Startup
-
కుబేరులకు కునుకు లేదు..?!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు నిద్రలేమితో బాధపడుతున్నారట. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు మొత్తం 260 మందిని సర్వే చేయగా ఆర్థిక అనిశి్చతి, ఎక్కువ సమయం పనిచేయడం, నిర్ణయాలు తీసుకోడానికి అధిక ఒత్తిడిని ఎదుర్కోడం, నిరంతర డిమాండ్లు తదితర అంశాలతో 55 శాతం మంది ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారట. ఇటీవల హార్ట్ఫుల్నెస్, టీఐఈ గ్లోబల్ సంయుక్తంగా నిద్ర సంక్షోభంపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ యజమానులు, టెక్ నిపుణులకు సైతం నిద్ర పట్టడంలేదని తేలింది. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.పనితీరుపై ప్రభావం.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది తగినంత సమయం నిద్రలేకపోవడంతో పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, అలసటకు గురవుతున్నామని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పోతున్నామని, ఫలితంగా కార్యాలయ పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. నిద్రలేమితో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారట. 26 శాతం మంది రాత్రి 6 గంటలే నిద్రపోతున్నారని, 19 శాతం మంది చాలా పేవలమైన నిద్రతో ఒత్తిడి, ఆందోళనల కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. నిద్రను త్యాగం చేస్తున్నారు.. స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపార వేత్తలు తమ విజయాల్లో నిద్రను త్యాగం చేస్తున్నారు. ఉత్పాదకత, నిర్ణయాలు తీసుకోవడం, పనితీరుపై నిద్ర లేమి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. స్థిరమైన విజయానికి కీలకమైన ఆరోగ్యకరమైన పని–జీవన సమతుల్యతను సాధించడంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే వనరులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. – మురళి, గ్లోబల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ కేవలం విశ్రాంతి కాదు.. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మనసు, శరీరం, ఆత్మ పునరుజ్జీవనం పొందడానికి ఒక పవిత్ర అవకాశం. ఆరోగ్యకరమైన నిద్ర పద్ధతులతో జ్ఞానం, సృజనాత్మకత, సమతుల్యతతో నడిపించే సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. అంతర్ దృష్టి బలపడుతుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. – రెవరెండ్ దాజీ, హార్ట్ఫుల్ నెస్ గైడ్, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు -
పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు
దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్షిప్, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ప్రస్తుతం భారత్లో 1,50,000 స్టార్టప్లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్కార్ట్ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలుఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభంఅత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా భారత్2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్గా భారత్ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఆసియా అంతటా విభిన్న కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకోవడానికి, బ్రాండ్లను విస్తరించడానికి సహాయపడేలా ‘ఆప్ట్రా’ అనే కొత్త కంపెనీని ప్రారంభించారు. టెక్నాలజీ, సప్లై చైన్ నైపుణ్యం, ఫ్రాంఛైజింగ్ భాగస్వామ్యాలను ఉపయోగించుకొని కొత్త మార్కెట్లోకి ప్రవేశించేటప్పుడు బ్రాండ్లు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేలా ఈ స్టార్టప్ ఆయా కంపెనీలను సర్వీసు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.వాల్మార్ట్ కొనుగోలుకు ముందు ఫ్లిప్కార్ట్ను ప్రపంచంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో ఒకటిగా మార్చడంలో బన్సాల్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక, నియంత్రణ, మౌలిక సదుపాయాల అవరోధాలతో పోరాడుతున్న బ్రాండ్లకు ప్రస్తుతం బిన్నీ ఆప్ట్రాను ఒక పరిష్కారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ సాధనాలు, మాస్టర్ ఫ్రాంచైజ్ అవకాశాలను ఏకకాలంలో అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశాన్ని సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఏఐ ఆధారిత సాంకేతికత అభివృద్ధిమొత్తం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఆప్ట్రా ఏఐ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, సమర్థవంతమైన వ్యూహాలను సమీకృతం చేయడం ద్వారా కంపెనీ అంతరాయంలేని మార్కెట్ను సృష్టించాలని భావిస్తుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలను విస్తరించడంలో బన్సాల్ అనుభవం కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి రోబోటిక్స్, ఆటోమేషన్తో కూడిన గ్లోబల్ సప్లై చైన్ను నిర్మించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.నిపుణులతో నాయకత్వ బృందంఈ-కామర్స్, రిటైల్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో ఆప్ట్రా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేసింది. నోకియా, యాపిల్ అమెజాన్ ఇండియాలో మాజీ ఎగ్జిక్యూటివ్గా పని చేసిన రంజిత్ బాబును ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ మర్కండైజ్ సీఈఓగా నియమించారు. గతంలో లెండింగ్ కార్ట్, ఫ్లిప్కార్ట్లో పనిచేసిన గిరిధర్ యాసను కంపెనీ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సప్లై చైన్ కార్యకలాపాలను ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో అనుభవం ఉన్న ఆనంద్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఎక్స్పోరియో, టెర్రాస్పాన్ బ్రాండ్లలో కీలక స్థానాల్లో పని చేసిన పునీత్ ఖన్నా, రాహుల్ గుప్తాలు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలుఆసియా మార్కెట్ కీలకంప్రపంచంలోని మొత్తం వినియోగదారుల వృద్ధిలో ఆసియా సుమారు 70% వాటాను కలిగి ఉంది. ఇది ఈ-కామర్స్, మారుతున్న వినియోగదారుల అలవాట్లకు కీలక మార్కెట్గా అవతరిస్తోందని కంపెనీ నమ్ముతుంది. భారత్, ఆగ్నేయాసియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) రీజియన్ మార్కెట్లపై ఆప్ట్రా దృష్టి సారించింది. ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, బేబీ కేర్, జనరల్ మర్కండైజ్ వంటి విభాగాల్లోకి విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. -
మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎక్కడంటే..
దేశీ అంకురాలు గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యవస్థలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. వచ్చే మూడేళ్లలో 600 బిలియన్ డాలర్ల(సుమారు రూ.52 లక్షల కోట్లు) మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్లాంటి (పీఈ/వీసీ) ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలను, ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి, కొత్త వెంచర్లు మనుగడ సాగించేలా అనువైన పరిస్థితులు కల్పించడానికి ఇవి తోడ్పడనున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధించాలంటే కావాల్సిన పెట్టుబడుల్లో (ప్రభుత్వ పెట్టుబడులు, కార్పొరేట్ డెట్, పీఈ/వీసీ ఫండింగ్ మొదలైనవి) ఇది 13 శాతమని ఐఎంటీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (సీఎఫ్ఎం) ప్రారంభ కార్యక్రమంలో నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్భారత అంకుర సంస్థల సామర్థ్యాలను ఇన్వెస్టర్లు గుర్తిస్తున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యాపారం తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు రాగలవని ఐఎంటీ ఘాజియాబాద్ డైరెక్టర్ ఆతిష్ చటోపాధ్యాయ పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటంతో సీఎఫ్ఎంలో కోర్సులకు మంచి ఆదరణ ఉంటుందని వివరించారు. పరిశ్రమ అవసరాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ రూపొందించిన సర్టిఫికేషన్లు, అనుభవపూర్వకమైన విధంగా ఉండే బోధన మొదలైన అంశాలు, విద్యార్థులు వివిధ నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడగలవని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవనీత్ మునోట్ తెలిపారు. -
కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు..
కొన్ని బాధకరమైన ఘటనలు మన అంతర్గత శక్తిని ప్రేరేపించి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. అలా కాకుండా ఆ పరిస్థితికి కలత చెందకుండా..ఎలా ఫేస్ చేద్దామనే ఆలోచనే మనల్ని కార్యోన్ముఖులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఆ విధంగానే ఈ తల్లి స్టార్టప్ని పెట్టేందుకు దారితీసి ఓ గొప్ప వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఏడాదికి రూ. 9 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. ఒక సాధారణ గృహిణి అయిన ఆ తల్లి ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగిందో చూద్దామా..!.కర్ణాటకకు చెందిన లక్ష్మీ ప్రియ విజయగాథ ఎందరికో ఆదర్శం. ఆమె కొడుకు అనారోగ్యమే ఆమెలో దాగున్న అసాధారణ వ్యాపారవేత్తను బయటకు తీసుకొచ్చింది. లక్ష్మికి నెలలు నిండకుండానే పుట్టిన కొడుకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను స్టార్టప్ పెట్టుందుకు దారితీశాయి. ఆమెకు పుట్టిన నవజాత శిశువు నెలల నిండకుండా జన్మించడంతో సుమారు 21 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ శిశువులో పెద్దగా మెరుగుదల కనిపించపోగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బతుకుతాడనేది చెప్పలేమని వైద్యులు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా ఆ చిన్నారికి తల్లి ఒడిలోవెచ్చదనం అందించి ప్రయత్నిద్దామని చెప్పడంతో..అలా చేసిన కొద్దిసేపట్లోనే ఏదో అద్భుతం జరిగినట్లుగా కోలుకోవడం జరిగింది ఆ శిశువు. పల్స్ రేట్ పెరిగి బతికి బట్టకట్టాడు. కానీ ఆ తర్వాత కూడా లక్ష్మీ కొడుకు బలహీనమైన రోగనిరోధకశక్తితో ఇబ్బంది పడేవాడు. శరీరంలో తగినంత స్థాయిలో రక్తం కూడా లేకపోవడం వంటి రుగ్మతనలు ఎదర్కొన్నాడు. దీనికి పోషకాహార లోపమని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ దిశగా వంటగదిలో ప్రయోగాలు చేసేది. తన కొడుకు పోషకాహార లోపంతో బాధపడకూదన్న ఆమె సంకల్పం పాలకూర వంటి ఆకుకూరలపై దృష్టిసారించేలా చేసింది. తనలాంటి తల్లలకు సహాయం అందించేలా చేయాలనే తపన, తన కొడుకు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే బలమైన కోరిక వెరసీ ఆమెను పాలకూర స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది. పాలకూరలో ఉండే విటమిన్లు పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయని న్యూట్రిషన్ల ద్వారా తెలుసుకుంది. ఆకుకూరల గొప్పతనం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలే ఆమెను పాలకూరతో రకరకాల వంటకాలు చేసేందుకు పురిగొలిపింది. కానీ ఈ పాలకూర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా దాన్ని ఎండలో బెట్టి పౌడరు చేసుకుని రకరకాల వంటకాలు ఎలా చేయొచ్చని ప్రయోగాల చేసింది. అలా ఆమె తానే స్వయంగా పాలకూర పొడులకు సంబంధించిన తినాసరి కీరై స్టార్టప్ పెట్టి విక్రయించడం ప్రారంభించింది. ఈ స్టార్టప్లో పాలకూరకు సంబంధించిన 40 రకాలు పొడుల మిక్స్లు ఉంటాయి. పాలకూరని కన్నడలో కీరై అని పిలుస్తారు. అందులోని వెరైటీలు ప్రధానంగా మనథక్కలి, కాసిని, ముదకథన్ , అగతి కరిసలంగన్నితో దాదాపు 15 రకాల వంటకాలను రూపొందించింది. ఈ లోగా కొడుకు కూడా ఆరోగ్యవంతుడయ్యాడు. క్రీడల్లో ఛాంపియన్గా కూడా రాణించే స్థాయికి చేరుకున్నాడు తన సొంత జ్ఞానంతో పెట్టిన ఈ స్టార్టప్తో ప్రారంభంలో పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ పొడులతో దోసెలు, సూప్లు, బియ్యం మిశ్రమాలు వంటి వాటిని కూడా చేర్చింది. వీటి గురించి తన కొడుకు స్నేహితుల తల్లిదండ్రులకు పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో తన స్టార్టప్లో విక్రయించే ఈ పాలకూర పొడుల ప్రాముఖ్యత గురించి వివరించేది. పైగా పాలకూర కొని చేయడం కంటే ఈ మిక్స్లతో సులభంగా వండటమేగాక మంచి పోషకాహారాన్ని అందిస్తామన్న ఆమె వివరణ ఎందరో తల్లిదండ్రులను ఆకర్షించింది. సులభంగా వండగలమన్న విధానం ప్రజలను ప్రభావితం చేసి.. కొనేందుకు ముందుకు వచ్చారు. అందులోనూ పిల్లలకు ఆకుకూరల తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటివి అయితే సులభంగా తింటారు, పైగా పోషకాలు అందుతాయన్న ఆశతో కొనేందుకు ముందుకు రావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్ల పెరగడం తోపాటు ఆర్డర్లు కూడా వచ్చేవి. అందుకు తగ్గట్టుగానే ఐఎస్ఓ(ISO)-సర్టిఫైడ్ పద్ధతులను అవలంబించడం, తన బ్రాండ్ నాణ్యతలో రాజీపడకుండా అందించి ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అలా అనాతి కాలంలోనే వార్షిక అమ్మకాలు రూ. 9 లక్షలకు చేరుకోవడంతో చిన్న వంటగది ప్రయోగాలు కాస్త ఓ పెద్ద బిజినెస్గా మారి దూసుకుపోయేందుకు కారణమైంది. అంతేగాదు లక్ష్మీ స్టార్టప్ ఈ స్టార్టప్ ఇప్పుడు భారతదేశం దాటి విస్తరించింది, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి సుదూర ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తుంది.నిపుణులు ఏమంటున్నారంటే..చివరగా పోషకాహార నిపుణురాలు పద్మజ గుత్తికొండ, పాలకూర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. పాలకూరలో కెరోటినాయిడ్లు, విటమిన్లు సీ, కే, ఫోలిక్ ఆమ్లం , కాల్షియంలకు మూలం అని ఆమె అన్నారు. ఇది కంటి ఆరోగ్యం, ప్రేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ప్రతిరోజూ పిల్లల ఆహారంలో లేదా వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేర్చడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడమే గాక కంటి చూపుకి ఢోకా ఉండదని చెబుతున్నారు.(చదవండి: టైప్ 2 డయాబెటిస్కి మొక్కల ఆధారిత ఔషధం..! ట్రయల్స్లో షాకింగ్ ఫలితాలు) -
కేన్సర్ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!
సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా సంన్నకుటుంబాల వాళ్లు కేన్సర్ బారినపడి జయించడం అనేది వేరు. ఎందుకంటే అత్యాధునిక వైద్యం పొందే ఆర్థిక స్థోమత వారికి ఉంటుంది. ఆ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చులు తట్టుకోగలరు. కేవలం వాళ్లు ధైర్యంగా చికిత్స చేయించుకుంటే చాలు. అదే సామాన్యుడు.. అందులోనూ ఓ మధ్య తరగతివాడు ఇలాంటి కేన్సర్ బారినపడితే అతడి పరిస్థితి తలకిందులైపోవడం లేదా కుటుంబమే రోడ్డున పడిపోతుంది. ఇక్కడ అలానే ఓ మధ్యతరగతికి చెందిన భార్యభర్తలిద్దరూ కేన్సర్ బారిన పడ్డారు. అయితే వారిద్దరూ కేన్సర్ని జయించి ఏకంగా లక్షల టర్నోవర్ చేసేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారెవరంటే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరానికి చెందిన దంపతులు లవీనా జైన్(Laveena Jain), ఆమె భర్త ఓ ప్రైవేటు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి కేన్సర్(cancer) మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది. భార్యభర్తలిద్దరూ 2010లో కేన్సర్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం అంటే తలకు మించిన భారమే. అందులోనూ ఇరువురు కేన్సర్ బారినపడ్డారు. లవీనాకు రొమ్ము కేన్సర్(Breast Cancer), ఆమె భర్తకు నోటి కేన్సర్(Mouth Cancer)..ఇలా ఇద్దరికి అయ్యే చికిత్సా ఖర్చులు, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీంటిని ఎలా నిర్వహించాలన్న ప్రశ్నలే ఆ దంపతులను వేధించాయి. ఏదో రకంగా ఇద్దరం దీన్నుంచి బయటపడితే పిల్లలని చూసుగోలమన్నా నిశ్చయానికి వచ్చి స్నేహితులు, తెలిసిన వాళ్లు బంధువుల దగ్గర అందినకాడికి అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకున్నారు. నిజానికి అవి తీర్చగలుగుతామా అన్న ఆలోచన లేకుండానే ఆ దంపతులు ముందు ఈ మహమ్మారిపై గెలవాలన్న సంకల్పంతో పోరాడారు. అలా ఇద్దరు కఠినమైన కీమోథెరపీ, రేడియోథెరపీలు చేయించుకుని కోలుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆర్థిక కష్టాలు మాములుగా మొదలవ్వలేదు. కుటుంబాన్ని ఎలా నడపాలన్నిది అర్థం కాలేదు. ఆ వ్యాధి నుంచి బయటపడ్డామంటే..మరోవైపు తినడానికే గుప్పుడు బియ్యం లేని గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఆ మహ్మమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలు తాళ్లలేక చనిపోవాలన్నంత నరకయాతన అనుభవించారు. అయితే లవీనా కేన్సర్ నుంచి కోలుకుని మాములు స్థితికి వచ్చింది గానీ ఆమె భర్తకి మాత్రం నోటి కేన్సర్ కారణంగా మాట రావడానికి టైం పడుతుందని చెప్పారు వైద్యులు. మరోవైపు చుట్టుముడుతున్న ఈ కష్టాల మధ్య ఆ దంపతులు తమ ఇంటిని అమ్మక తప్పలేదు. అలాంటి పరిస్థితిలో లవీనాకు తన చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న పాకనైపుణ్యం గుర్తొచ్చింది. సరదాగా నేర్చుకున్న ఆహార సంరక్షణ కోర్సు ఇలా ఉపయోగపడుతుందని లవీనా ఊహించలేదు. ఆ కోర్సులో భాగంగా మురబ్బా, ఊరగాయలు, జామ్లు తయారు చేయడం నేర్చుకున్న కళే తనకు ఆధారం అని భావించింది లవీనా. సరిగ్గా ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార సంరక్షణకు సంబంధించిన వందరోజుల ఉపాధి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. వెంటనే లవీనా అందులో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకుంది. అయితే వ్యాపారం పెట్టేందుకు ఆమె వద్ద కేవలం రూ. 1500/-లు మాత్రమే ఉన్నాయి. దాంతోనే 'లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్' అనే పచ్చళ్ల ఫుడ్స్టార్టప్ని ప్రారంభించింది. లవీనా స్వయంగా ఇంట్లో తయారు చేసే స్క్వాష్, జామ్లు, ఊరగాయలు విక్రయించేది. అయితే విక్రయాలు అంత ఈజీగా జరగలేదు. తయారుచేయడమే ఈజీ వాటిని ప్రజల వద్దకు చేరేలా చేయడమే అత్యంత కష్టమని తెలిసిందామెకు. అసలు వ్యాపార కిటుకేంటో తెలియక ఎన్నో ఇక్కట్లు పడింది. ఎలా ప్రజలకు తన వ్యాపారం గురించి తెలిపి విక్రయాలు ఊపందుకునేలా చేయాలన్నది ఆమెకు ఓ పెద్ద టాస్క్లా మారింది. అయితే స్థానిక కిట్టి పార్టీల ద్వారా తన వ్యాపారం గురించి ప్రచారం చేసుకోవడం..శ్యాంపుల్ బాటిల్స్ ఇవ్వడం వంటివి చేయడంతో అమ్మకాలు మొదలయ్యాయి. అలా ఒకరినుంచి ఒకరికి ఆమె చేసే పచ్చళ్లు, జామ్ల గురించి తెలియడం మొదలై వ్యాపారం ఊపందుకుని లాభాలు రావడం మొదలైంది. ఆ లాభాలతో అప్పులు తీర్చడం మొదలు పెట్టడమే గాక కుటుంబ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండేలా చేసింది. అయితే ఈ బతుకుపోరాటం కారణంగా ఆమె కొడుకు డ్రీమ్ పక్కన పెట్టి తన వ్యాపారం ప్రచారంలో పాలుపంచుకోక తప్పలేదు. అతడే తనకు చేదుడు వాదోడుగా ఉండి వ్యాపారాన్ని చూసుకోవడంతోనే తన వ్యాపారం ఇంతలా విస్తరించిందని అంటోంది లవీనా. ప్రస్తుతం ఆమె వ్యాపారం రూ. 34 లక్షల టర్నోవర్తో దూసుకుపోతోంది. ఇక ఆమె కుమారుడు కిన్షుక్ (30) మాట్లాడుతూ..సీఏ చేయాలనేది తన డ్రీమ్ అని కానీ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా చేయలేకపోయానని చెప్పాడు. తమ కుంటుంబాన్ని ఆదుకోవడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మా అమ్మ ప్రయత్నానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. తమ వ్యాపారం గురించి ఇంటి ఇంటికి తిరుగుతున్నప్పుడు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ..వ్యాపారం నిర్వహించడం అంత ఈజీ కాదని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు. తాను ప్రజల్లోకి తమ పచ్చళ్ల వ్యాపారం ఎలా తీసుకెళ్లగలను, వారితో చెప్పడం ఎలా అని బాధపడుతుంటే తన తండ్రి మాట్లాడలేని స్థితిలో కూడా సైగలతో ఓ బస్సు ఎక్కినప్పుడు ప్రయాణికుడితో మాటలు ఎలా కలుపుతావో అలానే అనుకుని మాట్లాడు చాలు అన్నారు. ఆ ఒక్క మాట తనను ఎంతగానో ప్రేరేపించి.. ఎన్నో ఆర్డర్లు అందుకునేలా చేసిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు కిన్షుక్. ఈ కథ ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే.. గివ్ అప్ ఇవ్వకూడదని, అచంచలమైన సంకల్పం, ఆశతో పోరాడితే గెలుపు తలుపు తప్పక తెరుచుకుంటుందనడానికి ఈ 50 ఏళ్ల కేన్సర్ వారియర్ లవీనా జైన్ కథే ఉదాహరణ. (చదవండి: కేన్సర్ని ముందే పసిగట్టే స్ర్రీనింగ్ పరీక్షలేమిటి..? ఎప్పుడు చేయించాలంటే..) -
స్టార్టప్స్కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులు
స్టార్టప్(Startup)లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు వెల్లువెత్తుతున్నాయన్నారు.‘ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు స్టార్టప్ల్లోకి వస్తున్నాయి. గరిష్టంగా ఇది 22–25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది’ అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.ఇదీ చదవండి: అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు దేశీయంగా మెషీన్ల తయారీఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొ న్నారు. భవిష్యత్లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. -
స్టార్టప్ కుంభమేళా
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ మహాకుంభ్ 2025’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిద్వారా వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాగస్వామ్యాల ద్వారా కొత్త లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ద్వారా ‘స్టార్టప్ మహాకుంభ్ 5.0’నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్లో స్టార్టప్లు సాధించాల్సిన లక్ష్యాలపై ఇందులో చర్చించి, దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్టార్టప్లకు ఊతమిచ్చేలా పాలసీలు, ప్రోగ్రామ్లు దేశంలో స్టార్టప్ల వాతావరణానికి ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పాలసీలు, ప్రోగ్రాములను అమలు చేస్తోంది. నేషనల్ మెంటార్íÙప్ ప్లాట్ఫామ్, సీడ్ ఫండ్ సపోర్ట్, ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్, స్టార్టప్ ఇండియా యాత్ర, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటివి చేపట్టింది. ఈ క్రమంలోనే భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయికి తమ కార్యకలాపాలను విస్తరించేలా స్టార్టప్ మహాకుంభ్ 2025ను కేంద్ర ప్రభుత్వ అనుబంధ విభాగం డీపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల స్టార్టప్లు డీపీఐఐటీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో 502 స్టార్టప్లు ఉండగా.. 2024 నవంబర్ 24 నాటికి 1,54,719 స్టార్టప్లకు చేరాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 17 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. స్టార్టప్లలో అత్యధికంగా 17,618 స్టార్టప్లు ఐటీ సేవలు, 14,285 స్టార్టప్లు ఆరోగ్య రక్షణ, 9,047 స్టార్టప్లు విద్యా రంగానికి చెందినవి ఉన్నాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్ర (27,459 స్టార్టప్లు), కర్ణాటక (16,335), ఢిల్లీ (15,851) దేశంలో టాప్ మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 5,157 స్టార్టప్లు ఉన్నాయి. భారత్లోని స్టార్టప్లలో నాయకత్వ స్థాయిలో 48 శాతం మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఫలితాలను ఇస్తున్న పథకాలు భారతీయ స్టార్టప్ల రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. స్టార్టప్ల ఆవిష్కరణలు, వాణిజ్య భాగస్వామ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టార్టప్ ఐడియాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘స్టార్టప్ యాత్ర’236 జిల్లాలు, 23 రాష్ట్రాల మీదుగా సాగుతూ... 143 బూట్ క్యాంపులను, 300 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్టార్టప్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో భాగంగా 21 దేశాలతో భారతీయ స్టార్టప్లను అనుసంధానం చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ప్రోగ్రామ్లో భాగంగా 2024 నాటికి 1,165 స్టార్టప్లలో 21,221 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది.యూనికార్న్ల వైపు అడుగులు..కొద్దిపాటి పెట్టుబడులతో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైన సంస్థలు స్వల్పకాలంలో ఒక బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.8,629 కోట్లు) విలువ కలిగిన సంస్థగా ఎదిగితే యూనికార్న్లుగా పిలుస్తారు. 2016 నాటికి భారత్తో 11 యూనికార్న్లు ఉండగా.. 2014 నాటికి వాటి సంఖ్య 118కి చేరింది. ఎడ్టెక్ రంగంలో అన్ అకాడమీ, వేదాంత.. ఫిన్టెక్లో పేటీఎం, ఫోన్పే, జెటా.. ఈ–కామర్స్లో ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై.. హెల్త్ టెక్లో ఫార్మ్ ఈజీ వంటి సంస్థలు భారతీయ యూనికార్న్ల జాబితాలో ఉన్నాయి. ఇలా భారతీయ స్టార్టప్ల నుంచి మరిన్ని యూనికార్న్లు ఎదిగేందుకు ‘స్టార్టప్ మహాకుంభ్’దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
విదేశాల వైపు ‘టీ–హబ్’ చూపు
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్టప్ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న ‘టీ–హబ్’... విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసే దిశగా దూసుకువెళుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్ల కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, కార్యకలాపాలకు ఊతమివ్వడం, అక్కడి నిపుణుల మార్గదర్శనం, నిధుల సేకరణ లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ స్టార్టప్లు భారత్తోపాటు దక్షిణాసియా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సాయం అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ‘టీ–బ్రిడ్జ్’అనే అనుబంధ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. భారతీయ స్టార్టప్ల ఆవిష్కరణలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి వ్యాపారపరంగా విజయవంతం అయ్యేలా తీర్చిదిద్దడంలో ‘టీ–బ్రిడ్జి’క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ సంస్థలు, స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు (ప్రోత్సాహక సంస్థలు), విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను ‘టీ–బ్రిడ్జి’అనుసంధానం చేసి... భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని సిద్ధం చేసింది. 42 దేశాల్లో మార్కెట్తో అనుసంధానం.. భారతీయ, అంతర్జాతీయ స్టార్టప్ల ఆవిష్కరణలు, మార్కెటింగ్, నిధుల సేకరణకు వీలుగా టీ–హబ్ 42 దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటివరకు 300కు పైగా భారతీయ స్టార్టప్లు, మరో 200కుపైగా అంతర్జాతీయ స్టార్టప్లు తమ ఆవిష్కరణలను మార్కెటింగ్ చేసుకునేందుకు టీ–హబ్ అంతర్జాతీయ ఒప్పందాలు దోహదం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్లను విస్తరించేందుకు ‘ఇండియా మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (ఐమ్యాప్), గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (జీమ్యాప్)’వంటి కార్యకలాపాలను చేపట్టింది. అమెరికా మార్కెట్లోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, అక్కడి నిపుణుల మార్గనిర్దేశనం కోసం సిలికాన్ వ్యాలీలోని ‘ఫాల్కన్ ఎక్స్’సంస్థతో టీ–హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘కొరియాకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల స్టార్టప్ ఏజెన్సీ (కొస్మె)’తోనూ టీ–హబ్కు భాగస్వామ్య ఒప్పందం ఉంది. అంతర్జాతీయ సంస్థ రెడ్బెర్రీతో కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఉత్తర అమెరికాలో ఆవిష్కరణల ఔట్పోస్ట్ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పేమాట్రిక్స్, ఆన్కానీ విజన్, డేటావెర్స్ వంటి భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయంగా మార్కెట్ను విస్తరించుకోవడంతోపాటు అనేక భాగస్వామ్యాలు, పెట్టుబడులను సాధించగలిగాయి.టీ–హబ్ప్రయాణంలో మైలు రాళ్లు ఇవీ..» వివిధ రంగాలకు చెందిన 2వేలకుపైగా స్టార్టప్లకు మార్గదర్శనం, నిధుల సేకరణ, నెట్వర్కింగ్లో ఊతం అందించింది. » పెట్టుబడి సంస్థలు, కార్పోరేట్ సంస్థలు తదితరాల నుంచి స్టార్టప్లకు రూ.1,300 కోట్లకు పైగా నిధుల సేకరణలో సాయం చేసింది. » ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పైలట్ ప్రాజెక్టులు తదితర అంశాల్లో 200కుపైగా కార్పోరేట్ సంస్థలతో స్టార్టప్లు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. » ఎంట్రప్రెన్యూర్షిప్, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర బదిలీ తదితరాల కోసం 100కు పైగా కార్యక్రమాలు, వర్క్షాప్లను నిర్వహించింది. » అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్లకు అవకాశాల కోసం విదేశీ సంస్థలు, ఇంక్యుబేటర్లు తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. నేపాల్సంస్థలతోనూ ఒప్పందాలునేపాల్, భారత్ నడుమ ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా టీ–హబ్ ఇటీవల నేపాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖతోపాటు అక్కడి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంస్థ ‘డోల్మె’తోనూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక బదిలీ, రెండు దేశాల నడుమ దృఢమైన ఆర్థిక బంధం ఏర్పడేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంటోంది. -
2047కి తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్గా నిలవాలి
హైదరాబాద్: 2047నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలవాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహసభల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ , తెలుగు ఏంజిల్స్ పేరుతో స్టార్టప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారికి బిజినెస్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికంటే విదేశాల్లో ఉన్న తెలుగు వారే భాష, సంప్రదాయాలను కాపాడుతున్నారని చెప్పారు. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది తెలుగువారేనని చెప్పారు. ఏ దేశం వెళ్లినా ఆ దేశంలో ఆమోదం రావాలంటే అక్కడి ప్రజలకు సేవలందించాలన్నారు. అయినా మాతృదేశాన్ని, జన్మభూమిని, కర్మభూమిని మరిచిపోవద్దని అన్నారు. పారిశ్రామికవేత్తగా సంపాదించిన డబ్బును మరింతమందికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగించాలని అన్నారు. ప్రపంచంలోనే తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారన్నారు. తెలుగుభాషకు వన్నె తెచ్చిన గిడుగు రామ్మూర్తిని స్మరించుకోవాలన్నారు. పీవీ నరహింహరావు, వెంకయ్యనాయుడు , కోకా సుబ్బారావు, జస్టిస్ రమణ, నీలం సంజీవరెడ్డి, బాలయోగి వంటి తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణించారన్నారు. కరణం మల్లీశ్వరీ, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీవీఎస్ లక్ష్మణ్, పీవి సింధు, పెండ్యాల హరికృష్ణ, వెంకటపతిరాజు వంటి ఎందరో తెలగువారు క్రీడల్లో సత్తాను చాటారని చెప్పారు. -
స్టార్టప్లకు అండగా కోటక్ బిజ్ల్యాబ్స్
వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.ఎవరికి సాయం చేస్తారంటే..అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్ఎస్ఆర్సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్ల్యాబ్స్ తెలిపింది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఎలాంటి సాయం చేస్తారంటే..ఈ ప్రోగ్రామ్లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్షాప్ల ద్వారా 1,000 స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. -
కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తరణకు స్టార్టప్ల ఎంపిక
వైర్డు కమ్యూనికేషన్ టెక్నాలజీ ‘నెస్సుమ్ వైర్’ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాలుగు స్టార్టప్లను ఎంపిక చేసినట్లు పానాసోనిక్, టీ-హబ్ తెలిపాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఛాలెంజ్లో భాగంగా టీ-హబ్తో కలిసి పానాసోనిక్ ఈ స్టార్టప్లను ఫైనల్ చేసినట్లు ప్రకటించింది. ఈ నాలుగు స్టార్టప్ల్లో అక్యా కంట్రోల్ సిస్టమ్స్, గోవిద్యుత్ మొబిలిటీ, ప్యూర్లాజిక్ ల్యాబ్స్ ఇండియా, ఎక్సీడ్ఐవోలు ఉన్నాయని పేర్కొంది.ఇప్పటికే ఉన్న వైర్డ్ డేటా కమ్యూనికేషన్ను మరింత మెరుగుపరిచేలా చేసే నెస్సమ్ వైర్ టెక్నాలజీని విస్తరించాడానికి ఈ స్టార్టప్ లు పానాసోనిక్, టీ-హబ్తో కలిసి పనిచేస్తాయి. డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మారుమూల ప్రాంతాల్లో సాంకేతిక సేవలు అందించేందుకు ఈ సంస్థలు పని చేయనున్నాయి.ఈ స్టార్టప్లను ఎంపిక చేసేందుకు పానాసోనిక్, టీ-హబ్లు సెప్టెంబర్ 2024లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించాయి. నెస్సమ్ టెక్నాలజీని ప్రభావితం చేయడానికి సరైన స్టార్టప్లను అన్వేషించాయి. అందుకోసం టీ-హబ్కు దరఖాస్తు చేసుకున్న 197 స్టార్టప్ల పనితీరు, వాటి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించింది. తర్వాత డెమో కోసం ఎనిమిది స్టార్టప్లను షార్ట్లిస్ట్ చేశారు. అందులో నాలుగు కంపెనీలను చివరిగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.అక్యా కంట్రోల్ సిస్టమ్స్: ఇది ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్లో ప్రత్యేకత కలిగిన క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలో ముందంజలో ఉంది.గోవిద్యుత్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.ప్యూర్లాజిక్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: వినూత్న పరిష్కారాల ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది.ఎక్సీడ్ ఐఓ: ఇది తయారీ, ఎనర్జీ రంగాలకు డిజైన్లను అందిస్తోంది.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్షార్ట్లిస్ట్ అయిన స్టార్టప్లను అభినందిస్తూ పానాసోనిక్ హోల్డింగ్స్లో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీస్ హెడ్ మిస్టర్ సైజో హిరోషి మాట్లాడారు. ‘పానాసోనిక్ మిషన్కు అనుగుణంగా నెస్సమ్ వైర్ టెక్నాలజీని ఉపయోగించి మా ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్లు జపాన్లోని భారత బృందంతో భాగస్వామ్యం అవుతాయి. ఈ కంపెనీల సాయంతో ప్రపంచ మార్కెట్లకు అనుకూలంగా పరిష్కారాలను అందించడానికి ఆసక్తిగా ఉన్నాం’ అని తెలిపారు. -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ బిజినెస్తో ఏకంగా రూ. 1500 కోట్లు..!
కొందరు అత్యంత విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టే.. బిజినెస్ ఊహించని రీతీలో ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తుంది. తాము ఫేస్ చేసిన సమస్య నుంచి బయటపడి..వ్యాపారానికి దారితీయడం అనేది అత్యంత అరుదు. అచ్చం ఇలానే ఓ జంట వ్యాపారం చేసి కోట్లు గడించింది. పైగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేసేలా చేసే వ్యాపారంతో దూసుకుపోయింది. ఆరోగ్యం తోపాటు ఆదాయాన్ని అందించే గొప్ప వ్యాపారంగా తీర్చిదిద్దింది. ఇంతకీ ఏంటా వ్యాపారం అంటే.అమెరికాకు చెందిన జ్యూడి ఎడ్వర్ట్ అనే మహిళ క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్తో బాధపడేది. దీంతో ఆమెకు డాక్టర్లు వాష్రూమ్లో ఇండియన్ స్టైల్ పొజిషన్లో కూర్చొమని సలహా ఇచ్చారు. జూడి తన భర్త, కొడుకు సాయంతో వెస్టర్న్ కమోడ్పై స్క్వాటీ పొజిషన్(భారత టాయిలెట్ స్టైల్)లో కూర్చొనేలా స్క్వాటీ పాటీని క్రియేట్ చేసుకుంది. దీని సాయంతో కూర్చోవడం వల్ల ఆమెకు కొద్ది రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది. అయితే ఈ క్రమంలో జూడీ తనలాంటి సమస్యనే చాలామంది ఎదుర్కొంటున్నారని తెలుసుకుని దీన్ని బిజినెస్గా ఎందుకు చేయకూడదు అనుకుంది. ఆ నేపథ్యంలోనే జూడీ దంపతులు స్క్వాటీ పాటీ వుడ్ టూల్ బిజినెస్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించారో లేదో జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే వన్ మిలియన్ డాలర్ల సేల్స్ని కంప్లీట్ చేశారు. చెప్పేందుకు కూడా ఇబ్బందికరమైన ఈ వ్యాపారాన్ని తనలాంటి సమస్యతో ఎవ్వరూ విలవిల లాడకూడదనుకుంది. ఆ ఆలోచనతోనే దీన్ని ప్రారంభించి మంచి లాభాలను గడించింది. అదీగాక ప్రస్తుతం ఏకంగా రూ. 1400 కోట్ల టర్నోవర్తో లాభదాయకంగా సాగిపోతోంది. నిజానికి మన పూర్వకులు ముందుచూపుతో ఎనిమిదివేల సంవత్సరాల క్రితమే మలబద్ధ సమస్యలు దరిచేరకుండా హ్యమన్ బాడీ పోస్చర్కి అనుగుణంగా ఈ ట్రెడిషనల్ టాయిలెట్స్ని డిజైన్ చేశారు. అయితే మనం పూర్వీకులు చెప్పే ప్రతిదాని వెనుక ఏదో మర్మం ఉంటుందనేది గ్రహించం.పైగా వాళ్లు ఆరోగ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి..ఎలాంటి ఆరోగ్య సమస్యల బారినపడకుండా జీవించేలా చేస్తున్నారని అస్సలు గుర్తించం. అదీగాక నేటి యువతరం టెక్నాలజీ పేరుతో వాటిని పక్కన పెట్టేసి కోరి కష్టాలు కొని తెచ్చుకుని, అనారోగ్యం పాలవ్వుతుండటం బాధకరం.(చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్షాప్లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ
సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్. ముఖ్యంగా తల్లిపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి, రూ. 120కోట్ల కంపెనీకి అధిపతిగా మారింది. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!రాజస్థాన్లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ పట్టా పుంచుకుంది. ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన భారతీయ ఫుడ్ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యతను గుర్తించింది. అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది. తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక సీఈవోగా విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య 2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 100కోట్లుగా ఉంది.అహానా గౌతమ్ ఏమంటారంటే.."ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు." అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు వెళ్లి చదవడానికి ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్ రెండో వేవ్లో కరోనా కారణంగా చనిపోయారు. -
అవి స్టార్టప్లు కావు.. ‘అప్స్టార్ట్లు’
ముంబై: చాలా వరకు స్టార్టప్లది ఆరంభ శూరత్వమేనని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.ఓ టీవీ చానెల్ నిర్వహించిన గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్స్టార్ట్లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్షిప్ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్ బజాజ్ ఈ విధంగా బదులిచ్చారు. బైక్లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు. -
ఏంజెల్ ఫండ్ పెట్టుబడి పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది. -
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్పై హాట్ ఎయిర్ బెలూన్పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్కి గురయ్యాడు..కట్చేస్తే 70 ఏళ్ల తర్వాత..!) -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్వేర్ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్టెక్ ప్లాట్ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్కార్ట్లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
రాత్రిని పగలుగా మార్చేయండిలా..
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్ను కూడా బెన్ నోవాక్.. లండన్లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్ ఫామ్లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి, భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్ను కలిగి ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇదెలా పనిచేస్తుందంటే..ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 -
వేద + కృత్రిమ మేధ
ఓ సినిమాలో ‘భవిష్యవాణి’ పుస్తకం రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని హీరోకు చెప్పేస్తుంది. దాన్ని బట్టి కథానాయకుడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అచ్చం అలాగే రేపు ఏం జరుగుతుందో చాలా కచ్చితత్వంతో చెప్పేస్తా అంటున్నాడు ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు. వేదాలకు ఏఐ సాంకేతికతను జోడించిదీన్ని సాధించినట్లు శ్రీకుషాల్ యార్లగడ్డ అనే టెకీ చెబుతున్నాడు. మూడేళ్లుగా ఎన్నోపరిశోధనలు చేసి డెస్టినీ.ఏఐ అనే స్టార్టప్ను ఏర్పాటు చేసిన అతను.. అదే పేరుతో ఒక యాప్కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. తల్లి భవితపై ప్రయోగాలు.. హైదరాబాద్లోని కేపీహెచ్బీకి చెందిన కృష్ణారావు, కనకదుర్గ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకుషాల్ యార్లగడ్డ. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండే అతను.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం)లో పీజీ చేశాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే చేసే పని నచ్చక 20 రోజులకే మానేసి ఇంటికొచ్చేశాడు. అప్పటి నుంచి వినూత్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆలోచనలను తల్లితో పంచుకొనేవాడు. భవిష్యత్తును కచ్చితంగా ఎలా అంచనా వేయగలమనే అంశంపై దాదాపు మూడేళ్లపాటు పరిశోధనలు చేపట్టాడు. ఇందుకోసం జ్యోతిష శాస్త్రంకన్నా ఎంతో గొప్పదైన ‘ప్రాణ’ (మనిíÙలోని ఆరు చక్రాలు, నాడులు, కుండలిని) ఆధారంగా భవిష్యత్తుపై పరిశోధనలు ముమ్మరం చేశాడు. ఇందుకోసం 400 కోట్ల డేటా సెట్స్తో అల్గారిథమ్ రూపొందించాడు. అందులోని వివరాల ఆధారంగా తన తల్లిపైనే ప్రయోగాలు చేసేవాడు. ఫలానా రోజున జ్వరం వస్తుందని తల్లికి చెప్పగా అన్నట్లుగా ఆమె ఆ రోజున జ్వరం బారిన పడ్డారు. అలాగే ఫలానా రోజున ఒంట్లో నలతగా ఉంటుందని చెప్పిన సందర్భంలోనూ అలాగే జరిగింది. ఇలా 6 నెలలు పరిశీలించాక తాను చెబుతున్న విషయాలు కచి్చతత్వంతో జరగడంతో స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చాడు. ఇదే విషయాన్ని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావుకు చెప్పడంతో ఆయన పరిశోధనలు చేసుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రోత్సహించారు. దీంతో డెస్టినీ.ఏఐ స్టార్టప్ను ఏర్పాటు చేసి అదే పేరుతో యాప్ రూపొందించాడు. హోర శాస్త్రం ఆధారంగా.. బృహత్ పరాశరుడు రాసిన హోర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషిలో ఉండే ‘ప్రాణ’ ఆధారంగా ఈ భవిష్యవాణి చెప్పొచ్చని కుషాల్ వివరించాడు. పూర్వ కాలంలో రాజులు, మంత్రులకు మాత్రమే పండితులు ఈ ప్రాణ లెక్కలు వేసి వారి భవిష్యత్తును అంచనా వేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జనాభాకు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లెక్కలు వేయడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కుషాల్ సాంకేతికతను వినియోగించాడు. దీని ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఒక వ్యక్తి భవిష్యత్తును కచ్చితత్వంతో చెప్పొచ్చని కుషాల్ అంటున్నాడు. సాధారణ పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణ విశ్లేషణ చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని కుషాల్ పేర్కొన్నాడు.ఎలా పనిచేస్తుంది? డెస్టినీ.ఏఐ అప్లికేషన్లో మన పుట్టినతేదీ, సమయం, పుట్టిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే మెషీన్ మొత్తం విశ్లేషించి రేపటి రోజున ఏం జరుగుతుందనేది చెప్పేస్తుందని కుషాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్లో ఉందని.. దాదాపు 60 శాతం కచ్చితత్వంతో సమాచారం అందిస్తోందని వివరించాడు. సమీప భవిష్యత్తులో యాప్ను మరింతగా అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వంతో భవిష్యవాణి చెప్పేలా రూపొందిస్తానని కుషాల్ అంటున్నాడు.నిర్ణయాలుతీసుకోవడానికి దోహదం జీవితంలో కీలక నిర్ణయాలుతీసుకొనే విషయంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కుషాల్ అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిస్తే ఆందోళనకు గురికాకుండా అప్లికేషన్లో భవిష్యత్తుతోపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అంశాలను కూడా మెషీన్ పొందుపరుస్తుందని వివరించాడు. -
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్కు సంబంధించిన సోల్ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్బాల్ స్నీకర్ ఫ్యాషన్ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లు
దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చదువు పూర్తయిన తర్వాత యువత ఉద్యోగం చేయడం కంటే కొత్త కంపెనీలు స్థాపించడంపైనే మక్కువ చూపుతున్నారు. విభిన్న ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు స్థాపిస్తున్నారు. ప్రాథమిక దశలో మూలధన పెట్టుబడులకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నా, కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ లభించాక ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలా విభిన్న రంగాల్లో కొత్త స్టార్టప్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా ఏఐ ఆధారిత సంస్థలు భవిష్యత్తులో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో కొన్ని ఏఐ స్టార్టప్ల గురించి తెలుసుకుందాం.జీబ్రా మెడికల్ విజన్: వ్యాధుల నిర్ధారణలో రేడియాలజిస్ట్లకు సహాయం చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. మెడికల్ ఇమేజింగ్ అనలిటిక్స్లో వైద్యులకు ఈ సంస్థ తోడ్పడుతుంది.నిరామై: మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల క్యాన్సర్ పెరుగుతోంది. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఈ సంస్థ ఏఐ సహాయంతో థర్మల్ ఇమేజింగ్ ద్వారా రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు సహాయపడుతుంది.క్యూర్మెట్రిక్స్: రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టేందుకు ఈ సంస్థ ఏఐను తయారు చేస్తోంది. ఎక్స్-రే ఇమేజింగ్ ద్వారా మమోగ్రఫీ విధానాన్ని ఉపయోగించి ఇతర చాతి సంబంధిత వ్యాధులను నిర్ధారిస్తుంది.సిగ్టుపుల్: ప్రాథమికంగా పాథాలజీ, మైక్రోస్కోపీలో వైద్య డేటాను విశ్లేషించి ఆటోమేట్ చేసేందుకు వీలుగా ఏఐను రూపొందించారు.ఫ్రాక్టల్ అనలిటిక్స్: వివిధ పరిశ్రమల్లో సంక్లిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఏఐను తయారు చేశారు.ఇదీ చదవండి: ‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగంఅగ్రకూల్: పంట నిర్వహణపై దృష్టి సారించి వ్యవసాయ రంగానికి ఏఐ ఆధారిత పరిష్కారాలు అందిస్తుంది.వోబోట్: వ్యాపారాల కోసం ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ సేవలందిస్తుంది.అన్కనీ విజన్: భద్రత, నిఘా కెమెరాలు మరింత పటిష్టంగా పనిచేసేందుకు ఏఐ అప్లికేషన్ల ద్వారా కంప్యూటర్ విజన్ టెక్నాలజీని అందిస్తుంది. -
‘అంతా అయిపోయింది’.. మొత్తం ఉద్యోగుల తొలగింపు!
క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ మద్దతు ఉన్న అగ్రిటెక్ స్టార్టప్ రేషామండి కథ ముగిసింది. సంస్థ మొత్తం ఉద్యోగులను తొలగించిందని ఎన్ట్రాకర్ నివేదిక తెలిపింది. ఆడిటర్ తప్పుకోవడం, వారం రోజులుగా కంపెనీ వెబ్సైట్ డౌన్ కావడం వంటి పరిణామాలతో సంస్థ స్థితిగతులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.'రేషామండి కథ అయిపోయింది' అని సంబంధిత వర్గాలు తెలిపినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు సహా అప్పులు చెల్లించడానికి, నిర్వహణ ఖర్చులను భరించడానికి కంపెనీ ఇబ్బంది పడుతోందని తెలిపింది. సంస్థలోని మొత్తం 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.రెవెన్యూ ద్రవ్యోల్బణం, మోసపూరిత ఇన్ వాయిస్ లతో సహా పలు కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను కంపెనీ ఎదుర్కొంది. గత నెలలో రాజీనామా చేసిన ఆడిటర్ వాకర్ చందోక్ అండ్ కో ఎల్ఎల్పీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ సమస్యలను తెలియజేసింది. రేషామండి ఆడిటింగ్ సంస్థకు రూ.14.16 లక్షలు బకాయి పడింది. బెంగళూరుకు చెందిన ఈ చింది.కంపెనీ జూలై చివరిలో సురేష్ కపూర్ అండ్ అసోసియేట్స్ అనే కొత్త ఆడిటర్ను నియమించుకుంది.దీనికి తోడు రేషామండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్వో) వరుస రాజీనామాలను చవిచూసింది. 2022 మార్చి 2 నుంచి 2023 జనవరి వరకు సీఎఫ్ఓగా పనిచేసిన రితేష్ కుమార్ స్థానంలో 2023 ఏప్రిల్లో కేపీఎంజీ మాజీ సీఎఫ్ఓ సమద్రిత చక్రవర్తి గ్రూప్ సీఎఫ్ఓగా నియమితులయ్యారు. తర్వాత ఆయన కూడా అదే ఏడాది అక్టోబర్లో కంపెనీని వీడినట్లు ఇంక్ 42 నివేదించింది.రేషామండి ప్రతినిధి ప్రచురణకు ఇచ్చిన ఒక ప్రకటనలో సంస్థ ఆర్థిక ఇబ్బందులను అంగీకరించారు. "రేషామండి కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మార్కెట్ నుంచి పెండింగ్ రిసీవబుల్స్ సేకరించడంపై దృష్టి పెట్టడానికి దాని సిబ్బంది, కార్యకలాపాలు, ప్రక్రియలను క్రమబద్ధీకరించింది. ఈ పరిస్థితి నుంచి బలంగా బయటపడి త్వరలోనే ట్రాక్లోకి రాగలమని నమ్ముతున్నాం' అని అన్నారు. -
ఐఐటీ హైదరాబాద్లో డ్రైవర్లెస్ టెక్నాలజీ రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్ లెస్ వాహనాలను ఐఐటీహెచ్లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్పాత్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది. ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ‘అటానమస్’ వాహనాల సాంకేతికతను టిహాన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. -
శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్గా..
ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించవచ్చు... అని చెప్పడానికి ఉదాహరణ కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఉదయ్ శంకర్. పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ఔరా అనుకునేలా చేశాడు. ఇప్పటి వరకు 10 ఏఐ యాప్లు, 9 కంప్యూటర్ ప్రోగ్రామ్స్, 15 రకాల గేమ్స్ డిజైన్ చేశాడు..బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘ యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’తో మరో అడుగు ముందు వేశాడు.కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్ఏఐ సదస్సులో ఉదయ్శంకర్ స్టార్టప్ ‘ఉరవ్’కు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్న వయసులోనే రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్. అది పాషన్గా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. కోవిడ్ కల్లోల సమయంలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్లో పైథాన్ప్రోగామింగ్ నేర్చుకున్నాడు. యాప్ డెవలప్మెంట్పై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు సాధించాడు.ఒకరోజు తన బామ్మకు కాల్ చేశాడు ఉదయ్. ‘కొద్దిసేపటి తరువాత నీకు ఫోన్ చేస్తాను’ అని ఫోన్ పెట్టేసింది బామ్మ. అంతవరకు వేచి చూసే ఓపిక లేని ఉదయ్ బుర్రలో ‘బామ్మ డిజిటల్ అవతార్’ను సృష్టించాలని, ఆ అవతార్తో ఏఐ ఉపయోగించి మాట్లాడాలనే ఐడియా తట్టింది. ఆ ఐడియాను సాకారం చేసుకున్నాడు. బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది.ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’ మరో అడుగు ముందు వేశాడు. ఏఐ రిమోట్ టీచర్ మిస్ వాణి, ఏఐ పర్సనలైజ్డ్ మెడికల్ అండ్ క్లినికల్ అసిస్టెంట్ మెడ్ఆల్కా, ఏఐని ఉపయోగించి ఫొటో నుంచి 3డీ ఇమేజెస్ సృష్టించే మల్టీటాక్ అవతార్ ఏఐ సూట్... మొదలైనవి కంపెనీ ్రపాడక్ట్స్. తండ్రి డా.రవి కుమార్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తల్లి శ్రీకుమారి ఉదయ్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్ శంకర్. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
దేశంలో వివిధ రంగాల్లో అనేక స్టార్టప్లు పురుడు పోసుకుంటున్నాయి. విభన్నమైన వ్యూహాలతో విజయ పథంలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విజయవంతమైన పలు స్టార్టప్లు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి టెండ్రిల్స్ నేచురల్స్.మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ సూక్ష్మ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పని చేస్తుంది. ప్రారంభంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతుల ద్వారా ఈ మొక్కల నుంచి సేకరించిన నూనె నుంచి సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు.తర్వాత క్రమంగా పలు సేంద్రియ ఉత్పత్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా నెలకు రూ.5 లక్షలకు పైగా విక్రయాలు చేస్తోంది. ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్లైన్ స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీని వ్యవస్థాపకుడు చెబుతున్నారు. -
బడ్జెట్లో మహిళలు ఏం కోరుతున్నారంటే..
కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్తగా కంపెనీలు స్థాపించిన మహిళలు వారికి సరైన ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం బడ్జెట్లో చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.పబ్లిక్ పాలసీ కన్సల్టింగ్ సంస్థ టీక్యూహెచ్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకురాలు అపరాజిత భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలి. స్టార్టప్ కంపెనీలు కలిగి ఉండడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ 2020 నుంచి 2022 వరకు మహిళల నేతృత్వంలోని స్టార్టప్లు సేకరించిన నిధుల వాటా మొత్తం స్టార్టప్ ఫండింగ్లో కేవలం 15 శాతం మాత్రమే. మహిళలకు సరైన నైపుణ్యాలు అందించి కొత్త కంపెనీలు స్థాపించే దిశగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సారథ్యం వహిస్తున్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా క్యాపిటల్ వెంచర్లను ప్రోత్సహించేలా బడ్జెట్ను రూపొందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?ఈ సందర్భంగా కినారా క్యాపిటల్ సీఈఓ హార్దికా షా మాట్లాడుతూ..‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలోని శ్రామికశక్తిలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు అందించి ఎంఎస్ఎంఈలో పనిచేసేలా నిర్ణయం తీసుకోవాలి. మహిళా శ్రామిక శక్తి 2021-22లో 32.8 శాతం నుంచి 2022-23లో 37 శాతానికి పెరిగినప్పటికీ దీన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి. సమీప భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. దాన్ని సాధించడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!! -
పాలు లేకుండా వెన్న.. ఇది కదా టెక్నాలజీ అంటే!
వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు. -
73 సార్లు తిరస్కరించారు : కట్ చేస్తే..రూ. వేలకోట్ల విలువైన కంపెనీలకు సారధి
స్టార్టప్ ఎకోసిస్టమ్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్ పరిశ్రమలో సూపర్వుమన్ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం.రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్ఫారమ్ ఆఫ్ బిజినెస్ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.2017లో, కల్రా వారి ప్లాట్ఫారమ్లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.మహిళలకు సందేశం‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్ పిల్లర్గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’ పెద్ద పెద్ద స్టార్టప్లు చేయలేని ఫీట్ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు. -
స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
నిధుల లేమి భారతీయ స్టార్టప్ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.ఏకంగా 80 శాతం మంది తొలగింపుపట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.10 వేల మందికి ఉద్వాసనఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్లు సైలెంట్ లేఆఫ్స్ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.మెరుగుపడుతున్న నిధుల సమీకరణ2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం. అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్స్పీడ్, అవ్రా క్యాపిటల్సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్లో ఉంది. -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్హస్ట్ సీఎన్బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్హస్ట్ వివరించారు. -
జనరేటివ్ ఏఐ స్టార్టప్లకు ఏడబ్ల్యూఎస్ సాయం!
జెనరేటివ్ ఏఐ స్టార్టప్లకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఏడబ్ల్యూఎస్ అంతర్జాతీయంగా జెనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్ఏఐ స్టార్టప్కు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్వర్కింగ్ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్లో తండ్రి రాజేష్తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్కు చెందిన నెక్ట్స్వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ సంస్థ నెక్ట్స్వేవ్తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్ట్స్వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది.భారత్ చెందిన కంపెనీలు ఇవే..ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్ కంపెనీ జియో స్పేషియల్ డేటాను అందించే హైపర్స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్ఫారాలను సర్వమ్ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్అవర్ తయారుచేస్తోంది. క్రాప్ఇన్ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్ప్లిక్స్ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మాంగనీజ్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది. -
Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్!
బీమా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త డిజిటల్ సాఫ్ట్వేర్ను రూపొందించాడు ఆదిత్య దాదియ. ముంబైకి చెందిన ఆదిత్య స్టార్టప్ ‘ఆల్ రైట్’ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో చిక్కుముడులకు పరిష్కార మార్గం చూపించింది. ‘ఆల్రైట్’ సృష్టించిన సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును సులభతరం చేస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.వాణిజ్య బీమా విభాగం పాత దారిలోనే నడుస్తోంది. ఇంటర్నల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇప్పటికీ మాన్యువల్గానే ఉంది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలను కొత్త దారిలో నడిపించడానికి ముందుకు వచ్చింది నెక్స్›్ట–జెనరేషన్ టెక్ ΄్లాట్ఫామ్ ఆల్రైట్. కోవిడ్ మహమ్మారి కాలంలో ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు కార్పొరేట్ లాయర్ అయిన ఆదిత్య దాదియ.ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఫిన్టెక్ స్టార్టప్లతో కలిసి పనిచేసిన ఆదిత్య ఆ టైమ్లో గమనించిన విషయం ఏమిటంటే.... కమర్షియల్ ఇన్సూరెన్స్ స్పేస్లో పని పూర్తిగా మాన్యువల్గానే జరుగుతుందని. ఈ నేపథ్యంలోనే ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు. అయితే ఇది అంత తేలికైన విషయం కాదనేది ఆదిత్యకు తెలుసు. రకరకాల ప్రయత్నాల తరువాత విజయం సాధించాడు. బీమా కంపెనీల పనిని సులభతరం చేసే సాఫ్ట్వేర్ను సక్సెస్ఫుల్గా రూపొందించాడు."సమయాన్ని ఆదా చేయగలిగే సాఫ్ట్వేర్ ఇది. ఉదాహరణకు..రెండు వారాలు పట్టే పనిని నిమిషాల్లో చేయవచ్చు. ఈ సాఫ్ట్వేర్కు తక్కువ కాలంలోనే మార్కెట్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇన్నోవేటివ్ స్టార్టప్గా గుర్తింపు పొందిన ‘ఆల్రైట్’ గత సంవత్సరం సీడ్ ఫండింగ్ రౌండ్లో విజయవంతంగా పది కోట్లు సమీకరించింది". జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, కార్పొరేట్ ఏజెంట్స్ తమ ‘టార్గెట్ కన్జ్యూమర్స్’ అంటున్నాడు ఆదిత్య.బీమా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్లు, కార్పొరెట్ ఇంటర్మీడియరీస్, బ్యాంకుల మధ్య అంతరాన్ని తగ్గించే సొల్యూషన్స్ అందించాలని ‘ఆల్రైట్’ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ ప్రొక్యూర్మెంట్, ప్లేస్మెంట్, అండర్ రైటింగ్, యూజర్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్....స్థూలంగా చె΄్పాలంటే బీమా ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఆల్రైట్.‘ఫోర్స్బ్ 30 అండర్ 30–ఆసియా’ జాబితాలో చోటు సంపాదించిన ఆదిత్య తన కంపెనీ మరింత విస్తరించే ప్రణాళికలతో బిజీగా ఉన్నాడు. ‘ఇది ఇలాగే ఉంటుంది. అంతే’ అనుకునేవారు కొందరు. ‘అలాగే ఎందుకు ఉండాలి? మరోలా కూడా ఉండవచ్చు కదా’ అని అడిగే వాళ్లు కొందరు. ఆదిత్య రెండో కోవకు చెందిన యువకుడు. కొత్తగా ఆలోచిస్తే విజయం ఖాయం అని అక్షరాలా ‘ఆల్రైట్’తో నిరూపించిన యువకుడు. -
పెద్ద కంపెనీలకు వెళ్లిపోదాం..
చెన్నై: అంకుర సంస్థల్లో పని చేసే వారిలో చాలా మంది పెద్ద కంపెనీలకు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన జీతం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వారికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న స్టార్టప్స్ ఉద్యోగుల్లో 67 శాతం మంది ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం స్టార్టప్ రంగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యధికంగా ఉంటోంది. ఉద్యోగి పనిచేసే సగటు వ్యవధి 2–3 ఏళ్లు మాత్రమే ఉంటోంది. స్టార్టప్ రంగంలో పనిచేసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగ భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల వైపు చూస్తున్నారు. ఇక 30 శాతం మంది మెరుగైన జీతభత్యాలు ఇందుకు కారణంగా తెలిపారు. 25 శాతం మంది స్టార్టప్లలో ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండటం లేదని అందుకే పేరొందిన సంస్థల్లోకి మారాలని భావిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 70 స్టార్టప్లకు చెందిన 1,30,896 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. హైరింగ్ ప్రణాళికల్లో అంకురాలు..‘కొత్త ఆవిష్కరణలు, ఉపాధికి ఊతమివ్వడంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 65 శాతం కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిపే యోచనలో ఉన్నాయి. దీంతో స్టార్టప్ వ్యవస్థ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, ఉద్యోగులు వెళ్లిపోకుండా తగు చర్యలు తీసుకోవడంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కెరియర్ పురోగతికి అవకాశాలుకల్పించడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూడటం మొదలైనవి చేయాలని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు స్టార్టప్లపై నమ్మకం పెరుగుతుందని, అట్రిషన్ తగ్గగలదని మిశ్రా వివరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మెరుగైన మానవ వనరుల విధానాలు ఉన్న అంకురాలు.. అట్రిషన్కు అడ్డుకట్ట వేసేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, రిమోట్ పని విధానాలు, భారీ స్టాక్ ఆప్షన్స్ స్కీములు మొదలైనవి అందిస్తున్నాయి. రిపోర్టు ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఆ తర్వాత సేల్స్, ప్రీ–సేల్స్, రిటైల్ వంటి ఉద్యోగాలు ఉంటున్నాయి. -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్లోని బ్రెయిన్బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?
రాబోయే 10 సంవత్సరాలలో తమ కంపెనీ లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని మామాఎర్త్ (mamaearth) సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ చెబుతున్నారు. తమను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన నివాసంలో నిర్వహించిన విశేష సంపర్క్ కార్యక్రమంలో మామాఎర్త్ సహ వ్యవస్థాపకుడు వరుణ్ అలఘ్ ప్రసంగించారు. దీన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్లో పోస్ట్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వరుణ్ అలఘ్ను అభినందించారు. స్టార్టప్లను, సంపద సృష్టిని తమ ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో యువశక్తిని చూసి గర్విస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.వరుణ్ అలఘ్ సతీమణి కంపెనీ సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ దీన్ని రీ ట్వీట్ చేస్తూ “ధన్యవాదాలు నరేంద్ర మోదీజీ. మీ ఆశీర్వాదం, ప్రభుత్వ మద్దతుతో రాబోయే 10 సంవత్సరాలలో లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలపై స్పందిస్తూ గజల్ అలఘ్ పేర్కొన్నారు. మోదీ అందించిన ప్రోత్సాహం తమలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తుందన్నారు. భారతీయ అందాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ప్రతిచోటా భారత జెండా ఎగరేస్తామంటూ రాసుకొచ్చారు. Thank you @narendramodi ji 🙏Aapke aashirvaad aur Modi sarkaar ke support ke sath lakhon jobs create karenge agle 10 saal mein.This truly fuels our passion and makes us even more determined to succeed. We will take Indian beauty to the world and place the Bharat flag… pic.twitter.com/GzuEU6Qrfc— Ghazal Alagh (@GhazalAlagh) May 22, 2024 -
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.Deepinder Goyal, ZomatoWhen I started Zomato in 2008, my father used to say “tu janta hai tera baap kaun hai” as my dad thought I could never do a start up given our humble background. This government and their initiatives enabled a small town boy like me to build something… pic.twitter.com/vogdM6v8oT— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 20, 2024 -
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో పది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది. డెల్వ్.ఏఐ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి ఉండటం విశేషం.పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి ఉన్నతికి పునాది వేశారు. ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది. ఆమెకు 11 ఏళ్లున్నపుడు కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్లో ఆమె ఇంటర్న్షిప్ ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్షిప్ సమయంలో, కోవిడ్ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లలోకి ప్రవేశించింది. ఓపెన్ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్ కూడా మొదలైంది.హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది. కేవలం ఒక ఏడాదిలోనే రూ100 కోట్లకు చేరింది. -
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్.. ప్రధాన స్టార్టప్లు ఇవే..
సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్మైండ్గ్రోడ్టెర్మినస్ సర్క్యూట్స్మార్ఫింగ్ మిషన్ఫెర్మియానిక్ఓక్టర్ఆగ్నిట్ఇన్కోర్సైన్ఆఫ్సిలిజియం సర్క్యూట్స్ఔరసెమిసెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి. -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
భారత్ స్టార్టప్ల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్లు ఈ ఏడాది దాదాపు 8–12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయతగిన ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు.. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021, 2022లో భారతీయ స్టార్టప్లలో ఏటా 8–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు. దీంతో ఆ రెండు సంవత్సరాల్లో అంకుర సంస్థల్లోకి వచి్చన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ‘గతేడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ, నిజం చెప్పాలంటే ఆరేళ్లకు సరిపడా పెట్టుబడులు రెండేళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గతేడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8–10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వెడుతున్నాం. రాబోయే రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదు‘ అని ఆనందన్ తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80,000 కోట్లు) సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్లో 20 స్టార్టప్లు లిస్ట్ అయ్యాయని, వచ్చే 7–8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీప్టెక్ స్టార్టప్స్ కోసం పాలసీ.. డీప్టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. అంకుర సంస్థలకు నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు దక్కాల్సిన అవసరం ఉందని, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్తో ఈ అవకాశం లభిస్తోందని సింగ్ వివరించారు. స్టార్టప్స్ నుంచి జీఈఎం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 22,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే..
ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఐఐటీలో చదివి స్టార్టప్ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్లో ఒక హోటల్కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్కు టాప్ ఇనిస్టిట్యూట్స్లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్కు లండన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్ఫ్లామ్లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
స్పేస్ స్టార్టప్లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారి కోసం తక్కువ ధరలో, సౌకర్యవంతమైన ఇయర్ ఇంప్లాంట్ను డెవలప్ చేశారు మదురైకి చెందిన ట్విన్స్ రామన్, లక్ష్మణన్. బోయింగ్ ఇండియా (బెంగళూరు) బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్(బిల్డ్) గ్రాంట్ ΄పొందిన వారిలో రామన్, లక్షణన్ ఒకరు...పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు వైద్యం చేయించాలనుకున్నారు. తమ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురుకి నెల రోజులు మాత్రమే వైద్యం చేయించగలిగారు. ఈ విషయం రామ్, లక్షణ్ సోదరులకు తెలిసింది. ఈ ట్విన్స్ మదురైలోని ఒక కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నారు. స్క్రాప్ మెటీరియల్తో వెంటిలేటర్ను తయారుచేయాలని ప్రయత్నిస్తున్న సోదరులు అమ్మాయి విషయం తెలిసిన తరువాత ఇయర్ ఇంప్లాంట్ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపానికి చికిత్స చేయడానికి నాన్–ఇన్వేసివ్ హియరింగ్ ఇంప్లాంట్ డెవలప్ చేయడంలో విజయం సాధించారు. సంప్రదాయ ఇంప్లాంట్లతో పోల్చితే దీని ధర తక్కువ. ఫస్ట్ ప్రోటోటైప్ను తమ పెరట్లో(బ్యాక్ యార్డ్)లో క్రియేట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వేంచర్కు ‘బ్యాక్యార్డ్ క్రియేటర్స్’ అని పేరు పెట్టుకున్నారు. ఖర్చును తగ్గించడం తోపాటు సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇంప్లాంట్ ఇది. బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్ (బిల్డ్–బెంగళూరు) గ్రాంట్ పొందిన విజేతల్లో రామ్,లక్ష్మణన్లు ఉన్నారు. చెవి వెనుక భాగంలో ఉంచే ఈ పరికరం విద్యుత్ తరంగాలను విడుదల చేసి నరాలను తాకి ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా వినడానికి సహాయపడుతుంది. ‘మాగ్నటిక్ ఇంప్లాంట్కు ఉండే పరిమితులు మా డివైజ్లో ఉండవు’ అంటున్నాడు రామన్. మన దేశంలో ప్రారంభ దశ స్టార్టప్లను ప్రొత్సహించడానికి 2019లో ‘బిల్డ్’ను ప్రారంభించారు. కస్టమర్ సెగ్మెంటేషన్ గురించి ఎంత బాగా ఆలోచించారు....మొదలైన విషయాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 1200 ఐడియాలు వచ్చాయి. ‘గ్రాంట్’ మొదలైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఐడియాలు రావడం ఇదే మొదటిసారి. ఒక్కో స్టార్టప్కు పది లక్షల రూపాయలు ఇస్తారు. రామన్, లక్ష్మణన్లతో ΄ాటు ప్రిత్వీష్ కుందు (గ్రీన్ ఎనర్జీ ఫర్ ఏవియేషన్ సెక్టార్), ఐశ్వర్య కర్నాటకి, పరీక్షిత్ మిలింద్ సోహోని–ముంబై (గ్లోవట్రిక్స్–సైన్లాంగ్వేజ్ను స్పీచ్ అంట్ టెక్ట్స్లోకి ట్రాన్స్లెట్ చేసే పరికరం), సత్యబ్రత శతపథి–ఒడిషా (బన్వీ ఏరో), దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ (సిటీపీఎల్–భువనేశ్వర్)లు ‘బిల్డ్’ గ్రాంట్కు ఎంపికైన వారిలో ఉన్నారు. అండర్ వాటర్ రోబోటిక్స్.. మన దేశంలో డ్యామ్లు, బ్రిడ్జీలు... మొదలైన వాటికి సంబంధించిన అండర్వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అనేది సవాలుగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలాలో చదువుకున్న దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ ఈ సమస్యకు పరిష్కారం కనుకొన్నారు. అండర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణను వేగవంతం, సురక్షితం చేయాలనే లక్ష్యంతో ‘సిటీపీఎల్’ కంపెనీ స్థాపించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ–బేస్డ్ టెక్నాలజీతో అటానమస్ అండర్వాటర్ వెహికిల్(ఏయూవీ), రిమోట్లీ ఆపరేట్ వెహికిల్(ఆర్వోవీ)ని డెవలప్ చేశారు. ‘అండర్వాటర్ రోబోటిక్స్కు సంబంధించిన రంగంలో మన దేశంలో నాలుగు స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి. అందులో సిటీపీఎల్ ఒకటి’ అంటున్న దేవేంద్ర మెర్సిడెస్ బెంజ్ ‘ఆర్ అండ్ డీ’ విభాగంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి బిస్వజిత్తో కలిసి ‘సిటీపీఎల్’ను స్టార్ట్ చేశాడు. మెకట్రోనిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన బిశ్వజిత్ స్టార్టప్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. (చదవండి: 'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..!) -
20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'కనికా టేక్రీవాల్'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సృష్టించిన సామ్రాజ్యం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1990లో భోపాల్లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రీవాల్.. స్కూల్ ఏజికేషన్ మొత్తం లారెన్స్, లవ్డేల్ పాఠశాలల్లో పూర్తి చేసి, కోవెంట్రీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత 2012లో జెట్సెట్గో (JetSetGo) సంస్థ స్థాపించి అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించి.. అతి చిన్న వయసులోనే కంపెనీని సక్సెస్పుల్గా నడిపిస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. చదువుకునే రోజుల్లో క్యాన్సర్ భారిన పడిన కనికా టేక్రీవాల్ ఆ సమయంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి మళ్ళీ సైక్లింగ్ ట్రాక్లో పడిన 'లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్' (Lance Armstrong) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని జెట్సెట్గో స్టార్ట్ చేసింది. 2012లో కంపెనీ ప్రారంభించిన తరువాత దేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగి 6000 విమానాలను విజయవంతంగా నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇందులో చార్టడ్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్ కూడా ఉన్నట్లు సమాచారం. నేడు వ్యాపార రంగంలో తనదైన రీతిలో ఎదుగుతూ.. 33 సంవత్సరాల వయసులో 10 సొంత ప్రైవేట్ జెట్లను కలిగి.. సుమారు రూ. 420 కోట్లకు అధినేతగా నిలిచింది. ఇదీ చదవండి: మస్క్, జుకర్బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత.. 20 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భారిన పడి రెండేళ్ల కాలంలో కోలుకుని, సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. 33 ఏళ్ల వయసులో రూ. 420 కోట్లు సంపాదించగలిగిందంటే.. దాని వెనుక కనికా టేక్రీవాల్ కృషి అన్యన్య సామాన్యమనే చెప్పాలి. ఇది ఎంతోమంది యువతకు మార్గదర్శం కావాలి. -
Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!
భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన పేరును లిఖించుకున్నాడు. గుజరాత్కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్గా ఆవిర్భవించింది. లండన్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది. -
తొలిసారిగా మానవ మెదడులో విజయవంతంగా చిప్ ఇంప్లాంటేషన్!
నేరుగా మనుషుల మెదడులోకి చిప్ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఇలాన్ మస్క్కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాందిపలికింది ఇలాన్ మస్క్ స్టార్ట్ప్ కంపెనీ న్యూరాలింక్. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేయగా, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్లో న్యూరాలింక్ తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్ని అమర్చింది. ఈ విషయాన్ని ఇలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్ ఇంప్లాంటేషన్ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు . 'ఇన్వాసిస్' అనే సర్జరీ ద్వారా మెదడులో ఐదు నాణేలతో పేర్చబడినట్లు ఉండే చిప్ని అమర్చినట్లు న్యూరాలింక్ పేర్కొంది. ఇది లింక్ అనే ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది. మస్క్ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్ మెషిన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది. దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో 'మానవాతీత శక్తి'ని పొందగలుగుతాం. అంతేగాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యితే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది. మెదడులో చిప్ అమర్చేది ఇలా.. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. చిప్ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను 'న్యూరాలింక్' అభివృద్ధి చేసింది. చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేసిక్ సర్జరీ తరహాలో భవిష్యత్లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐ(బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ చిప్)లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది. పనిచేసేది ఇలా.. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్1 చిప్కు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్లుగా మారుస్తుంది. కలిగే ప్రయోజనాలు.. న్యూరాలింక్ బీసీఐ చిప్ .. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. అంతేగాదు సుదీర్ఘ భవిష్యత్లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్ హ్యూమన్ కాగ్నిషన్) సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో 'సురక్షిత సహజీవనం' చేయడానికీ ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు. (చదవండి: షుగర్ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
'దీపెన్' దారి దీపం..
'సమస్య గురించి నిట్టూర్చేవారు కొందరు. సమస్యకు పరిష్కారం వెదకాలని ప్రయత్నించేవారు కొందరు. దీపెన్ బబారియా రెండో కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఎదురైన సమస్య స్టార్టప్ ఐడియాకు ఊపిరి పోసింది. ఇనోవేటర్గా, ‘రోడ్మాట్రిక్స్’ రూపంలో సక్సెస్ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్గా దీపెన్ను మార్చింది..' దీపెన్ బబారియా అతని ఫ్రెండ్ ఒకరోజు రాత్రి పనిపై బైక్పై ఎక్కడికో వెళుతున్నారు. లొకేషన్ తెలియక నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేశారు. ‘ఫాస్టెస్ట్ రూట్’ అని చూపించింది. తీరా చూస్తే అది గుంతలతో కూడిన రోడ్డు. మరోవైపు స్ట్రీటు లైట్లు లేకపోవడంతో బైక్ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురైంది. ‘దూరం, వేగాన్ని లెక్కలోకి తీసుకొని ఈ మ్యాప్స్ షార్టెస్ట్ రూట్ను గుర్తిస్తాయి తప్ప అధ్వానంగా ఉన్న రోడ్లను మాత్రం గుర్తించవు’ అంటున్న దీపెన్ ఈ సమస్యకు ఏఐ ద్వారా పరిష్కారం చూపాలని కాలేజిరోజులలో గట్టిగా అనుకున్నాడు. సూరత్(గుజరాత్)కు చెందిన దీపెన్ ఏఐ స్పెషలైజేషన్తో ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లో రోడ్ల స్థితిగతులను తెలిజేసే అప్లికేషన్ను మొబైల్ ఫోన్ల కోసం రూపొందించానుకున్నాడు. ఈ ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదై స్టార్టప్ రూపం తీసుకుంది. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలనే కలతో స్టార్టప్ల కేంద్రం అయిన బెంగళూరులో అడుగు పెట్టాడు దీపెన్. అక్కడ దీపెన్ ఐడియాపై నిఖిల్ ప్రసాద్ ఆసక్తి చూపించాడు. యూఎస్లో ఆటోమోటివ్ కారు కంపెనీలలో పని చేసిన నిఖిల్ ఇండియాకు తిరిగి వచ్చాడు. స్టార్టప్ కో–ఫౌండర్లలో నిఖిల్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ స్టార్టప్పై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. 100ఎక్స్.వీసి ఫస్ట్ ఫండింగ్ చేసింది. రోడ్ మేనేజ్మెంట్ ప్లానును అందించే ఏఐ–బేస్డ్ స్టార్టప్ ‘రోడ్మెట్రిక్స్’ బెంగళూరు కేంద్రంగా ్రపారంభమైంది. ‘కాలేజీరోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్ల్లో పనిచేసిన నాకు ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు సేఫ్టీ అనేది ముఖ్యమైన అంశం. అయితే రోడ్డు హెల్త్ను తెలియజేసే సాఫ్ట్వేర్లు మన దగ్గర లేవు. ఈ లోటును పూరించేలా రోడ్మెట్రిక్స్ను తీసుకువచ్చాం’ అంటాడు దీపెన్. మొబైల్ ఆధారిత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని మొదట్లో అనుకున్న ఐడియాపై వర్క్ చేశాడు దీపెన్. మొబైల్ అప్లికేషన్గా పనిచేసే సెన్సర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం బాగున్నప్పటికీ వైబ్రేషన్స్ను క్యాప్చర్ చేయడానికి రోడ్డు ప్రతి భాగంలో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర కో–ఫౌండర్లతో కలిసి దీపెన్ మరింత రిసెర్చ్ చేసి ఇమేజ్ బేస్డ్, కంప్యూటర్ విజన్ బేస్డ్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేశాడు. వీరు రూపొందించిన ఏఐ అల్గారిథమ్ పది రకాల రోడ్ డిఫెక్ట్స్ను గుర్తిస్తుంది. ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, ట్రాఫిక్లెస్ రోడ్లను గుర్తించడానికి వినియోగదారులకు ఉపకరించే రోడ్మెట్రిక్స్ మ్యాప్స్ను కూడా అభివృద్ధి చేశారు. మొదట బెంగళూరు, ముంబై రోడ్లను మ్యాపింగ్ చేసిన తరువాత అస్సాం, బిహార్లలో కూడా పనిచేశారు. ‘మా సాఫ్ట్వేర్ అంచనా వేసిన డ్యామేజ్ రిపోర్ట్ల ఆధారంగా మున్సిపాలిటీలు, ప్రైవేటు సంస్థలు నిధుల కేటాయింపు గురించి సరిౖయెన నిర్ణయం తీసుకోవచ్చు’ అంటున్న దీపెన్ రోడ్డు సమస్యలను గుర్తించడంలో జంషెడ్పూర్లోని టాటాగ్రూప్నకు సహాయం అందించాడు. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్తో కలిసి పనిచేస్తున్న ‘రోడ్మెట్రిక్స్’ ప్రభుత్వ మున్సిపాలిటీలతో పనిచేయడానికి చర్చలు జరుపుతోంది. మన దేశంలో వేలాది కిలోమీటర్లు కవర్ చేసిన కంపెనీ ఇక్కడితో ఆగిపోలేదు. ‘సిటీ ఆఫ్ లండన్’ మ్యాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. అక్కడ కూడా స్టార్టప్కు క్లయింట్స్ ఉన్నారు. ‘మన రహదారులను సాధ్యమైనంత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలనుకుంటున్నాం’ అంటున్నాడు దీపెన్ బబారియ. ‘రోడ్ మెట్రిక్స్’ స్టార్టప్ మొబిలిటీ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్, బెస్ట్ ఏఐ స్టార్టప్ అవార్డ్తో సహా ఎన్నో అవార్డ్లను సొంతం చేసుకుంది. ఇవి చదవండి: వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..? -
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్లు ఉన్నది భారత్లోనే. ఒక్క 2022లోనే భారత్లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్లు.. స్టార్టప్ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్లు పేటెంట్లు, ట్రేడ్మార్క్ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
జెప్టో జెట్ స్పీడ్
ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్ పలిచా ‘జెప్టో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్ హిట్ కొట్టింది. ‘సక్సెస్కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫామ్ ‘జెప్టో’ సూపర్ సక్సెస్ కావడమే కాదు యూనికార్న్ స్టేటస్ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.... పాఠం నెం 1: క్లారిటీ స్టాన్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’ హండ్రెడ్ పర్సంట్. లాక్డౌన్ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్లు. పాఠం నెం 2: నమ్మకం చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్లను ఇన్వెస్టర్లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్ విషయంలో ఇబ్బంది కాలేదు. పాఠం నెం 3: ధైర్యం ‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్ఫ్రెండ్. పాఠం నెం 4: టీమ్ స్ట్రెంత్ స్టీవ్ జాబ్స్ను అభిమానించే కైవల్య, అదిత్లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్ స్ట్రెంత్ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. పాఠం నెం 5: రీసెట్ డీఎన్ఏ తమ కంపెనీ తక్కువ టైమ్లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్’ అనే టర్మ్ను కాయిన్ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్కు స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్ఏను రీసెట్ చేయాలనుకున్న సమయం అది.’ -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్ఫామ్కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్షాప్లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్షాప్లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్షాప్లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్షాప్లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
మనీమంత్ర కవితాగానం
‘కష్టపడగానే సరిపోదు... ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు... దానికి తగిన ప్రతిఫలం ఉండాలి’ అంటుంది కవితా షెనాయ్. అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన కవితకు వినియోగదారుల నాడి తెలుసు. తగిన ప్రతిభ, సామర్థ్యాలు ఉండి కూడా నష్టాలతో చతికిల పడుతున్న కంపెనీలను చూసిన తరువాత ‘వోయిరో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. ఈ సాస్(సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్ దక్షిణ ఆఫ్రికాలోని ‘డీఎస్టీవీ’ చానల్తో సహా మనదేశంలోని పెద్ద వోటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ పబ్లిషర్లతో కలిసి పనిచేస్తోంది.... మేకప్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న కవిత షినాయ్ ఆ తరువాత ఎడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆనంద్ గోపాల్, అనీల్ కారట్, జితిన్ జార్జ్లతో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘వోయిరో’ సాస్ స్టార్టప్ మొదలుపెట్టింది. దీనికిముందు కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి తన బృందంతో కలిసి స్వయంగా కంటెంట్ క్రియేట్ చేసేది. ముంబై యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుకున్న కవిత మార్కెటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ‘లోవ్ లింటస్’ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత యూ ట్యూబ్ టీమ్తో పనిచేసింది. చదివిన చదువు, పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ‘వోయిరో’ ప్రయాణంలో తనకు ఉపకరించాయి. ఒక స్టార్టప్కు తొలి విజయ సంకేతం... నిధుల సమీకరణ. నిధుల సమీకరణకు సంబంధించి ‘వోయిరో’కు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇక రెండో సవాలు ఇతరులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎంతోమందితో మాట్లాడి, ఎన్నో సలహాలు తీసుకోవడం ద్వారా రెండో సవాలును కూడా అధిగమించింది. డిజిటల్ పబ్లిషర్స్, వోటీటీ ప్లాట్ఫామ్ల ఆదాయ వృద్ధికి కంటెంట్ను మానిటైజేషన్ చేయడం అనేది కీలకం. మార్కెట్, సాంకేతికత, డేటా అనే మూడురకాల అంశాలలో పట్టు ఉండాలి. అది కవితా షెనాయ్ పనితీరులో కనిపిస్తుంది. డిజిటల్ పబ్లిషర్లు, వోటీటీ ప్లాట్ఫామ్స్తో ‘వోయిరో’కు సంబంధించి సేల్స్ టీమ్, యాడ్ ఆపరేషన్ టీమ్, ఫైనాన్స్ టీమ్, స్ట్రాటజీ టీమ్ అనే నాలుగు బృందాలు కలిసి పనిచేస్తాయి. మీడియా కంపెనీలకు రెవెన్యూ అనలటిక్స్ను అందుబాటులో తీసుకురావడం నుంచి బలమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) స్ట్రాటజీని అనుసరించడం వరకు తనదైన దారిలో ప్రయాణిస్తోంది వోయిరో. కోవిడ్ కల్లోల సమయంలో అన్ని కంపెనీల లాగే ‘వోయిరో’కు సమస్యలు ఎదురైనప్పటికి వోటీటీ పరిశ్రమ, కంటెంట్ స్పేస్ పుంజుకోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ‘మీడియాతో అంటే నాకు ఉన్న ఇష్టం, అభిమానం వోయిరో ఆవిర్భావానికి కారణం అయింది. డిజిటల్ పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లకు వివిధ విషయాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ ప్రారంభించాం. లాభాల కంటే కూడా ఇతరులకు సహాయం చేయాలి, వారి విధానాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వోయిరో ప్రారంభించాం. అయితే అది అంత సులువైన విషయం కాదని అర్థమైంది. మా ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు వెళుతున్నాం. మీడియా, డిజిటల్ పబ్లిషర్లు నష్టపోకుండా మార్గనిర్దేశం చేయడం మా లక్ష్యం’ అంటుంది కవిత షెనాయ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వ్యాపార ప్రస్థానంలో ‘ఇక ముందుకు వెళ్లలేము’ అని నిరాశపడే పరిస్థితి రావచ్చు. దీనికి లొంగిపోకుండా పట్టుదలతో ముందుకు వెళితే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మన ఓపిక, కష్టపడేతత్వం గెలుపును నిర్ణయిస్తాయి. ‘వోయిరో’ ప్రారంభానికి ముందు ఇండస్ట్రీ పెద్దల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితుల వరకు ఎంతోమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఓటీటీకి సంబంధించి మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ మా పనితీరును మెరుగు పరుచుకుంటూ, పరిధిని విస్తరిస్తూ వెళ్లాం. – కవితా షెనాయ్, వోయిరో–ఫౌండర్, సీయివో -
'సహస్రనామం' సమ్మోహన విజయం!
‘ఎడారిలో రెయిన్ కోట్లు అమ్మకూడదు’ అనేది వ్యాపారానికి సంబంధించి అప్రకటిత ప్రాథమిక సూత్రం! ఎక్కడ ఏది అవసరమో అది అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఎంటర్ప్రెన్యూర్ గెలుపు జెండా ఎగరేయగలడు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా సంస్థలకు సంబంధించిన డేటా–ఎనాలటిక్స్ ప్రాసెస్ను సులభతరం చేయడానికి, కాలాన్ని, ఖర్చును తగ్గించడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. చెన్నైకి చెందిన అజిత్ సహస్రనామం ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’తో విజయం సాధించాడు. ‘రైట్ మోడల్ అనేది ముఖ్యం’ అంటున్న అజిత్ స్టార్టప్ కలల యువతరం రోల్మోడల్స్లో ఒకరిగా నిలిచాడు. 'ప్రాసెసింగ్ ఆఫ్ డేటా’కు సంబంధించి వివిధ సంస్థలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఏ) సాంకేతికత డేటా–డ్రైవెన్ మెథడాలజీలతో ఖర్చును తగ్గిస్తుంది. టైమ్ సేవ్ చేస్తోంది. రిపోర్ట్స్ తయారీని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. ‘ఒకప్పుడు రోజుల్లో మాత్రమే పూర్తయ్యే పని ఇప్పుడు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది’ అంటున్నాడు ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయీవో అజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఆధారిత నిర్ణయాలకు సంబంధించి ఏఐ–డ్రైవెన్ సొల్యూషన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్కు డైనమిక్ లుక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఎర్లీ–స్టేజ్ స్టారప్ ఫౌండర్స్ సమావేశంలో స్టారప్ ప్రయాణ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వివరంగా చెప్పాడు అజిత్ సహస్రనామం. ‘రైట్ మోడల్ లేకుండా ఎలా ముందుకు వెళ్లగలం?’ అంటాడు అజిత్. రైట్ మోడల్ మాట ఎలా ఉన్నా స్టార్టప్ కలల యువతరం ‘రోల్ మోడల్స్’లో అజిత్ సహస్రనామం ఒకరు. ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయివోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ఇన్స్టంట్ మెసేజింగ్ ΄ప్లాట్ఫామ్ ‘ఆన్గిల్’ పరిశ్రమలకు సంబంధించి డేటా కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ వరకు ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తుంది. ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లు అందుబాటులో ఉన్న మోడల్స్పై ఆధారపడడం అనేది ఒక విధానం. రెండోది పబ్లిక్ సోర్స్ శాంపిల్స్ ద్వారా సొంత డేటా తయారుచేసుకోవడం. అన్నిటికంటే పెద్ద సవాలు యూజర్స్ ఓకే అనేలా ప్రొడక్ట్ను బిల్డ్ చేయడం’ అంటాడు అజిత్. ‘ఆన్గిల్’ సాధించిన విజయం ఏమిటి? 2017లో ప్రారంభమైన ‘ఆన్గిల్’ రియల్–టైమ్ విజువలైజేషన్, ప్రిడెక్టివ్ ఎనాలటిక్స్ ఫీచర్ల ద్వారా పరిశ్రమలకు సంబంధించి ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తోంది. 2025 నాటికి మన దేశంలో ఏఐ మార్కెట్ మరింతగా విస్తరించనుంది అని నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ ఏఐ మార్కెట్లోకి యువతరం సారథ్యంలో మరెన్నో స్టార్టప్లు అడుగు పెట్టనున్నాయి. ఔత్సాహికులకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల మాటలే పాఠాలు అవుతాయి. ‘ఆన్గిల్’తో విజయం సాధించిన అజిత్ సహస్రనామం నోటి మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. -
నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం
ఒకే ఒక్క నిమిషం వీడియో దెబ్బకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్తో పాటు ఇతర కంపెనీలు రూ.1000 కోట్లు నష్టపోయేలా చేసింది. నమ్మడం లేదా? లేదంటే ఎందుకు? ఎలా అంటారా? జ్యూసెరో మెషిన్. ప్రపంచంలోనే స్మార్ట్ వైఫై యాప్ కోల్డ్ ఫెష్ జ్యూసర్. ఈ జ్యూసెరో మెషిన్ సాయంతో జ్యూస్ తయారు చేయాలంటే ఫ్రూట్స్ అవసరం లేదు. జస్ట్ ఆ కంపెనీ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఉంటే చాలు. ఆ ప్యాకెట్లను మెషిన్లో పెట్టి బటన్ నొక్కితే చాలు. మెషిన్లో నుంచి జ్యూస్ డైరెక్ట్గా గ్లాస్లోకి పడిపోతుంది. అనంతరం ఆ జ్యూస్ను తాగొచ్చు. ఇక ఈ కంపెనీ జ్యూస్ ప్యాకెట్లను సబ్స్క్రిప్షన్ ధర పొందాల్సి ఉంటుంది. డౌగ్ మాస్టర్ మైండ్ శాంపిల్ మెషిన్ తయారైంది. మరిన్ని జ్యూస్ మెషిన్లను తయారు చేసేందుకు, వాటిని మార్కెటింగ్ తయారు చేసేందుకు డబ్బులు కావాలి. అప్పుడు జ్యూసెరో ఫౌండర్ డౌగ్ ఎవాన్స్ తన మాస్టర్ మైండ్కి పదును పెట్టాడు. వెంటనే జ్యూసెరో మెషిన్ గురించి ప్రచారం చేశాడు. ప్రచారంతో ఊదర గొట్టాడు ఈ మెషిన్ తయారీ కోసం టెక్ కంపెనీలు టెస్లా, యాపిల్ తరహాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశామని చెప్పుకొచ్చాడు. యాపిల్ మాజీ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి యాపిల్ కంప్యూటర్ను ఎలా తయారు చేశారో నేను కూడా మెయిన్ఫ్రేమ్ జ్యూస్ మెషిన్ నుంచి జ్యూసెరో మెషిన్ను తయారు చేస్తున్నట్లు ఊదరగొట్టారు. ప్రొడక్ట్ వీక్.. పబ్లిసిటీ పీక్ ఎవాన్స్ పబ్లిసిటీ సూపర్ హిట్ అయ్యింది. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు జ్యూసెరో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డాయి. ఫలితంగా రూ.1000 కోట్ల కంపెనీగా అవతరించింది. ఇంకేం చేతిలో పుష్కలంగా డబ్బులు.. జ్యూసెరో మెషిన్ను, జ్యూస్ ప్యాకెట్లను పెద్ద ఎత్తున తయారు చేసింది. జ్యూసెరో మెషిన్ ధరను రూ.30000 వేలు పైగా నిర్ణయించింది. ఫ్రూట్స్ను బట్టి జ్యూస్ ప్యాకెట్ను ధరను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లోకి లాంచ్ అయిన కొద్దిరోజులు బాగానే ఉన్నా.. మెల్లిమెల్లిగా జ్యూసెరో చేసిన మోసం వెలుగులోకి రావడం మొదలైంది. ఆ సమయంలో మీడియా సంస్థ బ్లూమ్బెర్గ్ జ్యూసెరో మెషిన్ పనితీరును వివరిస్తూ నిమిషం వీడియోను ప్రసారం చేసింది. ఆ వీడియోలో జ్యూసెరో మెషిన్లో నుంచి జ్యూస్ రావడానికి ఎంత సమయం పడుతుంది. అదే జ్యూస్ ప్యాకెట్లను చేతులతో పిండితే ఎంత జ్యూస్ వస్తుందో అంతే సమయం పడుతుందని వివరించింది. ఆ వీడియో చూసిన వినియోగదారులు జ్యూసెరో మెషిన్ను కొనుగోలు చేయడం మానేశారు. పైగా మెషిన్ ఖరీదైందని, సంస్థ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి. ప్యాకెట్లలో నిల్వ చేసిన జ్యూస్ను తాగొచ్చా? లేదా? ఇలా విషయాల గురించి కొనుగులో దారులు, వినియోగదారులు ఎవాన్స్ను నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంది. సేల్స్ ఆగిపోయాయి. ఉద్యోగులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. నష్టాలు రావడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. చివరికి చేసేది లేక ఆ కంపెనీని మూసేస్తూ నిర్ణయం తీసుకున్న ఆ సంస్థ అధినేత డౌగ్ ఎవాన్స్. ఫలితంగా గూగుల్తో పాటు ఇతర సంస్థలు సైతం నష్టపోయేలా చేసింది. -
స్టార్టప్లకు రూ. కోటి ఫండింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ‘‘లీప్ ఎహెడ్’’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో (స్కేలింగ్) ఉన్న స్టార్టప్లతో పాటు గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్లకు కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చనుంది. ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్లకు మూడు నెలల పాటు హైబ్రీడ్ మోడల్లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్ చేస్తూ మార్కెటింగ్, ఫండ్ రైజింగ్ వంటి అవకాశాలను కల్పి స్తుంది. ఇందుకోసం డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీపీఐ కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. ఎన్జీఐఎస్ కింద 95 స్టార్టప్స్ నమోదు స్టార్టప్లను ప్రోత్సహించే నెక్టŠస్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీం (ఎన్జీఐఎస్) కింద రాష్ట్రంలో 95 స్టార్టప్లు నమోదు చేసుకున్నట్లు వినయ్కుమార్ తెలిపారు. ఇందులో 28 స్టార్టప్స్కు రూ.25 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్ అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్స్కు ప్రోత్సాహం అందిస్తుండటంతో పలు కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నాలుగో తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఏర్పాటు చేసిన కల్పతరువు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు స్టార్టప్స్కు మంచి వేదికలుగా మారాయని ఆయన వివరించారు. 6న విజయవాడలో ఔట్రీచ్ కార్యక్రమం లీప్ ఎహెడ్ కార్యక్రమంపై విద్యార్థులు, ఔత్సాహిక స్టార్టప్స్కు అవగాహన కల్పి ంచడానికి ఈ నెల 6న విజయవాడలో ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీపీఐ విజయవాడ జాయింట్ డైరెక్టర్ బి.వినయ్కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లు ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
ఉద్యోగులకు షాకిచ్చిన ‘ఫిజిక్స్వాలా’!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్ వాలా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 70 నుంచి 120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల్ని తొలగించిన జాబితాలో ఫిజిక్స్ వాలా చేరిపోయింది. అయితే ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. పిడబ్ల్యూలో మేం మిడ్ టర్మ్, అక్టోబర్ నెల ముగిసే సమయానికి ఎండ్ టర్న్ సైకిల్స్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తాం. ఫిజిక్స్ వాలా మొత్తం వర్క్ ఫోర్స్లో 0.8శాతం కంటే తక్కువ అంటే 70 నుండి 120 మంది ఉద్యోగుల్లో పనితీరులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాము’ అని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నామని, ఇది వృద్ధి పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని ఖేంగ్రే తెలిపారు. ఫిజిక్స్ వాలా గత ఏడాది రూ.100 కోట్ల యూనికార్న్ క్లబ్లో చేరింది. ఈ కంపెనీలో వెస్ట్బ్రిడ్జ్ కేపిటల్, జీఎస్వీ వెంచర్స్ వంటి కేపిటల్ మార్కెట్ కంపెనీలు 1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారులు తమ ఫోర్ట్ ఫోలియో కంపెనీ ఫిజిక్స్ వాలాలో పెట్టిన పెట్టుబడులతో లాభాల్ని గడించాలని భావిస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఫిజిక్స్ వాలా తన విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా కేరళకు చెందిన సైలెమ్ లెర్నింగ్ లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
భవిష్యత్నే మార్చేసిన స్టార్టప్ బిజినెస్.. విదేశాల్లోనూ పాపులర్
‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్లు... ‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది. ‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే. ‘అన్బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్కార్ట్లో సార్టింగ్కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్బాక్స్’ను సూపర్ హిట్ చేశారు. స్టార్టప్ కాన్సెప్ట్లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్ల డిమాండ్ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్లలో మరింత నమ్మకాన్ని నింపింది. ‘అన్బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్లాంటి సెక్టార్లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్ఫిల్మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. -
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
7 ఏళ్లకే కోడింగ్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం!
పాతికేళ్ళు దాటినా.. ఇప్పటికీ జీవితంలో ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. కానీ 16ఏళ్ల అమ్మాయి ఏకంగా రూ. 100 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13ఏళ్ల వయసులో ఇంటర్న్షిప్ ప్రారంభించింది. చాట్జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది. ఇదీ చదవండి: రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు! ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. -
ఇజ్రాయెల్ ‘స్టార్టప్ నేషన్’ ఎందుకయ్యింది? టెక్ దిగ్గజాల దృష్టిని ఎలా ఆకర్షించింది?
ఇజ్రాయెల్పై హమాస్ దాడి కొనసాగుతోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా వందలాది మంది పౌరులను కోల్పోయింది. ప్రపంచానికి సాంకేతికతతో సహా వివిధ ఉత్పత్తులను విక్రయించే ఇజ్రాయెల్ ఇప్పుడు కష్టాల కొలిమిలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా హమాస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దీన్ని స్టార్టప్ కంట్రీ అని కూడా అంటారు. ఇంతటి ఘనమైన పేరు ఇజ్రాయెల్కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను అమితంగా ప్రోత్సహించింది. స్టార్టప్లకు నిధులను సమకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలకు తగిన మద్దతును అందిస్తుంది. ఇటువంటి స్నేహ పూర్వక వాతావరణం కారణంగానే దేశంలో స్టార్టప్ల సంఖ్య వేగంగా పెరిగింది. 1990లలో ఇజ్రాయెల్.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో హైటెక్ విప్లవాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ స్టార్టప్లు టెల్ అవీవ్ సాంకేతిక కేంద్రం నుండి జెరూసలేం వరకు విస్తరించాయి. దక్షిణ ఎడారి నగరమైన బీర్-షేవాలో కూడా ఇజ్రాయెల్ స్టార్టప్లు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్టార్టప్ల భాగస్వామ్యం కారణంగా ఇజ్రాయెల్.. ‘స్టార్టప్ నేషన్’ హోదాను దక్కించుకుంది. స్టార్టప్ దేశంగా మారిన ఇజ్రాయెల్ ఆర్థికంగా మరింత బలోపేతంగా మారింది. ఇక్కడి స్టార్టప్లు దేశ ఆర్థిక వ్యవస్థలోకి $4.8 బిలియన్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇందులో 85 శాతం విదేశీ పెట్టుబడిదారులు ఉండటం విశేషం. ఇజ్రాయెల్ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.3 శాతం పరిశోధన, అభివృద్ధి రంగాలకు కేటాయిస్తోంది. గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల పరిశోధనా కేంద్రాలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్లోని పలు స్టార్టప్లు హెల్త్ టెక్, మొబైల్ యాప్లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్లను కలిగిన దేశంగా పేరుగాంచింది. ఈ దేశంలో ప్రతి 1,400 మందికి ఒక స్టార్టప్ ఉంది. అంటే దేశంలోని ప్రతి 1,400 మంది పౌరులలో కనీసం ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు లేదా సహ వ్యవస్థాపకుడు కనిపిస్తారు. ఇజ్రాయిలీలు పరిశోధన ఆవిష్కరణలకు పెట్టిందిపేరుగా నిలిచారు. ఈ దేశంలో 3,000కు మించిన హై-టెక్ స్టార్టప్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్మికులు సగటును అత్యధిక వేతనం పొందుతున్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? -
ఒక్క యాప్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. యాప్స్తో పాపులర్
యాప్ స్టోర్లలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ల హవా కొనసాగుతుండగానే ‘నేను సైతం’ అంటోంది ఫోన్పే. ‘ఇండస్ స్టోర్’ పేరుతో కొత్త యాప్ స్టోర్ను తీసుకురానుంది.యాప్ స్టోర్ల పోటీ సంగతి ఎలా ఉన్నా, దేశీయ యాప్లు వెలిగిపోతున్న కాలం ఇది. ‘ఒక యాప్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనేది నిజమే అయినా అది ఎలాంటి ఐడియా అనేదే కీలకం. ఆ కీలకమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని పాపులర్ యాప్ల రూపకల్పనపై దృష్టి పెడుతున్నారు యంగ్ యాప్ డెవలపర్లు. యాప్–పాపులారిటీని కలిపి నెటిజనులు సరదాగా సృష్టించిన ‘యాప్లారిటీ’కి న్యాయం చేసేలా కృషి చేస్తున్నారు... ‘సాధించాలనుకున్నప్పుడు సాధన చెయ్’ అనే మంచి మాట శివరీన సారికను కొత్త దారిలోకి తీసుకెళ్లింది. ‘ప్రెగ్బడ్డీ’ అనే పాపులర్ యాప్ ఆవిష్కరించడానికి కారణం అయింది. స్టార్ డెవలపర్గా తన పేరు మారుమోగేలా చేసింది. గేమింగ్ స్టూడియో ‘99 గేమ్స్’ వైస్ ప్రెసిడెంట్ శిల్పాభట్ ‘నేను సాధిస్తాను’ అంటూ నమ్మకంగా రంగంలోకి దిగి, సక్సెస్ఫుల్ డెవలపర్ల వరుసలో నిలిచింది.శివరీన ఐఐటీ–ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. తన సోదరికి గర్భస్రావం అయినప్పుడు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ‘మనం నిరంతరం టెక్నాలజీ మధ్యలోనే గడుపుతున్నాం అనుకుంటున్నప్పటికీ, ఆ టెక్నాలజీని కీలకమైన సమయంలో మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నాం’ అనే ఆలోచనతో తల్లులు, తల్లులు కావాలనుకునేవారి కోసం వాట్సాప్ గ్రూప్ మొదలు పెట్టింది. వారిని ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకుంది. నాలుగు నెలల తరువాత తన టీమ్తో కలిసి ‘ప్రెగ్బడ్డీ’ యాప్ డెవలప్మెంట్పై పనిచేసింది. తల్లులు, తల్లి కావాలనుకుంటున్నవారికి అనేక రకాలుగా ఉపయోగపడే ఈ యాప్ సంవత్సర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.ఉడిపి (కర్నాటక)లోని ‘రోబోసాఫ్ట్’ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో పనిచేసిన శిల్పాభట్ ‘99గేమ్స్’తో గేమ్ డెవలపర్గా మారింది.‘చాలామందికి టెక్నాలజీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆవిష్కరణల విషయం వచ్చేసరికి అది వేరే వాళ్ల వ్యవహారం, మనం చేయలేం అనుకుంటారు. అయితే ఇది సరికాదు. మనం ఏదైనా చేయాలంటే ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తెలుసుకుంటూ నేర్చుకుంటూనే ఎన్నో చేయవచ్చు’ అంటుంది శివరీన.‘సాధించాలనే తపన గట్టిగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ప్రోగ్రామింగ్ లేదా గేమ్ డెవలప్మెంట్ మీ ప్యాషన్ అయితే, ఆ ప్యాషన్ను గుండెల్లోకి తెచ్చుకోండి. గుండె నిండా ధైర్యంతో నేను సాధించగలను అనే నమ్మకాన్ని సొంతం చేసుకోండి’ అంటుంది శిల్పాభట్. చిన్న వయసులోనే ఎన్నో మిలియన్ డాలర్ యాప్స్ను సృష్టించి పెద్ద పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్ నాయక్. సక్సెస్ఫుల్ యాప్లను ఎలా బిల్డ్ చేయాలో బాగా తెలిసిన నాయక్ పదమూడు సంవత్సరాల వయసులోనే వెదర్ ప్రెడిక్షన్ యాప్ను క్రియేట్ చేశాడు. ‘తనదైన విలువను మార్కెట్లో సృష్టించగలిగినప్పుడే ఒక వ్యాపారసంస్థకు సంబంధించిన ప్రయోజనం నెరవేరినట్లు అవుతుంది. వినియోగదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడే యాప్ను సృష్టించడంపై దృష్టి పెడతాను. అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ను రూపొందించినప్పటికీ అది వినియోగదారులను ఆకట్టుకోకపోతే ప్రయోజనం నెరవేరనట్లే. యూజర్ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకొని యాప్ను డిజైన్ చేయడం అనేది ముఖ్యమైన విషయం’ అంటున్నాడు నాయక్.చిన్న యాప్లు కూడా పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం క్రియేటర్లు యూజర్ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకోవడమే. చైనీస్ యాప్లను నిషేధించిన తరువాత ఆ ప్లేస్లోకి మన కుర్రాళ్ల యాప్స్ వచ్చాయి. ‘ఎంఎక్స్ టకాటక్’ అలాంటిదే. ‘ఇదే సరిౖయెన సమయం అనుకొని మా టీమ్ ఆరు రోజులు రాత్రి, పగలు కష్టపడి ఈ యాప్ను డిజైన్ చేశాం. భారతీయత ఒక్కటే మార్కెట్లో విజయం సాధించడానికి కారణం కాదు. ఇతరుల కంటే ఏ రకంగా భిన్నంగా ఉన్నాం అనేదానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది’ అంటున్నాడు ‘ఎంఎక్స్ టకాటక్’ సీయివో కిరణ్ బేడీ. స్వదేశీ యాప్లు విజయంతో వెలిగిపోతున్న కాలం ఇది.‘నాణ్యత అంశాలను విస్మరిస్తే ఫలితం వేరేలా ఉంటుంది. ఎప్పటికప్పుడు మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి’ అంటున్నారు నిపుణులు. బిలియన్ డాలర్ ఐడియా యాప్ బిల్డింగ్పై ఆసక్తి ఉన్న యువతరానికి ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి... జార్జ్ బెర్కోవోస్కీ ‘హౌ టు బిల్డ్ ఏ బిలియన్ డాలర్ యాప్’ పుస్తకం. ‘మొబైల్ జెనెటిక్స్’ ‘ఏ బిలియన్ డాలర్ ఐడియా’ ‘ఈజ్ యువర్ యాప్ రెడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్?’ ‘హౌ మచ్ ఈజ్ యువర్ యాప్ వర్త్ అండ్ హౌ మచ్ మనీ షుడ్ యూ రైజ్?’ ‘ది టెన్–మిలియన్– డాలర్ యాప్’ ‘మేక్ సమ్థింగ్ పీపుల్ లవ్’ ‘డాలర్స్ ఇన్ ది డోర్’ ‘ ఏ కలర్ఫుల్ లెస్సన్’ ‘మనీ ఫర్ సేల్’... మొదలైన ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘బిలియన్ డాలర్ల యాప్స్ను రూపొందించిన వారి బుర్రలతో ఆలోచింపచేసే పుసక్తం ఇది’ అంటున్నాడు బెర్కోవోస్కీ. ఇంజనీర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయిన బెర్కోవోస్కీ ఎంతోమంది విజేతలతో మాట్లాడి, తన స్వీయ అనుభవాలను జోడించి ఈ పుస్తకం రాశాడు. -
కర్తవ్య నిష్టా! గెలుపే ధ్యేయంగా..
మంచి మాట....మాటగానే మిగిలిపోదు. ఆ మాటలోని సారాంశం ఇంధనమై ముందుకు నడిపిస్తుంది. విజయం చేతికి అందేలా చేస్తుంది. కెరీర్ కోచ్గా ఎంతోమందికి స్టార్టప్లపై ఆసక్తి, అవగాహన కలిగిస్తోంది నిష్ఠా త్రిపాఠీ. అమెరికాలో రకరకాల స్టారప్లతో కలిసి పనిచేసిన త్రిపాఠీ ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ఎడ్–టెక్ స్టార్టప్ ‘24 నార్త్స్టార్’తో విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నిష్ఠ తండ్రీ, తాతలు ప్రభుత్వ ఉద్యోగులు. ‘వ్యాపారం’ అనే మాట వారికి అపరిచితం. అయితే కథలు, కవితల పుస్తకాలు ప్రచురించేవారు. పుస్తకాలపై ఆసక్తి తాత, తండ్రి నుంచి నిష్ఠకు వారసత్వంగా వచ్చింది. నిష్ఠ పుస్తకాల పురుగు. చిన్న వయసులోనే స్కూల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివేసింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్’లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తరువాత ఎన్నో స్టార్టప్లతో కలిసి పనిచేసింది. ఉద్యోగాల కోత ఉధృతంగా ఉన్న రోజులవి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగాలలో ప్రమోషన్లతో మంచి పేరు తెచ్చుకుంది నిష్ఠ. ఆ సమయంలో తన మీద తనకు నమ్మకం ఏర్పడడంతో ఎంటర్ప్రెన్యూర్ కలలు మొదలయ్యాయి. ‘ఏ రోజైనా సరే స్టార్టప్ స్టార్ట్ చేస్తాను’ అనే నమ్మకంతో ఉన్న నిష్ఠ న్యూయార్క్ యూనివర్శిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరి ఎంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్లోముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ను నిర్వహించే అవకాశం వచ్చింది. నలుగురితో కలిసి మాట్లాడడానికి ఇబ్బంది పడే స్వభావం ఉన్న నిష్ఠకు ఈ సదస్సు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తన బలహీనతలను అధిగమించే బలాన్ని ఇచ్చింది. మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత...వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలతో అశాంతికి గురైన నిష్ఠ త్రిపాఠీకి అక్షరస్నేహం సాంత్వన ఇచ్చింది. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, తత్వశాస్త్ర పుస్తకాలు చదివింది. ‘సెవెన్ కన్వర్సేషన్స్’ పేరుతో మొదటి పుస్తకం రాసింది. ఈ పుస్తకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. స్కూలు ఫ్రెండ్స్ నుంచి యూనివర్శిటీ ప్రొఫెసర్ల వరకు తనను అభినందించారు. ఆతరువాత...సంక్లిష్టమైన బిజినెస్ కాన్సెప్ట్లను సులభతరం చేసి అందరికీ అర్థమయ్యేలా పుస్తకాలు రాసింది. పుస్తకాలు చదవడానికి ఇష్టపడే వాళ్లతో పాటు పుస్తకం పేరు వినబడగానే పారిపోయే వారు కూడా ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ హాయిగా చదువుకునేలా పుస్తకాలు రాసింది. ‘బిజినెస్ బుక్స్ అనగానే గంభీరమైన భాష వాడాలనే రూల్ లేదు’ అని చెబుతుంది నిష్ఠ. పదిహేనుమంది స్టార్టప్ ఫౌండర్లను ఇంటర్వ్యూ చేసి ‘నో షార్ట్కట్స్’ పేరుతో రాసిన పుస్తకానికి కూడా మంచి స్పందన వచ్చింది. అకడమిక్ కౌన్సెలింగ్ పేరుతో ఇస్తున్న కౌన్సెలింగ్ ఆమెను అసంతృప్తికి గురి చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు అత్యవసరమైన లైఫ్స్కిల్స్ డెవలప్ చేయడానికి అకడమిక్ కౌన్సెలింగ్ స్పేస్లోకి అడుగు పెట్టింది. ‘స్కాలర్ స్ట్రాటజీ’ పేరుతో ఎడ్యుకేషనల్ స్టార్టప్ను ప్రారంభించింది. ‘సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉండే వ్యూహాలు స్టార్టప్ల విజయానికి కారణం అవుతాయి ’ అంటున్న నిష్ఠ ఎడ్–టెక్ స్టార్టప్ ‘24 నార్త్స్టార్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది. ‘డబ్బు బాగా సంపాదించాలనే అత్యాశతో స్టార్టప్ను మొదలు పెట్డకండి. స్టార్టప్కు తమవైన సవాళ్లు ఉంటాయి. ఆ సవాళ్లు అర్థం చేసుకుంటూ ఓపిగ్గా ప్రయాణం మొదలుపెట్టాలి. ఒక స్టార్టప్ స్టార్ట్ చేసే ముందు కేవలం నా ఆసక్తి వల్లే ఇది మొదలు పెట్టానా? మార్కెట్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో సీరియస్గా విశ్లేషణ చేసుకోవాలి. నేను మొదట ఫ్యాషన్ స్టార్టప్ మొదలుపెట్టి కొద్ది కాలంలో మూసివేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఫ్యాషన్పై నాకు అంతగా అవగాహన లేకపోవడమే’ అంటుంది నిష్ఠా త్రిపాఠీ. సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉండే వ్యూహాలు స్టార్టప్ల విజయానికి కారణం అవుతాయి. – నిష్ఠ (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్గా మార్చింది! అదే ఆమెను..) -
కష్టాల్లో స్టార్టప్: గుడ్బై చెప్పిన కో-ఫౌండర్
బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్ఫామ్ డన్జోకు భారీ షాక్ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్ భారీ పునర్నిర్మాణ ప్లాన్ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో) 2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు. అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా గత కొన్ని నెలలుగా నిధుల సమీకరణం కోస కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి. అయితే ఎపుడు సూరి పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్తోపాటు అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ వాటా ఉంది. సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
‘ఎవరు భయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’
‘టాలెంట్ ఎవడి సొత్తుకాదు’ అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడో లేదంటే విన్నప్పుడో ఆ మాట నిజమేననిపిస్తుంది. చేతిలో జాబు లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ టాలెంట్కు కొదువలేదు. ఇదిగో ఈ తరహా లక్షణాలున్న ఓ యువకుడు తన మనసుకు నచ్చిన జాబ్ కోసం ఏం చేశాడో తెలుసా? ఎవరైనా సోషల్ మీడియా వినియోగిస్తూ గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటే..గడిచిన సమయం తిరిగి రాదు మిత్రమా అంటూ కొటేషన్లు చెబుతుంటాం. కానీ అదే సోషల్ మీడియాని ఉపయోగించి అవకాశాల్ని సృష్టించుకోవచ్చని నిరూపించాడు ఆయుష్. ఎక్స్ యూజర్ ఆయుష్ ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటున్నాడు. ఓ రోజు ఆయుష్ ఎక్స్ని బ్రౌజింగ్ చేస్తుండగా.. ఓ పోస్ట్ అతని కంటపడింది. బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్ కో-ఫౌండర్ సుభాషిస్ చౌదరి. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు ఆయుష్ తాను దుకాణలో ఫ్రంటెండ్ డెవలపర్ టీమ్లో చేరాలనుకుంటున్నానని, అవసరమైతే మీకోసం ఫ్రీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని రిప్లయి ఇచ్చాడు. Take this figma, and code it in HTML with 100% pixel perfection. If you think you have matched it, deploy it somewhere and email the link to subhash@mydukaan.io You will get an interview, guaranteed.https://t.co/kmpKoCD331 — Subhash Choudhary (@subhashchy) September 22, 2023 ప్రతి స్పందనగా సుభాష్ చౌదరి కాబోయే ఫ్రంట్-ఎండ్ డెవలపర్లకు ఓ ఛాలెంజ్ విసిరుతూ ఫిగ్మా డిజైన్ను షేర్ చేశారు. అందులో హెచ్టీఎంల్ కోడ్ను ఉపయోగించి 100శాతం పిక్సెల్ పర్ఫెక్ట్గా ఉండేలా చేయాలి. అలా చేస్తే దుకాణ్లో ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తానని తెలిపారు. కానీ హెచ్టీఎంల్ కోడ్ సాయంతో 100 శాతం పిక్సెల్ పర్ఫెక్ట్గా ఫిగ్మా డిజైన్ చేయడం అంత సులుభం కాదు. ఇందుకోసం హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్పై అవగాహన ఉండాలి. చాలా ఓపిక, ఖచ్చితత్వం కూడా అవసరం. ఆయుష్ సవాలును స్వీకరించాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. దుకాణ్లో ఇంటర్వ్యూకి వెళ్లాడు. కొన్ని వారాల తర్వాత సుభాష్ మరో ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన ఛాలెంజ్లో ఆయుష్ గెలిచాడని చెప్పారు. ఆయుష్కి ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా, తాను దుకాణ్ స్టార్టప్లో ఫ్రంటెండ్ ఇంజినీరింగ్ టీమ్లో చేరానని, అవకాశాన్ని అందుకున్నందుకు ‘సూపర్ పంప్’ అయ్యానని ఆయుష్ చెప్పాడు. Joined @mydukaanapp as a Frontend Engineering Intern. Thank you @subhashchy for giving me this opportunity. I am looking forward to giving everything and more. Super pumped. https://t.co/JCMBWDZ8fA — ayush⚡️ (@emAyush56) September 29, 2023 ఫిగ్మా అంటే ఏమిటి? ఫిగ్మా అనేది ప్రముఖ డిజైన్ టూల్. ఆయా కంపెనీలు తమ ప్రొడక్ట్ల ప్రొటోటైప్లు, ఇతర డిజైన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టూల్ సాయంతో కష్టమైన, వివరణాత్మక డిజైన్లు చేయొచ్చు. ‘సూపర్ పంప్’ అంటే? సందర్భాన్ని బట్టి మనస్సు ఎనర్జిటిక్ ఎగ్జైట్మెంట్, ఉత్సాహంతో నిండింది అని చెప్పేందుకు సూపర్ పంప్ అనే పదాన్ని వినియోగిస్తారు. -
స్టార్టప్లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్లిస్టెడ్ స్టార్టప్లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్లో షేర్ చేశాడు. అమెజాన్లో సప్లై చైన్ ఇంజనీర్గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్ను చూస్తున్నప్పుడు ‘ఇన్స్టాకార్ట్’ స్టార్టప్కు ఐడియా పుట్టింది. -
కొత్త దారి రైతుబిడ్డ
‘ఇక వ్యవసాయం చేయవద్దు అనుకుంటాను. కాని చేయక తప్పేది కాదు. దీనివల్ల తలపై అప్పులు తప్ప నాకు జరిగిన మేలు లేదు. అయినా సరే భూమి నాకు అమ్మతో సమానం’ అన్నాడు మహారాష్ట్రలోని ఒక రైతు. ‘లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఒక్కరోజు పొలం వైపు వెళ్లక పోయినా నాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది’ అంటాడు రాజస్థాన్లోని ఒక రైతు. మన దేశంలో రైతుకు, భూమికి మధ్య ఆత్మీయ బంధం ఉంది. ఆ బంధాన్ని బలోపేతం చేయడానికి కెనడా నుంచి వచ్చిన షర్మిల జైన్ తన లక్ష్యసాధనలో విజయం సాధించింది... రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయరంగం కల్లోలంగా ఉన్న కాలం అది. ఆ సమయంలో షర్మిలజైన్ కెనడాలో నివాసం ఉంది. స్వదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి చదివిన తరువాత ఆమె మనసు మనసులో లేదు. ఎన్నో ఆలోచనలు తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అని ఆమె ఆలోచించింది. ఆ సమయానికి కదిలిపోయి మరోరోజుకు మామూలై పోయే వ్యక్తి కాదు షర్మిల. కనిపించే సమస్య వెనకాల కనిపించని సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది. అంతేకాదు, రైతుల కోసం కెనడాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? భావోద్వేగాలపై తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. తీరిగ్గా ఆలోచించు. వెళ్లడం సులభమేకాని ఇక్కడికి మళ్లీ రావడం అంత సులభమేమీ కాదు’ అన్నారు సన్నిహితులు.బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పింది షర్మిల. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన షర్మిలకు రైతుజీవితం కొత్తేమీ కాదు. వారికి సంబంధించి తాను చిన్నప్పుడు విన్న సమస్యలే ఇప్పుడు కూడా వినాల్సి వస్తుంది. మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్న షర్మిల స్నేహితులలో చాలామంది రైతు బిడ్డలే. ఆ కుటుంబాల ఆర్థి«క కష్టాలతోపాటు గృహహింసకు సంబంధించిన విషయాలను తరచుగా వినేది. ఆ సమయంలోనే లాయర్ కావాలని అనుకుంది. కెనడా నుంచి భారత్కు తిరిగి వచ్చిన షర్మిల క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని ఎన్నో పల్లెలు తిరిగింది. ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడింది. వారితోపాటు పొలానికి వెళ్లింది. ‘ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి రాసుకోవడం, తరువాత కనిపించకపోవడం మామూలే. అయితే షర్మిలజీ కళ్లలో నిజాయితీ కనిపించింది. ఆమె మా కోసం ఏదో చేయగలదు అనే ఆశ కలిగింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు చౌహాన్ అనే రైతు. వ్యవసాయ సంబంధిత అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి... ఇంగ్లాండ్లో ఎన్విరాన్మెంటల్ లా, అగ్రికల్చరల్ లా లో మాస్టర్స్ చేసింది షర్మిల. రెండు సంవత్సరాల కాలంలో ఎంతోమంది రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడిన తరువాత ‘గ్రీన్ ఎనర్జీ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. చెరువులను పునరుద్ధరించడం, నవీన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, చిరుధాన్యాలు పండించడంపై అవగాహన కలిగించడం... మొదలైనవి ఈ ఫౌండేషన్ లక్ష్యాలు. తొలిసారిగా మహారాష్ట్రలోని బుచ్కెవాడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్తో వాటర్ మేనేజ్మెంట్ ప్రోగాం చేపట్టారు. నిరంతరం నీటిఎద్దడితో సతమతం అవుతున్న ఆ గ్రామం వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా బాగు పడింది. వేసవి సమయంలోనూ నీటి కష్టాలు రాని పరిస్థితి వచ్చింది. రాజస్థాన్లోని దుంగర్పుర్ గ్రామంలోని రైతులకు నీటి అవసరం ఎక్కువగా లేని పంటల గురించి అవగాహన కలిగించారు. ‘గ్రీన్ ఎనర్జీ మా ఊరిలో అడుగు పెట్టకపోతే వ్యవసాయానికి శాశ్వతంగా దూరం అయ్యేవాళ్లం. గ్రీన్ఎనర్జీ కార్యక్రమాల ద్వారా అనేక రకాలుగా లబ్ధిపొందాం. ఇప్పుడు కూరగాయలు కూడా పండిస్తున్నాం. గతంలో పంటలు పండనప్పుడు నా భర్త కూలిపనుల కోసం పట్నం వెళ్లేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’ అంటుంది దీప్తి అనే మహిళా రైతు. షర్మిల తన తండ్రి నుంచి రెండు విలువైన మాటలు విన్నది. ఒకటి... చిరుధాన్యాల ప్రాముఖ్యత. రెండు... కార్పోరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. ఇప్పుడు బాగా వినిపిస్తున్న సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఆరోజుల్లోనే విన్నది షర్మిల. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కోసం, చిరుధాన్యాలను పండించే రైతులకు సహాయపడడానికి ‘గుడ్ మామ్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టింది షర్మిల జైన్. ‘గుడ్ మామ్’ ద్వారా మిల్లెట్ నూడుల్స్ నుంచి హెర్బ్ స్టిక్స్ వరకు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలపై ఆసక్తి వేలం వెర్రిగా మారకుండా, దాన్ని ఇతరులు సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ‘గుడ్ మామ్’ ద్వారా ‘ఏది అబద్ధం?’ ‘ఏది నిజం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయిదు రాష్ట్రాలలో వేలాదిమంది రైతులకు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ–బిల్డింగ్ ప్రోగామ్స్ ద్వారా సహాయపడుతున్నాం. చిరుధాన్యాలు, కూరగాయలు పండించడంపై అవగాహన కలిగిస్తున్నాం. చిరుధాన్యాలు అనే పేరు పెద్దగా వినిపించని కాలంలోనే వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేశాం. – షర్మిల జైన్ -
సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్ కాన్సెప్ట్లకు గొప్ప మార్గనిర్దేశం
స్టార్టప్లు ప్రారంభించే విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడోస్థానంలో ఉంది. నేటి యువత కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. అయితే, అందులో సక్సెస్ అవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మనదైన ప్రత్యేకతను చాటుకోవాలి. మరి అది జరగాలంటే స్టార్టప్ ప్రారంభించే ముందే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా స్టార్టప్ వ్యవస్థాపకులకు సాధికారత కలిగించే వాటి పై దృష్టి పెట్టాలి. అలాంటి అవకాశమే ఇప్పుడు సిఎక్స్ఓ (CXO) ఫోరమ్ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇటీవల ముగిసిన ఇండియన్ స్టార్ట్-అప్ ఫెస్టివల్ 2023 రెండవ ఎడిషన్ నుంచి వచ్చిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే.. ఆర్థిక పిరమిడ్ దిగువన ఉన్న స్టార్టప్ల నిజమైన సమస్యలను పరిష్కరించడానికి దోహద పడాలని. 2023 స్టార్ట్-అప్ ఫెస్టివల్లో భాగంగా స్టార్ట్-అప్ కమ్యూనిటీతో 30కి పైగా రంగాలకు చెందిన ప్రముఖలు ఇన్సైట్ ఫుల్ కీనోట్తో పాటు రౌండ్టేబుల్ చర్చలు జరిపారు. ఈ రౌండ్ టేబుల్ సిఎక్స్ఓ ఫోరమ్ తరువున ప్రతి కంపెనీలో సీఈఓ, సీఓఓ అండ్ సీఎఫ్ఓ వంటి ప్రముఖ నాయకత్వ పాత్రల గురించి చర్చించారు. కమ్యూనిటీకి సహకరించే ప్రయత్నంలో ఈ నాయకత్వ స్థానాలను కలిగి ఉన్న ప్రముఖ కార్యనిర్వాహకులు సిఎక్స్ఓ ఫోరమ్ అనే సింపోజియంను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రయత్నం వెనుక ఉన్న దార్శనికుడు మేనేజింగ్ డైరెక్టర్ BNY మెల్లన్లో ఎంటర్ప్రైజ్ క్వాలిటీ ఇంజనీరింగ్ గ్లోబల్ హెడ్ అట్లూరికి మంచి పేరు ఉంది. స్టార్టప్ ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువకులకు మెంటర్షిప్ అందించడం సిఎక్స్ఓ ఫోరమ్ ప్రాథమిక లక్ష్యం కానుంది. ఈ మార్గదర్శకత్వం వారికి నిర్మాణాత్మక పద్ధతిలో మార్గనిర్దేశం చేస్తోంది. తమ ఆలోచనలకు పెట్టుబడిని పొందడంలో కూడా ఈ 'సిఎక్స్ఓ ఫోరమ్' వారికి సహాయం చేస్తోంది. ఇది కార్పొరేట్లో అత్యున్నత ర్యాంక్లను కలిగి ఉన్న గొప్ప నిష్ణాతులైన వ్యక్తులందరూ కలిసి సమాజానికి తిరిగి ఇస్తున్న గిఫ్ట్. ఇండియా స్టార్ట్-అప్ ఫౌండేషన్, ఐఎస్ఎఫ్ 2023లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ విజేతలలో ఒకరైన అట్లూరి దీని గురించి మాట్లాడుతూ, "స్టార్టప్లలో, చాలా మంది ఒకే ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం మనం చూస్తాము. ఒకవేళ వారికి వినూత్న ఆలోచనలు ఉంటే.. అలాంటి వారికీ ఒక సరైన రోడ్ మ్యాప్ చూపిస్తే.. వారు చాలా గొప్పగా వృద్ధి చెందుతారని తెలిపారు. ఆలోచన ఎంత ముఖ్యమో.. ఆ ఆలోచనకు సరైన ఆచరణ మార్గం, అవగాహన ప్రక్రియ అంతకన్నా ముఖ్యం. ఆ సరైన ఆచరణ మార్గం, అవగాహన పక్రియను ఈ సిఎక్స్ఓ ఫోరమ్ అందిస్తోంది అంటూ అట్లూరి తెలిపారు. స్టార్ట్-అప్ వ్యవస్థాపకుడు C-లెవెల్ ఎగ్జిక్యూటివ్ రామ్ పుప్పాల మాట్లాడుతూ.. ప్రారంభ దశ స్టార్ట్-అప్లు నిజంగా డబ్బు సంపాదించడం ఎలాగో గుర్తించాలి, లాభపడాల్సిన అవసరం లేదు, కానీ త్వరగా రాబడిని పొందే మార్గాన్ని ఆలోచించాలి అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించి మరో వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ 'రాజ్ అల్లాడ' పరిణామం చాలా ముఖ్యంమని నేను అనుకుంటున్నాను. కస్టమర్ల నిజమైన విలువని కాపాడుకొవడం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. ఇక సీఎక్స్ఓ ఫోరమ్లో చేరిన ఇతర ఎగ్జిక్యూటివ్ల వివరాల విషయానికి వస్తే.. మురళి వుల్లగంటి (సీఈఓ, పీపుల్ షోర్స్), బ్రహ్మానంద్ రెడ్డి (సీటీఓ, డేటాలింక్ సాఫ్ట్వేర్), బారీ రుడాల్ఫ్ (ఫౌండర్, ఫాల్కన్స్టార్ సాఫ్ట్వేర్), సాయి గుండవల్లి (సీఈఓ, సోలిక్స్), అశోక్ చిటిప్రోలు (సీఈఓ, టెక్స్టార్ గ్రూప్ ), రామ్ పుప్పాల (సీఈఓ, ఏసీఎల్ వరల్డ్వైడ్), రాజ్ అల్లడ (ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, మేజర్ వాల్స్ట్రీట్ ఫర్మ్), సంతోష్ యంసాని (ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, బీఎన్వై మెల్లన్), అజయ్ తివారీ (ఫౌండర్ & సీఈఓ, హ్యాపీ లొకేట్), యూఎస్ఎస్ ఉప్పులూరి (ఛైర్మన్, EDVENSWA ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్), సోమ రావు (గ్లోబల్ బిజినెస్ లీడర్, జేపీ మోర్గాన్ చేజ్) మొదలైనవారు ఉన్నారు. సీఎక్స్ఓ ఫోరమ్ ఏం చేయబోతుంది? వినూత్న స్టార్టప్ కాన్సెప్ట్లతో ముందుకు వచ్చే తెలుగు యువకులకు సీఎక్స్ఓ ఫోరమ్ ఒక ముఖ్యమైన వేదికగా కానుంది. సీఎక్స్ఓ ఫోరమ్ యువకుల ఆలోచనలను ఇంకా అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా, వారు తమ ఆలోచనలను ప్రపంచ స్థాయిలో సమలేఖనం చేసుకునే అవకాశాన్ని కల్పించడం. అలాగే ఆ ఆలోచనలను అంతర్జాతీయ సాధనాలుగా మార్చడానికి దోహద పడటం. ఇలా ఈ సీఎక్స్ఓ ఫోరమ్ స్టార్టప్ కాన్సెప్ట్లకు గొప్పవరం కానుంది. ఉత్తర అమెరికాలోని ఎన్ఏటీఎస్ మరియు తానా వంటి జాతీయ తెలుగు సదస్సులలో సీఎక్స్ఓ ఫోరమ్లను రూపొందించడంలో అట్లూరి కీలకపాత్ర పోషించారు. -
ఆక్వా స్టార్టప్ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: ఆక్వారంగంలో అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఆక్వాఎక్సేఛంజ్ ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్తో కలిసి ఆక్వా ఎక్సేఛంజ్ కో–పౌండర్ బండి కిరణ్కుమార్, సీఈవో పవన్కృష్ణ కలిసి ఇటీవల బెంగళూరులో జరిగిన జీ–20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ సమ్మిట్–2023లో సాధించిన గ్లోబల్ అవార్డును చూపించారు. అవార్డు సాధించిన ఆక్వా ఎక్సేఛంజ్ ప్రతినిధులను అభినందించిన సీఎం.. చిన్న, సన్నకారు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేలా ఆలోచనలు చేయాలని సూచించారు. -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
నీతిఆయోగ్ టాప్ పెర్ఫార్మెన్స్లో ‘విశాఖ ఏఎంటీజెడ్ ఇంక్యుబేషన్’కు చోటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు అద్భుతమైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విశాఖ మెడ్టెక్ జోన్లో, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు నీతిఆయోగ్ ప్రకటించిన సర్వేలో అగ్రస్థానాలను దక్కించుకున్నాయి. 2021కి సంబంధించి నీతిఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పనితీరును అధ్యయనం చేసి.. వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదిక విడుదల చేసింది. పదికి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మ్స్గా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 12 ఇంక్యుబేటర్స్కు స్థానం లభించగా.. విశాఖకు చెందిన ఏఎంటీజెడ్(మెడ్టెక్ జోన్) మెడ్వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్కు స్థానం లభించింది. ఒకే రంగంపై అత్యధికంగా దృష్టిసారించడం, అనేక రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పొందడం, సీడ్ ఫండ్ గ్రాండ్స్ ఫండ్స్లో మంచి పనితీరు కనపర్చిన వాటిని ఈ విభాగం కింద ఎంపిక చేసింది. అదే విధంగా 6.5–7.5 మధ్య మార్కులు పొందిన వాటిని ఫ్రంట్ రన్నర్స్గా కేటాయించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 22 ఇంక్యుబేటర్స్ ఎంపికకాగా, రాష్ట్రానికి చెందిన ఎస్కేయూ కాన్ఫడరేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో ఎంపికైన ఇంక్యుబేటర్స్కు ఇన్పుట్స్, ప్రాసెస్లన్నీ ఉన్నాయని, కానీ భాగస్వాములను పెంచుకోవాల్సిన అవ సరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. అటల్ ఇంక్యుబేటర్స్తో 35,000 మందికి ఉపాధి దేశవ్యాప్తంగా పరిశోధనలను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2016లో 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి ద్వారా 3,200కు పైగా యాక్టివ్ స్టార్టప్స్ అభివృద్ధి చెందినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 30 శాతం స్టార్టప్స్ మహిళల నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 ఇంక్యుబేటర్స్ ఉండగా.. వాటిలో 450 ఇంక్యుబేటర్స్కు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2,100 కోట్ల వరకు ఆరి్థక మద్దతు లభించినట్టు వెల్లడించింది. ఇందులో 70 శాతం అంటే 1,500 కోట్లు ప్రభుత్వం నుంచే వస్తే, ప్రైవేటు రంగం నుంచి కేవలం 18 శాతం అంటే సుమారు రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎస్ఆర్ నిధుల కింద మరో 12 శాతం లభించింది. ఈ గణాంకాలు ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను సూచిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. -
‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’
బెంగళూరుకు చెందిన ఫామ్పే అనే స్టార్టప్ సంస్థ ఒకేసారి 18 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా ప్రకటించారు. హైపర్-గ్రోత్ నుంచి సస్టైనబిలిటీకి తమ ఫోకస్ మారడం వల్ల తొలగింపులు తప్పడం లేదని ఫామ్పే కో ఫౌండర్ సంభవ్ జైన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు. అయితే తాము తొలగించిన సిబ్బందికి ఎవరైనా జాబ్ ఇవ్వాలని రిక్రూటర్లను అభ్యర్థించాడు ఆ ఫిన్టెక్ యాప్ సహ వ్యవస్థాపకుడు. ఇక మరో కో ఫౌండర్ కుష్ తనేజా కూడా సంభవ్ జైన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త జాబ్ పొందేలా సహాయం చేయాలని కోరారు. ‘ఈరోజు చాలా కఠినమైన రోజు. ఎందుకంటే 18 మంది ఉద్యోగులను వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఫౌండర్గా ఇది నాకు చాలా కష్టమైన పని. ఉద్యోగులను వదులుకోవడం తమలాంటి ‘పీపుల్ ఫస్ట్’ సంస్థలకు అంత సులభం కాదు’ అని సంభవ్ జైన్ ట్వీట్ చేశారు. తాను, తనేజా సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న జట్టు గురించి చాలా గర్విస్తున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు తగిన జాబ్లను తాము అందించలేకపోయామన్నారు. వీరిని ఎవరైనా నియమించుకోవాలని కోవాలని కోరారు. తనేజా కూడా ట్వీట్ చేస్తూ 18 మంది ఉద్యోగులను విడిచిపెట్టవలసి వచ్చినందున ఈ రోజు తమకు చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఫామ్పే సంస్థను నిర్మించడంలో వారి సహకారానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని ఇందు కోసం తమను సంప్రదించాలని రిక్రూటర్లను అభ్యర్థించారు. అయితే వీరి పోస్ట్లపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వీరిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Today was an extremely sad day for us as 18 of our FamStars had to leave 😔 We are forever grateful to their contributions in building the Fam! Please DM if you are looking for super passionate and extraordinary folks for your team https://t.co/fmQTH90xP8 — Kush (@iamkushtaneja) August 2, 2023 -
అవాక్కయ్యే నిజం.. ఆరు నెలల్లో అంతమంది ఉద్యోగులా?
Job Cuts 2023 First Six Months: కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. 2023లో కూడా కొన్ని కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 మొదటి ఆరు నెలల కాలంలో ఏకంగా 70 కంపెనీలు 17,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నిధుల క్షీణత కారణంగా సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి.. నగదును ఆదా చేయడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను తొలగించిన స్టార్టప్ల జాబితాలో.. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్టెక్, లాజిస్టిక్స్ టెక్ అండ్ హెల్త్-టెక్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మీషో, అనాకాడెమీ, స్విగ్గీ, షేర్చాట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్కి ప్రధాన కారణం కంపెనీలు లాభాలను పొందకపోవడమే అని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ - షావోమి నుంచి రెడ్మీ వరకు.. పెరుగుతున్న మూలధన వ్యయం, వడ్డీ రేట్లు, టెక్నాలజీ స్టాక్ల విలువ క్షీణత కారణంగా స్థిరమైన స్టార్టప్ ఫండింగ్పై ప్రభావం కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు మునుపటి వైభవం పొందలేకపోతున్నాయి. ఈ కారణంగానే 2023లో కూడా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
ఫిజిక్స్వాలా: గెలవాలంటే అజ్ఞానం కూడా అవసరమే!
సక్సెస్ కావాలంటే అజ్ఞానం కూడా ఉండాలి అంటారు ఫిజిక్స్వాలా ఫేమ్ అలక్ పాండే. అతడి మాటల తాత్పర్యం.. నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడూ ఏమి తెలుసుకోలేము ఏమి తెలియదు అనుకున్నప్పుడే అన్ని తెలసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. అదే విజయానికి దారి చూపుతుంది. ప్రయాగ్రాజ్లో ట్యూషన్లు చెప్పి కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళలా సహకరించిన స్టార్ ఎంటర్ప్రెన్యూసర్ అతడి ఎడ్టెక్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా శాఖోపశాఖలుగా విస్తరించి యూనికార్స్ క్లబ్లో చేరింది. సక్సెస్వాలా స్ట్రాంగ్ స్టోరీ. పాఠాలను పాఠాలుగా మాత్రమే బోధించాలని లేదు. వాటిని నిజజీవితంలోకి తీసుకువచ్చి, హాస్యం జోడించి చెబితే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ‘ఫిక్షనుకు ఫ్రిక్షన్కు తేడా ఏమిటి?’ నుంచి జటిలమైన భౌతికసూత్రాలను సులభంగా చెప్పడం వరకు అలక్ పాండే అద్భుతమైన నేర్పును సాధించాడు. ఈ ఫస్ట్–జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కొన్ని సంవత్సరాల క్రితం ‘ఫిజిక్స్వాలా’ పేరుతో ఫ్రీ యూట్యూబ్ చానల్కు శ్రీకారం చుట్టాడు. ‘పెద్ద సక్సెస్ సాధించబోతున్నాను’ అని ఆ సమయంలో అతను అనుకొని ఉండడు. అతడు అనుకున్నా, అనుకోకపోయినా ‘ఇస్రో’వారి రాకెట్లా ఫిజిక్స్వాలా దూసుకుపోయింది. 31 మిలియన్ల సబ్స్రైబర్లు, 61 యూట్యూబ్ చానల్స్, 5.3 బిలియన్ వ్యూస్! ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మేలు’ అనుకునే రకం కాదు అలక్. ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు మనదైన స్టైల్ను బయటికి తీయాలి’ అని బలంగా నమ్ముతాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం నుంచి వచ్చిన అలక్ ‘మాకు ప్రతి రపాయి వందరపాయలతో సవనంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అలక్ ఎడ్టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తాను వేసుకున్న ప్రశ్న ‘స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?’ ఈ ప్రశ్నకు ఊహల్లో నుంచి సమాధానం తీసుకోకుండా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాడ్లాడాడు. వారు చెప్పిన ప్రతీదాన్ని నోట్ చేసుకొని లైవ్ ఆన్లైన్ కాసులలో అప్లై చేశాడు. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కోంగ్ సెంటర్ల ద్వారా బాగా డబ్బు గడింన అలక్ పాండేకు ‘ఫిజిక్స్వాలా’ చానల్ ద్వారా వచ్చిన యాడ్ మనీ ఎనిమిది వేలు చాలా తక్కువ. అయితే ఇది ‘శుభారంభం’ అని వత్రమే అనుకున్నాడు అలక్. అతడి నమ్మకం వృథా పోలేదు యాడ్ మనీ ఊహించని స్థాయిలో పెరుగుతూ పోయింది. కొన్నిసార్లు విద్యార్థులే ఉపాధ్యాయులై చక్కని సలహాలు ఇస్తారు. కొత్తలో అలక్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్డాడు. ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంతగా సక్సెస్ అవుతాం అనుకునేవాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు... ‘యాడ్స్ మీద కాదు టీచింగ్ మీద దృష్టి పెట్టండి’ అని చెప్పారు. ఇక అప్పటి నుం యాడ్స్పై కాకుండా టీచింగ్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ‘ఫిజిక్స్వాలా క్లాస్లలో చక్కగా అర్థమవుతుంది’ అనే మౌత్టాక్ వచ్చేలా కృషి చేశాడు. చాలామంది విజేతలలాగే అలక్ పాండేకు ఎదురయ్యే ప్రశ్న.... ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అది చెప్పడానికి అలక్ నోరు విప్పనక్కర్లేదు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనంలోని అతని ఆఫీసు గోడపై అతికించిన పోస్టర్లు చూస్తే చాలు. మచ్చుకు రెండు... ‘సక్సెస్ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్ బీ గురించిన ఆలోచనే రాదు’ ‘వేగంగా పరాజయం పాలైనా సరే, నిదానంగా గట్టి విజయం సాధించాలి’. (చదవండి: మిస్ యూ భయ్యా! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!) -
స్టార్టప్ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్ః స్టార్టప్ రంగంలోని అవకాశాలను యువత అందుకునే దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య తను ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, అగ్రి హబ్ వంటి అనేక వేదికలను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన ‘ఫౌండర్స్ ల్యాబ్’ను కేటీఆర్ బుధవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ప్రారంభించారు. ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా శిక్షణ అందించడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. ఫౌండర్స్ ల్యాబ్ సీఈఓ శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ..వివిధ విద్యాసంస్థలు, వర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని వెల్లడించారు. ఫార్మా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ రంగాలను ఇంజనీరింగ్ రంగాలతో అనుసంధానం చేస్తూ ఆవిష్క రణలను విద్యార్థుల ద్వారా వెలికితీసే అవకాశం ఉందన్నారు. కార్య క్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఫౌండర్ ల్యాబ్ డైరెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. -
ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్ సరిపోదంటున్నారు ఐఐటీయన్, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. విభిన్నమైన జాబ్లకు విభిన్న రెజ్యూమ్లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్మెంట్ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్బుక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్ ట్విటర్ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఇదీ చదవండి ➤ లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్లో ఎంత మంది? ఐఐటీలో ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్లకు విభిన్న వెర్షన్ల రెజ్యూమ్లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, అదే డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్ల కోసమైతే మీ డెవలప్మెంట్ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్ల గురించి రెజ్యూమ్లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. విభిన్న రెజ్యూమ్లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్కుమార్ అన్నారు. కాగా సౌరభ్కుమార్ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. In IIT during internship/placement season we were often told to keep multiple versions of our resume Different resume for different kind of company or role you’re applying for For instance, having different resumes for different roles such as Dev based roles Quant based… — Saurabh Kumar (@drummatick) July 16, 2023 -
2 రోజుల్లో వేల రెజ్యూమ్లు, ఆ జాబ్ వస్తే చాలంటూ.. క్యూ కడుతున్న ఉద్యోగులు!
కోవిడ్-19, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాంద్యం భయాలతో చిన్న చిన్న స్టార్టప్ల నుంచి బడా బడా కార్పొరేట్ కంపెనీల వరకు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో తొలగింపుకు గురైన ఉద్యోగులు, లేదంటే ఇతర కారణాల వల్ల ఏ చిన్న సంస్థలో ఉద్యోగం దొరికినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీతం తక్కువైనా స్టార్టప్స్కు జై కొడుతున్నారు. తాజాగా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ స్ప్రింగ్ వర్క్ సంస్థ పలు విభాగాల్లో విధులు నిర్వహించేందుకు అభ్యర్ధులు కావాలని పోస్ట్ చేసింది. అంతే ఆ సంస్థలో ఉద్యోగానికి కేవలం 48 గంటల్లో 3వేల మందికి పైగా రెజ్యూమ్లు పంపారు. Received over 3K resumes in the last 48 hours just on our website - how bad is the job market? — Kartik Mandaville (@kar2905) July 16, 2023 దీనిపై ఆ సంస్థ సీఈవో కార్తీక్ మండవిల్లే స్పందించారు. మా వెబ్సైట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్ట్ ఉద్యోగ ప్రకటన చేసిన 48 గంటల్లో మూడు వేలకు పైగా రెజ్యూమ్లు వచ్చాయి. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అని ట్వీట్ చేశారు. స్పింగ్ వర్క్ సంస్థ హెచ్ఆర్ విభాగానికి టెక్నాలజీ ఆధారిత సేవల్ని అందిస్తుంది. తన కంపెనీలో వివిధ పాత్రల కోసం ఇప్పటివరకు దాదాపు 13,000 దరఖాస్తులు వచ్చాయని మాండవిల్లే చెప్పారు. అయితే, ఈ కంపెనీకి వేల రెజ్యూమ్లు పంపడానికి ప్రధాన కారణం రిమోట్ వర్కేనని తెలుస్తోంది. దీనిపై ఓ యూజర్.. మీ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అన్ని రెజ్యూమ్లో వచ్చాయని అనుకుంటున్నాను. అదే ఆఫీస్ నుంచి వర్క్ చేయాలంటే ఆ సంఖ్య తక్కువగా ఉండేదని కామెంట్ చేశాడు. ‘నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. కాలేజీలో నేర్చుకున్నదానితో సంబంధం లేకపోయినా యువత ఉద్యోగాల కోసం తహతహలాడుతున్నారు’ అని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి స్టార్టప్లో ఉద్యోగం జాబ్ మార్కెట్లో హాట్ టాపిగ్గా మారింది. చదవండి👉 అసలేం జరుగుతోంది?, టీసీఎస్ ఇలా చేస్తుందని అనుకోలేదు! -
హెచ్బిట్స్ ఆల్టర్నేటివ్ ఫండ్కు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: అంకుర సంస్థ హెచ్బిట్స్ ప్రతిపాదిత రూ. 500 కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచి్చంది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను కమర్షియల్ రియల్ ఎస్టేట్పై ఇన్వెస్ట్ చేయనున్నట్లు హెచ్బిట్స్ వెల్లడించింది. ఈ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 18–20 శాతం మేర రాబడులు అందుకునే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలాఖరున సెబీ నుంచి అనుమతి లభించిందని, ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీస్లు, అత్యంత సంపన్నులు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి నిధులు సమీకరిస్తున్నామని వివరించింది. ప్రస్తుతం హెచ్బిట్స్ తొమ్మిది ప్రాపరీ్టలవ్యాప్తంగా రూ. 220 కోట్ల అసెట్స్ను నిర్వహిస్తోంది. 50,000 మంది పైచిలుకు రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. -
స్టార్టప్ల కల్పతరువు విశాఖ
దొండపర్తి (విశాఖ దక్షిణ): అంకుర సంస్థలకు విశాఖపట్నం కల్పతరువుగా మారుతోంది. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆన్ ఇండస్ట్రీ 4.0’ కేంద్రాన్ని ఉక్కు నగరం టౌన్షిప్లో ఏర్పాటైంది. దీనిని స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్భట్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో విశాఖ స్టార్టప్ హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయన్నారు. ఎంఈఐటీవై, ఎస్టీపీఐ, ఎస్టీపీఐ నెక్ట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్య ఉమ్మడి నిధులతో స్టీల్ప్లాంట్లో ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్టు చెప్పారు. ఈ సెంటర్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అంశాలపై ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు చేపడుతున్నట్టు వివరించారు. ఇది భారతీయ ఆటోమేషన్ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఎగుమతుల పెరుగుదలకు దోహదం చేస్తూనే, ఆటోమేషన్ పరికరాల దిగుమతుల తగ్గుదలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆర్ఐఎన్ఎల్తో పాటు దేశంలో ఉన్న ఇతర పరిశ్రమల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 175 స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 5 స్టార్టప్లతో ఎంవోయూలు ఈ ప్రాజెక్టులో భాగంగా గురువారం 5 స్టార్టప్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్కుమార్, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఎస్టీపీఐ డైరెక్టర్ సీవీడీ రామ్ప్రసాద్, ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఏకే బాగ్చి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. స్టార్టప్లకు మార్గదర్శక సేవలు అందించే ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, ఐఐఎం వైజాగ్, లోటస్ వైర్లెస్ వంటి కల్పతరు భాగస్వాములతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఆర్ఐఎన్ఎల్ జీఎం పి.చంద్రశేఖర్, ఎస్టీపీఐ అడిషనల్ డైరెక్టర్ సురేష్ భాతా, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
సెలవులు తీసుకోవాల్సిందే.. ఈ కంపెనీ పెట్టిన రూల్ భలే ఉందే!
సాధారణంగా ఉద్యోగులు తమ యాజమాన్యాలు ఎన్ని సెలవులిస్తే అంత మేలని భావిస్తుంటారు. కానీ కొందరుంటారు.. అస్సలు లీవ్స్ తీసుకోరు. ఏడాదంతా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసేవారూ ఉన్నారు. అయితే ఈ స్టార్టప్ కంపెనీలో సెలవులు పెట్టకుండా పనిచేస్తామంటే కుదరదు. యునైటెడ్ స్టేట్స్కు చెందిన గో నింబ్లీ అనే స్టార్టప్ తమ సంస్థలో నూతన సెలవు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి సంవత్సరం కనీసం 20 సెలవులు తీసుకోవడం తప్పనిసరి. సంస్థ ఉద్యోగులు చాలా కాలంగా లీవ్లకు సంబంధించి మరింత అనువైన ప్లాన్ కోసం అభ్యర్థిస్తున్నారని, వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ కంపెనీ రూపొందించిన సెలవుల విధానాన్ని గురించి తెలియ జేస్తూ గో నింబ్లీ కంపెనీ పీపుల్ ఆపరేషన్స్ డైరెక్టర్ కైల్ లాసీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. కొత్త విధానం పర్యవసానంగా గత త్రైమాసికంతో పోల్చితే సెలవుల వినియోగం 19 శాతం పెరిగిందని తెలిపారు. కొత్త విధానంలోని ముఖ్యాంశాలు ఒక ఉద్యోగి సంవత్సరానికి తీసుకోవలసిన కనీస సెలవుల సంఖ్య 20 రోజులు నూతన సెలవు విధానానికి అనుగుణంగా ఇన్సెంటివ్ ప్లాన్. ఉద్యోగుల సెలవులను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బంది నియామకం పేరెంటెల్ లీవ్స్ కోసం ప్రత్యేక విధానం ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్లో ఎంత మంది? -
స్టార్టప్లలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు. పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి. -
జర్నలిస్ట్ టూ ఎంటర్ప్రెన్యూర్.. రూబీసిన్హా సక్సెస్ స్టోరీ
రూబీ సిన్హా ప్రారంభించిన ‘షీ ఎట్ వర్క్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు జ్ఞానకేంద్రంగా మారింది.‘అదిగో దారి’ అని దారి చూపే దిక్సూచి అయింది. ‘ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలు పెట్టారా? అయితే మీ దగ్గర ఉన్న శక్తిని బయటికి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెట్టి వందలాదిమందికి స్ఫూర్తి ఇస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఉత్సాహపరిచే రూబీ సిన్హా తాజాగా బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియామకం అయింది... దిల్లీకి చెందిన రూబీ సిన్హా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన తరువాత జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టింది. మరోవైపు వారాంతాలలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేది. ఏమాత్రం తీరిక దొరికినా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేది. షార్ట్ ఫిల్మ్స్ తీసేది.అడ్వర్టైజింగ్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆమెకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ఒక బిడ్డకు తల్లి అయిన రూబీ ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. కొంత కాలం తరువాత స్నేహితులలో ఒకరు ఇండిపెండెంట్ పీఆర్ కన్సల్టెంట్గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ సలహా రూబీకి బాగా నచ్చింది. అలా మొదలైన ప్రయాణమే తనను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది. ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అన్నట్లు రూబీ సిన్హా ఎంటర్ప్రెన్యూర్ అయిన తరువాతగానీ మహిళ వ్యాపారవేత్తలు ఎదుర్కొనే సమస్యలు అర్థం కాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ‘కమ్యూన్ బ్రాండ్ సొల్యూషన్స్’ ద్వారా కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసింది. అయితే తన విజయానికే పరిమితమై సంతృప్తి పడకుండా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్లాట్ఫామ్ ‘షీ ఎట్ వర్క్’ ద్వారా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ‘ప్రతి స్టార్టప్ ఐడియా సక్సెస్ కావాలని ఏమీ లేదు. కానీ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదల ఉండే మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాం. మన దేశంలో ఎంతో ప్రతిభ, సృజనాత్మకత ఉంది. వోలా క్యాబ్స్ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు ఎన్నెన్నో విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు’... ఇలాంటి మాటలు ఎన్నో ‘షీ ఎట్ వర్క్’లో కనిపిస్తాయి. ‘ఒంటరి ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అయితే ఆ ప్రయాణం నీకు కొత్త శక్తి ఇస్తుంది’ అనే మాట రూబీకి చాలా ఇష్టం.తాను ఒంటరిగానే ప్రయాణం పెట్టింది.‘బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం వరకు ఎంటర్ప్రెన్యూర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయితే అవేమీ జటిలమైన సవాళ్లు కాదు. ప్రతి సవాలు ఒక పాఠం నేర్పుతుంది. అలా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్ టీమ్ కెప్టెన్గానే కాదు టీమ్ మెంబర్గా కూడా వ్యవహరించాలి. టీమ్తో కలిసిపోయి వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి’ అంటుంది రూబీ. నేర్చుకోవడానికి చిన్నా,పెద్దా తేడా అనేది ఉండదు.‘నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఏమిటి’ అనే అహం అడ్డొస్తే అదే అడ్డుగోడగా మారుతుంది. అయితే రూబీకి అలాంటి అహాలు లేవు.‘ఈ తరానికి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ఉన్నాయి. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను’ అంటుంది రూబీ.‘భవిషత్ దార్శనికత, వ్యూహ చతురత, అంకితభావం రూబీ సిన్హా బలాలు’ అంటున్నారు బ్రిక్స్ సీసీఐ డైరెక్టర్ జనరల్ మధుకర్.భౌగోళిక సరిహద్దులకు అతీతంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సీసీఐ, ఉమెన్ వర్టికల్ ఏర్పాటయింది. ఇప్పుడు ఈ విభాగానికి రూబీ సిన్హా రూపంలో అంతులేని బలం చేకూరింది. -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
దిగంతారా రూ.82 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక రంగంలోని అంకుర సంస్థ దిగంతారా తాజాగా రూ.82 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్-ఏ1 రౌండ్లో పీక్ ఎక్స్వీ పార్ట్నర్స్, కలారీ క్యాపిటల్, గ్లోబల్ బ్రెయిన్స్, క్యాంపస్ ఫండ్తోపాటు ఐఐఎఫ్ఎల్ వెల్త్ వ్యవస్థాపకులు ఈ మొత్తాన్ని సమకూర్చారు. స్పేస్-మిషన్ అష్యూరెన్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలను ఈ నిఘా ఉపగ్రహాలు గుర్తిస్తాయని వివరించింది. త్వరలో కంపెనీ వీటిని ప్రవేశపెట్టనుంది. (హైదరాబాద్లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు) కాన్ ఫిన్ హోమ్స్ నిధుల సమీకరణ గృహ రుణ సంస్థ కాన్ ఫిన్ హోమ్స్ రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 1,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. పీఎస్ యూ కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీ బోర్డు నిధుల సమీకరణ ప్రణాళికలకు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. మారి్పడిరహిత డిబెంచర్లు తదితర రుణ సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 4,000 కోట్లు, క్విప్ లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లేదా రైట్స్ ద్వారా మరో రూ. 1,000 కోట్లు అందుకోవాలని భావిస్తోంది. బీఎస్ఈలో 0.6 శాతం నీరసించి రూ. 745 వద్ద ముగిసింది. (WhatsApp Latest Features: స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ
ఇంటర్, పదవతరగతి, ఇతర పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయంటే..చాలు విద్యార్థుల సక్సెస్ కంటే.. అందర్ని భయపెట్టే మరో అంశం కూడా మరొకటి ఉంది. అవును మీరు ఊహించింది కరెక్టే. ఫెయిల్ అయ్యామన్న బాధతో ఎంతమంది పిల్లలు ఉసురు తీసుకుంటారో ననే ఆందోళన ఎక్కువ. ఈ విషయంకేవలం తల్లిదండ్రులను మాత్రమేకాదు చాలామందిని పట్టి పీడిస్తోంది. అలాంటి వారికి జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినా, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి సక్సెస్ స్టోరీల గురించి చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే...కానీ అదే సందర్భంలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్టు కాదు.. అని మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలి. రెండుసార్లు పెయిలైనా వ్యాపారంలో రాణించి 29 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాపౌట్ సక్సెస్ జర్నీ చూద్దాం ఈ స్టోరీలో మన హీరో పేరు మిస్బా అష్రఫ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బిహార్లో పుట్టి పెరిగిన ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. అష్రాఫ్ ఐఐటీ ఢిల్లీలో చదువుతూ తొలి ఏడాదే కాలేజీ మానేశాడు. ఆ తరువాత Pulse.qa (YC), Pursuit, Toymail (YC),Spangle లాంటి సంస్థలలో పనిచేశాడు. మధ్యతరగతి కుటుంబం..ఇటు ఆర్థిక ఇబ్బందులు అయినా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల సాకారానికి ఇందుకు తండ్రే స్పూర్తి. ఎలా అంటే తండ్రి ప్రేరణ ఒక రోజు ఎప్పుడూ రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడుమిస్బా "ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు?" దానికి చిరు మందహాసంతో చెప్పాడు ఇలా "నువ్వు నెమ్మదిగా నడిస్తే..కొట్టుకుపోతావు" అని. దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కల సాకారం కోసం వేగాన్ని పెంచాడు. (స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) అలా సెప్టెంబరు 2013లో ఐఐటీ-ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబోలా అనే కంపెనీనీ స్థాపించాడు. కానీ నాలుగు నెలలకే దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టప్ కావడం,ప్రభుత్వం పేమెంట్స్ లైసెన్స్రాలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఆగస్ట్ 2017లోమార్స్పే అనే స్టార్టప్ లాంచ్ చేశాడు. ఇంతలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. అయితే భారీగా వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి 2021లో బ్యూటీ షాపింగ్ ,లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే మే 2021లో, జార్ అనే తన మూడవ వెంచర్ను ప్రారంభించాడు. జార్లో నిశ్చయ్ మరో కో ఫౌండర్. అతను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసరుగా ఉన్నారు. స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు , పెట్టుబడి. 18 నెలల తర్వాత, ఇది 11 మిలియన్ల వినియోగదారులను దాటింది. ఫిన్టెక్ సంస్థ 58 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. జార్ రూ. 2463 కోట్లు (22.6 మిలియన్ డాలర్ల) ను సేకరించింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే రూ. 2463 కోట్లకు చేర్చాడు కంపెనీని. అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ-మిలియన్ డాలర్ల బిగ్డీల్ను సాధించాడు. ఇండియాలోని మైక్రో-సేవింగ్స్ యాప్ అయిన జార్, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ ఫండింగ్లో ఈ నిధులను సమకూర్చుకుంది. అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ (2023)లో ఫోర్బ్స్ 30 అండర్ లిస్ట్లో 30 వాడిగా ఎంపికకావడం విశేషం. జార్ ఆఫ్ గోల్డ్ ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో జార్ ను స్టార్ట్ చేశారు.ఈ యాప్లో అందరూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంత చిన్న మొత్తంలో అయినా. 10 రూపాయలతో కేవలం 45 సెకన్లలో 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టొచ్చు. -
సౌత్పై కన్నేసిన ఫిజిక్స్వాలా.. మూడేళ్లలో రూ. 500 కోట్లు..
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్ సంస్థ ఫిజిక్స్వాలా మూడేళ్లలో ఎడ్టెక్ సంస్థ జైలెమ్ లెర్నింగ్ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్టెక్ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్ లెర్నింగ్ జైలెమ్ మోడల్ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. -
స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్మ్యాన్’!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ael) ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్ఫామ్ ట్రైన్మ్యాన్ సంస్థను కొనుగోలు చేసింది. సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఏఈఎల్కి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) 100 శాతం స్టేక్ కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు వెల్లడించింది. అయితే, ఎంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందనే ఆర్ధిక పరమైన అంశాల గురించి ప్రస్తావించలేదు. ఉత్తరాఖండ్ ఐఐటీ - రూర్కీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వినీత్ చిరానియా, కరణ్కుమార్లు గురుగావ్ కేంద్రంగా ఐఆర్సీటీసీ గుర్తింపుతో ట్రైన్ టికెట్ సేవల్ని అందించేలా ఎస్ఈపీఎల్ను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ట్రైన్మ్యాన్ యాప్ ప్రయాణికులు సులభంగా ట్రైన్ టికెట్లతో పాటు ఇతర సౌకర్యాల్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థనే అదానీ గ్రూప్ను సొంతం చేసుకుంది. ఇటీవల, ఎస్ఈపీఎల్ కార్యకలాపాల నిమిత్తం 1 మిలియన్ డాలర్లను అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఇక, పెట్టుబడి పెట్టిన సంస్థల్లో గుడ్వాటర్ కేపిటల్, హెమ్ ఏంజెల్స్ వంటి సంస్థలున్నాయి. ఈ క్రమంలో రైల్వే సేవల్ని అందించే స్టార్టప్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్లో చోటు దక్కలేదు. లింక్డ్ఇన్లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే... హైస్కూల్లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్ని ఏర్పాటు చేశాడు. బాచ్మానిటీ క్యాపిటల్లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్ఇన్ పోస్ట్లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లింక్డ్ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw — Eric Zhu (@ericzhu105) June 15, 2023 -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్ను, 12.8 వేల లైక్స్ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే..
ప్రేరణ ఝున్ఝున్వాలా.. భారత్కు చెందిన పారిశ్రామికవేత్త వ్యవస్థాపకురాలు. సింగపూర్లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీ స్కూల్ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడక్కడ బాగా పాపులరైన ప్రీ స్కూల్. దీంతోపాటు పిల్లల కోసం ఆమె ప్రారంభించిన మొబైల్ యాప్కు విశేష ఆదరణ లభిస్తోంది. కోటి డౌన్లోడ్లు లిటిల్ పాడింగ్టన్ ప్రీ స్కూల్ను నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఇది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్. ఈ అప్లికేషన్ భారత ఉపఖండంలో దాదాపు కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లల విద్యలో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రలైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి. వ్యాపార నేపథ్యం లేకుండానే.. ప్రేరణ ఝున్ఝున్వాలా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు.. ఎటువంటి బిజినెస్ కోర్సులు ఆమె చేయలేదు. కానీ ఈ కంపెనీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది ఫండింగ్ రౌండ్లో సుమారు రూ.60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్ల (రూ. 330 కోట్లు) వాల్యుయేషన్తో తమ కంపెనీ రౌండ్ను పెంచిందని ప్రేరణ చెప్పారు. తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో తన ఎదుగుదల క్రమబద్ధంగా జరిగిందన్నారు. 30 మంది సిబ్బంది ఉండగా ఏడాదిలోనే రెట్టింపు అంటే 60 మందికి పెంచినట్లు తెలిపారు. ఇండోసియా, వియత్నాంలో తమ సంస్థలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆమె సింగపూర్ వెంచర్లో ఇప్పుడు ఏడు పాఠశాలలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఉపాధ్యాయుల లోటును తీర్చడానికి ఆన్లైన్ విద్యను ప్రారంభించారామె. Honored to be featured in the current edition of @EntrepreneurIND's #Shepreneurs- Women to Watch 2023. Thank you for the feature @PunitaSabharwal https://t.co/IvZLcfsm0b — Prerna Jhunjhunwala (@prernaj87) April 3, 2023 ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
ఏపీలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
‘బాక్స్ సాగు’ భలేభలే..!
వ్యవసాయంతో పరిచయమున్న వారెవరికైనా గ్రీన్హౌస్ అంటే తెలిసే ఉంటుంది. ఎండావానలు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి చేసుకొనే ఓ హైటెక్ ఏర్పాటు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆధునిక గ్రీన్హౌస్ను ఏర్పాటు చేసుకోవాలంటే... రూ. లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖేతీ అనే స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన కౌశిక్ కప్పగంతుల అత్యంత తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక గ్రీన్హౌస్ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ప్రాంతం, వేసే పంటలను బట్టి దిగుబడులు పెంచుకొనేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పంటలను కాపాడుకొనేందుకు ఏమేం చేయాలో కూడా రైతులకు నేరి్పంచడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవస్థ పేరే... ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’. ఈ వినూత్న ఆవిష్కరణకుగాను బ్రిటన్ యువరాజు చార్లెస్ స్థాపించిన ప్రతిష్టాత్మక ‘ద ఎర్త్ షాట్ ప్రైజ్–2022’ను కౌశిక్ పొందారు. – సాక్షి, హైదరాబాద్ కావాల్సిన వారికి కావాల్సినంత... ఖేతీ అభివృద్ధి చేసిన గ్రీన్హౌస్ను 240 చదరపు మీటర్లు లేదా ఎకరాలో పదహారో వంతు సైజులో ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కటొక్కటిగా చేర్చుకోనూవచ్చు. ఒక్క గ్రీన్హౌస్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 60 వేల ఖర్చవుతోంది. సాధారణ గ్రీన్హౌస్తో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... రైతులు రోజుకు రెండు గంటలపాటు మాత్రమే పనిచేయడం ద్వారా ఏడాదిలోనే పెట్టుబడితోపాటు కనీసం రూ. 20 వేలు అదనంగా సంపాదించవచ్చు. 240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండే పంటకు ఏడు రెట్లు ఎక్కువగా పండటం ఒక కారణమైతే... నీటి వాడకం 95 శాతం వరకూ తక్కువ. అలాగే ఎరువులు, చీడపీడలకు పెట్టే ఖర్చులు కూడా తక్కువ కావడం వల్ల పెట్టిన పెట్టుబడికి మించిన రాబడి ఏడాదిలోనే వస్తుంది! (చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం) 15 రకాల పంటలు.. ఖేతీ గ్రీన్హౌస్ల అమ్మకాలు మాత్రమే చేయడం లేదు. ఏ పంట వేస్తే ఎక్కువ లాభాలుంటాయో నిత్యం తెలుసుకొనే ప్రయత్నాల్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని సొంత వ్యయసాయ క్షేత్రంలో ఇప్పటివరకూ 15 రకాల పంటలను విజయవంతంగా పండించింది కూడా. మరిన్ని పంటల సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2017లో కేవలం 15 మంది రైతులతో తెలంగాణలో ఈ టెక్నాలజీ వాడకం మొదలుకాగా... మూడేళ్లలో 500 మంది రైతుల దగ్గరకు చేర్చారు. గతేడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలోనూ ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’వాడకం మొదలైంది. మొత్తమ్మీద ఇప్పుడు సుమారు 2,500 మంది చిన్న, సన్నకారు రైతులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. 2027కల్లా 50 వేల మంది వాడేలా ప్రయత్నిస్తున్నాం... 2027 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల మంది రైతులు ‘గ్రీన్హౌస్ ఇన్ ఏ బాక్స్’ను వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు వ్యవస్థీకృతమైన పద్ధతిలో రుణ సౌకర్యం కల్పిస్తే వారికి మరింత మేలు జరుగుతుంది. చిన్న, సన్నకారు రైతులు ఎంత ఎక్కువగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే.. అంత తక్కువ ధరలకు ఈ గ్రీన్హౌస్లు అందించవచ్చు. సెన్సర్ల వంటి హంగులను కూడా ఈ గ్రీన్హౌస్లో చేర్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాం. – కౌశిక్ కప్పగంతుల, ఖేతీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో -
జర్మన్ స్టార్టప్లో టీవీఎస్కు 25 శాతం వాటా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్వాట్ జీఎంబీహెచ్లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది. ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది. -
గెలుపు గ్రామర్
విజయం సాధించడంలో ఎంత కిక్ ఉందో....ఇతరులను విజయం సాధించేలా చేయడంలో అంత కంటే ఎక్కువ కిక్ ఉంది!ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ప్రిప్ఇన్స్టా’తో ఆశయ్ మిశ్రా, కౌశిక్, మనీష్ అగర్వాల్లు విజయం సాధించడమే కాదు యువత తమ కలలు సాకారం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు... కౌశిక్, ఆశయ్ మిశ్రా, మనీష్ అగర్వాల్లు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటీ యూనివర్శిటీ, తమిళనాడు)లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత బెంగళూరులో వేరు వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు.‘చాలామంది స్టూడెంట్స్లో ప్రతిభ ఉన్నా తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారిలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడంలో అనుసరించాల్సిన వ్యూహంపై అవగాహన లేకపోవడం...’ ఇలాంటి ఆలోచనలను రెగ్యులర్గా బ్లాగ్లో రాసేవాడు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న కౌశిక్.తన బ్లాగ్ ఎంత హిట్ అయిందంటే సంవత్సరం తిరిగేసరికల్లా నెలకు లక్ష వ్యూలు వచ్చేవి.ఆ టైమ్లోనే కౌశిక్కు ‘ఫ్లిప్కార్ట్’ నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే దాన్ని కాదనుకొని ఇద్దరు మిత్రులతో మాట్లాడాడు.అలా ఈ ముగ్గురి మేధో మథనం నుంచి పుట్టిందే... ప్రిప్ఇన్స్టా.ప్రిప్ఇన్స్టా(ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్ ఇన్స్టంట్లీ) అనేది వోటీటీ ఫార్మట్ ప్లాట్ఫామ్. యూజర్లు డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ టైమ్లో(నెలలు లేదా సంవత్సరాలు) 200 కోర్సులతో యాక్సెస్ కావచ్చు. అప్స్కిలింగ్ సబ్జెక్ట్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (లాజిక్, వెర్బల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్)...మొదలైనవి ఆ కోర్సులలో ఉంటాయి.‘ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్ఇన్స్టా తీసుకువచ్చాం. యూత్ తమ డ్రీమ్ జాబ్స్ను గెలుచుకునేలా చేయడంలో మా ప్లాట్ఫామ్ విజయం సాధించింది’ అంటున్నాడు కో–ఫౌండర్ ఆశయ్ మిశ్రా. నోయిడా(ఉత్తర్ప్రదేశ్), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్లాట్ఫామ్ యాభైకి పైగా కాలేజీలతో కలిసిపనిచేస్తుంది. రాబోయే కాలంలో మూడు వందల కాలేజీలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.‘మాది సెల్ఫ్–పేస్డ్ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ తమకు అనుకూలమైన టైమ్, షెడ్యూల్లో చదువుకోవచ్చు.బీ2సీ (బిజినెస్–టు–కన్జ్యూమర్) మోడల్లో ఈ ప్లాట్ఫామ్కు 2.25 లక్షల పెయిడ్ యాక్టివ్ సబ్స్రైబర్లు ఉన్నారు. కోవిడ్ కల్లోల కాలంలో మాత్రం ఈ స్టార్టప్ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం సగానికి సగం పడిపోయింది. పేరున్న ఎడ్టెక్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. ‘నిరాశ’ మెల్లిగా దారి చేసుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సమయంలో గట్టిగా నిలబడ్డారు ముగ్గురు మిత్రులు. కంపెనీని రీవ్యాంప్ చేశారు. ఉద్యోగుల సంఖ్యను పెంచారు.‘ఇక కనిపించదు’ అనుకున్న కంపెనీ లేచి నిలబడి కాలర్ ఎగరేసింది! 25 కోట్ల క్లబ్లో చేరిన ఈ స్టార్టప్ తన విస్తరణలో భాగంగా వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.రిస్క్ అనిపించే చోట ‘ప్లాన్ బీ’ను దృష్టిలో పెట్టుకోవడం మామూలే. అయితే ‘ప్లాన్ ఏ’ పకడ్బందీగా ఉంటే ‘బీ’తో ఏంపని? అని ఈ ముగ్గురు అనుకున్నారు. వారి నమ్మకం నిజమైంది . ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్ఇన్స్టా తీసుకువచ్చాం. – ఆశయ్ మిశ్రా -
ఆస్ట్రేలియా సంస్థతో ‘వుయ్ హబ్’ జట్టు
హైదరాబాద్: మహిళల స్టార్టప్ ఇన్క్యుబేటర్ ’వుయ్ హబ్’ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్ వెస్ట్ సైన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇరు దేశాల్లోని అంకుర సంస్థలకు సీమాంతర అవకాశాలను కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని వుయ్ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు. ఈ ఎంవోయూతో మార్కెట్ విశ్లేషణ, పరిశ్రమ నెట్వర్క్లు, వనరుల వివరాలు మొదలైనవి అంకుర సంస్థలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. వ్యాపార విస్తరణ అవకాశాల గురించి అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ఈవెంట్లు, వర్క్షాప్లు వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం వుయ్ హబ్ను ఏర్పాటు చేసింది. -
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: యువతరం ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ కేంద్రంగా ఐ–స్పేస్ పేరుతో మల్టీ డొమైన్ ఇన్నొవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యాపార ఆవిష్కరణగా మార్చడానికి అవసరమైన ఆర్ అండ్ డీ, కటింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ వాలిడేషన్, ఉత్పత్తి పరిశీలన లాంటి వ్యవస్థలన్నీ ఒకచోట ఉండేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ స్పేస్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్, కో వర్కింగ్ స్పేస్, ఏంజెల్/వెంచర్ క్యాపిటలిస్ట్లను అందుబాటులో ఉంచడంతోపాటు చేయూతనిచ్చే విధంగా మెంటార్స్, టెక్నోప్రెన్యూర్స్ ఉంటారు. వీటితోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్, లీగల్ సర్వీసెస్, ఫండ్ సోర్సింగ్, ప్యాకేజింగ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కార్పస్ ఫండ్ స్టార్టప్లకు అవసరమైన సీడ్ క్యాపిటల్ సాయం అందించేందుకు ప్రభుత్వం కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటును ప్రోత్సహించనుంది. ఆర్అండ్డీ సెంటర్ల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఆర్ అండ్ డీ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్స్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు. -
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్తో కలిసి పేషెంట్ల హెల్త్కేర్కు సంబంధించి డిజిటల్ హెల్త్కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
రెండోరోజూ ‘బాలవికాస’పై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాలవికాస స్వచ్ఛంద సంస్థ, దాని అనుబంధ సంస్థలపై వరంగల్వ్యాప్తంగా రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. సుమారు 15–20 వాహనాల్లో బుధవారం తెల్లవారుజామున హనుమకొండకు చేరుకున్న ఐటీ అధికారులు.. సీఆర్పిఎఫ్ భద్రత మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. కాజీపేట ఫాతిమానగర్, హనుమకొండ సిద్ధార్థనగర్లలో ఉన్న బాలవికాస కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో గురువారం రాత్రి వరకు 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు నిర్వహించారు. తొలిరోజు తనిఖీల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్్కలతోపాటు కీలక ఉద్యోగులు, వ లంటీర్లకు చెందిన సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమా రు నాలుగైదేళ్లకు సంబంధించిన బాలవికాస ఆదాయ వ్యయాల పత్రాలు, వార్షిక నివేదికలపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, బాలవికాస సంస్థపై ఐటీ దాడులను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్రాజు ఖండించారు. 9 రాష్ట్రాలు, 7 వేల గ్రామాలకు సేవలు... భారత్లో సమాజాభివృద్ధి సేవల కోసం ఫ్రెంచ్–కెనడా జాతీయుడైన ఆండ్రే గింగ్రాస్, ఆయన సతీమణి బాలథెరిసా గింగ్రాస్ 1977లో కెనడాలో సోపర్ సంస్థను ప్రారంభించారు. సేవా కార్యకలాపాలను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా సోపర్కు అనుబంధంగా కాజీపేటలోని ఫాతిమానగర్లో 1991లో బాలవికాస సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బాలవికాసకు అనుబంధంగా 9 సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లలోని 7 వేల గ్రామాలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి బాలవికాస సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలవికాసలో సుమారు 300 మంది సిబ్బంది ఉండగా, క్షేత్రస్థాయిలో మరో 500 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మహిళా సాధికారత, ఆదర్శగ్రామాల ఏర్పాటు అంశాలు ప్రధాన లక్ష్యాలుగా 30 వేల మంది వలంటీర్లు బాలవికాస ద్వారా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 60 లక్షల మంది పేదలకు మేలు కలిగేలా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో ఘట్కేసర్ వద్ద సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్స్ బిజినెస్ సెంటర్ను ప్రారంభించారు. సామాజిక వ్యవస్థాపకత, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే శ్రేష్టత కేంద్రాలుగా 30 వినూత్న సోషల్ స్టార్టప్లను బాలవికాస ఏర్పాటు చేసింది. 125 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసింది. -
స్టార్టప్స్కు ఊతమిచ్చిన జీఐఎస్
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కేవలం భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే కాకుండా రాష్ట్ర స్టార్టప్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా వేదికగా నిలిచింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జీఐఎస్లో 36కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచన దగ్గర నుంచి దాన్ని వాణిజ్యపరంగా పూర్తిస్థాయి నూతన ఆవిష్కరణగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ను తయారు చేసే విధంగా పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్స్, పరిశ్రమలతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందుకోసం జీఐఎస్ ఎగ్జిబిషన్లో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, స్టార్టప్స్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 595 స్టార్టప్స్, 30 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఏపీ ఐటీ శాఖ నుంచి నాలుగు ఇంక్యుబేటర్లు, వివిధ కళాశాలల్లో మరో 26 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 1,500 మంది సొంతంగా ఇంటి నుంచే స్టార్టప్స్ కింద పనిచేయడానికి నమోదు చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్స్ అంతర్జాతీయంగా ఎదిగేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పలు సంస్థల సహకారాన్ని స్టార్టప్స్కి అందిస్తోంది. స్టార్టప్స్కు పరిశ్రమల మద్దతు రాష్ట్రంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్కు సహాయ సహకారాలందించడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. బహుళజాతి సంస్థలు పేటీఎం, ఒప్పొ, డసాల్ట్, స్మార్ట్ఫారి్మంగ్ టెక్, గ్లోబల్ యాక్సలేటర్ ఫర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వంటి సంస్థలు స్టార్టప్స్ను ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇన్నొవేషన్స్ సొసైటీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్స్కు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు పేటీఎం ముందుకొచ్చింది. అలాగే ప్రముఖ సెల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన అనుంబంధ సంస్థ ఓప్లస్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్స్ ప్రమోట్ చేయనుంది. రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన ప్రొడక్ట్సను 100 రోజుల్లో మార్కెటింగ్ చేసేందుకు డసాల్ట్ ఇండియా సిస్టమ్స్ ఆసక్తి కనబరుస్తోంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆవిష్కరించే నూతన టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు నెదర్లాండ్స్కు చెందిన స్మార్ట్ ఫార్మింగ్ టెక్ బీవీ ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన యాక్సిలేటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ రాష్ట్రంలోని స్టార్టప్స్ను దేశ విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆర్థి క వనరులను సమకూర్చనుంది. ఫండింగ్ చేయడానికి మూడు సంస్థలు అలాగే రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు దేశ విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజెల్ ఫండింగ్ రూపంలో ఆర్థి కసాయం అందించే విధంగా మూడు సంస్థలతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఒప్పందాలు చేసుకుంది. స్పెయిన్కు చెందిన యూరోపియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈఈడీసీ), చెన్నైకి చెందిన కన్సార్టీయం ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ), బ్రిటన్కు చెందిన ఈస్క్వేర్ ఇన్నొవేషన్స్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే విధంగా డీఎల్టీ ల్యాబ్ టెక్నాలజీస్, దుబాయ్కు చెందిన క్రియేటర్స్ ఎఫ్జెడ్కో, మై స్టార్టప్ టీవీ, నెక్టŠస్ వేవ్ వంటి స్టార్టప్ సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని 13కుపైగా ఇంక్యుబేటర్ సంస్థలు, ఎస్టీపీఐ నెక్ట్స్, నాస్కాంలతో ఏపీఐఎస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధే లక్ష్యం నూతన ఆవిష్కరణలు ఆలోచన దగ్గర నుంచి వ్యాపార పరంగా నూతన అప్లికేషన్ ఆవిష్కరించే విధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా మెటావర్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, డిజిటల్ ఆర్ట్, మార్కెటింగ్, మీడియా డిస్ట్రిబ్యూషన్ రంగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాం. నాలుగో తరం టెక్నాలజీలో పనిచేస్తున్న వారందరినీ ఆన్లైన్లో ఒకే వేదికపైకి తేవడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. రంగాల వారీగా నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి సమీక్షలతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రో గ్రాంలు, హ్యాక్థాన్లు, పోటీలు నిర్వహిస్తాం. – ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు -
స్టార్టప్లలో మహిళల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన దేశీ స్టార్టప్ రంగంలో ఇప్పుడు మహిళలు దూసుకెళుతున్నారు. కొంగొత్త ఆవిష్కరణలతో అంకుర సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఈ–కామర్స్, ఫైనాన్స్ తదితర రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల సారథ్యంలోని నైకా, జివామి, షీరోస్ వంటి పలు విజయవంతమైన అంకుర సంస్థలు ఇందుకు నిదర్శనం. ఫల్గుణీ నాయర్ నేతృత్వంలోని ఫ్యాషన్ ప్రొడక్ట్స్ సంస్థ నైకా... సంచలన స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు భారీగా ఎగబడి మరీ షేర్లు కొన్నారు. ఇక అంతకన్నా ముందు .. దాదాపు నలభై ఏళ్ల క్రితం రజని బెక్టర్ ఏర్పాటు చేసిన బేకరీ ఉత్పత్తుల సంస్థ మిసెస్ బెక్టర్స్ లిస్టింగ్కు వస్తే ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సానుకూల స్పందన ఊతంతో మరిన్ని స్టార్టప్లు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. గజల్ అలగ్ సహ–వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్ కూడా తాజాగా ఐపీవో యత్నాల్లో ఉంది. ఇలా పలు అంకుర సంస్థలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు అవసరమైన ఉత్పత్తులు, సర్విసులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టేవిగా ఉంటున్నాయి. 2014లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సహా దేశీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్ల సంఖ్య .. మొత్తం అంకుర సంస్థల్లో 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది దాదాపు 14 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల సారథ్యంలోని అంకుర సంస్థలతో పోలిస్తే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లు 2.5 రెట్లు ఎక్కువగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, పెట్టుబడులపై 35 శాతం అధికంగా రాబడులు అందించగలుగుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. లక్ష్యంపైనే గురి.. వ్యాపారాన్ని ప్రారంభించడమంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు మిగతా వర్గాల నుంచి సహకారం లభించడం కూడా కీలకం. వ్యాపారం ప్రారంభించడానికి ముందే టార్గెట్ మార్కెట్, పోటీ, తాము అందించే సర్వీసులు, ఉత్పత్తుల ప్రత్యేకత వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పేస్మంత్ర వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్ పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్లు మరింత తరచుగా తమ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందని టెరావిటా వ్యవస్థాపకురాలు రాహీ అంబానీ తెలిపారు. అయితే, ఒడిదుడుకులను అధిగమించి, లక్ష్యంపైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాల తోడ్పాటు.. స్టార్టప్ రంగంలోనూ మహిళలు రాణించేలా ప్రభుత్వాలు, వివిధ సంస్థలు తోడ్పాటు అందిస్తుండటం కూడా వారికి సహాయకరంగా ఉంటోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్టాండప్ ఇండియా వంటి స్కీములు స్టార్టప్లకు అండగా ఉంటున్నాయి. నిధులపరంగాను, ఇతరత్రా సహాయాన్ని అందించేందుకు యాక్సిలరేటర్లు, ఇన్క్యుబేటర్లు మొదలైనవి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నుంచి యాక్సెలరేట్హర్ 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ వెబ్ సర్విసెస్ (ఏడబ్ల్యూఎస్), ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్స్పీడ్ కలిసి యాక్సెలరేట్హర్ 2023 పేరిట ప్రత్యేక ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. ప్రారంభ స్థాయి దేశీ స్టార్టప్ల మహిళా వ్యవస్థాపకులు తమ సంస్థలను నిర్మించుకునేందుకు, వృద్ధిలోకి తెచ్చుకునేందుకు, విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన తోడ్పాటు దీని ద్వారా పొందవచ్చు. ఈ ఆరు వారాల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్నకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ (స్టార్టప్ ఎకోసిస్టమ్) అమితాబ్ నాగ్పాల్ తెలిపారు. దీనికి ఎంపికైన స్టార్టప్లు నిధుల సమీకరణ, సాంకేతిక అంశాలపరమైన మద్దతు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీస లాభదాయకత ఉత్పత్తి కలిగి ఉండి, మూడు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ నిధులను సమీకరించిన స్టార్టప్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్లలో 10 శాతమే.. గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మహిళల మేనేజర్ల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ అది సుమారు 10% స్థాయిలోనే ఉన్నట్లు మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య గతేడాది 32గా ఉండగా ప్రస్తుతం 42కి పెరిగింది. అదే సమయంలో మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరింది. వీరిలో 42 మంది మహిళలు.. ఫండ్స్ను ప్రైమరీ లేదా సెకండరీ మేనేజర్లుగా నిర్వహిస్తున్నారు. 2017లో 18 మందికి పరిమితమైన ఫండ్ మేనేజర్ల సంఖ్య ఆ తర్వాత నుంచి క్రమంగా పెరిగినట్లు మార్నింగ్స్టార్ పేర్కొంది. ప్రస్తుతం 24 ఫండ్ సంస్థల్లో 42 మంది మహిళా మేనేజర్లు ఉన్నారు. మహిళా మాసంగా మార్చి .. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెలను మహిళా మాసంగా పాటిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్లను అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందుగా వచ్చిన వారికి) ప్రాతిపదికన 10,000 మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది. దీని కింద థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డీ, బీ12 తదితర టెస్టులను నిర్వహిస్తారు. అలాగే మహిళా మోటరిస్టులకు కాంప్లిమెంటరీగా రోడ్సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక మహిళా ఎంట్రప్రెన్యూర్íÙప్ను ప్రోత్సహించే దిశగా మహిళా ఏజెంట్లను రిక్రూట్ చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ ఈడీ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. మహిళల కోసం సిగ్నిటీ ప్రత్యేక కార్యక్రమాలు టెక్నాలజీ రంగంలో మహిళలకు తోడ్పాటునిచ్చే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ వెల్లడించింది. మార్చి 9న ’ఉమెన్ ఇన్ టెక్ రౌండ్టేబుల్’ వర్చువల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పలు మహిళా దిగ్గజాలు పాల్గొనే ఈ చర్చాగోష్టికి సంస్థ ఎస్వీపీ శిరీష పెయ్యేటి సారథ్యం వహిస్తారు. అలాగే, మహిళలు కొత్త విషయాలను నేర్చుకునేలా, అనుభవజ్ఞులు నుంచి సలహాలు పొందేలా వెసులుబాటు కల్పించే దిశగా ’హర్డిజిటల్స్టోరీ’ పేరిట ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నట్లు సిగ్నిటీ పేర్కొంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీతో కలిసి పనిచేస్తున్నట్లు, ’ప్రాజెక్ట్ సిగ్నిఫికెన్స్’ పేరిట 100 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించింది. -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘ఆఫ్బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్తో తనదైన ఒక టీమ్ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ‘విక్రమ్లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
AP: నీతి ఆయోగ్ మెచ్చిన ఆక్వా టెకీ
సాక్షి, విశాఖపట్నం: ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో సాంకేతికతని పరిచయం చేసి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఏకంగా 2,500 మంది రైతుల్ని నడిపిస్తున్నారు విశాఖకు చెందిన పవన్కృష్ణ కొసరాజు. అతడి కృషిని నీతి ఆయోగ్ గుర్తించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి దోహదపడుతున్న 75 స్టార్టప్లలో ఆక్వా ఎక్స్చేంజ్కు చోటు కల్పించింది. విశాఖలో చదువుకుని ఐఐటీ మద్రాస్లో బీటెక్ పట్టా, బెర్లిన్లో ఎంబీఏ, యూఎస్ఏలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ పట్టా పుచ్చుకున్న పవన్కృష్ణ జర్మనీ, భారతదేశాల్లోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఆ తరువాత ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసిన పవన్ వారికి సాంకేతికతను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో 2020లో స్టార్టప్ను ప్రారంభించారు. విశాఖలో రిజిస్టర్ చేసి విజయవాడలో కార్యాలయం ప్రారంభించారు. కోవిడ్ సమయం కావడంతో కాస్తా ఆలస్యంగానే అడుగులు పడ్డాయి. తన బంధువులైన ఒకరిద్దరు రైతులతో మొదలుపెట్టగా.. వారు సత్ఫలితాలు సాధించడంతో క్రమంగా రైతులు ఆక్వా ఎక్స్చేంజ్ వైపు ఆకర్షితులయ్యారు. టెక్ పరికరాలు.. లాభాల సిరులు ఆక్వా రైతులకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపైనే పవన్ దృష్టి సారించారు. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సరఫరా చేయడం.. మేతను సమపాళ్లలో అందించడం.. విద్యుత్ ఖర్చులు తగ్గించడం.. దిగుబడుల్ని మంచి లాభాలకు కొనుగోలు చేయించడం వంటి నాలుగు అంశాలపై ఆక్వా ఎక్స్చేంజ్ పనిచేస్తూ.. రైతుల మన్ననల్ని చూరగొంటోంది. నెక్ట్స్ ఆక్వా పేరుతో భిన్నమైన పరికరాలను ఆవిష్కరించారు. వాటికి పేటెంట్లు కూడా దక్కించుకున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో తయారు చేసిన యాప్ ద్వారా ఈ పరికరాల్ని ఆయా రైతులే స్వయంగా మోనిటరింగ్ చేసుకునేలా వ్యవస్థను రూపొందించారు. అద్భుతమైన ఈ టెక్ పరికరాల్ని నెల్లూరు జిల్లా గూడూరు నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ 2500 మంది రైతులు 30 వేల ఎకరాల్లో వినియోగిస్తున్నారు. మేతకు ఢోకా లేదు... రొయ్యలకు మేత వేసేందుకు చెరువులోకి పడవలో వెళ్లి.. ఒక వైరుని చేత్తో పట్టుకొని మరో చేత్తో మేతని విసురుతారు. అన్నిచోట్లా మేత ఒకేలా అందకపోవడంతో రొయ్యలు, చేపలు సమస్థాయిలో ఎదగవు. ఫలితంగా దిగుబడిలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అధిగమించేందుకు పవన్ సంస్థ ఆక్వాబాట్ అనే పరికరాన్ని తయారు చేసింది. దీనిని రైతు ఏ ప్రాంతం నుంచైనా స్టార్ట్చేసి మేతని అందించవచ్చు. ఈ మెషిన్ చెరువులోని ప్రతి ప్రాంతానికి ఆటోమేటిక్గా తిరుగుతూ సమపాళ్లలో మేతని అందిస్తుంటుంది. దీన్ని 6 నెలలకు రైతులకు రూ.20 వేల అద్దెకు అందిస్తున్నారు. సాధారణంగా ఒక చెరువుకు ఒకర్ని నియమించుకుంటే.. ఒక పంటకాలానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. పవన్ సంస్థ తయారు చేసిన పరికరాల్ని వినియోగించి దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ రైతులు ఖర్చుల్ని ఆదా చేసుకుంటున్నారు. ఆక్వాఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వాలంటే నెలకు రూ.150 ఖర్చవుతుంది. వీటిని వినియోగిస్తుండటం వల్ల ప్రతి రైతు విద్యుత్ వినియోగంలో రూ.500 నుంచి రూ.600 వరకూ ఆదా చేస్తున్నారు. విజయవాడ శివారు గన్నవరంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయంలో ప్రస్తుతం 160 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 50 మంది మహిళలుండటం విశేషం. కరెంట్ పోయినా.. చింత లేదు ఈ సంస్థ రూపొందించిన పవర్ మోన్ అనే పరికరాన్ని చెరువు వద్ద ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ సరఫరాను ఆ పరికరమే మోనిటరింగ్ చేసుకుంటుంది. కరెంటు పోయినప్పుడు ఏరియేటర్లు ఆగిపోకుండా ఆ పరికరమే జనరేటర్ను ఆన్ చేస్తుంది. ఆక్వాఎక్స్చేంజ్ తయారు చేసిన ఏపీఎఫ్సీని పెట్టుకుంటే.. ఆక్వా చెరువుకు ఎంత లోడ్ అవసరమో అంతే విద్యుత్వినియోగించేలా చేస్తుంది. తది్వరా విద్యుత్ బిల్లు చాలా వరకూ ఆదా అవుతుంది. 25 వేల మంది రైతులకు చేరువ చేసే దిశగా.. ఆక్వా రైతులకు ఖర్చులు తగ్గించి వారికి భరోసా అందించే దిశగా ప్రారంభించిన స్టార్టప్ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక డేటా ఆధారంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. కేవలం టెక్ పరికరాలు అందించడమే కాదు.. నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు మంచి ధర వచ్చేలా ఎగుమతిదారులకు అనుసంధానం చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాం. మొత్తంగా 25 వేల మంది రైతులకు లక్ష ఎకరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. తాజాగా ఒడిశాకు కూడా ఆక్వా ఎక్స్చేంజ్ సేవలను విస్తరించాం. – పవన్కృష్ణ కొసరాజు, సీఈవో, ఆక్వా ఎక్స్చేంజ్ -
పశుసంవర్థక అభివృద్ధికి మరింత కృషి
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక రంగం మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే ఈ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి కేంద్రం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, స్టార్టప్ ఇండియా, సీఐఐ సహకారంతో కేంద్ర పశుసంవర్థ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సులో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ధితో రైతులు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి వీలవుతుందన్నారు. పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రులు బాల్యన్, మురుగన్ మాట్లాడుతూ శాస్త్రీయ చర్యలతో పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసురావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని వివరించారు. గణనీయంగా పెరిగిన గొర్రెల సంపద రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రంగానికి అనేక విధాలుగా చేయూతనిస్తున్నామని అన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడంతో రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రామాల్లో అత్యధికులు పాడి పరిశ్రమ, జీవాల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు వర్ష జోషి, రాజేష్ కుమార్ సింగ్, లచ్చిరాం భూక్యా, పెద్ద ఎత్తున పాడి రైతులు పాల్గొన్నారు. -
దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేశాయి. దేశీయ అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు, బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. నెక్ట్స్జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
షార్క్ టైగర్స్
‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్ అండ్ వైట్ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్ అవకాశం లేని స్టార్టప్ కలల యువతరానికి ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్కు చెందిన 20 సంవత్సరాల దావల్ తన సోదరుడు జయేష్తో కలిసి స్టార్టప్ కలను సాకారం చేసుకోబోతున్నాడు... దావల్కు కాలేజీ టీ స్టాల్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్లో పనిచేసే అబ్బాయి ఒక టబ్లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!! కాలేజీ టీ స్టాల్లోనే కాదు బయట రోడ్డు సైడ్ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్. యూట్యూబ్లో మెషిన్ డిజైనింగ్ సబ్జెక్ట్పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్వేర్ షాప్కు వెళ్లి స్క్రాప్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్. స్క్రాప్ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్వేర్ షాప్ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యి ఆటోమెటిక్ టీ–గ్లాస్ వాషింగ్ మెషిన్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్లోని వాటర్ జెట్తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్ కూడా తయారు చేశాడు దావల్. దీని గురించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్లను కలిసి ఈ మెషిన్ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు. దావల్ సోదరుడు జయేష్కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్ట్యాంక్ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్లు చెప్పిన స్టార్టప్ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్(బిగ్–షాట్ ఇన్వెస్టర్స్) డీల్ ఆఫర్ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు. ఆ మాటే విజయమంత్రం ‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్ -
విద్యార్థుల కోసం.. ఇది సరికొత్త ఎడ్యుకేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రోజుల్లో విద్యాసంస్థలు సంఖ్య రోజు రోజూకీ పెరుగుతున్నాయి. అలాగే వాటిలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే కళాశాలల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు ఉద్యోగులకు మారేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనికి ప్రస్తుతం విద్యా విధానంలో రెగులర్ పాఠ్యాంశాలతో పాటు పాక్ట్రికల్తో కూడిన విద్యను పక్కన పెట్టడమే కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని స్టార్ట్ప్లు ముందుకు వస్తున్నాయి. ప్రాక్టికల్ ఒక డిజైన్ ఎలా చేయాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఎలా జతచేయాలి , వాటిని ప్రోగ్రాం ద్వారా ఎలా కంట్రోల్ చేయాలి, కనీసం ఒక ఇంకుబేషన్ సెంటర్.. ఇవన్నీ ప్రస్తుతం కాలేజీ స్థాయిలో కూడా మనకు ఎక్కడా కనిపించడం లేదు. వీటిని విద్యార్థులకు అందించేందుకు ముందుకు వచ్చింది మణికొండలోని కిటోలిట్(KITOLIT)కంపెనీ. దీనిపై సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు లేటెస్ట్ టెక్నాలజీతో ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు స్కూల్స్తో టెక్నికల పార్టనర్స్గా వ్యవహరిస్తున్నాం. వీటితో పాటు ఇతర దేశాలలో ఉన్న మా క్లయింట్స్తో కూడా ఆన్లైన్ సెషన్స్ జరిపిస్తుంటాం. తక్కువ ధరకే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రోబోను తయారు చేయడమే మా విజన్గా పెట్టుకున్నాం. అందులో ఏఐ టెక్నాలజీ, మిషిన్ లెర్నింగ్ ఉపయోగిస్తున్నాం. వీటితో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ కారును కూడా డిజైన్ చేస్తున్నామని’ పేర్కొన్నారు. ఇక్కడ తాము టెక్నాలజీతో కూడిన విద్యను ప్రాక్టికల్గా అందిస్తున్నామన్నారు. -
28న హైదరాబాద్లో స్టార్టప్ 20–గ్రూప్ సమావేశం
న్యూఢిల్లీ: జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో జనవరి 28న హైదరాబాద్లో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆరంభ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో ఎంట్రప్రెన్యూర్షిప్, నవకల్పనలకు సంబంధించి విధానపరంగా తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో జీ20 దేశాలకు చెందిన ప్రతినిధులు, అబ్జర్వర్ దేశాల నుంచి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుళపక్ష సంస్థలు .. దేశీ స్టార్టప్ వ్యవస్థ ప్రతినిధులు పలు వురు పాల్గొంటారని వివరించింది. స్టార్టప్20 సదస్సు కార్యక్రమం జూలై 3న జరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ అయిన భార త్ .. వినూత్న అంకుర సంస్థలకు తోడ్పాటునివ్వడంలో సారథ్యం వహించగలదని స్టార్టప్20 ఇండియా చైర్ చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. -
వ్యాపారం ప్రారంభించడానికి షార్ట్కట్లు ఉండవు
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
స్టార్టప్లకు తగ్గిన నిధులు
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు గతేడాది తగ్గాయి. అంతక్రితం ఏడాదితో (2021) పోలిస్తే 2022లో 33 శాతం క్షీణించి 24 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, 2019, 2020తో పోలిస్తే మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. పీడబ్ల్యూసీ ఇండియా బుధవారం విడుదల చేసిన ’స్టార్టప్ ట్రాకర్ – సీవై 22’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్టార్టప్స్లోకి 2019లో 13.2 బిలియన్ డాలర్లు, 2020లో 10.9 బిలియన్ డాలర్లు, 2021లో 35.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయంగా మందగమనం ఉన్నా భారత స్టార్టప్ వ్యవస్థపై గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్), ప్రారంభ దశ ఫండింగ్ వంటి విభాగాల్లోకి పెట్టుబడులు ఆశావహంగా కనిపిస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా తెలిపారు. వచ్చే 2–3 త్రైమాసికాల్లో పెట్టుబడుల పరిస్థితి తిరిగి సాధారణ స్థాయికి రావచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అత్యవసరం కాని ఖర్చులు, పెట్టుబడులను వాయిదా వేసుకోవడం ద్వారా తమ నిర్వహణ విధానాలను కట్టుదిట్టం చేసుకునేందుకు, మరికొన్నాళ్ల పాటు నగదు చేతిలో అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు స్టార్టప్లు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ దశ డీల్స్ అత్యధికం.. ఒప్పందాల పరిమాణంపరంగా చూస్తే 2021, 2022లో ప్రారంభ దశ పెట్టుబడులకు సంబంధించిన డీల్స్ అత్యధికంగా (60–62 శాతం) ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో డీల్ కింద సగటున 4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించింది. గతేడాది విలువపరంగా చూస్తే వచ్చిన మొత్తం నిధుల్లో ప్రారంభ దశ పెట్టుబడుల పరిమాణం 12 శాతంగా (2021లో దాదాపు 7 శాతం) ఉంది. ఇక 2022లో వృద్ధి, తదుపరి దశ పెట్టుబడుల పరిమాణం 88 శాతంగా ఉంది. 38 శాతం డీల్స్ ఈ కోవకి చెందినవి ఉన్నాయి. ఇక నివేదిక ప్రకారం గ్రోత్ స్టేజ్ డీల్స్ సగటు పెట్టుబడి పరిమాణం 43 మిలియన్ డాలర్లుగా ఉండగా, తదుపరి దశ ఒప్పందాలకు సంబంధించి 94 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ స్టార్టప్స్లో అత్యధిక శాతం (82 శాతం) అంకుర సంస్థలు బెంగళూరు, ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబైలో ఉన్నాయి. ఈ టాప్ 3 నగరాల్లోని 28 శాతం స్టార్టప్లు 20 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు సమీకరించాయి. బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవి) నమోదయ్యాయి. ఎన్సీఆర్, ముంబై నగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
వారిద్దరి ఆలోచనలే ఆలంబనగా.. అన్నదాతకు తోడుగా...
‘ప్రయోగాలు మనకు పట్టెడన్నం పెట్టే రైతుకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి?’ అనేదాని గురించి ఆలోచించారు సాయి గోలె, సిద్ధార్థ్ దైలని. సాంకేతిక జ్ఞానానికి, వ్యవసాయానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ఎప్పటికప్పుడు రైతులకు నిర్మాణాత్మక సలహాలు అందించడానికి ‘భారత్ అగ్రి’ స్టార్టప్ మొదలు పెట్టి విజయకేతనం ఎగురవేశారు... సాయి గోలె, సిద్ధార్థ్ దైలని ఐఐటీ–మద్రాస్ విద్యార్థులు. ఇన్స్టిట్యూట్లోని ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ల్యాబ్’లో విద్యార్థులు రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు చేస్తుంటారు. అయితే సాయి, సిద్ధార్థ్లకు వీటి మీద వ్యతిరేకత లేకపోయినా ‘బహుమతులు గెలుచుకునే, పేరు తెచ్చుకునే ప్రయోగాల కంటే ప్రజలకు ఉపయోగపడే ప్రయోగాలు కావాలి’ అనేది వారి బలమైన అభిప్రాయం. అలా ఇద్దరి ఆలోచనలో నుంచి వచ్చిందే భారత్ అగ్రీ. సాంకేతిక జ్ఞానం, వ్యవసాయానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయడానికి ప్రారంభమైన ఈ స్టార్టప్ తన లక్ష్యసాధనలో ముందుకు దూసుకువెళతోంది. అంతర్జాతీయస్థాయి స్టార్టప్ పోటీలలో గెలిచింది. ‘భారత్ అగ్రీ’ అయిదు భాషల్లో మొబైల్ అప్లికేషన్లను లాంచ్ చేసింది. దీనికి రైతుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది స్టెప్–బై–స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఎప్పటికప్పుడు భూమి, నీరు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నిర్మాణాత్మకమైన సలహాలను రైతులకు ఇస్తుంది. దీని ద్వారా పంట ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం పెరిగింది. స్టార్టప్కు ముందుగా తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పుణెకు సమీపంలోని ఒక గ్రామంలో సంవత్సర కాలం ఉండి వ్యవసాయరంగ పరిస్థితులను అధ్యయనం చేశారు. ఎంతోమంది రైతులతో మాట్లాడారు. సాయి గోలె కుటుంబానికి వ్యవసాయంలో మూడు దశాబ్దల అనుభం ఉంది. గోలెకు వ్యవసాయరంగం గురించి మంచి అవగాహన ఉన్నప్పటికీ, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ క్షేత్రస్థాయి అధ్యయనం వారికి తోడ్పడింది. ‘మన దేశంలో నిర్లక్ష్యానికి గురవుతున్న రంగం వ్యవసాయం. మనం రైతుల గురించి చేయాల్సింది ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అగ్రి ప్రాధాన్యత సంతరించుకుంది. రైతులకు ఉపయోగపడే శాస్త్రీయ సలహాలు అందించడం ఒక ఎత్తయితే, వారి విశ్వాసాన్ని చూరగొనడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో భారత్ అగ్రి విజయం సాధించింది’ అంటున్నాడు ‘భారత్ అగ్రి’ ఇన్వెస్టర్లలో ఒకరైన ఆనంద్ లూనియా. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) -
మహిళా స్టార్టప్లపై గూగుల్ ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల సారథ్యంలో నడిచే స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడంపై టెక్ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెట్టనుంది. 75 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే, 100 పైచిలుకు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్ను సపోర్ట్ చేసే వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. భారత పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. భారతీయ స్టార్టప్స్లో 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు, ఇందులో నాలుగో వంతు భాగం (సుమారు 75 మిలియన్ డాలర్లు) మహిళల సారథ్యంలోని ప్రారంభ దశ అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. భారీ స్థాయిలో విస్తరించిన టెక్నాలజీ .. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను స్పృశిస్తున్న నేపథ్యంలో నియంత్రణలనేవి బాధ్యతాయుతమైనవిగా, సమతూకం పాటించేవిగా ఉండాలని పిచాయ్ పేర్కొన్నారు. ఎగుమతుల విషయంలో భారత్ అతి పెద్ద దేశంగా ఎదగగలదని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2020లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు)తో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లతో జియోలో 7.73 శాతం, భారతి ఎయిర్టెల్లో 700 మిలియన్ డాలర్లతో 1.2 శాతం వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ .. పర్యటన సందర్భంగా పిచాయ్ కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ‘మీ సారథ్యంలో భారత్ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం స్ఫూర్తిదాయకమైన విషయం‘ అని మోదీతో భేటీ అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. సమావేశంలో ఏయే అంశాలు చర్చించారనేది వెల్లడించలేదు. అయితే, ‘గూగుల్ చిన్న వ్యాపారాలు .. స్టార్టప్లకు మద్దతుగా నిలవడం, సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం, విద్య..నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడం, వ్యవసాయం.. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేథను వినియోగిస్తుండటం వంటి అంశాల‘ పై ప్రధానితో చర్చించనున్నట్లు పిచాయ్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. అలాగే, స్పీచ్ టెక్నాలజీ, వాయిస్, వీడియో సెర్చ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు ప్రాజెక్టులను బ్లాగ్లో ప్రస్తావించారు. తాను భారత్లో పర్యటించిన ప్రతిసారి భారత స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుండటాన్ని గమనిస్తున్నానని ఆయన తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా తమ అనువాదం, సెర్చ్ టెక్నాలజీ సేవలను మెరుగుపర్చుకునేందుకు దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్తో జట్టు కట్టినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఐఐటీ మద్రాస్లో ఏఐ సెంటర్ ఏర్పాటు కోసం 1 మిలియన్ డాలర్ల గ్రాంటును అందించనున్నట్లుపేర్కొంది.వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాత టెక్నాలజీలపై పని చేసేందుకు గూగుల్డాట్ఆర్గ్ ద్వారా వాధ్వానీ ఏఐకి 1 మిలియన్ గ్రాంటు అందిస్తున్నట్లు గూగుల్ వివరించింది. ‘మీతో నవకల్పనలు, టెక్నాలజీ వంటి ఎన్నో విషయాలను చర్చించడం సంతోషం కలిగించింది. మానవజాతి పురోగతికి, సుస్థిర అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించడంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’. – ప్రధాని మోదీ ట్వీట్ చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్లు ఇంజిన్గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్లకు సహకారం అందించడం, స్టార్టప్లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్ల కోసం హ్యాండ్ బుక్ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
స్టార్టప్స్కు శామ్సంగ్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ డిజిటల్ భారత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న స్టార్టప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ తెలిపింది. యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ వంటి సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు స్టార్టప్స్ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వాలెట్, హెల్త్, ఫిట్నెస్ వంటి డొమైన్లలో భారత్లోని శామ్సంగ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వ్యాపార విభాగాలతో స్టార్టప్లు భాగస్వాములవుతాయి. ఉత్పత్తులు, సేవలు శామ్సంగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అవసరమైతే నిధులను సైతం సమకూరుస్తారు. -
స్టార్టప్స్కు ద్వారక కో-వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్.. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్లో ద్వారక ప్రైడ్ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డి వివరించారు. అనువైన విధానం..: ఆఫీస్ స్పేస్ పరిశ్రమలో ప్లగ్ అండ్ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్ స్పేస్ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు. -
విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ
బెంగళూరు: పారిశ్రామిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఉత్పాదనల స్టార్టప్ సంస్థ లైన్క్రాఫ్ట్డాట్ఏఐ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగ సంస్థ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ వెల్లడించింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడించలేదు. తమ డిజిటల్ సర్వీసులను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సీఈవో ప్రతీక్ కుమార్ తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆటోమేషన్లో అపార అనుభవం గల లైన్క్రాఫ్ట్.. తయారీ సంస్థలు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కావల్సిన తోడ్పాటును అందిస్తుంది. -
యూనికార్న్ జెట్వెర్క్ చేతికి అమెరికా కంపెనీ
న్యూఢిల్లీ: యూనికార్న్ (స్టార్టప్) కంపెనీ జెట్వెర్క్ మ్యానుఫాక్చరింగ్.. అమెరికాకు చెందిన యూనిమాక్ట్స్ ను 39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.320 కోట్లు) పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని తెలిపింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! జెట్వెర్క్ కంపెనీ గత ఆరు నెలల్లో నాలుగో కంపెనీని కొనుగోలు చేస్తుండడం గమనించాలి. తాజా డీల్ మాత్రం తొలి విదేశీ కొనుగోలు అవుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేకు సంబంధించి సరఫరా వ్యవస్థలో భాగమైన కంపెనీలను జెట్వెర్క్ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ విధానంలో తయారు చేసి అందించడం జెట్వెర్క్ చేసే పని. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
ఓఎన్డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
‘కేక’ 57 మిలియన్ డాలర్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..మాట మార్చిన సీఈఓ!
కరోనా మహ్మమారి రాకతో చాలా రంగాలు డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తగ్గుమఖం పట్టాక పరిస్థితులు తిరిగి యధావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని పరిణామాల దృష్ట్యా పలు రంగాల పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఐటీ రంగంలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ప్రముఖ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎడ్యుటెక్ సేవల సంస్థ అనకాడమి మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇదివరకే 600 మంది సిబ్బందికి ఉద్వాసన పలకగా.. తాజాగా మరో 350 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ఖర్చులను తగ్గించి లాభాలను ఆర్జించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఇది మూడవ రౌండ్లో జరుగుతున్న తొలగింపులు. దీనికి సంబంధించి కంపెనీ సీఈవో గౌరవ్ ముంజల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో.. కంపెనీ ఖర్చులను తగ్గించే క్రమంలో (కాస్ట్ కటింట్) క్రమంలో మా అత్యంత ప్రతిభావంతులైన కొంతమంది అనాకాడెమీ ఉద్యోగులకు వీడ్కోలు చెప్పాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ప్రస్తుతం తొలగింపుకు సంబంధించి ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను. గతంలో లేఆఫ్స్ చేపట్టకూడదని తాము నిర్ణయించాం. అయితే మార్కెట్ సవాళ్లు వల్ల మా నిర్ణయాలను పునఃపరిశీలించవలసి వచ్చింది. పైగా ఇటీవల పెద్ద మొత్తంలో సంస్థ కోర్ వ్యాపారాలన్ని కూడా ఆఫ్లైన్కి మారిపోయాయని ముంజల్ తెలిపారు. జూలైలో గౌరవ్ ముంజాల్ అన్అకాడమీలో లేఆఫ్స్ ఉండవని ఉద్యోగులకు తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాట తప్పడంతో క్షమాపణలు కూడా చెప్పారు. చదవండి: ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
‘వైజాగ్ బిట్స్’ విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.. ‘కాంకర్డ్’కు అంకురార్పణ
సాక్షి, విశాఖపట్నం: స్థానిక బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు “కాంకర్డ్” పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ డా.గోవింద రాజు వెల్లడించారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా చెగ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ప్రకృతి శ్రీవాస్తవ గౌరవ అతిధిగా క్యాథెరిన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ హాజరయ్యారని తెలిపారు. చదవండి: వావ్..వాట్సాప్లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా? కాంకర్డ్ అంకుర సంస్థను బిట్స్ వైజాగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు పి. జాషువ రాజు ఆధ్వర్యంలో, ఐదుగురు విద్యార్థుల బృందం ఈ స్టార్టప్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, యుఐ/యుఎక్స్ డిజైనింగ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలెప్మెంట్, డిజైన్ స్పాటిలైట్ వెర్టికల్స్ లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారని సంస్థ వ్యవస్థాపకులు జోషువా రాజు వివరించారు. సహ వ్యవస్థాపకులు సందీప్, మేఘశ్యామ్ ఫుల్ స్ట్యాక్ డెవలప్మెంట్ లో అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తారని, విద్యార్థి రాహుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, మహేష్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని చెప్పారు. మూడవ సంవత్సరం చదువుతున్న శ్రావ్య కంటెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా పని చేస్తారన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సంస్థను ప్రారంభించడం అభినందనీయమని, వారికి తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగాప్రకృతి శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. తమ విద్యార్థులు అంకుర సంస్థను విద్యార్థులు స్థాపించడం చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంస్థల్ని మరిన్ని తీసుకురావాలని ప్రిన్సిపాల్ అభిలషించారు. కళాశాల కరెస్పాండెంట్ డా. కొండ్రు శ్రీలక్ష్మి బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని సంస్థలు అన్ని విభాగాల్లోనూ స్టార్టప్తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిట్స్ వైజాగ్ అకడమిక్ ముఖ్య సలహాదారు డా. సీవీ గోపినాథ్, డీన్ డా.విక్టర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపే సిక్స్ సెన్స్!
అంతా అయిపోయాక ‘అయ్యో!’ అనుకుంటాయి కొన్ని సంస్థలు. ‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపుతుంది సిక్స్ సెన్స్. ఇది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్ఫామ్. ఇద్దరు స్నేహితులు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్లు ప్రారంభించిన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. సాంకేతిక లోపాలను, కారణాలను ముందుగానే తెలియజేయడం ద్వారా ఈ టెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. తమ ప్రాజెక్ట్పై నమ్మకం కలిగించేలా, పెట్టుబడి పెట్టేలా చేయడం స్టార్టప్ ఫౌండర్లకు సవాలు. ఇక పురుషాధిక్య రంగాలుగా ముద్రపడిన వాటిలో మహిళా స్టార్టప్ ఫౌండర్లకు ఇది మరింత పెద్ద సవాలు. కానీ ఈ అతిపెద్ద సవాలును ఎలాంటి అవరోధాలు లేకుండానే అధిగమించారు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్. సింగపూర్ కేంద్రంగా వీరు శ్రీకారం చుట్టిన స్టార్టప్ ‘సిక్స్సెన్స్’ (ఎస్ఎస్)కు లీడింగ్ వెంచర్ క్యాపిటల్స్ నుంచి నైతిక,ఆర్థిక మద్దతు లభించింది. ఇద్దరు ఉద్యోగులతో మొదలైన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతుంది. ‘సిక్స్సెన్స్’ అనేది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్ఫామ్. సాంకేతికలోపాలను గుర్తించడంలో ఉపయోగపడే క్లాసిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇది. ఏ.ఐ సాంకేతికతను ఉపయోగించి ‘ఎస్ ఎస్’ టెక్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాడక్ట్స్ను స్కాన్ చేస్తోంది. ఎక్కువ నష్టం జరగక ముందే మాన్యుఫాక్చరింగ్ ఎక్విప్మెంట్లో లోపాలను గుర్తిస్తోంది. ఆపరేషనల్ మిస్టేక్స్లో అధిక ఆర్థిక నష్టం జరగకుండా చూస్తోంది. లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఇంజనీర్లకు ఈ ప్లాట్ఫామ్ వివరిస్తుంది. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీటివో అవ్నీ అగర్వాల్ అలహాబాద్లోని ‘మోతిలాల్ నెహ్రు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. డాటా సైన్స్లో మంచి పట్టు ఉంది. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ సంస్థలో పనిచేసి ‘బ్రిలియెంట్’ అనిపించుకుంది అగర్వాల్. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా లాంచింగ్ ప్రాడక్ట్స్ నుంచి మెనేజింగ్ కంపెనీ కల్చర్ వరకు ఎన్నో విషయాలను ప్రాక్టికల్గా తెలుసుకుంది. ఆ సమయంలో తాను ప్రధానంగా గమనించిన విషయం ఏమిటంటే, టెక్నాలజీ పరంగా సంస్థలు ఏ మేరకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయని. డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన అనివార్యత ఉన్నప్పటికీ ఎన్నో పరిశ్రమలు దానికి దూరంగా ఉండడాన్ని అగర్వాల్ గమనించింది. పరిశ్రమలకు ఆధునిక సాంకేతికతను పరిచయం చేసే బాధ్యతను తానే తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. దీనికి ఎంతో అధ్యయనం అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. తాను అందుకు రెడీ అయింది. అయితే ఏ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే విషయంలో అగర్వాల్లో స్పష్టత లోపించింది. దీంతో తన స్నేహితురాలు ఆకాంక్షను కలుసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ...ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్న తరువాత తమ ప్రధాన టార్గెట్ ‘మాన్యుఫాక్చర్ ఇండస్ట్రీ’ అని తేల్చుకున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు మాన్యుఫాక్చరింగ్ రంగం అన్ని రకాలుగా అనుకూలమైనది అనే అంచనాకు వచ్చారు. అది పరీక్ష సమయం. మానసికంగా ఎంత బలంగా ఉన్నాసరే, ఏమవుతుందో ఏమో! అనే సందేహం చెవిలో జోరీగలా డిస్టర్బ్ చేస్తున్న సమయం. ఆ జోరీగను దగ్గర రాకుండా చేసి ‘ఎస్. మేము తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకున్నారు ఇద్దరు మిత్రులు. ఒక ఫైన్మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంటర్ప్రెన్యుర్ ఫస్ట్ టాలెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్లో పాల్గొనడానికి సింగపూర్ విమానం ఎక్కింది అవ్నీ అగర్వాల్. అలా సింగపూర్ కేంద్రంగా ‘సిక్స్ సెన్స్’ స్టార్టప్ పట్టాలకెక్కింది. సింగపూర్ను కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అక్కడ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడమే. ‘మ్యాథ్స్ ప్రాబ్లం నుంచి టెక్నికల్ ప్రాబ్లం వరకు రకరకాల సమస్యలను పరిష్కరించం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అందులో చెప్పలేనంత సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషమే నన్ను ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యేలా చేసింది’ అంటుంది అవ్నీ అగర్వాల్. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీయివో ఆకాంక్ష జగ్వానీ(ముంబై) మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంది. ఆమెకి ప్రముఖ సంస్థలో పనిచేయడం కంటే ఒక సంస్థను ప్రారంభించి దాన్ని ప్రముఖ సంస్థల జాబితాలో కనిపించేలా చేయాలనేది కాలేజీ రోజుల నాటి కల. ‘ఎస్ ఎస్’ ద్వారా తన కోరిక నెరవేరింది. విజయపథంలో దూసుకుపోతున్న ‘సిక్స్ సెన్స్’ తాజాగా వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టిన్మెన్’ నిధులతో మరింత విస్తరించే పనిలో ఉంది. ఆల్ ది బెస్ట్. -
Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు
ఈ అబ్బాయికి తన వయసు వారిలాగే సినిమాలు అంటే ఇష్టం. సినిమా పాటలు అంటే ఇష్టం. ఆ పాటలకు తీన్మార్ డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. అయితే వీటితో పాటు తనకు టెక్నాలజీ అంటే కూడా ఇష్టం. ఆ ఇష్టమే ఇతడిని 14 సంవత్సరాల వయసులో కంటెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం అయింది. 21 సంవత్సరాల వయసులో సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి, మరో కంపెనీలో భాగస్వామి కావడానికి కారణం అయింది... టిక్టాక్తో ఊపందుకున్న షార్ట్ ఫామ్ కంటెంట్ ఆ తరువాత యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్... మొదలైన మాధ్యమాల ద్వారా మరింత విస్తరించింది. షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ప్రేక్షకులకు అందే వినోదం అనేది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల రకరకాల జానర్లలో ఎంతోమంది యువప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ స్ట్రీమర్స్ పెరిగారు.వీరిని రకరకాల బ్రాండ్స్ తమ మార్కెటింగ్కు ఉపయోగించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్తో పోల్చితే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.ఇన్ఫ్లుయెన్సర్లు, బ్రాండ్లకు మధ్య వారధిగా ముంబైలో ఏర్పడిన ‘నోఫిల్టర్’ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ముంబైకి చెందిన రుత్విక్ లోఖండె ఒకరు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. క్రిప్టో కరెన్సీ నేపథ్యంలో అందరిలాగే బ్లాక్చెయిన్ అనే మాటను చాలాసార్లు విన్నాడు రుత్విక్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) భద్రతకు ఉపకరించే, డేటాను జాగ్రత్తగా కాపాడే, పారదర్శకతకు వీలయ్యే బ్లాక్చెయిన్ టెక్నాలజీ రుత్విక్ను బాగా ఆకర్షించింది. ‘ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని ఆలోచించాడు. ‘ఇలా ఉపయోగించుకోవచ్చు’ అనే ఐడియా తట్టడంతో బ్లాక్చెయిన్ సాంకేతికత ఆధారంగా ‘బిలీవర్స్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి సూపర్హిట్ చేశాడు. ఈ ప్లాట్ఫామ్ కళాకారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు... రైటర్ లేదా డైరెక్టర్ కావాలనుకుంటున్నవారు తమ స్క్రిప్ట్ను షేర్ చేస్తే, అది ఆడియెన్స్(బిలీవర్స్)కు నచ్చితే నిధుల సమీకరణకు వీలవుతుంది. ‘షార్ట్ కంటెంట్ అనేది హోటల్స్ నుంచి టూర్గైడ్ల వరకు ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటున్న రుత్విక్ ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సంస్థ ‘కొలబ్ట్రైబ్’ భాగస్వామి. ‘ప్రస్తుతం మన దేశంలో స్ట్రీట్కల్చర్ పెరిగింది. హిప్ హాప్ టాలెంట్ ముందుకు వస్తుంది. మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి ఎంతో టైమ్ పట్టడం లేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దగ్గర వీరి ప్రతిభకు సరిౖయెన ప్రతిఫలం లభించడం లేదు. 2025 నాటికి కంటెంట్ క్రియేషన్కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచుల ప్రకారం ఇన్ఫ్లూయెన్సర్ కావచ్చు, అయితే ప్రతిభ మాత్రమే సరిపోదు. తమ కంటెంట్ను ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్కిల్స్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి’ అంటున్నాడు రుత్విక్. కంటెంట్ క్రియేషన్లో వ్యక్తులు, సంస్థలకు సహాయపడడానికి ఏంజెల్ ఫండ్ ‘మూన్ క్యాపిటల్’ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడు రుత్విక్. ‘ప్రతిభకు ఎలాంటి హద్దులు, అవరోధాలు లేవు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది’ అంటున్నాడు యంగ్స్టార్ రిత్విక్. తన సక్సెస్ స్టోరీ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది కదా! -
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
స్టార్టప్లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్లకు నిధుల సాయం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 20 స్టార్టప్లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు. అన్ని విభాగాల్లోనూ క్షీణత.. ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది. ఒక్కో డీల్ 4-5 డాలర్లు.. సెప్టెంబర్ క్వార్టర్లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్లలో ఎక్కువ ఎం అండ్ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. -
భారీగా ఉద్యోగాల కోత.. 2500 మందిని ఇంటికి పంపుతున్న స్టార్టప్ కంపెనీ!
ఇటీవల టెక్ కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రముఖ సంస్థల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం భారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ దిగ్గజం బైజూస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కొత విధించేందుకు సిద్ధమైంది. ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ సంస్థలోనూ కోతల పరంపర కొనసాగతోంది. ఇటీవల ఆలస్యంగా జరిపిన ఆడిట్ తర్వాత ఖర్చను తగ్గించుకోవాలని బైజూస్ భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో దాదాపు 5% ఉద్యోగులను తీసివేయాలిని నిర్ణయించుకుంది. ప్రాడెక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ సాంకేతికత వంటి విభాగాలలో దశలవారీగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. దేశంలోని విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభం కావడంతో, ఆన్లైన్ బోధన జరిపే ఎడ్టెక్ సంస్థలకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికీ వరకు బైజూస్ ఈ స్థాయిలో తొలగింపులలో జరగలేదు. మీషో, కార్స్ 24, అనాకాడెమీతో సహా ఇతర స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా మందగమనం, ఇన్వెస్టర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య కేపిటల్ ధనాన్ని ఆదా చేయడంతో పాటు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ వర్క్ఫోర్స్ను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా! -
స్టార్టప్లో ధోనీ పెట్టుబడి
బెంగళూరు: రెడీ టు కుక్ రంగంలో ఉన్న శాఖా హ్యారీ స్టార్టప్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వాటా కొనుగోలు చేశారు. ఇప్పటికే కంపెనీ బెటర్ బైట్ వెంచర్, బ్లూ హారిజోన్, పాంథెరా పీక్ వెంచర్స్ నుంచి రూ.16 కోట్ల సీడ్ ఫండ్ అందుకుంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో నెలకు 30,000 పైచిలుకు వినియోగదార్లకు శాఖా హ్యారీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
Aspire For Her: ఉద్యోగం చేసి చూడు
‘ఇల్లు కట్టి చూడు’ అన్నారుగానీ ‘ఉద్యోగం చేసి చూడు’ అనలేదు. అనకపోతేనేం... ఉద్యోగం చేయడం ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు. మనలోని శక్తులను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడం. ఈ ఎరుకతోనే ‘ఎస్పైర్ ఫర్ హర్’ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది మథురదాస్ గుప్త. తాజాగా... టెక్ దిగ్గజం గూగుల్ వారి ‘గూగుల్ ఫర్ స్టార్టప్’ కార్యక్రమానికి ఎంపికైన స్టార్టప్ ఫౌండర్లలో దాస్ ఒకరు... రకరకాల కారణాల వల్ల మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కొందరు ‘ఉద్యోగం మా పని కాదు’ అనుకుంటున్నారు. కొందరికి ఉద్యోగం చేయాలని ఉంటుంది. కాని దారి ఏమిటో తెలియదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ‘మహిళల ఆర్థిక స్వాతంత్య్రం’ లక్ష్యంగా ‘ఎస్పైర్ ఫర్ హర్’ (ఎఎఫ్హెచ్) స్టార్టప్కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మ«థురదాస్ గుప్త. ఇరవై అయిదు సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పని చేసిన దాస్, అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా ఇంటిపట్టునే ఉంటున్న ఎంతోమంది మహిళలను చూసింది. ‘మీరు ఎందుకు ఉద్యోగం చేయకూడదు?’ అని అడిగితే ‘పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ ‘ఇంటిపనులు ఎవరు చేస్తారు?’ ‘మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా. మళ్లీ నేను ఎందుకు?’... ఇలా రకరకాల మాటలు వినిపించేవి. మరోవైపు ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు మధ్య ఉన్న భారీ అంతరం బాధ పెట్టేది. ‘భద్రమైన ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు... అని హెచ్చరించారు చాలామంది. ‘‘అయితే నేను డబ్బుల కోసం కాదు ఒక మంచిపని కోసం ఈ స్టార్టప్ మొదలుపెట్టాను. మంచిపని చేస్తున్నాననే భావన నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది’’ అంటుంది మథుర. ‘ఏఎఫ్హెచ్’లో లక్షా యాభైవేలమంది సభ్యులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది నిపుణులు, సంస్థల మద్దతు ఉంది. ఆయా రంగాల నిపుణుల ద్వారా సభ్యులకు ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణ ఇప్పిస్తోంది ఎఎఫ్హెచ్. ‘ఏఎఫ్హెచ్’ సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలంటే కోల్కతాకు చెందిన ఆద్రిజ నుంచి మొదలు బిజోయెత మైత్ర వరకు ఎంతమంది గురించి అయినా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుంగుబాటు బారిన పడింది అద్రిజ. ఒకరోజు టీచర్ దగ్గరకు వెళ్లి ‘నేను బోర్డ్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేను’ అన్నది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి, భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్న అమ్మాయి ‘ఇక నేను ఏమీ చేయలేను’ అంటూ దీనంగా నిల్చోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ‘ఎఎఫ్హెచ్’ బాధ్యులకు పరిచయం చేశారు. ‘ఏఎఫ్హెచ్’లోకి అడుగుపెట్టడంతో ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘కష్టకాలంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నింపారు’ అని ఉత్సాహంగా చెబుతుంది ఆద్రిజ. కోవిడ్ కాలంలో బిజోయెత మైత్ర తన భర్తను కోల్పోయింది. ఇల్లు గడవడానికి ఆయన సంపాదనే ఆధారం. తానేమో ఎప్పుడూ ఉద్యోగం చేసింది లేదు. కూతురి గురించి ఆలోచిస్తూ మరింత బాధకు గురయ్యేది. ‘అదేపనిగా దిగులు పడడం తప్ప ఏం చేయాలో తెలియని రోజుల్లో, ఒకరి సలహా మేరకు ఏఎఫ్హెచ్ బాధ్యులను కలిశాను. వారు నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను ఒంటరిని అనే బాధ దూరమై, నా వెనక పెద్ద కుటుంబం ఉందనే మానసిక బలం వచ్చింది’ అంటున్న మైత్ర ప్రస్తుతం ఎంటర్ప్రెన్యూర్, వెల్నెస్ అడ్వైజర్గా రాణిస్తోంది. ‘ఉద్యోగం చేయాలనే కోరిక బలంగా ఉన్నా, నేను చదివిన చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది అనే అపనమ్మకం ఉండేది. అయితే ఏఎఫ్హెచ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నన్ను బాగా అర్థం చేసుకున్న తరువాత, ‘నీలో ఈ ప్రతిభ ఉంది, ఈ రంగంలో నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది’ అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో ఉండడానికి ఏఎఫ్హెచ్ కారణం’ అంటుంది ముంబైకి చెందిన 29 సంవత్సరాల వినీత. ‘ఎస్పైర్ ఫర్ హర్’ అద్భుత విజయం సాధించింది అని వీరి మాటలు చెప్పకనే చెబుతున్నాయి. -
కేంద్రం బంపరాఫర్, స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా
న్యూఢిల్లీ: తనఖా లేని రుణాలు పొందడంలో అంకుర సంస్థలకు తోడ్పాటు అందించేలా కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని (సీజీఎస్ఎస్) ప్రకటించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అర్హత కలిగిన స్టార్టప్లు అక్టోబర్ 6న లేదా ఆ తర్వాత మెంబర్ సంస్థల (ఎంఐ) నుంచి తీసుకున్న రుణాలకు ఈ స్కీము వర్తిస్తుంది. ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ. 10 కోట్ల వరకూ గ్యారంటీ లభిస్తుంది. స్టార్టప్ల నిధుల అవసరాలకు ఈ పథకం సహాయపడగలదని డీపీఐఐటీ తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లను (ఏఐఎఫ్) ఎంఐలుగా వ్యవహరిస్తారు. గుర్తింపు పొంది .. స్థిరంగా ఆదాయాన్ని పొందే స్థాయికి చేరుకున్న స్టార్టప్లకు ఈ స్కీము వర్తిస్తుంది. సదరు స్టార్టప్లు ఏ ఆర్థిక సంస్థకు డిఫాల్ట్ కాకూడదు. అలాగే మొండిపద్దుగా ఉండకూడదు. ఈ స్కీము అమలు కోసం కేంద్రం ప్రత్యేక ట్రస్టు లేదా ఫండ్ ఏర్పాటు చేస్తుంది. బోర్డ్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఈ ఫండ్కి ట్రస్టీగా వ్యవహరిస్తుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు డీపీఐఐటీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. -
క్రెడ్, అప్గ్రాడ్, గ్రో.. స్పీడ్
న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల్లోనూ దేశీయంగా 25 స్టార్టప్లు నిలకడను ప్రదర్శించినట్లు ఆన్లైన్ ప్రొఫె షనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. ఈ ఏడాది (2022)కి లింక్డ్ఇన్ తాజాగా రూపొందించిన స్టా ర్టప్ల జాబితాలో మూడు కంపెనీలు టాప్ ర్యాంకు ల్లో నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంస్థ క్రెడ్, ఆన్లైన్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అప్ గ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గ్రో అగ్రస్థానాన్ని పొందినట్లు జాబితా తెలియజేసింది. 6.4 బిలియన్ డాలర్ల విలువతో క్రెడ్ తొలి టాప్ చైర్ను కైవసం చేసుకోగా.. అప్గ్రాడ్, గ్రో తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. కొత్త కంపెనీలు ప్రస్తుత ఏడాది జాబితాలో కొత్తగా ఈ గ్రోసరీ కంపెనీ జెప్టో(4వ ర్యాంకు), ఫుల్స్టాక్ కార్ల కొనుగోలు ప్లాట్ఫామ్ స్పిన్నీ(7వ ర్యాంకు), ఇన్సూరెన్స్ స్టార్టప్ డిటో ఇన్సూరెన్స్(12వ ర్యాంకు)కు చోటు లభించినట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది. ఈ బాటలో ఫిట్నెస్ ప్లాట్ఫామ్ అల్ట్రాహ్యూమన్ 19వ స్థానాన్ని పొందగా, ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ప్లేస్ లివింగ్ ఫుడ్ 20వ ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. వినియోగదారులు ఇటీవల ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సంస్థలు జాబితాలో కొత్తగా చోటు సాధించినట్లు వివరించింది. కాగా.. టాప్–10లో స్కైరూట్ ఏరోస్పేస్(5వ ర్యాంకు), ఎంబీఏ చాయ్ వాలా(6), గుడ్ గ్లామ్ గ్రూప్(8), గ్రోత్స్కూల్(9), బ్లూస్మార్ట్(10) చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలలో షేర్చాట్, సింపుల్, రేపిడో, క్లాస్ప్లస్, పార్క్ప్లస్, బ్లిస్క్లబ్, డీల్షేర్, ఫామ్పే, అగ్నికుల్ కాస్మోస్, స్టాంజా లివింగ్ పాకెట్ ఎఫ్ఎం, జిప్ ఎలక్ట్రిక్కు చోటు దక్కింది. ఇందుకు 2021 జులై నుంచి 2022 జూన్ వరకూ ఉద్యోగ వృద్ధి, నిరుద్యోగుల ఆసక్తి తదితర నాలుగు అంశాలను పరిగణించినట్లు లింక్డ్ఇన్ తెలియజేసింది. ఇక టాప్–25 స్టార్టప్లలో 13 బెంగళూరుకు చెందినవికావడం గమనార్హం! -
స్టార్టప్లకు ఏఐఎఫ్ల దన్ను
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) స్టార్టప్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్ల కోసం ఉద్దేశించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్).. స్టార్టప్లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో ఏఐఎఫ్లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్సైడ్ వెంచర్స్ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. -
టీహబ్–2లో 200 స్టార్టప్ల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్ నెలలో ఐటీ శాఖ ఈ హబ్ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. టీహబ్–2 ప్రత్యేకతలివే.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్–2 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్,నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నెలకొల్పారు. ► స్టారప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. ► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ స్ఫూర్తితో.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి. ఈ హబ్ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’) ఐటీ భూమ్..హైహై టీహబ్ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!) -
ట్రాఫిక్ సమస్యకి చెక్.. జుయ్మంటూ ఎగిరే బైకులు రాబోతున్నాయ్!
ప్రస్తుత రోజుల్లో నగరవాసులకు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ జామ్. దీని వల్ల వాళ్ల సమయం వృథా కావడంతోపాటు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లైఫ్లో ట్రాఫిక్ సమస్య కూడా ఓ భాగమే అనుకుని ప్రజలు ముందుకు సాగిపోతున్నారు. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్ పెడుతూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చట. ఎలా అంటారా.. జపనీస్ కంపెనీ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ఇటీవలే ఆ బైక్ను మీడియా ముందు ప్రదర్శించింది. జుయ్మంటూ వచ్చేస్తోంది ఎగిరే బైక్.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్. దీనికి XTURISMO hoverbike అని పేరు పెట్టారు. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్( AERWINS) టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బైక్ గురువారం యునైటెడ్ స్టేట్స్లోని డెట్రాయిట్ నందు జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఈ హోవర్బైక్ ప్రముఖ స్టార్ వార్స్ సినిమాలోని బైక్లతో పొలిక ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఈ బైక్ గరిష్టంగా 100 kph (గంటకు 62 మైళ్లు) వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు.ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది. జపాన్లో ఇప్పటికే ఈ బైక్లు అమ్మకంలో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ హోవర్బైక్ ధర $7,77,000 (భారత కరెన్సీ ప్రకారం 6 కోట్లు) ఉంటుంది. అయితే కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ మోడల్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకోసం కంపెనీకి మరో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm — Reuters (@Reuters) September 16, 2022 చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
విజయవాడలో 20న బిజినెస్ స్టార్టప్ శిక్షణ
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం విశేష పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాలపై రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈనెల 20వ తేదీన బిజినెస్ స్టార్టప్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దాసరి దేవరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడి కలిగిన పరిశ్రమలు స్థాపించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు, ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం బిజినెస్ సెటప్ ఫ్లానింగ్, బ్యాంక్ క్రెడిట్ సపోర్ట్, మెషినరీ సపోర్ట్ కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన వారికి మెటీరియల్తో పాటు సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. విజయవాడ నాడార్స్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే ఈ శిక్షణకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈనెల 19 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్వయంగాగానీ, 6305941717, 8919737517 నంబర్లలోగానీ సంప్రదించాలని ఆయన సూచించారు. (క్లిక్ చేయండి: ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్) -
'సక్కగ ఉద్యోగం చేసుకో.. ఇలాంటి రిస్క్లెందుకు'
శివాంక్ అగర్వాల్కు కవిత్వం వినడం ఇష్టం. అయితే స్టార్టప్ అనేది కవిత్వం విన్నంత ఈజీ కాదని అర్థమైంది. అనీష్ ఖండేల్వాల్కు జోక్స్ వింటూ నవ్వడం ఇష్టం. అయితే స్టార్టప్ అనేది నవ్వినంత కూల్ కాదని అతడికి అర్థమైంది. అంతమాత్రాన వీరు వెనక్కి తగ్గలేదు. నేర్చుకుంటూనే ముందుకు కదిలారు. ‘మిత్రన్’ అనే తమ కలను నెరవేర్చుకున్నారు... ముంబైలోని జవేరిబజార్కు చెందిన నగల వ్యాపారి అమిత్కు టిక్టాక్ లేకుండా పొద్దు గడిచేది కాదు. టిక్టాక్ నిషేధం తరువాత అతడిని బాగా ఆకట్టుకుంది మిత్రన్. 58 సంవత్సరాల అమిత్కు మాత్రమే కాదు ఎంతోమంది కాలేజి విద్యార్థులకు ఈ ఫ్రీ షార్ట్ వీడియా ప్లాట్ఫామ్ బాగా నచ్చేసింది. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయిన అనీష్ ఖండేవాల్, శివాంక్ అగర్వాల్లు గురుగ్రామ్లోని ఒక ఆన్లైన్ ట్రావెల్ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే షార్ట్–ఫామ్ వీడియో యాప్ ఐడియా తట్టింది.రాత్రనకా, పగలనకా రోజుల తరబడి ఈ యాప్ గురించి చర్చలు జరిపారు. విద్వేషం పంచే, హింసప్రేరేపిత కంటెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనుకున్నారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సులభంగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయాలనుకున్నారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించకూడదు అనేది మరో గట్టి నిబంధన. ‘మిత్రన్’ పేరుతో యాప్ లాంచ్ చేశారు. మొదట్లో యూజర్స్ వీడియోలు చూసే విధంగా మాత్రమే దీన్ని డిజైన్ చేశారు. దీనికి కారణం కంటెంట్ క్రియేట్ చేయడానికి వారు ఆసక్తిగా లేరు అనుకోవడమే. అయితే అప్లోడ్ ఫీచర్ను యాడ్ చేయాలంటూ రిక్వెస్ట్లు వెల్లువెత్తడంతో నెక్ట్స్ వెర్షన్లో అప్లోడ్ ఫీచర్ను యాడ్ చేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది! ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో పుట్టి పెరిగిన శివాంక్ అగర్వాల్కు చిన్నప్పటి నుంచి కవిత్వం చదవడం, రాయడం అంటే ఇష్టం. తండ్రి ప్రొఫెసర్. అనిష్ ఝార్ఖండ్లోని చకులియలో పుట్టాడు. అక్కడే ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి చిన్నవ్యాపారి. ‘ఉద్యోగం చేసుకోకుండా రిస్క్ ఎందుకు’ అని వారి తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. పైగా వారి నుంచి ప్రోత్సాహం కూడా లభించింది. ‘బరిలో రకరకాల ఆటగాళ్లు ఉన్నారు. కొందరు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు, కొందరు నాన్–ఎంటర్టైన్మెంట్ వీడియోలపై దృష్టి పెట్టారు. మేము మాత్రం రెండిటినీ మిక్స్ చేశాం. పదిహేను కంటెంట్ విభాగాలను సృష్టించాం.ట్రెండింగ్ టాపిక్ మీద ఒపీనియన్ వీడియోలు క్రియేట్ చేసే అవకాశం ఇచ్చాం’ అంటున్నాడు ‘మిత్రన్’ సీయివో శివాంక్ అగర్వాల్. ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ‘మిత్రన్’లో ఇప్పుడు యాభైమందికి పైగా పనిచేస్తున్నారు.టెక్, ప్రాడక్ట్, మార్కెటింగ్, ఆపరేషన్....ఇలా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ‘మిత్రన్’ ఇన్స్టంట్ సక్సెస్ అయింది.అంతమాత్రన నల్లేరు మీద నడకలాంటి విజయమేమీ కాదు. తొలి అడుగులోనే షాక్ తగిలింది! కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘మిత్రన్’ను తొలగించారు. కరెక్ట్ వే ఏమిటో తెలుసుకొని గూగుల్ టీమ్తో టచ్లోకి వచ్చి తప్పు సరిదిద్దుకున్నారు. ఇలాంటివి మరికొన్ని కూడా ఎదురయ్యాయి. అయితే ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. వీరి భవిష్యత్ ప్రణాళిక విషయానికి వస్తే...క్వాలిటీ వీడియో ఎడిటింగ్ టూల్స్ రూపకల్పన, బ్రాండ్స్, క్రియేటర్స్ను ఒకే వేదిక మీదికి తీసుకురావడం...ఇలా ఎన్నో ఉన్నాయి. -
అంతర్జాతీయ ప్రవేశ పరీక్షలపై ‘ట్యూటరూట్’ ట్యూషన్లు
ఎడ్యుటెక్ స్టార్టప్ ‘ట్యూటరూట్ టెక్నాలజీస్’ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ ఎక్స్లెన్స్ సెంటర్ (ఐఈఈసీ)ను ప్రారంభించింది. అంతర్జాతీయ స్కూళ్లలో ప్రవేశాల కోసం పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా ట్యూషన్లు చెప్పనుంది. ముందుగా సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షలైన ఐజీసీఎస్ఈ, ఐబీడీపీలు రాసేందుకు కావాల్సిన నైపుణ్యాల బోధనపై ఐఈఈసీ దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా కోర్సులు, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం పోటీపడే విద్యార్థులకు ట్యూషన్లు అందించడానికి ఐఈఈసీ ప్రాధాన్యం ఇస్తుందని ట్యూటరూట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సత్యేంద్ర మంచాల తెలిపారు. చదవండి: Income Tax Return: ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే! -
వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూత బడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్ఎక్స్ కార్యకలాపాలు నిలిపి వేసింది. బెంగళూరుకు చెందిన షాప్ఎక్స్ ఈ మేరకు దివాలా పిటీషన్ దాఖలు చేసింది. దివాలా (ఐబిసి) కోడ్, 2016 సెక్షన్ 10 ప్రకారం దివాలా కోసం దరఖాస్తు చేసినట్టు కంపెనీ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్లో తెలిపింది. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. . షాప్ఎక్స్ -
ఎస్బీఐ బంపరాఫర్, స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు అవసరమైన ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్టప్లకు హబ్గా ఉంటున్న బెంగళూరులోని కోరమంగళలో తొలి బ్రాంచీని మంగళవారం ప్రారంభించింది. ప్రారంభ దశ మొదలుకుని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యే వరకూ అంకుర సంస్థలకు అవసరమైన తోడ్పాటును ఈ శాఖ అందిస్తుందని బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఈ శాఖ అనుభవాలను పరిశీలించి, వచ్చే ఆరు నెలల్లో గురుగ్రామ్లో రెండోది, హైదరాబాద్లో మూడోది ప్రారంభించనున్నట్లు వివరించారు. రుణాలు, డిపాజిట్లు, రెమిటెన్సులు, చెల్లింపులు, ఫారెక్స్, బీమా తదితర సర్వీసులు, న్యాయ సలహాలు, డీమాట్.. ట్రేడింగ్ ఖాతాలు మొదలైనవన్నీ ఎస్బీఐ స్టార్టప్ బ్రాంచ్లో పొందవచ్చు. స్టార్టప్ వ్యవస్థలో భాగంగా ఉండే వివిధ వర్గాలన్నింటికీ అవసరమైన ఆర్థిక, సలహాలపరమైన సర్వీసులను ఇది అందిస్తుంది. -
మరోసారి హాట్ టాపిగ్గా మారిన శాంతను నాయుడు!
ముంబై: గుడ్ఫెలోస్ స్టార్టప్లో రతన్ టాటా ఇన్వెస్ట్ చేశారు. ఎంత మొత్తం ఆయన పెట్టుబడిగా పెట్టారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. వృద్ధులకు సాంగత్య సేవలను గుడ్ఫెలోస్ అందిస్తోంది. Ratan Tata Invests In Assistant Shantanu Naidu's Startup Goodfellows https://t.co/aWlu46L0gx #digitalhealth #socialmedia #digitalmarketing #IoT #healthtech #industry40 #AI #mhealth pic.twitter.com/8aEw5QLzid — Dr Timos Papagatsias (@_timos_) August 16, 2022 సీనియర్ సిటిజన్ క్లయింట్స్గా నియమితులైన యువత వృద్ధులతో కలిసి క్యారమ్, చెస్ ఆడడం, స్నేహితుల మాదిరిగా వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. గుడ్ఫెలోస్ను కార్నెల్ వర్సిటీలో విద్యనభ్యసించిన 25 ఏళ్ల యువకుడు శాంతను నాయుడు స్థాపించారు. చదవండి👉 శంతన్నాయుడు.. రతన్టాటా.. ఓ ఆసక్తికర కథ !