Telangana Election Result 2018
-
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పని చేసిన పద్మాదేవేందర్రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
కేబినెట్లోకి ఇద్దరు మహిళలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు రుణమాఫీ చెక్కులు... కేంద్రం పీఎం–కిసాన్ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్సైట్ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్డేట్ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. అమెరికా అప్పులున్న దేశం కూడా! ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్ జీఎస్డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్కు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం... మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్ టైటిల్ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... లోక్సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్లో ఐదు ఔటర్ రింగ్రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్–జూలైలలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం. రైతు అంటే ఎవరు? ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్ దేశంలో నేచురల్ హ్యాపినెస్ అంటూ శ్రీధర్బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు. రెండు బిల్లులకు ఆమోదం... శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. -
కుట్రల వల్లే ఓటమి: మాజీ మంత్రి
అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సస్పెండ్ డిమాండ్తో రసాభాస టీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు. -
‘టీడీపీతో లాభం లేదు.. మరోసారి పొత్తు వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆపార్టీ నేతలతో సమావేశమైయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫాంహౌజ్లో జరిగిన ఈ సమావేశాంలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లో పొత్తు ఉపయోగం ఉండదని తాము ముందు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తాను లోక్సభకు పోటీచేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ తెలిపారు. ఓడిపోవడానికి అనేక కారణాల్లో టీడీపీతో పొత్తు కూడా ప్రధానమన్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్క నేతను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ను ఓడించిందని, పాలమూరులో ఓటమిపై అనేక అనుమనాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, రాజగోపాల్ రెడ్డి, హరిప్రియానాయక్, హర్షవర్ధన్, జానారెడ్డి, దామోదర, సునీతా లక్ష్మారెడ్డి పొన్నాల తదితరులు హాజరైయ్యారు. -
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
-
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెం స్పీకర్గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు. -
‘ఓటరు ఆలోచన మారింది..పార్టీ థింకింగ్ కూడా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్లో సమీక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. -
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17 నుంచి 20 వరకు నూతనంగా ఏర్పడిన సభ తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు నియమితులుకానున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ఆయనచే గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మర్నాడే (జనవరి 17న) నూతనంగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీహాల్లో సభ్యులకు విందు కార్యక్రమం ఉంటుంది. అదే రోజున శాసనసభ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18న సభ్యులు శాసనసభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం నూతన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న నూతనంగా ఏర్పడిన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ మర్నాడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం కార్యక్రమం జరుగుతుంది. కాగా డిసెంబర్ 11న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాల వల్లన శాసన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్కు ఒవైసీ థాంక్స్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు. -
ఏడాదంతా రాజకీయ రికార్డులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ఎన్నికల నగారాకు మన జిల్లానే వేదికగా నిలిచింది. జైత్రయాత్రకు ఇక్కడే అంకురార్పణ చేసిన గులాబీ నాయకత్వం.. ఊహకందని విజయాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో బలీయశక్తిగా ఎదిగింది. గతంలో కేవలం షాద్నగర్ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. తాజాగా ఆరు సీట్లలో విజయం సాధించి ఆజేయశక్తిగా ఆవతరించింది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఏఐసీసీ దూతలపైనే అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించి పార్టీకి దూరమవగా.. ఎల్బీనగర్ సీటు అడిగితే ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో సామ రంగారెడ్డి ఏకంగా తెలంగాణ టీడీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. దాదాపు టికెట్ ఖాయమైందని భావించిన బీజేపీ సారథి బొక్క నర్సింహారెడ్డికి చివరి నిమిషంలో టీఆర్ఎస్ జైత్రయాత్రకు జిల్లాలోనే అంకురార్పణనిరాశే మిగలడం ఈ ఏడాది పొలిటికల్ రౌండప్లో కొసమెరుపు. ‘ముందస్తు’ కుదుపు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో గులాబీ దళపతి మాత్రం ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆగస్టులో మొదలైన ఈ ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్లో ‘ప్రగతి నివేదన సభ’ దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలికింది. లక్షలాది మంది తరలివచ్చిన ఈ బహిరంగసభలోనే ముందస్తుకు శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్.. సెప్టెంబర్ ఆరో తేదీన శాసనసభను ఆర్థాంతరంగా రద్దు చేసి సమరానికి సై అన్నారు. అదే రోజు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు. శాసనసభ రద్దుతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్, టీడీపీలు అప్రమత్తమైనా అభ్యర్థుల ఖరారులో ఎడతెగని జాప్యం పాటించాయి. ప్రజాకూటమిగా జతకట్టి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నాయి. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలను టీడీపీకి సర్దుబాటు చేసిన ఒక్కచోట కూడా బోణీ కొట్టకుండానే బొక్కబోర్లా పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎల్బీనగర్, మహేశ్వరం సీట్లను గెలుచుకొని బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇక బీజేపీ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. తొలిసారి బలమైన అభ్యర్థులో బరిలో దిగిన బీఎస్పీ మాత్రం షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో గణనీయ ఓటు బ్యాంకు సాధించి ఔరా! అనిపించింది. కొండా తిరుగుబాటు ఈసారి జిల్లా రాజకీయాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజీనామా హాట్ టాపిక్గా మారింది. అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించిన కొండా.. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. మాజీ మంత్రి మహేందర్రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని కసితో పనిచేసిన ఆయనకు అది సాధ్యపడలేదు కానీ, తాను విభేదించే మహేందర్రెడ్డి ఓడిపోవడం.. అదీ తన సన్నిహితుడు రోహిత్రెడ్డి చేతిలో మంత్రి చావుదెబ్బ తినడం సంతోష పరిచింది. అదే సమయంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చేదు గుళికగా మారింది. ఇక కొండాను అనుసరించిన యాదవరెడ్డికి ఈ ఏడాదే ఖేదాన్నే మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గంపెడాశతో సొంతగూటికి చేరిన ఆయనకు నిరాశే మిగిలింది. దీనికితోడు ఫిరాయింపు చట్టం కింద ఆయనపై వేటు కత్తి వేలాడుతుండడం యాదవరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డిని అనుసరించిన జెడ్పీటీసీ సభ్యులకు కూడా ఈ సారి అంతగా కలిసిరాలేదు. కాంగ్రెస్లో ముడుపుల కల్లోలం అంతర్గత కలహాలు కాంగ్రెస్ను నట్టేట ముంచాయి. టికెట్లను అమ్ముకున్నారంటూ ఏకంగా డీసీసీ సారథి క్యామ మల్లేశ్ ఆడియో టేపులను విడుదల చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని బహిరంగ విమర్శలకు దిగడంతో ఆయనపై వేటు పడింది. ఈ పరిణామంతో మల్లేశ్ కాస్తా కారెక్కగా.. ఇబ్రహీంపట్నం రాజకీయం మాత్రం ఆధ్యంతం రక్తి కట్టించింది. పొత్తులో ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ల రోజున కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చిందని ఆర్భాటం ప్రదర్శించి.. చివరకు బీఎస్పీ తరఫున నామినేషన్ వేయడం చర్చకు దారితీసింది. ప్రచారం చివరి రోజున మెట్టుదిగిన కాంగ్రెస్ అధిష్టానం మల్రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం గెలుపు వాకిట బొల్తా పడ్డారు. అగ్రనేతల రాకపోకలతో జిల్లాలో ప్రచారపర్వం తారాస్థాయికి చేరినా టీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేకపోయారు. ఆరంభం నుంచే హడావుడి ఈ ఏడాదంతా ఎన్నికల హడావుడే కొనసాగింది. తొలి త్రైమాసికంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లను కూడా చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆక్షింతలు వేయడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొలువుదీరింది. ఇక ఫిబ్రవరితో కాలపరిమితి ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. పాత కమిటీలను కొనసాగిస్తూ వస్తోంది. వివిధ కారణాలతో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై కేసీఆర్ సర్కారు వెనుకడుగు వేసింది. -
కాంగ్రెస్కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
నిజమైన పని ఇప్పుడే మొదలైంది : హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యంతో ప్రలోభాలు ఉంటాయి.. అయితే ఇవేమీ సిద్దిపేట నియోజకవర్గంలో పనిచేయలేదు. మీ వద్దకు నేను ఓట్లు అడగడం కోసం కూడా రాలేదు. అయినా నాకు ఘనవిజయం తెచ్చిపెట్టారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. పార్టీ అప్పగిం చిన పనిని విజయవంతంగా నిర్వర్తించాను’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పత్తిమార్కెట్ యార్డులో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేం దుకు ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడా రు. కొడంగల్, కొల్లాపూర్, అలంపూర్ తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిం చేందుకు ప్రచారం చేశానని చెప్పారు. తనతోపాటు సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా వివిధ నియోజకవర్గాల్లో పనిచేశారని, అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో పాలుపంచుకున్నారని తెలిపారు. తాను ఇతర నియోజకవర్గాల పర్యటనలో ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని.. చరి త్రను తిరగరాసేలా గెలుపు సాధించి పెట్టారన్నారు. ఈ విజయం తన ఒక్కడిది కాదని, ఇది ప్రజల విజయమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని, అందుకోసమే దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ప్రజల కోసం వినియోగిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవచేస్తానని చెప్పారు. ఎవరికి కష్టం వచ్చినా అది తన కుటుంబ సభ్యులకు వచ్చినట్లే అనుకుంటానని అన్నారు. నాయకులంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారని, కానీ తాను ఎప్పుడూ మీ వెంటే ఉన్నానని, మీకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెక్కడా లేదని పేర్కొన్నారు. ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. నిజమైన పని ఇప్పుడే మొదలైంది.. నిజమైన పని ఇప్పుడే మొదలైందని, తన బాధ్యత మరింత పెరిగిందని హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచామని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయని అన్నారు. దీంతో యువతకు ఉపాధి మార్గాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశ, విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించడం, ఇక్కడి పనులను వారి ప్రాంతాల్లో అమలు చేసేందుకు వివరాలు తీసుకువెళ్లడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఈ ప్రాంతం ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా గౌరవం ఏముంటుందన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, దీంతో ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల పురస్కారంతోపాటు, గౌరవం కూడా పెరుగుతుందని అన్నారు. భేషజాలకు పోయి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ సంపత్, ఎంపీపీ మాణిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్రెడ్డిలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే... శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్ఎస్కు 31 మంది, కాంగ్రెస్కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రజల వైపు: ఆకుల లలిత మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. నేడు కొండా మురళీ రాజీనామా... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. -
మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు. కాంగ్రెస్ నుంచి చేరికలున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 4న పంచాయతీ నోటిఫికేషన్? హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
వేగంగా హామీల అమలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రకటించిన హామీలను వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో ఇచ్చిన హామీ ల వివరాలను అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పొందుపరచాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జనవరి మొదటి వారంలో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతుపై అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. ఓట్ల గల్లంతుతో టీఆర్ఎస్ అభ్యర్థులకు రావాల్సిన మెజారిటీ కొంత మేరకు తగ్గింది. కొన్ని చోట్ల ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా ఓట్లు వేయలేక బాధపడిన వారు ఉన్నారు. ఇలాంటి సమస్యలను టీఆర్ఎస్ తరఫున పరిష్కరించేందుకు ప్రయత్నిం చాలి. ఎన్నికల ప్రధానాధికారిని కలసి ఈ అంశాలపై విజ్ఞప్తి చేయాలి. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిం చాలి. ఒక్క ఓటరు పేరు కూడా గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హతగల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి ఎం.శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, సోమ భరత్కుమార్లతో కూడిన కమి టీ ఓటరు నమోదు అంశాలను సమన్వయం చేస్తుం ది. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కారణా లను తెలుసుకుని అవసరమైన చర్యలు ఏమిటనేది కమిటీ ద్వారా పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ ఇస్తాం. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పుచేర్పుల కార్యక్రమం ఉంది. ప్రతి ఓటరు పేరు నమోదు లక్ష్యంగా పని చేయాలి. ఓటరు నమోదు కార్యక్రమం కోసం ఈ నెల 22 నుం చి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిం చాలి. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. ఎకరానికి తక్కువ విస్తీర్ణం కాకుండా స్థలాలను ఎం పిక చేయాలి. సమావేశాలు నిర్వహించుకునేలా ఈ స్థలాలు ఉండాలి. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలం ఎకరం విస్తీర్ణంకంటే తక్కువగా ఉంటే వేరే వాటిని పరి శీలించాలి. పార్టీ జిల్లా కార్యాలయాల స్థలాలు అనువుగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కార్యాలయ భవనాల నమూనాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమోదిస్తారు. వెంటనే నిర్మాణాలను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలి. జనవరి మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో కార్యాలయ నిర్మాణాలు మొదలుకావాలి. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లాలకు ఇన్చార్జీలుగా గతంలో నియమించిన వారే కొనసాగుతారు. రాష్ట్ర కమిటీ నుంచి వైదొలగిన వారి స్థానాల్లో కొత్త వారిని త్వరలో నియమిస్తాం. కేసీఆర్ అనుమతితో దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు ఎప్పటికప్పుడు సమావేశమవుదాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు సిరిసిల్లకు... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొదటిసారి బుధవారం సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం ఉండనుంది. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటన మంగళవారమే జరగాల్సి ఉన్నప్పటికీ బుధవారానికి వాయిదా పడింది. -
గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు. -
అరే కోపంలో వంద అంటాం సార్.!
-
లెక్క తేలుతోంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. మరి జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఎవరి అధీనంలో ఉంటుంది? తిరిగి బాధితులకు అందజేస్తారా? లేక ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? సామాన్యుల్లో ఈ తరహా ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ లెక్కలు తేలుతున్నాయి. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. ఓట్లు దండుకోవడానికి ఆయా పార్టీల నేతలు పోటీపడి మరీ కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన నిర్దేశిత మొత్తానికి మించి ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ మార్గాల్లో.. పలు రూపాల్లో డబ్బును రాజకీయ నాయకులు తరలించారు. విస్తృతంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, స్టాటిక్ సర్వీలేన్స్ బృందాలు (ఎస్ఎస్టీ) పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కేసులు వీగిపోగా.. మరికొన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని కేసులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్లాయి. వీగిన కేసులు 13 రూ.10 లక్షలు లోబడి స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ) వద్ద భద్రపరిచారు. ఇటువంటి కేసులు జిల్లావ్యాప్తంగా 26 నమోదయ్యాయి. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎండార్స్ చేసిన పత్రం, పంచనామా, ఎన్నికల సంఘానికి వివరాలు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాన్ని కూడా డీటీఓకు అందజేశారు. డబ్బు వ్యవహారంపై డీఆర్ఓ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీ చర్చించనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తరలిస్తున్నారా? ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తుంది. వ్యక్తిగత సొమ్మే అని తేలితే.. సదరు కేసులను అక్కడితో మూసేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు వీగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ వ్యక్తగత, వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో స్పష్టమైంది. మిగిలిన కేసులపై త్వరలో విచారణ జరగనుంది. రూ.పది లక్షలకు పైబడి పట్టుబడిన కేసులన్నీ ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. పదుల సంఖ్యలో నమోదైన ఈ తరహా కేసులను ఆ శాఖ అధికారులకు అప్పగించడంతో విచారణ చేపడుతున్నారు. ఆ నగదుకు సంబంధించి గతంలో పన్ను చెల్లించారా? లేదా హవాలా మార్గంలో వచ్చిందా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే డబ్బును యజమాని తీసుకోవచ్చు. లేకపోతే సర్కారు ఖజానాలో జమచేస్తారు. భారీగా నగదు స్వాధీనం.. ఎన్నికలు పూర్తయ్యే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.84 కోట్లను సీజ్ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు చేయడంతోపాటు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సివిల్ పోలీసులూ ఎక్కడికక్కడ సోదాలు చేసి పెద్దమొత్తంలో డబ్బులను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో రూ. 40 వేలు, ఆపైబడి మొత్తం ఎవరి వద్దనైనా లభ్యమైతే అందుకు సంబంధించిన లెక్కలు చూపడంతోపాటు తగిన ఆధారాలను సైతం అందజేయాలి. ఈ ఉల్లంఘనను అతిక్రమించి నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి డబ్బును సీజ్ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్లు సోమవారం మండలి చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్కర్నూల్కు చెందిన దామోదర్రెడ్డి ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. -
బ్యాలెట్ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి
నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్ఎస్ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్గౌడ్కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. వీటిపై ఇప్పటికే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర్రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్వే: జానారెడ్డి
గుర్రంపోడు: టీఆర్ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. -
ఆద్యంతం ధన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్ రావు చెలికాని, బండారు రామ్మోహన్రావు, బి.శ్రీనివాస్రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు. ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్కుమార్ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడితే డ్యూయల్ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్ నంబర్తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్ విధించాలని, నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్లో ప్రత్యేకంగా చాంబర్ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి -
‘హస్త’వాసి మారేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకున్నా భవిష్యత్తు మీద గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టించాలని యోచిస్తోంది. ఈ అన్ని ఎన్నికల్లో ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తేనే లోక్సభ పోరులో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వగలమన్న భావనతో ఉన్న పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడింది. టీడీపీతోనా.. ఒంటరిగానా.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ మునిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ఓటమే ఎదురైన నేపథ్యంలో పొత్తులపై పునరాలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తు పార్టీకి చేటు కల్గించిందని పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారంలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రాజేశారని, పరాయి రాష్ట్రనేతల పాలన అవసరమా? అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని ఇటీవల జరిగిన పార్టీ పోస్టుమార్టమ్ సమావేశాల్లో నేతలు స్పష్టం చేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకెళ్తామని ఇటీవల టీజేఎస్ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము సైతం ఒంటరిగా వెళ్లాలన్న భావన ఎక్కువమంది కాంగ్రెస్ నేతల్లో ఉన్నా, హైకమాండ్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కాంగ్రెస్పెద్దలు వ్యాఖ్యానిస్తున్నా రు. పంచాయతీ ఎన్నికలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ త్వరలోనే కీలకనేతలతో పీసీసీ పెద్దలు సమావేశం కానున్నారు. -
ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!
సాక్షి, హైదరాబాద్ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు, సామాజిక న్యాయం చేకూర్చేందుకు ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్ఎఫ్ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు. కలసి రాని తమ్మినేని పాదయాత్ర వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్–నీల్’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్ఎఫ్లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్ఎఫ్పై సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో బరిలో నిలచిన బీఎల్ఎఫ్కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి. -
ఇవేం ఫలితాలు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ను అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే రాష్ట్రంలో పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఎదురైందనే చర్చ కమలనాథుల్లో సాగుతోంది. పార్టీ విస్తరణకు తగ్గట్టుగానే గెలిచే సీట్లు, మద్దతుదారుల ప్రభావం ఎక్కడెక్కడ అధికంగా ఉంది.. ప్రభావం చూపే అంశాలేమిటీ.. పార్టీపరంగా అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలేమిటీ.. అనే అంశాలను లోతుగా పరిశీలించి సరైన కార్యాచరణను సిద్ధం చేసుకోకపోవడం వల్లే నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ కమిటీ నుంచి సహాయ, సహకారాలు, మద్దతు అందినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయామనే భావన వ్యక్తమవుతోంది. దాదాపు పది సీట్ల వరకు గెలుచుకోలేకపోయినా, గతంలో గెలిచిన ఐదు స్థానాల్లోనైనా నిలబెట్టుకోలేక, చివరకు ఒక్క సీటుకే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి మద్దతుగా ఉన్న వర్గాలు కూడా ఫలితాల పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోగా, ప్రత్యర్థి పార్టీగా పరిగణించే ఎంఐఎం గతంలోని ఏడుసీట్లను మళ్లీ నిలబెట్టుకోవడం బీజేపీ మద్దతుదారులకు కొరుకుడు పడడంలేదు. క్షేత్రస్థాయిల్లోని రాజకీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తదనుగుణంగా పావులు కదపడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానమైన ఎన్నికల అంశాలన్నీ పక్కకు పోవడం, చంద్రబాబు ప్రచారంతో తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చర్చనీయాంశం చేయడం, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం వంటి వాటిని ముందే ఊహించలేకపోయినట్టు ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. 1983లోనూ ఇలాంటి స్థితే... ఈ ఎన్నికల్లో 118 స్థానాల్లో (భువనగిరి సీట్లో మినహా) పోటీ చేసి 103 చోట్ల అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతం అయినా పెరుగుతుందనే ఆశలు సైతం నెరవేరకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. రాజకీయపార్టీగా బీజేపీ ఏర్పడి ఉమ్మడి ఏపీలో సొంతంగా ఎదుగుతున్న క్రమంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఇప్పుడు కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన చూపుతుందని, మంచి సంఖ్యలోనే సీట్లు గెలుస్తుందని నాయకులతోపాటు అభిమానులు ఆశించారు. అయితే, ఫలితాలు భిన్నంగా వచ్చి మూడు సీట్లకే బీజేపీ పరిమితమైంది. బీజేపీకి తక్కువ సీట్లు రాగా ఆ ఎన్నికల్లోనే ఏఐఎంఐఎం ఏకంగా ఐదుసీట్లను గెలుచుకోవడం మద్దతుదారులకు మింగుడుపడటంలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచే సీట్లు పెరగడానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులతోపాటు అభిమానుల మద్దతు కూడా కారణమని చెబుతున్నారు. మళ్లీ అలాంటి పరిణామాలు పునరావృతమయ్యేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
బదిలీ కాని ఓటు.. అంచనాలు తలకిందులు.!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మహా కూటమి మంత్రం పారలేదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిస్తే గణనీయమైన ఓట్లు వస్తాయని, తేలిగ్గా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ నాయకత్వం అంచనాలు తలకిందులయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఒక జట్టుగా.., టీడీపీ, బీజేపీ మరో జట్టుగా.. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో మహా కూటమి పేర కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. ఈసారి మహాకూటమి అభ్యర్థులకు తేలికైన విజయాలు దక్కాలి. కానీ, వాస్తవంలో అలా జరగకపోవడం, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలుకావడంతో కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లును కలిపితే, గెలుపోటములతో సంబంధం లేకుండా దాదాపు అన్ని స్థానాల్లో మహా కూటమికి ఖాతాలోనే ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నా యి. అయితే.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు (కూటమి పక్షనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేశారు) గంప గుత్తగా పడతాయని ఆశించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఆశాభంగం జరగగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు పోలయ్యాయి. బలపడిన టీఆర్ఎస్ గత ఎన్నికల్లో దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానంలో, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో రెండో స్థానంలో నిలవగా, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, ఈసారి నకిరేకల్, మునుగోడు స్థానాలను కోల్పోయి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐదేళ్లుగా జరిగిన మార్పులు, చేర్పులు, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ చాలా చోట్ల బలపడింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవరకొండ నియోజకవర్గంలో రెండో స్థానంలో నల్లగొండలో టీడీపీ రెబల్ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన ఓట్లు ఈ సారి కూటమికి బదిలీ కాలేదన్న అంశం తాజా ఓట్ల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి భా గస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు బదిలీ కాకపోగా, ఆ తేడా భారీగా కనిపిస్తోంది. పక్కాగా ఓటు బదిలీ జరిగి ఉం టే నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు అవకాశం దక్కేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ఇలా.. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఇక్కడ కూటమి ఓట్లన్నీ కలిస్తే (2014 గణాంకాలు)నే బదిలీ కాకుండా పోయిన ఓట్లు 21,658. గతం కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. అంటే కూటమి బదిలీ అయి ఉంటే జానారెడ్డి ఓటమి కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి 23,698 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఈ నియోజకవర్గంలో 35,907ఓట్లు కూటమి బదిలీ కాలేదు. దీంతో ఆయనకూ ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన (బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి)4523 ఓట్లును ఈ సారి మినహాయించినా కూటమికి బదిలీకాకుండా పోయిన ఓట్లు 31,384. ఈ లెక్కన చూసినా, కాంగ్రెస్కు అవకాశం ఉందేం టున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాం గ్రెస్తో జతకట్టిన టీడీపీ, సీపీఐ తదితర పార్టీల కూటమి పక్షాల ఓట్లు కాంగ్రెస్కు బదిలీకాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
కోర్టుల్లో పోరాడతాం
ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన మోసాలు, ఎన్నికల అధికారుల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రిట ర్నింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లలోకి రానివ్వకుండా టీఆర్ఎస్కు సహకరించారన్నారు. ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్’ఉద్యమం హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తామన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పోరాడతామన్నారు. -
కేసీఆర్కు కేతిరెడ్డి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్రావుకు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంను ఆయన కలిశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. తెలుగు వారి భాషా సంస్కృతులను కాపాడటంలో ఒక తెలుగు నేతగా ముందుండాలని కోరారు. -
24న నగరానికి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘోర పరాజ యం పాలవ్వడంపై రాష్ట్ర కార్యవర్గంతో అంతర్గత సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉనికిని చాటుకునేలా వ్యూహరచన చేసి రాష్ట్ర నాయకత్వానికి అమిత్షా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో పొందిన సీట్లను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోవడంపై తెలంగాణ బీజేపీ నేతలపై షా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోవడంపై రాష్ట్ర నేతల పనితీరుపై షా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ వైఫల్యానికి కారణాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు షా తన పర్యటనలో మార్గదర్శనం చేయనున్నట్టు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి ఉన్న లక్ష్యాలను వివరించి క్లస్టర్ల వారీగా విభజించిన లోక్సభ స్థానాలపై సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తోం ది.రాష్ట్ర కార్యవర్గంలో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన అనంతరం ఈ నెలాఖరున లేదా జనవరి తొలి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉంది.. తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్లేషించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయడం, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలు తెలంగాణ వాదులు, వ్యతిరేకుల మధ్య పోటీగా మారిందని, దీని వల్ల ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఓటమిపాలయ్యామని ఆయన విశ్లేషించారు. పార్టీ వైఫల్యాలను గుర్తించి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొని సత్తాచాటుతామని ఆయన తెలిపారు. -
ఇంకా తేరుకోని కూటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ఫ్రంట్ కూటమి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. ఫలితాలు వెలువడి మూడు రోజులు దాటినా ఇంకా వాటిని సమీక్షించే సాహసం కూడా చేయడం లేదు. ఇంతవరకు కూటమి భాగస్వామ్యపక్షాల ముఖ్యనేతలు కనీసం పలకరించుకున్న దాఖలాలూ లేవు. టీడీపీతో కుదుర్చుకున్న పొత్తే ఆత్మహత్యా సదృశం గా మారడంతో ఓటమికి కారణాల విశ్లేషణే ముం దుకు కదలడం లేదు. టీడీపీతో పొత్తు కారణంగా ప్రస్తుతం రాజకీయంగా తలెత్తిన విపత్కర పరిస్థితులపై అంతర్మథనం కొనసాగుతోంది. ఫలితాల సరళి, తీరుపై సమీక్షకు రాష్ట్ర టీడీపీ నాయకులను పిలిపిం చాలంటేనే భాగస్వామ్యపక్షాలు జంకుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో సమావేశానికి చొరవ తీసుకోకపోవడంతో కనీసం సీపీఐ, టీజేఎస్ నేతలు కలుసుకుని ప్రాథమిక సమీక్ష జరపాలని భావించినా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కానట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో వరుసగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉండటంతో కూటమిగా కొనసాగాలా లేక విడివిడిగా పోటీచేస్తేనే మంచిదా అనే మీమాంసలో కూటమి నేతలున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై అతిగా అంచనాలు... ప్రజల మనోభావాలకు భిన్నంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం, కూటమి ఎన్నికల ప్రచార సంధానకర్తగా చంద్రబాబుకు పూర్తి బాధ్యతలు అప్పగించడం కూటమి ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేల విడిచి సాము చేస్తున్న చంద్రబాబు, తెలంగాణలో ఎలాంటి గుణాత్మక మార్పు తేగలుగుతారన్న దాని పై కూటమి నేతలు సరిగా అంచనా వేయలేకపోవడం ప్రతికూలంగా మారిందని అంటున్నారు. అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ ధోరణితో ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ముఖ చిత్రంగా మార్చేయడం కూటమిని దెబ్బతీసిందనే అభిప్రాయంతో పలువురు నాయకులున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పతాకస్థాయికి చేరాయన్న అతిఅంచనాలు కూటమి అవకాశాలను దెబ్బతీశాయని భావిస్తున్నా రు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో కూటమి విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కూటమిగా ఏర్పడగానే ఇక అధికారానికి వచ్చేసినట్లేననే అతివిశ్వాసం ప్రతికూలంగా మారిం దన్న అంచనాల్లో ఆయా పార్టీల నాయకులున్నారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కారణంగానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందనే ప్రాథమిక అంచనాపైనే కూటమి రాజకీయ వ్యూహా న్ని ఖరారు చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ప్రజలు, గ్రామీణుల మనోభావాలకు భిన్నంగా పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు, నిరుద్యో గ యువత భావాలు, అభిప్రాయాలనే కూటమి నేత లు ప్రామాణికంగా తీసుకోవడం కూడా దెబ్బతీసిందంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అందుతున్న ప్రయోజ నాలపట్ల ఎలాంటి అభిప్రాయం, వైఖరితో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా భారీ ఓటమికి కారణమైందనే అభిప్రాయం ప్రజాఫ్రంట్ నేతల్లో వ్యక్తమవుతోంది. -
సీఈసీ ముందు పరేడ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మోసాలు, ఎన్నికల అధికారుల తీరును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)దృష్టికి తీసుకెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయించాలని యోచిస్తోంది. ప్రభుత్వం రద్దయిన నాటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విన్నవించినా పట్టించుకోలేదని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికొచ్చింది. శుక్రవారం గాంధీభవన్లో ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్ సమీక్షించింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జీవన్రెడ్డి, దాసోజు శ్రవణ్, ప్రేమ్సాగర్రావు, ఆరేపల్లి మోహన్, రమేశ్ రాథోడ్, తాహెర్బిన్, ఆత్రం సక్కు, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మూడు దశలుగా సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్తో పాటు ఇతర అంశాలపైనా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గం మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్ పూర్తి చేశారని, ఆ సమయంలో జరిగిన పోలింగ్ కన్నా కౌంటింగ్ సమయంలో చూపిన ఓట్ల శాతం ఎక్కువగా ఉందని ప్రేమ్సాగర్రావు వివరించారు. త్రిసభ్య కమిటీతో అధ్యయనం.. ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్ నేత ప్రేమ్సాగర్రావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మపురి, కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల స్థానాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా నమోదైన ఓట్లు, కౌంటింగ్ నివేదికలను ఈ కమిటీ తెప్పించుకుని అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలనలోకి వచ్చే అంశాలతో అవసరాన్ని బట్టి కోర్టులకు వెళ్లాలని నిర్ణయించింది. పోటీ చేసిన అభ్యర్థులందరితో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, న్యాయం చేసేలా ఒత్తిడి తేవాలని నేతలు భేటీలో నిర్ణయించారు. ఓట్ల గల్లంతుపైస్పందన కరువు... నర్సాపూర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం సమయానికి 8.83 శాతం పోలింగ్ జరగ్గా, సాయంత్రానికి 70 శాతం పోలింగ్ అయినట్లు చూపారని, ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం సమయం పట్టినా, అంత తక్కువ సమయంలో ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అర్థం కావట్లేదని సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. హైదరాబాద్లో 22 లక్షల ఓట్ల గల్లంతుపై ఎంత పోరాడినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, చివరికి క్షమాపణతో సరిపెట్టిందని వివరించారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని, వారెక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు అడ్డగించారని, అలాంటి నేతలకే 30 నుంచి 40వేల మెజారిటీలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తక్కువ మెజార్టీతో ఓడిన తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి వంటి నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోలేదన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్ కుమార్, ఇతర అధికారులు టీఆర్ఎస్ పార్టీకి పేరోల్ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వచ్చే పార్టమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిప్లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్ చెప్పారు. ఇది మిషన్ మాండేటరీ తప్ప పీపుల్స్ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్ చెప్పారు. -
తెలంగాణలో టీడీపీ బలంగా లేదు : చినరాజప్ప
సాక్షి, అమరావతి : తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడంతోనే 13 స్థానాల్లో పోటీ చేశామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఆయన స్పందించారు. ప్రజలు మంచోళ్లు, తెలివైన వాళ్లు కాబట్టే అభివృద్ధికి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ప్రజలు అదే విధంగా తీర్పును ఇస్తారని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
మహిళ మహిమ..
రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసి అఖండ విజయం నమోదు చేసిన టీఆర్ఎస్ పార్టీ విజయం వెనుక జిల్లా మహిళల పాత్ర కీలకంగా ఉందనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు పోలింగ్లో కూడా పురుషుల కన్నా అధికంగా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన కారణంగానే టీఆర్ఎస్ సునాయసంగా విజయం సాధించడంతోపాటు చాలాచోట్ల ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిద్దిపేట మహిళా ఓటర్లు కారుకు.. కేసీఆర్కు జై కొట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 ఓట్లు ఉన్నాయి. ఇందులో 4,25,463 ఓట్లు పురుషులవి ఉండగా.. వీరి కన్నా 3,982 ఓట్లు అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సఖి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు, అధికారులు, అక్కడ సహాయ సహకారాలు అందించే సిబ్బంది కూడా మహిళలనే నియమించారు. ఇలా జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మొత్తం 3827 ఓటర్లు ఉండగా.. ఇందులో 2801 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 66.5 శాతం అంటే 1850 మంది మహిళలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓట్లలో 65శాతం ఓట్లు టీఆర్ఎస్కు పోల్ కావడం మహిళలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉన్నారని స్పష్టం అవుతుంది. కాగా మహిళలు.. పురుషులకన్నా 1.5 శాతం ఎక్కువగా టీఆర్ఎస్కు వేయడం గమనార్హం. సంక్షేమ పథకాల ప్రభావం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మహిళా ఓటర్లను అత్యధికంగా ఆకట్టుకున్నాయని, అదే అభ్యర్థులకు శ్రీరామ రక్షగా నిలిచి భారీ మెజార్టీకి దారులు సుగమనం చేసిందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పథకాల పుణ్యమా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగాయి. వసతులు పెరిగాయి. దీని మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ లేనిదే ప్రసవం కానిరోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు అధికం కావడం విశేషం. దీంతో ప్రసూతి ఖర్చులు తగ్గాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి రూ.1,0116 అందచేసిన ప్రభుత్వం తీరును పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రుల భారం తగ్గింది. అది కూడా ఆడపిల్ల తల్లి పేరిట చెక్కులు పంపిణీ చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అదేవిధంగా వృద్ధ మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వడంతో సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు కొట్టిందని మహిళలు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతోపాటు, దుబ్బాక, హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్కుమార్లు ప్రతీ సభ, సమావేశం, రోడ్షోలతోపాటు, పది మంది మహిళలు ఎక్కడ కన్పిస్తే అక్కడ ఈ పథకాల గురించే వివరించిన తీరు మహిళా ఓటర్లపై ప్రభావితం చూపింది. పథకాలను ఆదరించారు మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేసింది. మహిళా సాధికారత కోసం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆసరా, ఒంటరి మహిలా, బీడీ కార్మికుల పెన్షన్లు మహిళలకు అందాయి. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని తీరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసమే మహిళలు టీఆర్కు పట్టం కట్టారు. – కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ, మెదక్ పథకాలకు ఆకర్షితులయ్యారు హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లే అధికం. ఇందులో అత్యధిక శాతం మంది టీఆర్ఎస్కు ఓటు వేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయనే విశ్వాసం మహిళల్లో బలంగా ఉంది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, పాలపై లీటర్కు రూ.4 సబ్సిడీ, సబ్సిడీతో బర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. నాకు భారీ మెజార్టీ రావడంలోనూ మహిళా ఓటర్లే కారణం. – వొడితెల సతీష్కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్ నా మెజార్టీలో మహిళా ఓటర్లే కీలకం మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి.. ఆగ్రహిస్తే కూలిపోతాయి. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు మహిళలు టీఆర్ఎస్కు అండగా ఉన్నారు. గత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా మహిళల పాత్ర చాలా కీలకం. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్కు మహిళలే అండగా నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్కు మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. నా మెజారిటీలోనూ వారి ఓట్లే కీలకం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక -
ఉమ్మడి ఆదిలాబాద్లో నోటాకు పెరిగిన ఓట్లు
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమకు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వచ్చిన నోటా ఓట్లు నియోజకవర్గం 2014లో 2018లో సిర్పూర్ 1,752 1,579 చెన్నూరు 1,609 2,135 బెల్లంపల్లి 769 2,598 మంచిర్యాల 1,472 1,394 ఆసిఫాబాద్ 2,829 2,715 ఖానాపూర్ 2,421 2,776 ఆదిలాబాద్ 850 1,149 బోథ్ 2,242 2,275 నిర్మల్ 1,360 1,367 ముథోల్ 1,791 2,267 మొత్తం 17,095 20,255 -
గెలిచారు.. ఓడారు..
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని అధికార, ప్రతిపక్షాల్లో ఒకవైపు మోదం, మరోవైపు ఖేదం నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం సగమే అయింది. జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ కూటమి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మథనంలో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర అన్ని జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ దాదాపు స్వీప్ చేసినట్టుగా ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే భద్రాద్రి జిల్లాలో మాత్రం సీన్ పూర్తి రివర్స్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ నాలుగు, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో మాత్రమే ‘కారు’కు డిపాజిట్ దక్కింది. ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ధరావత్తు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పినపాక, అశ్వారావుపేట, వైరా స్థానాల్లో గెలిచింది. ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్, సత్తుపల్లిలో టీడీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత కాలంలో వైరాలో గెలిచిన మదన్లాల్, అశ్వారావుపేట నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో గెలిచిన కోరం కనకయ్య, ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్కుమార్ టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్కు ఏడు స్థానాల్లో ప్రాతినిధ్యం లభించి జిల్లాలో మంచి బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచింది. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కూటమిని తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన మహా మహా నాయకులు ప్రజాతీర్పుతో మట్టికరిచారు. అయితే జిల్లాలో మాత్రం తీర్పు ఇందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల స్వయంకృతాపరాధమే ఓటమి పాలు చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ పోటీ నడిచింది. ఈ మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సమీపానికి వచ్చి ఓటమి చెందారు. సిట్టింగ్లకు నో చాన్స్.. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచిన వారందరూ కొత్తవారే. అయితే కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో గెలిచిన రేగా కాంతారావు గతంలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించినవారే. ఇల్లెందు నుంచి గెలుపొందిన బాణోత్ హరిప్రియ, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. హరిప్రియ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం కాగా, ఈసారి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మెచ్చా నాగేశ్వరారవు గతంలో టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా అదే పార్టీ నుంచి గెలుపొందారు. భద్రాచలం నుంచి గెలిచిన పొదెం వీరయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి భద్రాచలం నుంచి ఎన్నికయ్యారు. ములుగు టికెట్ సీతక్కకు ఇవ్వడంతో చివరి నిమిషంలో భద్రాచలం వచ్చిన వీరయ్య.. వారం రోజుల ప్రచారంతోనే విజయం సాధించడం విశేషం. మోదం.. ఖేదం.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీయగా, జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు పక్షాల్లోనూ మోదం, ఖేదం కలిగింది. ఓడినప్పటికీ ప్రభుత్వం అండతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు చెపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయోనని జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
ఖమ్మంలో.. నోటాకు మూడో స్థానం
ఖమ్మం, మయూరిసెంటర్: ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నంగా ఆలోచించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం కాదని నోటా వైపు మొగ్గు చూపారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్కుమార్, టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ఉప్పల శారద, బీఎల్పీ నుంచి పాల్వంచ రామారావు పోటీ చేయగా పోటీ అంతా టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే జరిగింది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్లు 2,06,428. మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్న పువ్వాడ అజయ్కుమార్ 1,02,760 ఓట్లు సాధించగా, నామ నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించారు. వీరిద్దరు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి నోటా నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచింది. నోటా దెబ్బకి బీజేపీ, బీఎల్పీ అభ్యర్థులు 4, 6 స్థానాలల్లో నిలిచారు. ఇక బీఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల అభ్యర్థులు సైతం కనీస ఓట్లను పొందలేకపోయారు. అయితే నోటాకు ఖమ్మం నియోజకవర్గంలో గతం కంటే ఈ దపా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1,408 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు సరైనవారు కాదని నోటాకు ఓటు వేయగా, ఈసారి 3,513 మంది నోటాను నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థులు సరైన వారు కాదని భావించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పలువురు నోటాను ఎంచుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 19 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎన్నిక ఎన్నికకు నోటాకు ఆదరణ పెరుగుతుంది. నోటాకు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దక్కడం లేదని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
ఇంకెవరు?
సాక్షి,సిటీబ్యూరో: సీఎం కేసీఆర్ నూతన కేబినెట్లో నగరం నుంచి నలుగురికి చోటు కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వారెవరు అన్నది సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గురువారం సీనియర్ నేత మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించి పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటుకు మరో నాలుగు రోజులుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో కేబినెట్లో చోటు కోసం నేతలు ఎవరికి వారుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దయిన కేబినెట్లో నగరం నుంచి మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్రెడ్డికి స్థానం కల్పించారు. తాజా కేబినెట్లో రంగారెడ్డితో కలుపుకుని ఇంకా నాలుగు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రంగారెడ్డిఉమ్మడి జిల్లా కోటాలో మేడ్చల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కూడా సీఎం కేసీఆర్ ముందస్తు నిర్ణయమేనని ప్రచారం జరగుతోంది. మల్లారెడ్డికి సీఎం కేసీఆర్తో పాటు యువనాయుడు కేటీఆర్తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసివచ్చే అంశం. ఇక సిటీకి చెందిన నాయిని నర్సింహారెడ్డిని మళ్లీ క్యాబినెట్లో కొనసాగించే అంశం సస్పెన్స్గా ఉంది. నాయినికి ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకా రెండేళ్లు ఉంది. కొత్త క్యాబినెట్లోనూ స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ నాయినిని తప్పిస్తే పార్టీ బాధ్యతలు లేదా శాసనమండలిలో ఏదైనా కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం లేకపోలేదని సన్నిహితులు భావిస్తున్నారు. మరోపక్క సికింద్రాబాద్, సనత్నగర్ల నుంచి విజయం సాధించిన పద్మారావు, తలసాని సైతం తమకు క్యాబినెట్లో చోటు ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ఒకరిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే ఆలోచన అధినేతకు ఉంటే క్యాబినెట్లో చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ సీనియర్లు అందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వస్తే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆమేరకు ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్గౌడ్, వివేకానంద్గౌడ్, అరికెపూడి గాంధీ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
పంచాయతీ’ పోరుపై టీజేఎస్ గురి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడ్రోజుల్లో కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
అసెంబ్లీలో తగ్గిన ‘యువ’ ప్రాతినిథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు. 56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్గఢ్లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్గఢ్లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్ గురువారం మధ్యాహ్నం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు శుభాకాంకలు తెలిపిన మోదీ.. ఆయన పరిపాలన చక్కగా సాగాలని ఆకాంక్షించారు. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లు గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
‘కేసీఆర్ను ఏ పార్టీలు విశ్వసించవు’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్ఎస్కు ఇదే చివరి ప్రభుత్వం’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావ్ విమర్శలు గుప్పించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయ ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందన్నారు. తాడు, బొంగరం లేని కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్ని ఏ పార్టీలు విశ్వసించవన్నారు. మజ్లీస్ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లీస్ని జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని కేసీఆర్ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని విమర్శించారు. దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు. -
కాంగ్రెస్ నేతల మౌనం
-
అందరివాడు
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో కారు జోరుమీద పరుగులు పెట్టింది. ఇక్కడ నివసిస్తున్న విభిన్న వర్గాలు ప్రజలూ కేసీఆర్కే జైకొట్టారు. సీమాంధ్రుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, రాజస్థానీలు, మైనార్టీలు..ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు టీఆర్ఎస్కు ఓట్లేసి తమ మద్దతు ప్రకటించారు. దీని ఫలితంగానే అభ్యర్థులు సైతం ఊహించని రీతిలో మెజార్టీలు దక్కించుకున్నారు. ప్రజా భద్రత, అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాల్లో వీరిని టీఆర్ఎస్ ప్రభుత్వం మెప్పించగలిగింది. అందుకే వీరంతా ఈ ఎన్నికల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు, సామాజిక కోణంలో విశ్లేషణలు చేసిన అనంతరం శివారు నియోజక వర్గాలన్నీ తమవైపు ఉంటాయని తెలుగుదేశం, కాంగ్రెస్పార్టీలు భావించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు. వారు నమ్ముకు న్న ఒకటి రెండు సామాజిక వర్గాలు తప్పితే మిగతా వారంతా కేసీఆర్ వైపే మొగ్గుచూపినట్లు ఓటింగ్ సరళిని చూసిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీటీడీపీకి పూర్తి ప్రాబల్యం ఉందని భావించి నందమూరి సుహాసినిని బరిలోకి దించితే...టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు ఏకంగా 41,049 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇందులో టీఆర్ఎస్ రెబల్గా బీఎస్పీ నుండి పోటీ చేసి హరీష్రెడ్డి సాధించిన 12,761 ఓట్లు కూడా కలిపితే మెజారిటీ భారీగా పెరిగిపోయింది. కూకట్పల్లిలో నందమూరి సుహాసినికి సామాజిక వ ర్గం బలంగా ఉన్న ఒక్క డివిజన్లో తప్పితే..మిగిలిన ఏ డివిజన్లోనూ ఓట్లు రాకపోవటం విశేషం. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూన వివేకానంద్కు సైతం 41,509 ఓట్ల మెజారిటీ వచ్చింది. శేరిలింగంపల్లిలోనూ అదే తీరు... శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ స్థానికులతో పాటు మెజారిటీ సీమాంధ్రులు, ఉత్తర, దక్షిణ భారతీయలు టీఆర్ఎస్కే జై కొట్టారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరికెపూడి గాంధీకి 44,295 ఓట్ల మెజారిటీ సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన నియోకజవర్గాల్లో ఇది కూడా ఒకటి. టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్కు చందానగర్ డివిజన్లోనే ఆధిక్యత రాగా, మియాపూర్ డివిజన్ ఓట్లకు సంబంధించిన ఒక్క రౌండ్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మిగిలిన డివిజన్లలో మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్ వైపే నిలిచారు. కారు వైపే ఇతర రాష్ట్రాల వాసులు మల్కాజిగిరి నియోజకవర్గంలో స్థిరపడ్డ తమిళ, మలయాళీ ఓటర్లు సైతం టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి వెంట నడిచారు. ఈ నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావుకు 73,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతిచ్చిన ఓటర్లు సైతం తాజాగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఇక కోర్సిటీకి వస్తే అంబర్పేట నియోజకవర్గం అనూహ్యంగా టీఆర్ఎస్ ఖాతాలో పడటం ద్వారా బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్కు గండిపడినట్లయింది. కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్కు భారీ ఓట్లు పోలయ్యాయి. ఇక ఉప్పల్ నియోజకవర్గంలోనూ కాప్రా సర్కిల్లో స్థిరపడ్డ సీమాంధ్రులు సైతం టీఆర్ఎస్కే మొగ్గుచూపినట్లు ఓటింగ్ సరళి తేల్చింది. కుత్బుల్లాపూర్లో భిన్నమైన తీర్పు.. కుత్బుల్లాపూర్లో సీమాంధ్రులు అధికంగా ఉంటారని, మహాకూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేసినా భిన్నమైన రీతిలో ఇక్కడి ప్రజలు తీర్పునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామాల్లో 21,294 ఓట్లు కా>ంగ్రెస్కు పోల్ కాగా, టీఆర్ఎస్కు 20,223 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ మండలంలో 1071 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ సాధించినట్లైంది. అయితే ఇక్కడ అతిగా ఆశపెట్టుకున్న మహాకూటమి నేతలకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. సరిసమానంగా నువ్వా.. నేనా..అన్నట్లుగా దూసుకు రావడంతో ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే కొంపల్లి గ్రామంలో మహాకూటమికి స్వల్ప మెజార్టీ వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండడం 90 వేల పైచిలుకు ఓట్లల్లో అధికంగా కాంగ్రెస్ రాబట్టుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు. 8 డివిజన్లలో అన్ని వర్గాల వారు టీఆర్ఎస్ను ఆదరించడంతో ఏకంగా 1,13,238 ఓట్లు పోల్ కాగా, మహాకూటమికి 75,512 మాత్రమే ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్ 41,500 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. బస్తీల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 30 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ స్వల్పంగా పెరిగినా అది టీఆర్ఎస్కే లాభించింది. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపా యని ఫలితాల సరళి స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని బస్తీల్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొం దుతున్న లబ్ధిదారులు దాదాపు 50 నుంచి 60 వేలకుపైగా ఉండటంతో టీఆర్ఎస్కు లాభించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు తోడుగా గతంలో మంత్రిగా పని చేసి, మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండటంతో దానం నాగేందర్కు జనం పట్టంకట్టారు. పకడ్బందీ వ్యూహం.. కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు రాహుల్తో పాటు చంద్రబాబు, సీపీఐ నారాయణ, కోదండరాం, తదితరులు మహాకూటమి తరపున దాసోజు శ్రవణ్కు మద్దతుగా ప్రచారం చేసి టీఆర్ఎస్ను అడ్డుకోవాలని యత్నించారు. దీనికి ధీటుగా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. నాగేందర్కు ప్రతి వీధిలోను పరిచయాలు ఉండటం, ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగారు. సమయం చాలా తక్కువగా ఉన్నా అలుపు లేకుండా ప్రచారం నిర్వహించారు. పార్టీ తరపున కేటీఆర్ ఒక్కరే ప్రచారానికి రాగా ఆ ఒక్క ప్రచారమే నాగేందర్ను గట్టెక్కిందని చెప్పాలి. జరగని ఓట్ల బదిలీ.. ఖైరతాబాద్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఓట్లు ప్రభావితం చేస్తారని అంతా భయపడ్డారు. వీరికి తోడు సీపీఐ, టీజేఎస్ కూడా ఉండటం అవతల బీజేపీ మరింత బలంగా ఉండటంతో టీఆర్ఎస్కు గడ్డుకాలమేనని భావించారు. తీరా టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో సహజంగానే టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ అవుతాయేమోనని ఆ పార్టీ వర్గాలు భావించాయి. ఎక్కడా ఈ ఓట్ల బదిలీ కాలేదని తాజాగా వెలువడిన ఫలితాలతో తేట తెల్లమైంది. బస్తీల్లో ప్రజాకూటమికి అనుకున్నన్ని ఓట్లు పడలేదని సమాచారం. -
బీజేపీలో సంజయ్కి అత్యధిక ఓట్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్లో పాయ ల్ శంకర్కు 47,444 ఓట్లు, ముథోల్లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్సిం గ్కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. -
ఫ్యాన్సీ.. సీరియల్.. సేమ్!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన ఓట్లు వచ్చాయి. మరికొందరికి ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సీరియల్గా వచ్చినట్లు తేలింది. ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చిన అభ్యర్థులు సైతం ఉన్నారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన వారిలో అత్యధికులు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఇలా.. ఖైరతాబాద్: బీజేపీ తరఫున పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు వచ్చాయి. జాతీయ మహిళా పార్టీ అభ్యర్థిని దాన లక్ష్మికి 99 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె.నవీన్కుమార్కు 77 ఓట్లు, న్యూ ఇండియా పార్టీకి చెందిన అమృత్రాజ్కు 66 ఓట్లు వచ్చాయి. కార్వాన్: బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ రహిముద్దీన్కు 363, తెలంగాణ ఇంటి పార్టీకి చెందిన నర్సింగ్రావుకు 200 ఓట్లు వచ్చాయి. అలానే సోషలిస్ట్ పార్టీకి చెందిన సార్వత్కు 155, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీకి చెందిన ఖతీజాకు 154 చొప్పున పోలయ్యాయి. ఎల్బీనగర్: ఇండిపెండెంట్లు జగన్మోహన్ పోలే, అనుగు సాయికృష్ణలకు 74, 73 చొప్పున, రాంబాబురెడ్డి, ప్రవీణ్గౌడ్లకు 61, 60 చొప్పున, దేవ, శ్రీనివాసాచారిలకు 59 చొప్పున ఓట్లు వచ్చాయి. మలక్పేట: అన్నా వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన సయ్యద్ అన్వర్, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థి వెంకట రమణలకు 118, 117 ఓట్లు, ఆప్ అభ్యర్థి చిన్న లింగానికి 100, ఇండిపెండెంట్లు గోపాల్, రమేష్లకు 80 చొప్పున ఓట్లు వచ్చాయి. మేడ్చల్: స్వర్ణ్ భారత్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు రాహుల్ పండిట్, దుర్గా ప్రసాద్లకు 140 చొప్పున, ఇండిపెండెంట్లు వేద్, నారాయణలకు 137, 136 ఓట్లు, దీపక్, కాంతారెడ్డిలకు 134, 133 చొప్పున, సతీష్కుమార్కు 100 ఓట్లు నమోదయ్యాయి. ముషీరాబాద్: యువ పార్టీ, ఇండియా ప్రజా బంధు పార్టీలకు చెందిన చందు, రాజ్కుమార్లకు 147, 146, అన్నా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఫాతిమా భానుకు 100, న్యూ ఇండియా పార్టీకి చెందిన మహబూబ్ అలీకి 77, బహుజన రాష్ట్ర సమితి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన ప్రవీణ్కుమార్, నాగేందర్లకు 76 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇండిపెండెంట్ సోమయాజులు, జన వాహిని పార్టీ అభ్యర్థి నవాబ్లకు 53 ఓట్ల చొప్పున వచ్చాయి. నాంపల్లి: బీజేపీ అభ్యర్థి డి.కరుణాకర్కు 11,622 ఓట్లు పడ్డాయి. సీపీఐఎం అభ్యర్థి లక్ష్మీకుమార్కు 400, ఇండిపెండెంట్ అజీమ్కు 88, స్వతంత్ర అభ్యర్థులు సంతోష్, యూసుఫ్లకు 82 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్కు 1,54,500 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం గౌడ్కు 1,13000 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్లు బిక్షపతికి 727, భూపాల్, రాములుకు 338, 337 చొప్పున, మరో స్వతంత్ర అభ్యర్థి రాఘవకు 101 ఓట్లు లెక్క తేలాయి. సనత్నగర్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు 66464 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ దేవేందర్కు 200, బహుజన రాష్ట్ర సమితి అభ్యర్థి అశోక్ కుమార్కు 66 ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్: సీపీఐఎం అభ్యర్థి అనిల్కుమార్కు 555, ఇండిపెండెంట్ రజనికి 444, మోహన్కు 232, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ఆర్కు 88 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కంటోన్మెంట్: స్వతంత్ర అభ్యర్థి బి.రాజుకు 88 ఓట్లు పడ్డాయి. శేరిలింగంపల్లి: శివసేన, అన్నా వైఎస్సార్ సీపీల తరఫున పోటీ చేసిన కేశవులు ఖాలీద్లకు 212 చొప్పున, దళిత్ బహుజన్ పార్టీ అభ్యర్థి కల్పన, ఇండిపెండెంట్ శివప్రసాద్లకు 211 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజుకు 151 ఓట్లు వచ్చాయి. ఉప్పల్: బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వై.పరమేశ్వర్కు 1211, ది ఫ్యూచర్ ఇండియా పార్టీ అభ్యర్థి అనిల్కు 343 వచ్చాయి. ఆలిండియా సమత పార్టీకి చెందిన ప్రకాష్, ఇండిపెండెంట్ మహేందర్ కుమార్లకు 114 చొప్పున, న్యూ ఇండియా పార్టీ, జై మహాభారత్ పార్టీల అభ్యర్థులు బాలరాజు, యుగంధర్లకు 106 చొప్పున ఓట్లు పడ్డాయి. యాకుత్పురా: ఎంబీటీ అభ్యర్థి ఫర్హత్ ఖాన్కు 21222 ఓట్లు, శివసేన అభ్యర్థి మహేష్కుమార్కు 323 ఓట్లు, ఎంసీపీఐ అభ్యర్థి హాజీ పాషాకు 131, తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి ఉస్మాన్కు 121, ఇండిపెండెంట్ సుదర్శన్కు 99 నమోదయ్యాయి. గోషామహల్: అఖిల భారతీయ ముస్లిం లీగ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు ఖాజా ఖాన్, రాజులకు 103, 102 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి అభిమన్యు యాదవ్కు 99, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి రియాజుద్దీన్కు 88 ఓట్లు నమోదయ్యాయి. -
సగం ఓట్లు టీఆర్ఎస్కే
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 22,25,04 ఓట్లు ఉండగా, 12,40,441 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ప్రజాకూటమి, బీజేపీ, బీఎస్పీ చెందిన 17 మంది అభ్యర్థులకు 11,81,665 ఓట్లు వచ్చాయి. జిల్లాలో మిగిలిన çస్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలకు చెందిన 115 అభ్యర్థులకు 58,776 ఓట్లు పడ్డాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి 6,63,774 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ప్రజాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ )కి 3,65,245 ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులకు 1,92,334 ఓట్లు రాగా, ఉప్పల్, కూకట్పల్లి నుంచి పోటీ చేసిన టీడీపీకి 1,39,165 ఓట్లు, మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన టీజేఎస్కు 34,219 ఓట్లు వచ్చాయి. ఐదు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 1,12,024 ఓట్లు సాధించింది. మేడ్చల్, కూకట్పల్లి నుంచి బరిలో నిలిచిన బీఎస్పీకి 38,590 ఓట్లు రాగా, మేడ్చల్ నుంచి బరిలోకి దిగిన నక్క ప్రభాకర్గౌడ్ 25,829 ఓట్లు పొంది మూడవ స్థానంలో నిలిచారు. కూకట్పల్లి నుంచి బరిలో నిలిచిన హరీష్ చందర్ రెడ్డికి 12,761 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇద్దరూ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన వారే కావటం గమనార్హం. జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో 132 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన 17 మంది మినహా, మిగిలిన 115 మంది స్వతంత్ర, ఇతర చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలో నోటాకు 14,682 ఓట్లు పోలవడం గమనార్హం. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా 163 ఉన్నాయి. నియోజకవర్గాల వారిగా ప్రధాన పార్టీలు పొందిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. -
ఏం గిఫ్టిస్తారో..!
సాక్షి, అమరావతి: ‘నాకేదో గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తెలుగువారు ఎక్కడున్నా వెళ్లి పనిచేశా. ప్రజల కోసం పనిచేస్తున్న నాపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తా...!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణకు వచ్చి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురువారం ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయంపై చంద్రబాబు బయటకు వచ్చి చేసిన ప్రకటన ఇదొక్కటే కావడం గమనార్హం. కూటమి దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు మౌనముద్ర దాల్చారు. అనుకూలమైతే హడావుడి... లేదంటే పచ్చమీడియాకు లీకులిచ్చి గప్చుప్ తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి పాలు కావడంపై తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు ఇవ్వకపోయినా వారి విజయాన్ని తనకు ఆపాదించుకొని చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోవడం తెలిసిందే. వారి విజయానికి చంద్రబాబే కారణమంటూ మంత్రులు, టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు. కానీ... తెలంగాణలో కాంగ్రెస్ అధినేతతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నా... హైదరాబాద్లో వ్యక్తిగతంగా రోడ్డు షోలు నిర్వహించినా... కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ‘నగదు’ సమకూర్చినా... ఘోరంగా ఓటమి చెందడంపై చంద్రబాబు నోరు విప్పకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు హుందాగా ఓటమిని ఒప్పుకొని ఓటర్ల మనోగతాన్ని ఆహ్వానించకపోవడంపై నాయకుల్లో చర్చ జరుగుతోంది. బాబును తిరస్కరించిన తెలంగాణ ప్రజలు చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ఎన్నికల విషయాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై ప్రకటనలు చేయడంపైనా విశ్లేషకుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తాను మునిగి అధఃపాతాళానికి పడిపోవడమే కాకుండా ‘మహాకూటమి పార్టీలనూ చంద్రబాబు నిండా ముంచేశారు. కూటమికి రూ.వందల కోట్ల ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు ఈ ఎన్నికల్లో వారం రోజులకు పైగా తెలంగాణాలోనే ఉండి, కూటమికి స్టార్ క్యాంపయినర్గా వ్యవహరించి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. దాదాపు రూ.1,200 కోట్ల వరకు ఏపీ నుంచి తెచ్చిన మొత్తాన్ని తెలంగాణ ఎన్నికల్లో బాబు వెదజల్లారన్న ఆరోపణలున్నాయి. ప్రజాకూటమి గెలిస్తే అది చంద్రబాబు గెలుపే అన్నట్లుగా పచ్చమీడియా ప్రచారం చేసింది. లగడపాటిని రంగంలోకి దించి కూటమికి 75 స్థానాలు వస్తాయని, అదంతా కాంగ్రెస్ చంద్రబాబుతో కలవడం వల్లేనని దొంగ సర్వేలను తెరపైకి తెచ్చారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబును, ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు ఛీత్కరించారు. ఈ పరిణామాలన్నిటికీ కారణం తానే అయినా అదేదీ తనకు సంబంధం లేనట్లుగా చంద్రబాబు ఇపుడు వ్యూహాత్మకంగా మౌనం దాల్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను ఎక్కడా ప్రచారం చేయని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఓటమిపై ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని ముక్తసరిగా పేర్కొన్నారు. కర్నాటకఎన్నికల్లో ఎంతో హడావుడి కర్నాటకలో ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ప్రచారం నిర్వహించలేదు. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లు హోరాహోరీ పోరాటం చేశాయి. ఏ పార్టీకీ మెజార్టీ రాని పరిస్థితుల్లో బీజేపీ, జేడీఎస్లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఉత్పన్నమయ్యాయి. చివరిలో కాంగ్రెస్ సీఎం పదవిని ఆఫర్ చేయడంతో జేడీఎస్ అటువైపు మొగ్గి ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబునాయుడు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు తన వల్లనే అయిందని, తన పిలుపు వల్లనే బీజేపీని అక్కడి ప్రజలు ఓడించారని ప్రెస్మీట్లు పెట్టి చెప్పడమే కాకుండా పచ్చమీడియా ద్వారా ఊదరగొట్టించారు. తనకు సంబంధం లేని కర్నాటక ఎన్నికలపై తెగ హడావుడి చేసిన చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణలో ఓటమిపై పార్టీలో విశ్లేషణ చేయించడం కానీ, ఎందుకు ఇలా అయిందనే అంశంపై కనీసం చర్చించడం కూడా చేయకపోవడంపై పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు బేలచూపులు చూడడంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో చర్చోపచర్చలు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనా తప్పకుండా ఉంటుందనే చర్చ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో సాగుతోంది. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింటుందనే అంతర్మథనం పార్టీ నేతల్లో కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ ఎన్నికల్లో అదే అంశం ప్రతిబింబించిందని అంతర్గతంగా వారు అంగీకరి స్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి చెందడంపై ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు పండగ చేసుకున్నంత పని చేశారని, పలుచోట్ల బహిరంగంగానే బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇది తెలుగుదేశంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ ఫలితమే పునరావృతం అవుతుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులతో పాటు టీడీపీలోని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
‘సైలెంట్ సపోర్ట్’ను గుర్తించలేకపోయాయి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్ సపోర్ట్’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలున్నా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ తదితర అంశాలన్నీ కలిసి కేసీఆర్ గెలుపునకు కారణమయ్యాయని బుధవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పింఛన్లు, రైతుబంధు, గొర్రె ల పంపిణీ తదితర పథకాలు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్కు గండికొట్టాయని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం, కూటమి విధానాలు, తదితర అంశాలపై ప్రచారానికి 10– 15 రోజుల సమయం లేకపోవడం కూటమి ఓటమి కారణాలుగా చెప్పారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా తగ్గిపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘ఫలితాలను అంచనా వేయలేకపోయాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ ఎన్నికల ఫలితాలను తాము అంచనా వేయలేకపోయామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయ ణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, పలు సంక్షేమ పథకాలు లాభించడంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగలిగారన్నారు. అందుకే గతంకంటే టీఆర్ఎస్కు ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, కూటమి కుదిరినా పై స్థాయిలో నాయకులు కలసినట్టు కింది స్థాయిలో ప్రజలు కలవలేకపోయారన్నారు. కూటమిలో ఎక్కడ తప్పులు జరిగాయో పరిశీలించుకొని ముందుకెళ్తామన్నారు. -
ఎందుకీ పరిస్థితి... మారదా ఈ స్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రయత్నం చేసినా అంత దారుణంగా దెబ్బతినడానికి గల కారణాలపై బీజేపీ ఆలోచనల్లో పడింది. హైదరాబాద్తోపాటు జిల్లాల్లోనూ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావించినా ఫలితం అందుకు విరుద్ధంగా రావడంతో పార్టీ మొత్తం గందరగోళంలో పడింది. హైదరాబాద్లోని ఒక్క గోషామహల్ మినహా ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితికి గల కారణాలను పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక మంది ప్రచారం చేసినా కేవలం ఒకే ఒక్క స్థానానికి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో విశ్లేషిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అధ్యక్షుడిగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్న అపవాదు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, చివరి క్షణంలో టికెట్లు ఇచ్చినా ప్రచారానికి సమయం సరిపోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ సెంటిమెంట్పైనే జరిగాయని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, కూటమిలో ఆయన పార్టీ ఉన్న కారణంగా ప్రజల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటన్న అభిప్రాయం వచ్చిందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్సహా ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలు కావడంతో బుధవారం పార్టీ ముఖ్యనేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంతో కార్యాలయం బోసిపోయినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజీనామా చేస్తారన్న వదంతులు వచ్చాయి. అయితే వాటిని పార్టీ ముఖ్య నేత ఒకరు కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఉండదన్నారు. స్థానాలను పెంచుకోకపోగా, ఉన్న స్థానాలను కాపాడుకోలేని పరిస్థితి వల్ల ఐసీయూలోకి వెళ్లినట్లు అయిందని, దానినుంచి బయటకు రావాలంటే కొంత సమయం పడుతుం దని ఓ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు. బీజేపీలో సంజయ్కి అత్యధిక ఓట్లు సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్లో పాయ ల్ శంకర్కు 47,444 ఓట్లు, ముథోల్లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్సిం గ్కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేసి ఆదరించిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిరంతరం కృషి చేస్తూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ముషీరాబాద్ నుంచి గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ, ముషీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానన్నారు. -
అవకాశం కోల్పోయాం...‘అధ్యక్షా’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి... వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్ఎస్లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది. 1983 నుంచి మారిన పరిస్థితి... 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి. -
90కి చేరిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ బుధవారం కేటీఆర్ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కోరుకంటి చందర్ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కేసీఆర్ మా నాయకుడు: చందర్ ‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్ అన్నారు. -
టీజేఎస్లో ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని సొంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రజాకూటమి పేరుతో వెళ్లడం, పార్టీకి ఒక్కసీటు రాకపోగా, పోటీ చేసిన 8 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనల్లో పడింది. పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? వద్దా? అన్న గందరగోళం నెలకొంది. సొంతంగా పోటీ చేస్తే ఎంతమేరకు నెగ్గుకురాగలుగుతాం, సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం లేని పార్టీని ఎలా ప్రజల వద్దకు చేర్చాలన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కంటే కాంగ్రెస్లో విలీనం చేస్తే సరిపోతుందన్న వాదనలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల్లోనూ బోర్లా పడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్తో కలిసినా సరిపోయేదని, అందులోకి టీడీపీ రావడం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల కారణంగా ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తినాల్సి వచ్చిందన్న భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో అయినా తమకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉండేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు అయినా ఉంటే అది టీజేఎస్కు ఎంతో బలంగా ఉండేదని, దాంతో పంచాయతీ ఎన్నికలకు వెళితే పార్టీ బలోపేతం అయ్యేదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీజేఎస్ ఎలా ముందుకు సాగాలన్న భవిష్యత్తు కార్యాచరణపై మరో వారంలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోదండరాం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
‘లోక్సభా’ టీఆర్ఎస్దే!
సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే లోక్సభ ఎన్నికలలోనూ కారు జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గానూ.. 14 స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం లభించగా, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ (కూటమి) స్వల్ప ముందంజలో ఉంది. ఇక, యథావిధిగా హైదరాబాద్ లోక్సభ పరిధిలో 4.5 లక్షల పైచిలుకు ఓట్లతో మజ్లిస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, జాతీయ పార్టీగా బీజేపీ పరిస్థితిని ఈ ఎన్నికలు పాతాళంలోకి నెట్టాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిం చడం లేదు. అయితే, జాతీయ అంశాల ఆధారంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతం జరిగితే తప్ప 14 చోట్ల టీఆర్ఎస్, 1–2 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లిస్ గెలుపు దిశగా పయనిస్తాయని అసెంబ్లీ ఫలితాలు చెబుతున్నాయి. రెండంటే రెండే! అసెంబ్లీ ఎన్నికలలో పేలవ ప్రదర్శన చూపిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పోలయిన ఓట్లను పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది కూడా గుడ్డిలో మెల్ల అనే రీతిలో ఖమ్మంలో 38వేలు, మహబూబాబాద్లో 9వేల ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ పోలయ్యాయి. ఇక, కొంత మెరుగ్గా భువనగిరిలో 58 వేలు, పెద్దపల్లిలో 88వేలు, నల్లగొండ లోక్సభ పరిధిలో లక్ష ఓట్లు టీఆర్ఎస్ కన్నా వెనుకంజలో ఉంది. ఏ లెక్కన చూసినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనీసం టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కూడా టీఆర్ఎస్ మరింత మెరుగైన ప్రదర్శన కనపర్చింది. ఈ రెండు చోట్లా.. కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లే పోలయ్యాయి. పాపం.. బీజేపీ బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఏ ఒక్క లోక్సభ స్థానం పరిధిలో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల కన్నా తక్కువగా కేవలం 1.72లక్షల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి. మిగిలిన స్థానాల్లో పరిశీలిస్తే ఆదిలాబాద్, చేవెళ్ల, హైదరాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రమే లక్ష ఓట్ల కన్నా ఎక్కువ బీజేపీకి పోలయ్యాయి. ఇక, అత్యల్పంగా ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి బీజేపీకి 9,764 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. -
దేశమంతా రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సాహసోపేతంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త ఫ్రంట్ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసి.. రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని రైతులు, పేదలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి స్థితిగతులను మార్చే లక్ష్యంతోనే జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిని ప్రారంభించనున్నామని.. ఈ ప్రయత్నం కచ్చితంగా విజయవంతం అవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనులు కొనసాగుతున్న దుమ్ముగూడెం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేసి సాగునీటిని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార (పరపతి) పెరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గెలిస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు ‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రాష్ట్రాల పరిస్థితి దిగజారుతోంది. చిన్న చిన్న అంశాల్లోనూ కేంద్రానికిదే అధికారం. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీ వంటి పరిశోధన సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటే పర్వాలేదు. కేంద్రం వద్ద పరిధికి మంచిన అధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సహకార సమాఖ్య అంటున్నారు. కానీ చేతల్లో మాత్రం వికేంద్రీకరణను మరింత కేంద్రీకృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ పద్ధతి నశించాలి. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది. నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. దీని కోసం ఏటా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నా దగ్గర అజెండా ఉంది. లెక్కలున్నాయి. రైతుల పరిస్థితి మారుస్తాం’ చెవ్స్ పండించలేకపోయా! ‘దేశంలో కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. పురుగు మందులు అని, ఇంకోటని మెలికపెట్టి తిరస్కరిస్తారు. కట్ ఫ్లవర్ పంటలో ప్రపంచవ్యాప్తంగా 90% ఇజ్రాయిల్లోనే సాగు చేస్తున్నారు. చెవ్స్ పంట పండిద్దామనుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోలేమని తెలిసింది. దేశంలో అన్ని ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రాహుల్గాంధీ ఏదో రాష్ట్రానికి వెళ్లి క్వింటాల్ ధాన్యానికి రూ.2500 అన్నారు. కనీస మద్దతు ధర దేశమంతా ఒకేలా ఉండాలి. లేకుంటే తక్కువ ధర రాష్ట్రంలోనే వ్యాపారులు ఎక్కువ కొంటారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు. రాష్ట్రానికో విధానం చెబుతారు. ఓట్లు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా మాట్లాడుతారు. సీపీఎస్పై ద్వంద్వ విధానం జాతీయ పార్టీలు పచ్చి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎస్ విధానం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. ఇక్కడ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్లే తీసేయాలి అని డిమాండ్ చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్ను రద్దు చేయదు. ఇక్కడ బీజేపీ వాళ్లు రద్దు చేయాలని అంటారు. జాతీయ పార్టీల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు నడుంబిగించాలి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను ప్రాణానికి తెగించి ముందుకు సాగుతున్నా. కేంద్ర ప్రభుత్వాలవి చెత్త విధానాలు. యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను తీసుకొచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అందుకే వీటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వచ్చింది’ మేనిఫెస్టో 100% అమలుచేస్తాం ‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. రైతుబంధు, రైతుబీమా పథకాలను మేం మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమాతో ఎలాంటి పైరవీలు లేకుండానే పేద రైతులకు సాయం వస్తోంది. ప్రజల అవసరాన్ని బట్టి ఇలాంటి 76 అంశాలను అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మంది పరీక్షలు చేయించుకున్నారు. అమ్మ ఒడికి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాన్పుకు అయ్యే రూ.30 వేల ఖర్చు తప్పుతోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్య వివాహాలు లేకుండాపోయాయి. ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎరువులకు రైతులు ఇబ్బందిపడే రోజులు పోయాయి. గోదాములు లేక ఈ సమస్య అని గుర్తించాం. నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 25 లక్షల టన్నుల సామర్థ్యం పెంచాం. అన్ని రంగాలలో నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. ఉద్యమ పార్టీగా గత ఎన్నికలలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సరిగా చేసి చూపినం. ప్రజలు అన్ని చూసి తీర్పు ఇచ్చారు’ టీఎస్పీఎస్సీతో మైనస్ ‘మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ఇంటికో ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు. నిరుద్యోగులను రెచ్చగొంటేందుకు కొందరు డ్రామాలు చేశారు. ఏటా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఎలా? టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లు ఇలాగే చేసుంటే.. 60 లక్షల ఉద్యోగాలు అయ్యేవి. ఇదో ఎన్నికల నినాదంగా మారింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన పార్టీలే అధికారం పోయాక ధర్నాలు చేస్తాయి. మేం అలా కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను 100% భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యేలా కృషి చేస్తాం. టీఎస్పీఎస్సీ మాకు మైనస్ అయ్యింది. పనికిమాలిన పనులు ముందు పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసింది. అందుకే చివరికి కొన్ని పోస్టులను తీసి ఆయా శాఖలే భర్తీ చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ప్రైవేటులోనూ ఎక్కువ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’ 33 జిల్లాలు చేస్తాం ‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్వీయ పన్నుల ఆదాయం వృద్ధిరేటు 29.90%గా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దీంట్లో సగం కూడా లేదు. అప్పులు ఎలా చెల్లించాలో మాకు తెలుసు. సాధారణంగా పెరిగేవి తప్ప ప్రత్యేకంగా పన్నులు పెంచం. వచ్చే నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. రుణాల కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లిస్తాం. దీని వల్ల అదనంగా రూ.1.30 లక్షల కోట్ల రుణం పొందే అర్హత వస్తుంది. అన్నింటిపైనా అవగాహన ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా.. అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుతో వచ్చే జులైలో నీళ్ళు అందిస్తాం. 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. అప్పటికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90%పూర్తవుతుంది. ప్రాజెక్టుల వద్దకు నేనే స్వయంగా వెళ్లి పరిశీలిస్తా. తెలంగాణ అన్ని రాంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్ర పతార (పరపతి)పెరిగింది. రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్ఈసీ చైర్మన్ ఫోన్ చేశారు. తాజా తీర్పుతో ప్రజలు ఈ పతారను మరింత పెంచారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరుగుతుంది’ క్రమంగా అధికారాల బదిలీ ‘స్థానిక సంస్థలను బలోపేతం చేసి క్రమంగా అధికారాలను వికేంద్రీకరిస్తాం. గత ప్రభుత్వాలు ఈ సంస్థల అధికారాలను ఒకొక్కటిగా వెనక్కి తీసుకున్నాయి. పంచాయతీ సమితి పరిధిలోనే అన్ని జరిగేవి. ప్రాథమిక పాఠశాలలో టీచర్లను, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించే అధికారాలు బీడీవోలకు ఉండేవి. బీడీవోలను తొలగించారు. అన్ని ఆధికారాలను తీసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు వస్తేనే జిల్లా పరిషత్లకు పనులు. వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి’ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగభృతిని చెల్లిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. ఈలోపు వరుసగా పంచాయతీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మధ్యలో అమలు చేయడం వీలు కాదు. నిరుద్యోగుల భృతి అర్హతలపై నియమావళి రూపకల్పన కోసం కమిటీని నియమిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం పథకాన్ని అమలు చేస్తాం. మా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి నిరుద్యోగభృతి చెల్లింపు జరుగుతుంది’ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’ కోఠి చౌరాస్తాలో అమ్ముతరు ‘ప్రభుత్వాధినేత గట్టిగా ఉండాలి. మన ప్రజాస్వామిక వ్యవస్థ అలాగే ఉంది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకమే. నేను కొంచెం ఎక్కువ కట్టిక ఉంటా. అట్ల లేకపోతే.. సర్కారు కాదు సర్కస్ అయితది. గట్టిగా ఉండకపోతే నన్ను కోఠి చౌరస్తాలో రూపాయి పావలకు అమ్ముతరు. నేను గట్టిగ ఉండడం వల్లనే.. మా పాలనలో అవినీతికి తావులేదు. నేనెవర్నీ కలవడం లేదనేది సరికాదు. రాజ్దీప్ సర్దేశాయ్, ప్రణయ్రాయ్ వంటి మీడియా ఎడిటర్లు ఫోన్లు చేసి కలుస్తామని అడుగుతారు. వారిని పిలిచి ఊరికే ముచ్చట చెప్పి పంపేంత సమయం నాకు లేదని చెప్పా. ప్రజల కోసం ఏం చేయాలనే దానికే ప్రాధాన్యత ఇస్తా. కంటివెలుగు వంటి పథకాలు అమలు చేస్తుంటే ప్రతికూల మీడియాకు అవేవి కనిపించవు. సమాచార శాఖ నా దగ్గరే ఉంటది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను విధానంపై అధ్యయనం చేయిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’ 106 సీట్లు వస్తాయనుకున్నా! అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో 96 నుంచి 106 సీట్లు వస్తాయని అనుకున్నా. ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలొస్తాయి. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.’అని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశా. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై చర్చించాం. దిగ్విజయ్సింగ్తో ఆ విషయం మాట్లాడాలని సోనియా అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్సింగ్ను కలిశా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మీకిస్తే ఎలా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్కు వచ్చి పార్టీ నేతలతో చర్చించాం. ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేద్దామని అందరు అన్నారు. అదే నిర్ణయించుకున్నాం. మొండిగా ఎన్నికల్లో పోరాడాం. ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తితో మళ్లీ గెలిపించారు’కేసీఆర్ అన్నారు. -
సెంటిమెంట్ ముందు నిలవలేకపోయాం
సాక్షి,హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సెంటిమెంట్ రాజకీయాల ముందు ప్రజా కూటమి నిలవలేకపోయిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విశ్లేషించారు. కూటమి ఎజెండా బాగా ఉన్నా, వాటిలోని అంశాలను కేసీఆర్ మొదట విమర్శించినా ఆ తర్వాత పెన్షన్లు, నిరుద్యోగ భృతికి మరో రూ.16 కలిపి టీఆర్ఎస్ తమ వాగ్దానాలనే కాపీ కొట్టిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ప్రచారంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను టీఆర్ఎస్ తెరమీదకు తీసుకొచ్చిందని, దీంతో సెటిలర్లంతా టీఆర్ఎస్ పక్షానే నిలిచారన్నారు. మఖ్దూంభవన్లో బుధవారం ఆ పార్టీ నాయకులకు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలకు వామపక్షాలకు ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటులో జాప్యమే ముంచింది కూటమి సరైన సమయంలో ఏర్పడినా, సీట్ల సర్దుబాటులో జాప్యం, సమన్వయలోపాల కారణంగా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఖమ్మం జిల్లా మాత్రమే ప్రజాకూటమికి అండగా నిలిచిందని, మిగతా జిల్లాల్లో భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కుదరలేదన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్కు సగానికి సగం సీట్లు తగ్గుతాయని తాము అంచనా వేసినా సెంటిమెంట్ రాజకీయాలతోనే కేసీఆర్ విజయం సాధించారన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగిందని, వీటి నియంత్రణలో ఈసీ విఫలమైందన్నారు. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నందున, ప్రజాకూటమి మరింత సమన్వయంతో బలోపేతం కావడం ద్వారా కేసీఆర్ ఏకపక్ష విధానాలకు చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కలిసి పోటీచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని, తాము కాంగ్రెస్ కూట మిలో, బీఎల్ఎఫ్ కూటమిలో సీపీఎం పోటీచేశాయన్నారు. సీపీఐకు ఇచ్చిన 3 సీట్లలో మిత్రధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ విఫలమైందని సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. -
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి.. తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్లో కేబినెట్లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్.. సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్ఆర్టీసీకి చైర్మన్గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. -
నెక్ట్స్ ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాభవం తర్వాత ఏం చేద్దామన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితం కావడం, హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో రానున్న ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం క్లిష్టతరంగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై పార్టీలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం టీపీసీసీ ముఖ్యనేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పటి పరిస్థితుల్లో కొన్నాళ్లు మౌనంగా ఉండటమే మేలని, ఆ తర్వాతే ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. రాజకీయంగా ఒంటరిగానే ఉండాలని, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కన్నా కాంగ్రెస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్లాలని, ముఖ్యంగా టీడీపీతో ఈ ఎన్నికలతోనే సెలవు తీసుకోవాలనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. పంచాయతీ ఎన్నికల్లో బలమైన అధికార పక్షాన్ని ఎలా ఢీకొట్టాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బాబు దోస్తీనే పుట్టి ముంచింది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు వికటించిందని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశంతో తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లిందనే అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషణ జరుపుతున్న ప్రతి నాయకుడూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రీతిలో జరగాల్సిన ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే స్థితికి వెళ్లాయని, ఇదే తీవ్ర నష్టాన్ని కలగజేసిందని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విపరీత జోక్యాన్ని నివారించి ఉండాల్సిందని, టీజేఎస్ అధినేత కోదండరాంను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లి ఉంటే మరో రకమైన ఫలితాలొచ్చేవని, అసలు టీడీపీనే పక్కనపెట్టి టీజేఎస్, సీపీఐలతో ముందుకు వెళితే మెరుగైన ఫలితాలు వచ్చేవనే చర్చ జరుగుతోంది. ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే టీడీపీతో సెలవు తీసుకోవడమే మేలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జరగనున్న రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నుంచే ఇది ప్రారంభం కావాలని, ఈ విషయంలో అధిష్టానం అడిగినా ఒప్పుకోకూడదని, టీడీపీ మైత్రిలేని కాంగ్రెస్కే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పాలని భావిస్తున్నారు. ఎన్నికలు అయిన వెంటనే మిత్రపక్షాలను దూరం చేసుకోవడం మంచిది కాదని, అవసరం, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కారుకు ఓటెందుకేశానంటే..
నేను సమైక్యతావాదిని. 70ఏళ్ల తెలంగాణ వెనుకబాటుతనానికి, రాజకీయ పార్టీల దుష్పరిపాలనే ప్రధానమైన కారణమని, రాష్ట్ర విభజన దీనికి సరైన పరిష్కారం కాదని నమ్మాను. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, నాయకత్వం వహించిన వారందరూ నాకు సన్నిహితులే. వారి అనుభవాలు, వీరగాధలువింటూనే పెరిగాను. అయినా, నా శాయశక్తులా విభజనను వ్యతిరేకించాను. సమైక్యత కోసం ఒక రాజకీయ జేఏసీ నిర్మించడానికి అన్ని పార్టీల నాయకత్వంతో, అప్పటి సీఎంతో సహా అందరినీ కలిసి ఒక విఫలయత్నం చేశాను. రాష్ట్ర విభజన తరువాత అన్నిరకాల రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. ఈ దూరం రాజకీయ చిత్రపటాన్ని కొంత స్పష్టతతో చూసే అవకాశమిచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఓటు వేయలేదు. క్రమేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలను, వాటి ప్రచారాలను చూశాను. అంతకుముందు చూసిన అనేక పబ్లిసిటీ ఫ్లెక్సీల్లాగే ఉన్నాయి. ఇంత డబ్బు ఫ్లెక్సీల మీద పెట్టే బదులు, ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలకు వాడొచ్చుకదా అనుకున్నాను. క్రమేపీ కొన్ని కార్యక్రమాలు–మొట్టమొదట గ్రామాలలో పాత చెరువుల పూడిక తీయడం, కొత్త చెరువులు తవ్వడం–చూసి, ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో స్పష్టత ఉందని అర్థమయ్యింది. ఆ తరువాత ఒక్కొక్కటే కార్యరూపం దాల్చడంతో.. నిజాయితీతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కలిగింది. అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కారం అయిపోవు. తప్పులు, ఒడిదుడుకులు లేకుండా కూడా జరగవు. అసలు జరుగుతున్నాయా? లేదా? ఈ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోందా లేదా అనేది ప్రశ్న. ఈ మాత్రం పనులు జరిగిన దాఖలాలు దేశంలో చాలా కొద్దిగానే ఉన్నాయి. రాజకీయం న్యాయమైనదైనప్పుడు ఒప్పులను అభినందించాలి. తప్పులను ఎలా సరిచేసుకోవాలో చెప్పి, సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఎన్నికలలో గెలి పించడమో, ఓడించడమో ఒక్కటే గమ్యం కాదు. ఇంకా గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది. 70 ఏళ్ల పాటు పేరుకుపోయిన సమస్యల మురుగునీటిని ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదు. అలా అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో గ్రామ సీమలకు ఇచ్చిన నీరు, బీడువారిన నేలలో పైరులు చూసిన చిన్న రైతుల ఆనందం, తాగు నీరు, ఆరోగ్య కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు, విద్యావిధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు, ఐటీ రంగం, కరెంట్.. ఇలా ఇచ్చిన హామీల వైపు చిన్నచిన్న అడుగులు వేయడం నా అనుభవంలో మొదటిసారి చూశా. రెండడుగులు వెనక్కు వెళ్లి, రాజకీయ పార్టీ కోణం నుండి కాకుండా.. అభివృద్ధిని ఆశించే సాధారణ వ్యక్తిగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సాధారణ ప్రజలు ఊహా లోకాల్లో, దీర్ఘకాలిక ప్రణాళికలలో, ఉన్నతమైన రాబోవు యుగాలను చూడరు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితం. ఈరోజు తమ వాస్తవ పరిస్థితులు ఎలా మెరుగవుతున్నాయి, ఆ మెరుగుదలకు దారితీసే పథకాలను ఎవరు అమలు చేస్తారనే ఉత్కంఠతో, ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. Politics are about hope. Elections are about hope. ఈ నమ్మకాన్ని ఎవరు కలిగిస్తారో, వారిని ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ప్రాణాలుపెట్టి రక్షించుకుంటారు. దీనికి సిద్ధాంతపరమైన రాజకీయ వాదనలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పార్టీ జాతీయస్థాయి అధ్యక్షుడు అమిత్ షా, మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీలకు తోడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కట్టకట్టుకుని తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగగానే.. తాము ఇష్టపడిన ప్రభుత్వానికి ముప్పు కలుగుతోందనే భయం, ఆందోళన తెలంగాణ ప్రజల్లో కలిగింది. తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసమే ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఇలా పెరిగిన పోలింగ్ శాతానికి కొందరు రాజకీయ పండితులు భిన్నమైన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాలవారు, మతాల వాళ్లు వ్యతిరేకులని భాష్యం చెప్పారు. నాకు ఈ ప్రభుత్వంతో వ్యక్తిగత అవసరాలేమీ లేవు. మా నియోజకవర్గం అభ్యర్థులెవరో తెలీదు. వారెవరితో పరిచయం లేదు. నన్నెవరూ తమకే ఓటు వేయమని అడగలేదు. ఎస్సెమ్మెస్లు కూడా రాలేదు. అయినా, పొద్దున్నే పోలింగ్ బూత్కు వెళ్లా. ఈవీఎంను చూస్తే అన్నీ తెలియని పేర్లే ఉన్నాయి. ఓ నిరక్షరాస్యుడిలా పేర్లతో సంబంధం లేకుండా కారు గుర్తు దగ్గర ఉన్న బటన్ నొక్కా... పేపర్ స్లిప్ మీద కారు బొమ్మ వచ్చింది. ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా, ఒక మంచి పని చేశానన్న తృప్తితో పోలింగ్ బూత్ బైటికి వచ్చా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చాయి. అదేమిటంటే.. ఉపన్యాసాలు, ప్రలోభాలు, నినాదాలు కాదు; ప్రజాహిత కార్యాచరణే గెలిపిస్తుందని. Anti-incumbency అనే మాటకు అర్థమేమీ లేదు. బాగా పనిచేసే చేతిని ఎవరూ విరగ్గొట్టుకోరు. వ్యాసకర్త : డా‘‘ పుచ్చలపల్లి మిత్ర ,రాజకీయ విశ్లేషకుడు mitrapuchalapalli@gmail.com -
ఇక రైతు కేంద్రంగా రాజకీయం
బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతులు తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా సాధించింది. మూడు హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత వచ్చే కొద్ది నెలల్లో రాజకీయ పరిదృశ్యానికి సంబంధించిన రూపురేఖలు పదునెక్కనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఆరునెలల్లోపే జరుగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి నుంచి పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. రానున్న కొద్దిరోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలతో చర్చలు జరుగుతాయి. విశ్లేషణలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా మూడు ముఖ్యమైన విషయాలను రంగంమీదికి తీసుకొచ్చినట్లు స్పష్టమైపోయింది. అవేమిటంటే, గ్రామీణభారతంలో అశాంతి అనేది వాస్తవం. ఓటింగుపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. రెండోది, మతపరమైన విభజన లేదా సమీకరణ అనేది విశ్వాసాలను పటిష్టం చేస్తుందేమో కానీ అది భారీ ఎత్తున ఓట్లను సంపాదించలేదు. ఇక మూడో అంశం.. బలమైన, వ్యూహాత్మకమైన ప్రతి పక్ష కూటమి బీజేíపీని కదిలించివేస్తుంది, ఓడిస్తుంది కూడా. రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యత దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట వారు ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును గణనీయంగా కొల్లగొట్టింది. తెలంగాణ భావనపట్ల గతంలో ప్రజల్లో ఉన్న తీవ్రమైన అత్యుత్సాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే 2014 ఎన్నికల్లోలాగా ఉప జాతీ యవాదం కూడా ఇప్పుడు అంత బలంగా లేదు. సమస్యల ప్రాతిపదికన స్పందించే చైతన్యం తెలంగాణ ఓటర్లలో పెరిగిందనడానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ 2017 జూన్లో ఆ రాష్ట్రంలో మండసార్లో రైతులపై కాల్పులు జరగడం ఆయన పాలనకు మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కొనసాగింది. కానీ గ్రామీణ ఓటర్లలో కొన్ని విభాగాల మద్దతును ఆయన తప్పకుండా పొంది ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. ఈ గుణపాఠంతో రానున్న నెలల్లో రైతులను మరిన్ని ప్రలోభాలకు గురిచేస్తారని ఊహించవచ్చు కానీ ఇది వాస్తవ పరిస్థితిలో మార్పును తీసుకొస్తుందా అనేది చూడాల్సి ఉంది. విద్వేష రాజకీయాలకు భంగపాటు చిత్రవధ చేసి చంపడం కరడు గట్టిన హిందుత్వ వాదులను సంతోషపెట్టవచ్చునేమో కానీ, ప్రభుత్వాలపై ఓటరు తీవ్ర ఆగ్రహాన్ని అది ఏమాత్రం మార్చలేదు. రాజస్తాన్లో ఇది స్పష్టంగా కనబడింది. ఈ రాష్ట్రం లోని నియోజకవర్గాల్లోని పలు విభాగాల ప్రజలను వసుంధర రాజే పరాయీకరణ పాలు చేశారు. అందుకే ఓటర్లు ఆమెకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ విద్వేష ప్రచారం వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తోంది. హైదరాబాద్ పేరు మార్చేస్తానని, నిజాంని పారదోలినట్లే మజ్లిస్ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి తరిమేస్తామని యోగి చేసిన వాగ్దానాలను తెలంగాణ ఓటర్లు అసలు పట్టించుకోలేదంటే సందేహపడాల్సిన పనిలేదు. పైగా నిజాం తెలంగాణ నుంచి పారిపోయాడని చెప్పడమే ఒక చారిత్రక అసత్యం. ఇలాంటి విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడంలో భాగంగానే కావచ్చు. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కి మహామహులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ను ప్రచారానికి ఎక్కడికి పంపాలి అనే విషయంపై బీజేపీ మళ్లీ ఆలోచించుకోవాల్సి ఉంది. పరాజయం నేర్పుతున్న గుణపాఠాలు ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తప్పక పరిగణనలోకి తీసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పకుండా మార్చుకోవలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రదర్శించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్తో సహా దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అఖిలేష్ యాదవ్, మాయావతి గైర్హాజర్ కావడం ద్వారా తమ భవిష్యత్ పయనాన్ని సూచించారు. ఉదాహరణకు మాయావతి ఎక్కడికి వెళతారు? ఆమె మధ్యప్రదేశ్లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో కలిసి వెళ్లకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పేలవంగా కనబడుతోంది. పైగా వారు ఐక్యంగా ఉంటే మరిన్ని సీట్లను గెలిచి ఉండేవారు. కానీ తన సొంత బలాన్ని పరీక్షించుకోవాలని భావించి ఉండవచ్చు లేదా ఏవైనా ఒత్తిళ్లకు గురయి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపవచ్చు, లేదా కాంగ్రెస్తోనూ చేతులు కలపవచ్చు. ఇప్పటికే సంకీర్ణంలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్తో ఇలాంటి ఐక్యత సాధ్యపడితే ఉత్తర భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మరింత నిస్సహాయ స్థితిలో కూరుకుపోక తప్పదు. బుజ్జగింపులు, ప్రలోభాలు తప్పవా? ఇక మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫ్రంట్లో ప్రముఖపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మమత తన స్థానాన్ని వదిలేసుకుంటారా? ఇక శరద్ పవార్ ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్తో లాంఛనప్రాయమైన ఒడంబడికను కూడా చేసుకుంది. జాతీయ కూట మికి ఇది మరింత దన్ను కలిగిస్తుంది. మహారాష్ట్రలో దూకుడుమీదున్న శివసేనతో బీజేపీ తీవ్రంగా తలపడనుంది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని స్థానాలు గెల్చుకోవాలంటే శివసేనకు తలొగ్గి దాని డిమాండ్లను కాషాయదళం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భాగస్వాములతో సర్దుబాట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగమైన చిన్న పార్టీలు నరేంద్రమోదీ–అమిత్షా తరహా పనివిధానంతో, వ్యవహార శైలితో ఉక్కిరిబిక్కిరవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. వీటిలో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ లేక రామ్దాస్ అతవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మరెక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయా? తమ ప్రయోజనాలు ఉత్తమంగా ఎక్కడ నెరవేరుతాయో అక్కడే పనిచేయాలని ఈ పార్టీలు స్పష్టంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చేజారకుండా చూసుకోవడానికి ఎన్నో సర్దుబాట్లు, మరెన్నో రాజీలు చేసుకోవలసి ఉంటుంది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఉన్నట్లుండి మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ బేరసారాలు కూడా దీనికి తగినట్లుగానే పరాకాష్టకు చేరుకోనున్నాయి. ఇతర రాజకీయ పార్టీలను బుజ్జగించడం, ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీ తలొగ్గుతుందా లేదా అని ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టం. అయితే పొత్తు పార్టీలన్నింటినీ కూడదీసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాలంటే అది తన ఆకర్షణా శక్తిని, ఎత్తుగడల రాజకీయాలను ప్రయోగంచడమే కాకుండా డబ్బు, భుజబలాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించవలసి రావచ్చు. సంక్షేమ మంత్రంతోటే ఓట్ల సునామీ రైతు సంక్షేమానికి, విస్తృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జన హృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ రాష్ట్ర పాలకులు యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు. కేసీఆర్ జపించిన సంక్షేమమంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూత్లకు వరుకకట్టాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ పట్టణాల్లో కూడా పెను ప్రభంజనం సృష్టించింది. ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేకించి గ్రామీణ ప్రజల అభివృద్ధి పట్ల కేసీఆర్ తొలినుంచి ప్రదర్శిస్తూ వచ్చిన నిబద్ధత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సునామీని సృష్టించింది. ప్రజాకూటమిలో భాగమైన పెద్ద చిన్న పార్టీలను సానుకూల ఓట్ల సునామీ తుడిచి పెట్టేసింది. జిల్లాలకు జిల్లాల్లో గులాబీ రథానికి ఎదురు లేకుండా పోయింది. పాజిటివ్ ఓటు ఎంత ప్రభావం వేస్తుందో చెప్పడానికి, చూపడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పథకాలకు, దార్శనికతకు లభించిన ఘనవిజయం ఒక లిట్మస్ టెస్టుగా దేశం ముందు నిలుస్తోంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పథకాలు దేశంపై దండెత్తుతున్న మనకాలంలో ఇకనైనా రైతు సంక్షేమం తప్పనిసరిగా పట్టించుకోవలిసిన ఎజెండాగా రాజకీయ యవనికపై నిలుస్తుందేమో చూడాలి. వ్యాసకర్త : సిద్ధార్థ్ బాటియా, సీనియర్ పాత్రికేయుడు (ది వైర్ సౌజన్యంతో) -
జనం ఒప్పుకోలేదు
-
కొంపముంచిన ‘హిందూత్వ ఎజెండా’
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న లోక్సభ ఎన్నికలకు ఘంటారావంగా భావిస్తారు. ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 65 లోక్సభ సీట్లు ఉండగా, గత లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 62 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికలకు ఘంటారావంగాగానీ, రాజకీయ పండితులు వర్ణించినట్లు సెమీ ఫైనల్స్గాగానీ పరిగణించలేం. కాకపోతే ఓ హెచ్చరికగా చూడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేంతగా మెజారిటీలు వచ్చి ఉన్నట్లయితే సెమీ ఫైనల్గా చూసే అవకాశం ఉండేది. కానీ ఒక్క చత్తీస్గఢ్లో తప్పించి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కనుక ప్రభుత్వం వ్యతిరేకత ఉండడం సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్లో అది ప్రతిఫలించలేదంటే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్కున్న మంచిపేరు కావచ్చు. ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుపొంది.. ప్రస్తుతం వందకుపైగా సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మిజోరంలో రెండు సీట్లను ఆశించి రంగంలోకి దిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాలు హిందీ బెల్టులో ఉండడం, ప్రచారం చేసుకునే స్థాయిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు.. తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రచారకుడిగా భావించి.. బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా రంగంలోకి దింపింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో విస్తతంగా పర్యటించిన ఆయన ‘రామ్, రామ్ మందిర్, రామ్ రాజ్యం’ గురించే ఎక్కువ మాట్లాడారు. తెలంగాణ దండకారణ్యంలో రాముడు పర్యటించారని చెప్పినా ఆయన మిగతా మూడు రాష్ట్రాలకు కూడా రాముడితో ఏదో ఒక లింకు పెట్టారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెప్పారు. రాష్ట్ర వనరులన్నీ ముస్లింలకే దోచిపెడుతున్నారంటూ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారు. ‘రాముడు గీముడు జాన్తా నహీ’ అంటూ తెలంగాణ సెంటిమెంట్ ముందు ఆయన ప్రచారం నిలబడలేకపోయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం ద్వారానే విజయం సాధించిన విషయాన్ని పార్టీ పక్కన పెట్టి కేవలం హిందూత్వ ఎజెండానే ఎత్తుకోవడం వల్ల బాగా నష్టం జరిగిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కాక్డే అభిప్రాయపడడం గమనార్హం. 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో అభివృద్ధి ఎజెండాను ప్రచార అస్త్రంగా బీజేపీ చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టకపోతే మంగళవారం నాటి ఫలితాలు పునరావృతం కాక తప్పవని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
భావోద్వేగానికి లోనైన కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆయన.. ప్రజాతీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. నల్లగొండను దత్తత తీసుకోండి... ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు, తాగు- సాగునీటి సమస్యల నివారణకు కృషి చేశాననని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
'అపవిత్ర కూటమిని తెలంగాణలో తిరస్కరించారు'
సాక్షి, నెల్లూరు : అపవిత్రమైన కూటమిని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశంలో చక్రం తిప్పుతానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు సీట్లు గెలిచి ప్రధాని మోదీతో పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబుకి బుద్ది చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు. హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో పోటీ చేయమన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబానికి అనుమానం వచ్చిందని ఆనం అన్నారు. నందమూరి కుటుంబాలను రాజకీయంగా నాశనం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. -
అందుకే గవర్నర్ను కలిశాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్ను కలిశామంటూ.. తాము గవర్నర్ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది. -
బీజేపీ, కాంగ్రెస్ సైకాలజీ బాలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సైకాలజీ బాగాలేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. జాతీయ పార్టీలు దొందూ దొందేనని, అధికారం కోసం చిల్లమల్లర రాజకీయాలు చేయడం వాటికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఓట్లకోసం జాతీయ నాయకులు సైతం అబద్ధాలు ఆడుతున్నారని ఆయన ఎండగట్టారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్ ఆ పార్టీ శాసభసభా పక్షనేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం పూర్తి గెజిట్ విడుదలైన తర్వాతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలిపారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 70 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టు సంక్షేమానికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశామని, మరిన్ని నిధులు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. రాష్ట్రం అప్పులు పాలైందన్న విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్... అన్ని అంశాలపై తమకు పూర్తి అవగాహన ఉందని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అందుకే మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తాము అమలు చేశామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ... ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం మా ముందున్న సవాల్. హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలి. వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. కంటి వెలుగు, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలే తమ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాయని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీలు దేశంలో ఒక పాలసీ, రాష్ట్రానికో పాలసీ ప్రకటిస్తూ ప్రజలని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం ప్రజాస్వామ్యంలో కేంద్ర- రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణ జరిగినపుడే సమాఖ్య విధానానికి నిజమైన స్ఫూర్తి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని విమర్శించారు. అందుకే దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలు అంతర్జాతీయంగా తమ పంటను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పిస్తుంటే మనకు మాత్రం అలాంటి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర దేశవ్యాప్తంగా ప్రకటించాల్సి ఉంటుంది అలా జరిగినపుడే అన్ని రాష్ట్రాల రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం వచ్చినపుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతు, వివిధ వర్గాల సంక్షేమం కోసం జాతీయ స్థాయి రాజకీయాల్లో కొత్త ప్రయోగాలకు తాను సిద్ధమవుతున్నానని.. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాగానే రైతు బంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, అందుకు సంబంధించిన బడ్జెట్పై కూడా అవగాహన ఉందని కేసీఆర్ తెలిపారు. ఇక పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి తప్పకుండా వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘కచ్చితంగా ఏపీకి వెళ్తా. అక్కడికి రావాలని నాకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్కేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. హోదా సంజీవని కాదు. మూర్ఖులే హోదా అడుగుతారని అన్నారు. మరి ఇప్పుడేమో ఆయనే హోదా కోసం పోరాడుతున్నారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింది
-
టీఆర్ఎస్కు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎస్ఎస్
సింగపూర్ : తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ ప్రజల గుండె చప్పుడని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేసిన ఎన్నో ప్రజా ఉపయోగ, సంక్షేమ కార్యక్రమాల ఫలితమే ఈ ఘనవిజయం అని తెలిపారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకృషిని కొనియాడారు. దీంతో పాటు అత్యధిక మెజారిటీ సాధించిన హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, కరుణాకర్ రావు మొదలగు వారు ఉన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్: స్పందించిన రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కోరడంతో.. పలు నియోజకవర్గాల్లో కొన్ని వీవీప్యాట్లను కూడా లెక్కించినట్టు వెల్లడించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కానే కాదని, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లడం కూడా సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల ట్యాలీలో తేడా రాలేదన్నారు. మాక్ పోల్ తర్వాత.. సీఆర్సీ బటన్ నొక్కితే మాక్ పోల్ ఓట్లు వెళ్లిపోతాయని, రిజల్ట్ బటన్ నొక్కితే ఎర్రర్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఏజెంట్స్ అందరి ముందూ క్లోసర్ బటన్ కొట్టి.. 17 సీ లిస్ట్ ప్రకారం ఓట్లు ట్యాలీ అయ్యాక ఫలితాలు లెక్కపెట్టామన్నారు. 100 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టాలంటే.. బ్యాలెట్ పేపర్ తరహా అవుతుందని, అది సాధ్యం కాదని తెలిపారు. గవర్నర్కు గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఎస్కే రుడోలా బుధవారం గవర్నర్ నరసింహన్కు అందజేశారు. -
బాబు ప్రచారం.. టీఆర్ఎస్కు భారీ మెజారిటీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే తమపై ఓట్ల వర్షం కురుస్తుందని, బంపర్ మెజారిటీలు వచ్చేస్తాయని మురిసిపోయిన తెలంగాణ ప్రజా కూటమి అభ్యర్థులకు గట్టి షాక్ తగిలింది. బాబు ప్రచారం చేసిన చోట కూటమి గల్లంతైంది. ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్షోలు, సభలు నిర్వహించగా, 12 చోట్ల కూటమి అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచిచూశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వారం రోజులపాటు హైదరాబాద్లో మకాం వేసి వ్యూహరచన చేశారు. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్తోపాటు శివార్ల పరిధిలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్నగర్, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రోడ్షోలు, సభలు నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, కేసీఆర్ చేసిందేమీ లేదని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి గెలిచేస్తుందంటూ హడావుడి చేశారు. అయితే ఎక్కడా ఆయన పాచికలు పారలేదు. బాబు ప్రచారం చేసిన చోట టీఆర్ఎస్కు భారీ మెజారిటీ హైదరాబాద్ నగరం, శివార్లలో చంద్రబాబు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో అవమానకర ఓటమిని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కూకట్పల్లిలో 41 వేల ఓట్ల తేడాతో, శేరిలింగంపల్లిలో 44 వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు ప్రచారం చేసిన రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 58 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. బాబు ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, సనత్నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఊహించని మెజారిటీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్, మలక్పేటలో కూటమి అభ్యర్థులను చంద్రబాబు గెలిపించలేకపోయారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్క ఎల్బీ నగర్లోనే కూటమి అభ్యర్థి గెలిచారు. నల్గొండ జిల్లా కోదాడలో రాహుల్గాంధీతో కలిసి ప్రచారం చేసినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతిని గెలుపు తీరం చేర్చలేకపోయారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించలేక చంద్రబాబు చతికిలబడ్డారు. అదే జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా అది టీఆర్ఎస్లోని అంతర్గత విభేదాల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. -
రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణస్వీకారం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. రాజ్భవన్లో రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని, ఆయనతోపాటు ఒక మంత్రి కూడా ప్రమాణం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్.. ప్రమాణస్వీకారంతోనే ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. జాతీయ పార్టీలకు చెందిన సన్నిహిత నేతలు వారి పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఈ విషయాలపై గులాబీ బాస్ కూలంకషంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసి... అనంతరం మరో భారీ వేదికపై కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులను కూడగట్టాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో కేసీఆర్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి అనధికార సమాచారం అందిందని తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్, పలువురు సీనియర్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
గులాబీ గుభాళింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓటర్లు కేసీఆర్ మీద నమ్మకంతోనే ‘కారు’ గుర్తుకు ఓటేసి భారీ విజయాన్ని అందించారు. ఓటమి పాలవుతారని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అభివృద్ధి, రైతు ఎజెండా, జనాకర్షక పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు.. కూటమితో జట్టు కట్టటం టీఆర్ఎస్కు కలిసొచ్చింది. పేదలు, పల్లెలు ‘కారుకు’ అండగా నిలబడ్డాయి. తొలి ఓటు వేసిన నవ యువత, మలి ఓటు వేసిన వృద్ధులు, రైతులు పూర్తిగా కేసీఆర్పై విశ్వాసం ప్రకటించారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు (టీఆర్ఎస్), వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ (టీఆర్ఎస్), వరంగల్ పశ్చిమలో వినయ్భాస్కర్ (టీఆర్ఎ??స్), వర్ధన్నపేటలో అరూరి రమేష్ (టీఆర్ఎస్), నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి (టీఆర్ఎస్) పరకాలలో చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్), జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్), స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్య (టీఆర్ఎస్), డోర్నకల్లో రెడ్యానాయక్ (టీఆర్ఎస్), మహబూబాబాద్లో శంకర్నాయక్ (టీఆర్ఎస్ ) విజయం సాధించారు. భూపాపల్లిలో స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగులో మంత్రి చందూలాల్పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించారు. మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్బాబు,(కాంగ్రెస్).. భద్రాచలంలో పొదెం వీరయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు. రెడ్యానాయక్ ఆరోసారి.. డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్.రెడ్యానాయక్ ఆరో సారి విజయం సాధించారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన రెడ్యానాయక్ 1989లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచారు. 1994, 1999, 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెడ్యా.. టీడీపీ అభ్యర్థి జయంత్నాథ్నాయక్పై 19140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 కాంగ్రెస్ నుంచే గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తొలిసారి కారు గుర్తుతో పోటీ చేసిన రెడ్యా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రునాయక్పై 17,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరకాలలో ఫైర్ బ్రాండ్ ఓటమి కేటీఆర్తో విభేదించి సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. ఆమెను అత్యంత సునాయాసంగా ఓడించారు. కూటమి పొత్తుల్లో భాగంగా పరకాల నుంచి పోటీ చేసిన కొండాసురేఖ ఆది నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గట్టి పోటీదారుగా ఉన్న సురేఖ ఏ రౌండ్లోనూప్రభావం చూపలేకపోయారు. కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి 46,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజయ్య, వినయ్ నాలుగోసారి.. స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య రాజకీయ పరిశీలకుల అంచనాలకు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య, టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై 35,790 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. 2004లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయన ఆయన ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్రెడ్డిపై 39,059 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఆ ఇద్దరికి ‘సన్’స్ట్రోకే.. భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారికి , ములుగు అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్కు సన్స్ట్రోక్ తాకినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మధుసూదనాచారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. సన్స్ట్రోక్ను ముందుగానే పసిగట్టిన ఆయన ఆరు నెలలుగా కుమారులను నియోజకవర్గానికి దూరంపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 15,635 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. ఇక ములుగు నుంచి చందూలాల్కు ఇదే పరిస్థితి ఎదురైంది. కూమారుడి అనుమతి లేకుండా సాధారణ ప్రజలు నేరుగా చందూలాల్ను కలిసే అవకాశం లేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చందూలాల్పై 22,671 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. అరూరి రమేష్ రికార్డు మెజార్టీ వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో హరీశ్రావు తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్మేగా అరూరి రికార్డు సృష్టించారు. ఆయన టీజేఏస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. దేవయ్యకు 32,012 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లోనూ రమేష్కు 86 వేల మెజార్టీ వచ్చింది. ఈఎన్నికల్లో ఆయన రికార్డును ఆయనే బద్దలుకొట్టడం విశేషం. ఎర్రబెల్లి డబుల్ హ్యాట్రిక్ ఎర్రబెల్లి దయాకర్రావు వరుసగా ఆరు విజయాలను నమోదు చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1952 నుంచి 2018 వరకు కొనసాగిన శాసనసభ సభ్యుల ఎన్నికల్లో వరుసగా ఓటమి లేకుండా గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్రావు రికార్డు సాధించారు. 1994లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజేశ్వర్రావు మీద 22,175 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి పోటీ చేసి అప్పటి పాత చెన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావును వరుసగా రెండు సార్లు ఓడించారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4386 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పి.రామేశ్వర్రెడ్డిని ఓడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. -
గులాబీ గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్ : రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన చందర్ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం కేసీఆర్ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ రెబల్గా పోటీచేసిన చందర్ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. -
తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు
-
గులాబీ సునామీ..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘గులాబీ’ సునామీ సృష్టించింది. ముందస్తు సమరంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. ఊహకందని ఫలితాలను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లకు పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఏకంగా 11 స్థానాలు గెలిచి ఆజేయశక్తిగా ఆవతరించింది. టీడీపీ నామరూపాల్లేకుండా కొట్టుకుపోగా.. కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడు సీట్లను దక్కించుకొని ‘సమ్ తృప్తి’ చెందింది. జిల్లా వ్యాప్తంగా సంచలనాలు నమోదైన ఈ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి మూటగట్టుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగింటిలో మూడు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ.. తాండూరులో మాత్రం చతికిలపడింది. ఆది నుంచి తుది వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆఖరికి ఫలితం కూడా దోబుచులాడింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు. నలుగురు కొత్తవారే.. తాండూరు సహా వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో పోటీ చేసిన కొత్త నేతలకు ఓటర్లు పట్టం కట్టారు. వికారాబాద్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న డాక్టర్ మెతుకు అనంద్ను అదృష్టం వరించింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్పై ఆయన గెలిచారు. పరిగిలో సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్రెడ్డి తనయుడు మహేశ్రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిపై భారీ ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. చేవెళ్లలోను టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకునే చేవెళ్లలో టీఆర్ఎస్ గాలి వీచింది. ఈ హవాలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ పార్టీ తరఫున పోటీచేసిన కేఎస్ రత్నం భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. శివార్లలోనూ గుబాళింపే.. పట్టణ ఓటర్లు కూడా టీఆర్ఎస్ను ఆదరించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మద్దతు పలికారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఈసారి ఆ పార్టీ అభ్యర్థులపైనే గెలుపొందడం విశేషం. ఈ రెండు సీట్లతో పాటు ఇబ్రహీంపట్నం బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగమే ఎదురైంది. హస్తవాసి రెండింటికే.. టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. మహేశ్వరం నుంచి బరిలో దిగిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. తొలుత ఆధిక్యతను కనబరిచిన తీగలకు సొంత మండలంలోనే చుక్కెదురైంది. మీర్పేట, జల్పల్లి, జిల్లెలగూడ మున్సిపాలిటీల్లో ఆయన ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయారు. దీంతో పదో రౌండ్ నుంచి ఆధిక్యతలోకి వచ్చిన సబిత చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించారు. ఓటమెరుగని ఆమె నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎల్బీనగర్లో సుధీర్రెడ్డి మరోసారి విజయబావుటా ఎగువేశారు. ఆది నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన ఆయన దాదాపు 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టెన్షన్..టెన్షన్ ఇబ్రహీంపట్నం రాష్ట్ర రాజకీయాల్లోనే తరుచూ పతాక శీర్షికలకెక్కుతోంది. తాజాగా ఎన్నికల ఫలితాల్లోనే అదే ఉత్కంఠ కొనసాగింది. పొత్తులో టీడీపీకి ఈ సీటు కేటాయించడంతో బీఎస్పీ తరఫున బరిలో దిగిన అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ మొదట ‘ఏనుగు’ ముందంజలో సాగగా.. ఆ తర్వాత కారు జోరు కొనసాగించింది. ఇలా 16 రౌండ్ల వరకు వెనుకబడ్డ మల్రెడ్డి అనూహ్యంగా పుంజుకొని మంచిరెడ్డిని వెనక్కి నెట్టారు. ఆ తర్వాత క్రమేణా స్వల్ప ఆధిక్యతను దక్కించుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ 21 రౌండ్లు పూర్తయ్యే సరికి 104 ఓట్ల మెజార్టీతో నిలిచింది. అయితే, అప్పటికే ఆరు ఈవీఎంలకు సాంకేతిక సమస్య రావడంతో పక్కనపెట్టిన ఎన్నికల అధికారులు వాటిని బాగుచేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఒకవైపు పోటీ ఉత్కంఠగా మారడం.. ప్రతి ఓటు కీలకమే కావడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికితోడు మరోసారి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలనే డిమాండ్కు చేయడంతో ఆ మేరకు మరోసారి లెక్కించారు. ఈ ఈవీఎంలు బాగుచేయకపోవడం తో వీవీ ప్యాట్లలోని ఓట్ల లెక్కించారు. ఈ ఓట్లను కూడిన లెక్కించిన అనంతరం 376 ఓట్ల అధిక్యత సాధించిన మంచిరెడ్డి విజేతగా నిలిచారు. రేవంత్కు భంగపాటు! కాంగ్రెస్ ఫైర్బ్రాండ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి తొలిసారి ఓటమి ఎదురైంది. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. టీడీపీని వీడిన మరుక్షణమే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని భావించిన టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావు లు కదిపింది. అభివృద్ధి మంత్రమే నినాదంగా..రేవంత్రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది. తొలిసారి కొడం గల్ కోటలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది.