trailer released
-
కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలుసుండాలి!
కన్నడ హీరో ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు.‘నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు... కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుండాలి’, ‘నువ్వు పుట్టిన తిధి, వారం, నక్షత్రాలను బట్టి చూస్తే నీ గ్రహాలకి దోషం ఏర్పడినట్టుంది’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘రాక్షస’ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాకి కూడా ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
వన్ అండ్ ఓన్లీ దేవా
షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త. -
'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్
-
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు!
ధనుష్ టైటిల్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రకాశ్రాజ్, ఎస్జే సూర్య, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనుంది.ఈ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళవారం ‘రాయన్’ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘రాయన్... అడవిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా’, ‘సింహం,’ ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. రెండూ ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టిముట్టి, ఓ పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి’, ‘వస్తాడు... బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు... దహనం చేస్తాడు’, ‘రావయ్యా... రాయన్... వెళ్లి ఏం చెప్పావ్... టక్కున కేసు వెనక్కు తీసుకున్నాడు’ అనే డైలాగ్స్ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. -
రిస్క్ చేశారు.. సక్సెస్ కావాలి
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
రికార్డ్స్ చూసుకో..!
‘ఈ భూమ్మీద మొదటి నగరం.. ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ’ అనే డైలాగ్తో ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ప్రారంభమైంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్ని సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్.తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్తో సహా పలు భాషల్లో ఈ ట్రైలర్ని విడుదల చేశారు. ‘నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా.. సృష్టి.. నేను కాపాడతా’(అమితాబ్ బచ్చన్), ‘పాయింట్ ఏంటంటే నేనొక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను.. రికార్డ్స్ చూసుకో ఇంతవరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను’(ప్రభాస్), ‘ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకోని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి’(దీపికా పదుకోన్), ‘భయపడకు.. మరో ప్రపంచం వస్తుంది’(కమల్హాసన్) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి.ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఒక ఫిల్మ్ మేకర్గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా ΄్యాషన్ ఉంది. ‘కల్కి 2898 ఏడీ’లో ఈ రెండు ఎలిమెంట్స్ని మెర్జ్ చేయడం మా ఆర్టిస్ట్లు, టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా టైమ్ పట్టింది. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎగై్జట్ చేసేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
ఇంద్రాణి ట్రైలర్ బాగుంది
‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్టైన్ మెంట్స్పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని. -
గామి మూవీ ట్రైలర్
-
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్
-
ఏలియన్ మూవీ ట్రైలర్ రిలీజ్
-
ఈగల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
-
వ్యూహం... నేను నమ్మిన రియాలిటీ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది. వైఎస్ జగన్గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్. ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం. అసలు.. జనసేనలో పవన్కల్యాణ్ టీడీపీ కోవర్ట్గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్గోపాల్ వర్మ -
హారరా? థ్రిల్లరా?
భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్ను కట్ చేశారు. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్లో చూడండి’’ అని యూనిట్ పేర్కొంది. -
అడవి అందంగా ఉంటుంది
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత రామ్గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్ను విడుదల చేశారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు అందమంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్స్, ఫైట్లు చేస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నటనకు స్కోప్ ఉన్న ‘తలకోన’లాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు అప్సరా రాణి. ‘‘ప్రకృతిలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేశ్. ‘‘చాలా రిస్క్ చేసి, ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం’’ అన్నారు దేవర శ్రీధర్ రెడ్డి. -
వ్యూహం మూవీ ట్రైలర్ విడుదల
-
‘బ్రో’ మూవీ ట్రైలర్
-
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
పిల్లి బొమ్మ వస్తుంది!
‘నెక్ట్స్ టెన్ డేస్లో చాలా పెద్ద డీల్ ఉంది. దుబాయ్ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్గా మన దగ్గరకు చేర్చాలి’ అనే డైలాగ్తో ‘నారాయణ అండ్ కో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నారాయణ అండ్ కో’ రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ట్రైలర్
-
నిజం కచ్చితంగా గెలుస్తుంది
‘నిన్ను సీఎం సెక్యూరిటీకి అని పంపిస్తే.. నువ్వు ఆవిడ బండినే ఆపేస్తావా?’ అనే డైలాగ్తో ‘కస్టడీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని శుక్రవారం విడుదల చేశారు. ‘నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను.. లేకపోతే ట్రై చేస్తూ చస్తాను’, ‘ఒక్కసారి న్యాయం పక్క నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ (నాగచైతన్య), ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్లు.. లేకపోతే నా చావు నేను చస్తా’ (కృతీ శెట్టి) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా, అరవింద్ స్వామి విలన్గా, శరత్ కుమార్ పోలీసాఫీసర్గా నటించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కతీర్, సమర్పణ: పవన్ కుమార్. -
Rudhrudu: కనిపెట్టాలి.. కొట్టాలి!
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్కుమార్ అతని లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ను బాలయ్య రిలీజ్ చేశారు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్లు కీలక పాత్రలు పోషించారు. -
అజిత్ హీరోగా నటిస్తున్నతెగింపు సినిమా ట్రైలర్ రిలీజ్
-
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. నవీన్ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్. ఫైర్ ప్లై ఆర్ట్స్పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ను శేఖర్ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్ సక్సెస్ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్. నటులు శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీల పాల్గొన్నారు. -
Anukoni Prayanam: నా మనసుకు నచ్చింది
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో డా.జగన్మోహన్ డీవై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’లో నాది సీరియస్ పాత్ర. అందుకే ఆ సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. కానీ, అందరూ నవ్వి నవ్వి వంద రోజులు చూశారు. ఇప్పుడు ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నరసింహ రాజు. ‘‘కరోనా సమయంలో ఈ కథ రాశాను’’ అన్నారు డా.జగన్ మోహన్ డీవై. ‘‘ఈ చిత్రం అందరి హృదయాలను టచ్ చేస్తుంది’’ అన్నారు వెంకటేష్ పెదిరెడ్ల. ‘‘అనుకోని ప్రయాణం’ సంచలన విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి . ‘‘ఈ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. దర్శకులు కె.విజయభాస్కర్, నందినీ రెడ్డి, వీరభద్రం, నటుడు సోహైల్ పాల్గొన్నారు. -
'బ్రేక్ అవుట్'మూవీ ట్రైలర్ విడుదల చేసిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. Happy to launch the trailer of #BreakOut. The concept of the movie looks interesting. It’s good to see a young team in TFI experimenting with such stories. My best wishes to #RajaGoutham, director @its_Subbu4U and the whole cast & crew.https://t.co/sJ6BlKpa4N — Allu Arjun (@alluarjun) August 29, 2022 -
'ఓ మంచి రోజు చూసి చెప్తా' అంటున్న నిహారిక, విజయ్ సేతుపతి
Niharika Vijay Sethupathi O Manchi Roju Chepta Will Stream On Aha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మెగా డాటర్ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". ఈ చిత్రం తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్తో రిలీజైంది. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు అప్పట్లో క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఇప్పుడు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో అలరించడానికి రెడీ అయింది. దీనికి సంబంధించిన తాజా ట్రైలర్ను విడుదల చేసింది ఆహా. అయితే విజయ్ సేతుపతికి, నిహారికకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నిహారిక, విజయ్తోపాటు గౌతమ్ కార్తిక్ మరో కీలక పాత్ర పోషించాడు. ఇందులో విజయ్ దొంగతనాలు చేసే యముడిగా వేషం కట్టాడు. అతడిని నిహారిక మామయ్య అని పిలుస్తుంటుంది. ఈ క్రమంలో ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అతడు నోరు తెరిచి అడగ్గా చేసుకుంటాను మామయ్యా.. అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది. వినోదాన్ని పంచుతున్న ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఆగస్టు 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. -
‘బుజ్జి ఇలా రా’ ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లరి నరేశ్
సునీల్, ధన్రాజ్ హీరోలుగా చాందినీ అయ్యంగార్ హీరోయిన్గా నటింన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్ప్లే అందింన ఈ త్రానికి ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్గా చేశారు. రపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ని హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వర రెడ్డిగారు నాకు ‘సీమశాస్త్రి, సీమటపాకాయ్’ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. అంజి కెమెరామేన్ అవ్వకముందే నాకు తెలుసు. అంతమంచి టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందిం, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖ్చతంగా ఈ సినివ టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందించి, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనడానికి నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది సీరియస్ రోల్’’ అన్నారు ధన్రాజ్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన మూవీ ఇది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘ఈ సినిమా ఆడకపోతే నా స్నేహితులు నాగిరెడ్డి, జగదీశ్, సంజీవ్ రెడ్డి నష్టపోతారు.. కాబట్టి ఆదరించండి’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘మా సినిమాని థియేటర్లోనే చూడాలి’’ అన్నారు నాగిరెడ్డి, సంజీవరెడ్డి. -
ఇది నాకు ఎంతో ప్రత్యేకం: అనుపమ పరమేశ్వరన్
సీతమ్మధార (విశాఖ ఉత్తర): శ్రీ కృష్ణుని ద్వారక ఇతివృత్తంగా కార్తికేయ–2 చిత్రం రూపొందించినట్లు హీరో నిఖిల్ తెలిపారు. సాంకేతికపరంగా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్, ప్రేమ, యాక్షన్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. కార్తికేయ–2 చిత్రం ట్రైలర్ను శరత్ థియేటర్లో మంగళవారం చిత్రయూనిట్ సభ్యులు విడుదల చేశారు. ప్రేక్షకుల ముందు ట్రైలర్ విడుదల చేసి, కాసేపు ముచ్చటించారు. చదవండి: సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ? అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన కార్తికేయ–1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారన్నారు. ద్వారకలోని శ్రీ కృష్ణుడి గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా కార్తికేయ–2 చిత్రాన్ని రూపొందించామన్నారు. తమ సినిమాను శ్రీకృష్ణుడే ముందుకు నడిపారని, షూటింగ్ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పారు. దర్శకుడు చందూ మొండేటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ నెల 13న చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ–2, చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రేక్షకులు చూసినంత సేపు తర్వాత ఏమి జరుగుతుందో అని ఉద్వేగానికి గురవుతారన్నారు. చిత్రనటులు శ్రీనివాసరెడ్డి, హర్ష మాట్లాడుతూ ఇంత గొప్ప చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. -
ఏ అమ్మ కొడుకునైనా కొడతా.. ఆసక్తిగా ట్రైలర్
Aadi Saikumar Tees Maar Khan Trailer Released: ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. 'మా అమ్మని తప్పుగా చూశారు. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్లోని సన్నివేశాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆది లుక్స్, డైలాగ్ డెలీవరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆది.. స్టూడెంట్, రౌడీ, పోలీస్ వంటి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసిందే. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్తికేయ-2 ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా. ఇప్పటికే కార్తికేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్ హైలైట్గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
నిహారిక కొణిదెల 'హలో వరల్డ్' ట్రైలర్ రిలీజ్
Niharika Konidela Hello World Web Series Trailer Released: వరుస వెబ్ సిరీస్లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్తో ముందుకొచ్చింది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’. ఈ సిరీస్కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై విభిన్నమైన వెబ్ సిరీస్లను నిర్మిస్తున్న ఆమె తాజాగా ఈ సిరీస్ను జీ5తో కలిసి నిర్మించారు. ఇంతకుముందు జీ5తో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్ను కూడా రూపొందించారు. 8 ఎపిసోడ్లుగా రూపొందిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్కి శివసాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ను శనివారం (ఆగస్టు 6) ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. 'చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లానే చాలా అవుదామనుకున్నా' అనే డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్లో 'మనకు సాలరీ ఇత్తరా బ్రో', 'నీకు ఇవ్వాల్సిన రెండు లచ్చలు ఒక్క సంవత్సరంలో కట్టిపడేత్తా', 'చావడం కన్ఫర్మ్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తూ చావాలి కానీ, ఇలా ఏడుస్తూ చస్తే లాభమేంట్రా' అనే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. Thank you so much sir! Here the trailer, everyone!! https://t.co/L3VV9jMclY — Niharika Konidela (@IamNiharikaK) August 6, 2022 కాగా భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సిరీస్లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. -
బిగ్బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ 'కమిట్మెంట్'.. బోల్డ్గా ట్రైలర్
Tejaswi Madivada Commitment Trailer Released: బిగ్బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ వివాదానికి గురి కాగా డైరెక్టర్ లక్ష్మీ కాంత్ క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ను బుధవారం (ఆగస్టు 3) విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్న కమిట్మెంట్ ఇవ్వాలన్న పరిస్థితులు నెలకొన్నట్లు ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 'సమాజంలో ఒక మగాడు ఎలాగైనా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతది' అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషుల్ల సంగతే మరిచిపోతున్నారు, కాస్త మనుషుల్లా ఆలోచించండి' వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్ను పలు బోల్డ్ సీన్లతో కట్ చేసిన అమ్మాయిలు 'కమిట్మెంట్' అనే విషయంతో ఎలా నలిగిపోతున్నారనే విషయాన్ని చూపించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించిన 'కమిట్మెంట్' ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. -
ఆ రోజు రాత్రి నేను చూశాను.. ఆసక్తిగా ట్రైలర్
Matarani Mounamidi Movie Trailer Released: రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందింది ఈ సినిమా. తుది హంగులు అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఫేస్ మాస్క్లతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్ను ఆవిష్కరించారు. దీంతో ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోల ఆశీర్వాదం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. "మాటరాని మౌనమిది" మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి, అంతు చిక్కని అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచెలా ఉంది. -
అదిరిపోయిన నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్..
Nithin Macherla Niyojakavargam Movie Trailer Released: హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా మూవీ ట్రైలర్ను విడుదల చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో చూపించిన డైలాగ్లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్ను ట్వీట్ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్గా నిటిస్తున్న విషయం తెలిసిందే. -
మాస్ యాక్షన్తో రవితేజ మెరుపులు.. ఆసక్తిగా ట్రైలర్
Ravi Teja Ramarao On Duty Movie Trailer: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల 'క్రాక్'తో హిట్ కొట్టిన 'ఖిలాడీ' అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ను శనివారం (జులై 16) ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈవెంట్లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో మాస్ ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్తో అదరగొట్టాడు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ను 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై ఫ్రెండ్' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్తో ముగించారు. లవ్ ఫీల్తో ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. క్లాస్, మాస్ గెటప్లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్, తమన్ సంగీతం బాగుంది. లవ్, కెరీర్ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు మర్చిపోలేని ఆట ఆడి చూపిస్తా.. ఆసక్తిగా ట్రైలర్
Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్గా మారడం, క్రికెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
రక్తం మరిగిన పులి 'గ్యాంగ్స్టర్ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్
Laksh Starrer Gangster Gangaraju Trailer Released: వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో లక్ష్. 'వలయం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్.. ఇప్పుడు 'గ్యాంగ్స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. కమర్షియల్ ఎలెమెంట్స్తో కూడిన ఈ 'గ్యాంగ్స్టర్ గంగరాజు' ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. -
అలాంటి తేడాలు ఇండస్ట్రీలో ఉండవు: హీరోయిన్
Surapanam Movie Trailer Released: సంపత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ను సోమవారం రిలీజ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ –‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రేమకథ ‘సురాపానం’ లో ఉంటుంది. సంపత్కుమార్ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. ‘సురాపానం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథను ‘సురాపానం’ చిత్రంలో చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్..ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ప్రగ్యా నయన్. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్..
Ram Gopal Varma Konda Movie Second Trailer Released: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అదిత్ అరుణ్, ఐరా మోర్, పృథ్వీరాజ్ నటించారు. ఇదివరకు ఈ సినిమా మొదటి ట్రైలర్ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తాజాగా శుక్రవారం (జూన్ 3) రెండో ట్రైలర్ను రిలీజ్ చేశారు. 1990లో కారుపై జరిగిన కాల్పుల సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి అంటూ ఆర్జీవీ చెప్పే డైలాగ్ ఇంటెన్సిటీని క్రియేట్ చేసింది. 'విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా మురళీ' అంటూ మొదటి ట్రైలర్లాగానే హీరో పాత్రను పరిచయం చేశారు. ఈసారి కొట్టా, చంపేస్తా, ఆలోచనలు ఉంటే సరిపోదు స్వేచ్ఛ, బానిసత్వం, మనం చేసే పోరాటల గురించి కూడా తెల్వాలే అనే డైలాగ్లు, యాక్షన్, లవ్ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: ‘కొండా’ సినిమా: పొలిటీషియన్కి ఆర్జీవీ ఇండైరెక్ట్ వార్నింగ్ కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
Laal Singh Chaddha Trailer: తలరాతను ఎలా రాస్తారు ?
Aamir Khan's Laal Singh Chaddha Trailer: ఆమిర్ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్పీరియన్స్ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ సింపుల్మేన్’ అంటూ ‘లాల్ సింగ్ చద్దా’ హిందీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్లో ఈ ట్రైలర్ను ప్రదర్శించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్గంప్’కు హిందీ రీమేక్గా రూపొందింది. Experience the extraordinary journey of #LaalSinghChaddha, a simple man whose heart is filled with love, hope and warmth.#LaalSinghChaddhaTrailer out now! Releasing in cinemas worldwide on 11th Aug.https://t.co/yahghWFhJA — Aamir Khan Productions (@AKPPL_Official) May 29, 2022 -
ధనుష్ హాలీవుడ్ మూవీ ట్రైలర్ చూశారా..
Dhanush Starrer Hollywood Movie The Gray Man Trailer Released: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో అలరించిన ధనుష్.. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం యాక్షన్ సీన్స్తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో ధనుష్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడని టాక్. మార్క్ గ్రేనీ నవల 'ది గ్రే మ్యాన్' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. వీరు బాక్సాఫీసును షేక్ చేసిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇందులో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 15న థియేటర్లలో, జూలై 22న ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. కాగా ధనుష్కు ఇది రెండో ఇంటర్నేషనల్ సినిమా. ఇదివరకు 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' సినిమాతో హాలీవుడ్కు పరిచయం అయ్యాడు. చదవండి: 👇 రజనీ కాంత్తో ఇళయరాజా భేటీ.. కారణం ? బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ -
కొండపై నుంచి బైక్తో సహా దూకిన హీరో..
Tom Cruise Mission Impossible Dead Reckoning Part One Trailer Released: యాక్షన్ ప్రియులను సీట్ ఎడ్జ్లో కూర్చుండపెట్టే సినిమాలలో మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఏజెంట్ 'ఈథన్ హంట్'గా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ మూవీ సిరీస్కు క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ యాక్షన్ సీక్వెన్స్, అడ్వంచెర్స్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్ అందిస్తాయి. ఇక పరిస్థితులకు తగినట్లు వివిధ పాత్రల గెటప్పుల్లోకి హీరో మారే సన్నివేశాలు మంచి కిక్కిస్తాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు ఎంతో అలరించాయి. ప్రస్తుతం సిరీస్ నుంచి 7, 8వ సినిమాలు రానున్న విషయం తెలిసిందే. తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్'గా ఏడో సినిమా ట్రైలర్ను సోమవారం (మే 24) రాత్రి విడుదల చేశారు. ''గ్రేటర్ గుడ్'గా పిలవబడే మీ పోరాట రోజులు ముగిశాయి'' అంటూ ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ సీన్స్తో ఆద్యంత ఆకట్టుకునేలా ఉంది. లొకేషన్లు, సీన్స్ సూపర్బ్గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఏదో ఒక 'కీ' నేపథ్యంలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో కొండపై నుంచి బైక్తో సహా హీరో దూకే సీన్ థ్రిల్లింగ్గా ఉంది. 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మొదటి సినిమాలోని ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ యూజీన్ కిట్రిడ్జ్గా కనిపించిన హెన్రీ జెర్నీ ఇందులో నటించడం విశేషం. చదవండి:👇 36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్క్వారీ కథ, దర్శకత్వం అందించారు. ఇతను 2015లో 'రోగ్ నేషన్', 2018లో 'ఫాల్ అవుట్' సినిమాలను డైరెక్ట్ చేశాడు. 'డెడ్రెకనింగ్ పార్ట్ 1' జూలై 14, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024లో 'డెడ్రెకనింగ్ పార్ట్ 2' విడుదల కానుంది. అయితే ఇదే ఈథన్ హంట్గా టామ్ క్రూజ్ చివరి సినిమా అని సమాచారం. -
నవ్వులు పూయిస్తున్న 'జగ్ జగ్ జీయో' ట్రైలర్
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు: ఆది
Aadi Saikumar Black Movie Trailer Released: ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం బ్లాక్. జి.బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా శనివారం (మే 21) 'బ్లాక్' ట్రైలర్ను విడుదల చేశారు. 'ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది.' అంటూ ఆది చెప్పే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్లో మిగతా డైలాగ్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆది పోలీస్గా అలరించనున్నాడు. బిగ్బాస్ రెండో సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మూవీ ఒక రాబరీ, ఒక దొంగతనం చుట్టూ తిరిగే కథాంశంగా ఉంది. 'విభిన్నమైన కథ, కథానాలతో రూపొందుతున్న చిత్రమిది. ఆది నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్.' అని చిత్రబృందం తెలిపింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీలో దర్శనబానిక్, ఆమని, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. చదవండి: మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్పోర్టులో హీరోయిన్కు చేదు అనుభవం -
SVP: 'సమ్మర్ సెన్సెషనల్ బ్లాక్ బ్లస్టర్' ట్రైలర్ చూశారా !
Sarkaru Vaari Paata Summer Sensational Blockbuster Trailer Released: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తున్న సందర్బంగా సోమవారం కర్నూలులో విజయేత్సవ వేడుకను నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకలో సర్కారు వారి పాట కొత్త ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్' పేరుతో విడుదలైన ఈ ట్రైలర్లో మహేశ్ బాబు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక వెన్నెల కిశోర్, కీర్తి సురేశ్, సముద్ర ఖనితో మహేశ్ చేసే సందడిని ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇందులో టైటిల్ ర్యాప్ సాంగ్ హైలెట్గా నిలిచింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. -
అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్..
Vikram Trailer: Kamal Haasan Vijay Sethupathi Fahadh Faasil Gripping Action: లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్డేట్ ప్రకారం ఆదివారం సాయంత్రం 'విక్రమ్' ట్రైలర్ను రిలీజ్ చేశారు. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇదేకాకుండా ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే సినీ ప్రియులకు మంచి విందు దొరికినట్టే. చదవండి: కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి కమల్ హాసన్ విలన్గా రజినీకాంత్ హీరోగా రాజమౌళి చిత్రం..? -
అద్భుతమైన విజువల్స్తో 'అవతార్ 2'.. టీజర్ చూశారా !
Avatar The Way Of Water Teaser Released: ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'. దీనికి సీక్వెల్గా వస్తున్న మూవీ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్ను మే 6న 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేశారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' టీజర్ను తాజాగా సోషల్ మీడియాలో సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. టీజర్ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్గానే ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉండగా, 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. చదవండి: ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! “Wherever we go, this family is our fortress.” Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4 — Avatar (@officialavatar) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేజర్ ట్రైలర్: ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను..
Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్. తెలుగు ట్రైలర్ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్గా సాగిన ఈ ట్రైలర్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. 'ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను', 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది' వంటి తదితర డైలాగ్లు ఆకట్టుకున్నాయి. చదవండి: ‘మేజర్’ ట్రైలర్ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ -
మమ్ముట్టి మిస్టిక్ థ్రిల్లర్ 'పుజు'.. నేరుగా ఆ ఓటీటీలోకి
Mammootty Puzhu Movie Released On Sony Liv: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్ మూవీ 'పుజు'(Puzhu) తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో 'చార్లీ' సినిమా ఫేమ్ పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో రతీనా పీటీ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అలాగే ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ తండ్రికొడుకుల నేపథ్యంలో మిస్టిక్ థ్రిల్లర్గా తెరెకెక్కినట్లు తెలుస్తోంది. వాసుదేవ్ సజీత్ మరార్ మమ్ముట్టి కొడుకుగా నటిస్తున్నాడు. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సోనీ లివ్లో మే 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్, సిన్సిల్ సెల్యూలాయిడ్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆసక్తిగా అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్..
Akshay Kumar Prithviraj Movie Trailer Released: ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్ ఒకటి. బాలీవుడ్ యాక్షన్ హీరో టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’తో మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందించడం విశేషం. చదవండి: అక్షయ్ కుమార్ను ఆడేసుకుంటున్న నెటిజన్స్.. కారణమేంటంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘నో రామ రావణ్స్ ఓన్లీ’ ట్రైలర్ విడుదల
పద్నాలుగేళ్ల లోపు పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో తీసిన సినిమా ‘నో రామ రావణ్స్ ఓన్లీ’ అన్నారు వీరబ్రహ్మం. ఈ సినిమా ట్రైలర్ను జబర్దస్త్ ఫణి రిలీజ్ చేశారు. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించిన వీరబ్రహ్మం మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగ్గా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే సందేశం ఇచ్చాం’’ అన్నారు. నటుడు అంకిత్ పాల్గొన్నారు. -
ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనేక్ మూవీ ట్రైలర్ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఒక మిషన్ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ 'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్ల ట్విటర్ వార్పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్తోపాటు, లాక్డ్ థ్రిల్లర్లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్లోని సీన్లు, డైలాగ్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ట్రైలర్లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం మహేశ్బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట #WearHelmet #SafetyFirst Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022 -
మహేశ్బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
24 హత్యలు చేసిన కీర్తి సురేష్.. ఆసక్తిగా ట్రైలర్
Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released: 'మహానటి' కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించాడు. ఇది వరకు రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. 'ఎన్ని మర్డర్లు చేశావని' రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో మూవీ ట్రైలర్ ప్రారంభమైంది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్ సూపర్బ్ అనేలా ఉంది. 24 మందిని చంపి తాను చేయబోయే 25వ హత్య గురించి చెప్పడం క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ పగ, ప్రతికారం, క్రైమ్ నేపథ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్గా పని చేసిన చిన్ని ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో మే 6 నుంచి ప్రసారం కానుంది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ 'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమంత, నయనతార మధ్య నలిగిన హీరో.. ఆసక్తిగా ట్రైలర్
Kaathu Vaakula Rendu Kaadhal Telugu Trailer Released: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్.' ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ తమిళ ట్రైలర్ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్ను శనివారం (ఏప్రిల్ 23) రిలీజ్ చేశారు. తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజ' టైటిల్తో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు. ట్రైలర్లో ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీ జోడించి డైరెక్ట్ చేశారు విఘ్నేష్ శివన్. చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్తో పోటీ ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1071263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్..(ఫోటోలు)
-
36 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమా ?.. ప్రశ్నించిన విశ్వక్ సేన్
Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభంనుంచి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్..' అనే వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా ? అదేమైనా నేరమా ? జైళ్లో పెడతారా ? అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో తెలంగాణ అబ్బాయి అర్జున్ కుమార్గా విశ్వక్ సేన్, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సార్ దిల్లాన్ కనిపించనున్నారు. 33 ఏళ్లు వచ్చిన అర్జున్కు ఎందుకు పెళ్లి కాలేదు ? సంబంధం ఫిక్స్ అయిన తర్వాత మాధవి పెళ్లి వద్దని ఎందుకు చెప్పింది ? వంటి అంశాలతో సినిమా చూసి తెలుసుకునేలా ఆసక్తిగా ట్రైలర్ ఉంది. ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్కు మంచి స్పందన లభించింది. -
నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. అదరగొడుతున్న 'ఆచార్య' ట్రైలర్
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్, ఫైటింగ్లు అభిమానులకు సూపర్ ఐ ఫీస్ట్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రేమకథతో 'అమితాబ్ బచ్చన్'.. ట్రైలర్ విడుదల
Amitabh Bachchan First Look Trailer Released: సూర్య, రీతూ శ్రీ హీరో హీరోయిన్లుగా జె. మోహన్కాంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అమితాబ్ బచ్చన్’. తార శ్రీ క్రియేటివ్ వర్క్స్పై జె. చిన్నారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. పారిశ్రామికవేత్త సుదర్శన్ రెడ్డి ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సతీష్ రెడ్డి, కందుల శివకుమార్, మణి పాల్గొన్నారు. ‘‘మా సినిమా అమితాబ్ బచ్చన్గారి బయోపిక్ కాదు. ఓ మంచి ప్రేమకథ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. చిల్లర వేణు, ఉన్నికృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం అశ్రీత్ అయ్యంగార్ అందించగా సహనిర్మాతగా అక్కల శ్రీనివాస్ రాజు వ్యవహరించారు. -
అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్
John Abraham Attack Part 1 Movie Second Trailer Release: ఇప్పటివరకూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు చేసిన సాహసాలు చూశాం. దుష్ట శక్తులతో పోరాడి కష్టాల్లో ఉన్న వారిని రక్షించిన సూపర్ హీరోలను వీక్షించాం. ఇప్పుడు ఒక కొత్త సూపర్ సోల్జర్ను చూడబోతున్నాం. అటు సూపర్ హీరోల అద్భుత శక్తి, ఇటు సైనికుల దేశభక్తిని పుణికిపుచ్చుకుని వస్తున్నాడు ఈ సూపర్ సోల్జర్. అతనెవరో కాదు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం. 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్: పార్ట్ 1'. ఉగ్రవాదులను ఏరిపారేసే తొలి సూపర్ సోల్జర్గా కనిపించనున్నాడు జాన్ అబ్రహం. ఇది వరకు ఈ సినిమా మొదటి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఆ ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం (మార్చి 22) ఈ మూవీ రెండో ట్రైలర్ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్లానే ఈ ట్రైలర్ అదిరిపోయింది. బీజీఎం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఒక సోల్జర్కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను అమర్చి, దేశ భద్రతను కాపాడలనే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందింది. సైన్స్ ఫిక్షన్, హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. -
ఆ రెండింటి మధ్య నిజం ఉంటుంది.. థ్రిల్లింగ్గా 'రన్వే 34' ట్రైలర్
Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న చిత్రం 'రన్వే 34'. నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన యాక్టర్స్ ఫస్ట్లుక్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా 'ప్రతీ సెకండ్ కౌంట్స్.. రన్ వే 34 ట్రైలర్ను విడదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అంటూ ట్రైలర్ను షేర్ చేశాడు అజయ్ దేవగన్. ట్రైలర్ ప్రారంభంలో అజయ్ దేవగన్ నో స్మోకింగ్ జోన్లో సిగరెట్ పట్టుకుని కనిపిస్తాడు. ఇందులో అజయ్ దేవగన్ పైలట్గా, రకుల్ కోపైలట్గా కనువిందు చేయనున్నారు. ఒక భయంకరమైన సంఘటన నుంచి ప్రయాణీకులను ఆ విమాన పైలట్లు ఎలా కాపాడరన్నదే కథాంశంగా ట్రైలర్ ఉంది. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫిసర్గా అమితాబ్ బచ్చన్ ఆకట్టుకున్నారు. 'చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది', 'అసలేం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అదే నిజం' వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒక ప్రమాదపు సంఘటన కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అజయ్ దేవగన్ ఎఫ్ఫిల్మ్స్' సమర్పణలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'మిషన్ ఇంపాజిబుల్' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్' సందడి..
Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో మాఫీయ డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ.. రాజారామ్..' 'ఆర్ఆర్ఆర్' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి.. 'ఖలీల్.. జిలానీ.. ఫారూక్' 'కేజీయఫ్' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. -
ఇండియాస్ సూపర్ సోల్జర్పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్
John Abraham Attack Movie Part 1 Trailer Released: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎటాక్ సినిమా మొదటి పార్ట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. 'జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి మనం పుట్టిన రోజు. మరొకటి మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్తో కట్టిపడేసింది. చాలా థ్రిల్లింగ్గా యాక్షన్ ఉంది. శశ్వాత్ సచ్దేవ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్స్ సీన్స్లో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం వావ్ అనిపిస్తుంది. ఈ మూవీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే సూపర్ సోల్జర్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎటాక్ అనేది 'జాన్ అబ్రహం ఎంటర్టైన్మెంట్' సొంత స్వదేశీ కాన్సెప్ట్. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాలు అసమానంగా ఉంటాయి. ఈ సినిమాలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ట్రైలర్లో వాటిని చూపించలేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్లను వెండితెరపైనే చూడాలి.' అని నిర్మాతల్లో ఒకరైనా జాన్ అబ్రహం తెలిపాడు. అలాగే ఈ చిత్రం గురించి డైరెక్టర్ లక్ష్య రాజ్ 'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అద్భుతమైన నటీనటులు, చిత్ర యూనిట్తో తెరకెక్కించాం. మేము పడిన కష్టాన్ని బిగ్ స్క్రీన్పై చూడనున్నారు.' అని పేర్కొన్నాడు. -
వేగంగా పరిగెత్తమంటున్న ఆది.. అలరిస్తోన్న 'క్లాప్' ట్రైలర్
Aadhi Pinisetty Starrer Clap Movie Trailer Released: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించగా.. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతమందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరెకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్లాప్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. పముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'మనం జీవితంలో ఓడిపోయేది ఎప్పుడో తెలుసా ? మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం' అంటూ ప్రారంభమైన క్లాప్ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. 'పరిగెత్తూ.. వేగంగా పరిగెత్తూ.. నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్తో' అనే డైలాగ్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది. భాగ్యలక్ష్మీ అనే యువతిని అథ్లేట్గా చేయడానికి ఆది పడిన కష్టమేంటీ అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కోచ్గా ఆది అదిరిపోయే నటన కనబర్చి ఆకట్టుకున్నాడు. -
వినోదాత్మకంగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ట్రైలర్..
Raj Tarun Starrer Stand Up Rahul Movie Trailer Out: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది క్యాప్షన్. శుక్రవారం మార్చి 4న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. 'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్ను స్టాండప్ కమెడియన్గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి. ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు. -
ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు.. యాక్షన్ థ్రిల్లర్గా ఈటీ ట్రైలర్
Suriya Etharkkum Thunindhavan Movie Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళం ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్లోనూ ఫుల్ క్రేజ్. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎతర్క్కుమ్ తునిందవన్ (ఈటీ)'. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. 'వాడేమె సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది' అనే డైలాగ్తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. 'ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు', 'పంచె ఎగ్గడితే నేనే జడ్జి' వంటి తదితర డైలాగ్లు ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. -
జర్నలిస్ట్గా ధనుష్.. ఆకట్టుకుంటున్న 'మారన్' ట్రైలర్
Dhanush Starrer Maaran Movie Trailer Released: తమిళ స్టార్ హీరో ధనుష్ తనదైన విలక్షణమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆత్రంగి రే చిత్రంతో అలరించిన ధనుష్ తాజాగా నటించిన మూవీ మారన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ త్యాగరాజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ధనుష్కు సరసన మాళవికా మోహనన్ నటిస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ఇప్పటికే అలరించగా మూవీపై అంచనాలు పెంచాయి. తాజాగా మారన్ సినిమా తెలుగు ట్రైలర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు విడుదల చేసింది. ఈ చిత్రం మార్చి 11 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ విషయానికస్తే ధనుష్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. జర్నలిజం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్ జర్నలిస్ట్గా కనిపించనన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ధనుష్, మాళవిక మోహనన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్
Pawan Kalyan Bheemla Nayak Official Trailer Out Now: పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ అవేయిటేడ్ అయిన ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే సోమవారం నాడు 8.10 గంటలకు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఒక గంట పోస్ట్ చేసి 9.10 గంటలకు భీమ్లా నాయక్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్లో తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్లు అదిరిపోయాయి. తమన్ మ్యూజిక్తోపాటు పవన్ కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్ అనిపించాయి. సోమవారం ఫిబ్రవరి 21 జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక వాయిదా పడింది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. -
భావోద్వేగంగా 'ది కశ్మీర్ ఫైల్స్' ట్రైలర్.. కంగనా ప్రశంసలు
The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్. 1990 సంవత్సరంలో కశ్మీర్లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్ వివేక్ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్పై బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Duster 1212: యదార్థ సంఘటనల ఆధారంగా
అథర్వా, మిష్టి, అనైకా సోటి హీరో హీరోయిన్లుగా బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డస్టర్ 1212’. మరిపి విద్యాసాగర్ (వినయ్), విసినిగిరి శ్రీనివాస రావు నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన చిత్రం ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో కుటుంబమంతా కలిసి చూసేలా నిర్మించాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వీరం రమణ, సంగీతం: యువన్ శంకర్రాజా.