Bharat Ratna
-
రతన్ టాటాకు భారత రత్న!.. మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన
ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.కాగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు. ముంబైలోని ఎన్సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవ్వనున్నారు. -
రాహుల్ ద్రవిడ్కు భారతరత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2024తో భారత హెడ్ కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్కప్ విజయంతో తమ కోచ్కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు. భారత్ వరల్డ్కప్ గెలవడంలో ద్రవిడ్ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు."రాహుల్ ద్రవిడ్ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు. విండీస్లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్గా ద్రవిడ్ భారత్కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్లో టెస్ట్ మ్యాచ్ సిరీస్ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్కప్ను సొంతం చేసుకుంది.ఆటగాడిగా, కెప్టెన్గా, కోచ్గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు. -
అద్వానీకి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజం, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత రత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతరత్న ప్రదాన సమయంలో కూర్చోని ఉండటం ద్వారా రాష్ట్రపతిని మోదీ ఘోరంగా అవమానించారని కాంగ్రెస్ మండిపడింది -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్ఎఫ్ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్ఎఫ్ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్పవర్గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్ఎఫ్ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్ఎఫ్ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్ఎఫ్ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్పీ డిమాండ్కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్సింగ్కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్పత్, బిజ్నోర్ లోక్సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
హరిత విప్లవ సారథి
మాన్కొంబు సదాశివన్ స్వామినాథన్.. సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికే అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలూ తపించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ► ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీ థంగమ్మై, డాక్టర్ ఎం.కె.సాంబశివన్. ► 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. మెడిసిన్లో చేరారు. ► విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు. ► వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు. ► పీజీ పూర్తయ్యాక సివిల్ సర్విసు పరీక్ష రాశారు. ఐపీఎస్కు ఎంపికయ్యారు. కానీ, అటువైపు మొగ్గు చూపకుండా హాలెండ్లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. ► 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు. ► ప్రపంచస్థాయి వ్యవసాయ సంస్థల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. పరిశోధనతోపాటు పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ► అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. ► ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ► హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్ ఏకీభవించారు. స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు. ► వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్గా, డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ► స్వామినాథన్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్ మెగసెసే, 1986లో వరల్డ్ సైన్స్, 1991లో ఎని్వరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ► 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. ► 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ గుర్తించింది. ► 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది. ► 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయన ప్రదానం చేశాయి. ► 2023 సెప్టెంబర్ 28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూశారు. -
రైతు బాంధవుడు
రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకొచ్చిన చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. కన్సాలిడేషన్ ఆఫ్ హెల్డింగ్స్ యాక్ట్ ఆఫ్ 1953, ఉత్తరప్రదేశ్ జమీందారీ, భూసంస్కరణ చట్టం–1952ని తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్లో జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. చరణ్సింగ్ ప్రతిపాదించిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్లు 1964లో ఆమోదం పొందింది. దీంతో రైతులకు మార్కెట్ లింకేజీ మెరుగైంది. ఆయన చేపట్టిన భూసంస్కరణలో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భూమి లేనివారికి భూములపై హక్కులు లభించాయి. రైతులకు సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్లో కరువు తాండవించింది. దాంతో రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, లబ్ధి చేకూర్చారు. చరణ్ సింగ్ ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) విధానం ప్రారంభమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ చౌదరీ చరణ్సింగ్. రైతన్నల హక్కుల కోసం పోరాడి వారి ఆత్మబంధువుగా పేరు పొందిన దివంగత ప్రధానమంత్రి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అవలంబించిన సోషలిస్టు ఆర్థిక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలుత కాంగ్రెస్లోనే పనిచేశారు. 1960వ దశకంలో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా రికార్డుకెక్కారు. రెండుసార్లు యూపీ సీఎంగా, ఒకసారి ప్రధానిగా సేవలందిచారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో కాంగ్రెసేతర నాయకుడు చరణ్సింగ్ కావడం విశేషం. ► చరణ్సింగ్ 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లో మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నేత్రా కౌర్, చౌదరీ మీర్సింగ్. ► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత మీరట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ►1923లో ఆగ్రా కాలేజీలో సైన్స్లో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) పూర్తిచేశారు. 1927లో ఎల్ఎల్బీ పట్టా సాధించారు. ఘజియాబాద్లో అడ్వొకేట్గా పేరు నమోదు చేసుకున్నారు. ►ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్సింగ్ ప్రభావితులయ్యారు. మహాత్మా గాంధీ, వల్లభ్బాయ్ పటేల్ వంటి నాయకుల నుంచి స్ఫూర్తిని పొందారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. పలుమార్లు అరెస్టై జీవితం అనుభవించారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్నెల్లు జైల్లో ఉన్నారు. 1940లో మరో కేసులో ఏడాది జైలుశిక్ష పడింది. 1942లో మళ్లీ అరెస్టయ్యారు. ►స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు ఉత్తరాదిన యునైటెడ్ ప్రావిన్సెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ►1937లో తొలిసారిగా యునైటెడ్ ప్రావిన్సెస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మీరట్ జిల్లాలోని చాప్రౌలీ నుంచి గెలిచారు. 1946, 1952, 1962, 1967లోనూ విజయం సాధించారు. ►1946లో యునైటెడ్ ప్రావిన్సెస్ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్ సింగ్ పని చేశారు. ►1951లో మొదటిసారి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ►1967 ఏప్రిల్ 1న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ►1970 ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్ 2న యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంలో చరణ్ సింగ్ రాజీనామా చేశారు. ►ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ చరణ్సింగ్ పాల్గొన్నారు. 1975 జూన్ 26న అరెస్టయ్యారు. ►తన సొంత పార్టీ భారతీయ లోక్దళ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ సింగ్ 1977లో లోక్సభకు ఎన్నికయ్యారు. ►జనతా ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా చేశారు. 1979 జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ప్రధానిగా పదోన్నతి పొందారు. ►జనతా పార్టీ చీలిక చరణ్ సింగ్కు కలిసివచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆగస్టు 20 దాకా కేవలం 23 రోజులే పదవిలో కొనసాగారు. ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 దాకా ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. ►గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చరణ్సింగ్ ఎంతగానో చొరవ చూపారు. ‘నాబార్డ్’వంటి సంస్థల ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. ►భారత ఆర్థిక శాస్త్రం, దేశ వ్యవసాయ రంగం, భూసంస్కరణలు, పేదరిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు. ►1987 మే 29న 84 ఏళ్ల వయసులో చరణ్సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతి డిసెంబర్ 23ను ఏటా ‘కిసాన్ దివస్’గా పాటిస్తున్నారు. -
‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ
విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్ గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్ పన్ను పెంపు, టీడీఎస్ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. పీవీ నరసింహారావు హైదరాబాద్లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్తో కుస్తీ పట్టి.. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్ మాత్రమేకాదు.. కంప్యూటర్ లాంగ్వేజ్నూ నేర్చుకున్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్ 28న నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ► 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ)లో చేరారు. ► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ► 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కారు. ► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. ► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే.. – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు వంగరలో సంబురాలు సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్ హర్షం సాక్షి, అమరావతి : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో సీఎం ట్వీట్ చేశారు. -
పీవీకి భారతరత్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ ప్రాబల్యమున్నవే. ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్సింగ్కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే. దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు. సంస్కరణల రూపశిల్పి పీవీ... మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు. మార్గదర్శకుడు స్వామినాథన్... వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు. రైతు సంక్షేమానికి అంకితం... దివంగత ప్రధాని చరణ్సింగ్ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు. స్వాగతించిన పార్టీలు పీవీ, చరణ్సింగ్, ఎంఎస్లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు. -
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం
అనేక భాషల్లో పీవీ పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పీవీ గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పీవీ, వాజపేయి లాంటివారిని బుద్ధితో చూడాలి. జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. వారి సందర్భాల్లోకి వెళ్లి అవగాహన చేసుకోవాలి. మెదడుతో చూడాలి. మనసుతో తాకాలి. అప్పుడే పీవీ నుండి ఎంతో తెలుసుకోగలం. నేర్చుకోగలం. ఓర్పు పీవీది ఎంత సుదీర్ఘ ప్రయాణం? ఎన్ని మజిలీలు? ఎన్ని సత్కారాలు? ఎన్ని ఛీత్కారాలు? ఎన్ని పొగడ్తలు? ఎన్ని తిట్లు? ఒక దశలో సర్వసంగ పరిత్యాగిలా సన్యాసం స్వీకరించడానికి పెట్టే బేడా సర్దుకున్న వైరాగ్యం. అయినా బయటపడలేదు. కీర్తికి పొంగిపోలేదు. అవమానాలకు కుంగిపోలేదు. ఓపికగా, మౌనంగా, సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు రానే వచ్చింది. అప్పుడు కూడా యోగిలా ఆ మౌనంతోనే అన్ని అవమానాలకు సమాధానం ఇచ్చాడు. తన ప్రత్యర్థుల ఊహకందనంత ఎత్తుకు ఎదిగాడు. కంచు మోగునట్లు కనకంబు మోగునా? నేర్పు ఎక్కడి తెలంగాణా పల్లె? ఎక్కడి ఢిల్లీ గద్దె? రాజకీయ పరమపద సోపాన పటంలో, అందునా అడుగడునా మింగి పడేసే పెద్ద పెద్ద పాములమధ్య పాములపర్తి పి వి ప్రధాని అయ్యాడంటే ఎంత నేర్పు ఉండాలి? ఎన్ని విద్యలు నేర్చుకుని ఉండాలి? ఎన్ని భాషలు నేర్చుకుని ఉండాలి? ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉండాలి? ఎంత ఉత్సాహం ఉరకలు వేసి ఉండాలి? ముసలితనంలో, ఢిల్లీ తెలి మంచు ఉదయాల్లో స్వెటర్ వేసుకుని కంప్యూటర్ కీ బోర్డు ముందు ప్రోగ్రామింగ్ రాయగలిగాడంటే ఎంత జిజ్ఞాస లోపల దీపమై వెలుగుతూ ఉండాలి? పది భాషలు అవలీలగా మాట్లాడాలంటే మెదడు ఎంత చురుకుగా ఉండి ఉండాలి? రాజకీయంగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ లోపల భాషా సాహిత్యాలకు సంబంధించిన ఒక మూర్తిని తనకు తాను పెంచి పోషించుకోవాలంటే ఎంత సాహితీ పిపాస ఉండి ఉండాలి? విశ్వనాథ పెద్ద నవల వేయి పడగలను సహస్రఫణ్ పేరిట హిందీలోకి అనువదించాలంటే తెలుగు ఠీవిని దేశానికి రుచి చూపించాలని ఎంత తపన ఉండి ఉండాలి? మార్పు సంప్రదాయ చట్రాల్లో ఇరుక్కుపోకుండా నిత్యం కాలానుగుణంగా మారడంలో పీవీ వేగాన్ని చాలామంది ఆయన సమకాలీనులు అందుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన కొలువులో పెట్టుకోవడం అప్పట్లో ఒక సాహసం. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేసిన మార్పులే ఇప్పటికీ దారి దీపాలు. రెవిన్యూ సంస్కరణలు, పేదవారికి హాస్టల్ చదువులు, వినూత్న నవోదయ చదువులు… రాస్తూ పొతే రాయలేనన్ని మార్పులు. చేర్పు ఎవరిని చేర్చుకోవాలో? ఏది చేర్చుకోవాలో? ఎప్పుడు చేర్చుకోవాలో? తెలిసి ఉండాలి. మన్మోహన్ ను ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. అంతర్జాతీయ యవనిక మీద భారత వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు వాజపేయిని కోరి ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. లోకానికి తెలియనివి, తెలియాల్సిన అవసరం లేనివి ఎన్నో చేర్చుకున్నాడు. కూర్పు ఎన్నిటిని ఓపికగా కూర్చుకుంటే పీవీని ఇప్పుడిలా మనం స్మరించుకుంటాం? సహనాన్ని కూర్చుకున్నాడు. తెలివితేటలను కూర్చుకున్నాడు. తెగువను కూర్చుకున్నాడు. కార్యదక్షులను కూర్చుకున్నాడు. చివరికి కాలాన్ని కూడా తనకు అనుకూలంగా కూర్చుకున్నాడు. తీర్పు ఏ నిర్ణయం తీసుకోకాకపోవడం కూడా ఒక నిర్ణయమే- అంటూ పి వి ని విమర్శించేవారు తరచు అనే మాట. టీ వీ తెరల ప్రత్యక్ష ప్రసారాల్లోకి వచ్చి చిటికెల పందిళ్లు వేస్తూ…జనం మీద సర్జికల్ స్ట్రైక్ నిర్ణయాల హిరోషిమా నాగసాకి సమాన విస్ఫోటనాలు విసిరి వినోదం చూసే నాయకులతో పోలిస్తే పి వి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో? ఏ సయోధ్య కుదరని విషయాలను ఎందుకు కాలానికి వదిలేశాడో? అర్థమవుతుంది. ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆయనకు అవసరం లేదు. ఏ తప్పు లేని వాడు దేవుడే. మనిషిగా పుట్టినవాడికి గుణదోషాలు సహజం. నేర్చుకోగలిగితే పి వి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఒదిగిన పి వి మన ఠీవి అనుకుని విగ్రహాలు పెడితే కూడళ్లలో మౌన సాక్షిగా ఉండిపోతాడు. మనం తెలుసుకుని నడవదగ్గ అడుగుజాడ పీవీ అనుకుంటే నిజంగా మన మనసుల్లో పి వీ ఠీవి అవుతాడు. :::పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
పీవీకి భారత రత్న.. కవిత ఫస్ట్ రియాక్షన్
-
PV చనిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా పట్టించుకోని కాంగ్రెస్
-
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు
#BharatRanta M S Swaminathan భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్ కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భారత హరిత విప్లవ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథన్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. #WATCH | On M S Swaminathan being conferred the Bharat Ratna, Former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, Dr Soumya Swaminathan says, "I am sure that he would have also been happy if the news had come during his lifetime.… pic.twitter.com/gz3r6udKPb — ANI (@ANI) February 9, 2024 -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్లోని కరాచీ (ప్రస్తుతం పాక్లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించటం తెలుగు ప్రజలందరికీ గౌరవం. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రదానం చేయడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna. As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU — Narendra Modi (@narendramodi) February 9, 2024 వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. It is a matter of immense joy that the Government of India is conferring the Bharat Ratna on Dr. MS Swaminathan Ji, in recognition of his monumental contributions to our nation in agriculture and farmers’ welfare. He played a pivotal role in helping India achieve self-reliance in… pic.twitter.com/OyxFxPeQjZ — Narendra Modi (@narendramodi) February 9, 2024 हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv — Narendra Modi (@narendramodi) February 9, 2024 పీవీ ప్రస్థానం.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పీవీ నరసింహారావు, చరణ్సింగ్, స్వామినాథన్లకు ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. ఎం.ఎస్ స్వామినాథ్ ప్రస్థానం.. మాన్కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మిమంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ ప్రస్థానం... జమిండారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్సింగ్. భారతీయ రైతాంగ సమస్యసల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైతు సంక్షేమానికి తుది వరకూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే చరణ్దిక్కరించిన ధీరుడు 1902లో డిసెంబర్ 23న పశ్చిమ యూపీలో మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చరణ్సింగ్.. 1923లో సైన్స్లో డిగ్రీని పొంది.. 1925లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎంఏ, ఎంఎల్ పట్టాలను పొందారు. వృత్తిపరంగానే కాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. 1937-1974 వరకూ శాసనసభ్యుడిగా వరుసుగా ఎన్నిక అవుతూ వచ్చారు. యూపీ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 1979లో ప్రధాని అయిన చరణ్ సింగ్ 170 రోజులకే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1987, మే 29వ తేదీన ఆయన అసువులు బాశారు. -
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అయితే ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పందించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా.. అద్వానీ, ప్రధాని మోదీకి సంబంధించి తనకు రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అందులో మొదటి సంఘటన.. 2002లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్కు సీఎం ఉన్న సమయంలో.. మోదీని అద్వానీ కాపాడారని తెలిపారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజపేయి.. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ఆ పదని నుంచి తొలగించి రాజధర్మను గుర్తుచేయాలనుకున్నారని తెలిపారు.కానీ, ఆ సమంయలో మోదీని సీఎం పదవి నుంచి తొలగించబడకుండా అద్వానీ రక్షించారని అన్నారు. రెండో సంఘటన.. 5 ఏప్రిల్, 2014 నాటి సమయంలో నరేంద్ర మోదీ.. గుజరాత్లోని గాంధీ లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. అప్పడు అద్వానీ.. నరేంద్రమోదీపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తన శిష్యుడు కాదని.. మంచి ఈవెంట్ మేనేజర్ అని అన్నారని తెలిపారు. ఈ మాటలు తాను అంటున్నని కాదని.. స్వయంగా అద్వానీ అన్న మాటలేనని తెలిపారు. వారిద్దరినీ (అద్వానీ, మోదీ) చూసినప్పుడు ఈ సందర్భాలు గుర్తుకువస్తాయని జైరాం రమేష్ అన్నారు. ఇక.. 2002లో మోదీని రక్షించిన అద్వానీ.. 2014లో మాత్రం మోదీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని అన్నారు. आज दोपहर मोहनपुर, देवघर में हुई प्रेस कॉन्फ्रेंस में LK अडवाणी को भारत रत्न दिए जाने को लेकर एक पत्रकार साथी के सवाल पर मेरा जवाब। In my press meet this afternoon at Mohanpur in Deoghar district of Jharkhand I was asked about the Bharat Ratna to Mr. L.K. Advani. This was my… pic.twitter.com/IjnGIgDZoL — Jairam Ramesh (@Jairam_Ramesh) February 3, 2024 -
అద్వానీకి భారత రత్న.. దేశ అత్యున్నత పురస్కారం అందుకుంది వీరే
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకూ 50 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. చదవండి: బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ! ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 50. ఎల్కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024 -
బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ!
భారత అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(96)కి అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు లాల్ కిషన్చంద్ అద్వానీ. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీకే దక్కుతుంది. ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత అద్వానీకే దక్కుతుంది. అద్వానీ చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్ను స్థాపించినప్పుడు, ప్రారంభ సభ్యులలో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జన్ సంఘ్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత 1972లో అద్వానీ సంఘ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీ జన్ సంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు.. అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 90వ దశకంలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం భారత రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి జంట 1996 లోక్సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. ఆలయ ఉద్యమం తర్వాత, అద్వానీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అద్వానీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అద్వానీ స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. కాగా అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో ‘రామ రథ యాత్ర’, ‘జనదేశ్ యాత్ర’, ‘స్వర్ణ జయంతి రథయాత్ర’, ‘భారత్ ఉదయ్ యాత్ర’,‘భారత్ సురక్ష యాత్ర’ ముఖ్యమైనవి. -
Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు. -
కర్పూరి ఠాకూర్ కు భారతరత్న
-
భారత రత్న ఇవ్వాలి!
ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించారు కానీ దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించలేదు. ఎన్నో త్యాగాలూ, సేవలూ చేసినవారికి ప్రదానం చేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రతి ఏడాదీ ప్రకటించి వారిని గౌరవించుకోవడం మన విధి. 1954 నుండి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి ఇచ్చారు. సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత రత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ అవార్డుకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్... ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారత రత్నకు పరిశీలించొచ్చు. ప్రతి ఏటా ముగ్గురికి భారత రత్న ఇవ్వొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించినట్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం లేదు. అలా ప్రకటించాలని ప్రత్యేక నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులకూ గొప్ప సంఘ సంస్కర్తలైన ఫూలే దంపతులకూ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వంటి త్యాగ ధనులకూ, ధ్యాన్ చంద్ వంటి క్రీడాకారులకూ భారతరత్న పురస్కారం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజా భివృద్ధి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా వారి త్యాగాలను ఈ తరానికి మరొక్కసారి పరిచయం చేసినట్లు అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా -
Azadi Ka Amrit Mahotsav: గంధర్వ గాయని.. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
‘‘ఆమె కంఠం అత్యంత మధురం. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశులైపోతారు. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా భగవంతునిలో లీనం అవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు’’ అని మహాత్మాగాంధీ ఓ సందర్భంలో అన్నారు. సుబ్బులక్ష్మి సంగీతంలోని సారాంశం ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే! తమిళనాడులోని మదురైలో 1916లో సుబ్బులక్ష్మి జన్మించారు. ఆమె తల్లి వీణ షణ్ముఖవడివు సంగీత విద్వాంసురాలు. తొలి రోజుల్లో సుబ్బులక్ష్మికి సంగీత గురువు ఆమే! సుబ్బులక్ష్మి చిన్నప్పటి నుంచే కళాకారిణిగా నడక సాగించారు. పురుషుల ఆధిక్యమే చెల్లుబాటయ్యే మద్రాసు లోని మ్యాజిక్ అకాడమీలో 16 ఏళ్ల వయసులో ఆమె పాడుతుంటే, సంగీత ప్రపంచం ఆసక్తిగా విన్నది. పాత్రికేయుడు, సంగీత ప్రియుడు అయిన టి.సదాశివంతో ఆమె వివాహం జరిగింది. దాంతో ఆమెకు తనదైన మార్గదర్శకుడు దొరికినట్లయింది. దేశవ్యాప్తంగా పలువురితో సత్సంబంధాలున్న సదాశివం ఆమె వృత్తి జీవితానికి పూలబాట వేశారు. రాజనీతిజు ్ఞడైన సి.రాజగోపాలాచారి సహాయంతో, సుబ్బులక్ష్మి, సదాశివం దంపతులు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కేంద్రస్థానంలో నిలిచారు. సహాయ కార్యక్రమాల కోసం కచ్చేరీలు చేసిన సుబ్బులక్ష్మి, ఎంతోమంది ప్రముఖులను అభిమానులుగా సంపాదించుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ సైతం అభిమానే! 1954లో పద్మభూషణ్ దక్కిన సుబ్బులక్ష్మిని 1998లో భారతరత్న వరించింది. సంగీత కళానిధి బిరుదు పొందిన తొలి మహిళ ఆమే! కర్ణాటక సంగీతంలో నోబెల్ బహుమతి లాంటిదని పేరున్న ఆ బిరుదును 1968లో మ్యూజిక్ అకాడమీ ఆమెకు ఇచ్చింది. 1974లో రామన్ మెగసేసే అవార్డు దక్కింది. ఆమె గళం నుంచి వచ్చిన వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామం లాంటివి ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఇప్పటికీ ఆలయాల్లో, ఇళ్లల్లో సుబ్బు లక్ష్మి గళంలో ఇవి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె సంగీతమే ఆమె జీవితం. అది తెలుసు కనుకనే ఆమె తన గాత్ర మాధుర్యం ద్వారా ఎందరి హృదయాలనో చూరగొన్నారు. అలాంటి మహా వ్యక్తి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. నాకే కాదు, నాలాగా ఆమెను కలిసిన వారందరి విషయంలో ఇది నిజం. – లక్ష్మీ విశ్వనాథన్, ‘కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్’ పుస్తక రచయిత్రి -
ఘంటసాలను భారతరత్న పురస్కారంతో గౌరవించాలి : గీత రచయిత చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమంటూ శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హాంకాంగ్ నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) జూన్ 19న జరిగిన అంతర్జాల కార్యక్రమములో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఘంటసాలకు ‘భారతరత్న’ కోసం చేస్తున్న కృషి అభినందనీయం- చంద్రబోస్ నంది పురస్కార గ్రహిత, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న పురస్కార కోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కృషి చేయడం అభినందనీయమన్నారు. గాయకుడిగా ఘంటసాల ఎన్నో అత్యద్భుత గీతాలను ఆలపించి ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాటను ప్రపంచ ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారన్నారు. సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని కొనియాడారు. ఘంటశాల అమృతం గళంనుంచి జాలువారిన దేశభక్తి ప్రభోదించే గీతాలతోపాటు, కుంతీ విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు, జాషువా గారి బాబాయ్ పాటలు మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీత లాంటివాటిని గుర్తు చేశారు. బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని సినీ పరిశ్రమలో ఎవరు అందుకొని మైలురాళ్ళను చేరుకోగలిగారనీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని, ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని, ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారతదేశ గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని మరొక ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, పార్థ నేమాని కొనియాడారు. 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గారిని మించిన భారతరత్నం ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని కొనియాడారు. పాటలతో సభికులను అలరించారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. యు.యెస్.ఏ నుండి డా. రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికాతెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు, గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. -
స్వతంత్ర భారతి: భారత రత్నాలు
తొలి భారత రత్నలు రాజాజీ (సి.రాజగోపాలాచారి) సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్లు కాగా.. తాజా (2019) భారత రత్నలు.. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ . భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్న. తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ 1954లో ఈ అవార్డును నెలకొల్పారు. కళ, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, తదితర రంగాలలోని వ్యక్తుల అత్యుత్తమ కృషికి భారత రత్నను ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై తొమ్మిది మంది ఈ పురస్కారాన్ని అందుకు న్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు. జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం లభిస్తుంది. పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. 1954లో ఆ ఏడాది జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది భారతరత్న కాగా రెండవది ఆ తర్వాత స్థానంలోని మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారతరత్నను కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు ఆయన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో సచినే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో ఆయనే అతి పెద్ద వయస్కులు. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు అయింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను ఆయన రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరణ అయ్యాయి. 1992లో ఈ పురస్కారాల ‘రాజ్యాంగ సాధికారత‘ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో అప్పుడు ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. -
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి!
ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకి భారతరత్న ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో 2022 ఏప్రిల్ 3న జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర, ఘంటసాల కుమార్తె శ్యామలలు ఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్ రవి పోనంగి (యూఎస్), న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు శ్రీలత మగతల, తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు రుద్ర కొట్టు, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామ కృష్ణ బండారులతో పాటు ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో అనేక 53 టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా రత్న కుమార్ కవుటూరు (సింగపూర్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), ఆదిశేషు (ఆస్ట్రేలియా) వ్యవహరిస్తున్నారు. -
వైఎస్సార్కు భారతరత్న ప్రకటించాలని పాదయాత్ర
సింహాచలం (పెందుర్తి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ప్రకటించాలని ఏయూ పూర్వ విద్యార్థి, వైఎస్సార్ అమరజ్యోతి స్టూడెంట్స్ అండ్ యూత్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం జెడ్.కొత్తపట్నంకి చెందిన గాలి గణేష్ ఆదివారం సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చెంత నుంచి ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టారు. సింహాచలంలోని కొండదిగువన స్వామివారి తొలిపావంచా వద్ద పూజలు నిర్వహించి అమరజ్యోతిని వెలిగించారు. అనంతరం అమరజ్యోతిని పట్టుకుని పాదయాత్రని ప్రారంభించారు. అనంతరం గాలి గణేష్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్దేనన్నారు. అందుకే ఆయనకు భారతరత్న ప్రకటించాలని, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే నెల 2న వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాదయాత్ర ఇడుపులపాయలోని ఆయన స్మృతి వనానికి చేరుకుంటుందన్నారు. -
నోరు జారిన బాలయ్య.. ఏఆర్ రెహమాన్ ఎవరో తెలియదట!
టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి నోరుజారారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోటితో సమానమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాలయ్య హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ సినిమా ఇటీవల 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటితో సమానం: బాలయ్య ఏఆర్ రెహమాన్కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు, ఆస్కార్ అవార్డు అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అని పేర్కొన్నారు. సంగీత దిగ్గజం మేస్ట్రో ఇళయరాజాతో ప్రస్తావన వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్పై బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అవార్డుల గురించి మాట్లాడుతూ.. ‘భారత రత్న అవార్డు నా తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానం. అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం. ఆయనకు గౌరవం ఏంటి?. టాలీవుడ్కు నా కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదు. ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు.’ అని వ్యాఖ్యానించారు. ఆ సత్తా ఉంది: బాలయ్య హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ కామెరూన్తో పోల్చుకుంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కామెరూన్లాగా కాకుండా తను సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తానని వెల్లడించారు. జేమ్స్ కామెరాన్ ఒక్క సినిమాను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందని బాలయ్య అన్నారు. అలాగే ఒకేసారి మూడు సినిమాల్లో నటించగలిగే సత్తా ఉందని అన్నారు. కాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. భారతరత్న పురస్కారాన్ని ఇలా కించపరచడం దారుణమని బాలయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ ఎవరో తెలియకుండానే నీ నిప్పురవ్వ సినిమాకి పనిచేయించుకున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే 1993లో బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ సినిమాకు ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్
తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాష ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. నోరు తిరగని డైలాగులను కూడా సింగిల్ టేక్లో చెప్పే ఈ దివంగత హీరోకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ బర్త్డే నేడు(మే 28). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ డిమాండ్ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చాడు. "ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరు ట్వీట్ చేశాడు. #RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7 — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021 మరణంలేని జననం ఆయనిది.. అలుపెరగని గమనం ఆయనిది.. అంతేలేని పయనం ఆయనిది.. ‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన అవిశ్రాంతయోధుడు #NTR 🙏#BharatRatnaForNTR #JoharNTR #LegendaryNTRJayanthi @tarak9999 pic.twitter.com/dlPEN9K6WG — MassGodNTRFc (@massgod_ntr_fc) May 28, 2021 చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్' మూవీ -
‘టాటాకు భారతరత్న ఇవ్వాలి’ ట్వీట్ల ఉద్యమం
పారిశ్రామిక దిగ్గజం.. టాటా సంస్థల అధినేత రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలంటూ ట్విటర్లో ట్వీట్ల వెల్లువ కొనసాగుతోంది. ప్రతిభ ఉన్న వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ.. తన ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న టాటాకు భారత అత్యున్నత పురస్కారం ప్రకటించాలనే నినాదం ట్రెండవుతోంది. నిరంతరం సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండే టాటాకు శుక్రవారం రోజున #BharatRatnaForRatanTata #RatanTata అనే హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రచారాన్ని చూసిన రతన్టాటా స్పందించారు. ఇలాంటి ప్రచారాలను మానివేయాలంటూ రతన్ టాటా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది మాత్రం మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ మొదట వివేక్ ట్వీట్ చేశారు. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఈ పోస్ట్ చేశారు. దీంతో ఆయన చేసిన విజ్ఞప్తి ట్రెండింగవుతోంది. రతన్టాటాకు భారతరత్న ఇవ్వాలనే విజ్ఞప్తికి భారీ మద్దతు లభిస్తోంది. రతన్టాటాకు భారతరత్న అనే నినాదంపై సోషల్ మీడియాలో ఓ ఉద్యమం కొనసాగుతోంది. తాజాగా దీనిపై రతన్టాటా స్పందించి ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ఓ అవార్డు విషయంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారని, అయితే వారి మనోభావాలను గౌరవిస్తా’. కానీ అలాంటి ప్రచారాలను దయచేసి నిలిపివేయాలి. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పడూ ప్రయత్నిస్తూనే ఉంటా’ అని రతన్ టాటా ట్వీట్ చేశారు. దీంతో ఆ డిమాండ్కు మరింత జోష్ వచ్చింది. చాలామంది ట్విటర్ ఖాతాదారులు రతన్టాటాకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి భవన్కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. Ratan Tata believes today`s generation of entrepreneurs can take India to next level. We confer the country`s highest civilian award Bharat Ratna for @RNTata2000 Join us in our campaign #BharatRatnaForRatanTata #RequestByDrVivekBindra@PMOIndia @rashtrapatibhvn @narendramodi pic.twitter.com/U3Wr3aMxJh — Dr. Vivek Bindra (@DrVivekBindra) February 5, 2021 -
థాంక్యూ సీఎం జగన్: కమల్ హాసన్
చెనై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనపై విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారత రత్న ఇవ్వాలని కోరినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ట్విటర్లో పోస్టు చేశారు. ‘మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. సరైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ పేర్కొన్నారు. చదవండి : ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్ Thank you Honourable CM of Andhra Pradesh. @AndhraPradeshCM. The honour you seek for our brother Shri.S.P.Balasubramaniam is a sentiment which true fans of his voice will echo, not only in Tamilnadu but throughout the whole nation. pic.twitter.com/eSeC4MnR8p — Kamal Haasan (@ikamalhaasan) September 28, 2020 కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. బాలు మరణంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రీయులు కన్నీరు పెట్టారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం. (దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్) -
ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం. -
బాలు గారికి భారతరత్న ఇవ్వాలి: నందిగామ సురేష్
సాక్షి, విజయవాడ: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం దురదృష్టకరమని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. నందిగామ సురేష్ మాట్లాడుతూ.. బాలు గారు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నందిగామ సురేష్ తెలిపారు. కాగా జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమక్కం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ పేర్కొన్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొని తీర్మానాన్ని సమర్థించారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానంపై మాట్లాడిన వారిలో ఎవరేమన్నారంటే...! చబహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ: సీఎల్పీ నేత భట్టి ‘తత్వవేత్తలే ఉత్తమ పాలకులని, వారి పాలనలోనే న్యాయం, ధర్మం సమపాళ్లలో ఉంటాయని ప్లేటో.. భావోద్వేగాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా అర్థం చేసుకుని పాలన చేసే వ్యక్తి గొప్ప నాయకుడు కాగలడని చాణక్యుడు చెప్పారు. ఈ రెండు లక్షణాలను పుణికి పుచ్చుకుని ఈ దేశాన్ని పాలించిన గొప్ప నేత పీవీ. ఆయన ఓ తత్వవేత్త, ఆర్థిక, అభ్యుదయ, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. సరళీకృత ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడారు. అణుపరీక్షల కార్యక్రమాన్ని కూడా ఆయనే ప్రారంభించారు.’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. అయితే, తన ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ విజ్ఞప్తి చేయడంతో భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. తానేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నానని చెప్పారు. మరోసారి స్పీకర్ బెల్ కొట్టి ప్రసంగాన్ని ముగించాలనడంతో ఆయన కూర్చున్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ.. పదేపదే తమను అవమానించేలా సభలో వ్యవహరించడం మంచిది కాదన్నారు. దీన్ని కేటీఆర్ వ్యతిరేకించారు. స్పీకర్నుద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, సభ్యుల బలాబలాలను బట్టి మాట్లాడే సమయం ఇస్తారన్నారు. భట్టి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని, పీవీకి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. అస్తిత్వాన్ని స్మరించుకోవడమే – మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని యావత్తు దేశం సమున్నతంగా గౌరవించేలా పీవీకి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ పోరాటం ఆస్తుల కోసం కాదు.. అస్తిత్వం కోసమని కేసీఆర్ చెప్పేవారు. ఒక్క పీవీనే కాదు.. అనేక మంది తెలంగాణ వైతాళికులు మరుగున పడేయబడ్డారు. మగ్దూం మొహినోద్దీన్, సంత్సేవాలాల్ మహరాజ్, ఈశ్వరీబాయి. భాగ్యరెడ్డి వర్మ, దాశరథి కృష్ణమాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పైడి జయరాజు, సర్వాయి పాపన్నగౌడ్... ఇలా 25 మందికి పైగా యోధులను ప్రస్తుతం స్మరించుకుంటున్నాం. వీరిని స్మరణ అంటే తెలంగాణ సొంత అస్తిత్వాన్ని స్మరించుకోవడమే. పీవీ తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక. పట్వారి నుంచి ప్రధాని దాకా ఎదిగిన నేత. పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య పతాక పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి. సముచిత గౌరవం ఇవ్వాలి – మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలకు సముచిత గౌరవం ఇవ్వాలి. వారి స్ఫూర్తిని భావితరాలకు చాటాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు ఆయన. దళిత, గిరిజన బిడ్డలు గురుకులాల్లో చదువుకుని ఎదుగుతున్నారనేందుకు ఆయనే కారణం. మద్దతిస్తున్నాం – రాజాసింగ్, బీజేపీ పీవీకి భారతరత్న కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థిస్తున్నా. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది.. కానీ సమయం చాలదు. నిజాం పాలనలోనే ఉస్మానియా గడ్డపై వందేమాతరం పాడినందుకు ఆయన బహిష్కరణకు గురయ్యారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచి నాయకుడిగా, దార్శనికుడిగా గుర్తింపు పొందారు. బీసీలకు మేలు చేశారు – గంగుల కమలాకర్, మంత్రి వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు బాగా చదువుకోవాలనే ఆలోచన ఉన్న నేత పీవీ నరసింహారావు. నేను ఇంజనీరింగ్ చదివింది కూడా ఆయన చలువతోనే. ఆయన ప్రధాని అయిన తర్వాత కలిశాం. పీవీ కన్న కలలను కేసీఆర్ నిజం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారికి ఆయన పేరు పెట్టాలి. -
చంద్రబాబుపై కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు
-
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్సభకు పోటీచేసిన ప్రణబ్ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
పీవీకి భారతరత్న... సభలో తీర్మానం చేద్దాం..!
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. హైదరా బాద్ నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డును ఉద్యానవనా లతో పీవీ జ్ఞానమార్గ్గా అభివృద్ధి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన మెమోరి యల్ను నిర్మిస్తామన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామన్నారు. శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటు ‘తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా, దేశంలోనే అనేక సంస్కరణలకు ఆద్యులుగా ప్రపంచం గుర్తించిన మహా మనిషి పీవీ. ఆయన మహోన్నత వ్యక్తిత్వంపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుతోపాటు, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా పీవీ రచించిన పుస్తకాలతోపాటు ఆయన మీద ప్రచురితమైన పుస్తకాలను పీవీ కుమార్తె వాణిదేవి సీఎంకు అందజేశారు. సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ►పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ►హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్. ►విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం. ►అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు. ►ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం. ►పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ తయారు. -
అధికారిక గుర్తింపులకు ఆయన అతీతుడు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. జాతిపితగా ప్రజలు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారని, లాంఛనప్రాయమైన గుర్తింపులకి ఆయన అతీతుడని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం..గాంధీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించాలని అనిల్ దత్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. -
భారతరత్న కంటే మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి
సాక్షి, న్యూడిల్లీ : భారతరత్నను మించిన మహోన్నత వ్యక్తి మహత్మా గాంధీ అని అత్యున్నత భారత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.మహాత్మా గాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న అభ్యర్థనను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రజలు గాంధీని మహోన్నత స్థాయిలో గుర్తించి.. జాతి పితగా నిలిపారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బాబ్డే పేర్కొన్నారు. గాంధీ మహోన్నతమైన వ్మక్తి అని, ఆయనకు ఉన్న గుర్తింపు గొప్పదని కోర్టు తెలిపింది. దేశంలో భారతరత్న అవార్డు అత్యున్నతమైనదని తెలిసిందే. అయితే భారత రత్న బిరుదు కంటే గాంధీజీకి ఉన్న గుర్తింపు మహోన్నతమైనదని కోర్టు వెల్లడించింది. గతంలో సైతం ఈ అంశంపై కోర్టులో అనేకమార్లు పిల్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. గాందీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన సేవలను తక్కువ చేసి చూసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత, ఆనంద్పుర్ సాహెబ్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్ ఎ ఆజమ్’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్ విమానాశ్రయానికి భగత్సింగ్ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్ తివారీ తెలిపారు. -
‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’
న్యూఢిల్లీ : వీరసావర్కర్కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందుత్వం కోసం పనిచేసిన వీరసావర్కర్కు భారతరత్న ఇవ్వదల్చుకున్నప్పుడు నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. ‘రెండు జాతుల సిద్ధాంతాన్ని తొలుత సావర్కర్ పరిచయం చేశారు. అనంతరం మహ్మద్ అలీ జిన్నా అనుసరించారు. ఎవరికైనా భారతరత్న ఇవ్వాలని మీరనుకుంటే గాడ్సేకు కూడా ఇవ్వండి. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను సావర్కర్ రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన అవార్డులు ఇవ్వడం సరికాదు. అయినా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ పదేపదే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని ఎందుకు తెస్తున్నట్టు’అని ఓవైసీ ప్రశ్నించారు. (చదవండి : వీర్ సావర్కర్కు భారతరత్న!) మహారాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల అమలును విస్మరించిన ప్రభుత్వం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హిందుత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఓవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మొత్తం మహారాష్ట్రాలోనే అధికం. ఇవేవీ పట్టించుకోకుండా అవార్డు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వీటి బదులు రైతుల బాగుకోసం మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయొచ్చుకదా అని చురకలంటించారు. దేశవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ హామీలేమయ్యాయని ఓవైసీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీట్రేడ్ విధానం వల్ల ఎనిమిది కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘గాడ్సేకే భారతరత్న ఇవ్వండి’
నాగపూర్ : వీర్సావర్కర్కు భారత రత్నను బీజేపీ ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ సావర్కర్కు బదులు నాథూరాం గాడ్సేకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించాలని వ్యాఖ్యానించారు. ‘మహాత్మా గాంధీని అంతమొందించేందుకు సావర్కర్ కుట్ర పన్నారనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి..అయితే గాడ్సే మాత్రం నేరుగా గాంధీని బలితీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం సావర్కర్కు బదులు నేరుగా గాడ్సేకు భారత రత్న ప్రదానం చేయాలని మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. మరోవైపు సావర్కర్కు భారత రత్న ప్రతిపాదించడంపై కాంగ్రెస్ రషీద్ అల్వీ బీజేపీపై మండిపడ్డారు. తదుపరి భారతరత్న నాథూరాం గాడ్సేకు ఇస్తారని చురకలు వేశారు. సావర్కర్ గాంధీ హత్యకు కుట్రపన్నారని అందరికీ తెలుసని, సరైన ఆధరాలు లేనందునే ఆయనను విడిచిపెట్టారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని అలీ ధ్వజమెత్తారు. -
వీర్ సావర్కర్కు భారతరత్న!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చింది. సావర్కర్తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కమలదళం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందరికీ ఇళ్లు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రాన్ని కరువురహితంగా చేసేందుకు 11 డ్యామ్లతో మహారాష్ట్ర వాటర్గ్రిడ్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ‘సీఎం పీఠంపై వివాదం లేదు’ -
భారతరత్న అందుకున్న ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. 2019కి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే. నానాజీ, భూపేన్ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భూపేన్ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. -
ఫ్యామిలీ కోటాలో రాబర్ట్ వాద్రాకు భారత రత్న!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా లక్ష్యంగా బీజేపీ పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దేశాన్ని దోచుకున్నానని అంగీకరించినందుకు ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులని చురకలు అంటించింది. దేశాన్ని లూటీ చేసిన వ్యక్తులు దేశం నుంచి పారిపోయారని, కానీ, తాను ఇంకా దేశంలోనే ఉన్నానని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ ఈ మేరకు ట్విటర్లో విమర్శలు చేసింది. ‘రాబర్ట్ వాద్రా నిజాయితీపరుడు. లూటీ చేశానని అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఫ్యామిలీ కోటా ప్రకారం ఆయన ఇప్పుడు భారత రత్న పురస్కారానికి అర్హులు’ అని బీజేపీ తన అధికారిక ట్విటర్ పేజీలో ఎద్దేవా చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడిన వాద్రా.. తాను దేశంలోనే ఉంటానని, అవినీతి ఆరోపణల నుంచి బయటపడేవరకు రాజకీయాల్లోకి రానని చెప్పారు. ‘నేను దేశంలోనే ఉన్నాను. దేశాన్ని లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఏమంటారు? నేను ఎప్పుడూ దేశంలోనే ఉంటాను. నాపై ఉన్న అభియోగాలు తొలగిపోయేవరకు నేను దేశాన్ని వీడను. రాజకీయాల్లోకి రాను. అది నా హామీ’ అని వాద్రా అన్నారు. Robert is really honest. Thanks for accepting that you looted. You are now eligible for the Bharat Ratna as per your family quota :) https://t.co/zQRl5hQ0xt — BJP (@BJP4India) 7 March 2019 -
కేంద్రంపై నిరసన.. భారతరత్న వెనక్కి?
న్యూఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రఖ్యాత సంగీ త కళాకారుడు దివంగత భూపేన్ హజారికాకు మోదీ సర్కారు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆయన కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, పార్శీలు, జైన్లు, క్రైస్తవులు మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ముస్లిమేతర వలసదారులైన వీరందరికీ భారతపౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కేంద్రం భారతపౌరసత్వ బిల్లు తెచ్చింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా భారతరత్నను తిరస్కరించాలని అమెరికాలో ఉంటున్న హజారికా కొడుకు తేజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇతర కుటుంబసభ్యుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పురస్కారాన్ని వెనక్కి ఇవ్వడమనేది పెద్ద విషయమని, కుటుంబసభ్యులు ఉమ్మడిగా నిర్ణయించాల్సిన వ్యవహారమని హజారికా సోదరుడు సమర్ వ్యాఖ్యానించారు. బిల్లును వ్యతిరేకిస్తూ, తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రముఖ మణిపూర్ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ ఇటీవల ప్రకటించారు. నిరసనలు ప్రధాని మోదీనీ తాకాయి. శనివారం అస్సాంలో ఎన్నికల ప్రచార సభకొచ్చిన మోదీకి స్థానికులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అయినా, బిల్లును మోదీ సమర్థించారు. సామాజిక వేత్త నానాజీ దేశ్ముఖ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతోపాటు హజారికాకు భారతరత్న ఇవ్వనున్నట్లు గణతంత్రదినోత్సవంనాడు కేంద్రసర్కారు ప్రకటించడం తెల్సిందే. -
ఎంత మంది ముస్లింలకు ‘భారతరత్న’ ఇచ్చారు: ఒవైసీ
ముంబై : భారత అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ఇప్పటి వరకు ఎంతమంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలకు ఇచ్చారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దళితుల ఐకాన్ బీఆర్ అంబేడ్కర్కు కూడా భారతరత్న అవార్డును హృదయపూర్వకంగా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్రలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని ఒవైసీ కేంద్రాన్ని నిలదీశారు. తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్కు భారతరత్న అవార్డును ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్లకు భారత రత్న అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారాల ప్రకటన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: ప్రణబ్దా భారతరత్న) ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సైతం ఈ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సైతం భారతరత్న అవార్డుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్ముఖ్)కు అవార్డు ఇచ్చారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్నిసృష్టించాయి. కర్ణాటక ప్రభుత్వం సైతం శివకుమార స్వామికి భారత రత్న ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. (చదవండి: ‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’) -
భూపేన్ హజారికాపై వ్యాఖ్యలకు ఖర్గేపై కేసు
మోరిగావ్: అస్సాంకు చెందిన దివంగత గాయకుడు భూపేన్ హజారికాపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. భూపేన్ హజారికాకు కేంద్రం ఇటీవలే భారత రత్న ప్రకటించగా, ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్ముఖ్)కు అవార్డు ఇచ్చారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో అస్సాం ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. -
‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.(ప్రణబ్దా భారతరత్న ) గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు కనీసం ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా’ అని రాందేవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారతరత్న అర్హత ప్రణబ్ ముఖర్జీకి లేదు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీపై తమ సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేసు వేశామని చెప్పారు. అమెరికా నుండి వచ్చి ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ అని, ఆయన చెప్పింది ఎప్పుడూ చేయలేదని విమర్శించారు. ఇవాళ అత్యంత విచారకరమైన రోజు అని, బ్లాక్ డే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రణబ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకని భారతరత్న అవార్డు ఇచ్చారో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడని ప్రణబ్కు అవార్డు ఇచ్చారని ఆరోపించారు. లోక్ సభలో మెజారిటీ ఉంది కదా అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రధానం చేస్తారా అని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్గా సేవాలందించిన బాలయోగికి ఎందుకని అవార్డు ఇవ్వలేదన్నారు. బాలయోగి దళితుడిని అవార్డు ఇవ్వలేదా? టీడీపీ కనీసం ఆ దిశగా కృషి చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. -
ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
భారత రత్నాలు
-
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం
-
ప్రణబ్దా భారతరత్న
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు నాలుగేళ్ల తరువాత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. ప్రణబ్ ముఖర్జీ 2012–17 మధ్య కాలంలో భారత 13వ రాష్ట్రపతిగా పనిచేయగా, దేశ్ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ ముఖర్జీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో దేశ్ముఖ్ ఒకరు కాగా, ఈశాన్య భారత్ నుంచి సినీరంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో హజారికా ఒకరు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ‘ నాకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నా. నేను ఎప్పటికీ చెప్పేదాన్నే మళ్లీ చెబుతున్నా. ఈ గొప్ప దేశ ప్రజలకు నేను చేసిన దానికన్నా నాకే వారు ఎక్కువిచ్చారు’ అని ట్వీట్ చేశారు. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్, దేశ్ముఖ్, హజారికాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి మార్గంపై చెరగని ముద్ర: మోదీ ప్రణబ్ ముఖర్జీ, దేశ్ముఖ్, హజారికాల సేవల్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజాసేవచేసిన ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో గొప్పవారని, దేశ అభివృద్ధి మార్గంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ‘ప్రణబ్దాకు భారతరత్న రావడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన తెలివి, ప్రజ్ఞకు సాటిగా నిలిచేవారు కొందరే ఉన్నారు’ అని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో విశేష కృషిచేసిన దేశ్ముఖ్..గ్రామీణుల సాధికారతా విషయంలో గొప్ప మార్పులకు నాందిపలికారని కొనియాడారు. ‘అణగారిన, వెనకబడిన వర్గాల పట్ల కరుణ, విధేయత కనబరచిన దేశ్ముఖ్ నిజమైన భారతరత్న’ అని పేర్కొన్నారు. ఇక హజారికా సేవల్ని ప్రశంసిస్తూ ఆయన గేయాలు తరాలకు అతీతంగా గౌరవం పొందాయని అన్నారు. ‘హజారికా పాటలు న్యాయం, సమైక్యత, సోదరభావం అనే సందేశాలిస్తాయి. భారత సంగీత సంప్రదాయాల్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ హజారికాకు భారతరత్న దక్కడం ఆనందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసిన తమలో ఒకరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల కాంగ్రెస్ గర్విస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హజారికా, దేశ్ముఖ్లకు కూడా ఈ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి సరసన ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2010లో మరణించే వరకు దేశ్ముఖ్ ఆరెస్సెస్తో సంబంధాలు కొనసాగించారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకల్పనలో, 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. రుద్రాలీ, దార్మియాన్, గాజాగామిని, డామన్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు అస్సాం సినిమాలకు హజారికా సంగీతం సమకూర్చారు. బెంగాల్ నుంచి ప్రణబ్కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. భారతరత్న పొందిన ప్రణబ్ ముఖర్జీకి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచిన ప్రణబ్ భారతరత్నకు ఎంపికవడం బెంగాల్ ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి అన్నారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎంలు కూడా ప్రణబ్కు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయన ఈ దేశానికి గొప్ప పుత్రుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది కూడా అని తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. సమాజ సేవకుడిగా.. నానాజీ దేశ్ముఖ్.. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి.. ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్రావ్ దేశ్ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలా గంగాధర్ తిలక్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి.. చాలా ఏళ్లపాటు తనే సొంతగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. 1977లో లోక్సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు. బ్రహ్మపుత్ర కవి.. సుధాకాంత భూపేన్ హజారికా నేపథ్యమిదీ.. ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఆయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రూతలూగించారు. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో హజారికా జన్మించారు. పది మంది సంతానంలో పెద్దవాడైన హజారికా బాల్యం నుంచే తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయసులో ఓ కార్యక్రమంలో అస్సామీ భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాలా, సినీ దర్శకుడు విష్ణుప్రసాద్ రాభా దృష్టిలో పడ్డారు. తరువాత 1939లో అగర్వాలా సినిమాలో రెండు పాటలు పాడారు. 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. 1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించడంతో 1949లో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ప్రముఖ హక్కుల కార్యకర్త పాల్ రాబ్సన్తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపింది. కొలంబియా యూనివర్సిటీలోనే తనకు పరిచయమైన ప్రియంవదా పటేల్ను 1950లో వివాహమాడారు. 1953లో స్వదేశం తిరిగొచ్చారు. 1967–72 మధ్యలో అసోం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998–2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు. బ్రహ్మపుత్ర తీరంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు. -
ఆయనే నాకు మార్గనిర్దేశి: అఖిలేశ్
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవిదేశాల నుంచి నేతలు, అభిమానులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. వాజ్పేయితో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వాజ్పేయితో కలిసిఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 1999లో అఖిలేష్-డింపుల్ వివాహానికి హాజరైన వాజ్పేయి ఫోటోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘అటల్ బిహారి వాజ్పేయి రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన మహానేత, పార్టీ సిద్దాంతాలను పాటిస్తూనే వ్యక్తిత్వాన్ని మరిచిపోని గొప్పనేత వాజ్పేయి. ఆయన మాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు మార్గనిర్దేశి. ఆయన మరణంతో ప్రపంచం గొప్ప నాయకున్ని, రచయితను, గొప్ప వక్తను కోల్పోయాం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. వాజ్పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల, బీజేపీ ఆగ్రనేతలు కాలి నడకన వాజ్పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. स्व. अटल जी ने राजनीति को दलगत राजनीति से ऊपर उठाया, सदैव अपने दल के सिद्धांतों व अपने दर्शन पर अडिग रहना सिखाया, जब भी राजनीति भटकी उसको सही मार्ग दिखाया, विदेशों से मित्रता का पाठ पढ़ाया. अटल जी का जाना भारतीय राजनीति एवं साहित्यिक जगत के मुखरित स्वर का मौन हो जाना है. मौन नमन! pic.twitter.com/1w4EOgr9qG — Akhilesh Yadav (@yadavakhilesh) August 17, 2018 -
లైవ్ అప్డేట్స్ : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు స్మృతిస్థల్లో త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్పేయికి కడసారి నివాళులర్పించారు. మరోవైపు అంతియయాత్రలో దారి పొడవునా అటల్ జీ అమర్ రహే నినాదాలతో మార్మోగిపోయింది. తొలుత వాజ్పేయి కన్నుమూసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్కు తరలించారు. అనంతరం వాజ్పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్పేయికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య తన చేతుల మీదుగా చితికి నిప్పంటించి మాజీ ప్రధాని వాజ్పేయి అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సాయంతో వాజ్పేయి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న దత్త పుత్రిక నమితా భట్టాచార్య, ఇతర కుటుంబసభ్యులు తాత అటల్జీ నుంచి తరచుగా బహుమతులు అందుకునే నిహారిక చివరిసారి కానుకగా ఆయన పార్థీవదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు. త్రివిధ దళాధిపతులు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధానికి తుది వీడ్కోలు. మహానేత వాజ్పేయికి నివాళుతర్పించిన పలువురు కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాజీ ప్రధాని వాజ్పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య స్మృతి స్థల్కు చేరుకుంది. వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం స్మృతి స్థల్కు బయలుదేరిన బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. వాజ్పేయి అంతియయాత్రలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్టీ నేతలు విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్పేయి మెమోరియల్కు ఏర్పాట్లు పూర్తి ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్. వాజ్పేయి అంతియాత్ర స్థలానికి బయలుదేరిన ఖర్జాయ్ రాష్ట్రీయ స్మృతి స్థల్లో రాజనీతిజ్ఞుడు, ప్రజల నేత వాజ్పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అంతిమయాత్ర కొనసాగుతున్న దీన్ దయాల్ మార్గ్ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కాలి నడకన వాజ్పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు కృష్ణ మీనన్ మార్గ్లోని నివాసంలో వాజ్పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్లు వాజ్పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. -
భారత్కు విదేశీ నేతలు
న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించేందుకు పలువురు పొరుగు దేశాల నేతలు భారత్కు రానున్నారు. ముందుగా బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్..భారత్కు చేరుకుని వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రం స్మృతి స్థల్లో అధికారిక లాంఛనాల మధ్య వాజ్పేయీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వాజ్పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. ‘భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్ తన సంతాపం తెలియజేశారు. ‘భారత గొప్ప నేతల్లో వాజ్పేయి ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు’ అని యూకే మంత్రి మార్క్ ఫీల్డ్ సానుభూతి తెలిపారు. ‘వాజ్పేయి ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తన సంతాప సందేశాన్ని పంపారు. ‘ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు’ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంతాపం తెలియజేశారు. -
గోంగూర అన్నా...ఆవకాయ అన్నా ఎంతో మక్కువ
రైలుపేట(గుంటూరు): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93) మృతి పట్ల గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పలువురు సంతాపం తెలియజేశారు. వాజ్పేయితో తమకున్న అనుబంధాలను నెమరువేసుకున్నారు. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న గుంటూరు జిల్లా కు 15 సార్లు వచ్చిన వాజ్పేయి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు సైతం గుంటూరులోనే జరిగింది. అనేకమార్లు రాజకీయ తీర్మానాలు గుంటూరు వేదికగా తీసుకున్నారు. అఖిల భారత జనసంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేస్తున్న కాలంలో 1968లో గుంటూరు జిన్నాటవర్ సెంటర్లో వీరసావర్కర్ రోడ్డును వాజ్పేయి ప్రారంభించారు. జిన్నాటవర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ రోడ్డును నిర్మించారు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్పార్టీలో ఉన్నప్పటికీ వాజ్పేయితో ఈ రోడ్డును ప్రారంభింపచేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద ఆయనకు పౌరసన్మానం కూడా చేశారు. తదుపరి జనసంఘ్ నగర అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు 1983లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా వాజ్పేయి గుంటూరులో ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుకోసం ప్రచారం చేసిన వాజ్పేయి లేరనే మాటను జీర్ణించుకోలేక పోతున్నామని వనమా ఆవేదనగా అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నలబోతు వెంకట్రావు, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెలవర్తిపాటి పాండురంగవిఠల్, జిల్లా కార్యదర్శి పునుగుళ్ల రవిశంకర్, ఉపాధ్యక్షులు సత్యన్నారాయణ వాజ్పేయి మృతికి సంతాపం తెలిపి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వాజ్పేయి మృతిపై వైఎస్సార్ సీపీ నేతల దిగ్బ్రాంతి పట్నంబజారు(గుంటూరు): భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి మృతి చెందటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాజ్పేయి మృతి భారతదేశానికి, దేశ రాజకీయాలకు తీరని లోటని పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ, సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, పార్టీ నేత పాదర్తి రమేష్గాంధీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు షేక్ జిలాని, బూరెల దుర్గాప్రసాద్, ఆళ్ళ పూర్ణచంద్రరావు, సాయిబాబుతో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని కీర్తించారు. కేంద్రంలో ఐదేళ్ల పాటు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించారని పేర్కొన్నారు. వాజ్పేయి మృతికి ఎమ్మెల్యే ఆర్కే సంతాపం మంగళగిరిటౌన్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతిపట్ల మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. నిజాయితీపరుడైన రాజకీయ వేత్తను కోల్పోయామని, విలువలతో కూడిన రాజకీయాలను నడిపి భారతదేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజపేయి మృతి దేశానికి తీరని లోటని అన్నారు. మా కుటుంబంతో ఎంతో అనుబంధం వాజ్పేయి జనసంఘ్ జాతీయ అ«ధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో మా తండ్రి జూపూడి యజ్ఙనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి హైమావతమ్మతో పాటు నేను కూడా జన్సంఘ్లో పనిచేశాం. ఈ నేపథ్యంలో సుమారు 15 సార్లు వాజ్పేయి గుంటూరులోని మా ఇంటికి వచ్చి బసచేశారు. పలుమార్లు ఆయన గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు సభలకు వెళ్లే సమయంలో నేనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వాజ్పేయిను తీసుకెళ్లాను. ఎన్నో విషయాలను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు అంతా గుంతల మయంగా ఉండి డ్రైవింగ్ ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన వాజ్పేయి ప్రభుత్వమే రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని భావించారు. అందుకే ఆయన ప్రధాని అవగానే నాలుగులైన్ల జాతీయ రహదారులను వేయించి రవాణా రంగం అభివృద్ధి చేశారు. గుంటూరు గోంగూర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు గోంగూరను అడిగి వడ్డించమనేవారు. అవకాయపచ్చడి సైతం ఎంతో ఇష్టంగా తినేవారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా అదే పిలుపు, అదే ఆప్యాయత చూపించారు. ప్రధాని అయ్యాక ఢిల్లీకి వెళ్లిన సమయంలో మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయన మృతిని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. –బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు తెనాలిలో వాజ్పేయి జ్ఞాపకాలు తెనాలి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి కన్నుమూశారన్న సమాచారం బీజేపీ అభిమానులనే కాదు, పట్టణానికి చెందిన పలువురు నాటి తరం పెద్దల మనసుల్లో విచారం నింపింది. అఖిల భారత జనసంఘ పార్టీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలోనూ రెండు పర్యాయాలు ఆయన తెనాలిని సందర్శించారు. అప్పట్లో జిల్లా కేంద్రం కూడా కాని తెనాలి పట్టణానికి రావటానికి, జిల్లాలో ఆయా పార్టీలకు మూలస్తంభం వంటి ప్రముఖుడు దివంగత తమిరిశ రామాచార్యులు ఆహ్వానం ప్రధాన కారణం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడై జనసంఘ్ పార్టీ, తర్వాత బీజేపీలోనూ జీవితాంతం కొనసాగిన రాజకీయనేత టి.రామాచార్యులు, తెనాలిలో ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలే కాదు, పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాల నిర్వహణలో చొరవ చూపారు. ఆయన ఆహ్వానంపైనే జనసంఘ సమావేశంలో పాల్గొనేందుకు 1971లో వాజ్పేయి అఖిల భారత జనసంఘ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా తెనాలికి వచ్చారు. స్వరాజ్ టాకీస్లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఢిల్లీలో వాజ్పేయి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నూతన పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగి, భారతీయ జనతా పార్టీ అవిర్భవించింది. తెనాలి నుంచి ఆ సమావేశానికి టి.రామాచార్యులు హాజరై వాజ్పేయిని అభినందించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శాఖ ఏర్పాటైంది. జిల్లా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన టి.రామాచార్యులు ఆహ్వానంపై మరోసారి వాజ్పేయి తెనాలికి వచ్చారు. తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగిన సభలో వాజ్పేయితో అప్పటి ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్పీ రెడ్డి, జానా కృష్ణమూర్తి వేదికపై ఉన్నారు. మాచర్లతో ఎనలేని అనుబంధం మాచర్లరూరల్: మాజీ ప్రధాని వాజ్పేయికి మాచర్ల నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన 1983లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోదండ రామాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
రాజకీయ భీష్ముడి జ్ఞాపకాలు
కర్నూలు(హాస్పిటల్): రాజకీయ భీష్ముడు, భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గురువారం మరణించడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు జిల్లా నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు అప్పటి సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవలను, అభివృద్ధిని కొనియాడారు. బీజేపీ అగ్రనేతగా ఆయన కర్నూలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. 1969లో జేఎస్ నాగప్ప జనసంఘ్ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీచేయగా.. ఆయన తరపున ప్రచారానికి వచ్చారు. అలాగే 1973లోనూ జనసంఘ్ పార్టీ తరపున ఆయన జిల్లాలో పర్యటించారు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మరోసారి కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత 1989–90 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్నూలు, నంద్యాలలో బీజేపీ అభ్యర్థులు కపిలేశ్వరయ్య(కర్నూలు), ఎస్పీవై రెడ్డి(నంద్యాల) తరపున ఆయన ప్రచారం చేశారు. ఎంతో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాజ్పేయి గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు బీజేపీ నాయకుల మనోభావాలు ఇలా.. కమలాలతో నివాళి నంద్యాల విద్య: భారత మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి మృతికి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన సూక్ష్మచిత్రాల ద్వారా చిత్రనివాళులర్పించారు. ఆయన కేవలం రెండు గంటల వ్యవధిలో వాజ్పేయి చిత్రపటాన్ని 620 కమలాలతో చిత్రించి నివాళులర్పించారు. కారులోనే వచ్చారు 1991లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను బీజేపీ అభ్యర్థిగా ఉన్నాను. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభకు రావాల్సి ఉండగా భారీ వర్షాలు పడటంతో విమానంలో రావడానికి కుదరలేదు. దీంతో కారులో సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఆయన భోజనం కూడా చేయకుండా మీటింగ్కు వచ్చారు. ఆ తర్వాత నంద్యాల వెళ్లాము. ఆ మీటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలకు అయ్యింది. అప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోవడంతో ఆకలిగా ఉందని చెప్పారు. చేపట్టిన పని కోసం ఏ విధంగా శ్రమిస్తారనేది ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. భారతమాత దేశభక్తి కలిగిన వ్యక్తిని కోల్పోయింది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్కు బస్సు ప్రయాణం చేసిన ఏకైక ప్రధాని ఆయనే. ముస్లింలకు హజ్ యాత్ర వెళ్లేందుకు 35 శాతం సబ్సిడీ ఇచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న లక్నో నుంచి ఆయన పలుమార్లు ఎన్నికయ్యారు. – కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకు స్వయంగా భోజనం వడ్డించారు 1980లో గుంతకల్లో, 1981లో బళ్లారికి వచ్చిన సందర్భంగా వాజ్పేయిని నేను కలిశాను. ఆయన బాగోగులు చూసుకునేందుకు కర్నూలు నుంచి నన్ను బళ్లారికి పంపించారు. బళ్లారిలోనే నేను ఉండి ఆయనతో పాటు డోన్ వరకు రైలులో ప్రయాణించాను. ఆయన భోజనం చేసిన తర్వాత ప్లేటు కడిగేందుకు వెళ్లగా ఒప్పుకోలేదు. ఆయనే స్వయంగా ప్లేటు కడిగారు. ఆ తర్వాత ఆయన మాకూ స్వయంగా భోజనం వడ్డించారు. 1989–90 ఎన్నికల్లో కపిలేశ్వరయ్య కోసం ప్రచారానికి ఆయన వచ్చినప్పుడు కూడా కలిశాను. అప్పట్లో అలంపూర్ వద్ద ఆయన కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశాము. అయితే వర్షాలు అధికంగా ఉండటంతో పైలెట్ ఒప్పుకోకపోవడంతో ఆయన కారులోనే కర్నూలుకు వచ్చారు. – ఇ. మల్లికార్జున్రెడ్డి, ఏబీపీఎం సభ్యులు, ఏకలవ్యాన్ భుజం తట్టింది ఇప్పటికీ గుర్తే వాజ్పేయితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మురళీమనోహర్ జోషి ఏక్తాయాత్ర చేపట్టి జమ్మూలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో వాజ్పేయిని కలిసేందుకు నేనూ వెళ్లాను. ఆలయం వద్ద ఆయనను కలిసి మాట్లాడాను. అంత పెద్ద నాయకుడైన ఆయన మాతో కొద్దిసేపు ముచ్చటించారు. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఓ కార్యక్రమానికి వాజ్పేయి వచ్చారు. ఆ సందర్భంగా మా తండ్రి కాళింగి పుల్లయ్యవర్మ సూచనతో నేను వాజ్పేయికి పూల దండ వేశాను. అప్పడు ఆయన నా భుజం తట్టారు. ఆ విషయం ఇంకా గుర్తుంది. – కాళింగి నరసింహవర్మ, బీజేపీ సీనియర్ నాయకులు -
స్వర్ణ చతుర్భుజి ఎంత బాగుందో..
జ్ఞాపకం :తన కలల రహదారి ‘స్వర్ణ చతుర్భుజి’పై ప్రయాణించడం మంచి అనుభూతిని మిగిల్చిందని అటల్ బిహారీ వాజ్పేయి వ్యాఖ్యానించారు. ‘ఈ రోడ్డు ఎంత బాగుందో’ అని మురిసిపోయారు. ప్రధాని హోదాలో 2004 సంవత్సరంలో ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నెల్లూరు వంటకాలను వాజ్పేయి రుచి చూశారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన హెలికాప్టర్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ సభ ముగిసే సరికి చీకటి పడింది. హెలికాప్టర్ ద్వారా ప్రయాణించేందుకు భద్రతా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన రహదారి మీదుగా చెన్నైకు బయలుదేరారు. హెలికాప్టర్లో కాకుండా రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుందని వాజ్పేయికి వెంకయ్యనాయుడుతోపాటు అధికారులు చెప్పినపుడు ఆయన ఎంతో çసంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కలకల రహదారైన స్వర్ణ చతుర్భుజి మీదుగా ప్రయాణించడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని చెన్నైకి వెళ్లిన తరువాత అటల్ వ్యాఖ్యానించారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వాజ్పేయి చేపట్టి పూర్తి చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్కతా వరకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి(నాలుగు లేన్లు) నిర్మించారు. అందులో భాగంగా జిల్లాలో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. గురువారం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. జిల్లాతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఐదుసార్లు జిల్లాకు వచ్చి వెళ్లారు. ఆయన జ్ఞాపకాలను జిల్లావాసులు గుర్తుచేసుకుంటున్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శం అని, ఆయన మృతి దేశానికి తీరని లోటని జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజాపతినిధులు పార్టీలకు అతీతంగా పేర్కొన్నారు. వాజ్పేయికి నెల్లూరు జిల్లాతో ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం నెల్లూరు(బారకాసు):జనసంఘ్ పార్టీని స్థాపించిన తరువాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రక్రియలో భాగంగా 1977లో ఆయన నెల్లూరుకు వచ్చారు. అప్పుడు పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసంఘ్ తరపున అన్నదాత మాధవ రావు విజయం సాధించి పార్టీకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆ తరువాత జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైన తరువాత అందులో నుంచి బయటకు వచ్చేసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన మొదటి సంవత్సరంలో నగరంలోని పురమందిరం(టౌన్హాల్)లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. 1983లో ఆయన ఉదయగిరిలో ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు మద§ద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ తరపున ఇందిరాగాంధీ కూడా జిల్లాకు వచ్చారు. అప్పట్లో ఆయన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. హిందీ, ఇంగ్లిష్లో మాట్లాడినా.. కొద్దిపాటి భాషా పరిజ్ఞానం ఉన్నవారికి కూడా సులభంగా అర్థమయ్యేది. ప్రసంగంలో ఆయన ఉపయోగించే కవితలు, చమత్కారాలు ఎంతగానో ఆకట్టుకునేవి. అంతేగాక విమర్శలు చేసేటప్పుడు కూడా ఎంతో సంస్కారవంతమైన పదాలను ఉపయోగించి తన హుందాతనాన్ని నిలుపుకునే వారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వూరు రాధాకృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. అందులో పాల్గొన్న వాజ్పేయి కాంగ్రెస్, టీడీపీపై చేసిన విమర్శలను కూడా ప్రజలను ఆసక్తిగా వినడం గమనార్హం. వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా వాజ్పేయి పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చే వాజ్ పేయి సభలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరయ్యేవారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఆయన సభలకు హాజరై ఆయన ప్రసంగాలు విని ఆనందించేవారు. 2004లో భారత ప్రధానిగా ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. అప్పట్లో ఏసీ సుబ్బారెడ్ది స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పా ల్గొన్నారు. ఆ రోజున వాజ్ పేయికి మోకాలు నొప్పి అధికం కావడంతో ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అతిథి గృహానికి పిలిపించుకుని వారితో ముచ్చటించారు. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ను రాజకీయాలలోకి రావాలని కూడా ఆయన ఆహ్వనించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన షార్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. 2003లో షార్ కేంద్రానికి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరును ప్రధానిగా వాజ్పేయి పెట్టారు. షార్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో ఆవిష్కరించారు. షార్ కేంద్రాన్ని చూస్తే తనలో నూతనోత్సాహం వస్తుందని పలుమార్లు ఆయన శాస్త్రవేత్తలకు తన మనసులోని మాటను తెలిపారు. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ నామకరణం చేసింది వాజ్పేయి సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్స్పేస్సెంటర్ (షార్) కేంద్రంతో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన 1999 నుంచి 2004 దాకా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999 మే 26న షార్లో నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ2 ప్రయోగానికి విచ్చేశారు. ఆ ప్రయోగంలో సముద్రాల మీద ఆధ్యయనం చేసేందుకు ఐఆర్ఎస్–పీ4 (ఓషన్శాట్)తో పాటు కిట్శాట్–3, ఉత్తరకొరియాకు చెందిన డీఎల్ఆర్ మైక్రోశాటిలైట్స్, జర్మనీ టబ్శాట్ అనే ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించారు. ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు వాజ్పాయి ప్రధాని హోదాలో విచ్చేశారు. అప్పటిదాకా అందరు ప్రధానులు మిషన కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని తిలకించేవారు. అలాంటింది ప్రయోగాన్ని దగ్గరగా తిలకించాలని కోరడంతో ఆయన కోసం ప్రయోగవేదికకు సుమారు ఐదు కిలోమీటర్లు దూరంలో ఒక కూడలిలో అప్పట్లో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా ఒక షెడ్డు వేశారు. దీనికి త్రీడీ గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు. ఆ త్రీడీ గ్లాసుల్లో నుంచి ప్రయోగాన్ని మొదటి దశలో మండే దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ప్రయోగాన్ని తిలకించిన తరువాత మిషన్ కంట్రోల్ సెంటర్కు విచ్చేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత 2004లో షార్ కేంద్రానికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా పేరు మార్పుచేసినపుడు వాజ్పేయి చేతులు మీదుగా ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆవిష్కరించారు. ఆయన షార్కు విచ్చేసినపుడు అప్పటి ఇస్రో చైర్మన్ కస్తూరిరంగన్, అప్పటికి షార్ డైరెక్టర్ వసంత్ ఘనంగా స్వాగతం పలికారు. వాజ్పేయి మరణం తీరనిలోటు నెల్లూరు(బారకాసు):మాజీ ప్రధాని వాజ్పేయి మరణం బీజేపీ శ్రేణులకు తీరని బాధ కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ తెలిపారు. ఆయన మరణానికి తాము సంతాపాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రోడ్లు, నదులు అనుసంధానం, ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశాన్ని అభివృద్ధి పథంలో వాజ్పేయి తీసుకెళ్లారన్నారు. ఆయనకు నెల్లూరుజిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే ఆవేదన కలుగుతుందన్నారు. వాజ్పేయి మృతికి మేకపాటి సంతాపం నెల్లూరు(సెంట్రల్): మాజీ ప్రధాని, భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అటల్ బిహారీ వాజ్పేయి మృతిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబం లో జన్మించి, అత్యున్నత శిఖరాలను చేరిన ఆయన జీవితం దేశానికే గర్వకారణం అని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలను కలు పుతూ రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రధానిగా ఉండి కూడా ఏ మాత్రం ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రధానంగా కార్గిల్ యుద్ధంలోనూ , ప్రోక్రాన్–2 అణుపరీక్షల నిర్వహణలోనూ ఆయన స్థిర చిత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 1999లో ఆయన ప్రభుత్వం ఒకే ఒక ఓటుతో విశ్వాసం కోల్పోయిన ఘటన ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణం తెలిపారు. పదవిని తృణపాయంగా విడిచిపెట్టి భావి తరాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేశారని రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి యువతకు అభినందనలు నెల్లూరు(బృందావనం):గుజరాత్లో 2001సంవత్సరం జనవరిలో జరిగిన భూకంపం కారణంగా బాధితులైన వారిని ఆదుకున్న అఖిలభారత చిరంజీవి యువతను అప్పటి భారత ప్ర«ధాని అటల్బిహారీవాజ్పేయి అభినందించారని యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరుకు చెందిన చిరంజీవి అభిమాని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూకంప బాధితులను అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన చిరంజీవి యువత నాయకులు సురేష్(కర్నూలు), బషీర్(ఒంగోలు), ఆనందరాజు(హైదరాబాద్), రవీంద్రబాబు(గుంటూరు) తదితరులతో కలసి రెండునెలలకు పైగా కచ్ప్రాంతంలో విశేష సేవలందించామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తామంతా అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయిని ఆయన కార్యాలయంలో కలసి తమ సేవలను వివరించామన్నారు. అలాగే తాము అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించిన రూ.3లక్షల చెక్కును అందజేశామని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తాముచేసిన సేవలను గుర్తించి ఎంతో ప్రశంసించారని, అలాగే అభిమానులుగా స్వయంగా వచ్చి సేవలందించడంపట్ల, నటుడిగా ఉన్న చిరంజీవికి అభినందనలు తెలిపారన్నారు. -
తిరుమదిలో వాజ్పేయి
రాజకీయాల్లో మెరిసిన భారత రత్నం అటల్ బిహారీ వాజపేయి. పార్లమెంటరీ విలువలకు నిలు వెత్తు నిదర్శనం ఈ నిష్కళంక రాజనీతిజ్ఞుడు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసినా నీతిమాలిన చర్యలకు పాల్పడని గొప్ప ఆదర్శవాది. ప్రతిభ ఆధారంగా వరించి వచ్చిన పదవులకు వన్నెలద్దిన మహనీయుడు. భారత పార్లమెంటరీ చరిత్ర పుటల్లో తనదైన ముద్రవేసుకున్న మహానుభావుడు. గురువారం ఆయన దివంగతులయ్యారని తెలియగానే జిల్లా ప్రజానీకం శోకతప్త హృదయాలతో నివాళులర్పించింది. ఆయనకు జిల్లాకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది. సాక్షి, తిరుపతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తిరుమల వాసులకు చిరకాలం గుర్తుండే నాయకుడు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో కళ్యాణీ డ్యాం నుంచి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని అని తిరుమల వాసులు చెప్పుకుంటున్నారు. ఆయన మరణంతో తిరుమల వాసులు సంతాపం తెలియజేశారు. 1997–98 మధ్య కాలంలో తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ సమయంలో అప్పటి టీటీడీ ఈఓ ఐవీ సుబ్బారావు నీటి సమస్య తీర్చేం దుకు అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలోని కళ్యాణీ డ్యాం నుంచి నీటిని తిరుమలకు తీసుకురావాలని నిర్ణయించారు. 1999 నవంబర్ 18న కళ్యాణీ డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపింగ్ చేయటానికి భూమిపూజ చేశారు. పంపిం గ్ పనులను 61 రోజుల్లో పూర్తి చేశారు. 2000లో తిరుమలకు వచ్చిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించా రు. దానికి కళ్యాణి గంగ అని నామకరణం చేశారు. ఆ సందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అప్పటి టీటీడీ తొలి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రాంబాబు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు 1999, ఆ తర్వాత 2003లో ప్రధాన మంత్రి హోదాలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో తిరుపతి దూరదర్శన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 1981లో బీజేపీ జాతీయ పార్టీ అ«ధ్యక్షుని హోదాలో అటల్ బీహార్ వాజ్పేయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో వాజ్పేయి.. ప్రధాని కాకముందు నుంచే వాజ్పేయి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1981లో బీజేపీ తిరుపతి కోనేటి కట్ట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తంబళ్లపల్లె, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, తిరుపతిలో పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు.. వాజ్పేయి మృతి పట్ల జిల్లాలోని బీజేపీ నాయకులు సంతాప సభలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లెలో చల్లపల్లి నరసింహారెడ్డి వాజ్పేయితో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. 1980లో తాను పార్టీలో చేరిన సమయంలో వాజ్పేయిని కలిసినట్లు తెలిపారు. ఆయన పలుకరింపు ఎప్పటికీ మరచిపోలేనన్నారు. -
‘తండ్రిని రాముడిగా, కూతుర్ని దుర్గగా వర్ణించారు’
న్యూఢిల్లీ : రాజకీయాల్లో అజాతశత్రవుగా ఎదిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూశారు. పదిసార్లు లోక్సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిక్కచ్చిగా, సూటిగా మాట్లాడే వాజ్పేయి అంటే విపక్ష నేతలకు కూడా అభిమానమే. జవహర్లాల్ నెహ్రూ అంటే తనకు చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించేవారు వాజ్పేయి. రాజకీయ రంగంలో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అయితే వాజ్పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో జోస్యం చెప్పారు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది వివరాలు.. 1957లో వాజ్పేయి తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ నుంచి రెండో లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా లోక్సభలో క్రీయాశీలంగా ఉండేవారు వాజ్పేయి. ఆయన ఉత్సాహం నెహ్రూను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నెహ్రూ, వాజ్పేయిని బ్రిటీష్ ప్రధానికి పరిచయం చేస్తూ.. ‘ఇతను మా లోక్సభలో యువ ప్రతిపక్ష నేత. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. నాకు మాత్రం ఇతనికి గొప్ప భవిష్యత్తు ఉండబోతోందనిపిస్తోంది. మా దేశంలో వికసిస్తోన్న యువ పార్లమెంటేరియన్లకు ఇతను ప్రతీక’ అంటూ వాజ్పేయి భవిష్యత్తు గురించి స్వయంగా నెహ్రూ అనాడే జోస్యం చెప్పారు. వ్యక్తిగతంగా అభిమాని.. రాజకీయాల్లో ప్రత్యర్థి ఒకసారి వాజ్పేయి నెహ్రూని విమర్శిస్తూ.. ‘పండిట్జీ మీరు శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ దేశంలో జరిగే విషయాలను కూడా అలా తలకిందులుగానే చూస్తానంటే కుదరదం’టూ విమర్శించారు. వ్యక్తిగతంగా నెహ్రూ అంటే ఎంతో అభిమానమున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి తన బాధ్యతలను విస్మరించేవారు కారు. అందువల్లే నెహ్రూ 1961లో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రతా మండలీలో వాజ్పేయిని నియమించారు. ఆయన శ్రీరాముడిలాంటి వారు నెహ్రూ పట్ల తన గౌరవాన్ని చూపించడంలో వాజ్పేయి ఎవరికి భయపడేవారు కారు. 1964లో నెహ్రూ మరణించినప్పడు వాజ్పేయి మాట్లాడుతూ.. ‘ఒక కల చెదిరిపోయింది.. విశ్వంలో ఒక జ్వాల మరుగునపడిపోయింది. ఆకలి, భయమంటే తెలియని ప్రపంచం గురించి కలగన్న గులాబీ నేడు రాలిపోయింది. చీకటితో పొరాడి మాకు దారి చూపిన వెలుగు అస్తమించిందం’టూ నివాళులు అర్పించారు. అంతేకాక నెహ్రూ చాలా నిజాయితీ గల వ్యక్తి, చర్చలంటే భయపడే వారు కారంటూ నెహ్రూను, వాజ్పేయి శ్రీరామునితో పోల్చారు. కూతురితోనూ ఢీ... అయితే వాజ్పేయికి నెహ్రూతో ఉన్నంత మంచి సంబంధాలు ఆయన కూతురు ఇందిరా గాంధీతో లేవు. 1970లో ఒకసారి పార్లమెంట్లో వాడివేడి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇందిరా గాంధీ జన్ సంఘ్ను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక తాను తల్చుకుంటే జన్సంఘ్ను 5 నిమిషాల్లో నాశనం చేస్తానంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఇందిరా గాంధీ. అయితే తర్వాత మాట్లాడిన వాజ్పేయి ప్రధాని ఇందిరా గాంధీ మాటలకు ధీటుగా బదులిస్తూ ‘ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధాని ఇలా మాట్లాడటం సమంజసమేనా’ అంటూ విమర్శించారు. అంతేకాక ఆమె(ప్రధాని ఇందిర) జన్సంఘ్ను కేవలం 5 నిమిషాల్లో నాశనం చేస్తానని అన్నారు... 5 నిమిషాల్లో ఆవిడ తన జుట్టునే సరిచేసుకోలేరు అలాంటిది జన్సంఘ్ను ఎలా మారుస్తారంటూ’ వాజ్పేయి ప్రశ్నించారు. అంతేకాక నెహ్రూజీ కూడా కోప్పడేవారని, కానీ ఇలా మాత్రం మాట్లాడేవారు కారంటూ గుర్తు చేశారు. ఇందిరను దుర్గా దేవిగా అయితే మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగడటానికి వాజ్పేయి ఏ మాత్రం సిగ్గుపడే వారు కారు. అందుకే1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో వాజ్పేయి, పార్లమెంట్ సాక్షిగా ఇందిరా గాంధీని దుర్గామాతాతో పోల్చారు. అలానే కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోను వాజ్పేయికి మంచి స్నేహం ఉండేది. వాజ్పేయి చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం ‘రాజకీయ చదరంగం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ప్రజస్వామ్యం ఎన్నటికి నిలిచి ఉంటాయి’. -
కరుణపైనే ఆయనకు మక్కువ
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలోకి వచ్చేలా బలోపేతం చేసిన ఆ పార్టీ నేతల్లో ప్రథముడు అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పక తప్పదు. అయితే అంతటి మహానేత జీవితంలో చారిత్రాత్మక చేదు అనుభవాన్ని తమిళనాడు మిగిల్చింది. 1996లో అటల్ ప్రభుత్వం తొలిసారిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రధాని పదవికి వాజ్పేయి రాజీనామా చేశారు. ఎన్డీఏలో లేని కొన్ని ఇతర పార్టీల వారు వాజ్పేయ్కి లోపాయికారితనంగా మద్దతుపలుకుతామన్నా అయన అంగీకరించలేదు. ఎంపీలను కొనుగోలు చేయడం వంటి నీతిబాహ్యమైన పనులకు పాల్పడడం తనకు నచ్చదు. అందుకే మెజార్టీ లేదని ఒప్పుకుంటూ రాజీనామా చేస్తున్నానని వాజ్పేయ్ నిజాయితీగా తప్పుకున్నారు. ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత 1998–99లో వచ్చిన మద్యంతర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాగా వాజ్పేయి ప్రధాని అయ్యారు. ఆనాటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమి తమిళనాడులో 39కి గానూ 30 సీట్లు గెలుచుకుని జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను పొందింది. అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించగా అప్పటి ఎన్నికల్లో ఎన్డీఏకి 255 సీట్లు దక్కగా 37.5 శాతం మెజార్టీతో అత్యధిక శాతం సీట్లు కలిగిన కూటమిగా కేంద్రంలో వాజ్పేయ్ నేతృత్వంలో ప్రభుత్వం అవతరించింది. కేంద్రంపై తనకు పూర్తి పట్టు ఉండడంతో జయ కొన్ని కోర్కెలను వాజ్పేయ్ ముందుంచింది. తనపై ఉన్న అన్ని అవినీతి కేసులను ఎత్తివేయాలని, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జయ కోరారు. ఇందుకు వాజ్పేయ్ ప్రభుత్వం నిరాకరించడం జయకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వ బలపరీక్ష సమయంలో జయ తన చేతిలో ఉన్న ఒకే ఒక ఓటును వ్యతిరేకంగా వేయడం ద్వారా 13 నెలల వాజ్పేయ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఈ రకంగా వాజ్పేయ్కి తమిళనాడుతో శాశ్వతమైన చేదు అనుభవమే మిగిలింది. తమిళనాడుతో తరగని అనుబంధం: ♦ 1983–84 మధ్యకాలంలో బీజేపీ నేతగా వాజ్పేయ్ తొలిసారి తమిళనాడులో కాలుమోపి కోయంబత్తూరుకు వచ్చారు. ♦ 1995లో ఎండీఎంకే మహానాడుకు వాజ్పేయ్ హాజరయ్యారు. ♦ 1995లో మదురైకి, 1997లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని హోదాలో తిరుచ్చిరాపల్లికి వచ్చారు. ♦ రెండోసారి ప్రధాని అయినపుడు 1999లో శ్రీలంక ఈలం తమిళుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అప్పటి తమిళనాడుముఖ్యమంత్రి కరుణానిధితో పలుమార్లు మాట్లాడారు. ♦ 2001లో తిరుచ్చిరాపల్లి పర్యటనలో వాజ్పేయితోపాటూ వైగో, డాక్టర్ రాందాస్, కాంగ్రెస్ నేత కుమారమంగళంతోపాటూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉండడం చెరిగిపోని చరిత్ర. ♦ కావేరి జలవివాదంపై 2002–03 మధ్య కాలంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శ్రీకృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వంతో చర్చలు జరిపారు. ♦ 2004 ఏప్రిల్లో రోడ్డు మార్గంలో నెల్లూరుకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని వాజ్పేయ్కి ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలకడం ద్వారా స్నేహాన్ని పెంచుకున్నారు. ♦ తమిళనాడులోని అందరు నేతల కంటే కరుణానిధి అంటే వాజ్పేయ్కి ఎంతో ప్రేమాభినాలు కనబరిచేవారు. -
వాజ్పేయికి ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్, ఛాతీ సంబంధిత సమస్యతో గత కొన్ని రోజులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన గురువారం కన్నుమూశారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్కు తరలించారు. కృష్ణ మీనన్ మార్గ్లోని నివాసంలో వాజ్పేయిని కడసారి చూసేందుకు హాజరైన పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ మీనన్ మార్గ్లోని నివాసంలో వాజ్పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్లు వాజ్పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం వాజ్పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివస్తున్నారు. వాజ్పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత వాజ్పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్పేయి మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది. -
వాజ్పేయి కేవలం ముసుగు మాత్రమే!
న్యూఢిల్లీ : భారత్లోని వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు ఓ సరికొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు.. పార్టీల సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయి (93) కన్నుమూశారు. ‘ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ (సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి)గా ప్రజల చేత పిలువబడిన వ్యక్తి వాజ్పేయి. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా ఆయన అవలంభించిన ఆదర్శాలే ఇందుకు కారణం. వాజ్పేయి తన జీవితంలో పాటించిన ఆదర్శాల గురించి ఆయనతో సుదీర్ఘంగా కలిసి ప్రయాణించిన సంఘ్ ప్రచారకర్త, తెలుగువారైన కేఎన్ గోవిందాచార్య ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో వాజ్పేయి పాటించిన కొన్ని ఆదర్శాలే నేడు ఆయనను అజాతశత్రువుగా నిలిపాయి. ఆయన ‘అధికారం కావాలి కానీ దానికోసం ఎవరి ముందు చేయి చాచను.. దేనికి తలవంచను’ అనే వారు. ‘ఉత్తమమైన రాజకీయాలంటే ప్రజలతో కూడినవే కానీ అధికారంతో కూడినవి కాదు అనే వారు. రాజకీయాలు ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసేవిలానే ఉండాలి కానీ అధికారం కోసం అర్రులు చాచేవిగా ఉండకూడదు అనేవారని’ గోవిందాచార్య తెలిపారు. వాజ్పేయ్ నమ్మిన అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే వ్యక్తిగత, రాజకీయ ఆశయాలు పార్టీకి లోబడి ఉండాలి.. పార్టీ ఆశయాలు దేశ, సామాజిక ప్రయోజనాలకు లోబడి ఉండాలనేవారు. ఆయన కూడా అలానే నడుచుకునే వారన్నారు గోవిందాచార్య. వాజ్పేయి నమ్మిన మరో రెండు సిద్ధాంతాలు ‘ఎవరూ కూడా వివాదాస్పద రాజకీయాల్లో మునిగిపోకూడదు. మన చేతలు, మాటల ద్వారా ప్రజలకు సన్నిహితంగా ఉండాలి అనే వారు. అంతేకాక పార్టీలో ఉన్న వారు వారి వారి ఆశయాల సాధన కోసం వివాదరహితంగా ఉంటూ పనిచేయాలి’ అనే కోరుకునే వారని గోవిందాచార్య తెలిపారు. అయితే వాజ్పేయి, గోవిందాచార్యలకు 1997లో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి రిపోర్టుల ప్రకారం జనరల్ సెక్రటరీగా పని చేస్తోన్న గోవిందాచార్య ‘ఎల్కే అడ్వాణీయే అసలైన నాయకుడు .. వాజ్పేయి కేవలం ముసుగు మాత్రమే’ అనే ఆరోపణలు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాటలు తన ప్రధాని హోదాకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ వాజ్పేయి అడ్వాణీకి లేఖ రాశారు. ఈ విషయం గురించి గోవిందాచార్య ‘ఆ వివాదం 1997, అక్టోబర్ 3 న మొదలై.. అక్టోబర్ 30 1997 ముగిసింది. నేను వాజ్పేయిని బీజేపీ ముసుగు అన్నాను. కానీ మీడియా నా మాటలను వక్రీకరించింది. అందులో నా తప్పేం లేదు అని ఆయనకు తెలియజేయడం కోసం 17 పేజీల లేఖ రాశాను. ఆయన అప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ 1998లో నన్ను మరోసారి జనరల్ సెక్రటరీగా నియమించారు. అంటే ఆ వివాదం అప్పటికే ముగిసినట్లే కదా’ అన్నారు. అంతే కాక కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి (బీజేపీ), ఆర్ఎస్ఎస్కి బేధాభిప్రాయాలు వచ్చేవి. ఆ సమయంలో వారు ఒకరికొకరు ఎదురు పడేవారు కాదు అని తెలిపారు. ఇన్సూరెన్స్లో ఎఫ్డీఐలను అనుమతించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ, పెటేంట్ చట్టాలు, తెహ్రీ డ్యాం, రామజన్మభూమి వంటి అంశాల్లో బీజేపీకి, సంఘ్కి మధ్య విబేధాలు తలెత్తాయి అని తెలిపారు. -
అటల్ జీ.. ఓ జ్ఞాపకం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. శత్రు దేశంలో సైతంఅభిమానులను సంపాదించుకున్న గొప్ప దార్శనికుడిగా మాజీ ప్రధాని అటల్ బిహారివాజ్పేయి గుర్తింపు పొందారు. అంతటి గొప్పనేత గురువారం సాయంత్రం మృతి చెందారు. అటల్ మరణంతో నగరం కన్నీటి పర్యంతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా,ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు.ఇక్కడితో ఆయనకున్న అనుభవాలు, బంధాలను సిటీ నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాక్షి,సిటీబ్యూరో, మేడ్చల్/బంజారాహిల్స్/నాగోలు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి ఇక లేరనే వార్త నగర వాసుల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతితో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు. ప్రధానిగా ఉన్న సమయంలో నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన చేతులమీదుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా అటల్జీతో గడిపిన ఆత్మీయ క్షణాల్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ముందస్తు ఎన్నికల ప్రకటన.. 2004 లోక్సభకు జరిగిన ముందస్తు ఎన్నికల నిర్ణయం ట్యాంక్బండ్ సమీపంలోని మారియట్ హోటల్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నదే కావటం విశేషం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వాజ్పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో ఆయన రెండుసార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితర నేతలు వాజ్పేయితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాదాపూర్లోని సైబర్ టవర్ను 1998 నవంబర్ 22న ప్రధాని హోదాలో ఆయన ప్రారంభించారు. 1994లో మేడ్చల్ పట్టణానికి వాజ్పేయి వచ్చారు. ఐఎస్బీ ప్రారంభోత్సవానికి.. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్బీ)ను 2001 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. 1989లో నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రైలులో వచ్చిన ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగి కొంత సేపు ఈ ప్రాంత బీజేపీ నాయకులతో ముచ్చటించారు. పలువురు నేతల సంతాపం ఉగ్రవాదంపై అంతర్జాతీయ యూత్ కన్ఫరెన్స్ను ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో 2003లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని హోదాలో అటల్ బీహారీ వాజ్పేయి పాల్గొన్నారు. వాజ్పేయితో తన స్ఫూర్తిదాయక అనుబంధం ఉందని ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి అన్నారు. సంస్కరణలకు జీవం పోసిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. వాజ్పేయి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పద్మారావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి యువమోర్చా నాయకుడు స్వామిగౌడ్, బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి కటకం నర్సింగ్రావులు వాజ్పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి మృతికి సంతాపం సాక్షి, సిటీబ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప కవి, సాహితీవేత్త మహోన్నతుడని తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అన్నారు. గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవి సమయం, భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల 106వ జయంతి, స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పెద్దలు కనిపించని లోకానికి వెళ్లారని, అయినా వారు అందించిన పరిమళాలు ఇప్పటికి ఉన్నాయని తెలిపారు. తెలుగు చరిత్రలో వానమామలై వరదాచార్యులది సుస్థిర స్థానమన్నారు. ఈ సందర్భంగా భారత్ భాషా భూషణ్ డాక్టర్ తిరునగరికి స్మారక పురస్కార ప్రదానం చేశారు. సభలో ప్రారంభంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో కవి సమయం నిర్వాహకులు తాళ్లపల్లి మురళీధరగౌడ్, సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు చేయూతనిచ్చారు.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో సేవ చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి ఫీరాసత్అలీ బాక్రీ పేర్కొన్నారు. గురువారం వాజ్పేయి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం చీరాగ్అలీలైన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 1977– 79లో వాజ్పాయి విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో పాస్పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పొషించారని కొనియాడారు. 1996లో ధూల్పేట్కు.. అబిడ్స్: 1996లో ధూల్పేట్ను అటల్ బిహారీ వాజ్పేయి సందర్శించారు. ధూల్పేట మినీ స్టేడియంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్సింగ్ జెమేదార్ నిర్వహించిన అటల్ కేసరి కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కుస్తీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. నిర్వాహకులు వాజ్పేయిని ఘనంగా సత్కరించి మార్వాడీ టోపీ, తల్వార్ను బహూకరించారు. -
వాజ్పేయి సహాయకుడిగా..
అద్వానీ తన జీవిత చరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ పుస్తకంలో.. వాజ్పేయితో అనుబంధాన్ని పంచు కున్నారు. అప్పుడే లోక్సభకు కొత్తగా ఎన్నికైన వాజ్పేయికి రాజకీయ సహయకుడిగా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ.. ‘వాజ్పేయి తీసుకున్న అణుపరీక్షల నిర్ణయం, పాకిస్తాన్తో సంబంధాల పునరుద్ధరణకు నిజాయతీగా చేసిన ప్రయత్నాలు మన దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి’ అని కొనియాడారు. ఎలాంటి గొడవలు జరగకుండా వాజ్పేయి నాయకత్వంలో మూడు కొత్త రాష్ట్రాలు చత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్లు ఏర్పాటయ్యాయయని ప్రస్తుతించారు. ఏకాభిప్రాయాన్ని సాధించగల గొప్ప నేత వాజ్పేయి అని ఒక సందర్భంలో ఆయన పాలనాదక్షతను మెచ్చుకున్నారు. వాజ్పేయి భారతరత్నకు అన్ని విధాల అర్హుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు అద్వానీ లేఖ కూడా రాశారు. 1998–2004 మధ్య కాలంలో వాజ్పేయి ప్రధానిగా పనిచేసిన సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. పానీపూరీ తింటూ.. స్కూటర్పై షికారు చేస్తూ రాజకీయాల్లో అలాంటి మిత్రుల్ని అరుదుగా చూస్తుంటాం. వారే వాజ్పేయి, ఎల్కే అద్వానీలు.. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. వారిద్దరి అనుబంధం 1950ల నాటిది. అప్పటి నుంచి వారి మధ్య ఒక ప్రత్యేక స్నేహబంధం కొనసాగింది. దాదాపు ఐదు దశాబ్దాలు నమ్మకమైన సన్నిహితులుగా కొనసాగిన వాజ్పేయి, అద్వానీలు ప్రతీ సమయంలోను ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగారు. ఆ అనుబంధం దేశ రాజకీయాల్లో బీజేపీ రూపంలో పెనుమార్పులే తీసుకొచ్చింది. 1980, ఏప్రిల్లో వారిద్దరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. వాజ్పేయితో చిన్ననాటి స్నేహాన్ని అద్వానీ గుర్తుచేసుకుంటూ.. ‘ఇద్దరం యువకులుగా ఉన్నప్పుడు వీధుల్లో పానీపూరీలు తింటూ షికార్లు చేసేవాళ్లం. నేను స్కూటర్ నడుపుతుంటే వెనుక వాజ్పేయి కూర్చునేవారు. నేను పెద్దగా చాట్ తినకపోయినా వాజ్పేయి చాలా ఇష్టంగా తినేవారు’ అని ఒక సందర్భంలో వెల్లడించారు. -
పాలనాదక్షుడు...
స్వేచ్ఛా వాణిజ్యానికీ, సరళతర ఆర్థిక విధానాలకు దన్ను ఇచ్చిన వాజ్పేయి ఆర్థిక సంస్కరణల్లో తనదైన ముద్రవేశారు. 1991లో పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాల స్ఫూర్తిని వాజ్పేయి కొనసాగించారు. వాజ్పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే తరువాతి ప్రధానులు కొనసాగించారు. దేశాన్ని నూతన శకంవైపు నడిపించడానికి రాజమార్గాలు వేశారు. ప్రధానంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ’‘ఆర్థిక దుబారా’లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాజ్పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు.. మౌలిక సదుపాయాల కల్పన: మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్పేయి ప్రభుత్వం పెట్టింది పేరు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా విడివడి ఉన్న గ్రామాలన్నింటినీ కలిపే గొప్పకార్యాన్ని చేపట్టారు. దీంతో గ్రామాల నుంచి వ్యవసాయ ఉత్పాదనలు దేశ వ్యాప్తంగా రవాణా చేసేందుకు వీలు అయ్యింది. అలాగే చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నిర్మించడంలో కృత కృత్యులయ్యారు. ఆర్థిక దుబారా నియంత్రణకు చట్టం... ఆర్థిక దుబారాని నియంత్రించేందుకు వాజ్పేయి ప్రభుత్వం కృషి చేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక దుబారా నియంత్రణకు వాజ్పేయి ప్రభుత్వం పూనుకుంది. 2000 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 0.8 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పొదుపుని 2005 కల్లా 2.3 శాతానికి వృద్ధి చేసిన ఘనత వాజ్పేయిదే. జీడీపీ సైతం రెండంకెల స్థాయికి చేరువయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటైజేషన్... వ్యాపార రంగంలో ప్రభుత్వ పాత్రను వాజ్పేయి వ్యతిరేకించేవారు. అందులో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించారు. దానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఆర్థికశాఖా మంత్రి అరున్జైట్లీయే ఆ శాఖకు తొలి మంత్రి. భారత్ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే వీఎస్ఎన్ఎల్లు నాటి ప్రధాన పెట్టుబడుల ఉపసంహరణల్లోనివి. టెలికం విప్లవం... దేశంలో మొబైల్ ఫోన్ విప్లవానికి ఆద్యుడు వాజ్పేయి. కాల్రేట్లను తగ్గించి, టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారులువేస్తూ సరికొత్త టెలికాం విధానానికి శ్రీకారం చుట్టారు. నిర్ణీత లైసెన్స్ ఫీజు, ఆదాయం పంచుకునే పద్ధతి స్థానంలో సరికొత్త టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు వాజ్పేయి. టెలికాం రంగంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ నియంత్రణ, వివాదాల పరిష్కారాల పాత్రను వేరుచేసారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ఎంతగా ఎదిగిందంటే ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి మంత్రం అయిన జన్ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం–జామ్)లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఢిల్లీ మెట్రో రైలుకి అంకురార్పణ... ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది వాజ్పేయి హయాంలోనే. మెట్రో రాకతో పట్టణ ప్రజల రవాణా సమస్య పరిష్కార మైంది. టెలికం విధానం ప్రవేశపెట్టడం ద్వారా టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టుల్లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి నిధులు ... భారతదేశంలోనే తొలి ఆధునిక మెట్రోరైలు ప్రాజెక్టుకి అంకురార్పణ. విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలు విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ఢిల్లీ లాహోర్ బస్సు ప్రారంభంతో పాకిస్తాన్తో స్నేహానికి దారులు వేసారు... -
సిసలైన స్టేట్స్మన్
అనుభవజ్ఞుడైన రాజకీయ నేత. మరీ ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకో గలిగిన వాడిగా గౌరవం పొందిన వ్యక్తి కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ నిఘంటువులో స్టేట్స్మన్ అన్న పదానికి ఇచ్చిన విపులార్థం ఇది. భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయికి ఈ వర్ణన అచ్చు గుద్దినట్లు సరిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వ పక్షం తరఫున ఐక్యరాజ్య సమితిలో దేశం వాణిని వినిపించడమైనా.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నట్లు గోధ్రా అల్లర్ల విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ‘రాజ ధర్మం’పాటించాల్సిందేనని చెప్పడమైనా. వాజ్పేయి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన్ను ఓ మంచి స్టేట్స్మన్గా నిలబెట్టే సంఘటనలు బోలెడు. పార్టీ సిద్ధాంతాల కంటే దేశం ముఖ్యమని మనసా వాచా కర్మేణా నమ్మి ఆచరించిన వ్యక్తి! అమెరికాను ధిక్కరించిన ధీరత్వం.. అణ్వాయుధాలు దాచుకున్నారన్న నెపంపై అమెరికా 2003, మార్చి 20న ఇరాక్పై యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, పోలండ్, ఆస్ట్రేలియా తదితర 48 దేశాలు అమెరికా పక్షాన ఇరాక్పై కదన రంగంలోకి దిగాయి. యుద్ధం మొదలైందో లేదో.. 20 వేల మంది సైనికులను పంపాల్సిందిగా అమెరికా భారత్ను కోరింది. మూడేళ్ల క్రితమే భారత్ తన సహజ భాగస్వామి అని గొప్పగా ప్రకటించింది. ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జశ్వంత్ సింగ్లు అమెరికాతో చేయి కలపడం మేలన్న సలహాలు ఇచ్చారు. మరోవైపు ఒక వర్గం మీడియా ఇరాక్ యుద్ధంలో భారత్ పాల్గొంటేనే మేలని కథనాలు ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడి రోజువారీ ఫోన్లు ఇంకోవైపు!! ఇంత ఒత్తిడి, గందరగోళం మధ్య కూడా స్థిర చిత్తంతో అమెరికా నిర్ణయాన్ని తోసిపుచ్చగలిగింది ఒక్క వాజ్పేయి మాత్రమే. యుద్ధంలో పాల్గొనేది లేదని ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. ప్రధానిగా తనకున్న అనుమానాలకు, ప్రజాభిప్రాయాన్ని కూడా జోడించి తీసుకున్న ఈ నిర్ణయం తరువాతి కాలంలో అంతర్జాతీయ వేదికలపై దేశం గౌరవాన్ని కాపాడిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. జెనీవా వేదికగా భారతీయ గళం.. 1994లో జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు తద్వారా భారత్ పరువు తీసేందుకు పాక్ పన్నాగం పన్నింది. మానవహక్కుల ఉల్లంఘన పేరుతో ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదం చేయాలన్న ఈ కుట్రను ఛేదించేందుకు ప్రధాని హోదాలో పి.వి.నరసింహారావు ఎవరిని నియమించారో తెలుసా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయిని!! ఈ కాలం రాజకీయ నేతల్లా వాజ్పేయి.. ‘‘ప్రభుత్వం చేయాల్సిన పని మేమెందుకు చేయాలి? మీకు చేతకాకపోతే దిగిపోండి.. మేము చేసి చూపిస్తాం’’టైపు గంభీరోపన్యాసాలు ఇవ్వలేదు. పీవీ తనకు ఇచ్చిన గౌరవాన్ని అంతే హుందాగా నిలుపుకున్నాడు. జెనీవా వేదికగా పాకిస్థాన్ కుట్రలను తన వాగ్ధాటితో ఛిన్నాభిన్నం చేశాడు. కశ్మీర్ విషయానికి వస్తే భారతీయులంతా ఒక్కటేనని.. మా భూభాగాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసునని పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పారు. నిజాయితీ రాజకీయాలు.. 1976.. డిసెంబర్ 31. ఎమర్జెన్సీ కాలం. ఢిల్లీలోని వాజ్పేయి నివాసానికి ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి రామ్ బహదూర్ రాయ్ వచ్చాడు. కాంగ్రెస్ మంత్రి ఓమ్ మెహతా అటల్జీని కలిశాడన్న వార్త వినడంతో రాయ్ హడావుడిగా విచ్చేశాడు. ‘‘వాజ్పేయిగారు.. ఇది నిజమేనా? ఓం మెహతా మిమ్మల్ని కలిశారట’’అని రాయ్ అడిగాడు. ‘‘ఆయన చాలా పెద్దమనిషి.. నేనే ఆయన్ని కలవడానికి వెళ్లాను’’అంటూ ఠక్కున వచ్చింది సమాధానం! కొంత నిశ్శబ్దం తరువాత వాజ్పేయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అల్లరిమూకలు చేస్తున్న విధ్వంసాన్ని వివరించారు. ఏబీవీపీ కూడా తన తప్పులను ఒప్పుకుని ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడం మంచిదని, ఇలా చేస్తే ఎమర్జెన్సీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వాజ్పేయి రామ్ బహదూర్కు సూచించారు కూడా. ఆ అల్లర్లకు.. ఏబీవీపీకి సంబంధం లేదని రాయ్ అనడం.. ‘‘మీ లాంటి వాళ్లు ఇలా మాట్లాడటం సహజమే. మా లాంటి వాళ్లు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువ నమ్ముతూంటారు’’అని వాజ్పేయి అనడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ మీటింగ్ అక్కడితో ముగిసింది. ఏబీవీపీ క్షమాపణలు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది తరువాతగానీ ఎమర్జెన్సీ ఎత్తివేయలేదు. రాజధర్మం పాటించాల్సిందే.. గోధ్రా అల్లర్ల తరువాత గుజరాత్లో మత హింస చెలరేగడంపై వాజ్పేయి ఎంతో ఆవేదన చెందారు. అక్కడ అధికారంలో ఉన్నదీ బీజేపీనే కావడం వల్ల కేంద్రంలోని తమ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని ఆయన ఆందోళన చెందారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేదని ఆయన సమక్షంలోనే ప్రకటించడం వాజ్పేయి నిష్పాక్షికతకు ఒక నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెబుతారు. గోధ్రా అల్లర్ల విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రికి మీరే సలహా ఇస్తారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మోదీ రాజ ధర్మం పాటించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజధర్మం అంటే ఏమిటన్నది వివరిస్తూ.. అధికారంలో ఉన్నవాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజలపట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై కూడా పార్టీకి భిన్నంగా వాజ్పేయి స్పందించారు. ‘వివాదాస్పద కట్టడానికి ఎలాంటి హాని తలపెట్టమని హామీ ఇచ్చారు. అదుపు తప్పిన కొందరు కరసేవకులు కట్టడాన్ని కూల్చేశారు. అది జరగకుండా ఉండాల్సింది. దీనికి మేము చింతిస్తున్నాము’ అని స్పష్టంగా చెప్పారు. సిద్ధాంతాల చట్రంలో ఇమడని వ్యక్తి.. బీజేపీకి, సైద్ధాంతిక గురువుగా ఆర్ఎస్ఎస్ను చెప్పుకుంటారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ విధానాల రూపకల్పన మొదలుకొని, అనేక ఇతర అంశాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుందని ప్రచారంలో ఉన్న విషయం తెలి సిందే. వాజ్పేయి మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంత చట్రంలో ఇమడని వ్యక్తిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకత... హిం దుత్వ విధానాల ప్రచారం ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన విధానాలైతే.. చాలా సందర్భాల్లో వాజ్పేయి వీటిని తోసిరాజన్నా డు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా.. భారత్ తర ఫున జెనీవాలో కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడటం ఇలాంటిదే. సిద్ధాంతాలకంటే దేశం గొప్పదన్న ఆలోచన వాజ్పేయిది అంటారు కొందరు. -
అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా?
న్యూఢిల్లీ: అది 70వ దశకం. అటల్జీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో నెహ్రూ చిత్రపటం కనబడలేదు. వెంటనే కల్పించుకున్న అటల్.. దాన్ని అక్కడే తిరిగి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్లమెంటు భేటీలోనూ ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ మిత్రులు ఇది నమ్మకపోవచ్చు. సౌత్ బ్లాక్లో నేను వెళ్లే దారిలో నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ అకస్మాత్తుగా అది కనబడకుండా పోయింది’ అంటూ సభలో ప్రస్తావిం చారు. ‘సిబ్బందిని అడిగాను. ఆ పటం ఏదని. వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు’ అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇతరుల విమర్శలనూ స్వీకరించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నెహ్రూ అంటూ పొగిడారు అటల్జీ. ‘విన్స్టన్ చర్చిల్, నెవిలే చాంబర్లీన్ల వ్యక్తిత్వాలు కలబోసిన వ్యక్తి నెహ్రూజీ అని ఓ సారి విమర్శించాను. దానికి ఆయన ఏమాత్రం కలత చెందలేదు. సాయంత్రం ఆయన్ను కలసినపుడు చాలా బాగా మాట్లాడావని పొగిడారు. ఇప్పుడలాంటి విమర్శలు చేస్తే నాతో మాట్లాడటమే మానేస్తారు’ అన్నారు. -
రాజమాత కారు కాదని.. సైకిల్పైనే?
గ్వాలియర్ : అప్పటికే వాజ్పేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్లో సైకిల్పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజ్పేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజ్పేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు. ‘గతంలో అటల్జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్పేయి ఇష్టపడేవారు. -
విదేశీ విధానంపై చెరగని ముద్ర..
1998–2004 మధ్యకాలంలో ప్రధాని పదవిని నిర్వహించిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి నిలిచారు. ప్రధానిగా విదేశాంగ విధానంపై వాజ్పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్–2 అణుపరీక్షలు, పాకిస్తాన్తో స్నేహసంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు, చొరవతో పాటు 1999లో లాహోర్ డిక్లరేషన్ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. భారత్ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారత–పాక్లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునఃప్రారంభమయ్యాయి. వాజ్పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కషి చేయాలని నిర్ణయించారు. 1988లో రాజీవ్ –బేనజీర్ల మధ్య అణ్వాయుధ రహిత ఒప్పందం కుదరగా, దీన్ని రెండోదిగా పరిగణిస్తున్నారు. అయితే నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషార్రఫ్ నేతత్వంలోని సైన్యం కూలదోయడంతో ఒప్పందం నిరుపయోగంగా మారింది. తర్వాత కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దీనికి విలువలేకుండా పోయింది. కశ్మీర్లోని కార్గిల్ మంచుకొండల్లోకి పాకిస్తాన్ బలగాలు చొచ్చుకురావడంతో భారత్–పాక్ల మధ్య పరిమిత యుద్ధానికి దారితీసింది. పాక్ దురాక్రమణను అమెరికాతో పాటు పశ్చిమదేశాలు ఖండించాయి.ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించాల్సిందిగా నవాజ్షరీఫ్ను అమెరికాకు పిలిపించి మరీ హెచ్చరించారు. ఈ విధంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారిగా భారత్ పట్ల అమెరికా అనుకూల వైఖరి తీసుకుంది. 1999 జూలైలో కార్గిల్ నుంచి పాక్ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్ విజయ్లో విజయం సాధించింది. 1978లో జిమ్మీకార్టర్ భారత్లో పర్యటించాక 22 ఏళ్ల అనంతరం 2000లో అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ క్లింటన్ మన దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఇండియా రిలేషన్స్ : ఏ విజన్ ఫర్ ది 21 ఫస్ట్ సెంచరీ’పత్రంపై సంతకాలు చేశారు. ఆ తర్వాతి కాలంలో అమెరికాతో భారత్ సంబంధాలు బలపడేందుకు ఈ పర్యటన, తదనంతర పరిణామాలు దోహదపడ్డాయి. 2001లో జూలైలో భారత్తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ మొండిపట్టుదల కారణంగా ఆగ్రాలో జరిగిన ఈ శిఖరాగ్రభేటీ నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా వియత్నాం, ఇండోనేసియా దేశాల్లో పర్యటించిన వాజ్పేయి వ్యాపార, వాణిజ్య అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాజ్పేయి ప్రభుత్వం మంచి సంబంధాలు నెలకొల్పగలిగింది. 2000 జూన్లో లిస్బన్లో మొట్టమొదటి భారత్–ఐరోపా దేశాల సంఘం (ఈయూ) శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2003లో చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా, విమానాల కొనుగోలు, తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య, భద్రతా, రాజకీయ రంగాల్లో సహకారం కోసం ‘మాస్కో డిక్లరేషన్’పై సంతకాలు జరిగాయి. -
భరతమాత ముద్దుబిడ్డ
రాజకీయవేత్తగా.. ఒప్పుకోను పరాజయం కొత్తదారి నా ధ్యేయం కాలం తలరాతను చెరిపేస్తా సరికొత్త గీతాన్ని ఆలపిస్తా తెగి పడగలం... కానీ తల వంచం పాలకులతో పేచీ నిరంకుశంపై తిరుగుబాటు అంధకారంతో లడాయి వెలుతురు కోసం పెనుగులాట తెగి పడగలం గాని తల వంచం.... కవిగా, రాజకీయవేత్తగా వాజ్పేయి ధోరణి ఇదే కవిగా... బాధలు చుట్టుముట్టనీ ప్రళయం కరాళనృత్యం చేయనీ కాళ్ల కింద భూమి కదలనీ శిరస్సు మీద అగ్నివాన కురవనీ ఆగొద్దు... కలసి నడవడం ఆపొద్దు దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్పేయిది ఓ చెరగని ముద్ర! అబ్బురపరిచే వాగ్ధాటి.. అచంచల ఆత్మవిశ్వాసం.. రాజకీయ చతురత.. రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన ఆయన ప్రతి అడుగూ ఓ మైలురాయే!! పోఖ్రాన్ అణు పరీక్షలైనా దాయాది దేశం పాకిస్తాన్తో శాంతిచర్చలైనా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆయన.. గొప్ప కవి కూడా. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టగానే ఆయనకు భారతరత్న ప్రకటించారు. వాజ్పేయి జన్మదినాన్ని(డిసెంబర్ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి.. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్పేయి దంపతులకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న ఆయన జన్మించారు. వాజ్పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్. కవి కూడా. గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో వాజ్పేయి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత గ్వాలియర్లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్లోని దయానంద్ ఆంగ్లో–వేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1939లో ఆరెస్సెస్లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్గా చురుగ్గా పాల్గొన్నారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్లలో పని చేశారు. రాజకీయ ప్రస్థానం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్పేయి రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు అధిష్టించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన అప్పటి హిందూత్వ పునాదులపై డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. అనతికాలంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1957లో బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పట్నుంచి తన సహచరులు నానాజీ దేశ్ముఖ్, బల్రాజ్ మధోక్, ఎల్కే అద్వానీలతో కలసి పార్టీని కొత్త తీరాలకు తీసుకువెళ్లారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నేతృత్వంలో ఉధృతంగా సాగిన సంపూర్ణ విప్లవోద్యమంలో వాజ్పేయి చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జనసంఘ్ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు కొలువుదీరింది. అందులో వాజ్పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. 1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయడంతో వాజ్పేయి కేంద్రమంత్రిగా కొద్దికాలం పాటే పనిచేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే గొప్పనేతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 3 సార్లు ప్రధాని పీఠం.. 1984 ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ వాజ్పేయి నేతృత్వంలో 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి తన సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ పదో ప్రధానిగా వాజ్పేయి ప్రమాణం చేశారు. అయితే మిత్రపక్షాలు సహకరించకపోవడంతో బలపరీక్షలో ఓడిపోయి 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత 1998లో మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ సమయం(1998 మే)లోనే ఆయన రాజస్తాన్లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. మరోవైపు పాక్తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. కానీ పాక్ కయ్యానికి కాలుదువ్వి కార్గిల్ వార్కు కారణమైంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో పాక్ సైనికులను సరిహద్దుల నుంచి తరిమేసి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా వాజ్పేయి ప్రభుత్వం పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడపలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించింది. 1999 అక్టోబర్ 13న వాజ్పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999–2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్కరణల బాటలో.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్పేయి కీలక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేశారు. విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలతో ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకాన్ని చేపట్టారు. అమెరికా–భారత్ మధ్య స్నేహబంధం బలోపేతమైంది. 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేస్తూ అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు దగ్గరవుతూనే పాక్కు స్నేహహస్తం చాచారు వాజ్పేయి. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్తో ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ పట్టుపట్టడంతో ఇరుదేశాల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు ఉగ్రవాదం కూడా వాజ్పేయి సర్కారుకు సవాలుగా నిలిచింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకే.. అంటే 1999 డిసెంబర్లో కాందహార్లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులను ముష్కర చెర నుంచి విడిపించేందుకు జైల్లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాగే 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగింది. 2002లో గుజరాత్లో గోధ్రా ఘటనతో అల్లర్లు చెలరేగాయి. బీజేపీకి బీజాలు 1980లో అద్వానీ, భైరాన్సింగ్ షెకావత్ తదితరులతో కలసి వాజ్పేయి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించారు. జనతా సర్కారు తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్(ఐ) ప్రభుత్వంపై వాజ్పేయి సునిశిత విమర్శలతో విరుచుకుపడేవారు. 1984లో ఇందిర హత్య అనంతరం సిక్కుల ఊచకోత సమయంలో ప్రభుత్వ తీరును, అది చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ను తీవ్రంగా ఖండించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండే రెండు స్థానాలను గెల్చుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుతూనే లోక్సభలో ప్రతిపక్ష నేతగా వాజ్పేయి తన వాణిని బలంగా వినిపించారు. ఉదారవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు. అవార్డులు 1992: పద్మవిభూషణ్ 1994:లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్పంత్ అవార్డు 2015: భారతరత్న రాజకీయాల నుంచి నిష్క్రమణ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టేందుకు వాజ్పేయి నిరాకరించారు. పార్టీ బాధ్యతలను అద్వానీకి అప్పగించారు. 2005 డిసెంబర్లో ముంబైలో జరిగిన బీజేపీ సిల్వర్జూబ్లీ ర్యాలీలో క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సాక్షి, తెలంగాణ డెస్క్ -
తలవంచని కవి
కవిగా, రాజకీయవేత్తగా వాజ్పేయి ధోరణి అదే. తల వంచని ధోరణి. తలపడే ధోరణి. శిథిల స్వప్నాల నిట్టూర్పు ఎవరు వింటారు.. కనురెప్పలపై తారాట్లాడే వ్యథను ఎవరు కంటారు.. వద్దు.. ఓటమి వొప్పుకో వద్దు పాడుతూనే ఉందాం కొత్తపాట.. తన ఉపన్యాసాలతో మాటలతో చేతలతో కూడా ఇలాంటి స్ఫూర్తినే వాజ్పేయి ఎప్పుడూ ఎదుటివారిలో నింపుతూ వచ్చారు. వాజ్పేయి తనను తనలోని కవిని ఎంత నిరాడంబరంగా ఉంచాలనుకున్నారంటే తాను ప్రధాని అయినప్పుడు తన పరిస్థితిని శిఖరంతో పోలుస్తూ ‘శిఖరం ఒంటరిది... ఎవరూ రారు హత్తుకోవడానికి... అధిరోహించడానికి బాగుంటుంది... కాని తోడు నిలవడానికి ఒక్కరూ ఉండరు’అని రాశారు. ‘ఒకనాటికి నేను మాజీ ప్రధానిని కావచ్చు... కాని మాజీ కవిని మాత్రం కాలేను’అని తన శాశ్వత కవి హోదాను చూసి పొంగిపోయారాయన. ♦ ‘నడి మధ్యాహ్నామే నిశి ఆవరించింది ♦ సూర్యుడు తన నీడచే పరాజితుడయ్యాడు. ♦ నీ హృదయాన్నే వత్తిగా చేసి దీపాన్ని వెలిగించు ♦ తోడు మరిన్ని దీపాలు వెలిగించేందుకు కదిలిరా’... అంటూ రాశారాయన. ♦నన్ను క్షణక్షణం జీవించనీ... కణకణంలోని సౌందర్యాన్ని జుర్రుకోని’అని రాసిన వాజపేయి జీవితాన్ని ధనాత్మకమైన కానుకలా పరిగణిస్తూ అలా జీవించడానికే ఇష్టపడ్డారు. ♦ చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు’అన్న వాజపేయి ‘జీవితమన్నది ప్రగతిశీలం. అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’అని హితవు చెప్పారు. ♦ అంతిమంగా మృత్యువు అనే కవితను ముద్దాడిన ఈ కవి చాలాకాలం తన కవిత్వంతో సజీవ పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాడు. కవిగానే కాదు వక్తగా కూడా ఆయన మాటలతో చాలనం చేసేవారు. వాక్కును ఖడ్గంలా వాడేవారు. కవితాత్మకంగా సాగే ఆయన ప్రసంగాలను పార్లమెంటులో విపక్షాలు కూడా శ్రద్ధగా ఆలకించేవి. ఆయన కవిత్వం జాతీయవాదాన్ని ప్రేరేపించేది. మానవతా విలువల్ని పాదుకొల్పే విధంగా ఉత్తేజితం చేసేది. కవిత్వం ప్రజల్లో కర్తవ్యాన్ని తట్టిలేపాలని, సామాజిక బాధ్యతను గుర్తు చేయాలని వాజ్పేయి నమ్మేవారు. హిందూ పురణాల స్ఫూర్తి వాజ్పేయి కవితల్లో కనిపించేది. తేలిక పదాలతో, అందరికీ అర్థమయ్యేలా ఆయన రాసిన కవితలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, చరిత్రను, కీర్తి ప్రతిష్టలను ప్రస్తుతించడానికి పదం కలిపేవి. వాజ్పేయి కవితలను ఇంగ్లీషులోకి అనువదించిన భగవత్.ఎస్ గోయల్ వాజ్పేయి గురించి చెబుతూ, ‘వాజ్పేయి రాజకీయాలు, సాహిత్యం ఒకదాన్నొకటి సుసంపన్నం చేసుకుంటాయి. ఒక సాహితీవేత్త రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు మరింత శుద్ధమవుతాయని ఆయన నిరూపించారు. సాహితీ నేపథ్యం ఉన్న రాజకీయవేత్త మానవ విలువల్ని ఉద్వేగాల్ని అలక్ష్యం చేయజాలడని వాజపేయి నమ్మేవారు’అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలని వాజ్పేయి కవితను, జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. జైలులో కవితా రచన వాజ్పేయికి పదాలతో ప్రతిస్పందన తెచ్చే విద్య పాత్రికేయుడిగా ఉన్న నాటి నుంచి ఉంది. హిందీ మాస పత్రిక రాష్ట్ర ధర్మ, హిందీ వారపత్రిక పాంచజన్య, దినపత్రిక స్వదేశ్, వీర్ అర్జున్లకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు ‘ఖైదీ కవిరాజ్ కీ కుందలియా’పేరుతో కవితలు రాశారాయన. ఆ కవితలను 1994లో ‘అమర్ ఆగ్ హై’పేరుతో సంకలంగా తెచ్చారు. తన పార్లమెంటు జీవితంపై ‘మేరీ సన్సదీయ యాత్ర’పేరతో నాలుగు సంపుటాలు రచించారు. ‘మేరీ ఇక్కవాన్ కవితా’,‘సంకల్ప్ కాల్’, ‘శక్తి సే శాంతి’, ‘ఫోర్ డెకేడ్స్ ఇన్ పార్లమెంట్ (పార్లమెంటు ప్రసంగాలు),‘లోక్సభ మే అటల్జీ’(ప్రసంగాల సంకలనం),‘మృత్యు యా హత్య’, ‘అమర్ బలిదాన్’, ‘జన్సంఘ్ ఔర్ ముసల్మాన్’, ‘క్యా ఖోయా క్యా పాయా’, ‘కుచ్ లేఖ్..కుచ్ బాషన్’, ‘నయీ చునోతి– నయా అవసర్’తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారి అశేషసాహితీ ప్రియుల మనసులను దోచాయి. కుమరకోం మ్యూజింగ్స్ 2000 డిసెంబర్ 26 నుంచి 2001 జనవరి1 వరకు వాజ్పేయి కేరళలోని కుమరకోం రిసార్ట్స్లో గడిపారు.అక్కడ ఆయన మ్యూజింగ్స్ రాశారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తన మ్యూజింగ్స్లో ప్రస్తావించారు. ముఖ్యంగా కశ్మీర్ సమస్య, అయోధ్య వివాదాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. గతం నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి, బంగరు భవిష్యత్తువైపు పయనించడానికి తగిన సమయం ఆసన్నమైందని ఆ మ్యూజింగ్స్లో పేర్కొన్నారు. బాలీవుడ్ గాయకుల నోట వాజ్పేయి పాట... అటల్ బిహారీ వాజపేయి రాసిన కవితల్లో కొన్నింటిని బాలీవుడ్ గాయకులు పాడారు. ఆ పాటలు కూడా విశేష జనాదరణ పొందాయి.వాటిలో కొన్ని.... క్యా ఖోయా క్యా పాయా ఈ కవితను స్వర్గీయ జగ్జీత్ సింగ్ ఆలపించారు.1999లో షారూక్ ఖాన్ మీద ఈ పాటను చిత్రీకరించారు. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఈ పాట ప్రజల మనసుల్లోంచి చెక్కు చెదరలేదు. జీవితంలో మనిషి ఎదుర్కొనే ఆటుపోట్లను వాజ్పేయి ఈ కవితలో చిత్రించారు. దూర్ కహి కోయి రోతా హై 2002లో వచ్చిన సంవేదన ఆల్బమ్లో ఈ పాటను జగ్జీత్ సింగ్ పాడారు. చావు, విషాదం, కన్నీళ్లు జీవితంలో ఒక భాగమని. సంతోషంలాగే ఇవి కూడా జీవితంలో సమానమేనని వాజ్పేయి ఈ కవితలో అందంగా వర్ణించారు. జుకీ న ఆంకే జగ్జీత్ సింగ్ నోట పలికిన ఈ పాట 1999లో విడుదలయింది. విషాదభరితమైన ఈ గీతంలో వాజ్పేయి తన భావాలను గుండెలకు హత్తుకునేలా చెప్పారు. ఆవో మన్కీ గతే ఖోలే వాజ్పేయి కలం నుంచి జాలువారిన ఈ గీతాన్ని లతా మంగేష్కర్ ఆలపించారు. గాన కోకిల ఆలపించిన ఈ గీతం ఆణిముత్యంగా నిలిచింది. అందం, వర్ణన, అనుభూతుల కలయిక అయిన ఈ పాట భావోద్వేగ భరితంగా ఉంటుంది. అటల్జీ చివరి చిత్రం ఇదే.. అటల్జీకి భారతరత్న ప్రకటించిన తర్వాత అవార్డును అందించేందుకు 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీ ల్యూటెన్స్లోని కృష్ణమీనన్లో ఉన్న వాజ్పేయి బంగ్లాకు వెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ అటల్జీ అవార్డు అందుకుంటున్న ఫొటో బయటకు విడుదల చేసింది. అందులో వాజ్పేయి ముఖం తక్కువగా కనబడేలా జాగ్రత్తపడ్డారు.