buy
-
కొనుగోళ్లకే ఎఫ్పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
ఎకో హోటల్స్లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్మైట్రిప్ బ్రాండ్తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్స్టార్కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
కారట్లేన్లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్లేన్లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్లేన్లో తమ వాటా 98.28 శాతానికి జంప్చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
ఆ నిర్మాత ఇంటి పక్కనే బంగ్లా కొన్న ఊర్వశి రేటెంతో తెలుసా..!
-
అక్షయ తృతీయ..కళ్ళు చెదిరే ఆఫర్స్
-
యాక్సెంచర్ చేతికి ఫ్లూచురా
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! -
'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..'
లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు. मेरे भाई सत्य का कवच पहनकर चल रहे हैं। : @priyankagandhi जी#BharatJodoYatra pic.twitter.com/chp3baB0Pb — Congress (@INCIndia) January 3, 2023 కాంగ్రెస్కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో కొనసాగుతోంది. చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్బై.. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్ఫోలియో కంపెనీ కోహేన్స్ను సువెన్లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్కేర్లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మాస్క్
-
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్వే ఎడిషన్ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్లాండ్కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్లో న్యూ ఓర్లిన్స్లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. 5384 చదరపు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్సిరీస్లో కనిపించింది. -
రూ.10 నాణేలతో లక్షలు ఖరీదు చేసే కారు...కారణం వింటే షాక్ అవుతారు
ఇంతవరకు తమకు నచ్చిన స్కూటీ, లేదా మంచి ఖరీదు చేసే బైక్ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ ఇక్కడొక వ్యక్తి వారిలానే నాణేలను పోగుచూసి తన కలల కారుని కొనుకున్నాడు. కానీ అతను వారందరికీ భిన్నం. పైగా అతను ఎందుకు అలా చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను సుమారు రూ. 6 లక్షలు పోగుచేసి వాటితో తనకు నచ్చిన కారుని కొనుకున్నాడు. ఐతే మొదటగా ఆ షాప్ డీలర్ ఈ రూ. 10 నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు అంగీకరించ లేదు. వెట్రివేల్ ధృడ నిశ్చయం విని షాప్ డీలర్ ఈ విక్రయానికి అంగీకరించాడు. ఇంతకీ అతను ఎందుకు ఏకంగా రూ. 6 లక్షల రూ. 10 నాణేలను పోగు చేశాడంటే...అతని తల్లి ఒక దుకాణం నడుపుతుంటుందని చెప్పాడు. ఐతే కస్టమర్లు రూ. 10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించాడంతో చాలా పెద్ద మొత్తంలో రూ.10 నాణేలు ఉండిపోయాయి. పైగా పిల్లలు కూడా ఆ రూ. 10 నాణేలు విలువ లేనివని ఆడుకోవడం చూశానని చెప్పాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలతోనే కారు కొనుక్కుని చూపి.. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నట్లు తెలిపాడు. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడూ ఎందుకు బ్యాంకులు స్వీకరించడంలేదంటూ ప్రశ్నించాడు. తాను ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలు విలువైనవేనని చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ పని చేశానని చెప్పాడు. అందుకోసం తాను దాదాపు నెలరోజులకు పైగా పది రూపాయల నాణేలను రూ. 6 లక్షలు పోగుచేశానని చెప్పుకొచ్చాడు. (చదవండి: సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్) -
లగ్జరీ కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్ఆర్ఆర్తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Volvo Car India (@volvocarsin) -
గూగుల్ చరిత్రలో మరో అతి పెద్ద డీల్..!
ప్రముఖ టెక్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ మరో అతి పెద్ద భారీ డీల్ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్గా నిలిచే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు పోటీగా..! గూగుల్ సమీప టెక్ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్ డాలర్లతో గూగుల్ కైవసం చేసుకుంది. మరింత వేగంగా..! మాండియంట్ ఇంక్ కొనుగోలుతో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ కోసం 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్తో మాండియంట్ ఇంక్ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.! -
ఖరీదైన బైక్ కొన్న బిగ్బాస్ బ్యూటీ.. ధర ఎంతంటే..
Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్బాస్ సీజన్-5లో లేడీ అర్జున్రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్బాస్ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మొత్తానికి ఈ బైక్ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్ సౌండ్ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆనీ మాస్టర్ సహా పలువురు లహరికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్కి చెందిన ఈ బైక్ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ వచ్చే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీరంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అక్టోబర్ 10న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్జెటి) యాక్సెస్తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తయారీలో దిగ్గజ ప్లేయర్గా మారడానికి ఆర్ఐఎల్ పనిచేస్తోంది. 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్లో... -
టాటాల తరువాత జెస్ట్డయిల్ వేటలో రిలయన్స్ ఇండస్ట్రీస్
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ డయల్ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్ డాలర్లతో జస్ట్డయల్ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్ డయల్కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్ మార్కెట్లో రిలయన్స్ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్ డయల్ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్ డయల్ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. 2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్డయల్ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్డయల్ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్డయల్ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది. -
మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు
వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లతో డిస్కార్డ్ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్ హబ్, మైన్క్రాఫ్ట్ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్టాక్ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్తో యూజర్లకు వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్ బ్రాండ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్ గేమ్స్, అమెజాన్ కంపెనీలతో చర్చలు జరిపింది. (చదవండి: గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!) -
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్లో భారత్ ఫోర్జ్, కెమ్కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్డౌన్తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్ను కేటాయించడమైంది. -
జెఫ్పారీస్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..! 1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్లో పైప్స్లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది. 2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది. 3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది. -
3రంగాల నుంచి 3స్టాక్ సిఫార్సులు
మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ షేర్లు క్యాచ్ అప్ ర్యాలీకి సిద్ధమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు వినయ్ రజనీ అంటున్నారు. ఇప్పటికి వరకు లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ ర్యాలీకి సహకరించాయని ఆయన్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ర్యాలీ చేసేందుకు మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డైలీ ఛార్ట్ల్లో నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కన్సాలిడేషన్ ప్యాట్రన్ నుంచి బయటపడేందుకు రజనీ అన్నారు. నిఫ్టీకి అప్సైడ్లో 9,970 నిరోధాన్ని, దాన్ని అధగమిస్తే 10,550 వద్ద తదుపరి నిరోధాన్ని కలిగి ఉంది. డౌన్సైడ్లో 9500, 9580 వద్ద కీలకమైన మద్దతు స్థాయిలను కలిగి ఉన్నాయని రజనీ తెలిపారు. డైలీ ఛార్ట్లో 9,889 వద్ద ఉన్న కీలకమైన నిరోధాన్ని అధిగమించింది. ఇది రోజువారీ ఛార్ట్లో హయ్యర్ టాప్, హయ్యర్ ఫార్మేషన్ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 3రంగాల నుంచి చెందిన 3 షేర్లు సిఫార్సు చేస్తున్నారు. 1.షేరు పేరు: అపోలో టైర్స్ టార్గెట్ ధర: రూ.118 స్టాప్ లాస్: రూ.96 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: గత 4వారాలుగా కనిపించిన కన్షాలిడేషన్ ప్యాట్రన్ నుంచి షేరు బయటపడింది. బోలింగర్ ఎగువ బ్యాండ్పై ముగిసింది. ఇది అప్ట్రెండ్లో మూమెంటంకు సంకేతం. అటో రంగానికి చెందిన షేర్లు అవుట్ఫర్ఫామ్ చేస్తున్నాయి. తాజాగా అటో యాన్సలరీ , టైర్ స్టాకుల ఛార్ట్లో అప్ట్రెండ్ను సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఛార్ట్స్లో ఇండికేటర్లు, ఓస్కిలేటర్లు బుల్లిష్గా మారాయి. 2.షేరు పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టార్గెట్ ధర: రూ.96 స్టాప్ లాస్: 78 అప్ సైడ్: 11శాతం విశ్లేషణ: 2020 మార్చి 29 ముగిసిన నెలవారీ ఛార్ట్లో బుల్లిష్ హ్యమర్ క్యాండింల్ స్టి్క్ ప్యాట్రన్ను నమోదు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం బాటమ్ నుంచి బయటపడింది. అలాగే అయిల్ మార్కెటింగ్ కంపెనీల ఛార్ట్ల్లో మరింత పెరిగే సంకేతాలు కన్పిస్తాయి. ఈ షేరు షార్ట్-టర్మ్ మూవింగ్ రిసిస్టెంట్ దాటి ముగిసింది. ఇది రోజువారీ చార్టులలో రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా నమోదైంది. 3.షేరు పేరు: కేడిలా హెల్త్కేర్ టార్గెట్ ధర: రూ.375 స్టాప్ లాస్: రూ.333 అప్ సైడ్: 7శాతం విశ్లేషణ: ఇటీవల మార్కెట్ పతనం నుంచి ఫార్మా షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. అలాగే మార్కెట్ బుల్లిష్ ర్యాలీలో బలమైన ర్యాలీని ప్రదర్శిస్తున్నాయి. చివరి 8వారాలుగా ఈ షేరు చాలా తక్కువ వాల్యూమ్స్తో కన్సాలిడేషన్ను చూస్తోంది. వీక్లీ, డైలీ ఛార్ట్స్లో మూవింగ్ యావరేజ్, ఓస్కిలేటర్ సెటప్లు బలంగా ఉన్నాయి. ఈ స్టాక్ దాని మూమెంటంను తిరిగి పొందుతుంది. -
స్వల్పకాలంలో 13శాతం ర్యాలీ చేసే 3స్టాక్లు ఇవే..!
స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప గ్యాప్ అప్తో మొదలైంది. అయితే ప్రారంభంలో అనూహ్య కొనుగోళ్లతో సూచీలు భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒకదశలో 400 పాయింట్ల లాభపడి 30,596.17 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 9వేల స్థాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 స్టాక్లకు ‘‘బై’’ రేటింగ్ను కేటాయించారు. ఈ మూడు షేర్లు స్వల్పకాలంలో 13శాతం వరకు ర్యాలీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. షేరు పేరు: మారికో బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.354 స్టాప్ లాస్: 285 అప్సైడ్: 13.40శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ చార్టులలో హయ్యర్ హై.., హయ్యర్ బాటమ్ ఫార్మాషన్ ఏర్పాటుతో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా షేరు 100 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.306 వద్ద, అలాగే 200 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.323 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. బోర్డర్ స్ట్రక్చర్పై..., స్టాక్ డైలీ ఛార్ట్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నమూనా ఏర్పాటు చేసింది. ప్యాట్రన్ ఫార్మేషన్ నెక్లైన్పై తాజా బ్రేక్ అవుట్ అంచనా ఉంది. అదనంగా, మూమెంటమ్ ఇండికేటర్స్, ఓసిలేటర్స్ డైలీ, వీక్లీ స్కేల్ పై సానుకూల సంకేతాలను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.285 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.354 టార్గెట్ ధరగా రూ.310-312 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడెక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.627 స్టాప్ లాస్: రూ.505 అప్సైడ్: 12.77శాతం విశ్లేషణ: రూ.485 వద్ద సపోర్ట్ తీసుకున్న తర్వాత, షేరు వీ-ఆకారపు రీకవరీని తీసుకుంది. మరోసారి రూ.550 ధరను అధిగమించిన తర్వాత వెనక్కి వచ్చింది.ప్రస్తుత దశలో, ఈ స్టాక్ డైలీ చార్టులలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్స్ను ఏర్పాటు చేసింది. స్వల్ప హయ్యర్ వాల్యూమ్లతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది స్టాక్స్లో లాంగ్-బిల్డప్ నిర్మాణాన్ని సూచిస్తుంది. షేరు ధరలో తరువాత అప్స్వింగ్ ఉంటుందని మూమెంటమ్ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.505 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.627 టార్గెట్ ధరగా రూ.రూ.550-553 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: భారతి ఇన్ఫ్రాటెల్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.240 స్టాప్ లాస్: 185 అప్సైడ్: 11.63శాతం విశ్లేషణ: సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాట్రన్కు పైన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత షేరులో తదుపరి కొనుగోళ్లను చూస్తున్నాము. ఈ వారం, స్టాక్ డైలీ ఇంటర్వెల్లో 100రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడైంది. ఇది ధరలలో స్వల్పకాలిక రివర్సల్ను, రాబోయే సెషన్లలో మరింత అప్సైడ్ ట్రెండ్ను సూచిస్తుంది. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.185 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.240 టార్గెట్ ధరగా రూ.రూ.205-210 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్కు లుక్ అవుట్ నోటీసు -
వాటా కొనుగోలు : యస్ బ్యాంకుకు ఊరట
సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు యస్ బ్యాంకు కానీ, ఇటు ఎస్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గృహరుణంపై వడ్డీ రాయితీ 2020 మార్చి వరకూ...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద మధ్యాదాయ వర్గాల (ఎంఐజీ) వారికి ఇస్తున్న క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని (సీఎల్ఎస్ఎస్) 2020 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం కూడా చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద గృహ రుణం తీసుకున్న వారికి రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని ఇస్తారు. డిసెంబర్ 30 నాటికి 3,39,713 మంది లబ్ధిదారులు సీఎల్ఎస్ఎస్ను వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు. తొలుత వడ్డీ రాయితీతో కూడిన రుణ పథకాన్ని 2017 డిసెంబర్ వరకు ఏడాది కాల పరిమితితో కేంద్రం తీసుకొచ్చింది. నూతన నిర్మాణం, తిరిగి కొనుగోలు చేసే గృహాలపైనా దీన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత దీన్ని 2019 మార్చి వరకు పొడిగించింది. తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. వార్షికంగా రూ.6– 12 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 20 ఏళ్ల కాలానికి సంబంధించి రూ.9 లక్షల రుణం మొత్తంపై 4 శాతాన్ని రాయితీగా పొందొచ్చు. రూ.12– 18 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి వడ్డీ రాయితీ మూడు శాతమే లభిస్తుంది. -
సన్ ఫార్మా చేతికి జపాన్ పోలా ఫార్మా
న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా... జపాన్కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్ చేస్తున్నామని సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ కీర్తి గనోర్కార్ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్ ఫార్మా జపాన్ హెడ్ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు. పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... పోలా ఫార్మా కంపెనీ జపాన్లో జనరిక్, బ్రాండెడ్ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. సన్ ఫార్మా కంపెనీ జపాన్ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్ ఫార్మా జపాన్ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్ ఫార్మా మార్కెట్ 8,480 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్ ఫార్మా మార్కెట్ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
ఇల్లు కొంటున్నారా?
‘ఇల్లు మన ఆశలు, ఆకాంక్షలు, అభిరుచికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటాం. నగరాల్లో ఇప్పటి బిజీ లైఫ్లో ఎవరి ఇల్లు వాళ్లు కట్టుకోవడం ఊహకే అందదు. పైగా మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ హవా నడుస్తున్న పరిస్థితుల్లో తప్పని సరిగా బిల్డర్ను వెతుక్కోవలసిందే. 1. ఇల్లు కట్టించుకోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ముందుగా బిల్డర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. ఎ. అవును బి. కాదు 2. బ్రోచర్లో సూచించిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారా లేదా అని, ముందుగా పూర్తి చేసిన వెంచర్స్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ల ద్వారా (అడ్వాన్సు ఇవ్వడానికి ముందే) తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. కొనుగోలు దారులకు చూపించడానికి కట్టిన మోడల్ ఫ్లాట్ను నిశితంగా పరిశీలిస్తారు. అందులో ఇంటీరియర్ డెకరేషన్ను కాకుండా నిర్మాణంలో నాణ్యతను గమనిస్తారు. ఎ. అవును బి. కాదు 4. నిర్మాణానికి ప్రభుత్వశాఖల నుంచి అన్ని ఆమోదాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. నిర్మాణ దశలో స్వయంగా వెళ్లి బ్రోచర్లో చెప్పిన క్వాలిటీ పరికరాలను వాడుతున్నారా అని చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఇంట్లోకి చేరేముందుగానే కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పైకి కనిపిస్తున్న ధరలతోపాటు అంతర్లీనంగా ఉన్న చెల్లింపుల వివరాలను ముందుగానే బిల్డర్ను అడిగి స్పష్టంగా తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. మీకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూనిట్, సోలార్ ఎక్విప్మెంట్ అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి తగిన విలువను రాబట్టుకోవడం తెలుసు. ‘బి’లు ఎక్కువైతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అరకొర సౌకర్యాలతో ఏదో ఒకలా పూర్తయిందనిపించిన ఇంటిని స్వాధీనం చేసుకుంటే తర్వాత ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే !
ప్రొద్దుటూరు :‘‘రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం నాఫెడ్ ద్వారా కొనగా మిగిలే కందులను రాష్ట్రమే సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 45వేల టన్నుల కందుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చింది, అదనంగా 55వేల టన్నులు కొనుగోలు చేయాలని కోరినా అంగీకరించలేదు. కందుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి గత సోమవారం అమరావతిలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అయితే గురువారం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. దీంతో రైతులు మంత్రుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విమర్శిస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ అధికారులు మినుముల కొనుగోలుకు సం బంధించి కడప మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా కందుల కొ నుగోలుకు కడప, రాయచోటి, ఎర్రగుంట్ల, శనగ కొనుగోలుకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో వ్యాపారులు మినుములు అమ్ముతున్నారని అధికారులు బుధవారం కడప మార్కెట్ యార్డులో దాడులు చేయడంతో అక్కడ కొనుగోలు తాత్కాలికంగా నిలిపేశారు. మిగతా కొనుగోలు కేంద్రాలతో పోల్చితే చివరగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగలు, కందులు, మినుములు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ముందే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందనే విషయం తెలుసుకున్న రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకోవాలని ఆశతో వచ్చారు. కందులు, మినుములు క్వింటాలు ధర బయట మార్కెట్లో రూ.4వేలు మాత్రమే ఉండగా కొనుగోలు కేంద్రంలో కందులు రూ.5,450, మినుములు రూ.5,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, లింగాల, వేంపల్లి తదితర దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొనుగోలు కేంద్రంలోని డీసీఎంఎస్ అధికారులు ససేమిరా అంగీకరించలేదు. కేవలం శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉండటంతో టోకన్లు ఇస్తున్నామని, తొలి రోజు కందుల కొనుగోలుకు టోకన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పై అధికారుల అనుమతి వచ్చేంత వరకు కందులు, మినుములను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో రైతులు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారుల హవా నడుస్తోందని, ఈ కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
ఓలా చేతికి ఫుడ్పాండా: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఫుడ్పాండా భారత వ్యాపార్యాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఓలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్కు చెందిన డెలివరీ హీరో గ్రూప్ నుంచి ఫుడ్పాండా భారత వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఓలా ప్రకటించింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆహారపదార్ధాల వ్యాపారం ఓలాకు బదిలీ అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్ల బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు. 2014 లో, ఓలా కేఫేతో ఓలా ఆహార పంపిణీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తన సేవలను విస్తరించింది. తరువాత మూసివేసింది. అయితే ఉబెర్ ఈట్స్కు పోటీగా ఫుడ్ పంపిణీ వ్యాపారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో ఫుడ్పాండాను కొనుగోలు చేయడం కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్లైన ఫుడ్ సర్వీసుల సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి. ఇండియాలో ఫుడ్ సర్వీసులను మరింత అభివృద్ధి చేసే కృషిలో ఈ భాగస్వామ్యంపై సంతోషిస్తున్నామని, ఫుడ్ పాండా ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. తమ తాజా భాగస్వామ్యం మార్కెట్ల ఏకీకరణకు అనుమతిస్తుందని డెలివరీ హీరో గ్రూపు సహ-వ్యవస్థాపకుడు, సీఈవో నిక్లాస్ ఓస్టర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓలాలో తమ వాటా చాలా విలువైన ఆస్తిగా పరిగణిస్తామన్నారు. -
రైతుల ఆందోళన కనపడదా: డీకే అరుణ
పంటలు కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళన పడుతున్నారని, రైతుల గోస టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనపడదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. రైతును రాజు చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వేరుశనగ ధర గతేడాది ఇదే సమయంలో క్వింటాలుకు రూ.4,600 ఉందని, ఇప్పుడు గద్వాల మార్కెట్లో రూ.1,600కే కొంటున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గూగుల్ చేతికి హాలీ ల్యాబ్స్
న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ .. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ హాలీ ల్యాబ్స్ను ’ఆక్వి–హైరింగ్’ ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. భారత్లో గూగుల్ ఏదైనా సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కొత్త యూజర్లకి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు హాలీ ల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడనుంది. గూగుల్కి చెందిన నెక్స్ట్ బిలియన్ యూజర్స్ టీమ్లో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషంగా ఉందని హాలీ ల్యాబ్స్ తమ బ్లాగ్లో పేర్కొంది. ఏదైనా కంపెనీ అందించే ఉత్పత్తులు, సర్వీసుల కన్నా.. అందులోని సిబ్బంది కోసమే కొనుగోలు చేయడాన్ని ఆక్వి–హైరింగ్గా వ్యవహరిస్తారు. గూగుల్ ఇటీవలి కాలంలో కంపెనీల కొనుగోలు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
స్నాప్డీల్కి ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’.. స్నాప్డీల్కు అతిత్వరలోనే మరొక ఆఫర్ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది. -
అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్కార్ట్తో స్నాప్డీల్ చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో తీవ్ర పోటీలో స్నాప్డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించిన స్నాప్డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది. -
బుక్మైషో చేతికి బర్ప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెట్ సేవల సంస్థ బుక్మైషో (బీఎంఎస్) తాజాగా ముంబైకి చెందిన బర్ప్ సంస్థను కొనుగోలు చేసింది. స్థానిక రెస్టారెంట్ల సమాచార వివరాలు అందించే ఈ సంస్థను నెట్వర్క్18 నుంచి దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిగ్ట్రీలో భాగమైన ఫుడ్ఫెస్టా వెల్కేర్ ద్వారా ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నెట్వర్క్18కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్ కాగా.. బీఎంఎస్ బిగ్ట్రీ నిర్వహణలో ఉంది. 2006లో ప్రారంభమైన బర్ప్లో ప్రస్తుతం 12 నగరాల్లోని 56,000 పైచిలుకు రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2016–17లో సంస్థ ఆదాయం రూ. 56.67 లక్షలు. నెట్వర్క్18 టర్నోవర్లో ఇది 0.69 శాతం. 2017 మార్చి ఆఖరు నాటికి బర్ప్ నికర విలువ మైనస్ రూ. 28.89 కోట్లుగా ఉంది. స్లంప్ సేల్ ప్రాతిపదికన కన్సల్టెన్సీ సంస్థ ఈవై.. బర్ప్ విలువను రూ. 6.7 లక్షలుగా లెక్కగట్టినట్లు నెట్వర్క్18 పేర్కొంది. -
బిగ్ బాస్కెట్పై అమెజాన్ కన్ను!
ప్రాథమిక స్థాయిలో చర్చలు న్యూఢిల్లీ: అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నిత్యావసర సరుకుల విక్రయ ఆన్లైన్ సంస్థ బిగ్బాస్కెట్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇవి ఫలవంతం కావొచ్చు లేక కాకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూపర్మార్కెట్ గ్రాసరీ సప్లైస్ సంస్థలో భాగమైన బిగ్బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన అబ్రాజ్ గ్రూప్, హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన ఇన్వెస్టర్ల నుంచి గతేడాది 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. కొత్తగా గిడ్డంగుల ఏర్పాటుకు, డెలివరీ నెట్వర్క్ను పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ట్రైఫెక్టా క్యాపిటల్ నుంచి మరో 7 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆదాయాలు గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న బిగ్బాస్కెట్ ఇప్పటికే రెండు నగరాల్లో బ్రేక్ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ భారత్లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
అలీబాబా పిక్చర్స్కి టికెట్న్యూలో మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ టికెట్న్యూలో చైనాకి చెందిన అలీబాబా గ్రూప్ సంస్థ అలీబాబా పిక్చర్స్ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో తమ కార్యకలాపాలు, సర్వీసుల పోర్ట్ఫోలియో మరింత పటిష్టం కాగలదని టికెట్న్యూ పేర్కొంది. అలీబాబా విడతలవారీగా రూ. 120 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు టికెట్న్యూ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్కుమార్ నమ్మాళ్వార్ తెలిపారు. ఈ డీల్తో తమ సిబ్బందికి, కంపెనీకి ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. 2007లో రామ్కుమార్ నమ్మాళ్వార్ .. టికెట్న్యూని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. -
ఎన్డీటీవీనీ రాందేవ్ బాబా కొంటున్నారా?
ముంబై: ఒకవైపు ఎన్డీటీవీపై సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఎన్డీవీని కొనుగోలు చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈవార్తలను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ నిధి రాజ్దాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. Fake news from @e4mtweets: https://t.co/sc9JdSKGxD — VISHAL (@VishalManve12) June 5, 2017 Hello people, Ramdev is not buying NDTV. Thank you — Nidhi Razdan (@RazdanNidhi) June 5, 2017 -
అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు. ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. -
అక్షయ తృతియ: ఒక్క రూపాయికే బంగారం!
న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత అలీబాబాకు చెందిన పేటీఎం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎం మరో కొత్తరకం సర్వీసులతో మన ముందుకు వచ్చింది. ఇంకా ఒక్క రోజుల్లో అక్షయ తృతీయ కావడంతో, ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం 'డిజిటల్ గోల్డ్' ను లాంచ్ చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను కస్టమర్లకు అందించనుంది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎం పేర్కొంది. తమ పేటీఎం మొబైల్ వాలెట్స్ ను వాడుకుంటూనే వినియోగదారులు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని ఆన్ లైన్ లో కొనుకోవచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ చెప్పింది. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ సెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చట. బంగారానికి భారతీయుల పెట్టుబడుల సాధనంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, బంగారంలో డిజిటల్ గా పెట్టుబడులు పెట్టడానికి తాము సులభతరంగా సేవలందిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మార్కెట్ ఆధారిత ధరలతోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ బంగారాన్ని అమ్మడానికి, కొనడానికి కస్టమర్లకు అవకాశముంటుందన్నారు. ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుక్కునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తామని విజయ్ శేఖర్ చెప్పారు. 20వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను అందించాల్సినవసరం ఉండదు. -
ఫ్లిప్‘కార్ట్’లోకి ఈబే ఇండియా?
⇒ భారత విభాగం విక్రయంపై ఈబే చర్చలు ⇒ ఫ్లిప్కార్ట్లో మైనారిటీ వాటాలు కొనుగోలు యోచన ⇒ 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి ప్రతిపాదన ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం కన్సాలిడేషన్ పర్వం నడుస్తోంది. ఇప్పటికే స్నాప్డీల్ విక్రయం వార్తలు నడుస్తుండగా.. తాజాగా ఈబే కూడా ఈ జాబితాలో చేరింది. మార్కెట్లోకి ప్రవేశించి దశాబ్దం పైగా దాటిపోయినా.. ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయిన ఈబే తాజాగా తమ భారత విభాగాన్ని మరో ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిపాదిత డీల్ ప్రకారం ఫ్లిప్కార్ట్లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం 1.5–2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. ఒకప్పుడు 15 బిలియన్ డాలర్ల పైగా పలికిన ఫ్లిప్కార్ట్ వేల్యుయేషన్ తాజా నిధుల సమీకరణ సమయంలో సుమారు 11 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గిపోయింది. ప్రస్తుతం సమీకరిస్తున్న పెట్టుబడులు.. అత్యంత వేగంగా విస్తరిస్తున్న అమెజాన్కి గట్టి పోటీనిచ్చేందుకు ఫ్లిప్కార్ట్కి చాలా కీలకం కానున్నాయి. సంపన్న మార్కెట్లపై దృష్టి.. ప్రస్తుతమున్న చాలా మటుకు ఈకామర్స్ సంస్థల కన్నా ముందుగా భారత మార్కెట్లోకి ఈబే అడుగుపెట్టినప్పటికీ.. అంతగా విజయవంతం కాలేకపోయింది. 2004లో బాజీడాట్కామ్ను కొనుగోలు చేసిన ఈబే 2005లో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ కొనుగోలుదారులకు పెద్దగా చేరువకాలేకపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలే కాకుండా చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్నాప్డీల్, పేటీఎం, షాప్క్లూస్ వంటి సంస్థలు కూడా దూసుకెడుతుండగా.. ఈబే మాత్రం రాణించలేక చతికిలబడింది. 2015లో రూ. 172 కోట్లు, గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ. 262 కోట్ల మేర నష్టాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్న ఈబే ప్రధానంగా మళ్లీ అమెరికా, యూరప్ వంటి సంపన్న మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. భారత్ మార్కెట్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే, అలాగని పూర్తిగా వైదొలగాలని కూడా భావించడం లేదు. ఫ్లిప్కార్ట్లో పెట్టుబడుల ద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో ఎంతో కొంత వాటాలతో కొనసాగాలని ఈబే యోచిస్తోంది. దూకుడుగా అమెజాన్ .. అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ గతేడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2030 నాటికి ఇది 228 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించడంపై అమెజాన్ దూకుడుగా ఉంది. దాదాపు 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. దేశీయంగా సీ2సీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం క్వికర్, ఓఎల్ఎక్స్ సంస్థలు ఇందులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్నాప్డీల్ ఇటీవలే షాపో సంస్థను మూసివేయడం ద్వారా ఈ విభాగం నుంచి వైదొలిగినప్పటికీ.. అమెజాన్ మాత్రం ఈ మార్కెట్పై ఆశావహంగా ఉంది. మరోవైపు వివిధ మార్గాల్లో చైనాకి చెందిన ఆలీబాబా, జపాన్ సంస్థ రకుటెన్ మొదలైనవి కూడా భారత ఈ–కామర్స్ మార్కెట్లో చొరబడేందుకు పోటీపడుతున్నాయి. -
ఎయిర్టెల్ చేతికి ‘టికోనా’
♦ 4జీ వ్యాపారం కొనుగోలు ♦ డీల్ విలువ రూ.1,600 కోట్లు న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్టెల్... ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్వర్క్స్కు చెందిన 4జీ వ్యాపారాన్ని రూ.1,600 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలులో భాగంగా టికోనా సంస్థకు చెందిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 5 టెలికం సర్కిళ్లలో విస్తరించి ఉన్న 350 సైట్లు తమ పరం అవుతాయని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టికోనా సంస్థకు గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో 2,300 మోగాహెట్జ్ బ్యాండ్పై 20 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. టికోనా కొనుగోలుతో దేశంలో రిలయన్స్ జియో తర్వాత దేశవ్యాప్త 4జీ నెట్వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్టెల్ అవతరిస్తుంది. టికోనా సంస్థ కొనుగోలుతో వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలందించగలమని కంపెనీ ఎండీ, సీఈఓ (ఇండియా,దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఈ డీల్ పూర్తికాగానే ఈ ఐదు సర్కిళ్లలో 4జీ సేవలందిస్తామని తెలియజేశారు. -
ఎయిర్టెల్ మరో భారీ డీల్
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ కీలక అడుగు వేసింది. భారత్లో 4జీ ఇంటర్నెట్ సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ బ్రాడ్బాండ్ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్ను స్వాధీనం చేసుకోనుంది. టికోనా 4జీ డిజిటల్ నెట్వర్క్ బిజినెస్ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కాగా ఒకవైపు జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్ జియో సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్, ఐడియా మెగామెర్జర్ టెలికాం పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ టికోనాతో నిశ్చయాతమ్మకం ఒప్పందం చేసుకోవడం విశేషం. జియో ఎంట్రీ స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థ నిష్క్రమణకు ఉత్ర్పేరకంగా నిలిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవం: నాగార్జున ఫెర్టిలైజర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోరమాండల్ ఇంటర్నేషనల్ తమ సంస్థను కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎఫ్సీఎల్) ఖండించింది. కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవాలని తెలిపింది. కంపెనీ గానీ ప్రమోటర్లు గానీ ఇందుకు సంబంధించి ఏ సంస్థతోనూ చర్చలు జరపడం లేదని ఎన్ఎఫ్సీఎల్ వివరించింది. తమకున్న వివిధ వ్యాపార విభాగాల్లో యూరియా కూడా ఒకటని తెలిపింది. గెయిల్ పైప్లైన్ ప్రమాదం కారణంగా యూరియా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని, నష్టాలు భర్తీ చేసుకునేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించింది. ప్రభుత్వం తాజాగా గ్యాస్ కేటాయింపులు జరపడంతో యూరియా ఉత్పత్తి మళ్లీ ప్రారంభించామని ఎన్ఎఫ్సీఎల్ తెలిపింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ చేతికి ఐఎస్ఎస్ఎల్
వంద శాతం వాటా కొనుగోలు ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్)కు చెందిన సెక్యూరిటీస్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్(ఐఎస్ఎస్ఎల్)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్ ఇండ్ తెలియజేసింది. తాము ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నామని, 500కు పైగా బ్రోకర్లకు సేవలందిస్తున్నామని ఐఎస్ఎస్ఎల్ కొనుగోలుతో తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని ఇండస్ఇండ్ ఎండీ, సీఈఓ రొమేశ్ సోబ్తి చెప్పారు. 3 నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందన్నారు. 2007లో ప్రారంభమైన ఐఎస్ఎస్ఎల్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్ క్లియరింగ్, డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీస్లను నిర్వహిస్తోంది. రిటైల్, సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లతో పాటు వెయ్యికి పైగా బ్రోకర్లకు సేవలందిస్తోంది. రోజుకు పది లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది. -
ఇంటెల్ చేతికి మొబైల్ఐ
15 బిలియన్ డాలర్ల డీల్ న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తాజాగా ఇజ్రాయెల్కి చెందిన సెన్సర్ కంపెనీ మొబైల్–ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ను సరఫరా చేస్తుంది. రెండు కంపెనీల సంయుక్త ప్రకటన ప్రకారం మొబైల్ఐ షేరు ఒక్కింటికి 63.54 డాలర్ల చొప్పున ఇంటెల్ ఆఫర్ చేసింది. శుక్రవారం నాటి మొబైల్ఐ షేరు ధర 47.27 డాలర్లతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. వచ్చే తొమ్మిది నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఇంటెల్ పేర్కొంది. సుమారు 40 సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ కార్ల తయారీకి సంబంధించి ఈ రెండు సంస్థలు ఇప్పటికే జర్మనీ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూతో కలసి పనిచేస్తున్నాయి. 1999లో ఏర్పాటైన మొబైల్ఐ 2007లో గోల్డ్మన్ శాక్స్ సంస్థ నుంచి 130 మిలియన్ డాలర్స్ సమీకరించింది. 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో లిస్టయింది. -
టీవీఎస్ లాజిస్టిక్స్ చేతికి యూకే కంపెనీ
డీల్ విలువ రూ.165 కోట్లు చెన్నై: టీవీఎస్ గ్రూప్కు చెందిన టీవీఎస్ లాజిస్టిక్స్ ఇంగ్లండ్కు చెందిన ఒక కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. దీని కోసం రూ.165 కోట్లు వెచ్చించామని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ చెప్పారు. ఎస్పీసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లోవేకియా, అమెరికా, భారత్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తం 350 మంది ఉద్యోగులున్నారు. సాంకేతికంగా, అంతర్జాతీయంగా మంచి సేవలందిస్తున్న కంపెనీలను కొనుగోలు చేయడంలో భాగంగా ఎప్పీసీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నామని వివరించారు. -
27 నుంచి ఏడో విడత బంగారు బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27న ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.20వేల వరకు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంది. అంతకుమించితే డీడీ లేదా చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత జారీ. ‘‘ఆర్బీఐతో ప్రభుత్వం సంప్రదించిన అనంతరం సౌర్వభౌమ బంగారు బాండ్లు 2016–17 ఏడో సిరీస్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్లను కేటాయిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రత్యామ్నాయ సాధనంగా సౌర్వభౌమ బంగారు బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబర్లో తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు బాండ్లను జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటిపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. బాండ్ల కాల వ్యవధి 8 ఏళ్లు కాగా, ఐదో ఏట నుంచి వైదొలగేందుకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్టాక్ ఎక్సేS్చలలో ట్రేడ్ అవుతాయి. -
ఎయిర్టెల్ గూటికి టెలినార్!
టెలినార్ ఇండియా కొనుగోలుకు ఎయిర్టెల్ ఒప్పందం... ⇒ అప్పులు, ఫీజులు కట్టేందుకు అంగీకారం... ⇒ రిలయన్స్ జియో పోటీ ఎఫెక్ట్... ⇒ టెలినార్కు ఏడు సర్కిళ్లలో 4.4 కోట్ల మంది యూజర్లు... ⇒ 11 శాతం దూసుకెళ్లిన ఎయిర్టెల్ షేరు... దేశీ టెలికం రంగంలో మరో వికెట్ పడింది. రిలయన్స్ జియో చౌక టారిఫ్ల దెబ్బకు తోడు.. స్పెక్ట్రం రేట్లు చుక్కలు చూపిస్తుండటంతో విదేశీ టెలికం కంపెనీలు భారత్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో నార్వేకు చెందిన టెలికం దిగ్గజం టెలినార్ చేరింది. తన భారత్ కార్యకలాపాలను భారతీ ఎయిర్టెల్కు విక్రయించనుంది. ఈ మేరకు టెలినార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ గురువారం ప్రకటించింది. దీంతో ఇప్పుడు దేశంలో ఒక్క జపాన్ టెల్కో డొకోమో(టాటాలతో జాయింట్ వెంచర్) తప్ప విదేశీ కంపెనీలన్నీ దాదాపు ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి వైదొలగినట్టే లెక్క!! ఇటీవలే వొడాఫోన్.. ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి టారిఫ్లను అమలు చేస్తామంటూ తాజాగా జియో ప్రకటించిన నేపథ్యంలో అంతకుముందే భారత్ టెలికం రంగంలో భారీస్థాయిలో విలీనాలు, కొనుగోళ్లకు తెరలేవడం గమనార్హం. న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్.. టెలినార్ ఇండియాను చేజిక్కించుకుంది. దేశంలో టెలినార్కు ఉన్న ఏడు సర్కిళ్లలో కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెలినార్ సౌత్ ఏషియా ఇన్వెస్ట్మెంట్స్తో ఒప్పం దం ఖరారు చేసుకుంది. డీల్ ప్రకారం ఎయిర్టెల్ టెలినార్కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. అయితే, ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లైసెన్స్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్టెల్ భరిస్తుంది. కాగా, తాజా లావాదేవీతో తమ అసెట్స్కు సంబంధించి ఎలాంటి ఇంపెయిర్మెంట్(వ్యాపార నష్టం)కూ దారితీయదని టెలినార్ ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది(2016) చివరినాటికి తమకు భారత్కు 0.3 నార్వేజియన్ క్రోన్ల విలువజేసే ఆస్తులు(స్థిర, చర, ఇతరత్రా ఆస్తులన్నీ కలుపుకుని) మిగిలినట్లు వెల్లడించింది. 12 నెలలలో ఎయిర్టెల్తో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ‘ప్రతిపాదిత కొనుగోలుతో టెలినార్ ఇండియా ఆస్తులు, యూజర్లు, ఉద్యోగులు మొత్తం మాకు దక్కుతారు. దీనివల్ల మా వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు ఏడు సర్కిళ్లలో మరింత స్పెక్ట్రం కూడా అందుబాటులోకి వస్తుంది. మొత్తంమీద ఈ డీల్తో 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్లో 43.4 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం లభిస్తుంది’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికం శాఖ, కాంపిటీషన్ కమిషన్ ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ డీల్ పూర్తవుతుంది. ఏడు సర్కిళ్లు.. 4.4 కోట్ల కస్టమర్లు భారత్లో టెలినార్.. మొదట యూనిటెక్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా యూనినార్ పేరుతో 2008లో టెలికం సేవల్లోకి అడుగుపెట్టింది. అయితే, స్పెక్ట్రం కుంభకోణం నేపథ్యంలో సుప్రీం కోర్టు అప్పట్లో ఇచ్చిన లైసెన్స్లను రద్దు చేయడంతో యూని టెక్తో జేవీకి టెలినార్ ముగింపు పలికింది. ఆ తర్వాత యూనినార్ పేరును టెలినార్గా మార్చి.. కేవలం ఏడు సర్కిళ్లలో మాత్రమే స్పెక్ట్రంను కొనుగోలు చేసి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెలినార్కు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్(తూర్పు), ఉత్తరప్రదేశ్(పశ్చిమం), అస్సాం సర్కిళ్లలో 4.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దేశీ మార్కెట్లో మొత్తం వాటా దాదాపు 2.6%గా ఉంది. 700–800 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది తొలి క్వార్టర్ నుంచే తమ భారత్ కార్యకలాపాలను విక్రయానికి ఉంచిన ఆస్తులుగా పరిగణిస్తామని.. గ్రూప్ ఆర్థిక ఫలితాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని టెలినార్ పేర్కొంది. గతేడాది టెలినార్ ఇండియా ఆదాయం 6 బిలియన్ నార్వేజియన్ క్రోన్స్(దాదాపు రూ.రూ.4,800 కోట్లు)గా నమోదైంది. 40 కోట్ల నార్వేజియన్ క్రోన్ల(దాదాపు రూ.320 కోట్లు) నిర్వహణ నష్టాలను మూటగట్టుకుంది. ఎయిర్టెల్కు ‘స్పెక్ట్రం’ జోష్... ఇక ఎయిర్టెల్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా కంపెనీకి 26.9 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు. 33% పైగా మార్కెట్ వాటాతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు టెలినార్ సబ్స్క్రయిబర్లు జతయితే, ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 30 కోట్లను మించిపోతుంది. మార్కెట్ వాటా 35.6 శాతానికి చేరుతుంది. మరోపక్క, ఏడు కీలక సర్కిళ్లలో 1,800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం లభిస్తుండటంతో(దీన్ని 4జీ సేవలకు ఎక్కువగా వినియోగిస్తారు) ఎయిర్టెల్ తన 4జీ నెట్వర్క్ను మరింతగా పటిష్టం కానుంది. జియోతో పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుంది. టెలినార్ అప్పులు, ఫీజులకు ప్రతిగా అదనపు స్పెక్ట్రం లభించడం ఎయిర్టెల్కు ప్రయోజనకరమేనని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది. డీల్ కారణంగా కంపెనీ రేటింగ్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జియో ప్రవేశం వల్లే దేశీ టెలికంలో ఈ భారీ స్థిరీకరణ జరుగుతోందని పేర్కొంది. కాగా, గడిచిన ఐదేళ్లలో ఎయిర్టెల్కు ఇది అయిదో కొనుగోలు కావడం గమనార్హం. 2012లో క్వాల్కామ్ ఇండియా వ్యాపారాన్ని దక్కించుకుంది. 2014లో లూప్ మొబైల్ను, 2015లో ఆగెర్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఇండియాను కొనుగోలు చేసింది. ఇక గతేడాది వీడియోకాన్ టెలికం వ్యాపారాన్ని, ఎయిర్సెల్ డిష్నెట్ వైర్లెస్ను చేజిక్కించుకుంది. టెలినార్తో డీల్ నేపథ్యంలో గురువారం ఎయిర్టెల్ షేర్లు రివ్వుమన్నాయి. బీఎస్ఈలో ఒకానొక దశలో 10.93 శాతం దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని(రూ.401) తాకింది. చివరకు 1.36 శాతం మాత్రమే లాభంతో రూ.366 వద్ద ముగిసింది. టెలినార్ ఇండియా కొనుగోలుతో నెట్వర్క్ పరంగా, మార్కెట్ వాటా పరంగా పలు కీలక సర్కిళ్లలో ఎయిర్టెల్ మరింత బలోపేతం అవుతుంది. ఎయిర్టెల్ అందిస్తున్న అనేక ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవలను టెలినార్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. ఈ డీల్ ద్వారా లభించనున్న అదనపు స్పెక్ట్రంతో మా వ్యాపార కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి. – గోపాల్ విట్టల్, భారతీ ఎయిర్టెల్ (భారత్, దక్షిణాసియా) ఎండీ–సీఈఓ మా భారత్ వ్యాపారానికి తగిన దీర్ఘకాలిక పరిష్కారం లభించింది. ఎయిర్టెల్తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది. భారత్ నుంచి వైదొలగాలన్న నిర్ణయం ఏదో ఆషామాషీగా తీసుకున్నది కాదు. ఇక్కడ సేవలను మరింతగా విస్తరించాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. మరోపక్క, దీనిపై ఆశించిన మేరకు రాబడలు వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. – సిగ్వీ బ్రెకీ, టెలినార్ గ్రూప్ సీఈఓ తీవ్రమైన పోటీ.. అప్పుల భారం రిలయన్స్ జియో సంచలనాత్మక ఉచిత ఆఫర్కు తోడు.. అది ప్రకటించిన అత్యంత చౌక టారిఫ్లు దేశీ టెలికం రంగంలో పెను మార్పులకు కారణమవుతోంది. మరోపక్క, కంపెనీలకు అధిక స్పెక్ట్రం రేట్లు గుదిబండగా మారుతున్నాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీనికితోడు దేశంలో పన్ను సంబంధ, ఇతరత్రా వివాదాలు కొన్ని విదేశీ కంపెనీలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్)లో రష్యా టెలికం కంపెనీ సిస్టెమా(ఎంటీఎస్ బ్రాండ్) విలీనం అయ్యేందుకు ఓకే చెప్పింది. ఇక ఎయిర్సెల్(ప్రమోటర్ మలేసియా మాక్సిస్ గ్రూప్) ఆర్కామ్ల విలీనం కూడా త్వరలో సాకారం కానుంది. ఇదిలాఉంటే.. టాటా డొకోమో జాయింట్వెంచర్ నుంచి వైదొలిగేందుకు జపాన్ కంపెనీ డొకోమో చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా.. కోర్టు వివాదం కారణంగా ఇది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. భారత ప్రభుత్వంతో పన్ను వివాదంతో చాన్నాళ్లుగా గుర్రుగా ఉన్న బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్.. ఐడియాతో విలీనం ద్వారా ఇక్కడి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ డీల్తో ఏర్పాటయ్యే కంపెనీ దాదాపు 40 కోట్ల మంది యూజర్లతో ఎయిర్టెల్ను అధిగమించి టాప్ ర్యాంక్లోకి దూసుకెళ్తుంది. భారత్కు గుడ్బై చెప్పేస్తామంటూ సంకేతాలిస్తూ వచ్చిన టెలినార్ సైతం ఇప్పుడు దీన్ని ఖాయం చేసింది. మొత్తానికి ఒకప్పుడు పొలోమంటూ టెలికం రంగంలోకి కంపెనీలు ప్రవేశించడంతో కిక్కిరిసిన భారత్ మార్కెట్లో ఇప్పుడు మొత్తం టెల్కోల సంఖ్య దాదాపు అరడజనుకు పడిపోయే పరిస్థితి నెలకొంది. -
కొనుగోలు వార్తలతో ‘యాక్సిస్’ జోరు
యాక్సిస్ బ్యాంక్ కోసం పలు ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయన్న వార్తలతో మంగళవారం ఈ బ్యాంక్ షేరు భారీగా పెరిగింది. యాక్సిస్ను విలీనం చేసుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, యాక్సిస్ వాటాను కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇంద్ బ్యాంక్లు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయనే వార్తలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దాంతో ఈ షేర్ 5 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. కొటక్ బ్యాంక్తో విలీనమేదీ లేదని సోమవారం యాక్సిస్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ, మీడియాలో పదేపదే వార్తలు వెలువడుతుండటంతో బ్యాంక్ షేరు హఠాత్ ర్యాలీ జరిపింది. అలాంటిదేమీ లేదు..: కేంద్రం యాక్సిస్ బ్యాంక్ను విలీనం చేసుకునేందుకు, అందులో వాటా కొనుగోలుకు ఏ బ్యాంకూ తమవద్దకు ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి చెప్పారు. ఈ బ్యాంక్లో 12% వాటా ప్రభుత్వం వద్ద వుంది. ఆ వాటాను విక్రయించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి వుంది. అయితే తక్షణమే ఈ వాటాను విక్రయించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టంచేశారు. -
పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా
న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్ పంపారు. ఆటోమేషన్ కంపెనీ పనయను ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది. వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని, కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. -
బై బ్యాక్ కు టీసీఎస్ బోర్డు ఓకే
ముంబై: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)వాటాదారులకు ఉత్సాహకరమైన వార్త అందించింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్ల బై బ్యాక్ పై టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5.6 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.16 వేల కోట్ల విలువకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డ్ సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలించింది. 14.6 శాతం ప్రీమియంతో తన సొంత షేర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ రేటు పై ఈ ప్రీమియాన్ని అందించనుంది. రూ.2,850 ధర వద్ద షేరును కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.33 శాతంగా ఉంది. ఈ వార్తలతో మార్కెట్ ముగింపులో టీసీఎస్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. అటు టీసీఎస్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు హర్షం ప్రకటించాయి. -
వీటిల్లో కొంటే అంతే!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొనుగోలు చేయొద్దు సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజు ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో, బఫర్ జోన్లోనో, ఎఫ్టీఎల్లోనో అపార్ట్మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు. బఫర్ జోన్ అంటే: బఫర్ జోన్ అంటే నీటి పరీవాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా. ఎఫ్టీఎల్ అంటే: ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతంను ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి «ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కులు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు. -
సిస్కో చేతికి ‘దేశీ’ స్టార్టప్ సంస్థ
3.7 బిలియన్ డాలర్లకు యాప్డైనమిక్స్ కొనుగోలు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ వ్యాపారవేత్త జ్యోతి బన్సల్ నెలకొల్పిన ‘యాప్డైనమిక్స్’ స్టార్టప్ సంస్థను దిగ్గజ కంపెనీ సిస్కో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కంపెనీలు తమ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను మెరుగ్గా నిర్వహించుకునేందుకు, వ్యాపార పనితీరునును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సేవలను యాప్డైనమిక్స్ అందిస్తోంది. ఢిల్లీలోని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన బన్సల్.. 2008లో యాప్డైనమిక్స్ను ప్రారంభించారు. 2015 సెప్టెంబర్లో సీఈవో హోదా నుంచి బన్సల్ తప్పుకున్న తర్వాత డేవిడ్ వాధ్వానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బన్సల్ కంపెనీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. యాప్డైనమిక్స్ సంస్థ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీల్ పూర్తి కావొచ్చని అంచనా. -
కంది కొనుగోలుకు 80 కేంద్రాలు
• కందులకు మద్దతు ధరపై సమీక్షలో మంత్రి హరీశ్ • 2.17 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో కందులకు మద్దతు ధర ఇచ్చేందుకు 80 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటివరకు 68 కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. కంది మద్దతు ధర చెల్లింపు, సేకరణపై మార్కెటింగ్, ఎఫ్సీఐ, నాఫెడ్, హాకా, డీసీఎంఎస్, వ్యవసాయాధి కారులతో సోమవారం ఆయన సమీక్షిం చారు. మద్దతు ధర అందించాలని, దళారు లను అరికట్టాలనే ఉద్దేశంతో పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా కొనుగోలు చేయా లని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 20,720 మంది రైతుల నుంచి 2,17,628 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసి రూ.50 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన మొత్తం కూడా రైతులకు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదే శింశామన్నారు. కందిS కొనుగోళ్లలో సమ స్యలుంటే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల పరి ష్కారానికి మార్కెటింగ్శాఖ కార్యాలయం లో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశా మన్నారు. 040–23222306 నంబర్కు ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ప్రతి సోమ వారం మార్కెటింగ్ డైరెక్టర్ సమీక్ష నిర్వ హించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. కందుల రెగ్యులేషన్ జరుగుతున్న మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వ ఏజెన్సీలు కొన్న తర్వాత ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఆయా కార్యదర్శులు తగిన జాగ్రత్తలు తీసుకొని రైతుకు మంచి ధర వచ్చేలా చూడాలని చెప్పారు. వివాదాల పరిష్కారానికి కమిటీలు వేయాలన్నారు. రైతులు 12 శాతం తేమ మించకుండా కందులను యార్డుకు తీసుకొచ్చేలా ఆయా మార్కెట్ యార్డుల తరపున ప్రచారం చేయాలన్నారు. రైతు సరుకును యార్డుకు తీసుకొచ్చి కుప్పపోసేందుకే చార్జీలు చెల్లిం చాలని.. ఏ ఇతర చార్జీలు రైతులు చెల్లిం చాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కొనుగోలుకు సంబంధించి తూకం, హమా లీ అన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీలే భరిస్తా యన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తాత్కాలిక మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లోకి కందులు చేరిన వెంటనే ఇన్వాయిస్ బిల్లులు తయారుచేసి రైతులకు డబ్బులందేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. దేశం నుంచి కంది ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసేం దుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖపై అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. కల్వకుర్తి, కొల్హాపూర్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కె టింగ్ శాఖ అధికారులు ఆయా మార్కెట్ల లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్రావు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, మార్క్ఫెడ్ జీఎం రేఖ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ
డీల్ విలువ రూ.95 కోట్లు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్ఎల్సీ (డబ్ల్యూఎఫ్టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు)కొనుగోలు చేయనున్నది. వాహన, ఇతర పారిశ్రామిక విభాగాల్లో తన ఉత్పత్తులను మరింతగా పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని భారత్ ఫోర్జ్ కొనుగోలు చేయనున్నది. తమ అమెరికా అనుబంధ కంపెనీ భారత్ ఫోర్జ్ అమెరికా ద్వారా డబ్ల్యూఎఫ్టీని కొనుగోలు చేయనున్నామని భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలును తమ ఫైనాన్స అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదించిందని భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా ఎన్. కల్యాణి చెప్పారు. ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. డబ్ల్యూఎఫ్టీ కంపెనీ ఈ ఏడాది 2.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా. -
శాంసంగ్ భారీ డీల్
కనెక్టెడ్ కార్ల ఉత్పత్తిలో వేగవంతంగా పెరుగుతున్న ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఓ అమెరికన్ కంపెనీని సొంతం చేసుకోబోతుంది. అమెరికన్ ఆటో పార్ట్ల తయారీదారి హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లుగా(సుమారు రూ.54,107 కోట్లు) ఉండనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న శాంసంగ్, ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుందని, శాంసంగ్ బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం ముగింపు ధరకు 27.8 శాతం ప్రీమియంగా ఈ డీల్ ఉంది. ఒక్కో షేరుకు 112 డాలర్ల నగదును హర్మాన్కు శాంసంగ్ చెల్లించనుంది. అమెరికాలో లిస్టు అయిన హర్మాన్, కనెక్టెడ్ కారు టెక్నాలజీలో లీడర్గా ఉంది. ఈ డీల్ శాంసంగ్ విలువలోనే అతిపెద్దదని, గ్లోబల్ మార్కెట్లోని ఆన్లైన్ కనెక్టెడ్ ఆటో టెక్నాలజీలో తనదైన ఉనికిని చాటుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని సంస్థ పేర్కొంది. తాము ఆటోమోటివ్ ఫ్లాట్ ఫామ్లో వృద్ధి చెందడానికి శాంసంగ్కు హర్మాన్ ఓ బలమైన పునాదిని వెంటనే ఏర్పరుస్తుందని పేర్కొంది. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, ఇతర ఇంటర్నెట్ తరహా వినోద ఫీచర్లను జనరల్ మోటార్స్, ఫియట్ క్రిస్లర్ వంటి గ్లోబల్ కారు కంపెనీలకు హర్మాన్ ఉత్పత్తిచేస్తోంది. -
బంగార దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
-
బంగారం దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు 500, 1000ను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం, మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా చేసింది. బ్లాక్మనీని బంగారం వైపు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కొనుగోలు దారులు పాన్ నెంబర్ సమర్పించకపోతే అసలు బంగారం విక్రయాలు చేపట్టవద్దని ఆభరణ దుకాణదారులకు తెలిపింది. ఒకవేళ కొనుగోలుదారుల నుంచి పాన్ నెంబర్ తీసుకోని పక్షంలో ఆభరణ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పాన్ నెంబర్ తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆభరణ దుకాణదారులకు రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సూచించారు. బంగారం కొనుగోలు చేస్తున్నవారందరి వివరాలను భద్రపరచాలని వ్యాపారులకు తెలిపారు. పాన్ నెంబర్ ను తనిఖీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ఉంటుందని స్పష్టంచేసింది. శుభకార్యాల కోసం నగదు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ప్రజలు కూడా భారీగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. ప్రజల కొనుగోలు డిమాండ్ను క్యాష్ చేసుకున్న దుకాణదారులూ బంగారం ధరలను భగ్గుమనేలా పెంచారు. దీంతో బంగారం ధరలు కొన్ని ఆభరణ దుకాణాల్లో రూ.50వేల వరకు పలుకుతున్నాయి. ప్రధాని నిర్ణయాన్ని క్యాష్ చేసుకుని, బ్లాక్ మనీకి సహకరించే బంగార దుకాణదారులపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. -
హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ డెయిరీ వ్యాపారం
• డీల్ విలువ వెల్లడించని సంస్థ • దేశవ్యాప్త విస్తరణకు అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా రిలయన్స్ రిటైల్కి (ఆర్ఆర్ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తోంది. డీల్ ఖరారయినా... డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడి కాలేదు. నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతరత్రా అంశాలకు లోబడి ప్రతిపాదిత లావాదేవీ ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ శుక్రవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 553 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 2,400 గ్రామాల రైతుల నుంచి రోజుకు 2.25 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి కీలక మార్కెట్లతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కొత్తగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడుతుందని హెరిటేజ్ ఆశాభావం వ్యక్తంచేసింది. డీల్ అనంతరం కూడా హెరిటేజ్ డెయిరీ ఉత్పత్తులు సహా.. ఇతరత్రా డెయిరీ ఉత్పత్తులను కూడా తమ రిటైల్, హోల్సేల్ స్టోర్స్ ద్వారా విక్రయించడం కొనసాగిస్తామని తెలియజేసింది. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ తదితర ఆరు వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 1,13,500 రిటైల్ అవుట్లెట్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 123 హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. హెరిటేజ్ రిటైల్ వ్యాపార విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను హెరిటేజ్ ధ్రువీకరించటం తెలిసిందే. హెరిటేజ్ లాభం రూ. 16 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.641 కోట్ల ఆదాయంపై సుమారు రూ.15.69 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.587 కోట్లు కాగా లాభం రూ.15.29 కోట్లు. అయితే స్టాండెఅలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2లో డెయిరీ విభాగం రూ.462 కోట్ల ఆదాయంపై రూ.30 కోట్ల లాభం నమోదు చేసింది. రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. ఈ విభాగం రూ.175 కోట్ల అమ్మకాలపై రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. -
టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి
ముంబై: టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ అనుబంధ ప్రచురణ విభాగం వెస్ట్ల్యాండ్ను కొనుగోలు చేయనున్నట్టు అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఎంత మొత్తానికి అన్న విషయం తెలియజేయలేదు. ఈ కొనుగోలుతో వెస్ట్ల్యాండ్ రచయితలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా తమ ప్రచురణల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవచ్చని అమెజాన్ తెలిపింది. టాటాలకు చెందిన వెస్ట్ల్యాండ్లో అమెజాన్ గతంలోనే 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. వెస్ట్ల్యాండ్ కంపెనీ పుస్తక విక్రయాలు, పంపిణీ, ప్రచురణ విభాగంలో 50 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్వార్నర్ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్టీకి హెచ్బీవో, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్పై పట్టు వస్తుంది. ఏటీఅండ్టీ వైర్లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్వర్క్లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి. -
మేక్ మైట్రిప్ చేతికి ‘ఐబిబో’..
న్యూఢిల్లీ: ఆన్లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్మైట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది. దీంతో ఈ విభాగంలో మేక్మై ట్రిప్ ప్రధాన సంస్థగా అవతరించనుంది. ఐబిబోను దాని వాటాదారులైన దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టాన్సెంట్ హోల్డింగ్స్ మేక్ మైట్రిప్కు విక్రయించేందుకు ముందుకు రాగా, దీనికి ప్రతిగా మేక్ మై ట్రిప్ ఆయా సంస్థలకు తాజా వాటాలను జారీ చేయనుంది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. డీల్ పూర్తయితే ఐబిబో పూర్తిగా మేక్ మైట్రిప్ పరం అవుతుంది. అదే సమయంలో నాస్పర్స్, టాన్సెంట్ హోల్డింగ్స్ కలసి మేక్ మై ట్రిప్లో 40 శాతం వాటాను కలిగి ఉంటారు. ఇందుకు అనుగుణంగా మూలధన నిధులను సైతం అందించనున్నట్టు మేక్ మైట్రిప్ సంస్థ తెలిపింది. మేక్ మైట్రిప్ గతంలో సీట్రిప్ డాట్ కామ్కు జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్ను సాధారణ ఈక్విటీ కిందకు మార్చనున్నట్టు దీంతో ఈ సంస్థకు 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. మేక్మైట్రిప్ వాటాదారులతోపాటు నియంత్రణ సంస్థల అనుమతి అనంతరం ఈ డీల్ డిసెంబర్లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మేక్ మై ట్రిప్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ. కాగా, తాజా డీల్ నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళశారం ఇంట్రాడేలో దాదాపు 50% ఎగసి 31 డాలర్లను తాకడం గమనార్హం. -
ట్విట్టర్ను కొనేవారే కరువయ్యారు
-
రాస్ నెఫ్ట్, ట్రాఫిగుర సంస్థల చేతికి ఎస్సార్ ఆయిల్
♦ రేపు గోవాలో పుతిన్ సమక్షంలో ఒప్పందం ♦ డీల్ విలువ రూ. 86,000 కోట్లు న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ కంపెనీని రష్యా ఆయిల్ దిగ్గజం రాస్నెఫ్ట్, ఇతర సంస్థలతో కలిసి కొనుగోలు చేయనున్నది. రాస్నెఫ్ట్ కంపెనీ, యూరప్ కమోడిటీస్ ట్రేడర్ ట్రాఫిగుర, రష్యా ఫండ్ యూసీపీతో కలిసి ఎస్సార్ ఆయిల్ కంపెనీని 1,300 కోట్ల డాలర్లకు (రూ. 86,000 కోట్లు) కొనుగోలు చేయనున్నాయని సమాచారం. వాటాను విక్రయించిన తర్వాత ఎస్సార్ ఆయిల్లో 2 శాతం వాటా మాత్రమే ప్రస్తుత ప్రమోటర్లు, రుయా కుటుంబానికి ఉంటుంది. ఈ డీల్లో భాగంగా ఎస్సార్ ఆయిల్ కంపెనీకి వున్న 450 కోట్ల డాలర్ల రుణ భారాన్ని కొనుగోలు సంస్థలు టేకోవర్ చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రేపు(శనివారం) గోవాలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవాలో ఈ నెల 15-16 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదురనున్నది. ఈ ఒప్పందంలో భాగంగా రాస్నెఫ్ట్ పీజేఎస్సీ సంస్థ 49 శాతం వాటాను, ట్రాఫిగుర గ్రూప్ పీటీఈ, యూసీపీలు కలసి మరో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ డీల్లో వాదినర్ రిఫైనరీ, వాదినర్ పోర్ట్, 2,500కు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. రిఫైనరీకి సేవలందిస్తున్న విద్యుత్ ప్లాంట్, కంపెనీ కోల్ బెడ్ మీధేన్(సీబీఎం) బ్లాక్లు ఈ ఒప్పందం కిందకు రావు. -
టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా
డీల్ విలువ రూ.188 కోట్లు న్యూఢిల్లీ: హెల్త్కేర్ స్టార్టప్ ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా రూ.188 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ప్యూరో వెల్నెస్ తెలిపింది. దీంతో ఈ స్టార్టప్లో వ్యవస్థాపకుడు రుచిర్మోడికి 25%, టొరంటొ ఫార్మాకు 75% చొప్పున వాటాలుంటాయని వివరించింది. రుచిర్ మోడీ రూ.62 కోట్లతో ఈ స్టార్టప్ను ప్రారంభించారని, సీడ్ ఫండింగ్గా రూ.250 కోట్లు సమీకరించామని వివరించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్ను టొరంటొ ఫార్మా మాజీ ఈడీ రుచిర్ మోడీ ప్రారంభించారు. ఈ స్టార్టప్ సేంద్రియ ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. త్వరలో సొలైట్ బ్రాండ్ కింద ఉత్పత్తులను మార్కెట్లోకి అందించనున్నది. -
నకిలీ.. మకిలీ..
* పరిచయంలేని వ్యక్తి కారుపై రుణం పొందిన వైనం * అక్రమానికి సహకరించిన ఆర్టీఏ అధికారులు * మరో 8 మంది బాధితుడి ఫిర్యాదుతో నలుగురి అరెస్టు గుంటూరు రూరల్: పరిచయంలేని వ్యక్తి ఆధార్ కార్డును ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అతని కారుౖపై మాగ్జిమా అనే ప్రైవేటు సంస్థలో రూ 5.5 లక్షల రుణం పొందిన ఘటనలో నిందితులను నల్లపాడు పోలీస్లు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... నగరంలోని నవభారత్నగర్కు చెందిన చైతన్య అనే వ్యక్తి 2014లో రూ 5.7 లక్షల రుణంతో కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో నగరంలోని అరండల్పేట, విజయవాడ గవర్నర్పేట తదితర పోలీస్ స్టేషన్లలో నమ్మించి మోసం చేసే కేసులున్న తాడేపల్లి పాతూరుకు చెందిన సంకురు రవికిరణ్ అనే వ్యక్తి చైతన్యకు చెందిన ఆధార్ కార్డును ఆన్లైన్ ద్వారా 2015లో డౌన్లోడ్ చేశాడు. ఆధార్ కార్డుతో ఆతని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అతనికి కారుందని గమనించాడు. ఇదే అదనుగా భావించిన రవికిరణ్ చైతన్యకు చెందిన కారు తాను కొనుగోలు చేసినట్లు నకిలీ క్లియరెన్స్ పత్రాలను సృష్టించాడు. ఆధార్ కార్డుతోనే అంతా.... క్లియరెన్స్ పత్రాలు, ఆధార్ కార్డుతో సహా ఆర్టీఏ కార్యాలయానికి స్థానికంగా ఉండే ఏజెంట్ రఘునా«థరాం ద్వారా వెళ్ళి తన కారు సీబుక్ పోయిందని చెప్పి విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేçÙన్లో పొందిన ఎప్ఐఆర్ కాపీతో కారుకు చెందిన నకిలీ సీబుక్ను ఆర్టీఐ అధికారులనుంచి పొందాడు. అనంతరం తన వద్దనున్న నకిలీ క్లియరెన్స్, సీబుక్తో మాగ్జిమా సంస్థకు చెందిన ఏజెంట్ రాజేష్బాబును కలిసి తన కారుపై రుణం కావాలని కోరాడు. విషయం తెలిసిన రాజేష్బాబు సంస్థకు చెందిన ఉద్యోగి వెంకటశివనాగరాజును కలిసి కారుపై రూ 5.5 లక్షల రుణాన్ని పొందాడు. రుణం అందిన వెంటనే కనుమరుగయ్యాడు. ఈ క్రమంలో చైతన్య తన కారుపై ఉన్న రుణం తీర్చి క్లియరెన్స్ను పొదేందుకు ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్ళగా తన కారు తనపేరుపై లేదని గమనించి నిర్ఘాంతపోయాడు. ఏం జరిగిందని ఆర్టీఏ అధికారులను ప్రశ్నించటంతో విషయం ఎక్కడ బయటకు వచ్చి తమ మెడకు చుట్టుకుంటుందోనని ఆర్టీఏ అధికారులు ఏజెంట్లు గుట్టు చప్పుడు కాకుండా చైతన్య కారుపై మాగ్జిమా సంస్థలో ఉన్న రుణాన్ని చెల్లించారు. కేసులో 10 మంది నిందితులు.. ఈ క్రమంలో గత 5 రోజుల కిందట ఏడాది కిందట కనుమరుగైన రవికిరణ్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్ రఘునాధరాంకు కనిపించటంతో అతనిని పట్టుకుని ఆర్టీఏ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయగా తమను మోసం చేశాడని ఆర్టీఏ అధికారులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు తమదైన శైలిలో రవికిరణ్ను విచారించారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాలతో మాగ్జిమా సంస్థలో రుణం పొందిన వైనాన్ని వెళ్ళగక్కాడు. దీంతో ఈ ఘటనలో 10 మంది నిందితులున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చి అందులో ఏజెంట్ రఘునాథబాబు, రవికిరణ్, మాగ్జిమా సంస్థ ఉద్యోగి వెంకటశివనాగరాజు, రాజేష్బాబులను అరెస్ట చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరిచారు. నిందితులైన ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది ఇద్దరు కోర్టులో లొంగిపోయి బెయిల్ను సైతం పొందారు. 10 మంది నిందితులలో ఒకరు మృతి చెందగా ఇప్పటికి 6గురు అదుపులో ఉన్నట్లు మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నారని తెలిసింది. ఆన్లైన్ ద్వారా మోసాలు చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టే ఘరానా మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఏమరు పాటు తగదని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుల తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడమే.. రవాణాశాఖలో ఆరునెలల కిందట జరిగిన పొరపాటు సర్దుబాటు చేసినా ఇంకా వెంటాడుతునే ఉంది. ఆరునెలల తర్వతా అసలు నిందితుడు దొరకటంతో పునర్విచారణ పేరుతో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దొంగను పట్టించిన రవాణాశాఖ అధికారులపై సైతం కేసులు నమోదు కావటం సంచలనంగా మారింది. కేసులో రవాణాశాఖ అధికారులదే తప్పంటూ పోలీసులు నిర్ధారిస్తుండగా .. పోలీసులు ఇచ్చిన తప్పుడు మిస్సింగ్ సర్టిఫికేట్ వల్లే ఈ తప్పు జరిగినట్లు రవాణాశాఖ అధికారులు మండిపడుతున్నారు. మార్చినెలలో యార్లగడ్డ నాగ చెతన్య తన వాహనం పై సంకూరి రవికిరణ్ అనే వ్యక్తి తనకు తెలియకుండా రూ.5.5లక్షలు రుణం తీసుకున్నాడని దీనిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఉప రవాణా కమిషనరును కోరారు. దీనిపై విచారించిన రవాణాశాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన మిస్సింగ్ సర్టిఫికేట్ ఆధారంగానే రవికిరణ్ సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లుతో పొరపాటు జరిగిందని గ్రహించారు.