choreographer
-
బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సాంగ్ కి వచ్చింది..?
-
'మహిళల భద్రతకు ఈ తీర్పే నిదర్శనం'.. జానీ మాస్టర్ కేసుపై ఝాన్సీ పోస్ట్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)ఝాన్సీ తన ఇన్స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జాతర పాటను బాధ్యతగా భావించాను: నృత్యదర్శకుడు విజయ్ పోలాకి
‘‘అల్లు అర్జున్గారి ‘పుష్ప 2’ సినిమాలోని జాతర సాంగ్కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీలవ్వలేదు. బాధ్యతగా ఫీలయ్యాను. ఈ సినిమాలోని ‘జాతర’ పాటకు, పుష్ప 2 టైటిల్ సాంగ్కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. ‘అమ్మాడి...’ (నాని ‘హాయ్ నాన్న’), ‘మార్ ముంత చోడ్ చింత...’ (రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’), ‘లింగిడి లింగిడి...’ (శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి’), ‘నక్కిలిసు గొలుసు...’ (‘పలాస’), ‘కళ్ల జోడు కాలేజ్ పాప...’ (‘మ్యాడ్’) పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి ‘పుష్ప 2’ చిత్రంలోని జాతర పాట, టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’లకు నృత్యరీతులు సమకూర్చారు.ఈ నేపథ్యంలో విజయ్ పోలాకి మాట్లాడుతూ– ‘‘నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ...’. ఆ తర్వాత చాలా హిట్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేశాను. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాట కోసం గణేష్ ఆచార్య మాస్టర్గారితో కలిసి వర్క్ చేశాను. అయితే ‘పుష్ప 2’లో నాకు కొరియోగ్రాఫర్గా చాన్స్ వస్తుందని అప్పుడు ఊహించలేదు. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి...’ జాతర పాట, ‘పుష్ప... పుష్ప...’ పాటకు వర్క్ చేశాను. జాతర పాట రొటీన్గా ఉండకూడదని సుకుమార్గారు చె΄్పారు. ఇలా ఉండాలి అంటూ... కొన్ని మూమెంట్స్ ఆయన చూపించారు. పుష్పరాజ్ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈ పాట చేయాలనుకున్నాను. అందుకని ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ని చాలాసార్లు చూశాను. జాతర సాంగ్కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి, 20 రోజులు షూట్ చేశాం. అల్లు అర్జున్గారు చాలా కష్టపడి చేశారు. ప్రస్తుతం సాయితేజ్గారి ‘సంబరాల ఏటిగట్టు’, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్గారి ‘భైరవం’, ‘మ్యాడ్ 2’ (సింగిల్ కార్డు), హిందీలో ‘బేబీ’ సినిమాలకు వర్క్ చేస్తున్నాను’’ అన్నారు. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
HYD: ‘ఓయో’లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జానీ మాస్టర్కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 50 రోజులు ముందుగానే పుష్ప-2 కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అయితే తాజాగా పుష్ప-2 నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీనే థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు. దీంతో ఒక రోజు ముందుగానే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ ప్రెస్మీట్కు హాజరైన నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.(ఇది చదవండి: కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'కు బెయిల్)అందులో భాగంగానే జానీ మాస్టర్ గురించి ప్రశ్న ఎదురైంది. పుష్ప-2 ఓ సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది.. ఆయనతోనే చేస్తున్నారా? లేదా వేరే వాళ్లను తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై నిర్మాత నవీన్ యేర్నేని క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్తో ఎలాంటి సాంగ్ను చేయడం లేదు.. ఇప్పటికే ఆ పాటను మరో కొరియోగ్రాఫర్తో పూర్తి చేశామని ఆయన తెలిపారు. దీంతో పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప మేకర్స్ నిర్ణయంతో జానీ మాస్టర్కు మరో షాక్ తగిలినట్లైంది. కాగా.. జానీమాస్టర్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
మరో స్టార్ కొరియోగ్రాఫర్పై చీటింగ్ కేసు
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇతడి భార్యతో పాటు మరో ఐదుగురి కలిసే తనని మోసం చేశారని 26 ఏళ్ల డ్యాన్సర్.. ముంబైలోని మీరారోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఫిర్యాదు ప్రకారం.. డ్యాన్సర్ టీమ్ 2018-24 మధ్యలో టీవీ షోలో విజేతగా నిలిచింది. వీళ్ల గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్మనీని రెమో డిసౌజా తదితరులు తదమే అన్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ లాక్కున్నారు. రెమో డిసౌజాతో పాటు అతడి భార్య లీజెల్ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా ఉన్నారు.వీళ్లపై డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. రెమో డిసౌజాతో పాటు మరో ఆరు మందిపై 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇతర సెక్షన్ల కింద కేసు మోదు చేశారు. ఇకపోతే రెమో డిసౌజా కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టాడు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఫ్లయింగ్ జాట్, ఏబీసీడీ ఫ్రాంచైజీ, సల్మాన్ ఖాన్ 'రేస్ 3' సినిమాలతో దర్శకుడిగానూ అలరించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'హ్యాపీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏదేమైనా స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యిండి ఇలా చీటింగ్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్) -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై జానీమాస్టర్ బంధువు ఫిర్యాదు
నెల్లూరు (క్రైమ్): సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీమాస్టర్ కేసులో బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తోందని ఓ యువకుడు శుక్రవారం నెల్లూరు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేకరించిన సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన సమీర్ ప్రస్తుతం బిటెక్ చదువుతున్నాడు. అతను కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ మేనమామ కుమారుడు. సమీర్ ఎక్కువగా హైదరాబాద్లో జానీమాస్టర్ వద్ద ఉండేవాడు. ఆయనతో పాటు షూటింగ్లకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న యువతితో అతనికి పరిచయం అయింది. ఆమె 2020 నుంచి తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసిందని సమీర్ ఆరోపించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదరు యువతి జానీమాస్టర్పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం తెలిసిందే. తాజాగా ఆ యువతిపై జానీమాస్టర్ మేనమామ కొడుకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ, చైన్నె రాష్ట్రాల్లో జరగడంతో పోలీసులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్పై అనిశ్చితి నెలకొంది. -
మరికాసేపట్లో నార్సింగి పోలీస్ కస్టడిలో జానీ మాస్టర్
-
బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు
లైంగిక వేధింపుల వ్యవహారం, పోక్సో కేసులో జానీ మాస్టర్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్తో ఎఫైర్స్అయితే హీరోయిన్ అవ్వాలి, లేదంటే టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందంటున్నారు.. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవడి దగ్గరకు వెళ్లలేదని గ్యారెంటీ ఏంటి? తనకు చాలామంది కొరియోగ్రాఫర్స్తో ఎఫైర్స్ ఉన్నాయి. మహిళ అనే పదానికే ఆమె కళంకం అని బాధితురాలి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది.జానీపై కేసుఅవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే, సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్ తనను లైంగికంగా, మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిప్పు లేనిదే పొగ రాదునిజంగానే అతడు ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్నిరోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవాల్సిన గత్యంతరం ఏంటి? ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది కానీ తానే ఒప్పని చూపించుకోవడం కోసం బాధితురాలిపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని, ఎంతోమందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగ రాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సోనియా దిగజారుడు ప్రవర్తన.. ఛీ కొడుతున్న జనం -
ఎస్ వోటీ పోలీసుల అదుపులో కొరియోగ్రాఫర్ జానీ
-
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదు
-
జానీమాస్టర్పై పోక్సో కేసు నమోదు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఇటీవలే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.(ఇది చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీమాస్టర్పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జమ్ముకశ్మీర్లోని లడఖ్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జానీమాస్టర్ కోసం ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కేసు ఏంటంటే?మధ్యప్రదేశ్కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన బాధని బయటపెట్టింది. -
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. బాధితురాలి సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 3 గంటలపాటు జరిగిన విచారణలో జానీ మాస్టర్ దారుణాలను మహిళ డ్యాన్సర్ పోలీసులకు వివరించింది.షూటింగ్ టైమ్లో క్యారవాన్లో జానీ మాస్టర్ బలవంతం చేశాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. తన కోరిక తీర్చమని ఎంతో వేధించాడని.. లేకుంటే ఎలాంటి ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు వివరించింది. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు వాపోయింది. బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలేం జరిగిందంటే??ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. -
జానీ మాస్టర్ పై కేసు నమోదు..
-
జానీ మాస్టర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
-
జాతీయ అవార్డ్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సన్మానం (ఫొటోలు)
-
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం
టాలీవుడ్ లీడింగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తోడబుట్టిన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్పై కేసు నమోదు..?)'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. ఎక్కడికెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావ్. నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు.'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టరగా కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్పై రాజ్ తరుణ్ రియాక్షన్) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
తారక్ అద్భుతమైన డ్యాన్సర్.. ఆయన స్టెప్పులేస్తుంటే..: కొరియోగ్రాఫర్
హీరో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్.. ఎంతో అలవోకగా స్టెప్పులేస్తాడు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అంటున్నాడు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్. ఈయన దేవర: పార్ట్ 1 సినిమాకు కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడు.అద్భుతమైన డ్యాన్సర్తాజాగా ఆయన దేవర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను దేవర మూవీకి పని చేస్తున్నాను. హీరో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి. సూపర్గా డ్యాన్స్ చేసే హీరోల్లో ఈయన ఒకరు. ఏ స్టెప్పులైనా సులువుగా నేర్చేసుకుంటాడు. ఆయన డ్యాన్స్ చేయడం చూస్తుంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. తనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చాడు.ఆ వైరల్ స్టెప్పులు నేర్పింది ఈయనే!బోస్కో ఇటీవలే తారక్తో కలిసి దిగిన ఫోటోను సైతం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇకపోతే ఈ మధ్య వైరల్గా మారిన తాబ తాబ..(విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ మూవీలోని ఓ సాంగ్) స్టెప్పులు కూడా ఈయన కనిపెట్టినవే! దేవర విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Bosco Martis (@boscomartis) చదవండి: సినిమా దారుణంగా ఫ్లాప్.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు -
ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక
చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. రెండు రోజుల్లో పూర్తితర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. చదవండి: లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా.. -
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఫిర్యాదు!
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఆయనపై కంప్లెంట్ చేశారు. జానీ మాస్టర్పై డ్యాన్సర్ సతీశ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన అరాచకాలపై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్స్కు సతీష్ను పిలవవద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్లు చేయిస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్లోనూ సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని కంప్లైంట్లో సతీశ్ వివరించారు. కాగా.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్ను న్యూజిలాండ్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్గారు డైరెక్టర్గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
శేఖర్, సందీప్ మాస్టర్ సంపాదన ఎంతో తెలుసా? ఒక్క సంగీత్కు..
ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నవాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఇతడు తర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో పెద్ద హీరోలతో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరి డ్యాన్స్లో మెళకువలు నేర్చుకున్న మరో వ్యక్తి బషీర్ మాస్టర్. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ అందుకునే పారితోషికాన్ని బయటపెట్టాడు. బషీర్ మాస్టర్ నేను లక్ష తీసుకుంటా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుకల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్రఫీ చేసి రూ.1 లక్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్లకు ఆన్లైన్లో ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను. నా పార్ట్టైమ్ సంపాదన ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లందరూ ఇలా సంగీత్ వేడుకలు చేసినవారే! సందీప్ కూడా.. శేఖర్ మాస్టర్ ఒక్క సంగీత్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్, సత్య మాస్టర్, సందీప్ అందరూ సంగీత్లలో చేసినవారే! మొన్నటివరకు సందీప్ కూడా రూ.2-3 లక్షలకు సంగీత్ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వచ్చినప్పుడు రూ.50 లక్షలు తీసుకుంటాను. బిగ్బాస్ షోలో పాల్గొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఛాన్స్ వస్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: డిసెంబర్లో నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ! -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఈ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. తాజాగా షూటింగ్లో పాల్గొన్న ఓ హీరోయిన్కు అలాంటి సంఘటనే ఎదురైందిృ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమా సెట్స్లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే షూటింగ్ నుంచి వచ్చేశానని తెలిపింది. (ఇది చదవండి: టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!) కోల్కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ ఇటీవలే బంగ్లాదేశ్లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. అయితే సెట్స్లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే చేతులు పట్టుకున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చానని పేర్కొంది. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం 'చాయాబాజ్' షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్లో జరిగిన సంఘటనను వివరించింది. కాగా.. ప్రస్తుతం తాజు కమ్రుల్ దర్శకత్వం వహిస్తోన్న 'ఛాయాబాజ్' చిత్రంలో జయేద్ ఖాన్ సరసన సయంతిక నటిస్తోంది. View this post on Instagram A post shared by Sayantika Banerjee (@iamsayantikabanerjee) -
ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్
కృతి సనన్..ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అయితే ఆ స్టార్డమ్ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్గా కెరీర్ని ఆరంభించి.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్:నేనొక్కడినే’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్ మూవీ వన్: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్నర లాన్లో క్యాట్వాక్ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో కలిసి గణపత్:పార్ట్వన్ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. (చదవండి: ఫ్యాన్స్కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) -
నాగార్జున నెక్ట్స్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..
‘ది ఘోస్ట్’ చిత్రం విడుదల తర్వాత నాగార్జున నెక్ట్స్ సినిమా గురించిన ప్రకటన రాని విషయం తెలిసిందే. అయితే ఆ సమయం ఆసన్నమైందని, ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వెల్లడి కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. -
త్వరలో జైలర్ నటుడి పెళ్లి, తలైవా ఆశీర్వాదాలు కూడా..
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు! ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్బస్టర్ హిట్ జైలర్లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు. జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్కుమార్.. అతడిని ఫ్యాన్కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: క్రికెటర్తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు
రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్ కొరియోగ్రాఫర్గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ జూన్ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండని కోరాడు. అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి! చదవండి: బతికుండగానే అంత్యక్రియలు, బ్యూటీ క్వీన్ కన్నుమూత -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. (ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్) టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ హైదరాబాద్లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే! ఎందుకో తెలియదు కానీ శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్ మాస్టర్ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్. అటు శేఖర్ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్ సైతం రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం -
రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ లాస్ట్ వీడియో) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి సినిమా ఏదంటే?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చాన్స్లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చారు. కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్ టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన. వివాదాలతో కుటుంబానికి దూరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్మెట్లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే.. ‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ -
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
-
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతి.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by CELLULOID PANDA (@celluloid_panda) చదవండి: ఒక్కమాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి -
Rakesh Master: అనాథాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్, ఎందుకంటే?
టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా కీర్తి గడించిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, అంతకుముందున్న మాస్టర్ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్మెట్లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు. మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా కొడుకు చరణ్ను కొట్టారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్ని చూసి డ్యాన్సర్గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపారు. (ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత) రాకేష్ మాస్టర్కు టర్నింగ్ పాయింట్ ఇదే.. ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే. శేఖర్ మాస్టర్తో విబేదాలు టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు. గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్గానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
Rakesh Master Unseen Photos: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (ఫొటోలు)
-
Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్గా పని చేశారు. ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాళ్లు, చేతులు పడిపోవడంతో ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రీజతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన కల్యాణ్ దేవ్ -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్ -
ఢీలా పడుతున్నారా?
-
నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్
నెల్లూరు(క్రైమ్): ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా స్వగ్రామానికి తరలించారు. వివరాలు.. లింగసముద్రం మండలం ముత్తంవారిపాళెం గ్రామానికి చెందిన సి.చైతన్య(32)కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. అమ్మ, నాన్న, చెల్లెలితో హైదరాబాద్లో ఉంటూ పలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో కొరియోగాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. దీని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తన మెయింటినెన్స్, తనను నమ్ముకున్న డ్యాన్సర్లకు సరిపోయేది కాదు. దీంతో అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు క్లబ్లోని ఓ గదిలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మృతుడి బాబాయి మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. చైతన్య తల్లిదండ్రులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చైతన్య సెల్ఫీ వీడియో ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన అభిమానులు, స్నేహితులు, డ్యాన్సర్లు పదుల సంఖ్యలో సోమవారం నెల్లూరు జీజీహెచ్లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్యాన్స్లో మెళుకువలు నేర్పడంతోపాటు తమను నడిపించిన మాస్టర్ చైతన్య భౌతికకాయాన్ని చూసి పలువురు డ్యాన్సర్లు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, డ్యాన్సర్లు, స్నేహితుల అశ్రునయనాల నడుమ చైతన్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు తమ స్వగ్రామానికి తరలించారు. నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం. ఇలా చేస్తాడని అనుకోలేదు. నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. అప్పుల కోసం చనిపోతాడని ఊహించలేదు. ఆత్మహత్య చేసుకునే 15 నిమిషాల ముందు నాతో ఫోన్లో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్గా ఉన్నావు నవ్వూతూ ఉండమని చెబితే సరే అన్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ కట్ చేయక ముందు జామాయిల్ చెట్లు అమ్మాను.. రూ.4 లక్షలు వస్తున్నాయని చెప్పాను. అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను వాడి వద్ద ఏది దాచేదాన్ని కాదు. డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని చెప్పేవాడు. ఓ సారి ఫోన్ చేసి నీవు ఇంటికి రాలేదంటే నేను చచ్చిపోతా అంటే.. నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కూడా బెర్త్ కన్ఫామ్ చేయమ్మా అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే వెళ్లిపోయాడు. నేను చచ్చిపోతున్నా.. నువ్వు కూడా రా అమ్మ అంటే.. నేను కూడా వెళ్లేదాన్ని కదా. – చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం పదేళ్ల ప్రయాణం మా ఇద్దరిది పదేళ్ల ప్రయాణం. చైతన్య చాలా సెన్సిటివ్ మనస్తత్వం. తన పక్కనుండే వారూ బాగుండాలని కోరుకుంటాడు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం తనతో మాట్లాడాను. ఎప్పుడూ అప్పులున్నాయని చెప్పలేదు. – చిట్టి, డ్యాన్స్మాస్టర్ చైతన్య లేడని ఊహించలేను ఇద్దరం పక్కపక్క సీట్లలోనే ఉండేవాళ్లం. ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అప్పులున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదు. మాటలు రావడం లేదు. – పండు, డ్యాన్స్మాస్టర్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్పై స్పందించిన యాంకర్ రష్మీ
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే!అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా తాజాగా ఆయన మరణంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్స్టా స్టోరీలో పేర్కొంది. చదవండి: వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ మరణంపై శ్రద్ధాదాస్ ఎమోషనల్ పోస్ట్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు. అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు. ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. (చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) అంతకు ముందు టెంపుల్కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్ చెయ్’ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ’అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్ అయింది. -
చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ
కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు? మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ. కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్ ఓ ఈవెంట్ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో మేనేజ్మెంట్ టీమ్ పేమెంట్ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది. చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్ మాస్టర్ రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్ ఇవ్వలేదు: కండక్టర్ ఝాన్సీ -
చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్.. మాస్టర్తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. చైతన్య మరణంపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. యాంకర్ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య -
అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్
ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్ కరిగిపోయేవాళ్లు. మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఝాన్సీ. చదవండి: దుబాయ్లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్బాబు డీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) 'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by ROCK N ROLL DANCE STUDIO (@team_rds_1) -
విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సూసైడ్కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా రాజేష్ మాస్టర్కు మంచి పేరు ఉంది. పలు సినిమాల్లో ఆయన పనిచేశారు. కాగా రాజేష్ మాస్టర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ మాస్టర్ మరణవార్త తనను షాక్కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్స్టాలో పేర్కొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ప్రేమ్ రక్షిత్
-
Oscar Naatu Naatu: నాటునాటు ప్రేమ్రక్షిత్.. నాటి నుంచి నేటివరకు (అరుదైన ఫోటోలు)
-
డాన్స్ మాస్టర్ బృందా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్ సింహ, ఆర్కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్స్ని విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ బృందా గోపాల్ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్ సీఎస్ సింగీతం అందించారు. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
బాత్రూమ్లోకి వెళ్లి గంటన్నర ఏడ్చా: నాటు నాటు కొరియోగ్రాఫర్
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో నాటు హిట్ కొట్టింది. సినిమానే కాదు అందులోని పాటలూ విదేశీయులతో ఈలలు కొట్టించేలా చేశాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే నాటునాటు బెస్ట్ సాంగ్గా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడు. హుక్ స్టెప్ కోసం 50 రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే డైరెక్టర్కు ఇప్పుడున్నది నచ్చింది. చరణ్, తారక్ ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు తీసుకున్నారు. ఎట్టకేలకు నాటునాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పుడు కొద్దిక్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వాష్రూమ్లోకి వెళ్లి గంటన్నరపాటు ఏకధాటిగా ఏడ్చాను. రాజమౌళి సర్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. తారక్ అన్నయ్య, చరణ్ సర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. కీరవాణి సర్ అందించిన సంగీతంతో ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. ఫుల్ ఎనర్జీతో సాగే ఈ డ్యాన్స్ రిహార్సల్స్లో హీరోలు కాసేపు కూడా బ్రేక్ తీసుకునేవారే కాదు. మంచి స్టెప్స్ డిజైన్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. వాటిని పర్ఫెక్ట్గా చేయాలన్న కసితో హీరోలు 20 రోజులు రిహార్సల్స్ చేశారు. ప్యాకప్ చెప్పేశాక రాజమౌళి సర్ మాతో కలిసి ఆ స్టెప్ నేర్చుకునేవారు. మేము పొద్దున ఆరింటికి లేచి రాత్రి పదింటికి పడుకునేవాళ్లం. ఈ సినిమా కోసం అందరం ఎంతగానో కష్టపడ్డాం' అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్. చదవండి: నాటు నాటు సాంగ్కు మరో అవార్డ్, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్
‘‘చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం, సమయపాలన. ఏ డ్యాన్స్ మూమెంట్ని అయినా సక్సెస్ఫుల్గా పూర్తి చేసేంతవరకూ రిలాక్స్ అవ్వరు’’ అన్నారు నృత్యదర్శకుడు వీజే శేఖర్. చిరంజీవీ టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వరుసగా జనవరి 13, జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు, ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలకు (సుగుణసుందరి, మా భావ మనోభావాల్) కొరియోగ్రఫీ చేశారు శేఖర్. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకేసారి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అవుతాయనుకోలేదు. కాబట్టి ఈ సినిమాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చేప్పుడు పెద్దగా ఆందోళనపడలేదు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సంక్రాంతికే వస్తుండటంతో ఒకవైపు ఆందోళనగా మరోవైపు సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి నాకు పెద్ద పండగ అని చెప్పగలను. ఇక సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ రీల్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఈ మూమెంట్స్ బాగుంటే వీటి తాలూకు పాటలను, కంటెంట్ను బట్టి సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. సో.. సిగ్నేచర్ స్టెప్స్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపిస్తోంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను సిగ్నేచర్ స్టెప్స్ను ఫాలో అవుతూ వస్తున్నాను. అలాగే సీనియర్లకు కొన్నిసార్లు మూమెంట్స్ని బట్టి రెండు, మూడు ఆప్షన్లు రెడీ చేసుకుంటుంటాం. ఇక దర్శకత్వ ఆలోచన ఉంది కానీ ఎప్పుడో కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం మహేశ్బాబు–త్రివిక్రమ్గార్ల కాంబినేషన్ సినిమా, రవితేజగారి ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
మాజీ భర్తకు కాజల్ సర్ప్రైజ్.. విడాకులు తీసుకున్న పదేళ్లకు..!
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్కు కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) -
కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ బెయల్పై నిబంధనలు రద్దు
తమిళసినిమా: సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ బెయిల్పై మద్రాసు హైకోర్టు సడలింపు ఆదేశాలు జారీ చేసింది. ఆ మధ్య స్థానిక మదురవాయిల్లో హిందూ మున్నని పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఈయన అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. నాలుగు వారాల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు విచారణ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో కణల్ కన్నన్ షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండడంతో తన బెయిల్పై నిబంధనలను రద్దు చేయాలని దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి జగదీష్ చంద్ర ఒక వారం పాటు కణల్ కన్నన్ బెయిల్పై నిబంధనలు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్పేట్ గోకుల్ ఫ్లాట్స్లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్ను సీజ్ చేశారు. -
హీరోగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా, శ్రష్టి వర్మ నాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభ మైంది. ముహూర్తపు సన్నివేశానికి సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బాగుంటుందని ‘యథా రాజా తథా ప్రజా’లో నటిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు జానీ. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: సునోజ్ వేలాయుధన్. Thank you for gracing the Pooja Ceremony of my new film #YathaRajaTathaPraja 🙏🏼@ImSharwanand garu, #AayushSharma ji & #JKarunaKumar garu 😇@imVdeshK @verma_shrasti #SrinivasVittala #HareshPatel #OmMovieCreations #SriKrishnaMovieCreations @PulagamOfficial pic.twitter.com/ggVBogGXSL — Jani Master (@AlwaysJani) August 22, 2022 -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్మాస్టర్ కూతురు?
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్ కొరియోగ్రాఫర్గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్ కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టిక్టాక్ సహా డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత
Choreographer Thrinath Rao Passed Away In Chennai: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ త్రినాథ్ రావ్ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్ 15) ఉదయం గుండెపోటుతో చైన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గురువారం (జూన్ 16) చెన్నైలో త్రినాథ్ రావ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. 'చిన్న' పేరుతో కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందిన త్రినాథ్ రావ్ స్వస్థలం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 500 చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ప్రముఖ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్ డైరెక్షన్లో వచ్చిన 'తూరల్ నిన్రు పోచ్చు' మూవీతో నృత్య దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ తొలి సినిమా 'అమరావతి'కి త్రినాథ్ రావ్ కొరియోగ్రఫీ అందించారు. తర్వాత తమిళంలో 'ముందానై ముడిచ్చు', 'దావడి కలవుగల్', 'వైదేహి కాత్తిరుందాల్', 'వానత్తై పోల' వంటి తదితర చిత్రాలతోపాటు తెలుగులో 'రాణీకాసుల రంగమ్మ' లాంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు -
నోరాతో డేటింగ్? ష్, అది సీక్రెట్ అంటున్న కొరియోగ్రాఫర్!
బాహుబలి, టెంపర్తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోని ఐటం సాంగ్స్లో ఆడిపాడింది నోరా ఫతేహి. మెరుపులాంటి స్టెప్పులు, అదరగొట్టే ఎక్స్ప్రెషన్తో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ బ్యూటీ. అయితే నోరా సింగిల్ కాదని ఓ కొరియోగ్రాఫర్తో ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డ్యాన్స్ మాస్టర్ టెరెన్స్ లూయిస్తో డేటింగ్ చేస్తోందని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై టెరెన్స్ స్పందించాడు. ఈ సీక్రెట్ను సీక్రెట్లాగే ఉంచితే బాగుంటుంది. కావాలంటే నేను మీకు కెమెరా ఆఫ్ చేశాక చెప్తాను. నాకు తెలిసి ఆన్స్క్రీన్పై మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనుకుంటున్నాను. నిజంగానే ఆమె ఎనర్జీ, వైబ్ను ఇష్టపడతాను. తను డ్యాన్సర్ కాబట్టి ఆ విషయం తనకూ తెలుసు. తనది చాలా కష్టపడి పనిచేసే స్వభావం. ఇకపోతే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడూ చెప్పను, కాకపోతే మా మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా నోరా పంజాబీ సింగర్ గురు రంధవతో కూడా డేటింగ్ చేస్తుందంటూ ఇటీవల కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోరా ఫతేహి డ్యాన్స్ దీవానీ జూనియర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. హరిహర వీరమల్లులోనూ కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతోంది. చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్, అప్పటి నుంచే స్ట్రీమింగ్ ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్కు రాలేదు: శేఖర్ మాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ను క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు... ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ? సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. మహేశ్ గారితో మీ కాంబినేషన్ ? మహేశ్బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్. మహేశ్బాబు చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి? మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు. కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది. డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ? కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి. మహేశ్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేశ్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు? మహేశ్బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ''మాస్టర్ ఇంకోసారి చేద్దామా' అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేశ్బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా. మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ? ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ? కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ 'టాపు లేచిపోద్ది' పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'పుష్ప' మూమెంట్స్ కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాల దృష్టిని ఆకట్టుకుంటుంది. టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మా మూమెంట్స్ రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంటుంది. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ? ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది. కొరియోగ్రాఫేర్ గా మీ డ్రీమ్ ఏమిటి ? చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది. మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు. మీ అంచనాలు తప్పిన పాట ? 'జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు. కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ? లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు. చదవండి: నామినేషన్స్లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ ట్రోలింగ్ నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
జానీ మాస్టర్కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
BB Kannada Host Gift To Dhee 14 Judge Jani: టాలీవుడ్కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్స్లో జానీ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సుదీప్. ఖరీదైన థార్ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. సుదీప్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ థార్ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Jani Master (@alwaysjani) -
కంటెస్టెంట్ అప్పు మొత్తం తీర్చేస్తా: ప్రముఖ కొరియోగ్రాఫర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ ప్రస్తుతం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ఐదో సీజన్కు జడ్జ్గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో డ్యాన్స్ నేర్చిన చిన్నారులు తమ స్టెప్పులతో షోను షేక్ చేస్తున్నారు. ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడు హిమాన్షు తన డ్యాన్స్తో జడ్జీలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అనంతరం తన జీవితంలోని కష్టాలను వివరించాడు. ఢిల్లీ తమ స్వస్థలం అని, చిన్నవయసులోనే నాన్న చనిపోవడంతో అప్పటినుంచి సోదరుడితోపాటు తనను తల్లే పెంచుతుందని చెప్పాడు. రిక్షా తొక్కుతూ తమను పెంచి పోషిస్తుందని పేర్కొన్నాడు. ఆ రిక్షా కొనడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో లోన్ తీసుకుందని చెప్పాడు. ప్రతినెలా లోన్ డబ్బులు కట్టేందుకు ఆమె నానాకష్టాలు పడుతోందని వాపోయాడు. అతడి కన్నీటిగాథ విని కదిలిపోయిన రెమో డిసౌజ ఆ రిక్షా కొనేందుకు చేసిన అప్పు తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఇకపై ఆ రిక్షా మీదేనని, మిగిలిన లోను తాను కట్టేస్తానని హామీ ఇచ్చాడు. చదవండి: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు -
కొరియోగ్రాఫర్ యశ్ అందమైన ఇంటిని చూశారా?
ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ డ్యాన్స్ షో ద్వారా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చిన యశ్ ఆ తర్వాత సొంతంగా కొరియోగ్రాఫర్గా మారాడు. స్టయిలిష్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సమంత హీరోయిన్గా నటించిన యూటర్న్ సినిమాతో పాటు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు సైతం కొరియోగ్రఫీ అందించాడు. అలా యూత్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యశ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ పెట్టిన యశ్ తాజాగా తన ఇంటికి సంబంధించిన హోం టూర్ చేశాడు. ఇందులో తన ఇంటికి సంబంధించి పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.