issue
-
ప్రాణం తీసిన చీర గొడవ
శామీర్పేట్: చీర కారణంగా చెలరేగిన వివాదం తల్లి, కుమార్తె మధ్య ఘర్షణకు దారితీయగా అడ్డు వచ్చిన తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, శామీర్పేట, పెద్దమ్మ కాలనీలో హన్మంతు (50), పెద్దమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బుధవారం తల్లి, కుమార్తెకు చీర విషయమై గొడవ జరిగింది. ఈ విషయంలో తండ్రి హన్మంతు, పెద్దకొడుకు నర్సింహ జోక్యం చేసుకోవడంతో వారి మధ్య ఘర్షకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తండ్రిపై రోకలిబండతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్పేట పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితుడి రిమాండ్... శామీర్పేట సీఐ శ్రీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శలు
-
ఢిల్లీ కాలుష్యంపై కాప్-29లో చర్చ
బాకు: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీసింది. అజర్బైజాన్ రాజధాని బాకులో పర్యావరణంపై జరిగిన కాప్-29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది.కాప్-29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ ఢిల్లీలోని ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్ మీటర్కు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికస్థాయి కాలుష్యం నమోదవుతున్నదన్నారు. బ్లాక్ కార్బన్, ఓజోన్, శిలాజ ఇంధనాల దహనం, ఫీల్డ్ మంటలు వంటి అనేక కారణాలతో కాలుష్యం ఏర్పడుతున్నదని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సివున్నదన్నారు.ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారిందని, అక్కడి ప్రజలు ప్రతిరోజూ 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారన్నాని ఖోస్లా పేర్కొన్నారు. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుందని, ఇటువంటి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.గ్లోబల్ క్లైమేట్ అండ్ హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ కోర్ట్నీ హోవార్డ్ కెనడాలో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తూ 2023లో అడవిలో కార్చిచ్చు కారణంగా, వాయు కాలుష్యం ఏర్పడి 70 శాతం జనాభా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రీత్ మంగోలియా సహ వ్యవస్థాపకుడు ఎంఖున్ బైయాంబాడోర్జ్ తమ దేశంలోని తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే నగరాల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు. -
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్కు చెందుతుంది.ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-ఎంయూఎల్) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. -
లోక్సభ అభ్యర్థికి గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక!
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కాజల్ నిషాద్కు గుండెపోటుకు గురయ్యారు. ఆమెను వెంటనే లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 5న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమె స్థానిక స్టార్ హాస్పిటల్లో చేరారు. అయితే ఏప్రిల్ 7న అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యుల సూచన మేరకు లక్నోకు తరలించారు. కాజల్ నిషాద్ను అంబులెన్స్లో లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆమె డీహైడ్రేషన్ కారణంగా స్టార్ హాస్పిటల్లో చేరారు. తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో చికిత్స పొందుతున్నారు. యూపీలోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం రాష్ట్రంలో ఎంతో కీలకమైనది. గతంలో సీఎం యోగి ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం భోజ్పురి నటుడు రవికిషన్ ఈ స్థానానికి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రవికిషన్ బీజేపీ తరపున గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. రవికిషన్పై సమాజ్వాదీ పార్టీ తరపున కాజల్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్కు స్టీల్ షీట్ పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా?.. .. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku — KTR (@KTRBRS) March 20, 2024 -
జార్ఖండ్లో కొలిక్కిరాని ఇండియా కూటమి సీట్ల కేటాయింపు
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్లో ఎన్న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్లోని తూర్పు లడఖ్లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. లడఖ్లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి, సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్పై ఒత్తిడి తెస్తోంది. ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
ఆధార్కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్డెస్క్ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్రాజ్ -
భారత్లో బంగ్లా మహిళ రహస్య నివాసం.. 30 ఏళ్లకు బయటపడిన బాగోతం!
యూపీలోని బరేలీలో గత 30 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ అక్రమంగా భారత్కు వచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక్కడే నివసిస్తోంది. తాజాగా ఆమె పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఉదంతం పోలీసు శాఖలో కలకలం రేపింది. అక్రమంగా భారత్లో ఉంటున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్లోని జోధోపూర్కు చెందిన ఈ మహిళ పేరు అనితా దాస్. ఆమె దేవ్రానియాలోని ఉదయపూర్ గ్రామానికి చెందిన మంగళ్ సేన్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతని భార్యగా ఇక్కడే ఉంటోంది. ఆ మహిళ వయస్సు 55 సంవత్సరాలు. అనిత ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా పోలీసులకు ఆమె గురించి తెలియకపోవడం విశేషం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో అనిత వారిని చూడటానికి బంగ్లాదేశ్ వెళ్లాలని అనుకుంది. ఈ నేపధ్యంలోనే ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తులో ఆమె తన స్థానిక చిరునామాతో పాటు బంగ్లాదేశ్ చిరునామాను కూడా రాసింది. అలాగే పాస్పోర్ట్లో పుట్టిన స్థలం కాలమ్ ఉన్న చోట ఆమె బంగ్లాదేశ్ అని రాయడంతో ఆమె బాగోతం బయటపడింది. పాస్పోర్ట్ దరఖాస్తు పరిశీలినలో ఆమె బంగ్లాదేశీ అనేది స్పష్టమైంది. వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అక్రమంగా భారత్లో ఉంటున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అనిత బంగ్లాదేశ్కు చెందినదనే సంగతి తమకు కూడా తెలియదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనిత ఈ గ్రామంలో 30 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం. ఇంతకాలం ఆమె స్థానికురాలేనిని గ్రామస్తులంతా భావించారు. ఇది కూడా చదవండి: గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు.. -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
నేపాల్లో ‘డ్రాగన్’ ఆటలకు భారత్ ఎలా చెక్ పెట్టింది?
చైనా రుణంతో నేపాల్లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు? లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది. గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు. లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది. గత ఏడాది డిసెంబర్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు. కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్కు ఎందుకు ద్వేషం? -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి?
2024 జనవరి 8 నుంచి కెనడాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈఏడాది పంజాబ్కు చెందిన 36 వేల మంది విద్యార్థులు కెనడాలోని వివిధ విద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది విద్యార్థులకు వీసాలు వచ్చాయి. విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే కెనడా- భారత్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కెనడాలో 2,09,930 మంది భారత విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతుండగా, 80,270 మంది విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు. కెనడాలోని వివిధ కళాశాలలను డిప్లొమా కోర్సులను అందిస్తాయి. విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్, మాస్టర్స్ డాక్టోరల్ డిగ్రీలను అందిస్తాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు స్టాండింగ్ కమిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 22.3 బిలియన్ కెనడియన్ డాలర్లకు మించిన అధిక మొత్తాన్ని అందిస్తున్నారు. తీవ్రతరమవుతున్న దౌత్య సంక్షోభం కెనడా విద్యావ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్య కోసం వలస వచ్చే భారతీయ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయనుంది. వీసా వ్యవహారాల నిపుణుడు సుకాంత్ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు కెనడియన్ విద్యార్థుల కంటే రెండింతల మొత్తాన్ని ఆ దేశ విద్యా వ్యవస్థకు అందిస్తున్నారు. అంటారియో ప్రభుత్వం అందించే నిధుల కంటే ఇవి అధికంగానే ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో చెల్లుబాటు అయ్యే స్టడీ వీసాతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది జనవరిలో తరగతులకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లనున్న సర్బ్జిత్ కౌర్ మాట్లాడుతూ తమకు జనవరి నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయని, కెనడాలోని వాంకోవర్లో అడ్మిషన్ పూర్తయిందని, టిక్కెట్ కూడా బుక్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కెనడా- భారత్ మధ్య క్షీణించిన సంబంధాలు కారణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారతదేశం- కెనడాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కెనడాలో తమ పిల్లల చదువుపై తీవ్ర ప్రభావంచూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం పంజాబ్ నుండి ప్రతి సంవత్సరం 68,000 కోట్ల రూపాయలు అక్కడి విద్యా వ్యవస్థకు చేరుతాయని తెలిపారు. గత సంవత్సరం రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) కింద కెనడా నుంచి మొత్తం 226,450 వీసాలు ఆమోదం పొందాయి. త్వరలో కెనడాకు వెళుతున్నవారిలో దాదాపు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్కు చెందినవారే కావడం గమనార్హం. వీరు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కలిగిన వివిధ కోర్సులను అభ్యసించనున్నారు. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? -
'రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు'.. ఆరోగ్యంపై నటి షాకింగ్ కామెంట్స్!
షార్ట్ ఫిల్మ్స్తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ చాలా చిత్రాల్లో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) గాయత్రి గుప్తా మాట్లాడుతూ..'ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్గా భావించలేదు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఆమెను బోల్డ్ అనడంపై స్పందించింది. డైరెక్టర్స్కు కావాల్సిన క్యారెక్టర్కు తగినంత పొటెన్షియల్ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది. గతంలో ఆమె ఓ వీడియో ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మరి ఇంత బోల్డ్ వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తన బాయ్ఫ్రెండ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్పామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! ) -
చంద్రబాబు ఐటీ కేసు ఇష్యూపై చింతా రాజశేఖర్..!
-
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
సత్తుపల్లి మట్టా దయానంద్కి గట్టి దెబ్బ
సాక్షి, ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు. ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్కు నోటీసులు జారీ అయ్యాయి. ప్లాన్ బీ కూడా? 2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. -
చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు
టాలీవుడ్లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్,మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) తాజాగా హీరోయిన్ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది. 'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు.' అని తెలిపింది. (ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్) తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్లో నటించినప్పుడు కూడా, అతను లీగల్గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది. View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు
-
మేనేజర్తో విబేధాలు.. స్పందించిన రష్మిక
టాలీవుడ్లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్లో ఫుల్ క్రేజ్. అయితే తన మేనేజర్ చేతిలో సుమారు రూ.80 లక్షల వరకు మోసపోయిందని, దీంతో అతన్ని తొలగించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక ఈ విషయంపై తొలిసారి స్పందించింది. తాము విడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం నిజమేనని తెలిపింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) కానీ ఈ నిర్ణయం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. తామిద్దరూ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామని చెప్పుకొచ్చింది. పరస్పర ఒప్పందంతో విడిగా తమ కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రొఫెషనల్గా వ్యవహరించే పనిలో ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి ఇంతవరకు వర్క్ చేశామని పేర్కొంది. ఇప్పుడు కూడా అంతే హుందాగా తామిద్దరం విడిగా పనిచేయాలని అనుకుంటున్నట్లు రష్మికతో పాటు ఆమె మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
ఆదిపురుష్కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్
రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ నేపాల్లో మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ డైలాగ్ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్కు ఎలా పరిచయం?) -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్ని కోరిన నటి
కోలీవుడ్లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్లో సినీ ప్రముఖల లిస్ట్) -
ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం... ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. -
వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవి దౌర్జన్యకాండ
సాక్షి, వైఎస్సార్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఆదివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో ఓ వెంచర్లో ఆయన తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ వెంచర్ ఫెన్సింగ్ను తన అనుచరులతో కలిసి తొలగించి.. అక్కడ దున్నించాడు బీటెక్ రవి. అయితే.. వెంచర్ ఓనర్ మాత్రం తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అయినా రవి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ‘‘అనుచరులతో మాపై ఆయన దౌర్జన్యం చేయడం దారుణం. బీటెక్ రవి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపాలి’’ అని వెంచర్ ఓనర్ కోరుతున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన స్థానికులను మారణాయుధాలతో బీటెక్ రవి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్థానికంగా బీటెక్ రవి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారులు హడలిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత కథనం: బీటెక్ రవి నేతృత్వంలో మారణాయుధాలతో.. -
తాడికొండ టీడీపీలో ఫ్లెక్సీల వివాదం
-
ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు!
కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ అజాద్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురింపించారు. తన పట్ల మోదీ చాలా ఉదారంగా ప్రవర్తించారని తనపై ఎలాంటి రివేంజ్ తీర్చుకోలేదని అన్నారు. అలా అని ఒక ప్రతిపక్ష నేతగా ఆర్టికల్ 370తో సహ హిజాబ్ వంటి పలు విషయాల్లో ఆయన్ను వ్యతిరేకించడమే కాకుండా నిలదీయకుండా విడిచిపెట్ట లేదన్నారు అజాద్. తాను మోదీతో కొన్ని బిల్లులు విషయంలో విభేదించనినప్పటికీ ఆయన తనపై ఏవిధంగానూ రివేంజ్ తీర్చుకునే యత్నం చేయలేదు పైగా ఒక రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించారు. అందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పారు అజాద్. అదే సమయంలో మోదీపై విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వారి మనసులు కలుషితమైపోయాయని, అందుకే ఆయనపై అలాంటి విమర్శలకు దిగుతున్నారని అన్నారు ఆయనపై ఆరోపణలు చేసేకంటే ముందుగా వారంతా పాలిటిక్స్ అంటే ఏంటో ఓనమాలు నుంచి నేర్చుకోవాలంటూ అజాద్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 2021లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అజాద్ పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సందర్భంగా ప్రదాని మోదీ అజాద్పై ప్రశంసలు కురింపించారు. ఆయనతో తనకు గలు రాజకీయ అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయపరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తాడని అందువల్ల అలాంటి వ్యక్తికి వీడ్కోలు పలకాలంటే బాధగానే ఉంటుందంటూ.. మోదీ భావోద్వేగం మాట్లాడారు. (చదవండి: 'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ) -
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
నల్గొండ జిల్లా నకిరేకల్లో ప్రేమ జంటపై దాడి
-
కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
ఆధిపత్యమే పరమార్థమా?!
ఎప్పుడూ వార్తల్లో ఉండే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంది. ఢిల్లీలో కూడా మొన్న గాంధీ జయంతి రోజున తలెత్తిన సమస్య మినహా పెద్దగా వివాదం ఛాయలు లేవు. తెలంగాణ సరేసరి. ఇంతలోనే కేరళలో రాజుకుంది. అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ బయల్దేరింది. గత నెలలో కన్నూరు యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంపైనా, అంతక్రితం అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన లోకాయుక్త అధికారాల కుదింపు వ్యవహారంపైనా ఆరిఫ్ కన్నెర్రజేశారు. తాజాగా కేరళ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక అంశంలో గొడవ మొదలైంది. ఈ వ్యవహారంలో తమ బాధ్యతను మరిచారంటూ 15 మంది సెనేట్ సభ్యుల్ని గవర్నర్గా తనకున్న అధికారాలనుపయోగించి తొలగించారు. అంతేకాదు... మంత్రుల్ని పదవీచ్యుతుల్ని చేసే అధికారం కూడా తనకున్నదంటూ హెచ్చరించారు. వైస్ చాన్సలర్ల నియామ కాల్లో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయిగా ఉండేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు గత నెల అసెంబ్లీలో ఆమోదం పొందింది. దానిపై ఇంతవరకూ గవర్నర్ సంతకం చేయలేదు. నిర్ణయాలు తీసుకోవటంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మాట నెగ్గాలా, నియామకం ద్వారా పదవిలోకొచ్చిన గవర్నర్ది ఆఖరిమాట కావాలా అన్నదే ఈ వివాదాలన్నిటి సారాంశం. కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పాలకపక్షం ఉన్నప్పుడు పెద్దగా గొడవులుండవు. అలాగని విపక్ష ఏలు బడి ఉన్నచోట్ల నిత్యం సమస్యలుంటాయన్నది కూడా నిజం కాదు. రాష్ట్రపతిగా ఇటీవల పదవీ విరమణ చేసిన రాంనాథ్ కోవింద్ బిహార్ గవర్నర్గా ఉన్నప్పుడు అప్పటికి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న నితీష్ కుమార్తో ఆయనకెన్నడూ తగవు రాలేదు. రాజకీయపరంగా చూస్తే అంతవరకూ కోవింద్ బీజేపీలో చురుకైన నాయకుడు. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆరిఫ్ కూడా సీనియర్ నేత. చిరకాలం కాంగ్రెస్లో ఉన్నారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వమ్ము చేస్తూ రాజీవ్గాంధీ తీసుకొచ్చిన బిల్లు ముస్లిం మహిళల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ ఆయన 1986లో కాంగ్రెస్కు రాజీ నామా చేశారు. బోఫోర్స్ శతఘ్నల కొనుగోళ్లలో కుంభకోణం చోటుచేసుకున్నదంటూ వీపీ సింగ్తో కలిసి రాజీవ్ సర్కారుపై పోరాడారు. అనంతరకాలంలో వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభు త్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యం చూస్తే ఆరిఫ్ వివాదాల్లో చిక్కుకోవటం కొంత వింతగానే ఉంటుంది. గవర్నర్గా ఉన్నవారూ, రాష్ట్రాన్ని పాలించేవారూ అరమరికల్లేకుండా చర్చించుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. కానీ సమస్యలపై రచ్చకెక్కడం, మీడియా సమావేశాల్లో విమర్శించుకోవటం అలవాటైంది. ట్విటర్ వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకునే ధోరణి కూడా బయల్దేరింది. మంత్రుల్ని తొలగించే అధికారం కూడా తనకున్నదంటూ ట్విటర్ ద్వారానే ఆరిఫ్ హెచ్చరించారు. ‘సీఎంకూ, ఆయన మంత్రులకూ గవర్నర్కు సలహాలిచ్చే అధికారం ఉంది. కానీ అందుకు భిన్నంగా గవర్నర్ను కించపరుస్తూ కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని తొలగించటంతో సహా చర్యలు తీసుకునే అధికారం నాకుంది’ అన్నది ఆ ట్వీట్ సారాంశం. కేరళ వర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక ప్రక్రియలో వివాదం రాజేయటం ఆరెస్సెస్ ఎజెండా అమలు కోసమేనని కేరళ విద్యామంత్రి ఆర్.బిందు అనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనీ, వాటి ర్యాంకులు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా అడుగంటుతున్నాయనీ ఏటా తెలుస్తూనే ఉంది. వాటిని మళ్లీ చక్కదిద్దటానికి పాలనాపరంగా ఏం చేయాలన్న విషయంలో ఎవరూ పెద్దగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. తగినంతమంది అధ్యాపకులు లేకపోవటం, వారిలో చాలామంది కాంట్రాక్టు ప్రాతి పదికనే వచ్చినవారు కావటం, ప్రభుత్వాలు సకాలంలో నిధులు అందించకపోవటం ప్రమాణాలు పడిపోవటానికి ప్రధాన కారణాలని విద్యార్థి సంఘాల నాయకులూ, అధ్యాపకులూ ఆరోపిస్తు న్నారు. ఇలాంటి అంశాల్లో గవర్నర్ అభ్యంతరం లేవనెత్తితే అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్య ప్రమాణాలను కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని అందరూ జేజేలు పలుకుతారు. కానీ వైస్ చాన్సలర్ నియామకం, సెనేట్ సభ్యుల ఎంపిక, తొలగింపు తదితర అంశాల్లో పట్టుదలకు పోవటం వల్ల ప్రయోజనమేమిటో అర్థం కాదు. ఈ విషయంలో తనకున్న అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటం, ఫలానావిధంగా చేయటమే ఉత్తమమని సలహా ఇవ్వటం మంచిదే. కానీ అందు కోసం రచ్చకెక్కటం వల్ల ఉన్నత విద్యకు ఒరిగేదేమిటి? గవర్నర్ల వ్యవస్థ విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కీలక సూచనలు చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు చేసే నిర్ణయాలకు ఉన్నంతలో విలువనీయటం సరైందని అభిప్రాయపడింది. సర్కారియా కమిషన్ నివేదిక కూడా విస్తృతమైన సిఫార్సులు చేసింది. రాజకీయాలకు సంబంధంలేనివారు, తటస్థులుగా ముద్రపడిన వారు గవర్నర్లయితే మంచిదని తెలిపింది. కానీ ఆ కోవలోకొస్తారని భావించినవారు సైతం వివా దాల్లో ఇరుక్కున్న ఉదంతాలు లేకపోలేదు. నిర్ణయ ప్రక్రియలో పరిధులు అతిక్రమించి విపరీత పోకడలకు పోవటం, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం వంటివి చోటుచేసుకుంటే గవర్నర్లు ప్రశ్నించటంలో తప్పులేదు. కానీ ఎంతసేపూ ఆధిపత్యం కోరుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. కేరళ గవర్నరైనా, మరొకరైనా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. అసలు విషయం ఇది..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన నైట్క్లబ్ వీడియో ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నైట్పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ నేతలు రాహుల్ను టార్గెట్ చేశారు. దీంతో కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది. అయితే, ఈ వీడియోపై ఓ జాతీయ మీడియా సంస్థ అసలు నిజాలు తెలుసుకొని వీడియోతో సహా రాహుల్ పక్కనే ఓ యువతి గురించి క్లారిటీ ఇచ్చింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ కనిపించారు. వీడియోలో రాహుల్ ఓ యువతి మాట్లాడటం కనిపించింది. సదరు యువతి నేపాల్లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. కానీ, తాజాగా ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ఆమె చైనీస్ కాదని తెలిపింది. ఆమె నేపాలీ మహిళ, వధువు స్నేహితురాలు రాబిన్ శ్రేష్ట అని పేర్కొంది. అయితే, సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం రాహుల్ సోమవారం నేపాల్కు వెళ్లారు. #Factcheck: The woman in the video was a friend of the bride at the wedding that Rahul Gandhi was attending in Nepal. She is not a Chinese diplomat#AFWAFactcheck | @KunduChayan https://t.co/KH8oz6FuNJ — IndiaToday (@IndiaToday) May 3, 2022 ఆమె గురించి వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఇంటర్నేషనల్కు దిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ గ్యాంగ్రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలను రాశారు. 2001 నుంచి 2017వరకు సీఎన్ఎన్లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఫౌండర్గా కొనసాగుతున్నారు. Rahul Gandhi tweeting about pathetic state of Indian economy from a pub in Kathmandu along with Chinese ambassador to Nepal. Congress must explain this alliance pic.twitter.com/bdCMBHAWQx — Shashi Kumar (@iShashiShekhar) May 3, 2022 సుమ్నిమా ఉదాస్ ఫొటోలు ఇది కూడా చదవండి: ముగిసిన డెడ్లైన్.. ముంబైలో హైఅలర్ట్ -
బీజేపీలో భూ రగడ.. రాష్ట్ర అధిష్టానం దృష్టికి సమస్య
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో భూ రగడ వివాదాస్పదమవుతోంది.. ఆ పార్టీకి చెందిన జిల్లా ముఖ్య నాయకుల ప్రమేయంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గుర్రుగా ఉన్నారు. మంగళవారం రాత్రి ఈ వివాదం విషయమై ఎంపీని కలిసేందుకు వెళ్లిన కొంతమంది ముఖ్య నాయకులను ఎంపీ గన్మెన్లు ఆ సమయంలో కలిసేందుకు అనుమతినివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గన్మెన్లను నెట్టివేశారు. వారు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్రెడ్డిపై కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే గన్మెన్లను నెట్టివేసిన తీవ్రత కంటే భూ రగడ విషయంలోనే కేసు తీవ్రతకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ సోయం బాపురావుకు, పార్టీ జిల్లా ముఖ్య నాయకుల మధ్య వివాదం బీజేపీలో చర్చనీయంగా మారింది. రాష్ట్ర అధిష్టానం దృష్టికి.. అసైన్డ్ భూమి విషయంలో జిల్లా నేతల ప్రమేయం, దాని విషయంలో ఎంపీ నివాస గృహం వద్ద దురుసు ప్రవర్తన వంటి విషయాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంటి వద్ద జరిగిన వివాదంలో పలువురు బీజేపీ జిల్లా నేతలు ఉన్నప్పటికీ ఈ విషయంలో పార్టీ పరువును దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కేసు నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జిల్లా అధికార ప్రతినిధిపై మాత్రం అట్రాసిటీ కేసు నమోదైంది. కనిపించని సందడి.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పుట్టిన రోజు గురువారం కాగా, ఆ సందడి ఆదిలాబాద్ పట్టణంలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఆయన అత్యవసర పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఎంపీ క్యాంప్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పట్టణంలో ఎక్కడ కూడా ఎంపీ సోయం బాపురావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమివ్వలేదు. బీజేపీలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీల సందడి కనిపిస్తుంది. అలాంటిది ఎంపీ బర్త్ డే సందర్భంగా సందడి కనిపించకపోవడంపైనా చర్చ సాగుతోంది. అసైన్డ్ భూమి విషయంలో.. ఇచ్చోడ మండలం బాబుల్డోవ్ గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమి విషయంలోనే ఈ వివాదం చోటుచేసుకుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు, అతని బంధువులు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు గతేడాది సెప్టెంబర్లో నలుగురు అసైన్డ్దారులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వివాదం, ఆ నలుగురి కుటుంబాలను సదరు నేతలు వేధంచడంతో బాధితులు ఓ వ్యక్తి ద్వారా ఎంపీ సోయం బాపురావును కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలోనే మంగళవారం రాత్రి ఎంపీ సోయం బాపురావు తన నివాస గృహంలో ఉన్నప్పుడు అసైన్డ్దారుల తరపు వ్యక్తి మాట్లాడేందుకు రాగా, ఈ విషయం తెలుసుకుని జిల్లా బీజేపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ సూచన మేరకు బీజేపీ నాయకులను గన్మెన్లు మరుసటి రోజు ఉదయం రమ్మని చెబుతున్నా దురుసుగా ఇంట్లోకి ప్రవేశించడం, ఆ క్రమంలో గన్మెన్లను నెట్టివేయడం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ -
RRR సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల అభ్యంతరం
-
కావాలనే ఒకరిద్దరు రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే రోజా
-
మొట్ట మొదలు..ఆలుమగలు
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థ అమలు ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. జిల్లాల్లో టీచర్ల కౌన్సెలింగ్ను నిలిపివేసిన ప్రభుత్వం వారి ఆప్షన్లు పరిశీలించి స్కూళ్లు కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా భార్యాభర్తలు పెట్టుకున్న ఆప్షన్లపై (స్పౌజ్ కేసులు) దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన జాబితాను తక్షణమే పంపాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం రాత్రి అత్యవసర ఆదేశాలు పంపారు. ఈ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. భార్యాభర్తల ప్రాధాన్యతలపై ప్రధానంగా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే కొత్త జిల్లాల్లో టీచర్లకు స్కూళ్ళు కేటాయించే వీలుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే టీచర్లు ఆప్షన్లు ఇచ్చారని, వీటినే పరిగణనలోనికి తీసుకుంటామని అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండబోదని స్పష్టం చేశాయి. మరోవైపు మల్టీ జోనల్ కేటాయింపులపై అధికారులు సమీక్షించారు. నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే విద్యాశాఖ సరైన విధానంలో ప్రభుత్వానికి జాబితా పంపలేదని తెలిసింది. దీన్ని సవరించి తిరిగి పంపడంతో మల్టీ జోనల్ కేటాయింపుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ముట్టడి విజయవంతం : యూఎస్పీసీ సెక్రటేరియట్ ముట్టడి విజయవంతమైందని యూ ఎస్పీసీ ప్రకటించింది. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వా నికి తెలిపామని స్పష్టం చేసింది. ముట్టడి కార్యక్రమానికి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి (డీటీఎఫ్), యు.పోచయ్య (ఎస్టీఎఫ్), ఎన్.యాదగిరి (బీటీఎఫ్), ఎస్.హరికృష్ణ(టీటీఏ), బి.కొండయ్య, ఎస్.మహేష్ (ఎంఎస్టీఎఫ్), చింతా రమేష్ (ఎస్సీ ఎస్టీయూయస్), టి. విజయసాగర్ (టీజీపీఈటీఏ), వై.విజయకుమార్ (ఎస్సీఎస్టీ యూఎస్ టీఎస్) నాయకత్వం వహించారు. ప్రభుత్వ జీవో ఉపాధ్యాయులను సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లుగా మారుస్తోందని నేతలు విమర్శించారు. సాధారణ బదిలీల్లోనే శాశ్వత కేటాయిం పులు చేయాలని, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముట్టడిపై నిర్బంధం.. కేటాయింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఓ పక్క వేగం పెంచుతుండగానే.. మరోపక్క టీచర్లు ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. టీచర్లకు అన్యాయం చేసే 317 జీవో (స్థానికత)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీ (యూఎస్పీసీ) మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు రాజధానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ఉపాధ్యా య సంఘాల నేతలను జిల్లాల్లోనే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధ రాత్రి నుంచే నిర్బంధం అమలు చేశారని సం ఘాల నేతలు తెలిపారు. పోలీసు నిర్బంధం మధ్యే ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యూహాత్మకంగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. వేర్వేరు మార్గాల్లో సెక్రటేరియట్కు చేరుకున్న సంఘాల నేతలు కొద్దిసేపు నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉంటే నేతల అరెస్టులను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోని పోలీసుస్టేషన్ల వద్ద ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. -
టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి. నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్ కల్యాణ్కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్లో తీసు కుంటారా? బ్లాక్లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు పెట్టుకోవాలని భావిస్తారా? నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది. ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్ఫామ్పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు ఇవ్వవచ్చు. కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్ యాదవ్ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి. సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! ఆన్లైన్ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒక్క జగన్ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట. ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు దుమారం
-
చంద్రబాబే నన్ను కోట్టించాడు
-
చూడవయ్యా నీ మంత్రే ఏమన్నాడో..
-
ముషంపల్లి ఘటనతో తెరపైకి బెల్ట్ షాపుల అంశం
-
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
-
లక్ష గ్రీన్కార్డులు వృథా అయ్యే ప్రమాదం!
వాషింగ్టన్: దాదాపు లక్షకు పైగా గ్రీన్కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్కు చెందిన సందీప్ పవార్ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) చేస్తున్న జాప్యమే గ్రీన్కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్సీఐఎస్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నేటి నుంచి ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల జారీ బంద్..!
ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్కార్డ్ నేటి నుంచి కొత్త డెబిట్/క్రెడిట్ కార్డులను జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్కార్డ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్బీఐ పేర్కొంది. మాస్టర్కార్డ్ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్ కార్డ్ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్గా మాస్టర్కార్డ్ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్ విషయంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ భారత్లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్కార్డు డెబిట్/ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. బెల్లద్కు పరప్పన అగ్రహార జైలు లో ఉన్న యువరాజ్స్వామి నుంచి ఫోన్కాల్ రాలేదని విచారణలో తెలిసింది. హైదరాబాద్కు చెందిన అర్చకుడు జితేంద్రనాద్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసింది నిజమేనని, అయితే పరిచయస్తుడేనని తేల్చారు. జైల్లో ఉండే యువరాజ్స్వామి అనే ఖైదీతో ఎలాంటి సంబంధం లేదని డీసీపీ అనుచేత్ నిర్వహించిన విచారణలో నిర్ధారించినట్లు తెలిసింది. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
జగన్ నిర్ణయం బాగుంది : కేతిరెడ్డి
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల నిర్ణయం చాలా గొప్పదని, దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ తమ ఎజెండాలను పక్కనపెట్టి మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాలి. అధికారాన్ని సమానంగా పంచనప్పుడు ప్రత్యేక రాష్ట్ర నినాదాలు వస్తాయి. అందుకు ఉదాహరణగా తెలంగాణ, ఉత్తరాంచల్, చత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాలను చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలో లోపాలేవీ కనిపించనప్పుడు వేర్పాటు వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటాయి. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఇటీవల కొన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులాంటిది. ఇప్పటికే కర్ణాటకలో బెంగళూరు, మైసూరులలో రెండు అసెంబ్లీలు, మహారాష్ట్రలో ముంబై, నాగ్పూర్లలో రెండు అసెంబ్లీలు ఉన్నాయి. హైకోర్టు బెంచ్లు తమిళనాడులో చెన్నై, మధురైలలో ఉన్నాయి. మహరాష్ట్రలో ముంబై, నాగ్పూర్లలో బెంచ్లున్నాయి. తమిళనాడులో ముందు నుంచే అభివృద్ధిని చెన్నైకి పరిమితం చేయకుండా ప్రతీ జిల్లాకు సమపాళ్లలో పంచారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధినంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్కే పరిమితం చేయడం వల్ల తెలంగాణ వాదం బలపడింది. జగన్మోహన్రెడ్డి ఇప్పుడు చేసిన పనిని అప్పటి పాలకులు చేసి ఉంటే విభజన జరిగేది కాదు. అలాగే దక్షిణాదిలో రెండవ రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఏ ప్రభుత్వం కూడా మా డిమాండ్ను పట్టించుకోవట్లేదు. దానికి కారణం దక్షిణాదిలో కేవలం 130 ఎంపీ సీట్లు ఉండడమే. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అయినా రెండో రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కోరారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ (అమెండ్మెంట్ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టెండర్లకు అనూహ్య స్పందన రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్కు సైతం డబ్బుల్లేవ్.. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై వివిధ కేసులను హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. హైకోర్టు తీర్పు వచ్చినా ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావట్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ చిక్కుకుంది. దీని ఫలితంగా బస్సులకు డీజిల్ పోసే పంపులకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయొచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతోంది. ఏ క్షణమైనా ఆర్టీసీని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రచ్చకెక్కిన ఏయూ ఎన్నికలు
సాక్షి, ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికలు వివా దాస్పదంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓట్లు చేర్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ పంచాయతీ వీసీ వద్దకు చేరింది. ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈ నెల 17న విడుదల చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. బుధవారం నీలాపు శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానళ్లు, గురువారం జి.రవికుమార్ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక్కడ వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారి ఆచార్య జి.సుధాకర్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్తగా 185 మందిని ఓటర్లుగా చేర్చుతున్నట్టు అభ్యర్థులకు తెలియజేశారు. దీనిని శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానల్ సభ్యులు వ్యతిరేకించారు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలని, నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓటర్లను చేర్చడం ఏమిటని ఎన్నికల అధికారిని నిలదీశారు. వర్సిటీ వీసీ సంతకంతోనే నూతన జాబితా తనకు చేరిందని ఎన్నికల అధికారి చెప్పడతో వివా దం వర్సిటీ వీసీ కార్యాలయానికి చేరింది. వాగ్వాదాలు.. కేకలు వర్సిటీ వీసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ ఎదురుగానే ఉద్యోగులు ఘర్ణణకు దిగారు. పెద్దగా కేకలు వేశారు. చివరకు వీసీ స్వయంగా వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్లను పిలిచి మాట్లాడారు. అనంతరం పోటీ చేస్తున్న మూడు ప్యానళ్ల అధ్యక్షులతో సమావేశమయ్యారు. వీసీ సూచన మేరకు న్యాయ నిపుణుల తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జి.సుధాకర్ తెలిపారు. ఏమిటీ జాబితా? ఎందుకీ వివాదం ఎన్నికలు ప్రారంభ సమయంలో, నోటిఫికేషన్ విడుదల సమయంలో వర్సిటీలో 1634 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అభ్యర్థులకు సంతకం చేసి ఎన్నికల అధికారి అందజేశారు. తాజాగా గురువారం సాయంత్రం హాస్టళ్లలో పనిచేస్తున్న 185 ఉద్యోగుల జాబితాను దీనికి జత చేయాలని సూచిస్తూ వర్సిటీ వీసీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వర్సిటీ ఉద్యోగులకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు నెలలో రూ.10 వేతనం నుంచి సేకరించారు. మే నెల వేతనాలు నుంచి 1634 మంది ఉద్యోగులకు దీనిని సేకరించారు. తాజాగా జత చేసిన ఉద్యోగులకు గత నెల వేతనాల నుంచి ఎన్నికల నిధిని సేకరించలేదు. వీరికి సంబంధించిన రూ.1850 డీడీ రూపంలో చెల్లించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్యానల్కు సంబంధించిన పోటీదారుడే ఈ రుసుం చెల్లించారని వారు ఆక్షేపిస్తున్నారు. సాధారణంగా హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులకు హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్లో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వర్సిటీ విభాగాలలో పనిచేసే వారికి ఏయూ ఈయూలో ఓటు హక్కు ఉంటుంది. దీనికి విరుద్ధంగా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని పోటీదారులు కోరుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక చేర్పులా.. ఇప్పటికే వర్సిటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగి సింది. తాజాగా పలువురి ఓట్లు జాబితాలో చేర్చాలనే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు జరిపించాలి. – బుద్దల తాతారావు, పోటీదారుడు ఇదెక్కడి న్యాయం ఉద్దేశపూర్వకంగా కొంతమంది వర్సిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వర్సిటీ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఎంత మాత్రం సహించేది లేదు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలి. మార్పులు, చేర్పులు అనుమతించరాదు. – నీలాపు శివారెడ్డి, పోటీదారుడు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. వర్సిటీలో పనిచేస్తున్న ఎంటీఎస్లో కొంత మంది ఉద్యోగులకు గత నెలలో ఎన్నికలకు సంబంధించిన రూ.10 వేలు వేతనం కోత జరగలేదు. దీంతో వీరంతా ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పించారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా డిజిగ్నేషన్ ఇవ్వకుండా లాస్ట్ గ్రేడ్ కేటగిరీ అంటూ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇటీవల ఎంటీఎస్ పొందిన వారిలో కొంత మందికి ఓటు హక్కు కల్పించి, మరికొంత మందికి మొండి చేయి చూపడం ఎంత వరకు సమంజసం. – డాక్టర్ జి.రవికుమార్, పోటీదారుడు -
మైనింగ్ అనుమతుల జారీకి ప్రత్యేక విధానం
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అనుమతులు త్వరితగతిన జారీ చేసేందుకు ప్రత్యేక విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర గనుల శాఖ అధికారులు, రాష్ట్రంలోని జియోసైన్స్ సంస్థల ప్రతినిధులతో గురువారం జరిగిన వార్షిక వ్యూ హాత్మక ముఖాముఖి సమావేశం (అసిమ్)లో ఆయన మాట్లాడారు. అటవీ, పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్న తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులకు మైనింగ్ అనుమతులు సత్వరం జారీ చేయాలన్నారు. దీనికోసం కన్సల్టెన్సీ సేవలు అందించాలని సీఎస్ సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సమావేశాన్ని తెలంగాణలో కేంద్ర గనుల శాఖ నిర్వహించడాన్ని అభినందించా రు. రాష్ట్రంలో గనుల అభివృద్ధి, ఖనిజాన్వేషణకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర గనుల శాఖ పరిధిలోని జియోసైన్స్ పరిశోధనా సంస్థల సహకారంతో తెలంగాణలో ఖనిజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అసిమ్ తరహా ఎంతో ఉపయోగం హైదరాబాద్లో ఉన్న జియో సైన్స్ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేందుకు అసిమ్ తరహా సమావేశాలు ఉపయోగపడుతాయని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినరల్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), అటమిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సం స్థల సహకారంతో ఖనిజాన్వేషణ వేగవంతం గా చేపట్టవచ్చన్నారు. తెలంగాణలో సున్నపురాయి, మాంగనీస్, ఐరన్ఓర్, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ పనులు చేపడతామన్నారు. రూ.4,792 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,291 మైనింగ్ లీజులుండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గనులశాఖ జాయింట్ డైరక్టర్ రఫీ అహ్మద్ వెల్లడించారు. స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వా రా ఖనిజాల అన్వేషణ చేపట్టడంతోపాటు కేం ద్ర జియోసైన్స్ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందినట్లు టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ వెల్లడించారు. తమ సంస్థకు నేషనల్ మినరల్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్టు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. -
దిక్కులేని సిపాయి
కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా తేలిగ్గా...‘‘ఏంట్రా అబ్బాయి’’ అన్నాడు.‘‘కూలీలు’’ అని పిడికిళ్లు బిగించినంత పనిచేశాడు రాంబాబు.‘కూలీలు’ అనే చిన్న మాటలోనే చెప్పకనే ఎన్నో విషయాలు చెప్పాడు రాంబాబు. కూలిపోతున్న కూలీల జీవితాల గురించి కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు.పట్నంలో చదువుకొని వచ్చిన రాంబాబుకు కూలీలతో పనేమిటి? ఈ రాంబాబు అందరిలాంటోడైతే కూలీలతో పనేమిటి? అనే అనుకోవచ్చు. కానీ రాంబాబు చదువుతో పాటు సమాజాన్ని చదువుకున్నవాడు. అందుకే కూలీల సమస్యలను తన ఇంటి సమస్యగా చేసుకొని భూషయ్య ఇంటికొచ్చాడు.భూషయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.‘‘కూలీల సంగతి కూలోడు, రైతుల సంగతి రైతోడు పడతాడు. కుర్రోడివి నీకెందుకు ఈ ఎవ్వారం’’ విసుక్కున్నాడు భూషయ్య.‘‘చదువుకున్నాడని యవ్వారానికి వచ్చాడు’’ వెక్కిరింపుగా అన్నాడు భూషయ్య భజనుడు.‘‘వచ్చి మాత్రం ఏంచేస్తాడు! వరిముక్క చేతికి ఇచ్చి ఏంట్రా ఇది అని అడిగితే వడ్లుగాసే చెట్టు అనేవాడివి నీకెందుకురా...ఎళ్లు’’ రాంబాబును ఊకలా తేలికగా తీసేశాడు భూషయ్య.మరి భజనుడు ఊరుకుంటాడా..‘‘ఇదిగో గాడిద పని గాడిద కుక్క పని కుక్క చేయాలి. తెల్సిందా!’’ అని అరిచాడు.‘‘నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాద దక్కదు’’ అని హెచ్చరించాడు కూడా.‘‘వెళ్లిపోకపోతే?’’ కోపంగా అన్నాడు రాంబాబు.‘‘తలగొరుకుడు, సున్నంబొట్లు, గాడిద మీద ఊరేగింపు...చాలా’’ తన మాటలతో రాంబాబును మరింత రెచ్చగొట్టాడు భజనుడు.అంతే...‘‘ఏంట్రా కుశావు’’ అని ఆ భజనుడి వైపు పిడుగులా దూసుకువచ్చాడు రాంబాబు.∙∙ ఏటి ఒడ్డున పాక హోటల్.ఆలివ్గ్రీన్ దుస్తుల్లో ఉన్న ఒకాయన టీ తాగుతున్నాడు. ఊరికి కొత్తోడిలా ఉన్నాడు. అప్పుడే అక్కడి వచ్చాడు కామయ్య.‘‘పేరు?’’ అని కొత్తవ్యక్తిని అడిగాడు.‘‘చంద్రశేఖరం’’‘‘చంద్రశేఖరం అని తెల్సండీ. ఊరు?’’‘‘తోలేరు’’‘‘చంద్రశేఖరం... తోలేరు అనే సంగతి తెల్సండి. పని?’’‘‘ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్లో పొలం ఇచ్చారు. దాని కోసం వచ్చాను’’‘‘కరణంగారితో పనన్నమాట. మనం ఉండాలన్నమాట’’‘‘కరణంగారు మీకు తెలుసా?’’‘‘కాకిని, కరణంగారిని తెలియని వారు ఈ ఊళ్లో ఉంటారా! ఎటొచ్చి కొంచెం కమిషన్ అవ్వుద్ది’’‘‘కమిషనా! ఎందుకు?’’‘‘ఎందుకేమిటండీ, కరణంగారితో పని కావాలంటే కామయ్యగోరు కదలాలి. కామయ్యగోరు కదలాలంటే కమిషన్ ఉండాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి. రేపు రండి. మీ భూమి తీసుకువచ్చి మీ చేతిలో పెడతాను’’అమాయకంగా కామయ్య సాలెగూడులో చిక్కుకుపోయాడు పాపం ఆ మిలిటరీ ఆయన. సూటిగా చెప్పాలంటే మిలిటరీ చంద్రశేఖరం మోసపోయాడు.∙∙ ‘‘కరణంగారు ఈ చేను ఎక్కడుందండీ?’’ చంద్రశేఖరం పొలం గురించి వివరం అడిగాడు రాంబాబు.‘‘ఎక్కడిదంటే...’’ నసిగాడు కరణం.చంద్రశేఖరం పొలాన్ని భూషయ్య నొక్కేశాడని రాంబాబుకు అర్థమెంది.‘‘దీన్నంతా ముత్యాలమ్మ చేను అంటారు. ఇది ఎప్పటి నుంచో భూషయ్య చేతిలో ఉంది’’ అని తనతో పాటు వచ్చిన చంద్రశేఖరానికి చెప్పాడు రాంబాబు.తన చేను గురించి భూషయ్యను అడగడానికి వెళ్లాడు చంద్రశేఖరం.‘‘భూషయ్య గారు ఆ చేను నాది. నాకు పట్టా వచ్చింది. దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు’’భూషయ్య తనదైన శైలిలో ఇలా అన్నాడు...‘‘కిట్టమూర్తి మనం అట్టిపెట్టుకోవడమేమిటయ్యా. అది ముత్యాలమ్మ తల్లిది. కాదంటే ఆ తల్లికే కోపం వస్తది. మనకేం!’’‘‘ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడిచెట్టు కల్లు దొంగతనం చేయడానికి ఓ అర్ధాయుష్షు వెధవ చెట్టెక్కాడు’’ అని భజనుడు అన్నాడో లేదో పూజారి టక్కున అందుకున్నాడు...‘‘రక్తం కక్కుకొని టపీమని చావబోయి ఆగాడు. అంటే ఒకటి....అమ్మతల్లి మహత్యం నీకింకా తెలియదు. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లుతుంది. ప్రళయం వచ్చేస్తుంది’’‘‘భయంకర శత్రుమూకలను నేలమట్టం చేయడంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. నేను అవిటివాన్ని అయినా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. ఆ భూమి నాది’’ అని గట్టిగా అరిచాడు చంద్రశేఖరం.తాటిముంజలు తింటూ తాటికాయలను నరుకుతున్న పనివాడిని చూస్తూ తనదైన శైలిలో స్పందించాడు భూషయ్య...‘‘రేయ్ పోతూ! పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్లు నరుక్కెళుతుంటే, వొకనాడు అమ్మతల్లి కన్ను విప్పుతుంది. కుండెడు రక్తం భళ్లునా కక్కాలి’’∙∙ ‘‘రాంబాబు... ఆరునూరైనా సరే రేపే మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చేయ్. చేనులో కలుద్దాం’’ ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్రశేఖరం.మరుసటి రోజు...చేనులో చంద్రశేఖరం కనిపించలేదు.ఆయన శవం కనిపించింది.కళ్లనీళ్లతో శవాన్ని భుజానికెత్తుకున్నాడు రాంబాబు.దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు...‘‘మీరంతా ఇటు చూడండి. తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశం అని నా జనం అని వెర్రిప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువుల మీదికి దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చిసిపాయి. అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. ఇతడ్ని తగిలేయడానికి నాతో రాగలిగిన వారు ఎవరు? మీరా? మీరా?’’ -
హరీశ్, రేవంత్లకు ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రచారంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ స్పందించింది. టీఆర్ఎస్ మంత్రి హరీశ్రావు, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ తెలిపారు. ఈ నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు.. అభ్యర్థుల అనుమానల గురించి రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల కోసం ఇప్పటికే 32,500 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థలు ఫార్మ్ ఏ, ఫార్మ్ బీని ఎలా సబ్మిట్ చేయాలని అడుగుతున్నారన్నారు. ఫార్మ్ ఏని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) దగ్గర.. ఫార్మ్ బీని ఆర్వో దగ్గర ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో మూడు కాపీలను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఫార్మ్ 8ని సెల్ఫ్ డిక్లరేషన్తో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలేట్ బాక్స్, ఓటర్ స్లిప్కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. బ్యాలేట్ తెలుపు రంగులో ఉంటుందని.. ఓటర్ స్లిప్ పింక్ కలర్లో ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 64.36 కోట్ల రూపాయల డబ్బుతో పాటు రూ. 5 కోట్ల విలువైన మద్యం సీజ్ అయ్యిందని వెల్లడించారు. 77,384 మంది బైండోవర్ అయ్యారని.. సీఆర్పీసీ కింద 14,730 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నాయకులు వాడే భాష కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు. కొందరు మేనిఫెస్టో ఇచ్చారని కానీ కావలసిన పద్దతి ప్రకారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో నమోదయిన కేసుల విషయంలో.. ఎన్నికల తర్వాత సాక్షులు రావడం లేదు కాబట్టి విచారణ కొనసాగడం లేదని తెలిపారు. ఈ సారిఎన్నికల ఖర్చు విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. -
‘ఆహారభద్రత’కు మోక్షమెప్పుడో!
కరీంనగర్ సిటీ: ఆహారభద్రత కార్డుల జారీ విషయంలో జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కొత్త లబ్ధిదారులు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే వీలు లేకుండాపోతోంది. ఆగస్టు 15 నుంచి ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గడువు దగ్గర పడుతున్నా లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులు సమగ్ర విచారణ పేరుతో రెవెన్యూ అధికారుల జాప్యం.. హార్డ్కాపీలు అందకపోవడంతో సంబంధిత పౌరసరఫరాల శాఖ ఆన్లైన్ మంజూరు చేయకపోవడం వెరసి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో మొత్తంగా 13,000 మంది కొత్త రేషన్కార్డుల మంజూరుతోపాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా 8,900 దరఖాస్తులు పెండింగ్లో ఉండడం గమనార్హం. ఆహారభద్రత కార్డులపై అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హడావుడి చేసిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కేవలం కార్డుల లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన డేటా, వినియోగదారుని ఆధార్ సంఖ్య ఆధారంగానే రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారు. ఆహారభద్రత కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాన్ని చేపట్టి సులభతరంగా చేసినా కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల విచారణ వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రస్థాయిలో మంజూరు విధానాన్ని పక్కనపెట్టి జిల్లా స్థాయిలోనే దరఖాస్తులను పరిశీలించి అనుమతి జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. క్షేత్రస్థాయిలోనే ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. కొత్తగా రేషన్కార్డు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట ప్రభుత్వం సూచించింది. 13,400 దరఖాస్తులు.. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఆహారభద్రత కార్డులకు 13,400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి కార్డు మంజూరుకు పౌరసరఫరాలశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్తరేషన్ కార్డులు జారీకి అర్హులను గుర్తించి, వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 7,200 కొత్త కార్డుల కోసం దరఖాస్తులు రాగా 6,200 మ్యుటేషన్లు (మార్పులు, చేర్పుల) కోసం వచ్చాయి. జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులు 7 వేలకు పైగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరాలశాఖకు 6 వేల దరఖాస్తులు హార్డ్కాపీల రూపంలో అందగా అందులో 1,500 పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఆన్లైన్లో అనుమతించాల్సి ఉంది. 4,500 దరఖాస్తులను ఆన్లైన్ అప్లోడ్ పూర్తి చేశారు. జిల్లా స్థాయి లాగిన్లోనే అనుమతివ్వాలని ప్రభుత్వం తాజా మార్పులతో కొత్తకార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇంకా 8,500 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. గత జనవరి నుంచి దరఖాస్తులు సమర్పించిన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో త్వరితగతిన అనుమతినిచ్చే అవకాశమున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా స్థాయిలోనే మంజూరు మారిన నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మంజూరు చేస్తారు. ఆన్లైన్ ప్రక్రియ అయినప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ సేవలో పూర్తి వివరాలతో చేసుకున్న దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయ లాగిన్లోకి వస్తుంది. తహసీల్దార్ సంబంధిత ఆర్ఐకి విచారణ కోసం సిఫారసు చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన ఆర్ఐ ఆ నివేదికను తహసీల్దార్ లాగిన్కు పంపిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో సరి చూసుకుని అర్హులైతే తన లాగిన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. విడిగా ఒక ప్రతీని డీఎస్వోకు పంపించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీఎస్వో ఆహార భద్రత కార్డును మంజూరు చేస్తారు. మీసేవ ద్వారా కార్డు ప్రతీని పొంది సంబంధిత రేషన్ షాపులో సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్ల కిందట కొత్త రేషన్ కార్డులు ముద్రించి జిల్లాలకు పంపారు. అదే సమయంలో జిల్లాల విభజన చేయడంతో పాత జిల్లాల పేర్లతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయకుండా నిలిపేశారు. ఇప్పుడున్న 31 జిల్లాల వారీగా ఆహారభద్రత కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఎదురుచూపులు..! జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న అర్హులైన కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో మాత్రం ముందుకు సాగడం లేదు. క్షేత్ర స్థాయి విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూరికార్డుల ప్రక్షాళన, రైతు బంధు తదితర పనులతో ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా డీఎస్వో దగ్గరకు రాని 7,400 దరఖాస్తుల్లో 5,800 వరకు విచారణకే నోచుకోలేదు. ఆర్ఐల స్థాయిలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. 1,600 వరకు దరఖాస్తుల విచారణ పూర్తయినా తహసీల్దార్ తుది నివేదిక హార్డ్కాపీ రాకపోవడంతో మంజూరుకు నోచుకోలేదు. మొత్తంగా 7,400 దరఖాస్తులకు మోక్షమే లేదు. కేవలం 4,500 దరఖాస్తులకే పూర్తి స్థాయి విచారణ జరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పౌరసరఫరాల శాఖ హార్డ్కాపీలతో సరిచూసుకుని అప్రూవల్ చేస్తున్నారు. 13,400 దరఖాస్తులో 8,900 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆర్ఐలు విచారణ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు ఆహారభద్రత కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులకు ఆమోదం తెలిపి డీఎస్వో కార్యాలయానికి నివేదించాలని మండలాల అధికారులను కోరాం. మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో విచారణ, హార్డ్కాపీల అందజేయడంలో జాప్యం కారణంగా కొంత ఆలస్యమవుతోంది. విచారణ వివిధ దశల్లో పూర్తి చేయడం కష్టతరమే. డీఎస్వో స్థాయిలోనే అనుమతి ఇవ్వొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా 13 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖకు అందిన 6 వేలల్లో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అర్హత కలిగిన వారందరినీ లబ్ధిదారులుగా మంజూరు చేస్తాం. – గౌరీశంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
నా తండ్రి చితికి ఆమే నిప్పంటించారు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం. ఆ జంట తప్పు చేసిందా? ‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా -
అడ్డదారుల్లో అనుమతులిచ్చారు
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ ఒరిజినల్ లేఅవుట్లో చూపించిన విధంగా కాకుండా కొందరు బడాబాబులకు తలొగ్గిన అధికారులు, సొసైటీ ప్రతినిదులు తమ ప్లాట్ను మార్చేసి అన్యాయం చేస్తున్నారని యూకేకి చెందిన ఎన్ఆర్ఐ గొట్టిపాటి రోహిణి ఆరోపించారు. జూబ్లీహిల్స్లో సోమవారం తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.86లో జూబ్లీహిల్స్ సొసైటీ ద్వారా తనకు కేటాయించిన 469–డి ప్లాట్కు ఆనుకొని ఉన్న సొసైటీకి చెందిన అదనపు స్థలాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో తాను రూ.75 లక్షల బ్యాంకు పూచీకత్తును సొసైటీకి ఇచ్చానన్నారు.ప్రారంభంలో తన ప్లాట్ను ఆనుకొని ఉన్న అదనపు స్థలాన్ని తమకే క్రమబద్ధీకరిస్తామని చెప్పినా ఇప్పటిదాకా చేయలేదన్నారు. ఇదే విషయంపై తాను 11 నెలలుగా జీహెచ్ఎంసీ, పోలీసులు, రెవెన్యూ, సొసైటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఇటీవల తమ ప్లాట్ పక్కనే ఉన్న 469–సి ప్లాట్కు చెందిన డైమన్షన్ మార్చేసి తమ అధీనంలో ఉన్న స్థలంలోకి జరిపి జీహెచ్ఎంసీ అడ్డదారుల్లో అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై విదేశాంగ శాఖకు, మంత్రి కేటీఆర్కు ఫిర్యాదు చే యనున్నట్లు రోహిణి స్పష్టం చేశారు. -
మానసిక రోగులు పెరుగుతున్నారు: రాష్ట్రపతి
సాక్షి, బెంగళూరు: దేశంలో మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉధృతమయ్యేలా కనిపిస్తోందనీ, 2022కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేయాలనికోరారు. మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ ఉద్యోగాలు సంపాదించేందుకు మాత్రమే చదువు అనుకోవడం మంచిది కాదని అన్నారు. -
నేటి నుంచి కరెంటు కష్టాలు!
శ్రీకాకుళం , అరసవల్లి: జిల్లా వాసులకు కరెంటు కష్టాలు వెంటాడనున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తనుంది. విశాఖపట్నంలో సాంకేతిక లోపం కారణంగా జిల్లాకు కొద్ది రోజుల పాటు విద్యుత్ సరఫరా భారీగా తగ్గనుంది. కలపాకలో (విశాఖపట్నం) గల 315 ఎంవీఏ (మెగా వోల్ట్ ఆంప్స్) పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా అక్కడి విద్యుత్ అధికారుల సూచన మేరకు ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకోనున్నారు. దీంతో మన జిల్లాకు వస్తున్న రోజు వారీ విద్యుత్ సరఫరా కొద్ది శాతం తగ్గనుంది. ఈ ప్రభావంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కింద శుక్రవారం ఉదయం నుంచి వచ్చే నెల 3 వతేది రాత్రి వరకు విద్యుత్ కోతను అధికారులు విధించనున్నారు. జిల్లాకు రోజుకు 240 మెగావాట్లు సరఫరా అవుతుండగా, తాజాగా వచ్చిన సాంకేతిక లోపంతో సుమారు 50 మెగావాట్లు తక్కువగా సరఫరా కానుంది. దీంతో జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ సరఫరాలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లోనే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కోతలు విధించే అవకాశముంది. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు దాదాపుగా ఏడు లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరిపై ఈ ప్రభావం పడనుంది. దీనికి తోడు జిల్లాలో పైడిభీమవరం సబ్స్టేషన్లో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇక్కడ కూడా మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో విద్యుత్ కోతలు అనివార్యం కానున్నాయి. వచ్చే నెల 3 వరకు కోతలుంటాయి కలపాక పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటనెన్స్ కారణంగా శుక్రవారం ఉదయం నుంచి వచ్చే 3 వతేది వరకు జిల్లాలో కొంత వరకు విద్యుత్ కోతలు తప్పవు. అయితే కోతల సమయాలను జిల్లాలో పరిస్థితులు, అవసరాల మేరకు శ్రీకాకుళం డివిజన్, టెక్కలి డివిజన్లలో నిర్ణయిస్తాం. వినియోగదారులకు రాత్రి వేళల్లోనే కొంత మేరకు ఇబ్బందులుంటాయి. దాదాపుగా 40 నుంచి 50 మెగావాట్ల వరకు తక్కువగా విద్యుత్ సప్లై అవుతున్న కారణంగానే ఈ కోతలు అనివార్యంగా విధిస్తున్నాం. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం. – దత్తి సత్యనారాయణ, ఎస్ఈ -
మాట మార్చారు..
పోలవరం నిర్వాసితులపై వివక్ష 50 మంది పేర్లు తొలగింపు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి వీలుగా ఇళ్లను తొలగించనున్న కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. పలు సాకులతో కొంతమంది నిర్వాసితుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. కోల్పోయిన ఇళ్లను మరోచోట ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు. మరో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారన్న కారణాలతో ప్రత్యామ్నాయ ఇళ్ల మంజూరు జాబితాలో పేర్లు తొలగించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తొలి రెండు విడతల జాబితాల్లో ఉన్న తమ పేర్లను చివరి జాబితాలో తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా నివాసం ఉన్నా ఇప్పుడు పునరావాసం కాలనీలో ఇళ్లకు అనర్హులమంటూ అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. తుని రూరల్ (తుని) : తుని పట్టణాన్ని ఆనుకుఉన్న కొండవద్ద కుమ్మరిలోవ కాలనీని 1996లో నిర్మించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతోపాటు తునికి చెందిన పలువురు కాలనీలో నివాసాలు ఉంటున్నారు. ఈ ఇళ్లలో పేదలు, వ్యవసాయదారులు, కుల వృత్తిదారులు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమంలో కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. కుటుంబాలు పెరగడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. కొంతమందికి ఉద్యోగాలు లభించడం, కొందరు పదవీ విరమణ కూడా చేశారు. ఇటీవల పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకానికి కుమ్మరిలోవ కాలనీ అడ్డంగా ఉందంటూ కాలనీలో 323 ఇళ్లను తొలగించేందుకు నిర్ణయించారు. నష్ట పరిహారంతోపాటు పునరావాసంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని అధికారులు చెప్పడంతో కాలనీలో ఇళ్లు ఖాళీ చేసేందుకు కాలనీవాసులు అంగీకరించారు. 323 ఇళ్లు తొలగిస్తుండగా దుద్దికలోవలో రూ.వంద కోట్లతో 424 ఇళ్లు నిర్మించేందుకు 26 ఎకరాల భూమిని సేకరించారు. కొత్తగా మెలిక పెట్టారు... ఇప్పుడు కొత్తగా మెలిక పెట్టారు. ప్రభుత్వం నుంచి జీతాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఒక్కటే వర్తిస్తుందని, పునరావాసంలో ఇళ్లు, ప్రత్యేక ప్యాకేజీలు లభించవని స్థానిక అధికారులు చెబుతున్నట్టు బాధితులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని సొంతంగా చేపడతారా? ప్రభుత్వం నిర్మించాలా? అనేదానిపై సర్వే చేస్తున్న అధికారులు తమను సంప్రదించకపోవడంతో జాబితా నుంచి తమను తొలగించారంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. దీంతో 50 మంది వరకు బాధితులు సోమవారం పెద్దాపురం ఆర్డీఓ, బుధవారం తుని తహసీల్దార్ను కలసి విషయాన్ని విన్నవించారు. రాజకీయ నాయకులు జోక్యం వల్లే అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు ఇవ్వకపోతే కాలనీ ఖాళీ చేయమని, అవసరమైతే కాలువ తవ్వకాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిర్వాసితులకు పరిహారం మాత్రమే లభిస్తుందని తహసీల్దార్ బి.సూర్యనారాయణ అన్నారు. బాధితుల ఆందోళన, వినతి పత్రాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కూతురికి ఇల్లు ఇచ్చాను పెళ్లి సందర్భంలో కూతురికి కాలనీ ఇల్లు ఇచ్చాం. మరో చోట ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. కాలువ తవ్వకానికి ఆ ఇంటిని తొలగించనున్నారు. నష్టపరిహారం ఇచ్చారు. తమ పేరుతో రెండు ఇళ్లు ఉన్నందున పునరావాసంలో ఇల్లు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. – గేదెల ఎర్రియ్యమ్మ, బాధితురాలు పరిహారమే ఇచ్చారు పోలవరం కాలువ తవ్వకానికి కాలనీ ఇళ్లు తొలగిస్తామని అంటున్నారు. 2012లో తుపానుకు ఇల్లు కూలిపోయింది. పిల్లలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. నేను కూలిపోయిన ఇంటి స్థలంలో పూరిపాక కట్టుకున్నాను. దీనికి నష్ట పరిహారం ఇచ్చారు. పునరావాసంలో ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. – నాగం మాణిక్యం, బాధితురాలు, కుమ్మరిలోవ కాలనీ -
‘గూటి’ చుట్టూ గజిబిజే..
-‘అందరికీ ఇళ్లు’ పథకంలో తొలగని అయోమయం -స్పష్టత లేమితో వాయిదాల చెల్లింపులో లబ్ధిదారుల నిర్లిప్తత -గడువు రెండుసార్లు పెంచినా అంతంత మాత్రపు స్పందన -ఫ్లాటు రేటుపై విమర్శలతో మెట్టు దిగిన సర్కారు -టెండర్లు పూర్తయిన తర్వాత ధరల్లో మార్పులు మండపేట : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్న నానుడే.. ఆ రెండు కార్యాలూ ఎంత బరువుబాధ్యతలతో కూడినవో చెపుతుంది. అలాంటప్పుడు.. సర్కారు ‘ఇల్లు కట్టి ఇస్తాం’ అంటే సామాన్యులు, మధ్యతరగతి వారు ఎగిరి గంతేయాలి. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం’ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పథకం ఆదిలోనే అనేక సందేహాలకు నిలయంగా మారింది. ‘సరికొత్త టెక్నాలజీ’ అంటూ.. రియల్టర్ల బాటలో.. ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువగా ఫ్లాట్ రేటు ధర నిర్ణయించిన సర్కారు తొలి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సర్కారే భారీ దోపీడీకి రంగం సిద్ధం చేస్తుండటంపై ‘సాక్షి’ దినపత్రికలో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. నెలవారీ బ్యాంకు వాయిదాలపై స్పష్టత లేకపోవడం, షీర్వాల్ టెక్నాలజీపై ఆందోళన, మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపడం మొదలైన కారణాలతో తొలి విడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అభాసు పాలవుతున్న సర్కారు బ్యాంకు రుణం విషయంలో దిగి వస్తోంది. గత ప్రభుత్వాలు సెంటున్నర స్థలంలో ఇంటి కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తే, సొంతంగా కొంత మొత్తాన్ని వేసుకుని పేద వర్గాల వారు రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్లతో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ ప్రకారం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి ఇచ్చే రూ.3 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే సరికొత్త టెక్నాలజీ అంటూ సామాన్యుల దోపిడీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు సర్కారు. చదరపు అడుగుల పేరిట ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి, వసతుల భారాన్ని పేదలపైనే మోపజూసింది. అందుకోసం లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంకు రుణాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, 430 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాటుగా విభజించింది. జి ప్లస్-3 కింద జిల్లాలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. తొలి విడతగా రూ.1,457.62 కోట్లతో 19,242 ఫ్లాట్లు మంజూరు చేసింది. కాకినాడ నగర పరిధిలో 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరంలో 4,200, పెద్దాపురంలో 1,724, సామర్లకోటలో 1,048, రామచంద్రపురంలో 1,088, మండపేటలో 4,064, పిఠాపురంలో 874, అమలాపురంలో 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. ఇంతవరకూ వాయిదాలు కట్టింది 11,346 మందే.. అయితే ఆ కేటగిరీల్లోని ఫ్లాట్లకు ఎంత వరకూ బ్యాంకు రుణం చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకూ లబ్ధిదారులకు స్పష్టతను ఇవ్వడం లేదు. వసతుల భారాన్ని తమపైనే మోపడంపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తొలివిడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కేటగిరీ-1లో లబ్ధిదారుని వాటా రూ.500 ఒకే వాయిదాగా, రెండవ కేటగిరీలో లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు రూ.12,500లు చొప్పున నాలుగు విడతలుగా, కేటగిరీ-3లో లబ్ధిదారుని వాటా రూ.లక్షకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చెల్లించాలి. జూలై 20లోగా తొలి విడత వాయిదాలు చెల్లించాలని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గడువు జూలై 31 వరకు పొడిగించింది. అప్పటికి ఫలితం లేకపోవడంతో తాజాగా ఈ నెల 14 వరకు మరోమారు గడువిచ్చింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 11,346 మంది లబ్ధిదారులు మాత్రమే తొలి విడత వాయిదాలు చెల్లించారు. వీరిలో కేటగిరీ-1కు 3,413 మంది డీడీలు చెల్లించగా, కేటగిరీ-2కి 1,346 మంది, కేటగిరీ-3కి 6,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు రుణభారం తగ్గింపు.. సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ధర తగ్గించడం జరగదు. అయితే అధిక ధరలు నిర్ణయించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న సర్కారు దిగిరాక తప్పలేదు. ఆయా కేటగిరీల్లో లబ్ధిదారుని వాటా మాత్రం యథావిధిగా ఉంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన 40 రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్యాంకు నుంచి తీసుకునే రుణ భారాన్ని తగ్గించింది. వసతుల కల్పనకు ఫ్లాటుకు రూ.1.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఇటుకలతో ఇల్లు నిర్మిస్తే చదరపు అడుగు రూ.వెయ్యి వరకు మాత్రమే అవుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వాయిదాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. -
గోశాల షాపుల ‘గలీజు’
రూ. 15.72 లక్షలు గోల్మాల్ కమిటీ రద్దయినా నేటికీ దందా కొనసాగిస్తున్న సభ్యులు సభ్యులే బినామీల పేరుతో షాపుల కైవసం నెల అద్దె రూ 6500, కట్టేది రూ.1000 కాకినాడ రూరల్ : కాకినాడ జంతుహింస నివారణ సంఘంలో గో సంరక్షణ పేరుతో రూ. లక్షలకు లక్షలు దోచేశారు. గోవులపై వ్యాపారం చేస్తున్నారని, కమిటీని పూర్తిస్థాయిలో రద్దు చేసి, వారిపై విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం నేడు నిజమైంది. శనివారం సాయంత్రం ఆర్డీవో ఎల్.రఘుబాబు అధ్యక్షతన షాపుల లీజుదారుల సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. షాపు యజమానులు చెప్పే వివరణలు విన్న అధికారులు షాకయ్యారు. తాము ఒక్కొక్క షాపునకు నెలకు రూ. 6,500 చొప్పున పది నెలలు అడ్వాన్సుగా రూ. ఒక్కొక్కరు రూ. 65,000, నెలకు రూ. 6,500 చొప్పున అద్దె చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు రికార్డులను పరిశీలించగా ఒక్కొక్క షాపునకు నెలకు కేవలం రూ. వెయ్యి వంతున మాత్రమే చెల్లించినట్టు నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. దాదాపుగా లీజుల పేరుతో రూ. 15.72 లక్షలు గోల్మాల్ అయ్యిందని అధికారులు గుర్తించారు. లీజు పేరు రద్దయిన కమిటీ సభ్యులు షాపుల యజమానులపై దందాలు కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కమిటీలో ఎవరైనా షాపు యజమానులను బెదిరించి లీజు రూపంలో డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో రఘుబాబు హెచ్చరించారు. ఇటీవల గోవులు మృత్యువాత సంఘటన నేపథ్యంలో కలెక్టర్ కార్తికేయమిశ్రా పాత కమిటీని రద్దు చేసి కొత్తగా కమిటీ చైర్మన్గా ఆర్డీవో ఎల్ రఘుబాబును నియమించిన సంగతి తెలిసిందే. గో సంరక్షణకు వీలుగా చర్యలు తీసుకునే భాగంగా ఆర్డీవో షాపులను లీజులకు తీసుకున్న లీజుల గో సంరక్షణకు నిధులు పేరుతో 12 షాపులతో ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్ను నిర్మించారు. గో సంరక్షణ ఎలా ఉన్నా, దానిపై పెత్తనం చెలాయించే నాయకులకు మాత్రం ఈ కాంప్లెక్ బంగారు బాతుగా మారింది. నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులే షాపులను వ్యాపారాలకు తీసుకొని, మళ్లీ బినామీల పేరుతో మరొకరు వ్యాపారం చేసుకునేందుకు ఇచ్చేశారు. వారి నుంచి పదిరెట్లు డబ్బులు వసూలు చేసి దోచేశారు. గోవుల మృత్యుఘోష సమయంలో ప్రజలు నుంచి కమిటీపై దుమారం వచ్చినా అధికారులు పెద్దగా స్పందించలేదు. తరువాత కలెక్టర్ మిశ్రా స్వయంగా జంతు హింస నివారణ సంఘాన్ని పరిశీలించి కమిటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 13 మంది సభ్యులపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరి నుంచి షాపులు లీజు రూపంలో దోచేసిన సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రస్తుతం జంతు హింస నివారణ సంఘంలో 123 గోవులు ఉన్నాయని, వీటిలో రెండు పశువులు నీర్సంగా ఉండడంతో వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీవో రఘుబాబు వివరించారు. ఎవరైనా పశువులకు దానా రూపంలోనే విరాళాలు అందజేయాలని సూచించారు. ఎవరు ఏమీ ఇచ్చినా వాటికి సంబంధించి రశీదు పొందాలన్నారు. ప్రస్తుతం ఉన్న గోవుల సంరక్షణకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. షాపులకు సంబంధించిన లీజులను కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇకపై గతంలో లీజులు తీసుకున్న వారిని తొలగిస్తామని, నేరుగా షాపు యజమానులకే లీజు కేటాయించి, ఆ సొమ్ములను నెల, నెలా జంతుహింస నివారణ సంఘం పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకమా.. పర్సంటేజీలా..!
చైర్మన్ నవీన్ మొగ్గు ఎటువైపన్న దానిపైనే అందరి నిరీక్షణ చర్చనీయాంశమైన జెడ్పీ సీసీ పోస్టింగు సీటు కోసం ఎవరి పైరవీలు వారివి భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్లో ఏ ఫైలు కదలాలన్నా, బదిలీలు కావాల్సిన చోటుకి రావాలన్నా, పెన్షన్లు, పీఎఫ్ ఫైళ్లు, ఉపాధ్యాయులు డిప్యుటేషన్లు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, జెడ్పీ నుంచి విడుదలయ్యే కోట్ల రూపాయల నిధులు, వాటి పర్సంటేజీలు, జెడ్పీ ఆస్తులు, ఆదాయాలు వీటన్నింటిపై చక్రం తిప్పే సీటు జెడ్పీలో ఏదైనా ఉందంటే అది జెడ్పీ చైర్మన్ సీసీ పదవే. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా జ్యోతుల నవీన్ ఎంపికైన తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న గత జెడ్పీ చైర్మన్ నామన సీసీ ప్రసాద్ మాతృస్థానానికి వెళ్లారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుత చైర్మన్ సీసీగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది. గతంలో వంగా గీతావిశ్వనాథ్ నుంచి సీసీగా అనేక పర్యాయాలు పనిచేసిన ప్రణాళికా విభాగానికి చెందిన హరికృష్ణ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే నామనకు సీసీగా వ్యవహరించిన ప్రసాద్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జెడ్పీలో పనిచేసి ఆర్అండ్బీకి బదిలీపై వెళ్లిన సత్యనారాయణమూర్తి సైతం ఒకే సామాజిక వర్గ సమీకరణాలతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. సామాజిక వర్గమా.. అనుభవమా..! కీలకంగా మారిన ఈ పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్గీయులకే చైర్మన్ నవీన్ కట్టబెడతారో లేక పర్సంటేజీలలో అనుభవమున్న వ్యక్తులకు ఇచ్చి కలెక్షన్లకు తెరదించుతారోనని చర్చ మొదలైంది. నవీన్ సమావేశాల్లో ఆది నుంచీ రెండేళ్ల పాలనలో జెడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని పెంచుతానని, పర్సంటేజీల పాలనకు స్వస్తి పలికి నీతి నిజాయతీలతో పీఠానికి గౌరవం తెస్తానని అంటున్నారు. ఆయన మాటలు కేవలం సమావేశాలకే పరిమితమా లేక కార్యరూపంలో పెడదారా అన్న సందేహం అందరిలో మొదలైంది. ఉద్యోగుల్లో ఉన్న యూనియన్ల దృష్ట్యా ఏ సంఘం వారికి ప్రాధాన్యం ఇస్తారో ఆయా సంఘాల సభ్యులంతా వేచి చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సందేహాలు నివృత్తి కానున్నాయి. రెండు రోజుల్లో సీసీ నియామకం జరుగుతుందని, పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని, జిల్లా పరిషత్లో గ్రీవెన్స్తో సహా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చైర్మన్ నవీన్ ప్రకటించారు. -
ఎయిడెడ్ పోస్టుల దందా
పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్న దళారులు మోసపోవద్దుంటున్న విద్యాశాఖాధికారులు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అ«ధ్యాపక పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టుకు రూ.10 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం మీకే..సరేనండి ఇదిగో రూ.10 లక్షలు అంటూ కొందరు. ఇప్పుడు అంత ఇవ్వలేనండి రూ.5 లక్షలు ఇస్తున్నాను మిగతావి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాను అని మరికొందరు. ఆ సొమ్ముతేవడానికి అప్పులు చేసి కొందరు, ఇంట్లో బంగారునగలు, ఉన్నవి అమ్మి మరికొందరు పరుగులు మీద తెచ్చి లక్షల సొమ్ములు ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో దళారులు చేస్తున్న ఎయిడెడ్ పోస్టుల దందా. -కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) ఇదీ పరిస్థితి జిల్లాలో 45 హైస్కూల్స్ ఉండగా వాటిలో 774 పోస్టులు ఉండేవి. వాటిలో ప్రస్తుతం 300 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీ, ఎలిమెంటరీ స్కూల్స్ 100 వరకూ ఉండగా వాటిలో 529 ఉపాధ్యాయులు పని చేసేవారు. ప్రస్తుతం 310 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 210 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న ఈ పోస్టులు 15 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండగా వాటిని 2004 అక్టోబర్ నుంచి భర్తీని బ్యాన్ చేశారు. తర్వాత 2005లో ఎయిడెడ్ సిబ్బంది కోర్టుకెళ్లారు. స్కూల్స్లో బోధకులు లేకపోవడంతో విద్యార్థులు ఉండడం లేదు, తాత్కాలిక పోస్టుల భర్తీ చేయాలంటూ పోరాటల ఫలితంగా 2013లో కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో తాత్కాలిక ప్రాతిపదికన ఎయిడెడ్ యాజమాన్యమే జీతాలు ఇచ్చుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తునే ఉంది. కొందరు బోధకులు అవసరం కావడంతో జీవో నెంబర్ 1 ప్రాతిపదికన బోధకులను నియమించుకున్నారు. ఈ బ్యాన్ను 30.6.2017న లిప్ట్చేసింది. అంతే....ఎయిడెడ్ పోస్టుల భర్తీ జరుగుతున్నాయి. లక్షలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీకే అంటూ దళారులు దందా ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది అమాయకులు లక్షల రూపాయలు వారి చేతుల్లో పోసారు. దీనిపై విషయం తెలిసినా విద్యాశాఖ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఆ పోస్టులు ఏమిటి, ఎవరిని భర్తీ చేయాలనే దానిపై సమాచారం ఇస్తే అభాగ్యులు మోసపోయేవారు కారేమో. ఇలా మోసపోయిన కొందరు ‘సాక్షి’వద్దకు వచ్చి తమ బాధను తెలిపారు. తాము మోసపోయామని తెలిపారు. దీనిపై విద్యాశాఖ, ఎయిడెడ్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే పలు విషయాలను వివరించారు. ఏ పోస్టుల భర్తీ జరుగుతుంది? కోర్టు ఉత్తర్వుల మేరకు 2002 నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నేరుగా రెగ్యూలర్ అవుతుంది. ఆ తర్వాత కోర్టు 2013 ఇచ్చిన తీర్పుననుసరించి తాత్కాలికంగా జీవో నెంబర్ 1 ప్రాతిపదికన యాజమాన్యం జీతాలు ఇస్తూ భర్తీ చేసుకున్న తాత్కాలిక బోధకులకు ఫైవ్ మెన్ కమిటీతో ఇంటర్వూలు నిర్వహించి వారిని రెగ్యులర్ చేయాలి. ఇప్పటికే ఆ పక్రియ రాష్ట్ర కేంద్రంగా గుంటూరులో ప్రారంభమైంది. అయితే ఈ పక్రియలో ప్రథమంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీలను గుర్తించి రేషనలైజ్ చేయాలి, దీంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి, అంతే తప్ప ఎయిడెడ్ విద్యాసంస్థల్లో కొత్తవారికి ఉద్యోగాలు అనే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ పోస్టులు 2002 ముందు, 2013 తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే. మోసపోవద్దు ఎయిడెడ్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెపితే ఎవరూ నమ్మవద్దు. ఇది అంతా మోసం. కొత్తవారిని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియమించే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ విధానం ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై కొందరు లక్షల సొమ్ము గుంజుతున్న సమాచారం వచ్చింది. దళారులకు సొమ్ములు ఇచ్చి ఎవ్వరూ మోసపోవద్దు. -–ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే కోర్టు తీర్పునిచ్చింది డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే. అయితే కొందరు ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని వచ్చి సొమ్ములు గుంజుతున్నారు. ఇదంతా మోసం. ఎవరూ నమ్మవద్దు. సొమ్ములు పొగొట్టుకోవద్దు. –బి.చిట్టిబాబు, ఏపీ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు -
ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
- సొమ్ములు కట్టినా ఎదురుచూపులే.. - పీఎంఏవైలోనూ అర్హులకు మొండిచెయ్యి - సిఫారసులకు, పచ్చచొక్కాలకే గృహయోగం కాకినాడ : ‘అర్హత’కు ప్రాతిపదిక ఏమిటి? పేదరికమా? అధికార పార్టీ జెండా పట్టుకోవడమా? ప్రభుత్వం మారిపోతే అర్హులు ‘అనర్హులు’గా మారిపోతారా? జిల్లా కేంద్రం కాకినాడలో అర్హత కలిగిన గృహనిర్మాణ లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇల్లు మంజూరు చేస్తామంటే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వేలాది రూపాయలు అప్పులు చేసి, ప్రభుత్వానికి చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏడెనిమిదేళ్లుగా ఇల్లు మంజూరవుతుందని వెయ్యి కళ్లతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఐహెచ్ఎస్డీపీ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దీనికి దాదాపు 1,750 మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ములు కూడా చెల్లించారు. వీరిలో తొలివిడతగా అప్పట్లో 816 మందికి ఏటిమొగ, పర్లోపేట ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మందీ ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.86 వేల వరకు డీడీలు తీసి అప్పట్లోనే గృహనిర్మాణ శాఖకు అందజేశారు. అలా వీరంతా చెల్లించిన రూ.3 కోట్ల వరకు సొమ్ము గృహనిర్మాణ శాఖలో మూలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం కుంటుపడడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక సొంతింటి ‘కలే’నని లబ్ధిదారులు డీలా పడుతూ వచ్చారు. ఇళ్లు ఎప్పుడు మంజూరైనా సొమ్ములు కూడా చెల్లించిన తమకే ప్రాధాన్య క్రమంలో ముందుగా అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎంఏవైలో మొండిచెయ్యి ‘అందరికీ ఇళ్లు’ పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితమే వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లబ్ధిదారులను పక్కన పెట్టి పచ్చచొక్కాలతో కూడిన జాబితా బయటకు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా 4,600 ఇళ్లు మంజూరైనా పాత జాబితాలో ఉన్న చాలామందికి చోటు దక్కకకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. పారదర్శకత ఏదీ? పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా తీసుకుని రాజకీయాలకు దూరంగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను కూడా సమన్వయం చేసుకుని అర్హులకు ఇళ్లు దక్కేలా కృషి చేశారు. ప్రస్తుతం అలాంటి విధానానికి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు చక్రం తిప్పి సొంత పార్టీ కార్యకర్తలకు, సొమ్ములు ఇచ్చినవారికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా చేసుకుపోవడంతో అర్హులకు మొండిచెయ్యే మిగిలింది. గ్రీవెన్స్సెల్ ఎందుకూ? కలెక్టరేట్లో గ్రీవెన్స్సెల్కు నిత్యం ఎంతోమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తే ఇక గ్రీవెన్స్సెల్ వల్ల ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుని డబ్బులు కూడా కట్టినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ న్యాయం చేయాలి ఏడేళ్ల క్రితం ఇంటికోసం దరఖాస్తు చేశా. రూ.26 వేలు డీడీ కూడా తీసి ఇచ్చా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు వస్తుందని ఎంతో ఎదురు చూసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి. - టి.సత్యనారాయణ, లబ్ధిదారు నచ్చినవారికి ఇస్తున్నారు గృహనిర్మాణాల్లో అర్హత కలిగిన పాత లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి. వేలకు వేలు అప్పులు చేసి సొమ్ములు కట్టాం. తీరా ఇళ్లు వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టి నచ్చినవారికి ప్రాధాన్యం ఇనిస్తున్నారు. - బి.వెంకటలక్ష్మి, లబ్ధిదారు వడ్డీలు కట్టలేకపోతున్నాం ఇల్లు వస్తుందని మూడు విడతలుగా రూ.83 వేలు ప్రభుత్వానికి చెల్లించాను. అప్పులు చేసి కట్టడంతో టైలరింగ్ వృత్తిపై ఆధారపడుతున్న నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి, ఇళ్లు మంజూరు కాని పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి. - వాయివాడ రమణ, లబ్ధిదారు -
కామినేనీ ... కానరాలేదా...
నవమాసాలు పెంచి ... పురుటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఆ బిడ్డ కన్నుమూస్తే ... ఆ కన్నతల్లికి ఏదీ ఊరడింపు...? . తొమ్మిది నెలలు అమ్మ గర్భంతో అనుబంధం పెంచుకొని పేగు తెంచుకొని బాహ్య ప్రపంచంలోకి బయటపడిన రోజుల్లోనే ... అమ్మ ఒడి చవిచూడకుండానే... ఆ తల్లి కన్నుమూస్తే... ఆ బిడ్డకు రక్షణేదీ...? . పౌష్టికాహారలోపం... వాతావరణ కాలుష్యం... దోమల స్తైర విహారం... రక్త హీనత ... కారణాలేమైతేనేం అనుబంధాలు...ఆత్మీయతలు అంతలోనే అదృశ్యమైతే ఆ పాపం ఎవరిదీ...? ప్రశ్నిస్తోంది గిరిజనం . పాలకుల పరామర్శల సాక్షిగా చావులు నిజం... ముసురుతున్న దోమల సాక్షిగా మలేరియా లేదట...! లెక్కలు పక్కాగా చెబుతున్నా... పక్కతోవ పట్టించే యత్నం... ఇదేమి విచిత్రం... -
బాలలు కిలకిలలాడే చోట.. గ్లాసుల గలగలలా?
-నివాసప్రాంతాల్లో నిషా అంగళ్లా? –ససేమిరా సహించబోమంటున్న జనం –జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ కొనసాగిన ఆందోళనలు –ఉద్యమించిన మహిళలను అరెస్టు చేసిన కరప పోలీసులు –కామనగరువులో బ్రాందీషాపును ముట్టడించిన విద్యార్థులు –దుకాణాల ఏర్పాటుకు అనువుగా ఎండీఆర్ రోడ్లుగా రాష్ట్ర రహదారుల మార్పు –ఈ పరిణామంతో జనం మరింత భగ్గుమనే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : పిల్లాపాపల కిలకిలలు ప్రతిధ్వనించే తావుల్లో మందుగ్లాసుల గలగలలను సహించబోమన్న జనాగ్రహం రగులుతూనే ఉంది. ముంగిళ్లలో ముగ్గులు, లోగిళ్లలో మర్యాదమన్ననలకు పెద్దపీట వేసే మనుషులు ఉండే నివాసప్రాంతాల్లో నిషా దుకాణాలు ఏర్పాటు చేసే అనాగరిక వ్యాపార వైఖరిపై నిరసన గళం మార్మోగుతూనే ఉంది. బడి, గుడి గంటల సవ్వడి గాలిలో తేలివచ్చే చోట తాగుబోతుల ప్రేలాపలను ఎంత మాత్రం వినబోమన్న సమరభేరితో దిక్కులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. ఇళ్ల మధ్య, గుడులు, బడుల చేరువలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనం రోడ్లెక్కుతూనే ఉన్నారు. కొత్త మద్యం పాలసీ (2017–19) ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా వేలంలో పాడుకున్న వారు మద్యం దుకాణాల ఏర్పాటుకు సంసిద్ధులయ్యారు. అయితే జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని తొలిరోజు నుంచీ జిల్లాలో పలుచోట్ల స్థానికులు ముఖ్యంగా మíßహిళలు, యువకులు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. జిల్లాలో 545 దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా ఈసారి 534 దుకాణాలు లాటరీలో వ్యాపారులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ జిల్లాలో 175 దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇళ్ల మధ్య, పాఠశాలలు, దేవాలయాలకు సమీపంలో ఉన్న దుకాణాలను తొలగించాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. బుధవారం రాజమహేంద్రవరంలోని జాంపేట మార్కెట్ ఎదురుగా ఇళ్ల మధ్యలో, మసీదుకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని 31వ డివిజన్ కార్పొరేటర్ మజ్టి నూకరత్నం, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ముస్లిం నేత మున్నా మహిళలు, స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏవీ అప్పారావు రోడ్డులో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మహిళలు బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో మద్యం షాపు ఏర్పాటుతో గ్రామ మహిళలు, స్థానికులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. ఆలమూరులో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, గ్రామస్తులు ధర్నా చేశారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడించి, తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ పోలీస్స్టేషన్కు వీరలక్ష్మి తదితరులు కరప మండలం వేళంగిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలను పెడచెవిన పెట్టి మంగళవారం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ మహిళలు, సీఐటీయూ జిల్లా సెక్రటరీ ఎం.వీరలక్ష్మి తదితరులు మంగళవారం రాత్రి వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పోలీసులు వీరలక్ష్మిని, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కరప పోలీస్ స్టేషన్కు తరలిచారు. గ్రామస్తులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్ట్ చేసిన వారిని కాకినాడ పోలీస్స్టేషన్కు తరలించారు. దుకాణం 20 రోజుల్లో తొలగిస్తామని పెద్దల సమక్షంలో దుకాణ యజమానులు అంగీకరించడంతో నిరసన విరమించారు. పిఠాపురం మండలం కందరాడ రాజీవ్కాలనీ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత మహిళలు ఆందోళనకు దిగారు. పిఠాపురం రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఆది నుంచీ ఆగ్రహాగ్నే.. ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఒకటి నుంచి జిల్లాలో పలు చోట్ల స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముమ్మిడివరం బాలయోగి తపోవనం చేరువలో మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళనలు చేశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి బొమ్మిడిపాలంలో, అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామాల్లో మద్యం దుకాణాలు తీసేయాలని గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఆలమూరు మండలం చింతలూరు, చొప్పెళ్ల, రావులపాలెం సీఆర్పీ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు మద్యం దుకాణాలను తొలగించాలంటూ వాకర్స్, స్థానికులు ధర్నాలు చేశారు. రామచంద్రపురం రూరల్ తాళ్లపొలంలో, కె.గంగవరం మండల కేంద్రంలో మద్యం షాపు వద్దంటూ మహిళలు ఉద్యమించారు. సామర్లకోట 22వ వార్డులో ప్రైవేటు స్కూల్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటుచేయవద్దంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేశారు. మండల కేంద్రాలైన కొరుకొండ, సీతానగరంలలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కాగా, మంగళవారం నగరపాలక, పురపాలక సంఘాలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్పు చేయడంతో మిగిలిన 369 దుకాణాల ఏర్పాటుకు అవకాశం వచ్చింది. ఇందులో జాతీయ రహదారిపై ఉన్న 36 దుకాణాలు కూడా వాటికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసే వీలుంది. ఆ రకంగా ఇవి ఇళ్ల మధ్యకూ వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
పంచాయతీ తేల్చేదెవరు..?
- కృష్ణా జలాలపై పట్టింపు లేని కేంద్రం, బోర్డు - నేడు హైదరాబాద్కు కృష్ణా బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల నీటి వినియోగ విధివిధానాల ఖరారుపై అటు కేంద్ర జల వనరుల శాఖ, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. వాటర్ ఇయర్ ఆరంభమై నెల రోజులు ముగిసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వినియోగ విధానంపై సమన్వయం చేయకుండా చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్లో పదేళ్ల కనిష్టానికి నీటి మట్టాలు చేరుకున్న దృష్ట్యా తెలంగాణ శ్రీశైలం నుంచి నీటి విడుదల కోరుతున్నా, పట్టిసీమ వాటా తేల్చాలంటున్నా కేంద్రం, బోర్డులు మౌనాన్నే పాటిస్తున్నాయి. నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే ఎగువ శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ గత నెలలో మూడు మార్లు కృష్ణా బోర్డుకు విన్నవించినా ఫలితం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని పంపింగ్ చేసేందుకు సాగర్లో 502 అడుగుల నీటి మట్టాలు ఉండాలని, అయితే ప్రస్తుతం సాగర్లో మట్టం 501.6 అడుగులకు పడిపోయిందని తెలిపినా బోర్డు, ఈ విషయాన్ని ఏపీకి తెలియజేసి వారి అభిప్రాయం కోరడం తప్ప ఏం చేయలేకపోయింది. మూడు సార్లు ఫిర్యాదు చేయగా, దీనిపై ఏపీ తేల్చనప్పుడు తామేం చేయాలంటూ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తెచ్చింది. అయినా సమస్య మాత్రం అలాగే ఉండి పోయింది. సమన్వయ సమావేశాలెప్పుడు? ఇక ప్రతి ఏటా వాటర్ ఇయర్ జూన్ నుంచి మరుసటి ఏడాది జూన్వరకు నీటి వినియోగ ముసాయిదాను ఖరారు చేసుకోవాల్సి ఉం టుంది. ముసాయిదా ఖరారుకు సంబంధిం చి కేంద్ర జలవనరుల శాఖ ఏటా జూన్ లోనే ఇరు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాలకు పరిష్కారం చూపుతూ వస్తోంది. గత ఏడాది జూన్ 21, 22 తేదీల్లోనే సమన్వయ సమావేశాలు పెట్టి ము సాయిదా ఖరారు చేసింది. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు దీనిపై కదలిక లేదు. గత ఏడాది ముసాయిదానే కొనసాగించాలని తెలంగాణ, చిన్నపాటి మార్పులు చేయాలని ఏపీ బోర్డుకు ఇప్పటికే తెలియజేసినా, తమ స్పందన ఏంటన్నది బోర్డు, కేంద్రం తెలు పడం లేదు. ఇక పట్టిసీమతో గత ఏడాది ఏపీ చేసిన వినియోగం 53 టీఎంసీల్లో వాటాలపై ఎటూ తేల్చని కేంద్రం, బోర్డులు ఈ ఏడాది తిరిగి ఏపీ పట్టిసీమతో వినియోగం మొదలుపెట్టినా పట్టించుకోవడం లేదు. ఈ అన్ని అంశాలపై ముందుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలా? లేక నేరుగా కేంద్రం వద్దే సమావేశం ఏర్పాటు చేయాలా అన్న దానిపైన ఇంతవరకు స్పష్టత రాలేదు. కాగా, గత కొన్ని వారాలుగా ఢిల్లీలో ఉన్న కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చాక బోర్డు లేక కేంద్రం వద్ద సమావేశాలపై స్పష్టత వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
నిబంధనలు బేఖాతరు
వివాదాల నడుమ వైన్ షాపుల లైసెన్సులు కొన్ని చోట్ల గుడి, బడి సమీపంలోనే షాపులు తెలుగు తమ్ముళ్లకు వర్తించని నిబంధనలు రాజమహేంద్రవరం క్రైం : వివాదాల నడుమ బ్రాందీ షాపులకు లైసెన్సుల మంజూరు జరిగింది. బ్రాందీ షాపులకు జూన్ 30తో గడువు ముగిసి జూలై 1 నుంచి కొత్తగా లైసెన్స్లు తీసుకున్న వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 534 బ్రాందీషాపులకు, 42 బార్లు, స్టార్ హోటళ్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఆదివారానికి జిల్లాలో 175 బ్రాందీ షాపుల యజమానులు, 3 బార్లకు లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా బ్రాందీ షాపులు లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నాయి. తీసుకున్న కొన్ని షాపులతో పాటు, పాత బ్రాందీషాపులకు కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి, హాస్పటల్స్ చూడకుండా ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు ఇవ్వడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులకు లైసెన్సులు మంజూరు చేయాలంటే దేవాలయాలు, పాఠశాలలు, హాస్పటల్స్, జాతీయ నాయకుల విగ్రహాలకు 100 మీటర్ల దూరంలో ఇవ్వాలి. దీనితో పాటు స్థానికుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులు స్థానికుల అనుమతులు తీసుకోకుండానే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి అనుమతి ఉందని ఎక్సైజ్ అధికారులను నమ్మిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే బ్రాందీషాపులకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన తరువాత స్దానికులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా షాపులు తొలగించడం లేదు. చేసేది లేక బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. రామమందిరం సమీపంలో బ్రాందీ షాపు కొత్తగా ఇచ్చిన బ్రాందీషాపుల లైసెన్సులలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం, ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో కోదండరామ దేవాలయం సమీపంలో దేవసాయి వైన్స్కు అనుమతి ఇచ్చారు. ఈ షాపులు ఏర్పాటు చేయడానికి స్థానిక కోదండరామ దేవాలయం కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అయినా షాపు యథాతథంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గతంలో జాంపేట మార్కెట్ వద్ద ఉన్న పీఎస్ వైన్స్ ఏర్పాటులో స్థానిక ముస్లిం కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా స్థానికుల అభ్యంతరాలు పక్కన పెట్టి మళ్లీ ఎక్సైజ్ అధికారులు లైసెన్సును మంజూరు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాందీషాపును తరలించాలని పోరాటం చేస్తుంటే ఏటా షాపునకు లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. దానవాయిపేటలోని చిన గాంధీ బొమ్మ వద్ద ఎస్వీఎస్ వైన్స్ ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదురుగా బ్రాందీషాపు ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేసినా ఎక్సైజ్ అధికారులు తిరిగి మళ్లీ లైసెన్సులు ఇచ్చి నిబంధనలు తుంగలో తొక్కారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన లైసెన్సులపై వివాదాలు వ్యక్తమవుతున్నాయి. -
అదును దాటుతున్న ఖరీఫ్
- మృగశిరలో అందని నీరు - ఆరుద్ర రాకతో మరింత ఆలస్యం - ఇప్పుడు నాట్లు వేస్తేనే తుపాన్ల సమయంలో చేతికి వచ్చేది - శివారులో పునర్వసులోనే నారుమడులు అమలాపురం : ఆరుద్ర... డెల్టాలో ఏరువాకకు పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. పంట తుపాన్లు సమయంలో చేతికి వచ్చే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నారువేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. అయితే ముందస్తుగా మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసులో నారుమడులు వేయడం జిల్లాలో డెల్టాలో ఖరీఫ్ రైతులకు పరిపాటి. ఈసారి కూడా మృగశిరలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే పునర్వసులో నారువేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాడి కూడా ఖరీఫ్ ఆలస్యం కానుంది. గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆదునుదాటుతోంది. ముందస్తు ఖరీఫ్కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలానే సాగునీరు పొలాలకు ఆలస్యంగా విడుదల చేయడంతో సాగులో జాప్యం చోటుచేసుకుంటోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా..ఆధునికీకరణ, నీరు–చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్టు వేస్తూ 20వ తేదీ వరకు పొలాలకు అందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు కాగా ఇప్పటి వరకు 60 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదు. మృగశిర ఈ నెల 21 వరకు ఉన్నా ఆ సమయంలో నీరందక రైతులు నారుమడులు ఆలస్యం చేశారు. 22 నుంచి ఆరుద్ర మొదౖలై జూలై ఏడు వరకూ ఉంది. ఐదు నెలల పంట కాలం కావడం వల్ల ఈ సమయంలో నారు మడులు వేస్తే అక్టోబరు నెలఖారు నుంచి నవంబరు 15 మధ్య చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, తరువాత తుపాన్లు కారణంగా పంట నష్టపోవడం డెల్టాలో శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే జూలై మొదటి వారం తరువాత నారుమడులు వేయనున్నారు. అదే జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు వేసే అవకాశం ముంది. ఇదే జరిగితే రబీ ఆలస్యం కావడం, మూడో పంట అపరాలు లేకుండా పోనుంది. ఎగువున కొంతవేగం... – తూర్పుడెల్టాలో అనపర్తి సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో మూడుశాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల వద్ద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. – ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడగా, నాట్లు పది శాతం మాత్రమే అయ్యాయి. – మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంత వరకు నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు పడలేదని అంచనా కాగా, కేవలం 30 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. శివారులో మరింత ఆలస్యం... – తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం నియోజకవర్గం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. – సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం మాత్రమే నారుమడులు పోశారు. – కరప, కాకినాడ మండలాల్లో 28,700 ఎకరాలు ఆయకట్టు ఉండగా, ఇక్కడ నాట్లు ఆరంభం కాలేదు. ఇక్కడ సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. – మధ్యడెల్టాలోని సబ్ డివిజన్ల వారీగా చూస్తే పి.గన్నవరం 14,900 ఎకరాలకుగాను, 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకు గాను 25 శాతంచ రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు వేయలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. -
‘అందరికీ’ అయోమయం
- అందరికి ఇళ్ల పథకంలో కొరవడిన స్పష్టత - చదరపు అడుగు ధరల్లో వ్యత్యాసాలు - తాత్కాలికమంటూ చదరపు అడుగు రూ. 2,150 నుంచి రూ.1,925లకు తగ్గింపు - మున్ముందు పెంచేందుకే ‘తాత్కాలికమని’ అనుమానాలు - షీర్వాల్ టెక్నాలజీ పేరుతో సదుపాయాల కల్పన పేదలపైనే - ఒక్కొక్కరిపై రూ.1.4 లక్షలు అదనపు భారం - జిల్లాలోని తొలివిడత లబ్ధిదారులపై రూ.269.39 కోట్ల భారం - విశాఖలో ప్రైవేటు సంస్థ ప్లాటు చదరపు అడుగు ధర రూ.1,050లే. మండపేట : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఎండీగా ఉన్న కనస్ట్రక్షన్ సంస్థ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్లాటులో చదరపు అడుగు ధర (స్థలం కాకుండా) రూ.1,050. ఈ మేరకు పేదవర్గాల వారికి ప్రభుత్వం నిర్మించే ప్లాట్లలో చదరపు అడుగు ధర ఇంతకన్నా తక్కువ ఉండాలి. అయితే అందరికీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం చదరపు అడుగుకు నిర్ణయించిన ధర రూ. 1,925లు. షీర్వాల్ టెక్నాలజీ అంటూ స్థానిక స్థితిగతులకు తగని విధానంలో ప్లాట్ల నిర్మాణం చేయడంతోపాటు సదుపాయాల కల్పన భారాన్ని పేదలపై మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదవర్గాల వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘అందరికి ఇళ్ల పథకం’లో ధరల వ్యత్యాసం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో నిర్ణయించిన చదరపు అడుగు ధరను ‘తాత్కాలికం’ పేరిట స్వల్పంగా తగ్గించి లబ్ధిదారులతో అంగీకార పత్రాలను తీసుకుంటోంది. సదుపాయాల కల్పన భారాన్ని ప్రజలపైనే మోపుతోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారునిపై రూ.1.4 లక్షలు చొప్పున జిల్లాలోని తొలివిడతలో నిర్మించనున్న 19,242 మందిపై దాదాపు రూ. 269.39 కోట్లు భారాన్ని మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల వారి ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు 24,332 మంజూరు చేసింది. కాకినాడ నగర పాలక సంస్థకు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200 ప్లాట్లు మంజూరు చేయగా, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్లు నిర్మాణానికి రూ.1,457.62 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ధరలు తాత్కాలికమేనా ? అందరికి ఇళ్ల పథకంలో ప్లాటు ధరలపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ‘తాత్కాలికం’ పేరిట మూడు కేటగిరీల్లో చదరపు అడుగుకు రూ. 80లు నుంచి 100లు వరకు తగ్గించింది. ఈ మేరకు గతంలో రూ. 2,150 ఉన్న చదరపు అడుగు ప్రస్తుతం 1,925లకు తగ్గింది. గతంలో రూ. 6.46 లక్షల వ్యయంతో 300 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్రూం ప్లాటు, రూ. 7.8 లక్షలతో 365 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్ రూం ప్లాట్, రూ.9.14 లక్షలతో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూం ప్లాటు చొప్పున మూడు విభాగాలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఆయా విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల రూపంలో లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం 300 అడుగుల ప్లాటును రూ. 5.77 లక్షలకు, 365 చదరపు అడుగుల ప్లాటు రూ. 6.94 లక్షలు, 430 అడుగుల ప్లాటుకు రూ. 8.14లుగా ధర నిర్ణయించింది. సబ్సిడీలు షరామామూలే. ఇది తాత్కాలికమేనని లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న అంగీకార పత్రంలో పేర్కొనడం గమనార్హం. మండపేట పట్టణంలో 4,064 ప్లాట్లు నిర్మాణానికిగాను ఇటీవల గొల్లపుంతకాలనీలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజ చేశారు. ప్రస్తుత ధర తాత్కాలిక ధరగా అంగీకార పత్రంలో ఉండటంతో భవిష్యత్తులో ఈ ధర పెరిగే అవకాశముందని లబ్ధిదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల్లో స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రూ. 269.39 కోట్లు భారం... ప్రస్తుతం ప్లాట్ల నిర్మాణ పనులకుగాను జిల్లాలోని ఆయా ఏరియాలను బట్టి చదరపు అడుగుకు రూ.1600లు వరకు ధర నిర్ణయించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చదరపు అడుగులోని మిగిలిన మొత్తం మౌలిక వసతుల కల్పన కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. డబుల్ బెడ్రూం తీసుకున్న లబ్ధిదారునిపై వసతుల కల్పన రూపంలో రూ.1.4 లక్షలు భారాన్ని మోపుతోంది. జిల్లాలో 90 శాతం మందికి పైగా డబుల్ బెడ్ రూం ప్లాటు కోరుకోగా తొలివిడతలో నిర్మిస్తున్న 19,242 మంది లబ్ధిదారులపై దాదాపు రూ. 269.39 కోట్లు భారం పడుతుందని అంచనా. తాత్కాలిక ధర పెరిగితే ఈ భారం మరింత పెరగనుంది. -
గురువుల్లో గందరగోళం
- రోజురోజుకూ మారుతున్న బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ - పాయింట్ల కేటాయింపులో అస్పష్టత - లోపభూయిష్ట విధానాలపై ఉపాధ్యాయుల అసంతృప్తి - ఇంకా పూర్తికాని రేషనలైజేషన్ ప్రక్రియ రాయవరం (మండపేట) / రామచంద్రపురం రూరల్ : ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్.. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటు.. వీటికితోడు ఇప్పుడు బదిలీల ప్రక్రియ.. పాఠశాలలు పునఃప్రారంభమైన అనంతరం ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ రోజురోజుకూ మారుతోంది. ఈ షెడ్యూల్, ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండడంతో అయ్యవార్లు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడికి, 23న సచివాలయం దిగ్బంధానికి ఉపాధ్యాయ ఉమ్మడి సంఘాల కార్యాచరణ వేదిక జాక్టో ఇప్పటికే పిలుపునిచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఏం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొందని ఉపాధ్యాయ నేతలు అంటున్నారు. దీనికి బదులు సాధారణ కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించాలని, దీనివల్ల ఉన్న ఖాళీల్లో తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉపాధ్యాయులకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సలహాలు, సంప్రదింపులతో ఉపాధ్యాయుల మధ్య కొంతమేర సర్దుబాటు చేసుకునే వెసులుబాబు కూడా ఉంటుందని సూచిస్తున్నారు. సరికొత్త సమస్యలు - బదిలీల కోసం ఉపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఇందులో బదిలీల ఆప్షన్లు ప్రత్యక్షమవుతున్నప్పటికీ సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. - ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు, ఆన్లైన్ దరఖాస్తు సమయంలో కనిపించే వివరాలకు పొంతన ఉండడంలేదు. దీంతో పలువురు ఉపాధ్యాయులు మార్కులు కోల్పోతున్నారు. - కొందరు అదనపు పాయింట్ల కోసం తప్పుడు సమాచారం నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిభ ఆధారంగా పొందాల్సిన అదనపు పాయింట్లు కోల్పోతున్నామని అర్హులు ఆవేదన చెందుతున్నారు. - నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఎస్జీటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 15,424 మంది ఉపాధ్యాయులున్నారు. బదిలీలు తప్పనిసరి అయినవారు అన్ని కేటగిరీలూ కలిపి జెడ్పీ యాజమాన్యంలో 4,491 మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 150 మంది వరకు ఉన్నారు. బదిలీ అర్హత కలిగిన వారు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వెబ్సైట్లోని ఆప్షన్ల వల్ల వీరంతా ఆందోళన చెందుతున్నారు. పాయింట్ల కేటాయింపులోనూ.. - పాయింట్ల కేటాయింపులో అసమగ్రత చోటు చేసుకోవడం ఉపాధ్యాయులను కలవరానికి గురి చేస్తోంది. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని భాషా పండితులకు ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయించలేదు. ఏ స్థాయిలో పాయింట్ల కోసం నమోదు చేసుకోవాలన్నది వివరించలేదు. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు స్కూల్ గ్రేడ్ పాయింట్, క్లాస్ గ్రేడ్ పాయింట్ కన్పిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు క్లాస్ గ్రేడ్ పాయింట్లు మాత్రమే పొందుపరిచారు. - ప్రాథమిక పాఠశాలల్లో ఒకే స్థాయి ఉపాధ్యాయుల్లో ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయుడికి మాత్రమే పాయింట్లు ఇస్తున్నట్లు వెబ్ దరఖాస్తులో ఉంది. - ఎనిమిది సంవత్సరాల్లో స్పౌజ్ పాయింట్ను ఉపయోగించుకుంటే ఐదు పాయింట్లు ఇస్తారు. ఎనిమిదేళ్లు పూర్తయినవారు బదిలీకి అర్హులని నిబంధన పెట్టడంతో.. అంతకంటే తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు గతంలో స్పౌజ్ వాడుకుంటే ప్రస్తుత బదిలీల్లో అదనపు పాయింట్లు ఉండవు. - మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు ఉపాధ్యాయులందరూ నిర్వహిస్తున్నప్పటికీ హెచ్ఎంకు మాత్రమే ఒక పాయింటు కేటాయిస్తున్నారు. - ఒక పాఠశాలలో ఐదో తరగతి చదివిన విద్యార్థులందరూ వేరొక పాఠశాలలో ఆరో తరగతిలో చేరితేనే ఉపాధ్యాయులకు 5 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరు మానేసినా ఉపాధ్యాయులకు ఒక్క పాయింటు కూడా కేటాయించడం లేదు. వాస్తవానికి విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టిన తరువాత వేరొక పాఠశాలలో చేరడం అనేది తల్లిదండ్రుల బాధ్యతే తప్ప ఉపాధ్యాయులకు సంబంధం లేని విషయం. - ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందినవారికి పాయింట్లు కేటాయించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలి తప్ప, తాను ఉత్తమ ఉపాధ్యాయుడినని, తనకు అవార్డు ఇవ్వాలని దరఖాస్తు చేసుకునే పద్ధతి నచ్చక.. అర్హతలున్నా అవార్డులకు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిబంధనల వల్ల బదిలీల్లో వారికి అన్యాయం జరుగుతుంది. - తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో నలుగురు విద్యార్థులు చేరితే, ఉన్న విద్యార్థులతో పోల్చి శాతం లెక్కించి, అధిక పాయింట్లు ఇస్తున్నారు. అదే ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలో అదే నలుగుగురు విద్యార్థులు చేరితే శాతం లెక్కిస్తే తక్కువ వస్తుంది. అయినప్పటికీ దీని ప్రకారం వారికి తక్కువ పాయింట్లు కేటాయిస్తున్నారు. ఒక్కోసారి ఒక్క పాయింటు కూడా రాని పరిస్థితి. - ఇంకా విచిత్రం ఏమిటంటే అన్ని రకాలుగా ఒకే అర్హతలున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పాయింట్లు కేటాయించడంతో ఉపాధ్యాయుల్లో మరింత ఆందోళన నెలకొంటోంది. రేషనలైజేషన్పై కానరాని స్పష్టత ఇదిలా ఉండగా పాఠశాలల రేషనలైజేషన్పై చిక్కుముడి ఇంకా వీడలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించే ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ జీఓ నంబరు 29 విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ ప్రారంభించి సుమారు 15 రోజులవుతున్నా నేటికీ స్పష్టత కానరావడం లేదు. రేషనలైజేషన్తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉంది. రేషనలైజేషన్పై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ దరఖాస్తుల గడువును పెంచుకుంటూ పోతుంది. రేషనలైజేషన్లో ఎక్కడెక్కడ ఏయే స్కూల్స్ విలీనమవుతాయి? ఏయే స్కూళ్లు మూత పడనున్నాయనే విషయం స్పష్టమైతేనే బదిలీల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. నత్తనడకన నమోదు పాయింట్ల కేటాయింపుపై అయోమయం చోటు చేసుకోవడంతో జిల్లాలో బదిలీ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 12 నుంచి బదిలీ దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు గడువు పెంచారు. ఈ నెల 15, 16 తేదీల్లో అధిక సంఖ్యలో నమోదు జరిగింది. ఈ నెల 16వ తేదీ వరకూ 3,715 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెబ్ కౌన్సెలింగ్లో పారదర్శకత లేదు ఉపాధ్యాయ బదిలీలల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ప్రకటించింది. కానీ ఈ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. పారదర్శకత అన్న దానికి ఎక్కడా అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ విధానంలో ఏం జరుగుతుందనే దానికి జవాబుదారీతనం కూడా లేదు. ఏం జరుగుతుందని అడిగితే హెల్్ప లైన్ నంబరు అంటున్నారు. అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. వేసవి సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం ఆరంభంలో చేపట్టడం, విధి విధానాలు సరిగ్గా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. - కేవీ శేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి చెడ్డ పేరు బదిలీల విషయంలో కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కొత్త బదిలీ షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలి. వెబ్ కౌన్సెలింగ్, ఫెర్మార్మెన్స్ విధానాలను రద్దు చేయాలి. - అరవ విస్సు, ఉపాధ్యాయుడు, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం ఖాళీలపై దృష్టి పెట్టండి పిఠాపురం : జిల్లాలో ఈ నెలాఖరుకు సుమారు 180 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ ఖాళీల భర్తీకి కూడా బదిలీల సందర్భంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఈ నెల పదో తేదీకే పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో దానిని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఆయా పాఠశాలల్లో ఖాళీలు అలాగే ఉండిపోయి, విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ముందస్తు నీరు... అందని తీరు
- వారం రోజులు దాటుతున్నా డెల్టాలో చేలుకు చేరని కాలువ నీరు - ప్రశ్నార్థకంగా మారిన 4.80 లక్షల ఎకరాల్లో సాగు - - మడి తడవక రైతులు సతమతమవుతుంటే ఏరువాకంటూ పాలకులు హడావుడి అమలాపురం : ‘నీరు పల్లమెరుగ’ంటారు...నిజమే. కానీ ఆ సహజ సూత్రాన్నే మార్చేస్తున్నారు నేటి పాలకులు... నీటి పారుదల అధికారులు. డెల్టా కాలువ పరిస్థితి చూస్తే అది నిజమేనని రుజువవుతోంది. డెల్టా కాలువలకు నీరు విడిచిపెట్టి ఎనిమిది రోజులవుతున్నా కోన సీమ ప్రాంతంలోని పల్లంలో ఉండే కాలువలకు కూడా నీరు చేరడం లేదు ... మడి తడవడం లేదు. ఓ వైపు నీరు రాక ... సాగు కాక సతమతమవుతుంటే ప్రభుత్వం మరో వైపు ఏరువాకంటూ ఆర్భాటం చేయడం చూసి డెల్టా రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. గోదావరి డెల్టాలో ఈ ఏడాది ముందస్తు సాగు కోసమంటూ అధికారులు జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేశారు. ప్రధాన పంట కాలువల నుంచి ఛానల్స్, వాటి నుంచి పంట బోదెలకు, వాటి ద్వారా చేలకు చేరడానికి సాధారణంగా నాలుగైదు రోజులు పడుతుంది. శివారు ఆయకట్టుకు వారం రోజుల్లో చేరుతుంది. కానీ ఈసారి కాలువలకు నీరు వదిలి వారం రోజులు దాటుతున్నా ప్రధాన పంట కాలువలను, ఛానల్స్ను ఆనుకుని ఉన్న చేలకు నీరు చేరకపోవడం గమనార్హం. ఆధునికీకరణ, నీరు–చెట్టు పనులు పేరుతో ప్రధాన పంట కాలువలకు అడ్డుకట్టు వేసి దిగువునకు నీరు వెళ్లకుండా చేశారు. దీంతో రెండు డెల్టాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో ముందస్తు ఖరీఫ్ సాగు అనేది లేకుండాపోయింది. నీరు విడుదలైనా పలుచోట్ల నిలిపివేయడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 7వ తేదీన ‘సస్యశ్యామలంపై స్వార్థపు చీడ’ అనే కథనం రావడంతో అధికారులు హడావిడిగా కాలువలకు వేసిన అడ్డుకట్టలు తొలగించి కిందదకు నీరు వదిలారు. దిగువున ఛానల్స్, పంట బోదెలపై ఇంకా పనులు జరుగుతూనే ఉండడం గమనార్హం. చాలా పనులు వారం, పది రోజులు క్రితం మొదలు కావడం చూస్తుంటే ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో ఆర్థం చేసుకోవచ్చు. పనులు పేరుతో ఛానల్స్, పంట బోదెలపై పనులు చేస్తూ నీరుకు అడ్డుకట్టు వేయడంతో చేలకు నీరు చేరడం లేదు. తూర్పు, మధ్య డెల్టాలో పరిస్థితి చూస్తేంటే మరో వారం రోజుల వరకు శివారుకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే ఖరీఫ్కు ముందస్తు సాగుకు నీరంటూ పాలకులు చేసిందంతా ప్రచారమే తప్ప వాస్తవం కాదనిపిస్తోంది. పని మొదలు పెట్టి వారమే అయింది మధ్య డెల్టాలో కీలకమైన విలస ఛానల్ ఇది. దీనిపై ముక్తేశ్వరం, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్కు నీరు వచ్చినా సిరిపల్లి లాకుల వద్ద పనులు జరుగుతుండడంతో ఇదిగో ఇలా లాకులు మూసి దిగువున పనులు చేస్తున్నారు. దీంతో ఒకటో తారీఖున నీరు ఇచ్చినా ఈ ప్రాంత రైతులకు 15 వరకు నీరందే అవకాశం లేదు. రిటైనింగ్ వాల్ కోసం నీరు వదల్లేదు... ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ నుంచి ముమ్మిడివరం పరిసర ప్రాంతాలకు సాగునీరందించే ఠానేల్లంక ఛానల్ల్లో చుక్కనీరు లేదు. ఆయిల్ ఇండియా నిధులు రూ.1.20 కోట్లతో ఇక్కడ ఛానల్కు లాంగ్ రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. ఈ కారణంగా నీరు నిలిపివేశారు. దీనిపై సుమారు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. పైగా ఈ ఛానల్ ఎగువున పనులు చేస్తున్నా.. దిగువున కనీసం పూడిక తొలగించకపోవడంతో నీరు సరఫరా సాఫీగా జరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. -
అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోరుకున్న కొలువు కావాలనుకుంటున్నారా.. అర్హత లేకున్నా ఫర్లేదు, కావల్సిందల్లా...దండిగా సొమ్ములు...సిఫార్సులే. ఇదంతా దేవాదాయశాఖలో మాత్రమే సాధ్యమనడానికి ఉదాహరణ జిల్లాలోని పలు ఆలయాల్లో అర్హతలేని ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టడమే. అర్హతలుండీ అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేని వారిని ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితం చేయడం అవినీతికి దర్పణం పడుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పడి ఒకేచోట నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్న వైనందేవాదాయ శాఖలో సాగుతోంది. ఎవరైనా ఏదైనా అంటే పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని సమాధానం చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. డీసీ పోస్టులో జూనియర్... దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ పోస్టు ఇన్చార్జి ఏలుబడిలో నడుస్తోంది. రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు గడచిన ఎనిమిది నెలలుగా డీసీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకంలో 1986లో దేవాదాయశాఖలోకి వచ్చిన రమేష్బాబు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్గా పదోన్నతిపొంది అనంతరం 2009లో అడ్హాక్ ఏసీ అయ్యారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం అడహాక్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కాకినాడ డీసీగా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాది తప్ప మిగిలిన సర్వీసంతా జిల్లాలోనే. జిల్లాలో పలువురు సీనియర్ అధికారులున్నా రమేష్బాబుకు డీసీ ఇన్చార్జిగా కట్టబెట్టడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రమేష్బాబు కంటే సీనియర్లయిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఈవో దేవుళ్లు, పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం ఆర్ పుష్పనాథం, అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్ ఈరంగి జగన్నాథం. తలుపులమ్మ లోవ ఈవో చంద్రశేఖర్, అప్పనపల్లి బాలాబాలజీ స్వామి దేవస్థానం ఈవో బాబూరావులు రమేష్బాబుకంటే సీనియర్లు. వీరంతా పూర్తి స్థాయి అసిస్టెంట్ కమిషనర్లే. అయినా వీరందరినీ పక్కనబెట్టి అడహాక్ ఏసీగా ఉన్న రమేష్బాబును గడచిన ఎనిమిది నెలలుగా కాకినాడ డీసీగా కొనసాగించడంలో ఔచిత్యమేమిటో ఆ దేవుడికే తెలియాలి. డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నిర్వహిస్తే పదోన్నతుల్లో పైన పేర్కొన్న ముగ్గురు డీసీ జాబితాలో ముందుంటారు...అయినా అడ్హాక్ ఏసీగా ఉన్న రమేష్బాబుకే పదోన్నతి పట్టం కడుతోండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేడ్ వన్ అధికారులు కూడా ఆయన తరువాతే... ఏసీలు, డీసీలే కాదు గ్రేడ్–1 అధికారులు కూడా అన్యాయమైపోతున్నారు. పళ్లంరాజు గ్రేడ్–1 అధికారి. ఆయన అర్హతకు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్ కలిగిన వారిని నియమించే 6బి పరిధిలోని కాండ్రకోట నూకాలమ్మ ఆలయానికి ఈవోగా కొనసాగిస్తున్నారు. మరో గ్రేడ్–1 అధికారి అల్లు భవాని కాకినాడ జగన్నాథపురం గ్రూపు దేవాలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈవో పోస్టు 6–సీ అంటే గ్రేడ్–3 అధికారి పనిచేసే పోస్టింగ్ అది. మరో అధికారిణి ఆర్.చందన. ఈమె కూడా పదేళ్ల సీనియర్ గ్రేడ్–1 అధికారి. ఆమెను కూడా 6సీ అంటే గ్రేడ్3 రాజమహేంద్రవరం సత్యనారాయణస్వామి ఆలయం ఈవోగా పని చేస్తున్నారు. గ్రేడ్1అధికారైన పితాని సత్యనారాయణ (తారకేశ్వరరావు)ను 6బి పరిధిలోని రాజమహేంద్రవరం చందాసత్రం ఈఓగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్.శ్రీనివాస్, సత్యవాణి వీరు కూడా గ్రేడ్1 అధికారులే. వీరిద్దరూ రాజానగరం సత్రం, రాజమహేంద్రవరం నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్(ఎన్ఎస్బిఎస్) ఈవోలుగా పనిచేస్తున్నారు. 6–బి, 6–సీ గ్రేడ్లు కలిగిన ఈ రెండు పోస్టుల్లో గ్రేడ్–1 అధికారులు పనిచేస్తున్నారు. వీరంతా ఆ శాఖలో సీనియర్ గ్రేడ్–1 అధికారులే అయినా ఉన్నతాధికారులు ఎవరికీ వీరు కనిపించకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పైవారికి తెలియదా...? అర్హతలు లేని వారెందరో జిల్లాలో అందలాలెక్కి కూర్చున్నా ఆ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్కు తెలియకుండా ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కలిగిన ఆలయాల్లో అంతకు తక్కువ స్థాయి కలిగిన వారు పైరవీలతో పాతుకుపోయారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో వాసంశెట్టి ఉమామహేశ్వరరావు కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్, అమలాపురం వెంకటేశ్వరస్వామి ఈఓ వీవీవీఎస్ మూర్తి మందపల్లి, గ్రేడ్–1 స్థాయి కలిగిన ఈఓలు ఉండాల్సిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి, అయినవిల్లి సిద్దివినాయక ఆలయాల్లో అంతకంటే తక్కువ గ్రేడ్–2 క్యాడర్ కలిగిన రమణమూర్తి, సత్యనారాయణరాజు ఈవోలుగా పనిచేస్తున్నారు. అయినవిల్లి, వాడపల్లి రెండు దేవస్థానాల్లో పెరిగిన ఆదాయంతో ఏసీ క్యాడర్కు వచ్చేశాయి. అధికారికంగా ఉత్తర్వులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటువంటి ఈ రెండు దేవస్థానాలు గ్రేడ్–2 అధికారులనే కొనసాగిస్తున్నారు. ఇందులో తాజా బదిలీల్లో వాడపల్లి దేవస్థానానికి వచ్చేందుకు గ్రేడ్–1 రెగ్యులర్ ఇఒలు విశ్వప్రయత్నం చేసినా ఇన్ఛార్జిగా కొనసాగుతోన్న గ్రేడ్–2 వానపల్లి ఇఒ రమణమూర్తి తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఆ ఆలయానికి పని చేయగలిగే అర్హతలున్న గ్రేడ్–1 ఈవోలను కాదని ఇన్ఛార్జిని కొనసాగించడంలో మర్మమేమిటో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ విషయాన్ని గత నెల 25న ‘వాడపల్లి వెంకన్నా నీ వాడిని నేనయ్యా’మ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయ ఈవో గ్రేడ్–2 కేడర్. ఆ ఆలయం చూస్తే గ్రేడ్–1 అంతకంటే ఎక్కువగా అసిస్టెంట్ కమిషనర్ను కూడా నియమించవచ్చు. అటువంటిది ఐదేళ్లయినా గ్రేడ్–2 ఈవోను రెగ్యులర్ చార్జితో ఇన్ఛార్జిగా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రేడ్–1 ఈవోలు బీజేపీ నేతల దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారని తెలిసింది. దేవాదాయ శాఖలోని కమ్యునికేషన్ స్కిల్స్లో ఆరితేరిపోవడమే వారికి శ్రీరామ రక్షగా ఉందంటున్నారు. సరైన విధానం లేకనే... అయినవిల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మురమళ్ల వీరేశస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి...ఈ ఆలయాలన్ని ప్రస్తుతం గ్రేడ్–1, గ్రేడ్–2 ఈవోలు పనిచేస్తున్నారు. ఈ ఆలయాలన్నీ ఏసీ క్యాడర్ స్థాయికి ఎప్పుడో చేరిపోయాయంటున్నారు. వాటికి తగ్గ క్యాడర్ను ప్రకటించి ఆ తరహా ఈవోలను నియమించాల్సి ఉంది. ఇవి జరగనంత వరకు ఈ సిఫార్సు వ్యవహారాలు ఆ శాఖలో మామూలేనంటున్నారు. -
బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఆందోళన
రైతుల పార్టీగా అఖిలపక్ష పోరాటం వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి నార్త్జోన్ డీఎస్పీ ప్రసన్నకుమార్తో చర్చలు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. బలవంతంగా భూములు తీసుకున్న రైతులతో కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా నార్త్జోన్ డీఎస్సీ ప్రసన్నకుమార్తో జక్కంపూడి చర్చించారు. రైతులకు పోలీసుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో సంప్రదించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం మధ్యాహ్న వరకూ మీరు రైతులకు అందించే న్యాయం కోసం చూస్తామని, గురువారం నుంచి రైతు కుటుంబాలతో కలిసి భూముల్లో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డీఎస్పీకి సూచించారు. పై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భూములు తీసుకుంటున్నామంటూ మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల గోడలకు నోటీసులు అతికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్బాబు, వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంట్రాజు, బాధిత రైతులు ఐఎస్ఎన్ రాజు, గద్దె రామకృష్ణ, కలగర్ల భాస్కరరావు, కలగల సర్వారాయుడు, కరుటూరి విజయ్కుమార్ చౌదరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వాయిదా పంచాయితీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇరగవరం ఎస్సై కేవీ శ్రీనివాస్, రైటర్ ఎస్.ప్రదీప్కుమార్ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్బంధించిన అనంతరం తలెత్తిన పరిణామాలను చక్కదిద్దే విషయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలకు చంద్రబాబునాయుడు బుధవారం కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై సీఎం సమక్షంలో జరగాలి్సన పంచాయితీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ముఖ్యమంత్రి బుధవారం హైదరాబాద్ వెళ్లడం వల్ల ఎమ్మెల్యేలను కలవడానికి సమయం కుదరలేదని సీఎం కార్యాలయం నుంచి వారికి సమాచారం అందింది. బీజేపీ అగ్రనేత అమిత్షాతో చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమవుతారు. ఆ తరువాత మహానాడు ఉండటంతో జిల్లా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఆయనతో భేటీ రద్దవడంతో జిల్లా ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ముఖ్యమంత్రి క్లాస్ పీకినట్టు ప్రచారం. జిల్లా అధికారులతో గొడవలు ఏమిటి, ఒక అధికారిని నిర్బంధించడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు, 15 మందిని గెలిపించిన జిల్లాలో మనం ప్రవర్తించాల్సింది ఇలాగేనా, ఇన్చార్జి మంత్రిగా మీరేం చేశారని ప్రత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు తలంటినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. మరో వైపు పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్గానే తీసుకున్నారు. పెనుగొండ సీఐను సస్పెండ్ చేయడం ద్వారా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. -
వీడని జెడ్పీట ముడి
- చేతులెత్తేసిన ‘దేశం’ - చతికిలపడ్డ నేతలు - పార్టీ జిల్లా పగ్గాలపై వెనకడుగు - భంగపడిన పార్టీ పెద్దలు - నిరాశలో జ్యోతుల వర్గం, . సాక్షి ప్రతినిధి, కాకినాడ : క్రమశిక్షణ ... ఓ పద్ధతి ప్రకారం నడిచే పార్టీ ... మాట మీద నిలబడే కార్యకర్తల శ్రేణి తమకే సొంతమనే టీ డీపీలో క్రమ ‘శిక్ష’ గానే మారుతోంది. తాజాగా పార్టీ జిల్లా పగ్గాలను కార్యకర్తల సమక్షంలో ప్రకటించినప్పటికీ అప్పగించలేక చేతెలెత్తేసి చతికిలపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెంది దాదాపు 14 నెలలైంది. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న ఆ పోస్టును కోనసీమకు చెందిన జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుకు అప్పగించేందుకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించడం తెలిసిందే. జిల్లా పగ్గాలు అప్పగించి చైర్మన్ పీఠం వదులుకోమంటే ససేమిరా అంటూ చైర్మన్ నామన రాంబాబు ధిక్కార స్వరం వినిపించారు. వాస్తవానికి మంగళవారం ప్రత్తిపాడులో జరిగిన పార్టీ మినీ మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడిగా రాంబాబును ప్రకటించాలి. కానీ మనస్తాపంతో అలక వహించిన నామన ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా అన్న మాట ప్రకారమే మినీ మహానాడుకు రాకుండా జెడ్పీ బంగ్లాకే పరిమితమయ్యారు. . కాళ్లా వేళ్లా పడి... ఆయన మినీ మహానాడుకు రాకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డునపడ్డాయంటూ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి అధిష్టానం నుంచి అక్షింతలు పడతాయనే భయం నేతలను వెంటాడింది. జిల్లా టీడీపీలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ బయటపెట్టిన విషయం పాఠకులకు విదితమే. వరుస కథనాల్లో బయటపడిన లుకలుకలు మాదిరిగానే అగ్రనేతలు కూడా పార్టీ పగ్గాల విషయంలో ఎటూ తేల్చుకోలేక తలలుపట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వర్మను నామన వద్దకు రాయబారానికి పంపించగా సుమారు గంటపాటు సమాలోచనలు జరిగాయి. పార్టీ జిల్లా పగ్గాలను జెడ్పీ చైర్మన్కు అప్పగించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే స్వీయ నిర్ణయం తీసుకున్నారని, అందులో మెజార్టీ అభిప్రాయం లేదని పలువురు నేతలు నామన దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. . మౌన ముద్రలోనే నామన... చివరకు నామన మినీ మహానాడుకు రావడం వరకు ఒప్పించగలిగారుగానీ వేదికపైకి వచ్చిన దగ్గర నుంచి వేదిక దిగిపోయే వరకు నామన మౌనముద్రలోనే గడిపారు. వేదికపై ఉన్న ఎవరితోను కనీస పలకరింపు కూడా లేకుండా ముభావంగా కనిపించారు. జెడ్పీ చైర్మన్ మాట ఎలా ఉన్నా పార్టీ జిల్లా పగ్గాలు మినీ మహానాడు వేదికగా ప్రకటించాలనుకున్న చినరాజప్ప, కళావెంకట్రావు వంటి అగ్రనేతలకు భంగపాటు తప్పలేదు. . జిల్లా అధ్యక్ష బాధ్యతలు వాయిదా... మినీ మహానాడుకు నామనను తీసుకు రావడంతో కొంతవరకు పరువు దక్కిందనుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. నామన అలకబూనడం, పార్టీ జెడ్పీటీసీలు చైర్మన్ పీఠం మార్చవద్దని, అలా మారిస్తే రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు వెనక్కు తగ్గక తప్పింది కాదు. మినీ మహానాడు వేదికపై తమ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరంటూ మంత్రి యనమల గొప్పలకు పోతూనే జెడ్పీ చైర్మన్ మార్పు, పార్టీ జిల్లా పగ్గాలు వ్యవహారంలో అసమ్మతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీ అంతర్గత విషయాల్లో రోడ్డెక్క వద్దని నేతలకు సూక్తులు వినిపించారు. కానీ మినీ మహానాడు వేదికపై ప్రకటించాల్సిన పార్టీ జిల్లా పగ్గాలు విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. యనమల ప్రసంగాన్ని ముగించి భోజన విరామ సమయంలో నామనను వేదికకు దిగువన ఒకపక్కకు తీసుకువెళ్లి పార్టీ పగ్గాలపై ఒప్పించేందుకు యనమల చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో పార్టీ నేతలంతా కుదేలయ్యారు. ఇక చేసేదేమీ లేక పార్టీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంపై ఒకరకంగా ‘స్టే’ విధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ ఎదురుకాని పరిస్థితి పార్టీలో తలెత్తడంతో పార్టీ అగ్రనేతలు ఎటూ నిర్ణయం తీసుకోలేక తలలుపట్టుకుంటున్నారు. . పాపం జ్యోతుల... మరోపక్క పార్టీ జిల్లా పగ్గాలు నామనకు అప్పగించేలా ఒప్పించే ప్రక్రియ పూర్తయితే జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో స్పష్టత వస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం ఎదురుచూసింది. ఆ దిశగా కొందరు అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం ఆ వర్గానికి నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం అనవసర రాద్ధాంతం ఉండకూడదని పార్టీ పగ్గాలు వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి నిర్ణయం అక్కడే జరిగేలా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంమీద పార్టీ ముఖ్యనేతలంతా ఉండి కూడా జిల్లా స్థాయిలో సమస్యను పరిష్కరించ లేక చేతులెత్తేయడం కేడర్కు ఏమాత్రం రుచించడం లేదు. -
జెడ్పీ... కిస్కా కుర్చీ...!
- టీడీపీలో వీడని ముసలం - సందిగ్ధంలోనే ‘నామన’ భవితవ్యం - నేడు ప్రత్తిపాడులో మినీ మహానాడు - జెడ్పీటీసీల మూకుమ్మడి రాజీనామాల అస్త్రం - నవీన్కు పీఠం దక్కకూడదనే ఎత్తుగడ - తెరవెనుక యనమల వర్గం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టపడి పనిచేసిన వారిని కరివేపాకులా వాడుకొని వదిలేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యనే ఇప్పుడు జెడ్పీపై ప్రయోగించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు జెడ్పీ పీఠం పునాదులే కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు ప్రకటించినప్పుడే జెడ్పీ పీఠం నుంచి దింపేయడం ఖాయమైపోయిది. అయితే పార్టీ పరిశీలకుడు కిమిడి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ విషయాన్ని దాచిపెట్టి నామనతో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు అంగీకరింపజేసే ఎత్తుగడ వేశారు. అవసరమైతే పార్టీ ధిక్కారానికి సైతం వెనుకాడేది లేదంటూ ఎదురు తిగరడంతో గడచిన రెండు రోజులుగా దఫదఫాలుగా ముఖ్యనేతలు చేస్తున్న బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డోలాయమానంలో పడ్డారు. నామనను తప్పించి వైఎస్సార్ నుంచి టీడీపీకి ఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్కు కట్టబెట్టాలని గత కొంత కాలంగా పార్టీ వ్యూహకర్తలు గట్టి ప్రయత్నాల్లో ఉన్న విషయం విదితమే. వేడుకున్నా ససేమిరా... ఈ క్రమంలోనే నామనకు టీడీపీ పగ్గాలు అప్పగించడం, జెడ్పీ పీఠం నుంచి తప్పించడం, ఆ తరువాత నవీన్కు అందలమెక్కించాలనేది పార్టీ అధిష్టాన వ్యూహం. రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలు ప్రకటించిన 24 గంటలు కూడా తిరగకుండానే ఎదురు దెబ్బ తగిలింది. ఆ పగ్గాలు చేపట్టేది లేదని నామన తెగేసి చెప్పారని సమాచారం. జిల్లా టీడీపీ చరిత్రలో పార్టీ పగ్గాలు ప్రకటించాక స్వీకరించేది లేదని ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇదే తొలిసారి. నామనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు మినీ మహానాడులో నిర్ణయం వెలువడిన మరుక్షణమే రాజీనామా పత్రాలను మూకుమ్మడిగా అందజేసి ధిక్కార గళాన్ని వినిపించేందుకు జెడ్పీటీసీలు సమాలోచనల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లిన నామన సోమవారం కాకినాడలో పార్టీ నేతలకు చెప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్ఠాన నిర్ణయంలో మార్పు లేకుంటే మంగళవారం ప్రత్తిపాడు మినీ మహానాడుకు వెళ్లకుండా తమతోపాటు పార్టీకి రాజీనామా చేయాలని జెడ్పీటీసీలు నామనకు సూచించారు. రాజీనామాల వైపు జెడ్పీటీసీల అడుగులు... చినరాజప్ప, ఇన్ఛార్జి మంత్రి కళా వెంకట్రావు కాకినాడలో మరోమారు సమావేశమై నామనను రాజీనామా చేయాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అధిష్టానం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే జెడ్పీటీసీలకు ఎంతమాత్రం రుచించడం లేదు. మాట మాత్రమైనా చెప్పకపోవడం, పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఒకే గొడుకు కిందకు రావడానికి కారణమైంది. అయినా అధిష్టానం దిగి రాకుంటే జెడ్పీటీసీలు రాజీనామా చేయడానికి కూడా వెనుకాడకూడదనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. న్యాయమైన డిమాండ్ కోసం జెడ్పీటీసీలు సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఇప్పటికే చేపట్టారు. ఇందులో 22 మంది సభ్యులు పార్టీని ధిక్కరించేందుకైనా సిద్ధమేనంటున్నారు. ఈ పరిణామాలు చివరకు జిల్లా పరిషత్ చైర్మన్ గిరీకి ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. జెడ్పీలో 60 జెడ్పీటీసీ సభ్యుల్లో ప్రతిపక్ష వైస్సార్సీపీ జెడ్పీటీసీలు 14మంది ఉన్నారు. మిగిలిన 46 మంది పార్టీ జెడ్పీటీసీల్లో 22 మంది రాజీనామాకు సిద్ధపడితే ఎదురయ్యే పరిణామాలు చైర్మన్ పీఠానికే ఎసరుపెట్టడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 25 మందితో కోరం లేకుండా చేసి చైర్మన్ ఎన్నిక అడ్డుకోవాలనేది వీరి వ్యూహం. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటింగ్ ఉందనే ధీమాతో అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ వైఎస్సార్సీపీ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై, ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించిన నవీన్ను చైర్మన్ పీఠంపై కూర్చోబెడితే న్యాయస్థానంలో నిలుస్తుందా అనేది కూడా చర్చనీయాంశమైంది. చివరకు ఏమి జరిగినా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకత ఉందనే విషయంపై కళ్లుతెరిపించాలనేది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. యనమల హస్తం...? నామన. అతనికి మద్ధతుగా అంత మంది జెడ్పీటీసీలు నిలవడం, అవసరమైతే అధిష్టానాన్ని కూడా ధిక్కరించే తెగువ ప్రదర్శించడం వెనుక బలమైన రాజకీయ కారణమేదో ఒకటి ఉండే ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జ్యోతులకు ఆది నుంచి రాజకీయంగా బద్ధ విరోధి అయిన మంత్రి యనమల రామకృష్ణుడు వర్గం తెర వెనుక ఈ ఆట ఆడిస్తుందనే అనుమానం కలుగుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది. నెహ్రూ తనయుడు నవీన్కు చైర్మన్ పీఠం దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఆ వర్గం చేయని ప్రయత్నమంటూ లేదని, ఇందుకు నామన వ్యవహారాన్ని వినియోగించుకుంటోందనే వాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం మంగళవారం జరిగే మినీ మహానాడు తరువాత టీడీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. -
ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే ఇరిగేషన్ కార్యాలయాల స్థలాల కబ్జాకే తరలింపు డ్రామా వైఎస్సార్ సీపీ కేంద్ర సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ ధవళేశ్వరం: ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరం నుంచి తరలించాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ స్పష్టం చేశారు. ఆమె గురువారం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ బి.రాంబాబును కలిశారు. ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల కలిగే లాభాలను, వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలపాలని జక్కంపూడి విజయలక్షి ్మ ఎస్ఈ రాంబాబును కోరారు. ఒక ప్రక్క ఉద్యోగులకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని జీవోపై పూర్తి సమీక్ష వరకు తరలించబోమని హామి ఇచ్చినప్పటికీ తరలింపులో అధికారుల అత్యుత్సాహం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాల స్థలాలను కబ్జా చేసేందుకే 29 ఏళ్ళ క్రితం వచ్చిన జీఓను తెరమీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఈస్ట్రన్ డివిజన్కు ధవళేశ్వరంలో కార్యాలయం కడుతుండగా తరలింపు ప్రక్రియ ఏమిటని ప్రశ్నించారు.సెంట్రల్ డివిజన్ కార్యాలయ మరమ్మతులకు కూడా నిధులు విడుదల కాగా అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చాలని ప్రయత్నించడం ఏమిటని ఎస్ఈని ప్రశ్నించారు. సెంట్రల్ డివిజన్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను పెద్దాపురం డివిజన్లో కలిపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రైతులు,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యాలయాలను తరలించాలని చూస్తే వేలాది మంది రైతులతో ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమేనని జక్కంపూడి విజయలక్ష్మీ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాల తరలింపునకు ప్రయత్నించారంటే అధికారుల అత్యుత్సాహం తెలుస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాధనాల చంద్రశేఖర్ (శివ), వైఎస్సార్ సీపీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఆకుల రాజా, షట్టర్ బాషా, మిరప రమేష్, గపూర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు. -
చిరువ్యాపారులపై కనికరం చూపండి
కౌన్సిల్లో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ l కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ‘అఖండ గోదావరి’కి బీపీఎస్ నిధులెలా కేటాయిస్తారు..? నిలదీసిన స్వతంత్ర, అధికారపార్టీ కార్పొరేటర్లు సాక్షి, రాజమహేంద్రవరం : ఆశీల విషయంలో చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాలక మండలి, అధికార యంత్రాంగానికి సూచించారు. ఆదివారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు జీవుల నుంచి వసూలు చేసే ఆశీలు నగరపాలక సంస్థకు పెద్ద ఆదాయ వనరు కాదని, అది వసూలు చేయకపోవడం వల్ల చిరు వ్యాపారులకు మేలు చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ కొంత మంది ఆశీల కాంట్రాక్టర్లు బడుగుజీవుల వద్ద నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వారిని నిలువరించాలని పాలక మండలి, యంత్రాంగానికి సూచించారు. ఇక్కడే ఏర్పాటు చేయాలి గోదావరి అర్బ¯ŒS డెవలప్మెంట్ అథారిటీ(గుడా)ను నగరంలో ఏర్పాటు చేసుకునేలా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపుదామని చెప్పారు. నగరపాలకసంస్థ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఇంటర్లో కార్పొరేటర్ కాలేజీలలో చేర్చడం సరైన నిర్ణయం కాదన్నారు. అందరికీ ఇళ్లు పథకంలో 4200 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా అవి కార్యరూపం దాల్చకపోవడం దారుణమన్నారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిధులు అఖండ గోదావరి ప్రాజెక్టుకు సరికాదు నగరంలోని అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)ద్వారా వచ్చిన నిధులలో రూ.20కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేటాయించడం సరికాదని స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్, టీడీపీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్, కోసూరి చండీ ప్రియ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ నిధులతో నగరంలోని పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ గొప్పగా చేసింది అని చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టు చేపట్టడం అవసరమన్నారు. మోరంపూడి–స్టేడియం రోడ్డుపై మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్కు మూడు తీర్మానాలు పంపారని, దానిపై గందరగోళం నెలకొందన్నారు. ఆ రోడ్డును 80 అడుగులకు కుదించాలని కోరడంతో మేయర్ రజనీశేషసాయి సమ్మతించారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలి్సందిగా కమిషనర్ విజయరామరాజుకు సూచించారు. తొలగించిన 31 మంది కార్మికులు 180 రోజులకుగాను 100 రోజులు విధులకు హాజరవ్వలేదని కమిషనర్ చెప్పారు. మరో పది మంది కూడా ఉన్నారన్నారు. వారిపై నిర్ణయం తీసుకునే అధికారం కౌన్సిల్ కమిషనర్కు ఇచ్చింది. అనంతరం అజెండాలోని 11 అంశాలను ఏకగ్రీంగా ఆమోదిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. -
సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే సహించం
– వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ –ధవళేశ్వరంలో ఇరిగేషన్ కార్యాలయాలు బంద్ –నేడు ధవళేశ్వరం బంద్కు పిలుపు ధవళేశ్వరం : వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. కాటన్ ఆశయానికి తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా కార్యాలయాన్ని తరలించాలని అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనకు నిరసనగా సోమవారం జక్కంపూడి విజయలక్ష్మి , వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయాల బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి, డెల్టా రైతాంగానికి అందుబాటులో ఉండేలా నాడు కాటన్ మహనీయుడు ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరంలో ఏర్పాటు చేయించారన్నారు. అయితే నేడు కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం కార్యాలయాన్ని ఏకపక్షంగా మార్చడం దారుణమన్నారు. కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా అమలాపురంలో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం వెనుక మర్మమేమిటని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురం తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలింపును నిరసిస్తూ మంగళవారం ధవళేశ్వరం బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, పెన్నాడ జయప్రసాద్, ఏజీఆర్ నాయుడు, మిరప రమేష్, షట్టర్ భాషా, బర్రి కామేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీరామ్, ఎలీషా జగన్, రామరాజు, సత్యం వెంకటరమణ, గపూర్, తాడాల చక్రవర్తి, బోడపాటి సత్యనారాయణ, కొత్తపల్లి రాము, జంగా కేదార్నాథ్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమళ్ల ఆంజనేయులు, పడమటి కామరాజు, బొబ్బిలి భాస్కరరావు, పిల్లి కిషోర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు నీళ్లు ఇస్తేనే మేలు
అమలాపురం : ముందస్తు ఖరీఫ్ సాగు చేపట్టాలన్న డెల్టా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. సుదీర్ఘకాలంగా తాము చేస్తున్న పోరాటానికి స్పందించి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు 15 రోజుల ముందే సాగునీరు విడుదలకు ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. తాజాగా ముందుస్తుగా కాలువలకు సాగునీరందించేందుకు ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశ తీర్మానం ఉంటేకాని నీరు విడుదల చేయలేరని ఇరిగేషన్ అధికారులే చెబుతుంటుంటే ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు జూన్ ఒకటికి పంట కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 15 తరువాత సాగునీరు ఇవ్వడం వల్ల అక్టోబరులో పంట దెబ్బతింటుందని, రబీ సాగు చివరి కాలంలో నీరందకపోవడం, మూడో పంట అపరాల సాగు లేక పోవడం వంటి విపత్కర పరిస్థితులకు కారణమవుతోందని రైతులు ఆందోళన. సాగునీరు ఆలస్యమైనందున గతేడాది కోనసీమలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయని సంగతి తెలిసిందే. ఇందుకు రైతులు చెప్పిన కారణం జూన్ 15 తరువాత నీరు ఇవ్వడం వల్ల సాగు చేయడం లేదనే. రైతులు డిమాండ్ను ‘సాక్షి’ పలు సందర్భాలలో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు అధికారులు జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరివ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయంతో ముందస్తు సాగుకు అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖాధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో ముందస్తు సాగునీరు విడుదలకు తీర్మానం చేయలేదని, అప్పటి సమావేశంలో జూన్ 15 నాటికే నీరు ఇవ్వాలని తీర్మానించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనితో ముందస్తు సాగునీరు విడుదలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గోదావరి ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు ఐఏబీలో తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ముందస్తు సాగునీరు విడుదల చేయాలంటే సాధ్యం కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇరిగేషన్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అలా చేయాలంటే మరోసారి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దీమాతోనే ఈ ఏడాది ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ఆరంభించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సాగునీరు ఆలస్యంగా విడుదలైతే ఖరీఫ్ దూరంగా ఉండాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
ఎనలిటికల్ స్కిల్ పరీక్ష రద్దు చేసిన నన్నయఅధికారులు 29న తిరిగి నిర్వహిస్తామని ప్రకటన ఫీజు చెల్లించాలనడంపై మండిపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈనెల ఒకటిన నిర్వహించిన ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్ష రద్దయ్యింది. మోడల్ పేపర్ మారడమే దీనికి కారణమంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి. మురళీధర్ ప్రకటించారు. అంతేకాదు ఆ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.250 చెల్లించాలనడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టీపుల్ ఛాయిస్) నిర్వహించాల్సి ఉండగా పొరపాటున ప్రశ్నకు జవాబు ఇచ్చే విధానంలో నిర్వహించారు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షను రద్దు చేసి, మరలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. చివరకు వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షను రద్దు చేస్తూ తిరిగి ఈనెల 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తిరిగి నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రతి విద్యార్థి రూ. 250 ఫీజు చెల్లించాలనడం వివాదాస్పదమవుతోంది. ఒకటిన నిర్వహించిన పరీక్షను ఎందుకు రద్దు చేశారు? దానికి గల కారణాలేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే యూనివర్సిటీతోపాటు కళాశాలల యాజమాన్యాలూ అందుకు బాధ్యులే అవుతారు. అయితే విద్యార్థుల తప్పిదం ఏమిటని వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిపై ఆర్థిక భారం(రూ.250 ఫీజు) మోపడం ఏ మేరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పరీక్ష రద్దు భారం తగదు ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను రద్దు చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీయే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కానీ ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.250 ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదు. –ఎస్. ఉదయ్ప్రకాష్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, వీఎస్ డిగ్రీ కాలేజ్, కాకినాడ విద్యార్థులకు చేసే మేలు ఇదేనా ? నన్నయ యూనివర్సిటీ విద్యార్థుల ప్రగతికి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని పదేపదే చెబుతుంటారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్షను ముందు చెప్పిన మోడల్లో నిర్వహించకుండా తప్పుచేసి, ఇప్పుడు మరోసారి నిర్వహిస్తామంటూ, అందుకు ప్రత్యేక ఫీజు చెల్లించాలనడం సరికాదు. ఇదేనా విద్యార్థులకు చేసే మేలు. –అడపా కొండబాబు, బిఎస్సీ విద్యార్థి, కాకినాడ -
ఏక్ సాల్ గ‘లీజు’
- గయాళ్లు భూములపై పెద్దల కన్ను - ఆక్వా సాగు ముసుగులో 200 ఎకరాల్లో పాగా - లీజు పొందకుండానే చెట్ల నరికివేత - బరితెగిస్తున్న అధికార పార్టీ పెద్దలు సముద్ర తీరాన ఉప్పుటేరును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను బ్రిటిష్వారి హయాంలో ‘గయాళ్లు’ అని పిలిచేవారు. ఈ భూములకు రెవెన్యూ విభాగంలో ఎటువంటి సర్వే నంబర్లూ ఉండవు. వీటిని రెవెన్యూ శాఖ పరిశీలించి, సర్వే నంబర్లు ఇచ్చి, నిరుపేదలకు వీటిని ఏడాదికి ఒక ఎకరం లీజుకు ఇస్తారు. దీనిని ‘ఏక్ సాల్ లీజు’ అని పిలుస్తారు. ఈ లీజు పేరుతో కొందరు అధికారుల వత్తాసుతో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గలీజు వ్యవహారానికి పాల్పడుతున్నారు. అల్లవరం (అమలాపురం) : ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందంటే చాలు.. అది మడ అడవైనా.. ఉప్పుటేరు భూములైనా సరే.. అందులో పాగా వేసేందుకు అధికార టీడీపీకి చెందిన కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నిబంధనలను సహితం ఖాతరు చేయకుండా బరితెగిస్తున్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం రెవెన్యూ పరిధిలో ఎస్.పల్లిపాలెం బ్రిడ్జిని ఆనుకుని ప్రభుత్వ గయాళ్లు భూమి 200 ఎకరాలు ఉంది. ఎస్.పల్లిపాలెం నుంచి నక్కా రామేశ్వరం, మిలిటరీ పర్ర భూముల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన మడ, తిల్ల, ఇతర వృక్షజాతులు ఈ భూముల్లో ఉన్నాయి. మామూలుగా ఈ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేసి, ఆయా గ్రామాల్లో నిరుపేదలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి ఎకరం చొప్పున చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటు నిమిత్తం ఏడాది కాలానికి లీజుకు ఇస్తారు. ఏడాది తరువాత ఈ లీజును రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లబ్ధిదారు లేకపోతే, తరువాత అర్హులైనవారికి ప్రాధాన్య క్రమంలో ఈ భూములను కేటాయిస్తారు. చేతులు మారిన భూములు ఏక్ సాల్ లీజు పట్టా భూముల్లో వందలాది ఎకరాలు నేడు చేతులు మారాయి. కొందరు ఆక్వా రైతులు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెబుతూ, ఏక్ సాల్ పట్టా భూములను కైంకర్యం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు ‘పెద్దలు’ మిలటరీ పర్రభూములు, మడ అడవుల్లో పాగా వేసి వందలాది ఎకరాలను తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. నక్కా రామేశ్వరం ప్రాంతంలోని సీతారామపురం, చుక్కాబద్ద (పర్రభూములు), వైనతేయ నదీ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాలకు ఏక్ సాల్ లీజు పట్టాలున్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం ‘పెద్దల’ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఎస్.పల్లిపాలెం వద్ద ఉప్పుటేరు చెంతనే ఉన్న గయాళ్లు భూములను ఏక్ సాల్ లీజు పేరుతో చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొమరగిరిపట్నం, ఎస్.పల్లిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 250 మంది ఏక్ సాల్ లీజుకు ఆర్డీఓ గణేష్కుమార్కు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్.పల్లిపాలేనికి చెందిన 150 మంది, కొమరగిరిపట్నానికి చెందిన 100 మంది వీరిలో ఉన్నారు. వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్న ఆర్డీఓ ఉప్పుటేరు భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక తహసీల్దార్ వడ్డి సత్యవతిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మడ, తిల్ల, ఆల్చీ వృక్షజాతులున్న గయాళ్లు భూములను తహసీల్దార్ పరిశీలించారు. మరోపక్క ఇదే అదనుగా దరఖాస్తు చేసుకున్న కొందరు సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిల్ల, ఆల్చీ వృక్షసంపదను పొక్లెయిన్తో కూకటి వేళ్లతో పెకలించేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే భారీయంత్రాలతో చెరువుల ఏర్పాటుకు గట్లు వేసేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముమ్మరంగా సర్వే మరోపక్క ఏక్ సాల్ లీజు పట్టాకు దరఖాస్తు చేసుకున్న గయాళ్లు భూముల్లో లంకల సర్వేయర్ రవిశంకర్ నేతృత్వంలో కొద్ది రోజులుగా సర్వే జరుగుతోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే పరి«ధిలో లేని గయాళ్లు భూమిని తొలుత సర్వే చేసి, అనంతరం సర్వే నంబర్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎన్ని ఎకరాల్లో గయాళ్లు భూములున్నాయో నిర్ధారించుకొన్న తరువాత కలెక్టర్కు నివేదిక పంపించనున్నారు. ఏక్ సాల్ పట్టాలు పొందాలంటే.. ఏక్ సాల్ లీజు పొందాలంటే వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ తొలుత పరిశీలించాలి. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. దీనిపై ఆర్డీఓకు, కలెక్టర్కు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓ ఆ నివేదిక పరిశీలించాక కలెక్టర్కు పంపిస్తారు. తహసీల్దార్, ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏక్ సాల్ పట్టాలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుని ఏక్ సాల్ లీజు పట్టాలు మంజూరు చేస్తారు. కానీ ప్రస్తుత వ్యవహారంలో తహసీల్దార్ పరిశీలించినదే తడవుగా గయాళ్లు భూముల్లో ఉన్న వృక్షసంపదను దరఖాస్తుదారులు నరికేసి, దారులు ఏర్పాటు చేసేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఆక్వా చెరువులుగా మార్చేందుకు సన్నాహాలు చేసేశారు. అంటే సర్వే పూర్తి కాకుండానే.. తహసీల్దార్, ఆర్డీఓలు నివేదికలు ఇవ్వకుండానే.. కలెక్టర్ పట్టాలు మంజూరు చేయకుండానే.. ఇష్టారాజ్యంగా భూముల్లో చెట్లు నరికేస్తున్నారన్నమాట. దీనిపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా, ‘ఏక్ సాల్ లీజు పట్టాలివ్వాలంటే చెట్లను తొలగించాలి కదా!’ అని చెబుతున్నారు. ఉపేక్షించం కొమరగిరిపట్నంలో ఎస్.పల్లిపాలేనికి ఆనుకుని ఉన్న గయాళ్లు భూములకు ఏక్ సాల్ లీజు కోసం రెండు గ్రామాలకు చెందిన 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రా«థమిక పరిశీలనలో భాగంగా ఆర్డీఓ గణేష్కుమార్ ఆదేశాల మేరకు గయాళ్లు భూములను పరిశీలించాం. సర్వే పరిధిలో లేని ప్రభుత్వ భూములు కావడంతో ఎవ్వరికీ ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. ఈ భూముల్లో ఎటువంటి అన్యాక్రాంత చర్యలకు పాల్పడినా ఉపేక్షించం. - వడ్డి సత్యవతి, తహసీల్దార్, అల్లవరం -
పోలీసులకు చిక్కిన నిందితుడు
చోరీ సొత్తు స్వాధీనం మండపేట : మండపేటలో జరిగిన చోరీ కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ కేసు వివరాలను వివరించారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు నివసిస్తున్న గదిలో చోరీ జరిగిందన్నారు. అర్ధరాత్రి సమయంలో చినబాబు సతీమణి సుజాతమ్మ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో పట్టణంలోని మఠం వీధికి చెందిన పెదగాడి వీరవెంకట వీరేంద్ర (20) ఇంట్లోకి ప్రవేశించి రూ.57 లక్షల విలువైన ఆభరణాలు, రూ.52,700 నగదు చోరీ చేశాడన్నారు. దీనికి అదే ఇంటిలో పనిచేస్తున్న దేవుడు అనే వ్యక్తి సహకరించినట్టు అనుమానాలున్నాయన్నారు. వీరేంద్ర హైదరాబాద్లో ఉంటూ ఇక్కడకు వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారన్నారు. గతంలోను ఇతడికి నేరచరిత్ర ఉందని, తల్లి గొలుసు, మేనమామకు చెందిన బంగారాన్ని చోరీ చేసినట్టు ఏఎస్పీ దామోదర్ వివరించారు. నిందితుడు వ్యసనాలకు బానిసై పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డాడన్నారు. క్రికెట్ బెట్టింగ్లు కూడా చేసేవాడని తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఈ చోరీ చేసిన ఆభరణాల్లో రెండు గాజులను స్థానికంగా ఉన్న బంగారు షాపు వద్దకు అమ్మడానికి తీసుకురాగా అనుమానం వచ్చి షాపు యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా డీఎస్పీ మురళీకృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి అతడి ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగును గుర్తించగా అందులో బంగారు ఆభరణాలు, నగదు లభ్యమయ్యాయన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారని ఏఎస్పీ దామోదర్ ప్రశంసించారు. ఐదుగురు పోలీస్ అధికారులతో ఐదు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో వ్యూహాత్మకంగా ఒక బృందాన్ని రంగంలోకి దించారని వివరించారు. ఎప్పటికప్పుడు స్వయంగా కేసును పర్యవేక్షించడం వల్ల నిందితున్ని త్వరగా పట్టుకోగలిగామన్నారు. ఈ కేసులో సీఐలు గీతా రామకృష్ణ, వి. పుల్లారావు, హ్యాపీ కృపావందనం, ఎస్ఐలు ఎండీ నసీరుల్లా, పెద్దిరాజు, రామకృష్ణ తదితరులకు ఎస్పీ రివార్డు ప్రకటించారని వివరించారు. నిందితున్ని ఆలమూరు కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏఎస్పీ దామోధర్ తెలిపారు. -
హైకోర్టు లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్
ఇందిరాసత్యనగర్ పుంత ఆక్రమణదారులకు అనుకూలంగా హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలు ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ అమలు కాని కోర్టు, లోకాయుక్త ఆదేశాలు రోడ్డు పేరుతో ఇళ్ల తొలగింపునకు పూనుకున్న యంత్రాంగం రాజమహేంద్రవరం నగరంలోని ఇందిరా సత్యనగర్ పుంతవాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హైకోర్టు , లోకాయుక్తలు ఆదేశించాయి. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నేటి పాలకులు తాము అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలోని ఇందిరా సత్యనగర్ పుంత (పీఅండ్ టీ కాలనీ) నివాసితుల వివాదం ఎన్నో దశాబ్దాలుగా సాగుతోంది. 44, 47 డివిజన్ల పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్ 89లో ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డును 80 అడుగుల నుంచి తగ్గించాలని 1989లో రాజమండ్రి పురపాలక సంఘం చైర్మన్గా ఏసీవై రెడ్డి ఉన్న సమయంలో తీర్మానించారు. అక్కడే ఆక్రమణదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గ్రామీణ, పట్టణ ప్రణాళిక విభాగాన్ని అనుమతి కోరుతూ 1989 డిసెంబర్ 11వ తేదీన తీర్మానం నంబర్ 666 చేశారు. ఆ తీర్మానాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఆతర్వాత మరో పదేళ్లకు 1998 జనవరి 1వ తేదీన ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 19, ఎంఏ జారీ చేసింది. అనంతరం పుంతలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు 1989లో అప్పటి పురపాలక సంఘం చేసిన తీర్మానాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును (డబ్యూపీ నం.22093/2005) ఆశ్రయించారు. అప్పుడు నగరపాలక సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పుంతలో రోడ్డు వేసేందుకుగాను అక్కడ ఉన్న ఆక్రమణదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో చోట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. పూర్వాపరాలు విచారించిన హైకోర్టు ఈ విషయంపై ఆక్రమణదారులు నగరపాలక సంస్థను సంప్రదించాలని తీర్పు వెలువరించింది. అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లోకాయుక్త... అదే సమయంలో పుంత వాసులు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆసంఘం అధ్యక్షుడు పి.బి.ముత్తారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించారు. రాజమండ్రి పురపాలక సంఘం పుంతలోనే ఆక్రమణదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా చేసిన 666 తీర్మానాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 1248/2005 ఫిర్యాదు చేశారు. విచారించిన లోకాయుక్త అప్పటి రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.జితేంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ సి.నగరాజారావు, సిటీ ప్లానర్ ఆర్జే విద్యుల్లత, ఫిర్యాదు దారులను విచారించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా 2007 అక్టోబర్ 1న తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం రెవెన్యూ సర్వే నంబర్ 89లోని పోరంబోకు పుంతలో చిరకాలంగా కాపురం ఉంటున్న ఇందిరాసత్యన గర్ వాసులకు రాజమండ్రి నగరపాలక సంస్థ దాఖలు చేసిన ప్లాను ప్రకారం జీ ప్లస్ 1 గ్రూపు ఇళ్లు (6+6) తొమ్మిది బ్లాకులలో 108 మందికి కట్టించి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానికి నగరపాలక సంస్థ అంగీకారం తెలిపింది. ఇళ్లు కట్టకుండానే రోడ్డు నిర్మాణానికి యత్నం లోకాయుక్త ఆదేశాలు జారీ చేసి పదేళ్లు గడచినా ఇళ్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ ఎటువంచి చర్యలు చేపట్టలేదు. లోకయుక్త, హైకోర్టు తీర్పులను అమలు చేయకుండానే తాజాగా నగరపాలక సంస్థ యంత్రాంగం అక్కడ 80 అడుగుల రోడ్డు వేసేందుకు పూనుకుంది. దీనిపై పుంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు, లోకాయుక్త తీర్పులు అమలు చేయకుండా తమ ఇళ్లను తొలగించే ప్రయత్నం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు, లోకాయుక్త తీర్పు ప్రకారం తమకు 108 ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాత 40 అడుగుల మేర రోడ్డు వేయాలని కోరుతున్నారు. పేదలకు పునరావాసం కల్పించాలి పుంతలో ఉంటున్న పేదలకు పునరావాసం కల్పించాలి. ప్రస్తుతం వాంబే గృహాలు ఖాళీగా ఉన్న చోట ఇవ్వాలి. అద్దెలు కట్టుకునే స్థోమత వారికి లేదు. ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే రోడ్డు వేయాలని చెప్పాం. – రేలంగి శ్రీదేవి, 47వ డివిజన్ కార్పొరేటర్ మమ్మల్ని రోడ్డున పడేయకండి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇది పోరంబోకు పుంత అయినా బాగు చేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన పుంత ఆక్రమణలపై విచారణ చేయాలి. కోర్టు, లోకాయుక్త తీర్పులను అమలు చేయాలి. ఆ తర్వాతే రోడ్డు వేయాలి. – దాసరి జోసెఫ్రాజు, పీఅండ్టీ కాలనీ మాకు న్యాయం చేయాలి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పడు రోడ్డు వేస్తాం అంటే మేము వ్యతిరేకించడం లేదు. కానీ కోర్టు, లోకాయుక్త తీర్పు ప్రకారం అర్హులైన వారికి వాంబే గృహాలు కట్టించి ఇవ్వాలి. అప్పటి వరకు వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నాం. – కొమ్ము జిగ్లర్, వైఎస్సార్ సీపీ నేత, 44వ డివిజన్ -
నో టిక్కెట్ ... ఓన్లీ బ్లాక్
– యథేచ్ఛగా బ్లాక్ టిక్కెట్ల విక్రయం – కౌంటర్లో ఒక్క టిక్కెట్ట అమ్మని థియేటర్లు – ఆన్లైన్లోనూ దర్శనమివ్వని వైనం – చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు విభాగాలు – అమలాపురంలో బెనిఫిట్ షోపై వివాదం.. ఉద్రిక్తత సాక్షి, రాజమహేంద్రవరం: బాహుబలి–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ను డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లను బ్లాక్లో అమ్మి సొమ్ముచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాహుబలి బెనిఫిట్ షోను ప్రదర్శించారు. వాటి టిక్కెట్లను రూ.800 నుంచి రూ.2000 వరకు గురువారం ఉదయం నుంచే విక్రయించేశారు. శుక్రవారం సాధారణ షో టిక్కెట్లు కూడా బ్లాక్లో అమ్మడంతో సాధారణ ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. సాధారణంగా ఇప్పటి వరకు »బెనిఫిట్ షోతోపాటు సాధారణ షోలకు కనీసం కొద్ది మొత్తంలోనైనా థియేటర్ కౌంటర్లో టిక్కెట్లు అమ్మేవారు. అయితే ఈ చిత్రానికి మాత్రం శుక్రవారం బ్లాక్లోనే అన్నీ విక్రయించేశారు. ఆన్లైన్ టిక్కెట్లు నిల్... గతంలోనూ కొత్త సినిమా లేదా పేరున్న హీరో సినిమా విడుదల అవుతుందంటే ఆన్లైన్లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయని థియేటర్ యాజమాన్యాలు, నిర్వాహకులు చెప్పేవారు. వాటిని వారి సిబ్బందితో థియేటర్ వద్దనే విక్రయించేవారు. అయితే బాహుబలి సినిమాకు మాత్రం ఆన్లైన్లో ఒక్క టిక్కెట్టు కూడా పెట్టలేదు. నిబంధనల ప్రకారం బాల్కనీ టిక్కెట్లలో 50 శాతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. మిగిలిన 50 శాతం టిక్కెట్లతోపాటు ఇతర క్లాస్ టిక్కెట్లు కౌంటర్లో విక్రయిచాలి. కానీ శుక్రవారం ఇలా జిల్లాలో ఎక్కడా జరుగలేదు. నిమ్మకు నీరేత్తిన రెవెన్యూ, పోలీస్ విభాగాలు... థియేటర్ల వద్ద బ్లాక్టిక్కెట్ల దందా ఇలా సాగుతుంటే జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం కనీసం కౌంటర్లో, ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించేలా చూడాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకునీరేత్తినట్లుగా వ్యవహరిస్తోందని థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు బ్లాక్ టిక్కెట్ల దందా అరికట్టడం తమ పని కాదన్నట్లు థియేటర్ల వద్ద చోద్యం చూశారు. టిక్కెట్ల కోసం గుంపులుగా నిరీక్షిస్తున్న ప్రేక్షకులపై తమ ప్రతాపం చూపారేగానీ బ్లాక్టిక్కెట్లు విక్రయిస్తున్న వారి వైపు కన్నెత్తి చూడలేదు. అమలాపురంలో బెనిఫిట్షోపై ఉద్రిక్తత... అమలాపురంలో బాహుబలి బెనిఫిట్ షో ప్రదర్శనపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. గతంలో కొంత మంది హీరోల సినిమాలకు బెనిఫిట్ షో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం బాహుబలి–2 చిత్రానికి ఇవ్వలేదు. కొంత మంది అభిమానులు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఒక్కో టిక్కెట్టును రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయించేశారు. ఈ నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు అనుకున్న సమయానికి సినిమా వేయలేదన్న కోపంతో టిక్కెట్లు కొన్నవారు వెంకట పద్మావతి మల్లి కాంప్లెక్స్ అద్దాలు, అక్కడ ఉన్న ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సున్నితమైన అంశం కావడంతో అధికార యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. -
ఆర్బీఐకొత్త నాణేలు త్వరలో.. మరి పాతవి
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలో కొత్త నాణేలను పంపిణీ చేయనున్నది. త్వరలోనే రూ. 5,10 కాయిన్లను చలామణి లోకి తీసుకు రానుంది. భారత జాతీయ పురావస్తుశాఖ ఏర్పడి 125 సం.రాలు అయిన సందర్భంగా కొత్తగా రూ.10 విలువైన నాణేలను చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టు 150 వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త రూ.5 నాణేలను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కొత్త రూ.10 నాణేనికి వెనుక వైపు నేషనల్ అర్చీవ్స్ బిల్డింగ్ చిత్రం, దానికింద 125 ఇయర్స్ అన్న అక్షరాలు వస్తాయని కేంద్ర బ్యాంక్ తెలిపింది. అలాగే 125 వ వార్షికోత్సవ వేడుక చిహ్నాన్ని కూడా జోడిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే కొత్త రూ.5 నాణేలపై అలహాబాద్ హైకోర్టు భవనం ఫోటోతోపాటు 1866-2016 ఆంగ్ల సంఖ్యలు ఈ బొమ్మ కింద వచ్చేలా రూపొందించనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా రూ. 5, 10 పాత నాణేలు కూడా చట్టపరంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. -
లోకేష్ ఫ్లెక్సీ ఘటనలో గాయపడిన యువకుడి మృతి
జీజీహెచ్ వద్ద నష్టపరిహారం కోసం ఆందోళన హోంమంత్రి రాజప్ప హామీతో శాంతించిన బంధువులు కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన కోసం ఫ్లెక్సీ కడుతుండగా షార్ట్ సర్క్యూట్తో షాక్కు గురైన వ్యక్తి మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు చేపట్టిన ఆందోళన.. టీడీపీ వర్గాలను పరుగులు పెట్టించింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీకి చెందిన దున్న అనిల్కుమార్ (25) ఈ నెల 17న వాకలపూడిలో స్వాగత ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి తీవ్ర కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరిన విషయం విదితమే. అతడిని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య రామలక్ష్మి, ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు. జీజీహెచ్ వద్ద బంధువుల ఆందోళన మృతి చెందిన అనిల్కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జీజీహెచ్ పోస్ట్మార్టమ్ వద్ద బంధువులకు ఆందోళనకు దిగారు. మృతుని భార్య రామలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం, హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించడానికి వీల్లేదని బంధువులు భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతిలో ఉన్న హోంమంత్రి రాజప్పకు స్థానిక నేతలు ఇక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటంశెట్టి ప్రభాకర్ (బాబి)ని బంధువులతో చర్చించేందుకు పంపించారు. హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ కావాలని ఆయనకు బంధువులు స్పష్టంచేశారు. దీంతో సెల్ఫోన్ ద్వారా ఆందోళనకారులు, కుటుంబ సభ్యులతో హోంమంత్రి మాట్లాడారు. మృతుని కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు, ఎక్స్గ్రేషియా కింద రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. మృతుని భార్య రామలక్ష్మికి ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు సీపీఐ నగర కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. హోంమంత్రి హామీ మేరకు అనిల్కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించేందుకు అంగీకరించారు. -
లక్ష్యం ఒకటే..ఉత్తర్వులు వేరు
- ఏప్రిల్ 15–22 వరకు ‘అమ్మ ఒడి’ నిర్వహణ - 24 నుంచి మే 10 వరకు ‘మన ఊరు మన బడి’ - 23 నుంచి వేసవి సెలవులు ప్రకటన ... అంతలోనే ఈ ఉత్తర్వు - ఎస్.ఎస్.ఏ.కు ... విద్యాశాఖకు కొరవడిన సమన్వయం - తలలు పట్టుకుంటున్న క్షేత్రస్థాయి అధికారులు రాయవరం: లక్ష్యం ఒక్కటే ... ఉత్తర్వులు వేర్వేరుగా రావడంతో విద్యాశాఖ అయోమయానికి గురవుతోంది. మొన్నటి వరకు విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు విద్యాశాఖ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రెండు కార్యక్రమాల లక్ష్యం బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే. ఒకే కార్యక్రమం నిర్వహణ కోసం విద్యాశాఖ, ఎస్.ఎస్.ఏ. వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడంపై రెండు శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం బట్టబయలైంది. గందరగోళంలో ఉపాధ్యాయులు.. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం పేరుతో బడిఈడు చిన్నారులను బడిలో చేర్చుకునే కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిధిలో ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకునే చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాల పరిధిలో ర్యాలీలు నిర్వహించి, తల్లిదండ్రులతో అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ‘అమ్మ ఒడి’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లాలో 30,240 మందిని ఒకటో తరగతిలో చేర్పించారు. .మే 10వరకు ‘మన ఊరు మన బడి’ ‘అమ్మ ఒడి’ పేరుతో ఎస్ఎస్ఏ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు తిరిగి ‘మన ఊరు మన బడి’ పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించాలని, 5వ తరగతి పూర్తయిన వారికి 6వ తరగతిలో చేర్పించాలని, 7వ తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కార్యక్రమాలు గత వారం రోజులుగా ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఒకటే కావడం గమనార్హం. పైగా ప్రస్తుత వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకే ఆశయంతో విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క విద్యాశాఖా మంత్రి ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించగా... అధికారులు సెలవుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటించడం విశేషం. నవ్వులపాలవుతున్నాం... ఒకే కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించడం హాస్యాస్పదం. విద్యాశాఖలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయలేమిని బయటపెడుతోంది. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయు. ఇదేమి ఉత్తర్వులు... ఒకే కార్యక్రమంపై విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సమన్వయలోపాన్ని బట్టబయలు చేస్తోంది. విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుల మధ్య గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ, ఎస్ఎస్ఏ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడింది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్. -
ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం
-సంఘాలతో చర్చించని సర్కారు -నిబంధనలపై టీచర్ల అభ్యంతరం -రేషనలైజేషన్పై విద్యాశాఖ కసరత్తు రాయవరం : రేపటితో విద్యా సంవత్సరం ముగియనుంది. ఉపాధ్యాయుల దృష్టంతా బదిలీలపైనే ఉంది. ఉపాధ్యాయ బదిలీలు వేసవి సెలవుల్లో చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. బదిలీల విషయమై విద్యాశాఖ తయారు చేసిన ముసాయిదాలో పేర్కొన్న నిబంధలనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మేనేజ్మెంట్ కింద దాదాపుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు. నిబంధనలపై వీడని పీటముడి.. ఉపాధ్యాయ బదిలీల్లో ఇప్పుడు పాయింట్ల విధానం పైనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. పాయింట్లు కేటాయించే విధానం, వెబ్ కౌన్సెలింగ్, బదిలీలకు సర్వీసు నిబంధనపైనే ప్రధానంగా టీచర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెర్ఫార్మెన్స్ పాయింట్లపై టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలని, ఎనిమిదేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకం కానున్న రేషనలైజేషన్.. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే బదిలీలకు కీలకం కానుంది. 10 మంది లోపు పిల్లలున్న పాఠశాల ఉంటే ..ఒక కిలోమీటరు పరిధిలో పాఠశాల కూడా ఉండి ఉంటే దానిని పిల్లలు ఉన్న పాఠశాలలో విలీనం చేయాల్సి ఉంటుంది. కిలోమీటరు పరిధిలో ఏ పాఠశాలా లేకుంటే అక్కడే పాఠశాలను కొనసాగించాలి. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాల(6, 7 తరగతులు)లో 40 మంది లోపు విద్యార్థులుంటే సమీప పాఠశాలల్లో విలీనం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60–70 మంది విద్యార్థులుంటే ఆ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని భావిస్తోంది. మూడు కిలోమీటర్ల పరిధిలో ఒకటికి మించి ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని సమీపంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్కూల్లో కలపాలని యోచిస్తోంది. అయితే ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభ్యంతరాలపై చర్చించాలి బదిలీ నిబంధనలపై ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదు. ఈ నెల 19న పలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిబంధనలపై సంఘాలు, ఎమ్మెల్సీలతో చర్చించి బదిలీల షెడ్యూల్ను కచ్చితంగా విడుదల చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్, అసంబద్ధ నిబంధలనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణకు ఉపాధ్యాయ సంఘాలు సమావేశం కానున్నట్టు సమాచారం. సంఘాలు లేవనెత్తే పలు అంశాలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధం కానున్నాయి. వెబ్ కౌన్సెలింగ్కు పూర్తిగా వ్యతిరేకం.. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ ఉంటే బదిలీలను వ్యతిరేకిస్తాం. –డి.వి.రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ పెర్ఫార్మెన్స్ పాయింట్లు తొలగించాలి.. బదిలీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. బదిలీల పేరుతో పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఇస్తామనడం ప్రభుత్వ నిరంకుశత్వ దోరణికి నిదర్శనం. పెర్ఫార్మెన్స్ పాయింట్లు లేకుండా బదిలీలు చేపట్టాలి. – కవిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ( ఆందోళనకు గురవుతున్నారు.. బదిలీల షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల్లో అసంబద్ధ నిబంధనలను సంఘాలన్నీ ఏకమై వ్యతిరేకిస్తాం. – చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
చైర్మన్ పీఠానికి ‘నామం’
చైర్పై నెహ్రూ తనయుడు - నామనకు పార్టీ జిల్లా పగ్గాలు సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే’ సామెత జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు విషయంలో నిజమవుతున్నట్టుగానే ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కకపోవడంతో దాని ప్రభావం నామన పదవికి ఎసరుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కోనసీమలో పి.గన్నవరం నియోజకవర్గం మగటపల్లికి చెందిన నామన పార్టీ ఆవిర్భావం నుంచి వివాదరహితుడనే పేరుంది. లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. ఈ కారణాలతోనే జెడ్పీ పీఠానికి నామనను అప్పట్లో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జెడ్పీ చైర్మన్గా మూడేళ్లు పూర్తి కావస్తోంది. మునుపటి చైర్మన్లు మాదిరిగా నిధులు, విధులు మాటెలా ఉన్నా కనీసం బుగ్గకారు, ప్రోటోకాల్, హోదా ఇటు పార్టీలోను, అటు అధికారికంగాను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణలో మెట్ట ప్రాంతానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మొండి చేయి ఎదురైనప్పుడే చర్చంతా జెడ్పీ పీఠంపైకి మళ్లింది. ఎందుకంటే నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా అతని కుమారుడు, జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడు నవీన్కు జెడ్పీ పీఠాన్ని అçప్పగిస్తారని పార్టీలో విస్తృతమైన ప్రచారానికి తెరలేచింది. నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి అధిష్టించడం. ఆ పదవితో పాటు మరికొన్ని ప్రలోభాల ఎరలోపడి చంద్రబాబు మాట నమ్మి నెహ్రూ టీడీపీలో తిరిగి చేరారని బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని గంపెడాశతో నిరీక్షించిన నెహ్రూకు చివరకు రిక్తహస్తమే ఎదురైంది. ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు నామన పీఠానికి ఎసరుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీలో చర్చ నడుస్తోంది. మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంతో అంతర్మథనం చెందుతున్న నెహ్రూకు గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ లేదా, అతని తనయుడు నవీన్కు జెడ్పీ చైర్మన్ పీఠం రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గుడా చైర్మన్ రేసులో ఇప్పటికే పార్టీ రాజమహేంద్రవరం నాయకుడు గన్ని కృష్ణ ఉన్నారు. అందునా నెహ్రూ కూడా గుడా చైర్మన్ గిరీని ఆమోదిస్తే తన స్థాయి తగ్గించుకోవడమే అవుతుందనే భావనలోనే ఉన్నారంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తేగిస్తే అసలు ఏ పదవి వద్దనుకోవాలనే నిర్ణయంతో ఉన్నారని అనుచరవర్గం చెబుతోంది. జడ్పీ చైర్మన్ పీఠంపై కుమార్డు నవీన్ను కూర్చోపెట్టడానికి మాత్రం నెహ్రూ సుముఖంగానే ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు దశాబ్థాల రాజకీయాల్లో నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ద్రాక్ష అందలేదు అందుకే... కనీసం తనయుడు నవీన్ను జెడ్పీ చైర్మన్గా చేస్తే రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసినట్టు అవుతుందనే ఆలోచనతో నెహ్రూ ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అది జరగాలంటే ప్రస్తుత చైర్మన్ రాంబాబు చైర్మన్ పీఠం కదిలిపోవడం ఖాయమేనంటున్నారు. నవీన్కు చైర్మన్ పీఠం అప్పగించి రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలతో సరిపెట్టాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి చెందిన దగ్గర నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, మంత్రి లోకేష్ కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో బసచేసిన సందర్భంలో ఈ అంశంపై కొద్దిసేపు జిల్లా టీడీపీలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య చర్చ సీరియస్గా సాగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడా యనమల పితలాటకమేనా...! నెహ్రూతో మెట్ట ప్రాంతంలో రాజకీయంగా బద్ధ వైరం ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జెడ్పీ చైర్మన్ పీఠం నవీన్కు అప్పగించే విషయంలో ఏమంత సుముఖంగా లేరని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగని ఎక్కడా పెదవి విప్పని యనమల వర్గీయులు నెహ్రూతో పడని నేతలను వ్యూహాత్మకంగా ఎగదోస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పార్టీని కాలదన్ని వెళ్లిపోయి స్వార్థం కోసం నిన్నగాక మొన్న పార్టీలోకి తిరిగొచ్చిన వారికి అత్యున్నత పదవులు కట్టబెడితే పార్టీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలు వెళతాయని అనుమాన బీజాలు నాటుతున్నారు. ఈ అంశానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం ముమ్మరం చేయించే పనిలో నెహ్రూ వైరివర్గం చాపకింద నీరులా గోతులు తవ్వేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయోనని వేచి చూడాల్సిందే. -
నోటీసులిస్తే ఏంటీ?
కమిషనర్ ఆదేశాలు పాటించని ఆశీలు కాంట్రాక్టర్లు మరుసటిరోజే రూ. 20 నుంచి రూ.30 వసూలు నోటీసులు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవా? సాక్షి, రాజమహేంద్రవరం : ‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు..కానీ చంటిగాడు లోకల్.. ఇక్కడే ఉంటాడు’ ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్, ఇప్పటికీ అక్కడక్కడా ఇది వినపడుతుంటుంది. ఈ డైలాగునే వంట పట్టించుకున్నారేమో రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ మార్కెట్ల ఆశీలు కాంట్రాక్టర్లు. నిర్ణయించిన ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ల వద్ద ఆశీలు వసూలు చేయరాదంటూ కమిషనర్ ఆదివారం కాంట్రాక్టర్లు ఎం.చంద్రరావు, డి.శ్రీనివాస్, జి.సాయిబాబులకు నోటీసులిచ్చారు. మరోసారి ఇలా చేస్తే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టులు రద్దు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. సరిహద్దులు దాటి ఆశీలు వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే కమిషనర్ వి.విజయరామరాజు ఇచ్చిన నోటీసులు, హెచ్చరికలు భేఖాతరు చేస్తూ పైన పేర్కొన్న ముగ్గురు కాంట్రాక్టర్లు సోమవారం ఆయా మార్కెట్ల వద్ద సైకిల్, మోటారు సైకిల్పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద రూ.8కి బదులు రూ.20 రూ.25, రూ.30 వసూలు చేశారు. ఆల్కాట్తోట కాంట్రాక్టర్ చిరు వ్యాపారులకు మార్కెట్లోని దుకాణాలు, కానాలకు ఇచ్చే టోకెన్ (రూ.28)ఇచ్చి రూ. 30 వసూలు చేశారు. మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్ కాంట్రాక్టర్ తన సరిహద్దు దాటి కోరుకొండ రోడ్డులోని హరిపురం వద్ద రోడ్డుపక్కన తాటిముంజలు, చీపుర్లు విక్రయించే వారి వద్ద రూ.25 తీసుకుని టోకెన్ ఇచ్చారు. జాంపేట మార్కెట్ కాంట్రాక్టర్ డి.శ్రీనివాస్ తన పరిధిలో లేని గణేష్ చౌక్ రైతు బజార్ వద్ద తాటిముంజలు విక్రయించుకునే వారి వద్ద రూ.20 వసూలు చేశారు. ఇలా కమిషనర్ నోటీసులు ఇచ్చిన ముగ్గురు కాంట్రాక్టర్లు వాటిని లెక్కచేయకుండా సరిహద్దులు దాటి మరీ అధికంగా ఆశీలు వసూలు చేయడంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం నగరపాలక సంస్థ అధికారులు వచ్చింది. నోటీసులలో పేర్కొన్నట్టు వారి కాంట్రాక్టులు రద్దు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం కాంట్రాక్టర్లే అధికారులు ఇచ్చినట్టయ్యింది. -
మూడు రోజులైనా రాని నీరు
- ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు - టీడీపీ నేతలకు భయపడడం వల్లే ఈ పరిస్థితని ఆరోపణ - ఎండుతున్న పొలాల చూసి రైతుల దిగాలు పిఠాపురం : ఏలేరు ఆయకట్టు పరిధిలో పిఠాపురం సీతారాంపురంలో నీరందక పంటలు ఎండిపోయి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతలకు భయపడి నీరివ్వడానికి వెనుకాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం వల్లే తమ పంటలు ఎండిపోయాయని చేసిన ఆరోపణల పర్యవసానంగా అధికారులు ఆ కాలువల వంక కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాలకు నీరందక రైతులు కన్నీరుమున్నీరవుతున్న వైనాన్ని ‘సాక్షి’ అధికారుల దృష్టికి తెచ్చింది. గత శనివారం ‘అందని నీరు అన్నదాత కన్నీరు’ శీర్షికన వెలువడిన కథనం నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, జేఈలు అప్పారావు, నాగేశ్వరరావు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. నీటిఎద్దడి వల్లే ఎండిపోయినట్టు నిర్ధారించారు. నెలరోజుల పాటు సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించినట్టు గుర్తించిన అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా పంటలు ఎండిపోతుంటే మీరు ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే కాలువలకు పొక్లయిన్తో మరమ్మతులు చేసి మిగిలిన ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గించి రెండురోజుల పాటు పొలాలకు నీరందించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన నీరు వచ్చే ఏర్పాటు చేసి వీలున్నంత వరకు నష్టం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే అధికారులు పర్యటించి మూడురోజులైనా ఇప్పటికి ఒక్క చుక్క నీరు రాలేదు. కాలువకు మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పటికే కొన్ని పంట పొలాలు పనికి రాకుండా ఎండిపోగామూడు రోజుల నుంచి మిగిలిన పొలాలు ఎండిపోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఏలేరు నీటిసంఘం నేతలపై ఆరోపణలు చేయడం వల్లే తమ పొలాలకు నీరివ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మాపైనే ఆరోపణలు చేస్తారా మీకు నీరెలా వస్తుందో చూస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. దాని వల్లే అధికారులు నీటిసరఫరాపై దృష్టి సారించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. -
మాస్టర్‘ప్లాన్’ వేశారు
- రూ.లక్షలు నొక్కేసి.. ఇష్టానుసారం పట్టాలు ఇచ్చేశారు - చేతులు మార్చి అవే స్థలాలను నొక్కేసిన బినామీలు - నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు - సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు - అధికార పార్టీ నేతల అండతో కాకినాడలో దందా రోడ్డుకు అడ్డు వస్తున్నాయనే సాకుతో అనేక ప్రాంతాల్లో నిరుపేదల ఇళ్లను అధికారులు తొలగించేసినా కిమ్మనని అధికార పార్టీ ‘పెద్దలు’.. లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు మాస్టర్ ‘ప్లాన్’ వేశారు. నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి.. కొందరు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి.. మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డును ఆనుకుని ఉన్న విలువైన స్థలంలో ఇష్టారాజ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. ముందే వేసిన పథకం ప్రకారం అవే పట్టాలను కొందరు బినామీలు చేజిక్కించుకున్నారు. కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగమంతా కొలువుదీరిన కాకినాడ స్మార్ట్ సిటీయే ఈ దందాకు వేదికగా మారింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నగరంలోని 35వ డివిజన్ అది. అక్కడి బాలాజీనగర్ ఎర్రమట్టి రోడ్డును తాజాగా రూపొందించిన మాస్టర్ప్లాన్లో 60 అడుగులుగా ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆ రోడ్డును విస్తరించాలనే ప్రణాళిక ఉంది. ఆ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలం కాకినాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. ఒకప్పుడు మెయిన్ రోడ్డు విస్తరణ కోసం స్థలం ఇచ్చిన తపాలా శాఖకు ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్లో ఉంది. అయితే నగరంలోని ఓ అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిళ్లతో ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. రోడ్డును ఆనుకుని 50 గజాల వంతున నచ్చినవారికి నచ్చినట్టు అడ్డగోలుగా పట్టాలు ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో గజం స్థలం రూ.20 వేలకు పైనే పలుకుతోంది. దీని ప్రకారం ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ రూ.10 లక్షల పైనే ఉంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల ఆమ్యామ్యాలు తీసుకుని కార్పొరేషన్ స్థలాన్ని ఇష్టానుసారం బేరం పెట్టేశారు. పైగా ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న ఇంటి ప్రహరీని చేర్చి పట్టాలు ఇవ్వడంతో ఆ ఇంటి దారిని సైతం మూసివేసి నిర్మాణాలు ప్రారంభించేశారు. మరోపక్క పట్టాలు ఇచ్చిన స్థలానికి పొరుగున ఉన్న ఇళ్ళను రహదారి కోసం తొలగించాలని అధికారులు ఇటీవల నోటీసులు కూడా ఇచ్చారు. అటువంటప్పుడు ఆ పక్కనే పట్టాలు ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి రోడ్డు మార్జిన్లలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని 2002లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా సామాజిక స్థలాలపై ఆయా స్థానిక సంస్థలకే సర్వాధికారాలూ ఉంటాయి. కానీ, మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించిన రోడ్డు మార్జిన్లోని స్థలంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారో జారీ చేసిన అధికారులకే తెలియాలి. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అడ్డగోలుగా మాస్టర్ప్లాన్లో పేర్కొన్న రోడ్డులో పట్టాలు ఇవ్వడమే ఒక తప్పయితే పట్టాలు పొందినవారు కాకుండా, వారినుంచి కొనుగోలు చేసిన బినామీలు ఇప్పుడు అక్కడ నిర్మాణాలు ప్రారంభించడం గమనార్హం. జగన్నాథపురంలోనూ అంతే.. జగన్నాథపురం 22వ డివిజన్ పరిధిలోని ధోబీçఘాట్ను ఆనుకుని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వడం కుదరదని అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్ అడ్డు చెప్పారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం నగర టీడీపీ నేతలు ముఖ్యనేతకు సిఫారసు చేయడంతో రూ.లక్షలు దిగమింగేసి, కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అదేచోట ఇళ్ల పట్టాలు కట్టబెట్టేశారు. ఇక్కడ సుమారు 30 వరకూ స్థలాలను ఇళ్ల పట్టాలుగా అమ్మేసుకున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం సత్తి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలాల వివరాలు కోరగా, ఆ రోడ్లు మాస్టర్ప్లాన్లోనే ఉన్నాయని నగరపాలక సంస్థ పేర్కొంది. అటువంటప్పుడు కార్పొరేషన్కు తెలియకుండా రెవెన్యూ అధికారులు అక్కడ ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే.. అది రెండేళ్ల క్రితం జరిగిందంటూ కార్పొరేషన్ అధికారులు తప్పించుకుంటున్నారు. పట్టాలున్నాయో లేవో పరిశీలిస్తున్నాం బాలాజీనగర్ ఎర్రమట్టి రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు వచ్చింది. ఆ ప్రాంతాన్ని 60 అడుగుల మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించడం వాస్తవమే. అందువల్ల నిర్మాణాలను నిలుపు చేస్తున్నాం. పట్టాలు ఉన్నాయా? లేవా? అనే అంశంపై విచారణ జరుపుతున్నాం. - కాలేషా, సిటీప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ అడ్డగోలుగా పట్టాల పంపిణీ మాస్టర్ప్లాన్ రోడ్లలో సైతం ఇష్టం వచ్చినట్టుగా పట్టాలు పంపిణీ చేసేస్తున్నారు. ఎర్రమట్టి రోడ్డు స్థలం నగరపాలక సంస్థకు చెందినదని గతంలోనే స్పష్టం చేశారు. ఆ స్థలంలో కోర్టు నిర్ణయాలను సైతం పక్కన పెట్టి పట్టాలు ఇవ్వడం వెనుక ఉన్న రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. - చిట్నీడి మూర్తి, మాజీ కౌన్సిలర్, కాకినాడ -
రిజిస్ట్రేషన్లు చేయకపోతే ఆందోళన ఉధృతం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ (రాజానగరం) : భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని పార్టీలకు అతీతంగా కోరుకొండలో రైతులు, ప్రజలు ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. గ్రామంలో ఆదివారం దీక్షాధారులకు డ్రింక్ ఇచ్చి ఆమె దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం ఈఓ వైఖరి వల్ల రెండున్నర ఏళ్లుగా పొలాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు క్రయ విక్రయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై దేవాదాయ శాఖ కమిషనర్కు రైతులతో కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు బొరుసు బద్రి, వుల్లి ఘణనాథ్, కాలచర్ల శివాజీ, సలాది వెంకటేశ్వరరావు, అయిల శ్రీను, వాకా నరసింహరావు, గట్టి ప్రసాద్, తోరాటి సత్య ప్రసాద్, ముద్దాల అను, వుల్లి శేషగిరి, అయిల రామకృష్ణ, గుగ్గిలం బాను తదితరులు పాల్గొన్నారు. -
డుమ్మాల నుంచి సొమ్ములు
-కాకినాడ నగర పాలక సంస్థలో అవినీతి బాగోతం -మస్తర్ల మాయాజాలంతో శానిటరీ ఇన్స్పెక్టర్ల దందా -గైర్హాజరుకు ఇంత అని రేటు నిర్ణయించి వసూళ్లు -నిత్యం 20 శాతం మంది విధులకు రాకున్నా పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడైనా విధులకు డుమ్మా కొడితే పైనుంచి చర్యలుంటాయని భయపడతారు. కానీ కాకినాడ కార్పొరేషన్లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. నెలనెలా మస్తర్ల మాయాజాలంతో మామూళ్ల దందా నడుస్తోంది. ఇక్కడ పారిశుద్ధ్య విభాగంలో కొందరు అధికారులు.. ఎంతమంది డుమ్మా కొడితే అంత మంచిదనుకుంటున్నారు. అలా అయితేనే తాము నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆరాటపడుతున్నారు. కాకినాడ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అడుగడుగునా అవినీతి కంపుకొడుతోంది. చిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పర్యవేక్షకులు నెలనెలా మామూళ్లు దండుకుంటున్నారు. ఈ విభాగంలో విధులకు రాకున్నా ఫర్వాలేదు. కానీ వచ్చినట్టు మస్తర్ మాత్రం పడిపోతుంది. అలాగని మస్తర్ ఉచితంగా వేస్తారనుకుంటే పొరపాటే. డుమ్మా కొట్టే చిరుద్యోగుల నుంచి మస్తర్, మస్తర్కు ఒకో రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ మస్తర్ల బాగోతంలో మొత్తం శానిటరీ విభాగం అంతటినీ ఒకే గాట కట్టలేము. కానీ కొందరు జేబులు నింపుకునేందుకు చేస్తున్న అవినీతి శానిటరీ ఇనస్పెక్టర్లందరికీ మచ్చ తెస్తోంది. కాకినాడ జనాభా నాలుగున్నర లక్షలు. నగరంలో రోజూ సేకరించే చెత్త 175 టన్నులు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 14 సర్కిళ్లు ఉన్నాయి. ఒక సర్కిల్కు ఒక ఎస్ఐ(శానిటరీ ఇన్స్పెక్టర్)ఉంటారు. శానిటరీ వర్కర్లలో సీనియర్లు, మాట వినే వారిని మేస్త్రీలుగా నియమించుకుని తమ ఆదేశాలు అమలు చేసేలా చూసుకుంటారు. ఇది నగరంలో నడుస్తున్న ప్రక్రియ. ఒక సర్కిల్ పరిధిలో 40 నుంచి 60 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు లేదా ముగ్గురు మేస్త్రీలు పనిచేస్తున్నారు. నగరంలో ఆయా సర్కిళ్లలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తుండగా వీరిలో 450 మంది పర్మనెంట్ కార్మికులు, మిగిలిన వారు ఆయా సొసైటీల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. పర్మనెంట్ వారికి రూ.18 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలుండగా, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.12,000 నుంచి రూ.15,000 ఉన్నాయి. నెలనెలా వేతనాలు ఎవరి ఖాతాలకు వారికి వేసేస్తారు. కార్మికులు పనిచేస్తున్నారో, లేదో పర్యవేక్షించి మస్తర్ వేయాల్సింది శానిటరీ ఇన్స్పెకర్. శానిటరీ ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి తెల్లవారుజామున 5 గంటలకు ఆ సర్కిల్ పరిధిలో పనిచేసే వారి మస్తర్ తీసుకోవాలి. ఇదివరకు రిజిస్టర్లో సంతకం తీసుకునే వారు. ఇప్పుడు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అలా తెల్లవారుజామున ఒకటి, మధ్యాహ్నం మరొకటి మస్తర్ తీసుకుంటారు. కొన్ని సర్కిళ్లలో కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు మస్తర్ల ప్రక్రియను మేస్త్రీలకు విడిచిపెట్టేసి తీరిగ్గా తొమ్మిది, 10 గంటలకు బయటకు వస్తున్నారనే విమర్శలున్నాయి. మస్తరు పడగానే హుష్కాకి కొన్ని సర్కిళ్ల పరిధిలో కొందరు మస్తర్లు తీసుకునే సమయానికి వచ్చి మస్తర్ వేసేసి ఆనక డుమ్మా కొట్టేస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 15 నుంచి 20 శాతం మంది డుమ్మా కొడుతున్నా కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. అలా కార్మికులు డుమ్మా కొట్టేయడమే కావాలని కొందరు ఎస్ఐలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మస్తర్ వేయించుకున్నాక డుమ్మా కొట్టేసే కార్మికుడు అలా ఎన్ని రోజులు ఎగనామం పెడితే అన్ని రోజులకు అక్కడి ఎస్ఐకి తాంబూలం ఇచ్చుకుంటున్నారు. డుమ్మా కొట్టే కార్మికులకు ఒక్కొక్కరికి ఒకో రేటు నిర్ణయించారు. కొన్ని సర్కిళ్లలో ఎస్ఐల పేరు చెప్పి మేస్త్రీలు కూడా ఈ తతంగం నడిపిస్తున్నారు. నెలలో 20 రోజులు ఎగనామం పెడితే పర్మనెంట్ వర్కర్ రూ.11 వేలు, కాంట్రాక్ట్ వర్కర్ రూ.6 వేలు, ఒక రోజు ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.200, పర్మనెంట్ వర్కర్ రూ.500 చొప్పున మామూళ్లు ఇచ్చుకుంటున్నారు. అదే ఒక పూట ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.100, పర్మనెంట్ వర్కర్ రూ.200 చెలించుకునే విధానం నడుస్తోంది. ఇలా ప్రతి నెలా పలువురు ఎగనామం పెడుతున్న కారణంగా వారు చేసే పని కూడా తాము చేయాల్సి వస్తోందని, తమపై పనిభారం రెట్టింపు అయిపోతోందని మిగిలిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారిపై పనిభారం ఇప్పుడున్న 850 మందికి అదనంగా మరో 200 మంది కార్మికుల అవసరం ఉంది. కార్మికుడెవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి మరొకరికి పోస్టింగ్ ఇస్తున్నారు తప్ప కొత్తగా నియామకాలు ఉండటం లేదు. ఈ కారణంగా పెరిగిపోతున్న పని భారానికి తోడు డుమ్మా కొట్టే వారి భారం కూడా తమపై పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. పండుగలు, ఆగస్టు 15, రిపబ్లిక్ డే.. ఇలా పలు ముఖ్యమైన సందర్భాలతో పాటు అవసరమైనప్పుడు అడుగుతున్నా క్యాజువల్ లీవ్లు ఇవ్వకపోవడంతో సెలవులు పెట్టక తప్పడం లేదని డుమ్మా కొడుతున్న కార్మికులు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని చెప్పారు. పారిశుద్ధ్య విభాగంలో సరిపడినంత వర్కర్లు లేకపోవడంతో పనిభారం పెరిగిన మాట వాస్తవమేనన్నారు.విధులకు హాజరు కాకపోయినా మస్తరు వేసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి మస్తర్లు తనిఖీ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఆరోపణలు ఉన్నా, లోపాలు జరుగుతున్నా తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఈడో రకం వసూల్ రాజా
- రోజువారీ మెనూగా మార్చేశాడు - శాకాహారం సరే..మాంసాహారంతో బెంబేలు - ఇవ్వకపోతే వేధింపులు...బండ బూతులే - కమిషనర్కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం - చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలిక సెలువులోకి వెళ్తామని బాధితుల హెచ్చరిక ఇంటిల్లపాదికి సరిపడేలా రోజూ రెండు లీటర్ల పాలు...కావల్సినన్ని కూరలు...వారానికి రెండు, మూడు రోజులు రెండు పూటలకు ఫుల్గా చికెన్...ఆదివారం వస్తే చాలు బొంతకోడి లేదా నాటుకోడి..ఇదేదో ఒక హోటల్లో మెనూ అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే...ఇదంతా కాకినాడ కార్పొరేషన్లో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి రోజువారీ వసూళ్ల మెనూ ఇదీ. తన కింద పనిచేసే వారికి ఇండెంట్లమీద ఇండెంట్లు వేస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి వ్యవహార శైలిదీ... ఇప్పుడు ఇదే హాట్టాపిక్ మారింది. వివరాలిలా ఉన్నాయి... సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఒక ఉద్యోగి కోరిన కోర్కెలు తీర్చకపోతే తన కింద పనిచేసే ఉద్యోగులు నరకం కళ్లచూడాల్సిందే. రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయి అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాను చెప్పిన పనులు చెప్పినట్టు చేయని వారికి వేధింపులు తప్పడం లేదు. అతని గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక దిగువ కేడర్లో పనిచేసే ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ నుంచి తెచ్చే వాటిలో పై అధికారులకు కూడా వాటాలు వెళుతుండటంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. . కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని పెద్ద మార్కెట్ ఉన్న ప్రాంతమంతా కలిపి ఒక పారిశుద్ధ్య సర్కిల్ అంటారు. ఆ సర్కిల్ అంటే మంచి గిరాకీ ఉన్న ప్రాంతం. ఎందుకంటే అక్కడ నిత్యం లక్షల రూపాయలు కూరగాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఆ ప్రాంత పారిశుద్ధ్య నియంత్రణ కోసం పనిచేస్తున్న ఉద్యోగి నిత్యం కిందిస్థాయిలోని మేస్త్ర్రీలు కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరలు, ఇతర వస్తువులు తీసుకురావాలని చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఆ ఉద్యోగికి తమపై పర్యవేక్షణాధికారం ఉండడంతో ప్రారంభంలో అడిగినవన్నీ అక్కడా ఇక్కడ వ్యాపారులను బతిమిలాడి చక్కబెట్టేవారు. అదికాస్తా రోజువారీ వసూళ్ల దందాగా మారిపోయిందని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు సిబ్బందికి మింగుడుపడని పరిస్థితి నెలకొంది. అడిగిన వస్తువులు రాకపోతే అయ్యవారిలో కోపం కట్టలు తెచ్చుకుని రాయడానికి, వినడానికి వీలులేని విధంగా తిట్ల పురాణం లంకింంచుకోవడంతో సిబ్బంది హడలిపోతున్నారు. ధైర్యం చేసిన కొందరు కార్పొరేషన్ కమిషనర్ అలీమ్భాషా, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్ళారు. అతని ఆగడాలు నిలువరించలేకపోతే దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . మస్తర్లలోనూ మాయాజాలమే.. ఆ సర్కిల్లో పారిశుద్ధ్య సిబ్బంది హాజరుకు సంబంధించిన మస్తర్లలో కూడా ఆ ఉద్యోగి చేతిలో పెద్ద మాయాజాలమే నడుస్తోంది. ఆ సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొక్కుబడిగా హాజరై వేలిముద్రలు వేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయకుండా తీసుకునే జీతాలలో సంబంధిత కార్మికులు రూ.1200లు, రూ.1500లు వంతున నెలవారీగా ఆ ఉద్యోగికి ముట్టజెబుతున్నారు. ఇలా నెలకు లక్ష జేబులో వేసుకుని పై అధికారులకు సగం ఇవ్వాల్సి వస్తోందని కార్మికులకు ఎదురు చెబుతుండటం విశేషం. ట్రేడ్ లైసెన్సులలోనూ అదే పరిస్థితి... ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూళ్ళలో కూడా ఇటీవల అతని ఆగడాలు మితిమీరిపోయాయని మార్కెట్లో విమర్శలు వినిపిస్తున్నాయి. అతని నిర్వాకంతో కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతుందంటున్నారు. పెద్ద, చిన్న దుకాణాల తారతమ్యం లేకుండా వ్యాపారుల నుంచి సొమ్ములు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. వ్యాపారాన్ని బట్టి ట్రేడ్లైసెన్సు కింద రూ.5 నుంచి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ రెండు, మూడు వేలు మించి నగరపాలక సంస్థకు జమ చేయడం లేదంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. కార్పొరేషన్ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్ను వివరణ కోరగా ఈ ఆరోపణలు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
అవినీతి బాటలు
- ఆత్రేయపురం మండలంలో రూ.3 కోట్లతో రోడ్ల పనులు - నాణ్యతకు తిలోదకాలు.. మూణ్నాళ్లకే ముక్కలు - కానరాని ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ - యథేచ్ఛగా ‘తమ్ముళ్ల’ అక్రమాలు కోట్లాది రూపాయలతో గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లపై ‘తమ్ముళ్లు’ అవినీతి బాటలు వేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. నాసిరకం గ్రావెల్తో.. మూడు పాళ్లు సిమెంటు.. ముప్ఫై పాళ్లు ఇసుక చందాన.. నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో ఏళ్లపాటు నిక్షేపంలా ఉండాల్సిన ఆ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి. ఆత్రేయపురం : మండల పరిధిలోని 17 గ్రామాల్లో ఇటీవల తెలుగు తమ్ముళ్లు నామినేషన్ పద్ధతిపై సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. జిల్లా పరిషత్ నుంచి కొత్తపేట మార్కెట్ కమిటీ నిధులు, ఎంపీ ల్యాడ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.3 కోట్లు ఈ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం గ్రావెల్ రోడ్డు వేసేటప్పుడు గ్రావెల్, ఇసుక, సిమెంటు మిశ్రమంతో నిర్మాణం చేపట్టాలి. కానీ, కాంట్రాక్టర్లయిన ‘తమ్ముళ్లు’ నిబంధనలకు తూట్లు పొడుస్తూ నాసిరకం సిమెంటు, నాసిరకం గ్రావెల్తో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూడిద ఎక్కువగా కలిసిన గ్రావెల్ వాడడంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. తాడిపూడి, పేరవరం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క సీసీ రోడ్ల నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించడంలేదు. ముఖ్యంగా వాటర్ క్యూరింగ్ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. క్యూరింగ్ 10 రోజులు చేయాల్సి ఉండగా చాలాచోట్ల ఆవిధంగా జరగడంలేదు. దీంతో నిర్మించిన కొద్ది రోజులకే సీసీ రోడ్లు బీటలు వారుతున్నాయి. పేరవరం, తాడిపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన కొద్ది రోజులకే బీటలు తీశాయంటే రోడ్లను ఎంత నాణ్యతారహితంగా నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుబాటులో ఉండని ఇంజినీరింగ్ అధికారులు ఈ రోడ్ల పనులకు మంజూరైన నిధులు, రోడ్డు నిర్మాణంలో చేపట్టాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకునేందుకు సంప్రదించేందుకు ప్రయత్నించగా జెడ్పీ ఇంజినీరింగ్ అధికారులు అందుబాటులోకి రావడం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ సమావేశాల్లో ప్రశ్నించాలనుకున్నా ఇంజినీరింగ్ అధికారులు వాటికి కూడా డుమ్మా కొడుతున్నారని మండిపడుతున్నారు. విజిలెన్స్, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై నిధులు దోచేస్తున్నారు. దీంతో రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాను. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు కృషి చేసే ప్రజాప్రతినిధులకు ఆ పనులు ప్రారంభించే సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కనీస సమాచారం కూడా అందించడం లేదు. - మద్దూరి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, ఆత్రేయపురం -
105 పింఛన్లు అనర్హమైనవే
అధికారుల తనిఖీల్లో బయటపడిన బండారం 105 పింఛన్లు రద్దు ... పంపిణీ నిలిపివేత పాత పింఛన్లపైనా దృష్టి ... దరఖాస్తుల పరిశీలన అడుగడుగునా అడ్డుపడుతున్న కౌన్సిలర్లు పిఠాపురం : ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. పిఠాపురం ము న్సిపాలిటీలో భార్యలు బతికుండగానే వితంతువులుగా మార్చేసి ప్రతి నెలా రూ.1000 స్వాహా చేస్తున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ గత నెలలోనే దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే మున్సిపల్ అధికా రులు ఒకసారి రెవెన్యూ అధికారులు ఒకసారి విచారణ నిర్వహించగా ముచ్చట గా మూడోసారి మళ్లీ మున్సిపల్ అధికా రులు విచారణ చేపట్టి 105 మంది పింఛ ¯ŒSదారులు అనర్హులని నిర్ధారించారు. దీం తో వాటిని రద్దు చేయాలంటూ స్థానిక మున్సిపల్ అధికారులు ఉన్నతాధికారుల కు నివేదికలు పంపడంతోపాటు వాటిని ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించి పంపిణీని నిలిపివేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న అధికారులు పాత పింఛన్లపైనా దృష్టి కేంద్రీకరించారు. అన్ని దరఖాస్తులనూ పరిశీలిస్తున్న అధికారులు ఇంకా అనర్హులున్నారా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పుడో ఇచ్చిన పింఛన్లపై ఇప్పుడు పరిశీలనలు ఏమిటని కొంతమంది కౌన్సిలర్లు అడ్డుతగులుతున్నారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా అనర్హులను గుర్తించడానికే పాతవి పరిశీలిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సమాధానమిచ్చారు. తొక్కిపెట్టేసిన నివేదికపై పెన్నుపోటు... ‘సాక్షి’ ఇచ్చిన కథనాలపై కొనసాగిన దర్యాప్తు నివేదికలను జిల్లా కలెక్టరుకు గత నెలలోనే అందజేశారు. కానీ వాటిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇంతలో మార్చి నెల పింఛన్లు వచ్చేయగా తిరిగి మళ్లీ అక్రమార్కులకే పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ‘పింఛన్లపై విచారణ అంతా వంచన’ అనే శీర్షికన మార్చి ఒకటో తేదీన కథనం వెలువడడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లు 321 పంపిణీని నిలిపి వేయాలని ఆదేశించారు. మున్సిపల్ సిబ్బందితో పునర్విచారణ జరిపించాలని కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహ¯ŒS మున్సిపల్ డీఈ మాధవి, టీపీఎస్ శేషగిరి, ఆర్వో రూబే¯ŒS, ఏఈఈ వంశీ అభిషక్లను విచారణాధికారులుగా నియమించగా 30 వార్డుల్లో విచారణ చేపట్టారు. అర్హులకు అవకాశం... ఈ విచారణ పూర్తయ్యాక 321 పింఛన్లలో 105 తొలగించారు. వాటి స్థానంలోఅర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డుల్లోను సుమారు 200 మంది అర్హులైన అబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులకు కొత్త పింఛన్లు అందనున్నాయి. అయితే రద్దు చేసిన పింఛన్లు కొత్త వారికి ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. పింఛ¯ŒS అక్రమాలపై విచారణ కొంకుదురు(బిక్కవోలు): కొంకుదురు గ్రామంలో సామాజిక పింఛన్ల అక్రమాలపై ఈ నెల7వ తేదీన ‘బొట్టు చెదరకున్నా’ భరోసా శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీవో పోకల విజయభాస్కర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 40మందిపై విచారణ నిర్వహించాల్సి ఉండగా 37 మంది లబ్థిదారులు హాజరయ్యారు వారి వివరాలు నమోదు చేసిన విజయభాస్కర్ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ఉప సర్పంచి కొవ్వూరి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసింది నిజమే... ఇటీవల కొత్తగా పంపిణీ చేసిన పింఛన్లలో 105 అనర్హమైనవిగా గుర్తించి రద్దు చేశాం. ఇప్పటికే వారి పేర్లను ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించడంతోపాటు మార్చి నెల సొమ్ము పంపిణీని నిలిపివేశాం. అనర్హుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.రామ్మోహ¯ŒS, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం -
కురుకూరులో దారుణ హత్య
దేవరపల్లి : ఇంటి సరిహద్దు తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలోని దళితవాడలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సరిహద్దు తగాదా ఉంది. వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుకూరు గ్రామంలోని దళితవాడలో పత్తిపాటి శ్రీను (53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య సరిహద్దు తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలకు వి వాహమైంది. సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
కురుకూరులో దారుణ హత్య
దేవరపల్లి : ఇంటి సరిహద్దు తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలోని దళితవాడలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సరిహద్దు తగాదా ఉంది. వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుకూరు గ్రామంలోని దళితవాడలో పత్తిపాటి శ్రీను (53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య సరిహద్దు తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలకు వి వాహమైంది. సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
పన్ను ‘పోటు’పై నిరసన జ్వాల
- వైఎస్సార్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన - జనం స్వచ్ఛంద మద్ధతు సాక్షిప్రతినిధి, కాకినాడ : అశాస్త్రీయంగా పెంచిన ఇంటి పన్నులపై జనం నిరసన గళం వినిపించారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలంటూ నినదించారు. మండల పరిషత్, తహసీల్థార్ కార్యాలయాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోకు దిగారు. కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా జీపుల్లో ఎక్కించుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. రూ.200 ఉన్న ఇంటి పన్నును ఒకేసారి ఏకపక్షంగా చంద్రబాబు సర్కార్ రూ.1500 పెంచేయడంతో జనం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తన వంతు బాధ్యతగా ప్రజల గొంతుకను వినిపించింది. పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు కురసాల కన్నబాబు ఇటీవల అయినవిల్లిలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఇచ్చిన పిలుపునందుకు పార్టీ శ్రేణులు జిల్లా అంతటా ఆందోళన పథం పట్టాయి. జిల్లా కేంద్రం కాకినాడ సహా కోనసీమతో పాటు మెట్ట, ఏజెన్సీ ప్రాంత మండలాల్లో కూడా గిరిజనులు అనూహ్యసంగా స్పందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్, కరప మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచిన పన్నులు కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సర్కార్కు చీమకుట్టినట్టయినా లేదని కన్నబాబు ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీడీవో సీహెచ్కె విశ్వనాథ రెడ్డికి సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, నగర కన్వీనర్ రాగిరెడ్డి ఫ్రూటీకుమార్, ప్రచార సెల్ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు వినతి పత్రం అందజేశారు. కోఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం, గొల్లప్రోలు నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులు ముఖం చాటేయడంపై 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ శివకృష్ణ ఆందోళన చేస్తున్న నేతలపై దురుసుగా ప్రవర్తించి రాస్తారోకో విరమించకుంటే అరెస్టు చేస్తామంటూ దొరబాబు, కొప్పనను బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించగా కొంతసేపు కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.అనంతరం దొరబాబు, కొప్పనలను పోలీసులు జీపులో ఎక్కించి పోలీస్స్టేషన్కు తరలించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్సెల్లో ఆర్డీవో జి.గణేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఉప్పలగుప్తంలో రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, అల్లవరంలో బొమ్ము ఇజ్రాయిలు ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. రాజానగరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇంటి పన్నులను పెంచడమే కాకుండా, పేదలకు ఇచ్చే పింఛన్ల నుంచి సొమ్ములు మినహాయించుకోవడంపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన పన్నులు వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఒ సిహెచ్వీఎఆర్ సుబ్రహ్మణ్యానికి అందజేశారు. కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం స్థానిక బాలాజీచౌక్, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట పార్టీ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీయెత్తున తరలివచ్చి సుమారు గంట సేపు ధర్నా నిర్వహించారు. వద్ద ప్రధానర హదారిపై ధర్నా నిర్వహించారు. రాజమండ్రిరూరల్, కడియం తహసీల్దార్ కార్యాలయాల వద్ద కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, ఎండీవోలకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంట్ల అచ్యుతరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. స్థానిక శాంతినగర్లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జీఎన్టీ రోడ్డు మీదుగా తహసీల్ధార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు తహసీల్ధార్ కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెద్దాపురం ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల వద్ద కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, డిఎల్పీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రం అందజేసారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద పన్నుల పెంపుకు నిరసనగా «దర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. అయినవిల్లి, అంబాజీపేటలలో జరిగిన ధర్నాలో పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు పాల్గొన్నారు. పెంచిన ఇంటిపన్నులను ఉప సంహరించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పంతగడ ప్రసాద్ తదితరులు నేతృత్వంలో ఆర్డీవో కె సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు.మండల కేంద్రమైన కె.గంగవరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్ ధర్నా నిర్వహించిన ఎంపీడీఓ శాస్త్రీకి వినతి పత్రం అందించారు. మండపేటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ తదితరులు ధర్నా నిర్వహించగా, కపిలేశ్వరపురం ఎంపీడీవో కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ధర్నా నిర్వహించారు. మండపేట ఎండీవో కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రాయవరం మండల పరిషత కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లోను వైఎస్సార్సీపీ మండలపార్టీ నాయకులు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, స్థానిక గిరిజనులు ఆందోళనలు నిర్వహించారు. కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎండీవో కార్యాలయం, గోకవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు.రాజోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం, ఐ.పోలవరం ఎంపీడీఒ కార్యాలయాల వద్ద స్థానిక నేతలు, కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. గతంలో రూ.100, రూ.200 ఉన్న ఇంటి పన్ను రూ.1000 నుంచి రూ.1500 పెంచేశారు. పన్ను కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ ఆపేస్తామని, రేషన్కార్డులు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేడు. ఇంటి పన్నులు ఏవిధంగా అంచనా వేసి పెంచారని చెప్పే అధికారి లేడు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలుంటాయి. వాటిని కాలరాస్తూ చంద్రబాబు సర్కార్ నేరుగా ఉత్తర్వులు ఇచ్చి ఇంటి పన్నులు పెంచేయడం ఏవిధంగా సబబో చెప్పాలి. ఒక పక్క ఇంటి పన్నులు పెంచేసి నీటి పన్ను పెంచుతున్నట్టుగా చెప్పారు. ఒక ఇంటికి అయినా కొళాయి ఇచ్చారా. ఏ గ్రామంలో అయినా లైబ్రరీలు పనిచేస్తున్నాయా. ఉన్న చోట పత్రికలు, పుస్తకాలు లేవు. కానీ లైబ్రరీ పన్ను వేశారు. ఏగ్రామంలో కూడా డ్రైనేజీలు లేవు. అయినా డ్రైనేజీ పన్ను విధించారు. వీధి దీపాల పన్ను అంటూ వీధిదీపాల పన్నులు అంటూ ఇష్టానుసారంగా పెంచేశారు. చంద్రబాబు సర్కార్ ఒక్క జుట్టుపై తప్ప అన్నింటిపైనా పన్నులు వేసినట్టు కనిపిస్తోంది. కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఉద్యానంపై ఉక్కు పిడికిలి
- కడియం నర్సరీకి విద్యుత్తు షాక్ - వైఎస్ ఉచితంగా విద్యుత్తు ఇస్తే బాబు బాదుడే - సుమారు 60 వేల మంది రైతులు సతమతం - మోటార్లు బిగిస్తే ఒక్కో మోటారుపై రూ.50 వేలు అదనపు భారం - నిరసన తెలిపినా అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యమే... సాక్షిప్రతినిధి, కాకినాడ : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అందుకే రైతు పక్షపాతి ఎవరంటే ఎవరి నోటైనా ఠక్కున వచ్చే సమాధానం వైఎస్ రాజశేఖరరెడ్డి అని. ప్రజాప్రస్థానంతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసేటప్పుడు ఆ మహానేత రైతుల బాధలను వారి పొలాలకు వెళ్లి నేరుగా చూసి చలించిపోయారు. అందుకే మెట్ట ప్రాంతంలో విద్యుత్పై ఆధారపడి వరి పండించే రైతులతోపాటు నర్సరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్తు సరఫరా చేశారు. వైఎస్కు ముందు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో రైతుల పక్షాన ఉంటానని నమ్మబలికి రైతుల ఓట్ల కోసం వారికి రుణమాఫీ ప్రకటించారు. అది అరకొర మాఫీగానే మిగిలిపోయిందిగానీ రైతుల రుణాలన్నీ మొత్తంగాæ మాఫీ చేశానని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ విషయాన్ని పక్కనబెడితే జిల్లాలో నర్సరీ రైతుల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో వైఎస్ వారికి ఉచిత విద్యుత్తును ప్రకటించి అమలు చేశారు. విద్యుత్తు బకాయిలు చెల్లించనవసరం లేకుండా సడలింపు ఇచ్చారు. విద్యుత్తు చార్జీలు భారంగా మారాయని మొరబెట్టుకున్న నర్సరీ రైతులను మానవతా దృక్పధంతో రాజశేఖరరెడ్డి ఆదుకుంటే, అటువంటి రైతుల నెత్తిపై చంద్రబాబు విద్యుత్తు ఛార్జీల భారం మోపేందుకు ‘సై’ అంటున్నారు. నాటి వైఎస్కు నేటి చంద్రబాబుకు ఉన్న తేడా అదేనని రైతుల మధ్య చర్చ నడుస్తోంది. వై.ఎస్. ఏమీ చేశారు...? కడియం నర్సరీలకు రాష్ట్రంతోపాటు పలు రాష్ట్ర్రాల్లో మంచి గుర్తింపు ఉంది. కడియం మండలం ఆ మండలాన్ని ఆనుకుని మండపేట రూరల్, ఆలమూరు, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో కలిపి పాతిక గ్రామాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో నర్సరీలు సాగుచేస్తున్నారు. 15వేల మంది రైతులు నేరుగా నర్సరీలు చేస్తుండగా సుమారు 40వేల మంది ఆ రంగంపై ఆధారపడి పొట్టపోసుకుంటున్నారు. విద్యుత్తు చార్జీల భారంతో నర్సరీ రంగం కుదేలవుతోందని రైతులు అప్పటి రోడ్లు భవనాలశాఖా మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు మొరబెట్టుకున్నారు. వైఎస్ సీఎం అయ్యాక 2004లో కాకినాడ వచ్చిన సందర్భంలో నర్సరీ రైతుల ఇబ్బందులను జక్కంపూడి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన వైఎస్ విద్యుత్ బకాయిలు చెల్లించనవసరం లేదని, విద్యుత్ మీటర్లు బిగించవద్దని ఆదేశాలు జారీచేశారు. అంటే సుమారు 13 ఏళ్లుగా నర్సరీ రైతులు మహానేత వైఎస్ పుణ్యమా అంటూ చార్జీల సడలింపు పొందుతున్నారు. అటువంటి రైతులపై చంద్రబాబు సర్కార్ కత్తికట్టి చార్జీల భారం మోపేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు ఏప్రిల్ ఒకటే తేదీని ముహూర్తంగా నిర్ణయించింది. మోటార్లు బిగించి వసూళ్లకు... వచ్చే నెల ఒకటి నుంచి నర్సరీల్లోని విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి ప్రతినెలా బిల్లులు వసూలు చేయనుంది. ఇప్పటి వరకు వ్యవసాయ హోదాలో ఉన్న నర్సరీ రంగాన్ని ఉద్యాన రంగంగా పరిగణిస్తూ చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులపై భారం మోపుతోంది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడ్డ రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ హయాంలో విద్యుత్ మీటర్లు పెడదామని ట్రాన్స్కో అధికారుల ప్రతిపాదనను తిరస్కరించి ‘ఆల్ నర్సరీస్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్..’అంటూ అధికారులకు తెగేసి చెప్పారని నాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాడాల వీరాస్వామి ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి చొరవతో నర్సరీలకు ఉచిత విద్యుత్తును అమలు చేశారన్నారు. రైతులకు తమ ప్రభుత్వం వెన్నంటి నిలుస్తుందంటోన్న చంద్రబాబు 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న నర్సరీ రంగంపై విద్యుత్ బిల్లుల భారం వేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.నాడు రాజశేఖర్రెడ్డి కల్పించిన బిల్లుల సడలింపు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో మోటారుపై ఏడాదికి రూ.50 వేలు పైమాటే.. ఒక్కో మోటారుపై ఏడాదికి రూ. 50 వేలు వరకు విద్యుత్ బిల్లు భారం పడుతుందని అంచనా. అంటే నర్సరీ రైతులపై ఏడాదికి పడే భారం ఆరున్నర కోట్లు పై మాటే. 5 హార్స్పవర్ మోటారు ఒక్కో దానిపై ఏడాదికి రూ. 50వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్న 5 హెచ్పీ మోటారుపై గంటకు 3.75 యూనిట్లు విద్యుత్తు అవసరమవుతుంది. 7 గంటలపాటు సరఫరా చేస్తారని లెక్కేసినా రోజుకు 26.25 యూనిట్లు వంతున నెలకు 787.50 యూనిట్లు వినియోగించాల్సి వస్తుంది. యూనిట్కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.70. ఈ లెక్కన నెలకు రూ.2,913.75 విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలి. విద్యుత్తు ఛార్జీలకు ఇతర ఛార్జీలు అదనంగా కలిపితే నెలనెలా ఒక మోటారు రూ. 3,500 పైనే బిల్లుల భారం పడనుంది. ప్రస్తుతం నర్సరీల్లో వినియోగిస్తున్న విద్యుత్తు మోటార్లు దాదాపు పాతవే. ఇవి ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.అంటే ఆ మేరకు భారం మరింత పెరుగుతుందంటున్నారు. నర్సరీల్లో మొక్కలకు నిత్యం నీటి అవసరాలు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై సోలార్ పంపుసెట్లు ఇస్తున్నాం వాటిని వినియోగించమని చెబుతోంది. వాతావరణ పరిమితులతోపాటు, సీజన్ల వారీగా చేలలో ప్యాకెట్లను మార్చడం, మబ్బుతో కూడిన వాతావరణం ఉన్న సమయాల్లో నీటిని తోడడంలో తలెత్తే ఇబ్బందులు, సోలార్పై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో సోలార్ మోటార్లను అమర్చుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ అననుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులను నట్టేటా ముంచేసేందుకు సమాయత్తమవుతోందని వాపోతున్నారు. నిరసనగా మోటారు సైకిల్ ర్యాలీ చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై ఆందోళనతో ఉన్న నర్సరీ రైతులు రెండు రోజుల కిందట మోటర్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కడియం నర్సరీ రైతు సంఘం అధ్యక్షుడు పుల్లా చంటి, ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తదితర ప్రతినిధులు సుమారు 250 మంది రైతులతో కలిసి రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఇంటికి వెళితే గంటన్నర తరువాత కానీ కలవలేకపోయామంటున్నారు. వైఎస్ ఇవ్వగా లేంది ఇప్పుడు ఇవ్వలేరా అని రైతులు ప్రశ్నిస్తే అప్పుడు పక్కాగా ఇచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని అయినా అదంతా ఏపీఈఆర్సీ పరిధిలో ఉందని, సీఎం వద్దకు వెళదామని ముక్తసరిగా సమాధానం చెప్పారని రైతులు పేర్కొంటున్నారు. రైతుల విషయంలో మహానేత వైఎస్కు, ఇప్పటి సీఎం చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనంటున్నారు. -
పేనుకు పెత్తనం ఇస్తే..
రాజ్యాంగేతర శక్తిగా మారిన జన్మభూమి కమిటీలు వాటికి తలవంచిన అధికారులు రద్దు చేసిన వృద్ధుల పింఛన్లకు న్యాయపోరాటం మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి చంద్రబాబు తయారుచేసిన జన్మభూమి కమిటీ వ్యవస్థ.. రాజ్యాంగేతర శక్తిగా మారి..అధికారులను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీల పెత్తనం.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీలుగా నియమించి వారి ద్వారా చేస్తున్న పాలన ప్రజాస్వామికవాదులను విస్తుబోయేలా చేస్తోంది. పథకాల అమలు చేయడంలో వారు చెప్పిందే వేదమన్నట్టుగా అధికారులు కూడా వ్యవహరిస్తుండడంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోతోంది. ఈ కమిటీ పరిస్థితి.. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) ఎవరికైనా రుణాలు, సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఈ జన్మభూమి కమిటీలు.. జీరోలు చేస్తున్నాయి. మండలం కాపవరంలో కేవలం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులన్న కారణంతో అర్హులైన 9 మంది వృద్ధులకు పింఛన్లను ఈ కమిటీలు తొలగించాయి. వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు బీసీకి చెందిన వారు ఉన్నారు. మండల, జిల్లా గ్రీవెన్స్సెల్లో వీరు ఎన్నోసార్లు లిఖిత పూర్వకంగా అర్జీలు దాఖలు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామంలోని మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు) సహకారంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు పింఛన్లకు అర్హులేనని, ఫిబ్రవరి 4వ తేదీలోగా వీరికి పింఛన్లు పంపిణీ చేయాలని జనవరి 21న మండల లీగల్ సెల్ అధారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో జన్మభూమి కమిటీని కాదని తానేమీ చేయలేనంటూ ఎంపీడీఓ చేతులెత్తేశారు. దివంగత సీఎం వైఎస్ పాలనలో మంజూరు చేసిన పింఛన్లను రెండేళ్లుగా ఇవ్వనందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ పింఛనుదారుల నరాల లోవరాజు, గీసాల మునియ్య, నరాల పాపయ్య, వజ్రపు యల్లారమ్మ, కొల్లపు శ్రీరాములు, పెట్టా సత్యం, నరాల తణుకులు, గీసాల కృష్ణమూర్తి, కొల్లపు చినసూరయ్య ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీలను ప్రజల నెత్తిన రుద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. న్యాయాధికారి ఆదేశించినా పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకోకుంటే.. న్యాయం కోసం ఎక్కడకి వెళ్లాలని వారు అడుగుతున్నారు జన్మభూమి కమిటీ శాపంలా దాపురించింది.. అధికారులకు, ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకున్నాం. న్యాయ శాఖను ఆశ్రయించాం. అయినా మా వేదన అరణ్య రోదన అయింది. జన్మభూమి కమిటీ మా పాలిట శాపంలా దాపురించింది. - నరాల పాపయ్య రెండో పూట గడవని దుస్థితి.. ఒక పూట తింటే రెండో పూట గడవని దుస్థితి నాది. నా పింఛన్ను జన్మభూమి కమిటీ వాళ్లు తీసేశారు. మరో దారి లేదు. పింఛన్ తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నాను. - కొల్లపు చిన సూర్యారావు అధికారుల తీరు బాధాకరం వృద్ధుల పింఛన్ల రద్దు విషయంపై న్యాయ వ్యవస్థ ఆదేశించిన తరువాతైనా అధికారులు కళ్లు తెరవకపోవడం బాధాకరం. అధికారులు ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలి. - కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు), మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించినా పింఛన్ల మంజూరుకు అధికారులు.. జన్మభూమి కమిటీకే తలొగ్గడం గర్హనీయం. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది. - అంగర గోపాలాచార్యులు, హైకోర్టు న్యాయవాది హైకోర్టు అప్పీలుకు వెళ్లాం వీరికి పింఛన్లు పంపిణీ చేయమని మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించడం వాస్తవమే. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు అంగీకరించకుండా ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై హైకోర్టుకు అప్పీలు వెళ్లాం. - పీవీవీ సత్యనారాయణ, ఎంపీడీఓ -
అందుకేనా..?
స్కూలు కోసం పాపారావు స్థలం సేకరణ అదే సర్వే నంబర్లోని సత్యవతి స్థల సేకరణపై కోర్టు స్టే మరోచోట పాఠశాల నిర్మాణం స్కూలు కోసం సేకరించిన స్థలంలో వాంబే ఇళ్ల నిర్మాణం పొరపాటున సత్యవతి స్థలంలో కూడా కట్టిన వైనం దీనిపై కోర్టును ఆశ్రయించిన సత్యవతి కుమారుడు విచారణ జరిగితే ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అందుకే ఆక్రమణలపై నోరు మెదపని యంత్రాంగం సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరైనా ఓ ప్రైవేటు వ్యక్తి 20 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ప్రభుత్వ యంత్రాంగం కోర్టును ఆశ్రయించి, పోలీసుల సహాయంతో ఖాళీ చేయిస్తుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరం ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన సుమారు మూడెకరాల స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తనదంటూ ఆక్రమించి, అమ్మేసేందుకు చకచకా పావులు కదుపుతుంటే అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730/2సి2 స్థలంలోని పేదలను ఖాళీ చేయించి కంచె వేయడం ప్రారంభించి శనివారంతో మూడు నెలలవుతోంది. ఇప్పటికీ కూడా అధికారులు దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. విచారణ చేసి ఆ స్థలంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. విలేకర్లు ప్రస్తావిస్తే విచారణ చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు. తమ పరిధిలోకి రాదంటూ రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు చెబుతూ గడిపేస్తున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత వెనుక మతలబేమిటన్న కోణంలో ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/డి, 725/3ఎ, 725/3బి, 730/2సి2, 731/2లలో 5.87 ఎకరాలకు 1985లో అవార్డు ప్రకటించారు. కోర్టు స్టేలు, సేకరణ ఉపసంహరణల తర్వాత చివరికి రెవెన్యూ యంత్రాంగం ప్రకటించిన అవార్డు 3.80 ఎకరాలకు వర్తించింది. వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ కోసం ఈ భూమి సేకరణకు యత్నించగా ఈ ప్రక్రియ దాదాపు 2001 వరకు నడిచింది. దీంతో హైసూ్కల్ నిర్మాణం ప్రస్తుతం ఉన్న స్థలం ఎదురుగా (కంబాల చెరువు నుంచి పేపర్ మిల్లు రోడ్డు వైపు) నిర్మించారు. కోర్టు వివాదాల అనంతరం ఆ స్థలంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అప్పటికే పాఠశాల నిర్మించడంతో ఆ స్థలంలో పేదలకు వాంబే ఇళ్లు నిర్మించాలని 2003లో నిర్ణయించి, అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఎ నుంచి ఐ వరకు 9 బ్లాకులు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2003లో ఎ బ్లాక్ నిర్మించి పేదలకు ఇచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు క్రమేపీ హెచ్ బ్లాక్ వరకు నిర్మించి, ఎంపిక చేసిన పేదలకు కేటాయించాయి. స్థలం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఐ బ్లాక్ నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభించలేదు. అయితే ఆ బ్లాక్లో ఎవరెవరికి ఇళ్లివ్వాలనేది ముందుగానే ఎంపిక చేశారు. వారిలో కొంతమంది ఆదెమ్మదిబ్బలో తెలుగు తమ్ముడు ఖాళీ చేయించిన పేదలు ఉన్నారు. ఎ నుంచి ఐ వరకు వాంబే బ్లాకుల నిర్మాణ ప్లా¯ŒSను హోలీ ఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక గోడపై స్పష్టంగా పెయింటింగ్ చేశారు. వాంబే ఇళ్ల నిర్మాణంలో ఏం జరిగింది? పేపర్లపై యంత్రాంగం వేసిన ప్లా¯ŒS అమలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా జరిగింది. సత్యవోలు పాపారావు స్థలాన్ని ప్రభుత్వం సేకరించి అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హైకోర్టు స్టే విధించడంతో సత్యవోలు సత్యవతి స్థలానికి అవార్డు వర్తించని విషయం పాఠకులకు తెలిసిందే. అయితే సత్యవోలు పాపారావు స్థలంతోపాటు సత్యవోలు సత్యవతి స్థలంలో కూడా పొరపాటున వాంబే ఇళ్లు కట్టేశారు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే గృహాలు కట్టిందంటూ 2011లో సత్యవోలు సత్యవతి రెండో కుమారుడు దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టును ఆశ్రయించే వరకు ఈ విషయం అధికారులు కూడా గుర్తించలేదు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే ఇళ్లు కట్టిందంటూ కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్, ప్రతివాదులుగా పేర్కొంటూ దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టులో ఓఎస్ నంబర్ 62/2011 దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికీ నగరపాలక సంస్థ యంత్రాంగం కోర్టు వాయిదాలకు హాజరవుతోంది. తమకు ఇబ్బంది వస్తుందనేనా? సేకరించిన కొంత స్థలంతోపాటు పొరపాటున ప్రైవేటు వ్యక్తికి చెందిన మరికొంత స్థలంలో వాంబే ఇళ్లు కట్టడంతో యంత్రాంగం తప్పు చేసినట్లయింది. తెలియక చేసినా ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కింది స్థాయి అధికారులు తాత్సారం చేసినట్లు సమాచారం. చేసిన తప్పు ఒప్పుకుంటే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న జంకుతోనే అధికార యంత్రాం గం అసలు విషయాన్ని తొక్కిపెడుతుందన్న విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు ఆ స్థలం తనదని పేర్కొం టూ కోలమూరు టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడితో, అక్కడ పేదలను ఖాళీ చేయించి ఏకంగా బోర్డులే పెట్టేశారని తెలుస్తోంది. -
వెలుగుచూస్తున్న పింఛన్ల అక్రమాలు
కాపు కులస్తులకు చేనేత .. సొసైటీ డైరెక్టర్కు వింతంతు పింఛన్లు గొల్లప్రోలు (పిఠాపురం) : మొన్న పిఠాపురం.. నిన్న అనపర్తి నియోజకవర్గం కొంకుదురు...నేడు గొల్లప్రోలు నగర పంచాయతీలో పింఛను అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పచ్చనేతలు కనుసన్నల్లో పింఛను జాబితాలు ఇష్టానుసారంగా రూపొందించారు. బొట్టు చెరగకుండానే పుణ్య స్త్రీలను వితంతువులుగాను, కులం పేరులో మార్పులు చేసి పచ్చ చొక్కాలు ధరించిన వారికి పింఛన్లు మంజూరు చేశారు. ఎంతో మంది అర్హులు పింఛను కోసం కాళ్లరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరిగినా వారికి భరోసా కనిపించడం లేదు. తాజాగా గొల్లప్రోలు నగర పంచాయతీలో పింఛను మంజూరులో భారీ ఎత్తున అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో భాగంగా పలు అవకతవకలు బయటపడ్డాయి. గొల్లప్రోలు విశాల వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ కొల్లి సత్యవతికి భర్త సూర్యారావు బతికుండగానే వితంతు పింఛను (ఐడీ నెంబరు 104828101) మంజూరు చేశారు. అదే విధంగా 10వ వార్డులోని కాపు సామాజికవర్గానికి చెందిన మర్రి వెంకట్రావుకు బీసీ చేనేత కార్మికునిగా (ఐడీనెంబరు–104832404), 19వ వార్డు కాపు సామాజిక వర్గానికి చెందిన రాశంశెట్టి దొంగబ్బాయి బీసీ చేనేత కార్మికునిగా (ఐడీ నెంబరు–104836671) పింఛను మంజూరు చేశారు. పట్టణానికి చెందిన ఆరుగురు చేనేత కార్మికులకు పింఛను మంజూరు కాగా ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారిని చేనేత కార్మికులుగా గుర్తించి పింఛను మంజూరు చేయడం విశేషం. వాస్తవానికి పలువురు వయసు తక్కువ ఉన్న వారిని ఆధార్కార్డులో వయసు ఎక్కువగా ఉన్నట్టు మార్పులు చేయించుకుని పింఛను కేటాయించారు. పింఛను మంజూరులో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు దారుణం
భీమవరం అర్బన్ : మా ఓట్లతో గెలుపొంది, మా సమస్యలను పరిష్కరించాల్సిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు గోదావరి ఫుడ్పార్కుసై మాట మార్చడం దారుణమని ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఫుడ్పార్కుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, మహిళలు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదిన ప్రపంచం మొత్తం మహిళల హక్కులను, మహిళల గౌరవ మర్యాదలను కీర్తిస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తుందుర్రులో మహిళలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫుడ్పార్కును ఈ ప్రాంతంలో వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చటి పొలాల మధ్య కెమికల్స్ కలిగిన ఫ్యాక్టరీ పెట్టేందుకు అధికారులు సైతం వంతపాడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే స్థలాల్లో ఇటువంటి ఫుడ్పార్కు ఫ్యాక్టరీని కట్టుకోవాలని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీ యజమానుల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో నగదు లాబీయింగ్ చేసుకుని వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ వద్దని శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా నిర్మాణ పనులు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మమ్మల్ని వ్యతిరేకించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసినా ఏదో రూపంలో నిరసనలు చేసి ఫ్యాక్టరీ ఉత్పత్తులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో చీడే నాగమణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ఉద్యమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దళిత నాయకుడు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్పై కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వివిధ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలపాల రవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, కొంత కాలంగా దళిత ఉద్యోగులే లక్ష్యంగా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా ఉద్యోగులను బదిలీ చేయకూడదనే నిబంధన కలెక్టర్కు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ఉద్యోగులను అవినీతిపరులుగా చూపించడానికి కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ భాస్కర్ దళిత ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మొండెం సంతోష్ కుమార్, మున్నుల జాన్గురునా«థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళిత నాయకులు పులవర్తి కొండబాబు, ఎం.ఆనందరావు, పలివెల చంటి, కందుల రమేష్, దాసరి నాగేంద్రకుమార్, మేతర అజయ్, అంతర్వేది కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సాగర్ వేధిస్తున్నారు.. రేషన్ డీలర్ల ఆరోపణ ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ ఎల్వీ సాగర్ వేధిస్తున్నారని పలువురు రేషన్ డీలర్లు ఆరోపించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్, రేషన్ డీలర్ రాయి విమలాదేవి మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినైనా ఏకవచనంతో సంబోధిస్తూ మహిళనని కూడా చూడకుండా సాగర్ కించపరుస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రొటోకాల్ నిమిత్తం తమ అసోసియేషన్ నాయకుడు గంగాధర్ నెలకి రూ.500 చొప్పున వసూలు చేసేవారని, సాగర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచారని, భరించలేమని చెబితే దానిని రూ.1,000కి తగ్గించారన్నారు. విషయాన్ని గంగాధర్కు చెబితే అతను కూడా సాగర్కు అనుకూలంగా మారి తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో బినామీ డీలర్లు ఎవరూ లేరని, అందరూ కుటుంబసభ్యులు మాత్రమే దుకాణాలను నిర్వహిస్తున్నామన్నారు. మారిన పరిస్థితుల్లో ఒక్కో డీలర్ పరిధిలో సుమారు 300కు మించి కార్డులు లేవని, అయితే గంగాధర్కు 800 కార్డులున్నాయన్నారు. గంగాధర్కు మూడు బినామీ దుకాణాలు ఉన్నాయని ఆరోపించారు. అటువంటి వ్యక్తి తమ కష్టాలపై పోరాడాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారు బినామీ డీలర్లని ప్రచారం చేయడం తగదన్నారు. విలేకరుల సమావేశంలో రేషన్ డీలర్లు దాసరి ఆంజనేయులు, ఈపిచర్ల కాశి, మాదాల రాజశేఖర్, పీవీ రమణ, ఎం.శారద, డి.గంగ, సీహెచ్ రమేష్ పాల్గొన్నారు. -
‘పచ్చ’ వాకిళ్లు పదిలం
-ఇతరులవి పొక్లెయిన్ కోరలకు ఫలహారం -మురుగుకాలుల నిర్మాణంలో ద్వంద్వనీతి -టీడీపీ నేతల ప్రాబల్యంతో అధికారుల వివక్ష రాజమహేంద్రవరం సిటీ : నగరంలో మురుగుకాలువల నిర్మాణంలో ‘సమన్యాయం’ అనే దానిపై ‘పొక్లెయిన్’ కోరల్లో నుజ్జునుజ్జవుతోంది. నిర్మాణానికి అడ్డం వచ్చే ఇళ్లలో అధికార టీడీపీ వాళ్లవి ఉంటే కాలువ దారిని అష్టవంకరలతో మళ్లిసున్నారు. అదే మిగిలిన వారి ఇళ్లు అడ్డం వస్తే నిస్సంకోచంగా పగులగొట్టి నిర్మాణం సాగిస్తున్నారు. నగరంలో దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో పాతకాలపు మురుగు కాలువల పునర్నిర్మాణం చేపట్టారు. నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు ఎవరికి చెందిన అక్రమ కట్టడాలు అడ్డంకిగా ఉన్నా తొలగించాల్సిన అధికారులు ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారు. ‘దేశం’ వారి నివాసాల వద్ద ఒంపులే ఒంపులు కాలువల నిర్మాణానికి ఆటంకమయ్యే ఆక్రమణలను తొలగించాల్సిన నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అధికార పార్టీకి చెందిన వారికి ఓ న్యాయం, మిగిలిన వారికి ఇంకో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ వారి కట్టడాలున్న చోట వాటి జోలికి పోకుండా ఒంపులతో కాలువ నిర్మిస్తూ.. అదే మిగిలిన వారి కట్టడాలు అడ్డంగా ఉంటే ఆగమేఘాల మీద జేసీబీలతో తొలగిస్తున్నారు. ఏవీ అప్పారావు రోడ్లో వైట్హౌస్ ఎదురుగా శ్రీనివాసా గార్డెన్స్లో కాలువ నిర్మాణం ఓ అధికార పార్టీ నాయకుని ఇంటి వరకూ తిన్నగానే సాగింది. అక్కడి నుంచి నిర్మాణం తిన్నగా జరగాలంటే ఆ నాయకుని ఇంటి మెట్లతో పాటు మూడడుగుల మేర అడ్డంగా ఉన్నాయి. అంత మేరా అడ్డంకిని తొలగించి, కాలువను తిన్నగా నిర్మించాల్సిన అధికారులు.. ఆ ఇంటి దిగువమెట్టుపైన కూడా కనీసం గునపు మొన పడకుండా కాలువను వంపు తిప్పి నిర్మించారు. అలాగే దేవీచౌక్లో కూడా అధికార పార్టీ వారి భవనం చెక్కు చెదరకుండా కాలువనే దారి మళ్లించారు. కమిషనర్ ఏమంటారు? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాబలత్యంతో ఇంజినీరింగ్ అధికారులు ప్రదర్శిస్తున్న వివక్ష నగరవాసులను విస్మయపరుస్తోంది. అధికార పార్టీకి చెందిన వారి కట్టడాల మెట్లను సైతం ముట్టుకోకుండా ఎంతైనా ఒంపులు తిప్పి కాలువలు నిర్మిస్తున్న అధికారులు ఇతరుల ఇళ్లను, నిర్మాణాలను తక్షణమే తొలగించడంపై ధ్వజమెత్తుతున్నారు. అధికార పార్టీ వారికో న్యాయం, ఇతరులకో న్యాయం అమలు చేయడంపై మండిపడుతున్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పే కమిషనర్ విజయరామరాజు కాలువల నిర్మాణంలో బాహాటంగా జరుగుతున్న ఈ వివక్షపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. -
బొట్టు చెదరకున్నా భరోసా
పుణ్యస్త్రీలకూ వితంతు పింఛన్లు కొంకుదురులో టీడీపీ కుతంత్రం ముఖ్యనేత మామ కనుసన్నల్లో జన్మభూమి కమిటీ బరితెగింపు అనర్హులకు యథేచ్ఛగా మంజూరు అస్మదీయులు కారని అర్హులకు అన్యాయం పిఠాపురం తరహాలో మరో కుంభకోణం పచ్చచొక్కా వేసుకుంటే చాలు అక్కడ జరగని పని అంటూ ఉండదు. భూమ్మీద నిక్షేపంగా బతికున్న వారికి కూడా చనిపోయినట్టు రికార్డులు పుట్టించి, వారి భార్యలకు వితంతువులుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎడాపెడా మంజూరు చేయగలరు. అక్కడ ముఖ్యనేత మామ చేసేదే శాసనం, చెప్పిందే చట్టం. పిఠాపురంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా పింఛన్లు మేసేస్తున్న బాగోతం కొలిక్కి రాకుండానే అనపర్తి నియోజకవర్గం కొంకుదురులో వెలుగు చూసిన ఆ తరహా కుంభకోణం ఇది. అవినీతిపై ‘సాక్షి’ సేకరించిన సాక్ష్యాధారాలిలా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలోని కొంకుదురు గ్రామం అవకతవకలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. అక్కడ అర్హులను గాలికొదిలేసి. జన్మభూమి కమిటీ ముసుగులో అనర్హులకు, అనుచరగణానికి పింఛన్లు కట్టబెట్టారు. వాస్తవాలన్నీ తెలిసినా ఉద్యోగులు పెదవి విప్పలేని పరిస్థితి. అడిగే నాథుడు లేడనే ధైర్యంతో నియోజకవర్గంలో ఒక ముఖ్యనేత మేనమామ కొంకుదురు పంచాయతీపై పెత్తనం చెలాయిస్తూ అడ్డగోలుగా పింఛన్లు అనర్హులకు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి అండ చూసుకుని తమ్ముళ్లు బరితెగించేశారు. అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు పింఛన్ల భరోసా కల్పించారు. కొంకుదురులో సత్తి పద్మావతి భర్త వెంకటరామారెడ్డి నిక్షేపంలా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ పింఛన్ కోసం చనిపోయినట్టుగా చూపించి భార్యకు వితంతు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. గుడిమెట్ల పుష్పావతి భర్త రామారెడ్డి కొంకుదురు పరిసర ప్రాంతాల్లో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కానీ పుష్పావతికి వితంతు పింఛన్ అందుతోంది. గనిశెట్టి నాగమణి భర్త వెంకట్రావు చుట్టలు చుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమణికి కూడా వితంతు పింఛన్ మంజూరు చేశారు. గ్రామ జనాభా 6,987. పురుషులు 3,449 మంది, మహిళలు 3,538 మంది. సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 852 మంది. అత్యధికంగా 326 మంది వితంతు పింఛన్లు పొందుతున్నారు. 300 మంది వృద్ధులు, 104 మంది వికలాంగులు, 13 మంది చేనేత కార్మికులు, 7గురు కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా 102 మంది అభయహస్తం పింఛన్లు పొందుతున్నారు. ఇవన్నీ తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీలు ఎంపిక చేసినవేనంటున్నారు. వయసు తక్కువైనా జన్మభూమి కమిటీలోని తెలుగుతమ్ముళ్లకు నచ్చిన వారైతే ఒకే ఇంటిలో ఇద్దరికి పింఛన్లు ఇచ్చేశారు. ఒక ఇంటిలో ఆధార్ నంబర్ 240009279916, పింఛన్ ఐడీ నంబరు 702682తో పడాల గంగిరెడ్డికి, ఆధార్ నంబర్ 307946113548 , ఐడీ నంబర్ 192547తో అతని భార్య పడాల లక్షి్మకి ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశారు. అన్ని అర్హతలున్నా అక్కడి జన్మభూమి కమిటీ చాలా మంది నిర్భాగ్యులను పింఛన్లకు దూరం చేసింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నుంచి పింఛన్లు తీసుకుంటున్న అర్హులను జాబితా నుంచి తొలగించేశారు. టీడీపీకి కాక వైఎస్సార్ సీపీకి ఓటేశారని కొందరిని, ఆ పార్టీ ప్రచారానికి వెళ్లారని మరికొందరిని, ఆటోలో తీసుకువెళ్లారని ఇంకొందరిని...ఇలా పింఛన్లను తొలగించేసి నిర్భాగ్యులను రోడ్డునపడేశారు. వికలాంగురాలైన చిట్టూరి సత్యవతి వైఎస్ హయాంలో పింఛన్ పొందేది. ఇటీవల జన్మభూమి గ్రామసభలో తెలుగుతమ్ముళ్లు ఆమె పింఛన్ను రద్దుచేసేశారు. వికలాంగుల సర్టిఫికెట్ ఉందని వేడుకున్నా కనికరం చూపలేదు. వయసు మీదపడి అడుగు ముందుకు పడని వారిపై కూడా వారు దయ చూపలేదు. తమకు పింఛన్లు లేకుండా చేసిన టీడీపీ వారికి తమ ఉసురు తగుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. పెత్తనమంతా జన్మభూమి కమిటీదే... అధికారులు పేరుకే తప్ప పెత్తనం అంతా జన్మభూమి కమిటీదే. జన్మభూమి కమిటీలో టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్ చంద్రమళ్ల చిన్నారావు, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, రంది రామకుమారి, కుక్కల సుమతితో పాటు మరో ఇద్దరు సామాజికవేత్తలున్నారు. వారిచ్చేదే తుది జాబితాగా ఎంపిక జరిగిందనే విమర్శలున్నాయి. ఒక్క కొంకుదురులోనే అనర్హులకు ఇన్ని పింఛన్లు ఇచ్చారంటే నియోజకవర్గమంతా పరిశీలిస్తే లెక్కా పత్రం ఉండదేమోనంటున్నారు. పింఛన్ల బాగోతంపై స్థానికులు, అర్హత ఉండీ పింఛన్ రాని వారు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు. -
కబ్జా చేసి.. చదును చేస్తూ..
రూ.100 కోట్ల ప్రభుత్వ స్థలం ప్రైవేటుపాలు ఆక్రమించి చదును చేస్తున్న జన్మభూమి కమిటీ సభ్యుడు మిగిలిన ముగ్గురు పేదల గుడిసెలు ఖాళీ బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడకు వెళ్లిన ‘సాక్షి’ సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలోని అదెమ్మదిబ్బ ప్రాంతంలో సర్వే నంబర్ 730/2సీ2లో ఉన్న (3.54 ఎకరాలు) రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నేత, జన్మభూమి కమిటీ సభ్యుడు యథేచ్ఛగా కబ్జా చేశారు. అక్కడ గుడిసెలు, రేకు షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 మంది పేదలను నయానో భయానో ఖాళీ చేయించారు. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు అంతంత మాత్రంగానే స్పందించ డం గమనార్హం. ఆ స్థలం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ 1985లో సేకరించి నగరపాలక సంస్థ పాఠశాల నిర్మాణానికి అప్పగించారని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా కథనాలను ప్రచురించినా రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం, స్థలంపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. తాజాగా స్థలం కొన్నానంటూ చెబుతున్న రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఏ దిక్కూలేక మూడు నెలలుగా ప్రతిఘటించి అక్కడే ఉంటున్న ముగ్గురు పేద కుటుంబాలను సోమవారం ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించారు. చుట్టూ కంచె, మధ్యలో రేకుల షెడ్డు ఉన్నా కంచె వేయడంతో అక్కడ ఉన్న వృద్ధుడిని ఖాళీ చేయించారు. అతను తన సామాగ్రిని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ వృద్ధుడి ఇంటిని కూలీలు నేలమట్టం చేశారు. మిగిలిన రెండు పూరిగుడిసెలవారిని తమ సామాగ్రి బయట పెట్టుకోవాలని బెదిరిస్తున్నారు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పకోవాలో అర్ధంగాక వారు ‘సాక్షి’కి ఫోన్ చేశారు. నా స్థలంలోకి ఎందుకు వచ్చావ్ ? బాధితుల ఫిర్యాదు మేరకు ఆదెమ్మదిబ్బ ప్రాంతానికి ‘సాక్షి’ వెళ్లి చూడగా రేకుల షెడ్డు తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని పొక్లెయిన్తో చదును చేస్తున్నారు. రేకుల షెడ్డు వృద్ధుడు చెప్పిన మేరకు అతడి నివాసాన్ని పరిశీలించేందుకు అక్కడకి వెళ్లగా ‘ ఈ స్థలం నేను కొన్నాను. లోపలికి ఎందుకు వచ్చావ్? ఎవరు ఇక్కడకు రమ్మన్నారు?’ అంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు వచ్చానని, మీరు ఈ స్థలం కొనుగోలు చేస్తే పత్రాలు చూపించాలని అడగ్గా, స్థలం పత్రాలు కావాలంటే అర్బన్ఎమ్మార్వోను అడగాలని చెప్పుకొచ్చారు. -
మృతదేహాల తరలింపులో ఉత్కంఠ
జంట హత్యల కేసులో కలెక్టరేట్ వద్ద ఆందోళన బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల డిమాండ్ బాధ్యులను అరెస్టు చేయాలని నినాదాలు భారీగా పోలీస్ల మోహరింపు∙ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల రెండో తేదీన కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసు బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల కేసులో ప్రధాన నిందితుడు అశోక్కుమార్ ఘటన జరిగిన రోజే పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుబ్బయ్య హోటల్ యాజమాన్యానికి చెందిన ఇద్దరి ప్రమేయం ఉందని, ఏ1 ముద్దాయిలుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ మూడు రోజులుగా కాకినాడలో ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మార్చి రెండున జీజీహెచ్లో పోస్ట్మార్టమ్ పూర్తయినా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. బా«ధితులకు న్యా యం జరిగేదాకా మృత దేహాలను తీసుకువెళ్లే ప్రశక్తి లేదని ఒక పక్క, పోస్ట్మార్టమ్ అయిన మృతదేహాలను మూడు రోజుల్లో తీసుకెళ్లకపోతే మున్సిపల్ కార్పొరేష¯ŒSకి అప్పగించి, దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసులు మరో పక్క ప్రకటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు కలెక్టరేట్ వద్ద శనివారం ఉదయం జిల్లా దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. çసుబ్బయ్య హŸటల్ సిబ్బందిపై ఏ1గా పరిగణించాలని, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జేసీ సత్యనారాయణను కలిసి వారి డిమాండ్లు వినిపించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని సర్దిచెప్పారు. జేసీ చాంబర్లోనే డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావుతో చర్చించారు. దర్యాప్తు సాగుతుందని, ఆందోళన విరమించి, మృతదేహాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించగా తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే తీసుకువెళ్తామని, లేదంటే ఉంచేస్తామని దళిత నాయకులు తెలిపారు. దళిత ఐక్యవేదిక నేతలు« డి.శ్యామ్సుందర్, సబ్బతి ఫణీశ్వరరావు, గుడాల కృçష్ణ, కొండేపూడి ఉదయ్కుమార్ పాల్గొన్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మొహరించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మార్చురీ వద్ద నుంచి కలెక్టరేట్కు మృతదేహాలతో ధర్నా చేస్తారన్న సమాచారంతో డీఎస్పీ పరిధిలోని పోలీసులు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించి ఈ భారీ బందోబస్తు చేశారు. -
టీఆర్ఎస్లో మళ్లీ తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్
-
నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
దివీస్పై అఖిలపక్ష నాయకులు కాకినాడ సిటీ : తొండంగి మండలంలో నిర్మించతలపెట్టిన దివీస్ కంపెనీ విషయంలో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక సుందరయ్యభవన్లో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆరు నెలలుగా తొండంగి మండలంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ దౌర్జన్యంగా దివీస్ నిర్మాణం ఎందుకు సాగించాల్సి వస్తోందని, ప్రజలు ప్రశ్నించే చోటల్లా 144 సెక్షన్ విధించడం ఏమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజలను వారి భూముల్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యంగా అడ్డగించడం దారుణమన్నారు. దివీస్ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి గోడ నిర్మిస్తోందని రైతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకుండా ఆక్రమణదారులవైపే ఎందుకు ఉండాల్సి వస్తుందో బహిరంగ పర్చాలన్నారు. డ్రోన్ కెమెరాలను ఉద్యమాలను అణచడానికి ఉపయోగించడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలలుగా పోలీస్ పికెట్ నడుపుతున్నా పాలకులు ఒక్కసారి కూడా ప్రాంత ప్రజల గోడు వినకపోవడంతో వారు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ నాగేశ్వరరావు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి, ఐఎన్టీయూసీ నాయకులు రోకళ్ళ సత్తిరాజు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. 25కెకెడి151: అఖిలపక్ష నాయకుల సమావేశం -
పర్సంటేజీ పేచీ
ముఖ్యనేత కాసుల వేట అందుకోసం చిల్లర వేషాలు రూ.కోటిన్నర రోడ్డుకు మోకాలడ్డు వేలాదిమందికి ఇబ్బందులు ‘ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకులు ఒకప్పుడుండేవారట!’ అనే రోజులు వచ్చేసేలాఉన్నాయి. ప్రజలెలా పోతే నాకేంటి? నాకు రావాల్సిన పర్సంటేజీ వస్తే చాలనుకుంటున్న నేతలే టీడీపీ హయాంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో ఓ నియోజకవర్గ నేత తీరు ఇలాగే ఉంది. పర్సంటేజీలు లేకుండా ఏ పనైనా చేసేది లేదంటూ తెగేసి చెబుతూండడంతో సహచర నేతలే నివ్వెరపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం శివారు ఇందుపల్లి వంతెన నుంచి భట్లపాలెం మీదుగా అమలాపురం ఎత్తు రోడ్డు వరకూ రెండు కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారి ఉంది. ఆ రోడ్డుపై నిత్యం పది పన్నెండు వేల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులే 3 వేల మంది పైగా ఉంటారు. ట్రాఫిక్ రద్దీ ఉండే అమలాపురం పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అల్లవరం మండలం బోడసకుర్రు, సామంతకుర్రు, డి.రావులపాలెం, దేవగుప్తం, పేరూరు, పాశర్లపూడి నుంచి వచ్చేవారు ఇందుపల్లి మీదుగా అంబాజీపేట, పి.గన్నవరం, రావులపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది బాగా దగ్గర మార్గం. ఈ రోడ్డులో వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం కూడా కలిసి వస్తుంది. ఇంత ముఖ్యమైన ఈ రోడ్డుకు పెద్ద పెద్ద గోతులు పడి, రాళ్లు పైకి లేచిపోవడంతో ప్రజలు మూడున్నరేళ్లుగా నిత్యం నరకం చవి చూస్తున్నారు. పదేపదే విజ్ఞప్తులు చేయగా.. రెండేళ్ల క్రితం ఈ రోడ్డు మరమ్మతుల కోసం జెడ్పీ నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. మరమ్మతులు చేశారు. మళ్లీ మామూలే అయిపోయింది. గోదావరి పుష్కరాల మిగులు నిధుల నుంచి ఈ రోడ్డు ఆధునికీకరణ కోసం మూడు నెలల క్రితం రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ విషయం తెలిసి ఆ రోడ్డులో ప్రయాణించేవారు చాలా సంతోషించారు. ఈ రోడ్డుకు మహర్దశ పడుతుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. రోడ్డు పనులకు ఆన్లైన్ టెండర్లు కూడా పిలిచారు. రావులపాలేనికి చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఇక పనులు మొదలవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో నియోజకవర్గ ముఖ్య నేత ఒకరు ఆ రోడ్డుపై చిల్లర ఏరుకునేందుకు సిద్ధమయ్యారు. పర్సంటేజీ విషయంలో పేచీ మొదలు పెట్టారు. దీంతో రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాధారణంగా ఇటువంటి అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఆన్లైన్ టెండర్లయితే ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతకు 2 శాతం పర్సంటేజీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదే. కానీ ఆ నియోజకవర్గ ముఖ్యనేత అందరి మాదిరిగా 2 శాతం కుదరదంటూ డీల్కు అంగీకరించలేదని సమాచారం. 2 శాతం పర్సంటేజీ అంటే రూ.3 లక్షలివ్వాలి. దీనికి మరో రూ.లక్ష వేసి రూ.4 లక్షలు ఇస్తామని ఆ నేత వద్దకు రెండో దఫా ప్రతిపాదన రాగా తిరస్కరించారు. కాయగూరల బేరంలా ఇటువంటివేమీ కుదరవని, ఇస్తే రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తనకు ముఖం చూపించవద్దని ఆ నేత కేకలు వేసి పంపించేశారని చెబుతున్నారు. ఆందోళన చేస్తే కేసులంటూ బెదిరింపులు ఈ పరిస్థితుల్లో ని««దlులు సిద్ధంగా ఉన్నా పనులు ముందుకు కదలకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఇటీవల మూడు గంటలపాటు ఆందోళన చేశారు. వారికి సంఘీభావంగా ఆ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ఆ నేతకు ఎంతమాత్రం రుచించలేదు. ఆందోళన చేసిన స్థానికులతోపాటు కాలేజీ విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేయాలని అమలాపురం పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికీ విద్యార్థులపై కేసులు పెట్టమంటున్నారని తెలిసింది. పనుల శంకుస్థాపన జరగకపోవడానికి ఆ నేతకు పర్సంటేజీ పేచీయే కారణం కాగా, పైకి మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు డేట్లు సర్దుబాటు కావడం లేదనే కుంటిసాకులు చెబుతున్నారు. -
టెండరింగ్
వాడపల్లి ఆలయంలో చక్రం తిప్పుతున్న నేతలు ఆదాయానికి గండికొడుతున్న వైనం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నలుగురు గ్రామ పెద్దలు తిష్టవేశారని పలువురు వెంకన్న భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్కా నేతలు ఆలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఆలయ అభివృద్ధి పనులకు జరిగిన టెండర్లలో నలుగురు నాయకులు చక్రం తిప్పి పనులు టెండరింగ్ అయ్యేలా ప్రయత్నాలు చేయడంతో పాటు తమ అనుచరులకే పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆలయ సిబ్బంది కూడా వారికి తమ వంతు సాయం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రూ.32.20 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు టెండర్లలో రింగ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది పరోక్ష సహకారంతోనే ఆలయంలో తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారుల సమక్షంలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున గుడ్విల్ రూపంలో అందించి దేవుడికి శఠగోపం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పోటీకీ వచ్చిన టెండరుదార్లను ప్రలోభాలకు గురిచేయడంతో రూ 32.20 లక్షల విలువైన పనులు 0.01 తక్కువ మొత్తానికి (రూ.32 తగ్గించి) టెండర్లు ఖరారైనట్టు ఆలయ ఈవో బీహెచ్వీ రమణమూర్తి ప్రకటించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వెంకన్న ఆలయంలో అన్నదాన సత్రానికి ప్రహరీ, ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వనైజ్డ్ మెస్కు దేవాదాయ శాఖ రూ.32.20లక్ష లు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు ఈ నెల 9న టెండర్లు పిలిచారు. ఆ పనులకు సంబంధించి టెండరుదార్లను ఆహ్వానించేందుకు మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఆలయ పరిపాలన సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది గోప్యం పాటించారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పత్రికల్లో టెండర్ నోటీస్ ప్రకటనలు రాకపోవడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతుంది. దీంతో రూ.32.20 లక్షలు పనులకు నాలుగు టెండర్లు మాత్రమే రాగా అందులో రెండు బినామీ అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయంలో సుమారు రూ.కోటితో పనులు చేపట్టిన కొందరు టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికత పేరుతో బెదిరించి పను లు దక్కించుకున్నారని భక్తులు వాపోతున్నారు. టెండర్ల గురించి మరింత ప్రచారం చేసి ఉంటే 5 శాతం తక్కువకు ఖరారై దేవాదాయ శాఖకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వాడపల్లి ఆలయ పనుల్లో జరిగిన టెండరు అవకతవకలపై దృష్టిసారించి తిరిగి టెండర్లు నిర్వహించాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు. -
అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ బాధిత రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తొండంగి : దివీస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాగు భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం దారుణమన్నారు. కొత్తపాకలు గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రాజా పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, నాయకులు కొయ్య శ్రీనుబాబు, పేకేటి సూరిబాబు, మద్దకూరి చిన్నబ్బులు తదితరులు సోమవారం మద్దతు పలికారు. దీక్షలో కూర్చున రైతులు, మహిళలు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దివీస్ యాజమాన్యం బలప్రయోగానికి దిగుతుందన్నారు. బాధిత రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆరోగ్యం గుర్తురాలేదా? ప్రజల ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో యనలమ ఫౌండేషన్ను స్థాపించామని చెబుతున్న ఆర్థిక మంత్రి యనమలకు కోన ప్రజలు, రైతుల ఆరోగ్యం గుర్తురాలేదా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. దీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల మద్దతుతో రాజకీయంగా ఎదిగిన యనమల ఇప్పుడా ఆ ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పెరుమాళ్లలోవరాజు, కాలిన అప్పారావు, కొంజెర్ల వీరబ్బాయి, మేడిశెట్టి సుబ్బారావు, వెల్నాటి బుజ్జి, కందాబాబ్జి, చొక్కా కోదండం, చొక్కా రామచంద్రరావు, గాబురాజు, మేడిÔð ట్టి ఈశ్వరరావు, మేడిశెట్టి దారబాబు ఉన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు దివీస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతానికి బాధిత రైతులు, ప్రైవేటు సర్వేయర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వివాదం జరిగింది. దీంతో శాంతియుతంగా చేపట్టిన దీక్షల నేపథ్యంలో రైతులంతా చట్టపరంగానే పోరాటం చేస్తామంటూ దీక్షాబిరానికి చేరుకున్నారు. బాధిత రైతులు లేకుండా కేవలం గంటలోనే ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేసి ఎటువంటి ఆక్రమణలు దివీస్ యాజమాన్యం నిర్మించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి అన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను ఉన్నారు. -
గాల్లో దీపంలా తిరుమలలో భద్రత
-
ఇదేనా..మహిళా సాధికారత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళా సాధికార సదస్సుకు ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించిన ప్రభుత్వం.. ఆమెను తీవ్రంగా అవమానించడం దారుణం. ఈ ఘటనతో ప్రభుత్వ తీరు ఏమిటో స్పష్టమైంది. రోజాతో పోలీసులు వ్యవహరించిన తీరు మహిళలపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు తార్కాణంగా మిగిలింది’ అంటూ మహిళా లోకం సర్కారుపై దుమ్మెత్తి పోసింది. మహిళా సాధికార సదస్సుకు బయలుదేరిన రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే నిలువరించడం.. ఆ తరువాత జిల్లాలు మారుస్తూ తీసుకెళ్లడంపై వైఎస్సార్ సీపీ నాయకులతోపాటు విపక్షాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. వీరంతా ప్రభు త్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. నిడదవోలు మునిసిపాలిటీలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పువ్వల రతీదేవి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, మహిళలు ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం ఆందోళన చేపట్టారు. మహిళలపై పెచ్చుమీరిన దాడులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మన జిల్లానే తీసుకుంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆక్వా ఫుడ్పార్క్కు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆరేటి సత్యవతిని 40 రోజులకు పైగా జైలులో పెట్టిన ప్రభుత్వ దమన నీతి అందరికీ తెలిసిందే. తన అక్కను వెంటాడి వేధించి మరీ చంపారని నరసాపురం పట్టణానికి చెందిన పావని మొత్తుకున్నా అధికార పార్టీ నేతను కాపాడేందుకు శ్రీగౌతమి కేసును ఏ విధంగా నీరుగార్చారో జిల్లా ప్రజలకు తెలుసు. ఒక దళిత మహిళను మంత్రిగా చేసినా మూ డేళ్లలో ఒక్కసారి కూడా ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ చేసే అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం ఎమ్మెల్యే రోజా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం. సదస్సుకు ఆహ్వానించి ఎయిర్ పోర్టులోనే ఆమెను నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం. మహిళ ప్రశ్నిస్తే ప్రభుత్వం కూలిపోతుందేమోననే భయం టీడీపీకి పట్టుకుంది. ప్రభుత్వమే ఒక నాయకురాలిని కిడ్నాప్ చేయడం ఎప్పుడూ లేదు. – పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ భార్యను ఎలా మాట్లాడించారు మహిళా పార్లమెంట్ నిర్వహిస్తూ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా పట్ల అంత అమానుషంగా వ్యవహరించటం సమాజం తలదించుకునేలా ఉంది. సీఎం చంద్రబాబు లోకేష్ భార్యతో ఎలా మాట్లాడించారు. బృందాకారత్ను ఎందుకు ఆహ్వానించలేదు. కేవలం ఒక పార్టీ సదస్సులా నిర్వహించాలనుకోటం దారుణం. రోజా విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – వి.కనకదుర్గ, యూటీఎఫ్ జిల్లా మహిళా కన్వీనర్ సిగ్గులేని ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వమిది. రాష్ట్రంలో మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులపైనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఇక సామాన్య మహిళల విషయంలో టీడీపీ నాయకుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. – ఎండీ అమర్జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళలపై ప్రభుత్వ తీరుకు నిదర్శనం మíహిళా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను సదస్సుకు ఆహ్వానించలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాతో ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మహిళా సమస్యలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సదస్సుకు మహిళా ఎమ్మెల్యేను పిలిచి అవమానించటం దారుణం. – సీహెచ్ రాజ్యలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు -
వెనక్కి తగ్గిన ట్రంప్:కొత్త ఆదేశాలు త్వరలో
వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఏడు ముస్లిం దేశాల ముస్లిం ప్రజలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటీవల జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన పునరాలోచనలో పడ్డారు. ముఖ్యంగా అమెరికా కోర్టులు ట్రంప్కు షాకిచ్చిన నేపథ్యంలో దిగి వచ్చిన ట్రంప్ త్వరలోనే కొత్త ఆదేశాలను జారీ చేయనున్నట్టు స్వయంగా ప్రకటించారు. దేశ భద్రత రీత్యా అంటూ డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు కోర్టులు, ఇతర వర్గాల తీవ్ర వ్యతిరేకత రావడంతో కొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై దృష్టి పెట్టక తప్పలేదు. స్వల్పమార్పులతో "బ్రాండ్ న్యూ ఆర్డర్" ను త్వరలోనే జారీ చేయనున్నట్టు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విలేకరులతో చెప్పారు. సోమవారం లేదా మంగళవారం గానీ ఈ కొత్త ఆదేశాలు రానున్నట్టు ఆయన చెప్పారు. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఆర్డర్ చాలా కీలకమైనదనీ, దీనిపై చర్యను "చాలా వేగంగా" తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కోర్టు నిర్ణయం నేపథ్యంలో "అదనపు భద్రత" అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించడం గమనార్హం. అయితే ఈ కొత్త ఆదేశాలు ఎలా ఉండనున్నాయి?ముఖ్యంగా ముస్లిం ప్రజలపై బ్యాన్ ను పూర్తిగా ఉపసంహరించుకుంటారా లేక కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కాగా ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్ దేశాల ముస్లిం వీసా హోల్డర్లు తాత్కాలిక నిషేదానికి గురికావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ బ్యాన్పై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి దిగాయి. దీంతో ఈ పిటిషన్లను విచారించిన శాన్ఫ్రాన్సిస్కో కోర్టు ట్రంప్ ఆదేశాలను నిలిపి వేసింది. అంతకుముందు సియిటెల్ కోర్టుకూడా ఈ ఆదేశాలను తాత్కాలింగా నిలిపివేసింది. -
స్వప్రయోజనాల కోసమే ప్యాకేజీ
ఏలూరు (సెంట్రల్) : సీఎం చంద్రబాబు రాజకీయ, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్యాకేజీలకు ఆహ్వానం పలుకుతున్నారని, ప్యాకేజీలకు చట్టబద్ధత ఉందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నిం చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి ఏలూరు చేరుకుంది. సోమవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో రామకృష్ణ విలేకరులతో మా ట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగి పోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా హోదా కోసం పోరాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. త్వరలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై ఇద్దరు మోసగాళ్లు అనే సినిమా వస్తుందని హేళన చేశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 9 నుంచి విశాఖలో నిరాహార దీక్ష చేయనున్నట్టు రామకృష్ణ ప్రకటించారు. ఇది కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వమని రామకృష్ణ అన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారని, కొందరు రౌడీల్లా ప్రవర్తిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలు, గిరిజనులకు స్థానం కల్పించిన తర్వాతే లోకేష్కు స్థానం కల్పించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటే అవినీతి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. చివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. నాయకులు జేవీ సత్యనారాయణ, జి.ఓబులెస్, డేగా ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఎల్పీడీపై వీడిన అస్పష్టత
కంపెనీలకు మాత్రమే ఇస్తామంటూ నిబంధన రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న సీడీబీ కొబ్బరి సొసైటీలకు డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే స్పష్టం చేసిన సీపీసీఆర్ఐ, సీడీబీ డైరెక్టర్ చౌడప్ప అమలాపురం : కొబ్బరి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ) కొందరి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని కోనసీమ కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. లేయింగ్ అవుట్ ఆఫ్ డిమాన్స్ర్టేషన్ ప్లాంట్ల (ఎల్ఓడీపీ) ఎంపిక కోసం లేని నిబంధనలు ప్రవేశపెట్టిందా? అంటే అవునంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. సీడీబీలో లేని నిబంధనను ఇక్కడ అమలు చేసి వందలాది మంది రైతుల ప్రయోజనాలను కాలరాసిందని ఆరోపిస్తున్నారు. కొబ్బరి సాగుకు చేయూతనిచ్చేందుకు సీడీబీ గత కొన్నేళ్లుగా ఎల్ఓడీపీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో రైతుకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున రెండేళ్లపాటు ఎరువులను ఉచితంగా అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలను మొదట క్లస్టర్ల్గా చేసి ఒక్కో దాని పరిధిలో 25 హెక్టార్లను ఎల్ఓడీపీ స్కీమ్ను అమలు చేశాయి. తరువాత రైతులు కోకోనట్ ప్రొడ్యూసర్ సొసైటీలగా ఏర్పడితే ఇస్తామని చెప్పింది. దీంతో కోనసీమలో వందలాది సొసైటీలు ఏర్పడ్డాయి. తరువాత నిబంధన మార్చిన సీడీబీ అధికారులు ఫెడరేషన్లుగా ఏర్పడితేనే ఎల్ఓడీపీ ఇస్తామని చెప్పారు. తరువాత ఈ నిబంధననూ మళ్లీ మార్చేసి కేవలం కంపెనీలుగా ఏర్పడ్డవారికి మాత్రమే ఇస్తామన్నారు. దీని వల్ల సొసైటీలకు, వాటిలోని వేలాది మంది రైతులకు ఎల్ఓడీపీ స్కీమ్ అందకుండా పోయింది. ఈ సంఘాలను పక్కనబెట్టారు – ముమ్మిడివరం మండలం లంకాఫ్ఠాన్నేల్లంకలో సుమారు 750 మంది రైతులు 17 సొసైటీలుగా ఏర్పడ్డారు. సీడీబీ సూచన మేరకు వీరంతా స్వామి వివేకానంద ఫెడరేషన్గా ఏర్పడ్డారు. రెండేళ్లు గడుస్తున్నా ఎల్ఓడీపీ ఇవ్వలేదు. ఇందుకు సీడీబీ అధికారులు చెప్పే కారణం వీరందరూ కలిసి కంపెనీ కాలేదని. – కోనసీమలో భద్రకాళీ వీరేశ్వరస్వామి (ఐ.పోలవరం), బలరామ సీపీఎఫ్ (బండారులంక), ఆర్ధర్ కాటన్ (అయినవిల్లి), సుజలా (అంబాజీపేట) ఫెడరేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2,500 మంది రైతులున్నారు. కొన్ని ఫెడరేషన్లు 2013లోనే సీడీబీలో రిజిస్టర్ అయ్యాయి. కేవలం కంపెనీలుగా ఏర్పడలేదని వీరికి కూడా ఎల్ఓడీపీ అందించలేదు. ఆ నిబంధన ఉందా? కంపెనీలుగా ఏర్పడినవారికే ఎల్ఓడీపీలో ఎరువులు ఇవ్వాలనే నిబంధన ఉందని సీడీబీ అధికారులు చెబుతుండగా, అటువంటిదేమీ లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కోనసీమలో ఒక కంపెనీ ప్రయోజనం కోసం మొదట సొసైటీలు, తరువాత ఫెడరేషన్లు, తరువాత కంపెనీలకు ఎరువులు ఇస్తామనే నిబంధనలు పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు ఎల్ఓడీపీ ఇవ్వాల్సిందే ‘కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీలకు మాత్రమే డెమోప్లాట్లు ఇవ్వాలనే నిబంధన ఏమీలేదు. సొసైటీలకు సైతం డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే. మీ ఫెడరేషన్కు ఎందుకు ఇవ్వలేదనేదానిపై నేను చర్చిస్తాను’అని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీసీఆర్ఐ), కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ)ల డైరెక్టర్ పాలెం చౌడప్ప చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దీనిపై డీసీసీబీ డైరెక్టర్, స్వామి వివేకానంద ఫెడరేషన్ చైర్మన్ గోదాశి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జమ్మిలు మాట్లాడుతూ సీడీబీలో లేని ఈ నిబంధన వల్ల కోనసీమలో సుమారు ఐదు వేల మంది రైతులు ఎల్ఓడీపీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వివరించగా ఆయన పై విధంగా స్పందించారు. దీనిపై తాను సీడీబీ పాలక మండలి సమావేశంలో మాట్లాడతానన్నారు. సొసైటీలకు ఎల్ఓడీపీలో ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
శాఖల మధ్య స్థలవివాదం
మాదంటే మాది అంటున్న ఆర్టీసీ, ఇరిగేషన్ పరిశీలన చేసి నివేదికకు ఆదేశించిన జేసీ అన్నవరం : అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఖాళీ స్థలం వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. అన్నవరం నడిబొడ్డులో మెయిన్రోడ్ పక్కన గల ఈ స్థలం రూ.కోట్లు విలువ చేస్తుంది. ఈ స్థలంపై ఆర్టీసీ, ఇరిగేషన్ శాఖల మధ్య వివాదం నెలకొనడంతో ఖాళీ స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆ స్థలం తమదేనని ఆర్టీసీ అధికారులు అంటుండగా కాదు అది ఇరిగేషన్శాఖదని ఎవరికీ బదలాయించలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ స్థలం పై రెండు శాఖల మధ్య వివాదం ఏర్పడింది. పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు తదితరులు జేసీ వెంట ఉన్నారు. ఈ స్థలం వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వమని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జేసీ ఆదేశించారని ఆర్డీఓ ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ లీజుకు ఇవ్వడంతో మొదలైన వివాదం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఇరిగేషన్ శాఖ, అన్నవరం దేవస్థానం నుంచి సేకరించిన 2.38 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి అప్పగించారు. అందులో ఎకరం స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థలంలో హోటల్ నిర్మాణం నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు గతేడాది స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఓ కాంట్రాక్టర్కు 43 సంవత్సరాలు లీజుకు అప్పగించారు. ఆ స్థలంలో హోటల్ నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్ శంకుస్థాపన చేయడంతో ఇరిగేషన్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఆ స్థలం తమదేనని ఆర్టీసీకి అప్పగించలేదని తెలిపింది. దీంతో ఆ హోటల్ నిర్మాణం ఆగిపోయింది. తనకు ఆర్టీసీ స్థలం అప్పగించలేదని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాకు అప్పగించినట్టు రికార్డు ఉంది ఆ ఖాళీ స్థలాన్ని తమకు అప్పగించినట్టు రికార్డులు ఉన్నాయి. అప్పుడు అప్పగించి ఇప్పుడు ఇవ్వలేదని ఇరిగేషన్ అధికారులు అంటే చెల్లదు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు. - డీఎస్ఎన్ రాజు, ఈఈ, ఆర్టీసీ ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించలేదు ఆ స్థలాన్ని రెవెన్యూశాఖకు ఇరిగేషన్ శాఖ అప్పగించలేదు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని అప్పగించినట్టు చెబితే అందుకు మేం భాద్యులం కాదు. ఈ వివాదంపై సంయుక్త పరిశీలన నిర్వహించమని జేసీ ఆదేశించినందున మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నివేదిక అందజేస్తాం. - ఇరిగేషన్ డీఈ శేషగిరిరావు -
మందుల కొరత లేకుండా చర్యలు
శాక్స్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తాడితోట (రాజమహేంద్రవరం) : ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (శాక్స్)S జాయింట్ డైరెక్టర్ పి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మందుల కొరత ఏర్పడిందని, ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతాలు చెల్లిచలేకపోయామన్నారు. దేశంలో పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించేందు పల్స్పోలియో చేపట్టినా గత ఏడాది హైదరాబాద్లోని నీటి కుంటలలోని నీటి పరీక్షించినపుడు పోలియో క్రిమి ఉన్నట్లు గుర్తించారని, అది వినియోగించిన సిరంజిల ద్వారా వచ్చినట్లు గుర్తించారని తెలిపారు. దేశంలో పోలియో లేకపోయినా పొరుగుదేశాల్లో ఉందని, అక్కడికి రాకపోకలు సాగించేవారి నుంచి వ్యాధి రాకుండా ఉండడానికే పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడత ఏప్రిల్ 2 న నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల పనితీరు, శుభ్రత, రోగులకు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జిల్లాలో రెండు రోజులు గా ఆస్పత్రులకు పరిశీలిస్తున్నామని శనివారం అమలాపురం, రామచంద్రపురాల్లో పరిశీలించామన్నారు. ఆదివారం రంపచోడవరం, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది హెచ్ఐవి రోగులు రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మంది హెచ్ఐవి రోగులు ఉన్నారని, వారిలో 40 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. 70 వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మెడికల్ స్టోర్స్ను విజయవాడకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఏఆర్టీ సెంటర్ నిర్వాహణ అధ్వానంగా ఉందన్నారు. 2012 నుంచి ఇక్కడ రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ప్రస్తుతం మరో వైద్యుడిని ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఏఆర్టీ సెంటర్లో రికార్డులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. క్వాలిటీ ప్రాసెసింగ్ సీనియర్ అధికారి ప్రభాకరరావు, కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ భువన కుమార్, డీసీహెచ్ డాక్టర్ రమేష్ కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ పాల్గొన్నారు. -
ఇదో‘రాజ’ మార్గం
- రూ 20 లక్షలు కొట్టేసే ఎత్తుగడ - విద్యార్థుల పేరు చెప్పి కొల్లగొట్టే యత్నం - మూడేళ్ల క్రితం రూ.8 లక్షలతో రహదారి నిర్మాణం - అదే రోడ్డుపై మళ్లీ రూ.20 లక్షలతో... - జెడ్పీ స్కూలు పక్కన నేతల ఇళ్లుండడమే అవినీతికి కారణం - మెట్టలో ముఖ్యనేత బాగోతం సాక్షి ప్రతినిధి కాకినాడ: తన గొప్ప కోసం పార్టీ నేతల మెప్పు కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఒక ముఖ్య నేత పక్కా ప్లాన్ వేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ . 20 లక్షలు పనుల పేరుతో జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్పై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. విద్యార్థులు పేరుచెప్పి నిక్షేపంలా ఉన్న సీసీ రోడ్డుపై మరో ‘రాజ’మార్గం వేసి ఈ దోపిడీకి తెరతీశారు. ఒక టీడీపీ ముఖ్యనేత బాగోతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కార్పొరేట్ రహదారే... మెట్ట ప్రాంతలో ప్రత్తిపాడు ప్రధాన రహదారి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు మూడేళ్ల క్రితం రూ.8 లక్షలతో 300 మీటర్లు సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డును అనుకుని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మరో ఇద్దరు టీడీపీ నేతల ఇళ్లున్నాయి. అప్పట్లో విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. నిక్షేపంలా ఉన్న ఈ రోడ్డుపై రూ.10 లక్షలు వెచ్చించి హడావుడిగా పైన మరో రోడ్డును ముఖ్యనేత ప్రోద్బలంతో వేశారు. జిల్లాలో మరెక్కాడా ప్రజలు నడిచేందుకు ఇటువంటి రోడ్డు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. ఈ రోడ్డుపై పార్కింగ్ టైల్స్ వేశారు. ఈ విధమైన రోడ్డు పెట్రోల్ బంకులు, స్టార్ హోటల్స్ పార్కింగ్ స్థలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇటీవల ఆ నేత ఇంట ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా నలు మూలల నుంచి అధికార పార్టీ నేతలు వస్తారని హడావిడిగా ఆ రోడ్డు వేయించారు. పాఠశాల విద్యార్థులకు, స్థానికుల కోసమనే ముసుగు వేసి, తన స్వప్రయోజనం కోసం ఈ హంగామా చేశారు. ఇది ఒక వైపు మాత్రమే. రెండో వైపున మరో రూ.10 లక్షలు వెచ్చించి మరో సిమెంట్ రోడ్డును కూడా వేయించుకున్నారు. ఇవన్నీ కూడా ఆ ముఖ్యనేత అనుచరుడే దగ్గరుండి వేయించాడు. రెండు రోడ్లు పని ముందు పూర్తి చేయిచేస్తే తరువాత ఏదో ఒక పద్దు నుంచి బిల్లులు చేయిస్తానని భరోనిచ్చారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ నెలలో వేడుకల నాటికి పనులు పూర్తి చేసి అప్పగించారు. ఈ రెండు పనులకు సంబంధించి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లుల కోసం జెడ్పీకి పంపించే పనిలో ఉన్నారు. బిల్లుల కోసం ఒత్తిళ్లు... రూ.20 లక్షలు వెచ్చించి పనులు చేసిన ఆ నాయకుడు ప్రస్తుతం బిల్లులు మంజూరు చేయించుకునేందుకు ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లా పరిషత్లో ఇదివరకటిలా నిధులు అందుబాటులో లేవు. ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయాలంటూ ఆ నేత జెడ్పీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అవసరం లేకున్నా అడ్డంగా రోడ్లు వేసి నిధులు నొక్కేందుకు ఈ నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండలంలో రోడ్లన్నీ అధ్వానమే... ఇదే మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారి జనం నరకం కళ్ల చూస్తున్నారు. ఆ రోడ్లను ఆధునికీకరించాలని జనం మొత్తుకుంటున్నా పాలకులకు చెవికెక్కటం లేదు. ఇందులో జెడ్పీ హైస్కూల్కు ఒక పక్కన అవసరం లేకపోయినా లక్షలు కుమ్మరించి వేసిన సిమెంట్ రోడ్డు, పార్కింగ్ టైల్స్ను వేసుకున్నారు. కానీ స్కూల్కు మరో పక్కన ఎస్సీ, బీసీలు నివసించే తోటవీధి, క్వారీ కాలనీల్లో పట్టుమని పదివేలు కూడా వెచ్చించటానికి నేతలకు చేతులు రాలేదు.ఎస్సీ బీసీల నివాసం ఉండే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి తమ ఇంటి చుట్టూ మాత్రం రోడ్లు వేయించుకున్నారని స్థానికులు నేతలపై మండిపడుతున్నారు. వీటితోపాటు మండలంలో 37 గ్రామాలకు ప్రధాన రహదారైన రాచపల్లి అడ్డు రోడ్డు జంక్షన్ నుంచి రాచపల్లి వరకు జెడ్పీ రోడ్డు మరమ్మతులు లేక అధ్వాన స్థితికి చేరుకుంది. గోకవరం వద్ద రోడ్డు శిథిలమైంది. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య ఆర్ అండ్ బీ రోడ్డు (తారు రోడ్డు) నామరూపాలు లేకుండా పోయి గ్రావెల్ రోడ్డుగా మారిపోయింది. రాళ్లు లేచి కాళ్లు గొప్పులు కట్టేస్తున్నాయి. అయినా దీని కోసం నేతలు పట్టించుకోరా అని ఆ ప్రాంతవాసులు ధ్వజమెత్తుతున్నారు. -
పింఛన్లనూ భోంచేస్తున్న ‘పచ్చ’ బకాసురులు
జన్మభూమి కమిటీలదే లబ్ధిదారుల ఎంపిక వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా రాజానగరం : ఏ ఆశ్రయం లేని వారికి ప్రభుత్వం అందించే పింఛన్లను సైతం అర్హులకు అందకుండా అధికార పార్టీ పెద్దలే గెద్దల్లా తన్నుకుపోతున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులను పక్కకు నెట్టి జన్మభూమి కమిటీలతో చేయిస్తూ పచ్చ చొక్కాలు చక్రం తిప్పుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు బకాసురుల్లా గోదావరిలో ఇసుక, కొండలను, చెరువులను భోంచేస్తూ వస్తున్న అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు పింఛన్లను కూడా స్వాహా చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం మండలం కొండగుంటూరులో శనివారం పర్యటించిన ఆయనకు అనేక మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ గత రెండున్నరేళ్లుగా వాటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దానిపై ఆయన స్పందిస్తూ, గతంలో నెలకు రూ.200 చొప్పున పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లను అందజేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఈ మొత్తాన్ని రూ.వెయ్యి, రూ.1500 లకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాని అధికారంలోకి వచ్చాక పింఛను సొమ్మును పెంచినా వడపోత పేరుతో తమ పార్టీ కాని వారందరి పింఛన్లను రద్దు చేశారని విమర్శించారు. అంతటితో ఆగకుండా కొత్తగా మంజూరైన పింఛన్లకు లబ్ధిదారులుగా కూడా తమ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తూ రాజకీయం చేయడం విచారకరమన్నారు. తాజా పింఛన్లలోనూ ఇదే అన్యాయం జన్మభూమి – మన ఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రాధాన్యతల ప్రకారం లబ్ధిదారులుగా ఎంపిక చేయవలసి ఉండగా టీడీపీకి చెందిన వారా, కాదా, అంటూ పరిశీలించి ఎంపిక చేయడం హేయమని రాజా అన్నారు. తాజాగా నియోజకవర్గానికి రెండు వేల చొప్పున మంజూరైన పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలోను ఇదే పంథాను అనుసరిస్తున్నారన్నారు. రాజానగరం నియోజవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జన్మభూమి కమిటీ సభ్యులు రాత్రికి రాత్రి తమ అనుయాయులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ఆన్లైన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీడీఓలకు కూడా ప్రమేయం లేకుండా చేస్తున్నారంటే అధికార పార్టీ అరాచకాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వీరి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. పాలకుల అకృత్యాలను, అరాచకాలను తెలియజేస్తూ, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తమ పార్టీ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పింఛన్ల బాగోతంపై సీతానగరంలో సోమవారం బహిరంగ సమావేశం నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, వేమగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర తొక్కిసలాటపై నేడు కమిషన్ విచారణ
ఇప్పటికైనా వాస్తవాలు బయట పడేనా? రాజమహేంద్రవరం క్రైం : పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ సి.వై.సోమయాజులు నేతృత్వంలో శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో విచారణ జరపనుంది. ఇప్పటికే అనేక సార్లు విచారణ జరిపిన కమిషన్ నాలుగోసారి 390 జీఓ విడుదల చేసింది. ఈ జీవో కాలపరిమితి ఈ నెల 29 వరకు ఉంది. మానవ హక్కుల కమిషన్కు మొదటిసారిగా ఇచ్చిన నివేదికలో కలెక్టర్, ముఖ్యమంత్రి పుష్కర ఘాట్ లో ఉండడం వల్లే తొక్కిసలాట జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ, అనంతరం భక్తుల తొందరపాటే తొక్కిసలాటకు కారణమని మాట మార్చారు. అయితే అధారాలు సమర్పించడంతో దాటవేత ధోరణి అవలంబించారు. స్వామి భక్తే కొంప ముంచింది పుష్కరాల సందర్భంగా వీఐపీలకు ప్రత్యేక ఘాట్ కేటాయించినప్పటికీ టెలిఫిల్మ్ చిత్రీకరణకు వీలుగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్లోనే కుటుంబ సమేతంగా స్నానం చేశారు. మూడు గంటల పాటు నిరీక్షించిన లక్షలాది పుష్కర యాత్రికులను ఒక్కసారిగా ఘాట్లోకి అనుమతించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 29 మంది మృత్యువాత పడగా, 51 మంది గాయాలపాలైయ్యారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి అధికారులు తాపత్రయ పడి వీఐపీల వద్దే ఉండిసామాన్య యాత్రికులను, వారి రక్షణను నిర్లక్ష్యం చేశారు. బారికేడ్లు తొలగించి వీఐపీలకు అనుమతి పుష్కర ఘాట్లో స్నానం చేసేందుకు లక్షలాది మంది వస్తారని ముందుగానే అంచనాలు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టు ఘాట్ల గేట్లు వెడల్పు చేడయంలో అధికారులు విఫలమయ్యారు. గేటు లోపల వైపు ఏడు మెట్లు కూడా తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి చెండానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును. అలాగే పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసి బారీకేడ్లు వీఐపీల కార్లు వచ్చేందుకువీలుగా బారికేడ్లు తొలగించారు. అందువలన యాత్రికులు గేటు వద్ద గుంపులు, గుంపులుగా రావడంతో తోపులాట చోటు చేసుకొని ఈ దుర్ఘటన జరగడానికి కారణమైంది.ఇప్పటికైనా అధికారులు ఆధారాలు సమర్పిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది లేకుంటే నిజం మరుగున పడే ప్రమాదం ఉంది. -
ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
-
మా స్థలంలో అంగన్వాడీ భవనం నిర్మిస్తారా?
అధికారుల వద్ద కన్నీటి పర్యంతమైన మహిళ రాజమహేంద్రవరం రూరల్ : తమ స్థలంలో అంగన్వాడీ భవనం నిర్మించడం ఏమిటంటూ రాజమహేంద్రవరానికి చెందిన చేబోలు శ్రీలక్ష్మీభవాని అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తొర్రేడు గ్రామంలోని ఒకటో వార్డులో చెరువు సమీపంలోని గ్రామ కంఠభూమిలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి వస్తున్నట్టు తెలుసుకున్న శ్రీలక్ష్మీభవాని, ఆమె భర్త నారాయణ, తండ్రి దర్శిపూడి కృష్ణారావు అక్కడకు చేరుకున్నారు. ఇది తనకు పుసుపు కుంకుమగా ఇచ్చిన స్థలమని, అక్కడ అంగన్వాడీ భవనం ఎలా నిర్మిస్తారని శ్రీలక్ష్మీభవాని అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, కలెక్టర్, రాజానగరం ఐసీడీఎస్ సీడీపీఓలకు, పంచాయతీ కార్యదర్శికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ తతంగం తెలుసుకున్న ఎమ్మెల్యే గోరంట్ల అక్కడకు రాకుండా వెనుదిరిగారు. శంకుస్థాపనకు వచ్చిన తహసీల్దార్ భీమారావు, ఎంపీడీఓ ఎ.రమణారెడ్డికి శ్రీలక్ష్మీభవానీ మొరపెట్టుకుంది. కాగా స్థానిక టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని.. ఇది గ్రామకంఠానికి చెందిన పోరంబోకు భూమి అని, అంగన్వాడీ భవనం నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఒక దశలో ఇరువర్గాల వాగ్వాదం జరిగింది. గ్రామ ఆడపడుచు ఉసురు తగులుతుందంటూ శ్రీలక్ష్మీభవాని కన్నీంటిపర్యంతమైంది. తుదకు తహసీల్దార్ భీమారావు మాట్లాడుతూ ప్రస్తుతం శంకుస్థాపన మాత్రమే చేస్తున్నామని, అనంతరం కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని వివరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ నేతలు అత్యుత్సాహంతో శంకుస్థాపన ఫలకాన్ని రోడ్డుపైనే ఏర్పాటు చేశారు. -
ప్రాణాలు మింగేస్తున్నా పట్టదా..?
వెచ్చాలకు పోవాలన్నా వాగు దాటాల్సిందే రోగమొచ్చినా ఎదురీత తప్పదు ఇప్పటికి నలుగురు ప్రాణాలు వాగుపరం.. శిలాఫలకానికే పరిమితం కేటాయించిన రూ.25 లక్షలు ఏమైనట్టో? అడ్డతీగల : నిత్యావసరాలు, విద్య, వైద్యం, మరే ఇతర అవసరాలకైనా గ్రామ పొలిమేరల్లోని కొండవాగు దాటాల్సిందే. ఈ నిత్య జీవన పోరాటంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వేటమామిడి పంచాయతీలోని పణుకురాతిపాలెం గ్రామస్తుల దుస్థితి ఇది. ఇక్కడి మొత్తం జనాభా 570 మంది. 325 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం కన్నేరు (పెద్దేరు) వాగుకు ఆవలి వైపు ఉంది. వర్షాకాలం వస్తే ఈ గ్రామస్తులు ట్యూబుల సాయంతో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి వస్తుంటారు. ఐదేళ్ల కాలంలో నలుగురిని ఈ వాగు పొట్టనపెట్టుకుంది. ఐదేళ్ళ క్రితం ఉలెం చిన్నారావు పింఛను తీసుకోవడానికి వాగు దాటే యత్నంలో ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో వివాహ నిశ్చితార్థమై, కొన్నిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్న పణుకురాతిపాలెం యువకుడు మామిడి మల్లేశ్ రెడ్డి కూలి పని కోసం వాగు దాటబోతూ అందులోపడి చనిపోయాడు. ఇంకో ఘటనలో భవననిర్మాణ కార్మికురాలు ముర్ల చిన్ని అడ్డతీగలలో పనిచేస్తూ తిరిగి స్వగ్రామానికి వెళ్తూ కనుమరుగైంది. నేటికీ ఆమె మృతదేహం జాడ కనపడలేదు. తాజాగా మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు పింఛన్ సొమ్ము కోసం మంగళవారం వాగులోనికి దిగి నీటి ఉధృతి తట్టుకోలేక కొట్టుకుపోయి మృతిచెందింది. వీరంతా దగ్గర బందువులే కావడం గమనార్హం. రోప్ బ్రిడ్జి నిర్మాణాన్ని మరచారు వాగుపై రోప్బ్రిడ్జ్ నిర్మిస్తామని దాని నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించినట్లు 2013 చివర్లో అప్పటి అరకు ఎంపీ కిశోర్చంద్రదేవ్ ఇతర ప్రజాప్రతినిధులు వేటమామిడి వైపు వాగు ఒడ్డునే శిలాఫలకం ప్రారంభించారు. కాలక్రమంలో ఆ శిలాఫలకం శిథిలమైంది. ఇటు అధికారులు అటు పాలకులు ఈవిషయాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ నీటి వల్ల ఇబ్బంది పణుకురాతిపాలేనికి ఎగువ నిర్మించిన పవర్ప్రాజెక్ట్ నుంచి నీటిని ఎటువంటి హెచ్చరికలు చేయకుండా దిగువకు వదలడం వల్ల హఠాత్తుగా నీటి ఉధృతి పెరిగి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ నీటి ఉధృతి వల్లే మంగళవారం మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదాల నివారణకు నీటిని వదిలేటప్పుడు హెచ్చరికగా సైర¯ŒS ఏర్పాటు చేయాలంటున్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఉప ముఖ్యమంత్రి రాజప్ప బాలాజీచెరువు(కాకినాడ) : మారిన సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పాఠకులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గ్రంథాలయ ఉద్యమం భారత జాతిని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా నడిపించిందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను ఆదరించాలని కోరారు. గ్రంథాలయాల్లో సాహితీ గ్రంథాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రంథాలయ సెస్ వసూళ్లను వేగవంతం చేసి మండల, ,గ్రామీణశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర గ్రంథాలయ భవన ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రంథాలయ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్హౌస్ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, సభ్యులు గద్దేపల్లి దాసు, పాఠకులు పాల్గొన్నారు. -
దోచుకున్నది పోతుందనే: లక్ష్మణ్
హైదరాబాద్: నల్లధనం, నకిలీ నోట్ల చెలామణి అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని దేశ ప్రజలంగా అభినందిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం వారి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని.. ఈ ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు. బొగ్గు స్కామ్, 2జీ స్కామ్, కామన్వెల్త్ క్రీడల స్కామ్లతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ నాయకులు పెద్ద నోట్ల రద్దుపై ధర్నాలు చేయడాన్ని ప్రజలు అసహ్వించుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల బాధంతా తాము దోచుకున్న డబ్బుకు ఎసరొచ్చిందనే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాలనలో నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతికి వ్యతిరేకంగా ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేదో ప్రజలకు తెలియజెప్పే ధైర్యం వారికి లేదన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా నగదు ప్రజలకు అందించే ప్రయత్నం జరుగుతుందని.. ప్రధాని తీసుకున్న చర్యతో దీర్ఘకాలంలో దేశానికి మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. -
ఎమ్మెల్యే సారూ... ఇలాగేనా రుణమాఫీ
అనపర్తి ఎమ్మెల్యేను నిలదీసిన డ్వాక్రా మహిళ పాతకోటపాడు (రంగంపేట) : డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారే తప్ప ఒక్కరికీ రుణమాఫీ జరగలేదని ఎ.దుర్గమ్మ అనే మహిళ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిలదీసింది. టీడీపీ జనచైతన్య యాత్ర, మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పాత కోటపాడులో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రుణమాఫీ విషయమై ఎమ్మెల్యేను ఆమె నిలదీసింది. మాఫీ చేయలేనప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించింది. కంటితుడుపు చర్యగా రూ.3.వేలు ఇచ్చారే తప్ప దాని వల్ల తమకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీ నమ్మి రుణం తీర్చకపోవడంతో చాలా వడ్డీ పెరిగిపోయిం దన్నారు. దీనిపై ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం ఎన్నికల్లో ఇచ్చి న హామీ మేర కు మొదటి విడతగా కొంత మొత్తం అందించారని, మిగిలినది తరువాత విడుదల చేస్తారని చెప్పారు. -
రొయ్య సీడ్ వివాదంపై బ్యారేజీ పరిశీలన
రబ్బర్ సీళ్ల తొలగింపుతో నీటి వృథా సబ్కలెక్టర్కు తెలిపిన ఇరిగేషన్ అధికారులు సీడ్ వేటపై వీడియో చూపిన మత్స ్యకార నాయకులు ధవళేశ్వరం : కాట¯ŒS బ్యారేజీ దిగువ రొయ్య సీడ్ వేట కోసం రబ్బర్ సీళ్లను మత్స ్యకారులు తొలగిస్తున్నారనే ఆరోపణలతో అక్కడ సీడ్ వేటను నిషేధించారు. దాంతో ఉపాధి కోల్పోతున్నామంటూ మత్స ్యకారులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో గురువారం సబ్ కలెక్టర్ విజయ్కృష్ణ¯ŒS, ఇరిగేష¯ŒS హెడ్వర్క్స్ ఈఈ ఎ¯ŒSవీ కృష్ణారావు, మత్స్యశాఖ ఏడీ రామతీర్థలతో కూడిన అధికారుల బృందం కాట¯ŒS బ్యారేజీని పరిశీలించింది. రొయ్యసీడ్ వేటవల్ల కలిగే నష్టాలను ఇరిగేష¯ŒS అధికారులను అడిగి బృంద సభ్యులు తెలుసుకున్నారు. బ్యారేజ్ రబ్బరు సీళ్ళు తొలగించడంతో నీరు వృథాగా దిగువకు వెళుతోందని, దాంతో రబీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇరిగేష¯ŒS అధికారులు తెలిపారు. మత్స్యకార సంఘ సొసైటీ అధ్యక్షుడు కరుకు ఇమ్మానియేల్ తాము ఏ విధంగా వేట కొనసాగిస్తున్నదీ వీడియోను సబ్కలెక్టర్కు చూపించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తలారి మూర్తి, ఇరిగేష¯ŒS డీఈ శ్రీనివాస్, ఏఈ సాయిరాం, తహసీల్దార్ జి.భీమారావు, సీఐ ఎం. కృపానందం, పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తర‘గతి’ లేకున్నా పట్టదా?
పాఠశాల ఆవరణలో భవనం కుట్టుశిక్షణకు కేటాయింపు వరండాలో చదువుతో అవస్థలు పడుతున్న విద్యార్థులు ప్రజాప్రతినిధి పంతానికి తలవంచిన కార్పొరేషన్ అధికారులు విద్యాకమిటీ కాదన్నా... తల్లిదండ్రులు వద్దన్నా... హెచ్ఎం అభ్యంతరం చెప్పినా... చివరకు ప్రజాప్రతినిధి పంతమే నెగ్గింది. తరగతి గదిలేక పిల్లలు ఎండ వేడిమి, వర్షం తాకిడి తట్టుకుంటూ వరండాలోనే చదువుతున్నా పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న హాలును ఓ కుట్టు శిక్షణ కేంద్రానికి కేటాయిస్తూ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీస్తోంది. ఇలా అయితే టీసీలు తీసుకుని వెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా బేఖాతరు చేస్తూ అధికారులు ఆ ప్రజాప్రతినిధిని సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యం ఇచ్చిన తీరు వివాదానికి ఆజ్యం పోస్తోంది. కాకినాడ : కాకినాడ రామకృష్ణారావుపేటలో మదర్థెరిస్సా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవలే ఈ స్కూల్ను ఈ – పాఠశాలగా ప్రకటించి ఆధునిక విద్యాబోధనకు కూడా శ్రీకారం చుట్టారు. 5 కేఎన్ కంప్యూటర్లు కూడా సమకూర్చారు. ఒకప్పుడు తెలుగు మీడియం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో గత ఏడాది వరకు 90మందికి మించని ఈ పాఠశాలలో ప్రస్తుతం 153 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. 5వ తరగతి విద్యార్థులకు స్కూల్ వరండాలో విద్యాబోధన చేస్తున్నారు. కమ్యూనిటీ హాలు ఖాళీగా ఉన్నా.. స్కూల్ ఆవరణలో ఒకప్పుడు కమ్యూనిటీ హాలుగా వినియోగించిన భవనం ఖాళీగా ఉంది. ఈ భవనంలో ఐదవ తరగతి గది నిర్వహించుకునేందుకు హెచ్ఎం సీహెచ్ విజయలక్ష్మి కమిషనర్కు ప్రతిపాదనలు కూడా పంపారు. లెక్కచేయక... కుట్టు శిక్షణకు మొగ్గు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఆ ప్రాంగణాన్ని కుట్టు శిక్షణ కేంద్రానికి ఇచ్చారు. మైనార్టీలకు కుట్టు శిక్షణ పేరుతో దీనిని ప్రతిపాదించినప్పటికీ ఆ సంస్థ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి అధీనంలో పనిచేస్తుందో కూడా తెలియదు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పిల్లలు ఆరుబయట చదువుకుంటున్నా పట్టని అధికారులు ఎలాంటిధ్రువపత్రాలు లేని ప్రైవేటు సంస్థకు హాలును కట్టబెట్టడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. శిక్షణ కేంద్రాన్ని వేరొక చోటకు తరలించి ఆ ప్రాంగణాన్ని తరగతిగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ఇలాగైతే టీసీలు తీసుకుని తమ పిల్లలను బయటకు తీసుకువెళ్లిపోతామంటూ గొడవపడ్డారు. విద్యాకమిటీ సభ్యులు కూడా అదే స్థాయిలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకానొకదశలో స్థానికులు ఆ భవనానికి తాళాలు వేస్తే దానిని తొలగించి ఆ శిక్షణ కేంద్రానికి అప్పగించడం వెనుక స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమంటున్నారు. నిర్వాహకురాలితో వాగ్వాదం కుట్టుశిక్షణ ప్రారంభించేందుకు బుధవారం మధ్యాహ్నం వచ్చిన నిర్వాహకురాలు విజయలక్షి్మతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ నిలదీశారు. అవేమీ తన వద్ద లేవని, పది రోజుల్లో వస్తాయంటూ ఆమె చెప్పిన సమాధానం తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. -
216 జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలి
బాధితులకిచ్చే నష్టపరిహారం పెంచాలి వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు కన్నబాబు? కరప : చిరుద్యోగుల నుంచి కాయకష్టంచేసుకునే కూలీవరకు వెనకేసుకున్న సొమ్ములతో ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే 216 జాతీయరహదారి పేరిట పేదలభూములు లాక్కోవడం అన్యాయమని, బాధితులకు న్యాయం జరిగేలా వారితరపున వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. గత శనివారం కరప మండలం నడకుదురు పంచాయతీ కార్యాయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో 216 భూసేకరణ అదనపు సంయుక్త కలెక్టర్ రాధాకృష్ణకు బాధితులకు జరిగే నష్టాన్ని వివరించానని సోమవారం ఆయన ఫో¯ŒSలో విలేకర్లకు వివరించారు. కాకినాడ నగరం స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందపోతోంది, దాని దృష్ట్యాలో ఎప్పుడో రూపొందించిన 216 జాతీయరహదారి అలై¯ŒSమెంట్ను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని, బాధితులకిచ్చే నష్టపరిహారం మార్కెట్విలువకు చాలా వ్యత్యాసం ఉన్నందున, ప్రభుత్వమిచ్చే పరహారం కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కత్తిపూడి నుంచి తిమ్మాపురం, సర్పవరం, మాధవపట్నం, గంగనాపల్లి, మేడలైన్, తూరంగి గ్రామాలమీదుగా యానాంరోడ్డును అనుసంధానం చేసే 216 జాతీయరహదారి అలై¯ŒSమెంట్ తప్పులతడకగా ఉందన్నారు. రూ.2 వేల కోట్లతో కాకినాడ మహానగరంగా విస్తరించపోతోందని, అలాంటప్పుడు ఇళ్ల మధ్య నుంచి 216 జాతీయరహదారి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. సిటీకీ దూరంగా ఉండేలా ఎవరికీ నష్టకలగకుండా జాతీయరహదారిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే కలెక్టర్ అరుణ్ కుమార్ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. బాధితులకు నష్టపరిహారంగా ఎకరానికి రూ 18 లక్షలు ఇస్తున్నామంటున్నారని, తూరంగిలో ప్రస్తుతం మార్కెట్విలువ రూ.2 కోట్లు ఉన్నందున చాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 216 బాధితులకు వైఎస్సార్సీసీ అండగా ఉండి, న్యాయం జరిగేలా పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. కన్నబాబు వెంట ఎంపీటీసీ జవ్వాది సతీష్, ఉప్పలంక మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాస్, గురజనాపల్లి మాజీసర్పంచ్ పెంటపాటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘నెక్కంటి’లో మళ్లీ ప్రమాద ఘంటికలు
వాంతులతో 26 మందికి అనారోగ్యం మొత్తం అస్వస్థులైన వారి సంఖ్య 56 మంది కాకినాడ, రాజమండ్రి ఆస్పత్రులకు తరలింపు ఫ్యాక్టరీ తాత్కాలిక మూసివేతకు జేసీ ఆదేశం పెద్దాపురం : పెద్దాపురం–జగ్గంపేట మార్గంలోని నెక్కంటి సీఫుడ్స్లో మరోమారు ప్రమాద ఘంటికలు మోగాయి. సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో 30 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం సంభవించిన ప్రమాదంలో మరో 26 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇప్పటి వరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య 56కు చేరింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం యథావిధిగా నెక్కంటి సీఫుడ్స్లో విధులకు హాజరైన మహిళలు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కిందపడిన మహిళలు వాంతులు చేసుకుంటూ బాధపడుతుండడంతో కాకినాడ, రాజమండ్రిల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా సీఫుడ్స్ యాజమాన్యం పోలీసు, మీడియా, ప్రజాసంఘాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈ ఫ్యాక్టరీలో జనరల్ డ్యూటీలకు వెళ్లే మహిళలు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి వెనుకకు పరుగులు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్సై సతీష్ అక్కడకు చేరుకున్నారు. మరోపక్క ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన పాత్రికేయులపై యాజమాన్యం దాడిచేసే ప్రయత్నం చేసింది. మీడియాను లోపలికి రాకుండా నిలువరించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖరరావు, తహసీల్దార్ వరహాలయ్య, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, చీఫ్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవీంద్రబాబు, కార్మికశాఖ కమిషనర్ కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణంపై ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ సాంకేతిక నిపుణులతో వారు చర్చించారు. ప్లాంట్లోలోని ఏసీ సామర్థ్యం, ఆక్సిజ¯ŒS లోపం వల్లే మహిళలు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. కార్మికుల భద్రత దృష్టా తాత్కాలికంగా ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేయాలని జేసీ సత్యనారాయణ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న మహిళలు సృహతప్పి పడిపోతుంటే వారిపై సత్తెమ్మ అమ్మవారు పూని అలా కింద పడిపోతున్నారని యాజమాన్యం ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మహిళల అస్వస్థతకు కారణమైన నెక్కంటి సీఫుడ్స్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ, రైతుకూలీ సంఘం, ఆర్పీఐ, లిబరేషన్, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టాయి. 30 మంది సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సంజీవి ఆస్పత్రికి 18 మంది కాకినాడ క్రైం: పెద్దాపురం సమీపంలోని నెక్కింటి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో బుధవారం కార్భన్ డయాక్సైడ్ లీకవడంతో అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని యాజమాన్యం కాకినాడలోని సంజీవి ఆస్పత్రికి తరలించింది. ఇదే ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన వారిలో 28 మందిని ఇదే ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. రొయ్యల కంపెనీలో వెదజల్లిన విషవాయువుపై విచారణ చేపట్టకుండా, లోపాలను సరిచేయకుండా బుధవారం కంపెనీలో పనులు నిర్వహించడంపై సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ తక్షణమే విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
షాపులను ఖాళీ చేయించడం దారుణం
దేవాదాయశాఖ డీసీ కార్యాలయం వద్ద చేబ్రోలు వ్యాపారుల ధర్నా రంగప్రవేశం చేసిన పోలీసులు బోట్క్లబ్ (కాకినాడ): 20 సంవత్సరాలుగా ఉంటున్నా దేవాదాయశాఖకు ఎటువంటి బాకీ లేకున్నా షాపులు ఖాళీ చేయించడం దారుణమని హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన షాపులు పాత వారితో దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తంచేస్తూ మంగళవారం కాకినాడ దేవాదాయశాఖ డెప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద షాపులకు చెందిన కుటుంబ సభ్యులతో, సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉంటున్న వారికి ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా ఆలయ ఫౌండర్ వంశానికి చెందిన ఎ.అప్పారావు ఖాళీ చేయని వారిని బెదిరింపులుకు గురిచేశారన్నారు. షాపులను బహిరంగ వేలం నిర్వహించాలని పాట వేరొకరు పాడుకుంటే అప్పుడు ఖాళీ చేస్తామని షాపుల్లో ఉంటున్నవారు చెప్పారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్బాబు, ఇ¯ŒSస్పెక్టర్ సతీష్లు పోలీసుల సహకారంతో షాపులకు సీలు వేశారన్నారు. ఇటీవల పోలీసులు సహకారంతో సీలు తీసేందుకు అధికారులు ప్రయత్నించగా షాపు యాజమానులు, పరిషత్ సభ్యులు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులో తీసుకొన్నారన్నారు. దేవాదాయశాఖ డీసీ వచ్చేంత వరకూ తాము కదలబోమని భీష్మించుకొని కూర్చున్నారు. త్రీటౌ¯ŒS ఎస్సై చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపు యజమానులు, కుటుంబ సభ్యులు, సమితి సభ్యులు 150 మంది బైఠాయించారు. డీసీ చందు హనుమంతరావు ఆందోళనకారులతో ఫో¯ŒSలో మాట్లాడుతూ ఈ సమస్యను దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ నిర్వహించిన ధర్నాను ఆందోళనకారులు విరమించారు. -
చెప్పుల వివాదంలో చెయ్యి నరికేశాడు..
ఫిరంగిపురం: చెప్పుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన మంగళవారం 113 తాళ్ళూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కటారి పుల్లయ్య కుమారుడు సాయి, డేగల గోవిందు కుమారుడు సాయి ఇద్దరు స్నేహితులు. కొద్ది రోజుల క్రితం పుల్లయ్య కుమారుడు కొనుగోలు చేసిన చెప్పులు అతడికి సరిపోకపోవడంతో గోవిందు కుమారుడు ఆ డబ్బు తాను ఇస్తానని, ఆ చెప్పులు తనకు ఇవ్వమని చెప్పి తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా చెప్పుల తాలూకూ డబ్బు ఇవ్వక పోవడంతో ఈనెల 10న స్నేహితులిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి మరుసటి రోజు ఇరు కుటుంబాల పెద్దలు ఘర్షణకు పాల్పడ్డారు. పథకం ప్రకారం కత్తిని వెంట తెచ్చుకున్న గోవిందు దుర్భాషలాడుతూ పుల్లయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి కుడి చేతి మణికట్టు పై భాగంలో నరికాడు. స్థానికులు 108 వాహనంలో పుల్లయ్యను జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు రక్తం అధికంగా పోవడంతో అపస్మారక స్థితిలో వున్నాడని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వివరించారు. -
వితంతు పింఛన్ రద్దు చేస్తూ సిఫార్సు
వితంతు పింఛన్ అని ఆమెకు తెలియదట! l సొమ్ము వెనక్కి ఇచ్చేసిన సత్యవతి కాకినాడ : ‘పదవి పదిలం–పింఛన్ కోసం మరణం’ శీర్షికన ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీమ్బాషా స్పందించారు. 32వ డివిజన్ జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజు తన భార్యపేరిట వితంతు పింఛన్ మంజూరు చేయించుకున్న అంశంపై సంబంధిత విభాగాన్ని విచారణకు ఆదేశించారు. దీంతో టీపీఆర్వో భాస్కరరా వు, కింది స్థాయి సిబ్బంది అసలా పింఛన్ ఎలా మంజూ రైంది? భర్త ఉండగానే ఆమె పేరిట వితంతు పింఛన్ ఎలా విడుదలైంది? ఆన్లైన్లో ఎలా పంపారు? అనే అంశాలపై విచారణ జరిపారు. అందులో భాగంగా పింఛ న్ పొందిన మేడిశెట్టి సత్యవతిని కార్పొరేషన్ కార్యాల యానికి పిలిపించి మాట్లాడారు. వితంతు పింఛన్ తీసుకున్న వ్యవహారం వివాదం కావడంతో ఆమె కార్పొరేషన్కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. తనకు పింఛన్ మంజూరైందన్న సమాచారం రావడంతో Ðð ళ్లి తీసుకున్నానని, అది వితంతు పింఛన్ అని తనకు తెలి యదని చెప్పారు. తన భర్త అడిగితే రేషన్కార్డు, ఆధార్ జిరాక్స్ గతంలో ఎప్పుడో ఇచ్చానని, ఆ పింఛన్ ఎలా మంజూరైందో తనకు తెలియదన్నారు. పొరపాటు జరి గిందని, అందువల్ల పింఛన్ వెనక్కి ఇచ్చేస్తున్నానంటూ రూ.వెయ్యి నగదు కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వానికి నివేదిక జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు భార్య వితంతు పింఛన్ వ్యవహారం బయటపడడంతో సదరు పింఛన్ రద్దు చేస్తూ ప్రభుత్వానికి నివేధించనున్నట్టు టీపీఆర్వో భాస్కరరావు చెప్పారు. ఈ సొమ్మును బ్యాంక్లో జమ చేస్తామని, వచ్చేనెల నుంచి ఆ పింఛన్ నిలుపుచేస్తారని తెలి పారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యులపై చర్యలేవి? వితంతు పింఛన్ వ్యవహారం ఆధారాలతో బయటపడినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కేవలం పింఛన్ తీసుకున్న సత్యవతి నుంచి లేఖ తీసుకుని, పింఛన్ రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ మంజూరు వెనుక ఉన్న ఆమె భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు పాత్ర, పింఛను మంజూరుకు సహకరించిన కార్పొరేషన్లోని సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ వ్యవహారాన్ని అక్కడితో ముగింపు పలకాలని అధికారులు నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాఫికి టోపి
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ∙ఏళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు నయాపైసా కూడా మాఫీ కాని వైనం పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా నెరవేరకపోవడంతో.. తాము నట్టేట మునిగామని నేతన్నలు వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా. మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్లూమ్స్కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో డబ్బు పడితే ఖతం మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. -
వ్యాపారులపై ఉక్కుపాదం
ఎటువంటి నోటీసులు లేకుండా దుకాణాల తొలగింపు రోడ్డున పడ్డ 200 మంది వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వ్యాపారులు ఐ.పోలవరం : జాతీయ రహదారి 216 విస్తరణ పనుల పుణ్యమా అని మురమళ్లలో వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే సుమారు 200 మంది రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే వారిపై ఉక్కుపాదం మోపారు. గత వంద సంవత్సరాలుగా మురమళ్ల రహదారికి ఆనురేని ఇరువైపులా బడ్డిలు, దుకాణాలు వేసుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం, భరోసా ఇవ్వని ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి.. ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్రవారధి నుంచి కొమరగిరి వరకూ జాతీయ రహదారి ఇరువైపులా పంటకాలువకు ఆనుకొని బడ్డీలు, తా త్కాలిక దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సందడిలో సడేమియా అన్న చందా గా హైవే విస్తరణ నేపథ్యంలో పూర్తిగా హైవే స్థలా న్ని ఖాళీ చేయాలని అధికారులు పట్టుపడ్డారు. అయితే వ్యాపారస్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు రావడంతో అధికారులు, ప్రజాప్రతి నిధులు ఒక అడుగు వెనక్కు వేసి కొంత ఉపశమ నం కలిగించేలా వారికి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా మొదట ఇరువైపులా 10 మీటర్లు స్థల సే కరణ చేసి మార్కింగ్ ఇచ్చారు. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మార్కింగ్ వరకూ వెనక్కి మళ్లించుకుని కుదించుకున్నారు. రాజకీయ దురుద్దేశంతో.. అధికార నాయకుల ప్రోత్సాహంతో పంట కాలువ దిగువున ఉన్న రైతులు, వ్యాపార సంస్థలు తొలగించాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దుకాణాల వెనుక ఉన్న కాలువలో వ్యర్థాలు తదితర వాటి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నామని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనితో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్న వ్యాపార సంస్థలను కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఉన్న దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో వ్యాపారస్తులు విస్మయానికి గురయ్యారు. రైతుల సాగునీటì ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూస్తామని వ్యాపారస్తులు చెప్పినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిర్ధాక్షినంగా వ్యవహరించారు. పంట కాలువలు ఆక్రమణలకు గురై శివారు భూములకు నీరు అందక పోవడం జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉన్న దుకాణాలను తొలగించడంపై వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోనే కాకుండా ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంక, పల్లంకుర్రు ప్రధాన పంటకాలువతో పాటు మీడియం, మైనర్ కాలువల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతుంటే మురమళ్లలోనే తొలగించడంపై ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 15 మంది వ్యాపారులు కోర్టు స్టే తెచ్చుకున్నా తొలగించారని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కలుగజేసుకుని వీధిన పడ్డ చిరు వ్యాపారులకు తగిన నష్ట పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.