Minister Jagadish Reddy
-
పట్టపగలే అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్..!
-
మునుగోడులో ఓటమితోనే మోదీ విషం చిమ్ముతున్నారు: జగదీశ్రెడ్డి
నల్లగొండ: మునుగోడులో బీజేపీ ఓటమి పాలైందన్న అక్కసుతోనే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్ముతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ప్రారంభమై ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించేందుకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. నల్లగొండలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎనిమిదేళ్లలోనే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనివిధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్తున్నారని తెలిపారు. తల్లిని చంపి పిల్లను తెచ్చారని..తెలంగాణ సరైన పద్ధతిలో రాలేదని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించటంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. మోదీ కుట్రలు తెలంగాణ ప్రజల ముందు సాగవన్నారు. చదవండి: తెలంగాణ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యమే.. రేవంత్ రెడ్డి ఫైర్ -
Telangana: మంత్రి జగదీశ్రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు
నల్లగొండ క్రైం/ రాంగోపాల్పేట్ (హైదరాబాద్): రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. నల్లగొండలోని తిరుమలనగర్లో ఉన్న ప్రభాకర్రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 15 మంది ఐటీ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర పోలీసు బలగాల రక్షణలో సోదాలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డి ఇంట్లో నగదు దాచిపెట్టారని వారికి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్కు చెందిన ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లతోపాటు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును కూడా సీజ్ చేశారని.. దీనికి మంగళవారం సాయంత్రానికల్లా లెక్కలు చెప్పాలని ప్రభాకర్రెడ్డికి నోటీసు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్టు చెప్తున్నారు. కానీ çఅధికారులు దీనిని ధ్రువీకరించలేదు. ఐటీ అధికారుల బృందం రాత్రి 11:15 గంటలకు ప్రభాకర్రెడ్డి నివాసం నుంచి వెళ్లిపోయింది. కాగా సోదాల విషయం తెలిసి ప్రభాకర్రెడ్డి ఇంటి సమీపంలో స్థానికులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాడులు మొదలైన తర్వాతే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కావేరీ సీడ్స్ కార్యాలయాలపైనా.. సికింద్రాబాద్లోని మినర్వా కాంప్లెక్స్లో ఉన్న కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కేంద్ర బలగాల రక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థల యజమాని జీవీ భాస్కర్రావుకు ప్రభుత్వంలోని ముఖ్యులతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర -
బీజేపీ నేతలు ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మరు : మంత్రి జగదీష్ రెడ్డి
-
సన్నాల కొనుగోళ్లు షురూ : మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట: సన్నాల కొనుగోళ్లు మొదలయ్యాయని, అందరూ ఏకకాలంలో మిల్లుల దగ్గరికిపోతే నష్టపోతారని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ వంకతో దళారులు ధర తగ్గించే ప్రమాదం ఉందన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి టోకెన్లు జారీచేస్తున్నామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పండించిన పంటకు టోకెన్ల జారీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన పంట కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులేనని, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట దిగుబడి 46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందన్నారు. అందుకు తెలంగాణ సమాజం గర్వపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. -
కిషన్రెడ్డిది ప్రజావంచన యాత్ర: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ‘ప్రజాఆశీర్వాద యాత్ర’పేరిట ప్రజలను మోసం చేసే యాత్ర నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రూ.70 ఉన్న పెట్రోలు, డీజిల్ ధరను రూ.100 దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలి. కిషన్రెడ్డి తన యాత్రలో వాస్తవాలను కాకుండా గాలిమాటలు చెప్తున్నారు’అని మంత్రి విమర్శించారు. ‘నల్లడబ్బును రప్పిస్తామన్న ప్రధాని మోదీ మాటలు విని ప్రజలు తెల్లడబ్బు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల సామాజిక పింఛన్లు ఇస్తున్నారా? కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనైనా అమలు చేస్తున్నారా’అని నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి దేశ ప్రజలు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతుల జేబులు కొట్టేందుకు తెస్తున్న కొత్త చట్టాలతో రైతాంగం నడ్డి విరుగుతోందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకవాసులు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు... తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ పార్లమెంటులో ఒకలా, బయట మరోలా మాట్లాడుతోందని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు సాధ్యం కాదని జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ‘చట్టబద్ధంగా వచ్చిన నిధులు మినహా అదనంగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు’అని మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి సరిహద్దుల వద్ద కాపలా కాయడం చేతకాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఎద్దేవా చేశారు. -
జగదీశ్రెడ్డి వర్సెస్ రాజగోపాల్రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే వెంటనే మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్రెడ్డి రాస్తారోకో చేశారు. -
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిని ఎవరూ ఆపలేరు: జగదీశ్రెడ్డి
సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలుసు’ అని అన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. -
ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి తదితరులు ఏకతాటి మీదకు రావడం పీతల కలయిక వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో కూడా మీడియాతో ముచ్చటించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఎన్ని పీతలు ఏకమైనా తమను ఏమీ చేయలేవని.. గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ఉప ఎన్నికను ముడిపెట్టొద్దని, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉంటారన్నారు. ‘హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎంత మెజార్టీ సాధిస్తామని పోలింగ్ తేదీ సమీపించినపుడు వెల్లడిస్తాం. కాంగ్రెస్తోనే మాకు అక్కడ పోటీ.. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనుభవంతో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు’అని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపు మాకు బూస్టప్.. హుజూర్నగర్ నియోజవర్గాన్ని ఉత్తమ్ కుమార్రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని, స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో తమ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. టీఆర్ఎస్ రాజకీయ గొడవలకు పూర్తి దూరంగా ఉంటుందని, 2014 తర్వాత హుజూర్నగర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు లేదన్నారు. హుజూర్నగర్లో గెలుపుతో తమకు బూస్టప్ వస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని జగదీశ్రెడ్డి వెల్లడించారు. సీఎంను కలిసిన సైదిరెడ్డి హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డి శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న సైదిరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి జగదీశ్రెడ్డి నివాసానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రగతిభవన్కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం, సమన్వయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అందరినీ కలుపుకొనివెళ్లి విజయం సాధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
కాలేజీల షిఫ్టింగ్లపై సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలను ఇష్టారాజ్యంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చేస్తున్న షిప్టింగ్ల వ్యవహారంపై మంత్రి జగదీశ్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇష్టారాజ్యంగా కాలేజీలను మండల పరిధి, జిల్లా పరిధి కాకుండా ఇతర జిల్లాలకు మార్చుతు న్నట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహేతుక కారణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కాలేజీల షిఫ్టింగ్కు అనుమతించవద్దని స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులతో సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విభాగాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేయాలని సూచించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన దృష్ట్యా దానిపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే దీనిని ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్లు ఈ డిగ్రీని చదవడం, అందులో తొలి ఏడాది నుంచే విద్యా బోధనకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండటం ద్వారా మెరుగైన విద్య లభిస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. ప్రమాణాలు పెరుగుతాయని, ప్రమాణాలు పాటించని కాలేజీలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుపై సీఎం కేసీఆర్తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడిపైనా సమీక్షించినట్లు తెలిసింది. ప్రవేశాలు, ఫలితాల ఆలస్యంపైనా సీరియస్ అయినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. -
టెట్ నిర్వహణకు చర్యలు చేపడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెట్ను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 2 టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయిందని, జూన్ గడిస్తే మరో టెట్ వ్యాలిడిటీ ముగిసిపోతుందని, ఇక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లలు అనే వారే ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలన్నారు. బడి మానేసే వారు ఎందుకు మానేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. గురుకులాల్లో సీట్లు లేకపోయినా అలాంటి వారిని చేర్చుకునేలా సీఎం కేసీఆర్తో చర్చించి ప్రత్యేక ప్రవేశాలకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. మన విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. ఇతర దేశాలతో పోల్చినా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:17 ఉందన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు.. నాలుగేళ్లలో పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చామని, ఈసారీ పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశాల్లో విద్య కూడా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మంత్రులు, ఎంఎల్ఏల కాలేజీలను మూసేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తప్పవన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలని, అందుకు అవసరమైన మార్పులను సిలబస్లో తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలపై స్పందిస్తూ అవి కాలేజీల వారీగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.ప్రైవేటు వర్సిటీల చట్టం తెచ్చామని, నిబంధనలను రూపొందించి ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తామన్నారు. ఇంటర్మీడియట్ హాల్టికెట్లలో తప్పుల విషయంలో స్పందిస్తూ ఎవరైనా విద్యార్థులకు నష్టం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామన్నారు. డిగ్రీలు పూర్తయ్యాక కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. మీడియంపై లోతుగా పరిశీలన తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటుండగా, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదనలు ఉన్నాయని, దీనిపై ఉన్నతస్థాయిలో మరింత లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి మరోసారి సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపడతామన్నారు. మహిళా యూనివర్సిటీ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యకు బడ్జెట్లో ఎక్కువ నిధులే కేటాయించామని, అయితే అవి విద్యాశాఖ పేరుతో రానుందున అలా భావిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు మంచి నీటి కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అట్రాసిటీ చట్టం అమలుపై నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 478 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మంత్రి పేర్కొంటూ వీటిని పునఃసమీక్షించాలన్నారు. అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నిరో ధించేందుకు పీసీఆర్, పీవోఏ చట్టాలకు పదును పెట్టాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఐదుగురు సభ్యులతో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. 79 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసిందని, స్టేమీద ఉన్న మరో 37 కేసుల్లో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్దేశంతో స్టే రద్దవుతుందని మంత్రి వివరించారు. అట్రాసిటీ చట్టం అమలును పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. -
మంత్రి వ్యాఖ్యలపై జనం ఆగ్రహం
సాక్షి, యాదాద్రి : వేములకొండ దుర్ఘటనపై మంత్రి జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. వేములకొండలో పోస్టుమార్టం జరుగుతున్న పీహెచ్సీ వద్ద మృతుల బంధువులను పరామర్శించా క ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్కుమార్రెడ్డి, గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆగ్రహించిన మంత్రి.. ‘రూ.15 లక్షలు సరిపోతాయా...? రూ.50 లక్షలు వద్దా?’ అని అనిల్తో వ్యంగ్యంగా అనడంతో వివాదం మొదలైంది. ‘మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. బాధ్యతగా మెలగడం నేర్చుకోండి. శవాల మీద పేలాలు ఏరుతున్నారు. చచ్చినకాడ రాజకీయం చేస్తారా?’ అంటూ ఆందోళన చేస్తున్న వారిపైనా మంత్రి ఆగ్రహించడంతో వివాదం పెద్దదైంది. కాంగ్రెస్ నాయకులను, గ్రామస్తులను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మృతుల కుటుంబీకులతో చర్చించి రూ.2.5 లక్షల ప్రభుత్వ సాయం, సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్థలం లేని వారికి స్థలంతోపాటు ఇల్లు, చదువుకునే పిల్లలుంటే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అనంతరం మంత్రి చెప్పారు. ఈలోపు గ్రామస్తులు, విపక్ష నేతలు గేటుకు అడ్డంగా బండరాళ్లు పెట్టి ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను బయటకు వెళ్లనీయలేదు. పరిహారం రూ.5 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. మంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మృతదేహాలను గ్రామానికి పంపారు. రూ.2.50 లక్షలు ప్రభుత్వం నుంచి, మరో లక్ష భువనగిరి ఎమ్మెల్యే నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. దీంతో సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతకు తెరపడింది. -
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపైనున్న మెజారిటీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, పెండింగ్ కేసులను కూడా త్వర లో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివా లయంలోని హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగ్ కేసులపై చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసు షీట్లలో వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడం వల్ల కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని డీజీపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీకి సూచించారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుంచి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి అప్పగించి, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు. టీఆర్ఎస్కు కేసుల సమాచారం పంపండి ఈ సమావేశానంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసులు ఎత్తివేస్తూ 1138 జీవో జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకా 19 రకాల కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారాన్ని contact@trspartyonline.org వెబ్సైట్ లేదా వాట్సాప్ నంబర్ 8143726666 కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని, ఇందుకు nnreddy.hm@ gmail.com, 04023451073ను సంప్రదిం చవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమసమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అయితే, కేంద్ర పరిధిలో ఉన్న వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో వందలకోట్ల అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. తెలంగాణ 31 జిల్లాలో లేని అవినీతి సూర్యాపేటలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయం కోసం ఇప్పటి వరకూ స్థల సేకరణ జరగలేదని తెలిపారు. సూర్యపేటలో 70 ఎకరాల స్థలం కేటాయించి బోర్డు పెట్టారు కానీ ప్రస్తుతం అది కబ్జాకు గురువతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ విషయంపై సీఎం చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థల సేకరణ గురించి కలెక్టర్ను అడిగారు. ఆ సమయంలో అతను కేసు కోర్టులో ఉన్నట్టుగా చెప్పారు. గతంలో సీఎం కూడా వచ్చారు.. అప్పుడు కలెక్టర్ సీఎంకి మూడు ప్రతిపాదనాలు ఇచ్చారు. స్థానికంగా సూర్యాపేటలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెప్పారు. నల్ల చెరువు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న 200 ఎకరాలు పేదవారి ఇళ్ల స్థలాలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాక అమాయక ప్రజల భూములు కొని కలెక్టర్ కార్యాలయం కోసం ఇస్తున్నారు. దీంట్లో మంత్రి హస్తం కూడా ఉంది’ అని సంకినేని వెంకటేశ్వర రావు మండిపడ్డారు. అవే కాకుండా పేదల భూములు, ప్రైవేట్ భూములు కొని రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది నిరూపణ అయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని సక్కినేని సవాల్ విసిరారు. 18 లక్షల చొప్పున నాలుగున్నర కోట్లు కావాలని సీఎస్ ఎస్పీ సింగ్ని అడిగారు. ఇందులో మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హస్తం కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలి.. లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. వైద్యశాఖలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేసినట్టుగా.. మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది నిరూపణ కాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సక్కినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. -
ఎన్నికలకు భయపడుతున్నట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికలకు భయపడి శాసనసభ్యత్వం రద్దుపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోర్టుకు వెళ్తున్నారా అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో కలిసిన విలేకరులతో ఆయన గురువారం మాట్లాడుతూ ఇద్దరు శాసనసభ్యుల బహిష్కరణపై ప్రజాక్షేత్రానికే వెళ్తామన్న కాంగ్రెస్ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు భయపడటమంటే జానారెడ్డి ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. ఉపఎన్నికల్లోనే గెలవలేని వాళ్ళు సాధారణ ఎన్నికల్లో ఇంకేమి గెలుస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే సభలో బోర్ కొడుతుందని, 2019 ఎన్నికల తర్వాత శాసనసభలో ఉండేవి టీఆర్ఎస్, మజ్లిస్లేనని జోస్యం చెప్పారు. కొన్ని పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటనేది సీఎం కేసీఆర్ ఉద్దేశం కాదని, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నదే ఆయన ప్రధాన ధ్యేయమని జగదీశ్రెడ్డి చెప్పారు. ప్రజల కనీస అవసరాలు, మౌలిక వసతులకోసం 70 ఏళ్ల భారతంలోనూ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమిటన్నదే ఆయన ప్రశ్న అని చెప్పారు. తెలంగాణ ప్రజలను ఉద్యమంలో ఏకతాటి పైకి తెచ్చినట్టే దేశ ప్రజలను ఐక్యంగా నడిపించే శక్తి కేసీఆర్కు ఉందన్నారు. -
గడువులోగా నిధుల ఖర్చు: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
గురుకుల సమస్యలకు త్వరలో పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం మంత్రి నివాసంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాలల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్క రించారు. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిం చటంతో పాటు 2007లో రెగ్యులర్ అయిన టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం అధ్యక్షులు కొల్లు వెంకట్రెడ్డి, యం.వెంకటేశ్వర్లు కోరారు. రూల్ 28ఏ కింద ఇంక్రిమెంట్ల కోతను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సీఆర్కే శంకర్దాస్, రఘునందన్రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యసాధనపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దానికి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఎదురవుతాయి. ప్రోత్సహించే వాళ్లకంటే విమర్శించే వాళ్లే చాలా మంది ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది’అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సదస్సుకు ఆయన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను ప్రోత్సహించేందుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు రాయితీలిస్తున్నాయని వివరించారు. బ్యాంకులతోనే ఇబ్బందులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు బ్యాంకులతో ముడిపడి ఉండటంతో లక్ష్యసాధన ఇబ్బందిగా మారుతోందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లపై ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోందని, కానీ అవన్నీ బ్యాంకులతో ముడిపడి ఉండటంతో ఔత్సాహికులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. బ్యాంకుల నిబంధనల్లో మార్పులు రావాలని, ఆమేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్పందించడంలేదు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్) ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో రాయితీలిస్తోందని ఎంఎస్ఎంఈ సంచాలకుడు పీజీఎస్ రావు పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఖర్చు చేస్తోందని, కానీ వీటిని వినియోగించుకోవడంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని అన్నారు. -
దళిత శాఖ రెడ్డికా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఉనికి కోల్పోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత శాఖను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీనియర్లైన దళిత శాసనసభ్యులు 15 మంది ఉన్నారని, అలాంటి వారిని పక్కనపెట్టి ఒక్కసారి ఎమ్మె ల్యేగా గెలిచిన జగదీశ్రెడ్డిని దళిత మంత్రిగా నియమించడంలో ఆంతర్యమేమిటన్నారు. జగదీశ్రెడ్డిని తొలగించకుంటే ఉద్యమం ఎస్సీ అభివృద్ధి శాఖకు ఏటా రూ. 15 వేల కోట్ల బడ్జెట్ ఉందని, అంతటి పెద్ద శాఖకు ప్రాతినిధ్యం వహించే జగదీశ్రెడ్డి డిల్లీ వెళ్లినప్పుడు కేవలం విద్యుత్ శాఖ మంత్రిగా చలామణి కావడం, అందుకు సంబంధించిన కేంద్ర మంత్రులు, అధికారులను మాత్రమే కలవడం జరుగుతుందని, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా వెళితే అతన్ని దళితుడు అనుకుంటారనే ఉద్దేశంతో అలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే జగదీశ్రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించిన నిధులు పూర్తిగా దారి మళ్లుతున్నాయన్నారు. జనాభాలో కేవలం ఒకశాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం మెజారిటీ వర్గాలను అవమానించడమేనన్నారు. -
ఎస్సీ వసతి గృహాలకు కొత్త మెనూ!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు కోడి గుడ్లు, ఒక రోజు చికెన్, సన్న బియ్యంతో వండిన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్మీడియట్, ఆపై చదివే విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డుతోపాటు వారంలో రెండు సార్లు చికెన్తో భోజనం అందించనుంది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో కొత్త మెనూను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విడుదల చేశారు. ఎస్సీ వసతి గృహాల్లోని అందరికీ వర్తింపు: జగదీశ్రెడ్డి ఇప్పటివరకు విద్యార్థులకు కోడిగుడ్లు వారానికి మూడు మాత్రమే పెడుతుండగా, ఇకపై వారానికి ఆరు కోడిగుడ్లు, ఒకరోజు కోడికూరతో కూడిన భోజనం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు జగదీశ్రెడ్డి తెలిపారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆదివారం చికెన్తో భోజనం పెడతామని, ఇంటర్మీడియట్, ఆపై తరగుతులు చదివే విద్యార్థులకు ప్రతి బుధవారం, ఆదివారాల్లో కోడికూరతో భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికి ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే పోషక పదార్థాలు కలిగిన కాయగూరలతో భోజనం అందించేలా కొత్త మెనూను రూపొందించినట్లు వివరించారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న దార్శనికతకు ఈ పథకం అద్దం పడుతోందన్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విద్యార్థులకు టీ, బిస్కెట్ అందిస్తామని, 8 గంటలకు టిఫిన్ పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్డీఎఫ్ యాక్ట్ దేశానికే తలమానికం
జాతీయ సదస్సులో మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ యాక్ట్ దేశానికే తల మానికమని ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్డీఎఫ్ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు నుంచే కేసీఆర్ దళిత, ఆదివాసీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధాస క్తులతో ఉన్నారన్నారు. సీడీఎస్ డైరెక్టర్ వై.బి. సత్య నారాయణ అధ్యక్షత వహించిన ఈ సభలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఇటువంటి చట్టం కోసం పౌర, ప్రజాసంఘాలు కృషి చేయాలని ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు మాట్లాడుతూ చట్టంలో కొన్ని విషయాలపట్ల త్వరలో రూపొందించబోయే రూల్స్లో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రూపొందిన చట్టం స్ఫూర్తితో వివిధ రాష్ట్రాల్లో చట్టం రూపకల్పనకు త్రిముఖ వ్యూహాన్ని అవలంభిం చాలని కోరారు. కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, డీబీఎఫ్ శంకర్, 12 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈ వంతెన పొలాలకు నీళ్లిస్తుంది!
వందేళ్ల బ్రిడ్జికి కొత్త బాధ్యతలు.. - సాగునీటి ప్రాజెక్టుగా మారనున్న టేకుమట్ల బ్రిడ్జి - నిజాం హయాంలో నిర్మితమైన వంతెన.. - హైదరాబాద్–విజయవాడ హైవేపై మూసీనది మీద నిర్మాణం - ఇప్పటికీ చెక్కుచెదరని పటుత్వం - చెక్డ్యాంగా మార్చాలని రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదన - 1.5 టీఎంసీ సామర్థ్యం.. 10 వేల ఎకరాలకు సాగునీరందించే వీలు సాక్షి, హైదరాబాద్: అదో వంతెన.. వయసు 107 ఏళ్లు. ఇటీవలే అది ‘విశ్రాంతి’లోకి వెళ్లింది. శతాబ్దం పాటు వాహనాలను నది దాటించి అలసిపోవటంతో దాని స్థానంలో ప్రభుత్వం మరో భారీ వంతెన నిర్మించింది. కానీ తనలో పటుత్వం ఏమాత్రం తగ్గలేదన్న ట్లు ఇప్పటికీ రాచఠీవీ ఒలకబోస్తూ సగర్వంగా నిలిచిన ఈ కట్టడం మరో బాధ్యతను తన భుజాలపై వేసుకోనుంది. నది నీటిని నిల్వ చేసి రైతుల మోములో చిరునవ్వు చిందించే బాధ్యత నిర్వర్తించబోతోంది. బ్రిడ్జి నుంచి చెక్డ్యాంగా.. హైదరాబాద్– విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద మూసీ నదిపై కళాత్మకంగా ఉండే వంతెన సుపరిచితమే. పేరుకు వంతెన అయినా దాని నిర్మాణ కౌశలం మాత్రం ఇట్టే కట్టిపడేస్తుంది. ఆర్చి ఆకారంలో ఉండే నీటి తూములు, దానికి పేర్చిన రాళ్లు, వంతెన పైన రోడ్డుకు వాడిన రాతి దిమ్మెలు.. ఓ అద్భుత నిర్మాణంగా కనిపిస్తుంది. వందేళ్ల వయసు పైబడటం, విజయవాడ హైవే విస్తరణలో భాగంగా దాని స్థానంలో ఇటీవలే ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించింది. ఈ కొత్త బ్రిడ్జిపై వెళ్తూ పాత వంతెన కళాత్మకతను కనులారా వీక్షించే భాగ్యం వాహనదారులకు కలుగుతోంది. ఇటీవల రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ఈ బ్రిడ్జి పటుత్వాన్ని పరిశీలించి ఇప్పటికీ పటిష్టంగానే ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాగులపై నిర్మించే వంతెనలను చెక్డ్యాం నమూనాలో నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 120 వరకు వంతెనలను చెక్డ్యాం నమూనాలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 324 మీటర్ల పొడవుతో మూసీ నదిపై టేకుమట్ల వద్ద ఉన్న ఈ వంతెనను నీరు నిల్వచేసే ప్రాజెక్టుగా మార్చాలన్న ఆలోచన అధికారుల్లో కలిగింది. దీంతో వారు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటి పారుదల శాఖ ఆమోదానికి పంపారు. ఒకటి, ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం.. మూసీనదిపై సోలిపేట వద్ద నిర్మించిన ఆనకట్ట ద్వారా సాగునీరందిస్తున్నారు. ఇప్పుడు టేకుమట్ల రోడ్డు వంతెనను చెక్డ్యాంలోకి మారిస్తే దిగువ ప్రాంతాల్లోని రైతులకు సాగునీరందించే అవకాశం ఉంటుంది. దాదాపు 324 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు నదీగర్భంలో దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుతో మత్తిడి గోడను నిర్మిస్తే ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంలో నీరు నిలుస్తుందని అంచనా. ఈ నీరు దాదాపు పదివేల ఎకరాలకు ఉపయోగపడనుంది. ఇంతటి నిల్వ సామర్థ్యంతో కొత్త చెక్డ్యాం నిర్మించాలంటే దాదాపు రూ.30 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. కానీ ఈ పాత వంతెనను డ్యాంగా మార్చాలంటే కేవలం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకానికీ ఊతం: తుమ్మల ఈ పాత వంతెనను చెక్డ్యాం నమూనాలోకి మారిస్తే సాగుతో పాటు పర్యాటకానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. కళాత్మకంగా ఉన్న వంతెన ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మారిస్తే పర్యాటకులు వస్తారు. పర్యాటక కేంద్రంగా మారుతుంది. శనివారం దీనిపై మంత్రి జగదీశ్రెడ్డితో చర్చించా. ఆయన కూడా సానుకూలం వ్యక్తం చేశారు. మరో నాలుగైదు రోజుల్లో నీటిపారుదల శాఖ నుంచి అనుమతి వచ్చే అవకాశముంది. -
కోమటిరెడ్డి, జగదీష్రెడ్డిల తీవ్రవాగ్వాదం
నల్లగొండ: నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. జిల్లాలో ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపించారు. అధికారులు సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ దానికి మీరే కారణం అంటూ ఎదురు దాడికి దిగారు. రౌడీ రాజకీయాలు చేస్తూ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకానొక దశలో ఏం జరుగుతుందో... ఎవరేమి మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిలు ఒకరి వైపు ఒకరు చేతులు చూపుకుంటు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పంచాయితీ పెట్టుకున్నారు. దీంతో సభలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సర్దిచెప్పే యత్నం చేశారు. ఇరుపార్టీల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో బాహాబాహికి దిగే పరిస్థితి కనిపించింది. జెడ్సీ చైర్మన్ బాలునాయక్, ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం సభలో మంచినీటి సమస్యలపై చర్చించారు. Nalgonda district , zp General Meeting, mla komatireddy, minister jagadish reddy, సర్వసభ్య సమావేశం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, -
దాహార్తి తీరింది..!
♦ బోరు అద్దెకు తీసుకుని నీటి సరఫరా ♦ మరో బోరుకు కూడా మరమ్మతులు ♦ రాజనాయక్ తండావాసుల్లో సంబరం తుంగతుర్తి: పదేళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఆ తండా వాసుల దాహర్తి తీరింది. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ తండాకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదు. వారి ఆవేదనను వివరిస్తూ ‘పానీ చేనికన్.. ఛార్విన్ దేరేకొని’ శీర్షికన శనివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో మంగళవారం తండాకు నీటి సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి మండలం మారుమూల గ్రామమైన జలాల్పురం శివారు రాజనాయక్ తండాలో పదేళ్లుగా గిరిజనులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. తండాలో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్.. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరలో తండావాసుల నీటి కష్టాలు తీర్చాలని ఆదేశించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సోమ, మంగళవారాల్లో తండాను సందర్శించి నీటి వనరులను సమీక్షించారు. తండాకు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరులో నీరు ఉండటంతో ఆ రైతును పిలిచి డబ్బులు చెల్లిస్తాం వేసవిలో నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం తండా వెలుపల ఉన్న మరో బోరుకు మరమ్మతులు చేయడంతో కొద్దిగా నీరు వస్తోంది. ఈ రెండు బోర్లద్వారా తండాలోని ట్యాంక్ను నింపి మంగళవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్య తీరడంలో ఆ తండావాసుల ఆనందానికి హద్దులు లేవు. నీటి సమస్య పరిష్కారానికి తోడ్పడిన సాక్షి దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు మా తండాకు 10 ఏళ్ల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సాక్షి పత్రిక వారు మా బాధలను తెలుసుకొని కథనాన్ని రాశారు. దీంతో అధికారులు స్పందించి మా తండాకు నీటిని సరఫరా చేశారు. సాక్షి పత్రికవారికి కృతజ్ఞతలు. – మాలోతు హరిలాల్, రాజనాయక్ తండా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించి, మా తండాకు నీటిని తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా. కిలోమీటర్ దూరం నడిచే బాధ తీరింది. – మాలోతు బుజ్జి, రాజనాయక్ తండా -
నయీమ్తో సంబంధాలు ఉన్నవారిని శిక్షించండి
కొనపూరి రాములు భార్య కవిత సాక్షి, యాదాద్రి: గ్యాంగ్స్టర్ నయీమ్తో సంబంధాలు ఉన్న అసాంఘిక శక్తులకు పదవులను ఇస్తే బంగారు తెలంగాణ కాకుండా బద్మాష్ తెలంగాణ అవుతుందని కొనపూరి రాములు భార్య కొనపూరి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సాంబశివుడు, కొనపూరి రాములు వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నయీమ్తో చేతులు కలిపి అక్రమ వ్యాపారాలు, భూదందాలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం బాధాకరంగా ఉందని ఆమె పరోక్షంగా మంత్రి జగదీశ్రెడ్డిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. బీసీలంతా ఏకమైతే తమకు రాజకీయ ఇబ్బంది ఏర్పడుతుందని కొందరు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. నయీమ్ను ఎన్కౌంటర్ చేసి ఎంతో మేలు చేశారన్నారు. ఇప్పటికైనా నయీమ్తో సంబంధాలు ఉండి బయట తిరుగుతున్న వారిని శిక్షించాలని లేకుంటే మరికొంత మంది నయీమ్లు తయారవుతారన్నారు. -
అసెంబ్లీ సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ!
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఇష్టాగోష్టిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చుననే వార్తలు వస్తున్నాయి కదా అని విలే కరులు ప్రస్తావించగా ‘మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులు అనేవి పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోనివి. దానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడా, అయిపోయిన తర్వాతనా అనేది ఎందుకు? ముఖ్యమంత్రి అనుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో హైడల్ విద్యుత్పత్తి
హైదరాబాద్ : తెలంగాణలో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 2,400 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులో ఉందని, అన్ని వనరులు ఉపయోగించి హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో పారదర్శకంగా బిడ్డింగ్ ద్వారా వెళ్తున్నామని పేర్కొన్నారు. ఏడాది చివరిలోపు 2 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటామని తెలిపారు. సోలార్ విద్యుత్లో తెలంగాణ నెంబర్వన్గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. -
విద్యుత్ సబ్సిడీ రూ. 7,150 కోట్లకు పెంచండి
⇒ మంత్రి జగదీశ్రెడ్డిని కోరిన విద్యుత్ సంస్థలు ⇒ సాగుకు 9 గంటల విద్యుత్తో ఆర్థిక భారం పెరిగినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీలను రూ. 7,150.13 కోట్లకు పెంచాలని (గతేడాది బడ్జెట్లో రూ. 4,476.86 కోట్లు) విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డిని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోరాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని వివరించాయి. అందువల్ల డిస్కంలపై ఆర్థిక భారం పెరిగిందని, విద్యుత్ సబ్సిడీలు రూ. 7,150.13 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులపై శనివారం సచివాలయంలో జగదీశ్రెడ్డి నిర్వహించిన సమీక్షలో డిస్కంలు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్రావు సమావేశంలో పాల్గొన్నారు. జెన్కోలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టండి... జెన్కో చేపట్టిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి మూలధనంగా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఆ సంస్థ సీఎండీ ప్రభాకర్రావు కోరారు. అలాగే రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ. 245.72 కోట్ల సబ్సిడీ నిధులు కేటాయించాలని తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎన్ఆర్ఈడీసీఎల్) కోరింది. విద్యుత్ సబ్సిడీల పెంపు, జెన్కో థర్మల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సబ్సిడీలు, ఇతరత్రా అవసరాల కోసం బడ్జెట్లో ఇంధన శాఖకు మొత్తం కేటాయింపులను రూ. 13,840.25 కోట్లకు పెంచాలని మంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు. -
వారిది బానిస మనస్తత్వం
కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీష్రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర యాజ మాన్యాలు ఇచ్చే బీ–ఫారాలు, మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మోకరిల్లారని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో కలసి రాకపోయినా, ఇప్పుడు కూడా సొంత రాష్ట్రంలో పిల్లిమొగ్గలు వెయ్యడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ బానిస మనస్తత్వంతో ఉన్నారని, తెలంగాణలో దానికి భిన్నంగా ప్రజలే యజ మానులుగా ప్రభుత్వం నడుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడడం లేదని ధ్వజమెత్తారు. ఆ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డం కులు సృష్టించినాసరే నీటి ప్రాజెక్టులు కట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులు అనేకం పూర్తి కాలేదని, ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రతి పక్షాలు ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు. పుట్టగతులుండవనే... పలు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు 29 పిటిషన్లు వేశాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అనుచరుల పేరుతో హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నా రన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే విపక్షాలకు పుట్టగతులు ఉండవనే ప్రాజెక్టుల ను అడ్డుకుంటున్నారన్నారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎం కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలు తున్నారన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తే ఇప్పుడున్న నేతల్లో ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని, కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. నిజానికి కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఓ దొంగల ముఠాగా వ్యవహరి స్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు అబద్దాల మీద అబద్దా లు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రజారంజక పాలన మీద తెలంగాణ ప్రజలు సంతృప్తిక రంగా ఉన్నారని, అందుకే రాష్ట్ర ప్రజలు మెదక్ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉపఎన్నికల వరకు టీఆర్ఎస్కు నీరాజనం పలికారన్నారు. -
ఢీసీసీబీ
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. బ్యాంకు చైర్మన్గా ఉన్న ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత 77 రోజులుగా సాగుతున్న పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియక డైరెక్టర్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే.. డీసీసీబీ వ్యవహారంలో పొరుగు జిల్లాకుచెందిన ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో సమస్య మరింత జటిలంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలకవర్గానికి కేవలం 11నెలల గడువు మాత్రమే ఉన్నందున చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని.. ప్రత్యేకాధికారి పాలనతో సరిపెట్టాలని ఆ మంత్రి సహకార రిజిస్ట్రార్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి ఈ వ్యవహారంపై పెద్దగా దృష్టి సారించకపోయినా.. చైనా పర్యటన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీబీ రాజకీయం మరింత రసకందాయంగా మారింది. ఏం జరుగుతుందో.. వాస్తవానికి డీసీసీబీలో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడి నేటికి 77 రోజులు కావొస్తోంది. పాలకవర్గం లేని కారణంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పాలన కుంటుపడింది. అయితే.. కాపుగల్లు సొసైటీ రద్దు తర్వాత లేచిన దుమారానికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు. చైర్మన్ ఎన్నికను నిర్వహించి బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలని బ్యాంకు సీఈఓ.. సహకార రిజిస్ట్రార్ (ఆర్సీఎస్), జిల్లా సహకార అధికారి (డీసీఓ)కి లేఖలు రాసి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే చర్చ జరుగుతోంది. ముత్తవరపు పాండురంగారావు సదరు మంత్రిని కలిసి తమ తప్పు లేదని.. అధికారుల తప్పిదాలకు బలి చేశారని, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని విన్నవించుకున్నట్లు సమాచారం. దీంతో ముత్తవరపు పక్షాన నిలబడ్డ ఆ మంత్రి.. చైర్మన్ ఎన్నికను ఎట్టి పరిస్థితిలో నిర్వహించొద్దని పట్టుపడుతున్నారు. ఎలాగూ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం 11 నెలలే ఉందని.. అవసరమైతే పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండురంగారావుకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న పలువురు డైరెక్టర్లు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డిని కలిశారు. వారి వాదన విన్న ఆయన చైనా పర్యటన తర్వాత డీసీసీబీ వ్యవహారాన్ని తేల్చేస్తానని ఆ డైరెక్టర్లకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి విదేశీ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి వచ్చినందున డీసీసీబీ చైర్మన్ ఎన్నికపై ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ఉత్కంఠ బ్యాంకు వర్గాలతో పాటు డైరెక్లర్లలో నెలకొంది. చైర్మన్ ఎన్నిక కోసం పట్టువీడకుండా పోరాడుతున్న డైరెక్టర్లు మాత్రం నైరాశ్యంలో పడిపోయారు. సహకార శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని, ఎన్నికలకు అనుమతిస్తే పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో... పొరుగు జిల్లాకు చెందిన మంత్రి ఏం చేస్తారోననే మీమాంసకు ఎప్పుడు తెరపడుతుందో.. వేచిచూడాల్సిందే. -
'కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది'
-
'కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. సన్నాసుల పార్టీ అంటే తిట్టుకాదని...కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న ద్రోహానికి ఆయన వ్యాఖ్యలు చాలా చిన్నవని చెప్పారు. ( చదవండి : కాంగ్రెస్ ఓ దొంగల ముఠా! ) ప్రజల బాగుకోసమే ఏ పార్టీ అయినా పని చేయాలి కానీ, రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పంచాయితీ వస్తే అందరూ కలిసి రావాలని చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని... జీవో నం.123పై 29 కేసులు వేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన విషయాల్లో ఏది అబద్ధమో వారు చెప్పాలన్నారు. క్షుద్ర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ పొరపాట్లు చేస్తే సలహాలు ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే డీకే అరుణకు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం బహిరంగంగా దేవుళ్లకు మొక్కులు తీరుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లాగా దొంగ వ్యవహారాలు చేయలేదని..దొంగబాబాలను ప్రొత్సహించలేదన్నారు. నేతల చీకటి కోణాలు ప్రజలకు తెలుసునని చురకలంటించారు. కాంగ్రెస్ ఒక కప్పల తక్కెడ పార్టీ అని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని... కాంగ్రెస్ నేతలు సన్నాసులు కాకపోతే ప్రాజెక్టులు ఎందుకు అడ్డుకుని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా నేతలు తీరు మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరని హెచ్చరించారు. సన్నాసుల నుంచి బిచ్చగాళ్లగా మారడం ఖాయమని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. -
వారి వీపులు పగలడం ఖాయం
⇒ కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజం ⇒ తెలంగాణలో చిచ్చుకు కుట్ర ⇒ అడ్డుకోవడమే ‘ముఠా’పని ⇒ మా అమ్మ,నాన్నే నిర్వాసితులు ⇒ ప్రభుత్వరంగ ఖాళీలను భర్తీ చేస్తాం సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ అధికారంలోకి రావడం మాటేమో గానీ వారి వీపులు పగలడం ఖాయమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు హెచ్చరించారు. తాము 2019లో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలపై ఆయన మండిపడ్డారు. ‘ఆ.. 2019లో ఖాయం.. పక్కా ఖాయం.. వీపులు పలుగుడు ఖాయం.. శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం’అని ధ్వజమెత్తారు. సోమ వారం రాజన్న సిరిసిల్లలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. తన తండ్రి.. సీఎం కేసీఆర్ స్వయంగా భూనిర్వాసితులని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం ఉండే పోశాన్పల్లి ఎగువమానేరు ముంపులో పోతే, సిద్దిపేటకు వెళ్లారని గుర్తు చేశారు. అలాగే, తమ తల్లి శోభ కుటుంబీకు లున్న కొదురుపాక మిడ్మానేరు ముంపులో పోతోందన్నారు. నిర్వాసితుల బాధేంటో తమ తల్లిని అడిగితే తెలుస్తుందని, తన చిన్న నాటి జ్ఞాపకాలు కూడా కనుమరుగయ్యా యని పేర్కొన్నారు. ‘వాళ్లిద్దరికి తెలియని నిర్వాసితుల బాధలు.. ఈ సిపాయిలకు (జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి)లకు తెలు సట’ అంటూ విరుచుకుపడ్డారు. ‘బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యం తప్ప, దారిన పోయే దానయ్యలు.. జానాబెత్తెడు జానా రెడ్డితో ఏం కాద’న్నారు. తాము ప్రజలకు జవాబుదారులం కానీ ప్రజలు విడిచిపెట్టిన ప్రతిపక్షాలకు కాదన్నారు. తెలంగాణలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కొంతమంది కుట్రపన్నారని ఆరోపించారు. పెట్టుబడులు రావద్దనేదే వారి ఆలోచన అని ఆరోపించారు. ఆందోళనలకు, అరుపులకు భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ ఖాళీ లన్నింటినీ భర్తీ చేసేందుకు చిత్త శుద్ధితో ఉన్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పించేందుకు దేశ, విదేశాలకు కాలికి బలపం కట్టుకొని తిరు గుతున్నామని చెప్పారు. అభివృద్ధిలో దేశం 8– 10 శాతం పెరుగుతుంటే, రాష్ట్రం 17– 19 శాతం పెరుగుతోందని కేటీఆర్ వివరించారు. ప్రతిపక్షాలు కావవి... దుష్పక్షాలు దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచిన కేసీఆర్ పాలనను, తెలంగాణను వ్యతి రేకించిన ఆంధ్రోళ్లు, ప్రధాని మోదీ సైతం మెచ్చుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకొంటున్నాయని, అవి ప్రతి పక్షాలు కావని, దుష్పక్షాలని ధ్వజమెత్తారు. -
లింగా.. ఓ లింగా..
మార్మోగిన పెద్దగట్టు సాక్షి, సూర్యాపేట: లింగా.. ఓ లింగా.. అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రాంగణం మార్మోగింది. జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మొదటి రోజు దేవపెట్టె పెద్దగట్టు దేవాలయానికి చేరింది. అనంతరం యాదవ కులస్తులు గుడిచుట్టూ గంపల ప్రదక్షిణ చేశారు. రెండేళ్ల క్రితం నెలవారం తర్వాత సూర్యాపేట రూరల్ మండలంలోని కేసారం గ్రామం లోని మెంతబోయిన, గోర్ల, మున్న వంశీయులు దేవరపెట్టెను తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం దేవరపెట్టెను తీసుకురా వాలని యాదవ కులస్తులను కలెక్టర్, ఎస్పీలు కోరారు. దీంతో రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హననూతన్, జేసీ సంజీవరెడ్డి కేసారం గ్రామానికి చేరుకున్నారు. దేవరపెట్టె ఉన్న మెంతబోయిన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాదవ కులస్తులు దేవర పెట్టెను తరలించే తంతు నిర్వహించారు. ఆ పెట్టెను యాదవ పూజారులు భుజాలపై పెట్టుకొని ముందు నడవగా, గజ్జెల లాగులు, భేరీ చప్పుళ్లు, కటార్ల విన్యాసాలతో పాటు.. ఓలింగా.. ఓలింగా.. నామస్మరణల మధ్య కేసారం గ్రామం నుంచి కాలినడకన ఆరు కిలోమీట్ల దూరంలో ఉన్న దురాజ్ పల్లి (పెద్దగట్టు) దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజ లతో దేవాలయ ప్రవేశం చేశారు. అనంతరం మెంతబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన బియ్యం, ఇతర పూజా సామగ్రితో వచ్చిన గంపల ప్రదక్షిణ నిర్వహించారు. -
‘గురుకుల’ అర్హతలపై రేపు స్పష్టత
టీఎస్పీఎస్సీకి సంక్షేమ శాఖల వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యుల పోస్టులకు సంబంధించి సవరించిన అర్హతలపై సోమవారానికి పూర్తి స్పష్టత, నిబంధనల వివరాలను అందిస్తామని సంక్షేమ శాఖలు టీఎస్పీఎస్సీకి తెలియజేశాయి. విద్యార్హతల వివరాలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ వర్గాలు శనివారం ఆయా శాఖలను కోరగా.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని, పూర్తిస్థాయి వివరాలను సోమవారం అందిస్తామని లిఖితపూర్వకం గా తెలియజేశాయి. మరోవైపు విద్యార్హతల విషయంలో టీఎస్పీఎస్సీకి ఎలాంటి సం బంధం ఉండదని, సంక్షేమ శాఖలు నిర్దేశిం చిన నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. మంత్రులకు తెలిసే... మూడు శాఖలకు చెందిన మంత్రులకు తెలిసే గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. తెలం గాణ గురుకుల సొసైటీ పరిధిలోని పోస్టుల కు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల పోస్టులకు సంబంధించిన నిబంధనల ఫైలుపై సంబంధిత మంత్రి జగదీశ్రెడ్డి, గిరిజన సంక్షేమ గురుకులాల పోస్టుల నిబంధనల ఫైలుపై మంత్రి చందూ లాల్ సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎన్సీ టీఈ నిబంధనలు ఎలా ఉన్నాయన్నది కూడా మంత్రులు పరిశీలించలేదు. దీంతో గురుకుల సొసైటీలు పోస్టుల భర్తీకి టీఎస్పీ ఎస్సీకి ఇండెంట్లు సమర్పించాయి. అయి తే సంబంధిత శాఖల అధికారులు కూడా మంత్రులకు ఎన్సీటీఈ నిబంధనలపై స్పష్టం చేయకుండానే మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం. -
ప్రమాదాల నివారణకు చర్యలు
నల్లగొండ క్రైం : నా కుమారుడు అడిగినా బైకు కొనివ్వలేదని, మీ పిల్లలను కూడా గారాబం చేసి బైక్లు కొనిస్తే మనకే నష్టం జరుగుతుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. దేశంలో నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, నెలకు 400 మంది, సంవత్సరానికి 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 99 శాతం మానవతప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. సీటుబెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం, మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్లలో వెనుక సీట్లో కూర్చున్న వారే ఎక్కువగా మరణిస్తున్నారని, ఆ సీట్లో కూర్చున్న వారు కూడా సీటుబెల్ట్ పెట్టుకోవాలన్నారు. లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విద్యార్థులు తమ తండ్రి చెప్పాలని సూచించారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు కేసులు రాస్తుంటారని అన్నారు. భద్రత ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, డ్రైవర్లకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ గౌరవ్ఉప్పల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కమిటీతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ గత 14 రోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వివిధ అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదరహితంగా మార్చాలన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు జాగ్రత్తలపై ఆలోచన ఉంటుందని, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం వ్యాసరచన, పెయింటింగ్, స్లో సైక్లింగ్, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసప్రతాలు, హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, సీఐలు ఉన్నారు. -
త్వరలో ‘కాంట్రాక్ట్’ ఉద్యోగాల క్రమబద్ధీకరణ
మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్ర శేఖర్రావు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్తో కలసి బుధవారం ఇక్కడ మింట్ కాంపౌండ్లో తెలంగాణ విద్యుత్ కాంట్రా క్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల కృషితోనే 24 గంటల నిరంతర విద్యుత్ను అందించడం సాధ్యమైందన్నారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల దోపిడీని అరికడతామని, మధ్య దళారి వ్యవస్థను రూపుమాపతా మని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమ రోజుల్లోనే విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడామని, కార్మికుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంద న్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం వడ్డించాలన్న ప్రతిపాదనల ఫైల్ కూడా 4సార్లు వెనక్కి వచ్చిందని తెలి పారు. పేదల ఆకలి తెలిసిన పార్టీగా తాము అన్ని అడ్డం కుల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతామన్నారు. కాంట్రా క్ట్ ఉద్యోగ వ్యవస్థ అత్యంత దుర్మార్గమని, దీనిని రద్దు చేయాలని హరగోపాల్ కోరారు. కరెంట్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తే వారి వేత నాలను కాంట్రాక్టర్లు దోచుకోవడం దారుణమన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు. సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని 23 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మిక కుటుంబాల తరఫున యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. శ్రీధర్ గౌడ్, ఎస్.సాయిలు కృతజ్ఞతలు తెలిపారు. -
పదవులేవీ.. గుర్తింపేదీ..!
టీఆర్ఎస్ వలస నేతల్లో అసంతృప్తి అధినేత దర్శనమే గగనమైందంటూ ఆవేదన సాక్షి, హైదరాబాద్: ‘‘నామినేటెడ్ పదవుల న్నారు. వాటి ముచ్చట అటుంచి పార్టీ పద వులకు కూడా దిక్కులేదు. మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన నేతలకే దిక్కూ మొక్కు లేదు. మాకే కాదు, వారికి కూడా అధినేత అపాయిం ట్మెంటే దొరకడం లేదు. ‘పాత–కొత్త నేతల కలయిక’ నినాదం మాటలకే పరిమితమైంది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు’’ – అధికార టీఆర్ఎస్లోకి పలు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల్లో పలువురి ఆవేదన ఇది. పట్టించుకునే వారు లేక, పదవుల్లేక, గుర్తింపూ లేక చివరికి అనామకంగా మిగిలి పోయామన్న నైరాశ్యం వారిలో వ్యక్తమవు తోంది. బంగారు తెలంగాణ పునర్నిర్మాణం, రాజకీయ పునరేకీకరణ పేర కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చు కోవడం తెలిసిందే. తామొక్కరమే చేరితే గుర్తింపు ఉండదేమోననే భావనతో తమ అనుచరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధుల్లోని అస్మదీయుల్ని కూడా టీఆర్ఎస్ లోకి వెంటతెచ్చుకున్నారు. వారిలో ముఖ్యుల నుకున్న వారికి నామినేటెడ్ పదవులిచ్చేలా టీఆర్ఎస్ పెద్దల నుంచి హామీ తీసుకుని మరీ చేరారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడిందంటూ వారు వాపోతున్నారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికే ఎక్కువ పదవులు దక్కాయి. వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్లలోనైతే కొత్తవారికి నామమాత్రంగా కూడా అవకాశం దక్కలేదు. దీనికి తోడు వలస వచ్చిన ఎమ్మెల్యేల్లో పలువురు తమకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం కూడా లభించడం లేదని వాపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇదేమిటం టూ తమను పార్టీలోకి తీసుకొచ్చిన నేతలతో వాదులాటకు దిగుతున్నారు. పార్టీ పదవులకూ చుక్కెదురే తొలి నుంచీ టీఆర్ఎస్లో పనిచేసిన, ఎన్నిక ల్లో గెలుపు అనంతరం పలు పార్టీల నుంచి వచ్చి చేరిన ‘పాత–కొత్త’ నేతలు పాలూ నీళ్లలా కలిసిపోయి పని చేయాలని కేసీఆర్ ఒకటికి రెండుసార్లు పార్టీ వేదికలపై చెప్పారు. కానీ వారు కలిసిపోయిన దాఖలాలు మాత్రం లేవు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ పాత, కొత్త నేతల మధ్య ఒకరకమైన విభజన స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కమిటీల నియామకం కోసం అధినాయకత్వం ప్రతిపాదనలు అడిగినప్పుడు కూడా మెజా రిటీ జిల్లాల్లో పలువురు మంత్రులు పాతవారి, తమ దగ్గరివారి పేర్లతోనే జాబితాలు పంపిం చారంటున్నారు. వలస నేతలకు ప్రాధాన్య మివ్వలేదని, వారి అనుచరుల పేర్లను పక్కన పెట్టారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగిం ది. దాంతో ఇలా వలస వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో పలువురు తమ పాత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతోనే సాన్నిహిత్యం నెరుపు తున్నారని, అవకాశం చూసుకుని పాత గూటికి చేరుకునే ప్రయత్నాలూ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో విన్పిస్తోంది. ముఖ్యంగా పాత వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల విషయంలో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. తాజాగా నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంటున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మధ్య పొసగడంలేదన్న ప్రచారం బాహాటం గానే జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మిన హా మిగతా జిల్లాల్లో ఈ అసంతృప్తి బాగానే ఉందని సమాచారం. అయితే కొందరు వలస ఎమ్మెల్యేలు తమ అనుచరుల నుంచి త్రీవమైన ఒత్తిడి ఉన్నా సముదాయిస్తూ సమయం కోసం వేచిచూస్తున్నారు. కనీసం పార్టీ పదవులిచ్చినా తమపై కొంత ఒత్తిడి తగ్గేదని వారంటున్నారు. -
‘విద్యుత్’లో అవినీతి తగ్గింది: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్శాఖలో గతంలో కంటే అవినీతి తగ్గిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గతంలో అదేపనిగా విద్యుత్ సిబ్బంది అవినీతికి పాల్పడేవారని, వారిని విద్యుత్ సరఫరా విధులకు దారి మళ్లించామన్నారు. అవినీతిని నిర్మూలించేందుకే వ్యవసా య విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను వచ్చే మేలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ గడువు నిర్దేశించారని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించిన జగదీశ్రెడ్డి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ జారీ కోసం క్షేత్ర స్థాయిలో రూ. 25 వేలు లంచం అడుగుతున్నారని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పైవిధంగా స్పందించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఎవరైనా వేధిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీ తర్వాత కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రికార్డు స్థాయిలో పెరిగిన విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6న రికార్డు స్థాయిలో 8,320 మెగావాట్ల డిమాండ్ నమోదైందన్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట డిమాండ్ 9,500 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, ఒక్క ఎకరం పంట ఎండినా బాధ్యులైన విద్యుత్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లలను 24 గంటల్లో ప్రభుత్వ ఖర్చుతో మార్చాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. -
విమర్శకులే చీకట్లో ఉన్నారు
రెండున్నరేళ్లలో అన్ని హామీలు నెరవేర్చాం: మంత్రి జగదీశ్రెడ్డి ములుగు: ‘తెలంగాణ ఏర్పడితే చీకట్లోకి వెళతామని నాడు విమర్శించిన నాయకులే నేడు చీకట్లోకి వెళ్లారు.. ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండాయని’రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండున్నరేళ్ల కాలంలోనే పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పందికుంటలో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ గిరిజనశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్తో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 సబ్స్టేషన్లు, సరఫరా లైన్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. 26 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పాల్వంచ: రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను బుధవారం పరిశీలిం చారు. అనంతరం మంత్రి తుమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
‘తెలంగాణలో విద్యుత్కు డిమాండ్’
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్కు డిమాండ్ పెరుగుతోందని, మన అవసరాలకు అనుగుణంగా వచ్చే రెండేళ్లలో 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి బుధవారం పాల్వంచ కేటీపీఎస్ను సందర్శించారు. మణుగూరులలోని భద్రాద్రి విద్యుత్ ప్లాంట్కు త్వరలో పర్యావరణ అనుమతులు మంజూరవుతాయని మంత్రి చెప్పారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని పేర్కోన్నారు. -
త్వరలో అసెంబ్లీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు
మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే బిల్లును త్వరలోనే అసెంబ్లీ ముందుకు తెస్తామని మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, దళిత, గిరిజ నుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున జగదీశ్రెడ్డి ప్రకటన చేశారు. దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల్లో చదువుకున్న విద్యార్థులను కాంట్రా క్టర్లుగా చేయాలన్న ఆలోచనతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మారు స్తామని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. -
ఇంట్లో ఎందరున్నా ‘కల్యాణ లక్ష్మి’
• అసెంబ్లీలో మంత్రి జగదీశ్రెడ్డి • లబ్ధిదారులకు వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయం సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని విద్యుత్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ, బీజేపీ పక్షనేత జి.కిషన్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కల్యాణలక్ష్మి పథకం తెచ్చేందుకు కారణమైన ఉదంతాన్ని మంత్రి ఈ సందర్భంగా సభకు వివరించారు. ‘‘చెత్తకుండీ వద్ద పసికందును పందులు పీక్కుతిన్నాయన్న వార్తను పత్రికల్లో చదివి ముఖ్య మంత్రి చలించిపోయారు. దీనిపై అధికా రులతో రోజంతా చర్చించారు. ఆడపిల్లలను గర్భంలోనే ఎందుకు తీసేస్తున్నారన్న దానిపై సమీక్షించారు. ఆడపిల్లల పెళ్లిళ్లు భారం అవుతాయన్న కారణంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గుర్తించారు. ఆడపిల్లల వివాహాలు మనమే చేద్దామని నిర్ణయించి పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి కల్యాణలక్ష్మి పేరు పెట్టింది మంత్రి కేటీఆర్..’’ అని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 81 వేలకుపైగా అర్హులకు లబ్ధి చేకూరిందని, పెండింగ్లో ఏవైనా దరఖాస్తులు ఉంటే నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఆర్యస మాజ్లో వివాహం చేసుకున్న వారికి కళ్యాణలక్ష్మి వర్తింప జేయాలని టీడీసీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరగా.. పెళ్లి ఎక్కడ చేసుకు న్నా ఆధారాలు చూపితే పథకం వర్తిస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... స్పీకర్, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్రెడ్డి నియోజకవర్గాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్షం నేతలు స్పందిస్తూ.. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదని సమాధానం రావడంతో అంతా నవ్వుకున్నారు. -
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానిది రెండో స్థానం
ఇకపై సబ్ స్టేషన్ల వారీగా టెండర్లు: జగదీశ్రెడ్డి - వరంగల్ను ఐటీ, ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాం: కడియం - 2018 ఆగస్టు వరకు కొత్త పంచాయతీలు అసాధ్యం: జూపల్లి - ఇతర కార్పొరేషన్లకు డ్రైవర్ కం ఓనర్ పథకం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఆరు నెలల్లో మొదటి స్థానానికి చేరుకుంటామని విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు వంశీచందర్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధా నమిస్తూ.. ఇప్పటికే రాష్ట్రంలో సోలార్ ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోం దని, మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తికి సబ్ స్టేషన్ల వారీగా టెండర్లు పిలిచామన్నారు. వ్యవ సాయపరంగా రైతాంగానికి సోలార్ విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చెలక, మైలవరం గ్రామాల్లో ప్రయో గాత్మకంగా 90 పంపుసెట్లను వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడించారు. సాగునీటి లిఫ్ట్లకు అవసరమయ్యే 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపా మని, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థల్లో సోలార్ విద్యుద్దీకరణ కోసం చర్యలు చేపట్టామన్నారు. ఐటీ హబ్గా వరంగల్: కడియం రాష్ట్రంలో రెండో పెద్ద పట్టణమైన వరంగల్ను ఎడ్యుకేషనల్, ఐటీ హబ్గా మారుస్తామని డి ప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పే ఏ విద్యా సం స్థలను వరంగల్లోనే ఏర్పాటు చేస్తామ న్నారు. సభ్యులు వినయ్భాస్కర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాకతీ య వర్సిటీ భూములను ఎవరు ఆక్రమించు కున్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 8 నెలల్లో మనోహరాబాద్–కొత్తపల్లి భూసేకరణ: మహేందర్రెడ్డి మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గానికి 8 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామని రవాణా మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ మార్గం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.60 కోట్లు విడుదల చేశాయన్నారు. ఈ అంశంపై సభ్యుడు గంగుల కమలాకర్ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్, కేటీఆర్ నియోజకవర్గాల గుండా పోతున్న ఈ మార్గానికి ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్లకు డ్రైవర్ కం ఓనర్ పథకం: కేటీఆర్ నగరంలో విజయవంతమైన డ్రైవర్ కం ఓనర్ పథకాన్ని త్వరలో ఇతర కార్పొరేషన్లకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలో 408 మందిని ఈ పథకం పరిధిలోకి తేగా అందులో 95 శాతం మంది బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. 2018 ఆగస్టు వరకు కొత్త పంచాయతీలు కుదరవు: జూపల్లి రాష్ట్రంలో 2018 ఆగస్టు వరకు కొత్త పంచా యతీల ఏర్పాటు కుదరదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 631 ఎస్టీ పంచాయతీలుండగా, కొత్తగా 1,757 పంచాయతీల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. ప్రస్తుత పంచాయతీల కాలం ముగిసే నాటికి కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియకు అంతా సిద్ధం చేస్తామన్నారు. నిధులేవీ: ఆర్.కృష్ణయ్య గడిచిన రెండేళ్లలో బీసీ సమాఖ్యలకు రూ.220 కోట్లు కేటాయించినా రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగతా నిధులను ఎప్పుడు ఖర్చు చేస్తారని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. దీనీపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ, వచ్చే జనవరికి పూర్తి నిధులు విడుదల చేస్తామన్నారు. -
సాక్షి సాగుబడి పుస్తకావిష్కరణ
-
త్వరగానే క్రమబద్ధీకరణ!
- విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టీకరణ - సమ్మె పిలుపును ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు... సాక్షి, హైదరాబాద్: ఇంధన శాఖ పరిధిలోని తెలంగాణ ట్రాన్సకో, జెన్కో, డిస్కంలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సాధ్య మైనంత త్వరగా క్రమబద్ధీకరిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ జరుగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన తెలం గాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల సమాఖ్య (టఫ్) ప్రతినిధులతో శనివారం సచివాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమ్మె పిలుపు ఉపసంహరణకు ఉద్యోగ సంఘాలు అంగీ కరించాయని, చర్చలు సఫలమయ్యా యని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను మంజూరు చేసిందని చెప్పారు. జూనియర్ లైన్మెన్ తదితర కేటగిరీలకు సంబంధించి మరో 6 వేల పోస్టులను త్వరలో మంజూరు చేయనుం దన్నారు. అనవసర సమ్మెలకు దిగి ప్రజలు, విద్యుత్ సంస్థలకు నష్టం కలిగిం చొద్దని ఉద్యోగులకు మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపట్ల టఫ్ చైర్మన్, కన్వీనర్లు పద్మా రెడ్డి, శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన నేపథ్యంలో సమ్మె పిలుపును ఉపసం హరించుకుంటున్నామని తెలిపారు. భేటీలో ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపా ల్రావు, ట్రాన్సకో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డెరైక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. 3 సంఘాలే ఉపసంహరించుకున్నారుు: టఫ్ చీలిక వర్గం టఫ్లోని 13 ఉద్యోగ సంఘాల్లో 3 మాత్రమే సమ్మె పిలుపును ఉపసంహరించుకున్నాయని, మరో 8 యూనియన్లు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటాయని టఫ్ కార్యనిర్వాహక కార్యద ర్శి సారుులు, కో చైర్మన్ వజీర్, వైస్ చైర్మన్ కిరణ్లు శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. -
ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష
నల్లగొండ : సీఎం కేసీఆర్ తలపెట్టిన దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం నల్లగొండలోని ఎన్జీ కాలేజీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందన్నారు. ఉద్యమానంతరం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక మంది అపహాస్యం చేశారని ఇప్పుడు వారందరు ముక్కున వేలేసుకునేలా ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రశంసలు అందుకుంటున్నారని మంత్రి తెలిపారు. అభివృద్ధి పథంలో దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. విద్యార్థులు పోటీ పడే విధంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చి దిద్దే క్రమంలో కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలన్న సంకల్పంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకోసం గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలికల కోరిక మేరకు కాలేజీలో మరుగుదొడ్లను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమయ్యే స్థలాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స క్లబ్ చైర్మన్ గోలి అమ రేందర్ రెడ్డి, వేణు సంకోజు, జల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు
మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో భారీ వ్యయంతో విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్ను రూ.3,810 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని... అదే 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల ఏపీలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ను రూ.4,606.87 కోట్లు, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్-2ను రూ.4,967 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారన్నారు. తెలంగాణతో పోల్చితే నార్ల తాతారావు ప్లాంట్పై రూ.796.87 కోట్లు, దామోదరం సంజీవయ్య ప్లాంట్పై రూ.1,157 కోట్లను ఏపీ అధికంగా ఖర్చు చేస్తోందన్నారు. ఈ డబ్బులను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో.. దీని వెను క ఏ మతలబు ఉందో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అరుున బీహెచ్ఈఎల్ నుంచి కూడా వాటాలు పొందవచ్చని 30 ఏళ్ల రాజకీయ అనుభవంగల వారికే బాగా తెలుసని ఏపీ సీఎం చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావుతో కలసి మంగళవారం జగదీశ్రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణంపై టీటీడీపీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రైవేటు ఒప్పందం ఎందుకు? మిగులు విద్యుత్ సాధించామని ప్రకటించుకున్న ఏపీ ప్రభుత్వం మీనాక్షి నుంచి 200 మెగావాట్లు, సింహపురి నుంచి 400 మెగావాట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు 392 మెగావాట్ల మిగులు విద్యుత్ను ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ఏపీ ఆ తర్వాత వెనక్కితగ్గి మరోసారి మోసం చేసిందన్నారు. రిటైర్డ్ అధికారులను సీఎండీలుగా నియమించడాన్ని కూడా తప్పుపడుతున్నారని, ఈ అధికారులే గత రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేయడంతో రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందన్నారు. దేశ వ్యాప్తంగా 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి 1,080 మెగావాట్ల సబ్క్రిటికల్ ప్లాంట్కు సైతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసేవారు జైలుకెందుకు వెళతారు? భద్రాద్రి ప్లాంట్ విషయంలో జరిగిన వ్యవహారాల్లో అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంటదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటు కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టామని వెల్లడించారు. వీటిపై చర్చకు సీఎండీలు, డీఈలు అవసరం లేదని, తమ లైన్మెన్లు సరిపోతారని, వారితో చర్చకు విపక్షాలు ముందుకు రావాలని సవాలు విసిరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై పడే ప్రభావాన్ని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, పూర్తి స్థారుులో అవగాహనకు వచ్చిన తర్వాత స్పందిస్తామన్నారు. -
టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి
- యాదాద్రి నిర్మాణ పనులు, డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష - కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చిన సింగరేణి, జెన్కో - ఆ సంస్థలకు సరిపడా స్థలం కేటాయించాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, రాబోయే కాలంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రధానాలయానికి అభిముఖంగా గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లే అవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. టెంపుల్ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, ఫుట్పాత్లు, ఫుడ్ కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల డిజైన్లను ఖరారు చేశారు. 86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, ఏడెకరాల విస్తీర్ణంలో మంచినీరు. మురుగునీరు నిర్వహణ వ్యవస్థ, పన్నెండున్నర ఎకరాల్లో గ్రీనరీ, 68 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. యాదాద్రి అభివృద్ధి పనులపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్రావు, ఆలయ శిల్పులు ఆనందసాయి, ప్రవీణ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వర్రెడ్డి, రమేశ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్కోలతోపాటు దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయని, వారికి కేటాయించేందుకు వీలుగా 1,000 చదరపు గజాల నుంచి 1,500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రధాన ఆలయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని ఆదేశించారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరఫునే ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచన ఉందని సీఎం వెల్లడించారు. గుట్టపైన నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు. -
విద్యుత్శాఖలో అవినీతిని ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులొచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, సబ్ స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ కనెక్షన్ల మం జూరు తదితర అంశాలపై సోమవారం టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్రావు, జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లైన్మెన్లు, సబ్ ఇంజనీర్లు, డీఈలు, ఏఈలు, ఏడీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులందరూ పనిచేసే చోటే నివాసముంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా సమీక్షిస్తుండాలని ఆదేశించారు. ఎస్ఈలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టాలని సూచించారు. ఖరీఫ్లో రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 33 కేవీ లైన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల పెంపు పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాక 9 గంటల విద్యుత్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి మరింత మంది కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం సిబ్బంది రైతుల వద్దకు వెళ్లాలని మంత్రి సూచించారు. -
‘విద్యుత్’ సమ్మె విరమణ
♦ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలతో మంత్రి జగదీశ్రెడ్డి చర్చలు సఫలం ♦ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలకు ప్రభుత్వం సుముఖం ♦ మూడు నెలల్లో డిమాండ్ల పరిష్కారానికి హామీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమే నేరుగా తమకు జీతాలు చెల్లించాలన్న ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ను మూడు నెలల్లో పరిష్కరిస్తామని విద్యుత్శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్లను వెంటనే క్రమబద్ధీకరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న 34 డిమాండ్లను పరిష్కరించకుంటే బుధవారం నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ ప్రకటించిన నేపథ్యంలో జగదీశ్రెడ్డి మంగళవారం సచివాలయంలో ఫ్రంట్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫ్రంట్ నేతలను సమ్మె విరమణకు ఒప్పించారు. అనంతరం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రేడ్ యూనియన్ల నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడంతో మధ్య దళారి వ్యవస్థ లేకుండా మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చామని జగదీశ్రెడ్డి తెలిపారు. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృత్యువాతపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి చెల్లించే ఎక్స్గ్రేషియాను ప్రస్తుతమున్న రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచేందుకు (గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఎక్స్గ్రేషియాను తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రూ. 5 లక్షలకు పెంచింది. దీన్ని రూ. 25 లక్షలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి) అంగీకరించామన్నారు. అలాగే విధి నిర్వహణలో గాయపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి వైద్య ఖర్చులను విద్యుత్ సంస్థలే భరిస్తాయని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల బీమాను రూ. 10 లక్షలకు పెంచేందుకు చట్టపరమైన అడ్డంకులున్నాయని, వాటిని అధిగమించి ఈ డిమాండ్ను సైతం నెరవేరుస్తామని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు అదనపు పోస్టులను మంజూరు చేసి సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగుల కోసం వైద్యశాఖ త్వరలో ప్రకటించనున్న నూతన పాలసీ అమల్లోకి వచ్చాక విద్యుత్ ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తామన్నారు. రెండు వేర్వేరు మాస్టర్ పే స్కేళ్ల అమలు వల్ల నష్టపోతున్న కొందరు విద్యుత్ ఉద్యోగులకు రాబోయే పీఆర్సీ నుంచి ఒకే మాస్టర్ పే స్కేల్ను అమలు చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని... దీనివల్ల పడే అదనపు భారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ట్రస్ట్ ద్వారా పెన్షన్ను చెల్లించేందుకు అంగీకరించామన్నారు. విద్యుత్ ట్రేడ్ యూనియన్లు తొందరపడి సమ్మె నోటిసు ఇచ్చినప్పటికీ సానుభూతితో స్పందించిన సీఎం కేసీఆర్ ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పుకున్నారని జగదీశ్రెడ్డి తెలిపారు. విద్యుత్శాఖ పనితీరుపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తగ్గించుకోవాలని ఫ్రంట్ నేతలకు ఆయన సూచించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు యూనియన్ల ఫ్రంట్ నేతలు మంత్రి జగదీశ్రెడ్డితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, 3 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ట్రేడ్ యూనియన్ల ఫ్రం ట్ చైర్మన్, కన్వీనర్లు పద్మారెడ్డి, శ్రీధర్ తొలుత ప్రకటించారు. అయితే వెంటనే కలగజేసుకున్న జగదీశ్రెడ్డి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాలని కోరగా ‘ప్రస్తుతానికి సమ్మెను విరమిస్తున్నాం’ అని వారు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాల చెల్లింపుతోపాటు 22 వేల అదనపు పోస్టుల మంజూరు తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించినందుకు మంత్రి జగదీశ్రెడ్డితోపాటు సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు. -
కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతల కన్నెర్ర
న్యూఢిల్లీ/హైదరాబాద్: రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. ప్రపంచమంతా కేసీఆర్ ను కీర్తిస్తుంటే ఆయన మాత్రం తప్పుబడుతున్నారని ఢిల్లీలో అన్నారు. కోదండరామ్ కుబుసం విడిచిన పాము అని వర్ణించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉనికిలోనే లేదని, కోదండరామ్ దేనిక చైర్మనో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరికి వారు విడిపోయారని గుర్తు చేశారు. చేతకాకుంటే తప్పుకోవాలన్న వ్యాఖ్యాలను కోదండరామ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారని చెప్పారు. తమతో కలిసి రావాలని కోరినా కోదండరామ్ రాలేదన్నారు. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కోదండరాం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
డిస్కంల మనుగడ కోసమే చార్జీల పెంపు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి - కరెంట్ ఇవ్వకుండానే గత పాలకులు చార్జీలు పెంచారు - నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నాం.. ప్రజలు అర్థం చేసుకుంటారు - బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపై భారం వేయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయంతో పోల్చితే చార్జీలతో వచ్చే ఆదాయం తక్కువగా ఉందని, మూడేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో విద్యుత్ పంపి ణీ సంస్థ(డిస్కం)లు నష్టాలు ఎదుర్కొంటున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఏటా ఏకంగా రూ.6 వేల కోట్ల లోటు ఎదుర్కొంటున్న అంశాన్ని డిస్కంలు లెక్కలతో సహా నిరూపించాయని.. ఈ పరిస్థితిని అధిగమించి మనుగడ సాగించాలంటే చార్జీలు పెంచకతప్పదని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే మన రాష్ట్రంలో చార్జీల పెంపు ప్రక్రియను చేపట్టాయన్నారు. గత పాలకు లు సరిగా విద్యుత్ సరఫరా చేయకున్నా చార్జీలు పెంచేవారని, తాము నిరంతరంగా కరెంటు ఇస్తున్నందున చార్జీలు పెంచినా ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానిం చారు. అయితే చార్జీల పెంపు నుంచి బడుగు, బలహీనవర్గాలు, పేదలకు వెసులుబాటు ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాల నలో విద్యుత్ రంగం పురోగతిపై జగదీశ్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘చీకటి’ కుట్రలను ఛేదించి... ‘‘తెలంగాణ ఉద్యమం ఆద్యంతం విద్యుత్ చుట్టూ తిరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యుత్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగాయి. కానీ ఆ కుట్రలన్నింటినీ ఛేదించి నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయకపోయినా.. దీన్ని ఎలా సాధించగలిగారని చాలా మంది అడుగుతుంటారు. క్షేత్రస్థాయిలోని హెల్పర్లు, లైన్మెన్ల నుంచి సీఎండీల వరకు అందరూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు నిబద్ధతతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించాం. జెన్కో ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని (పీఎల్ఎఫ్) పెంచాం. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గత ప్రభుత్వాలూ నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగేవని నిరూపించాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గడంతో... ఆ విద్యుత్ను గృహాలు, పరిశ్రమలకు మళ్లించి నిరంతర విద్యుత్ ఇస్తున్నామంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవం. 2014-15తో పోల్చితే 2015-16లో 13శాతం విద్యుత్ వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనం. గత ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను ప్రారంభించడంతో అదనంగా 500 మెగావాట్ల వినియోగం పెరిగింది. అనుకున్న సమయానికే ప్రాజెక్టులు... రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2018-19 నాటికి 25,000 మెగావాట్లకు పెంచేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేనివారు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేశారు. 2017 మార్చిలోపు భద్రాద్రిని పూర్తి చేయాలని కేంద్రం నిబంధనలు పెట్టినా.. కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఇలాంటి అడ్డంకులను అధిగమించి అనుకున్న సమయానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. రూ.2,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని 9,000 మెగావాట్ల నుంచి 12,000 మెగావాట్లకు పెంచాం. ఇదే తరహాలో ప్రాజెక్టు నిర్మాణంలో సైతం పురోగమిస్తాం. తొందర్లోనే ఉత్తమ శాఖగా.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఓ వైపు ప్రభుత్వం తాపత్రయ పడుతుంటే... మరోవైపు క్షేత్ర స్థాయిలో కొందరు సిబ్బంది అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవమే. దీన్ని సీరియస్గా తీసుకున్నాం. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దీంతో కొంత వరకు మార్పు వచ్చింది. ఒక్కరోజులోనే పూర్తి నియంత్రణ సాధ్యం కాదు. ప్రజలెవరూ అధికారుల చుట్టూ తిరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలు పొందగలిగితే అవినీతిని నిర్మూలించవచ్చు. ఆ దిశగా చర్యలు ప్రారంభించాం. తొందర్లోనే ప్రజలు ఉత్తమ శాఖగా విద్యుత్ శాఖను గుర్తిస్తారు. రైతులు సహకరించాలి వచ్చే ఖరీఫ్లో రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం. అయితే వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. ఆటోమేటిక్ స్టార్టర్ల వినియోగాన్ని మానుకోవాలి. కరెంటు వచ్చినప్పుడే పొలానికి వెళ్లి మోటార్ను వేసి అవసరం తీరిన వెంటనే నిలిపేయాలి. అలా చేస్తే విద్యుత్తో పాటు భూగర్భ జలాలు కూడా ఆదా అవుతాయి. మోటార్లూ కాలిపోకుండా ఉంటాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు భారీ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 12,000 మెగావాట్ల విద్యుత్కి సంబంధించిన చార్జీలను ఎవరి నుంచి వసూలు చేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేరుగా రైతులపై వేస్తారా, క్రాస్ సబ్సిడీ రూపంలో విద్యుత్ వినియోగదారులపై వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా అన్న అంశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఏడాదిలో కేవలం 3 నెలల పాటే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం. స్వల్పకాలిక లేక దీర్ఘకాలిక ఒప్పందాలకు వెళితే తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందా? లేక మూడు నెలల పాటు ఓపెన్ యాక్సెస్లో కొనుగోలు చేస్తే సరిపోతుందా? అన్న అంశాలపై అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకుంటాం.’’ -
మంత్రి చొరవతో శ్రీచైతన్య ఫలితాలు విడుదల
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి చదివిన 54 మంది విద్యార్థుల ఫలితాలు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలసి ఈ విషయాన్ని వివరించారు. వెంటనే ఆయన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ సురేందర్రెడ్డితో మాట్లాడారు. నిబంధనలు పాటించకుంటే పాఠశాలపై చర్యలు తీసుకోవాలి కానీ.. ఫలితాలు నిలిపివేయడం సరికాదన్నారు. దీంతో విద్యార్థుల ఫలితాలను విడుదల చేశారు. దీంతో మంత్రికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అంతకుముందు సూర్యాపేటలోని శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థులు దాడి చేశారు. వారం గడచినా ఇంతవరకు ఇక్కడ అభ్యసించిన 54 మంది విద్యార్థుల పదో తరగతి ఫలితాలు వెలువడలేదని ఫ్లెక్సీలను దహనం చేసి, ఫర్నిఛర్ను ధ్వంసం చేశారు. వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం తమ జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థులు మండిపడ్డారు. -
మంత్రి కార్యక్రమంలో జేబు దొంగల హల్చల్
హాలియా (నల్లగొండ జిల్లా) : హాలియా మండలం తిరుమలగిరి గ్రామంలో సోమవారం మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో జేబు దొంగలు చెలరేగిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూమి పూజలో మంత్రితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే దొంగలు చేతివాటం చూపించారు. పలువురి నుంచి మొత్తం రూ.18,700 కాజేశారు. దుర్గారావు జేబు నుంచి రూ.7,500, రమేశ్ దగ్గర రూ.8వేలు, వీఆర్ఏ నర్సింహ దగ్గర రూ.3వేలు, నాగయ్య అనే వ్యక్తి జేబు నుంచి రూ.200 కొట్టేశారు. -
పత్తి వద్దు.. పప్పులే ముద్దు:మంత్రి జగదీశ్
సూర్యాపేట: అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నందువల్ల పత్తి ఉత్పత్తి లాభదాయం కాదని, పత్తి స్థానంలో పప్పు ధాన్యాలను పండించడం మేలని మంత్రి జగదీశ్ రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పిల్లాయిపాలెంలో జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సును మంత్రి.. ఆమేరకు రైతులను ప్రోత్సహిస్తామన్నారు. పత్తిని అధికంగా దిగుమతి చేసుకునే చైనా తాజాగా దిగుమతులపై నిషేధం విధించిచడంతో పత్తి ధరలు విపరీతంగా పడిపోయాయని మంత్రి చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలో లక్ష హెక్టార్లలో పత్తి పంటకు బదులు పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ మెమోరియల్ను ముట్టుకోం
♦ ఆ పక్కనున్న చోట 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ♦ ఏడాదిపాటు అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల నిర్వహణ ♦ డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి ♦ కడియం చైర్మన్గా విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: సచివాలయం పక్కనే 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారక కేంద్రాన్ని ముట్టుకోకుండా ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న పార్టీ జోన్లో 125 అడుగుల అంబేడ్కర్ క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి, ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్దత్ ఎక్కా, డెరైక్టర్ ఎం.వి.రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనంటే గౌరవముందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్స్, పక్కనున్న ప్రాంతం మొత్తం కలుపుకుని 39 ఎకరాలుంటే ఎన్టీఆర్ స్మారకం 4 ఎకరాలను మినహాయించి మిగతా 35 ఎకరాల పరిధిలో అంబేడ్కర్ స్క్వేర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తై అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించే ఉత్సవాలను, హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు. 14న సీఎం శంకుస్థాపన ఈ నెల 14న ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంత్యుత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కడియం తెలిపారు. లోయర్ ట్యాంక్బండ్లో శిథిలావ స్థలో ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్స్కు సీఎం అదే రోజు భూమిపూజ చేస్తారని, బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రానికి, ఎన్టీఆర్ గార్డెన్స్ను ఆనుకొని ఉన్న పార్టీ జోన్లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉన్న కార్ల పార్కింగ్ ప్రదేశంలో అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14కల్లా అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటును పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాం గం లేకపోతే ఆర్టికల్(3)లో ఆయా అంశాలను పొందుపరచకపోయి ఉంటే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఉండేది కాదన్నారు. దూరదృష్టితో అంబేడ్కర్ పొందుపరచిన ఆర్టికల్ (3) ప్రకారమే కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఉద్యమించి విజయం సాధించిందన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ను వర్గానికో, కులానికో, ఏ కొందరికో పరిమితం చేయరాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజ లను ప్రభావితం చేసిన మహనీయుడిగా ఆయన్ను స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకయ్యే వ్యయంపై అంచనా వేయలేదని, ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైర్మన్గా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనికి మంత్రి జగదీశ్రెడ్డి వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, ఎంపీలు బాల్క సుమన్, పసునూరు దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపకుడు మల్లేపల్లి లక్ష్మ య్య, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ప్రసాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, హెచ్ఎండీఏ కమిషనర్, ఎస్సీ డీడీ డెరైక్టర్ ఉండనున్నారు. ఎస్సీశాఖ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారని ఎస్సీశాఖ కార్యదర్శి బి.ఎం.డి. ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మాజీ మంత్రి ‘కోమటిరెడ్డి’కి ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, : నల్లగొండ : అధికార టీఆర్ఎస్ ఆకర్ష్ పథకం మరోసారి తెరపైకివచ్చింది. చాలా రోజులుగా అదిగో.. ఇదిగో అని ఊరిస్తున్న నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శనివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్పర్సన్గా ఎన్నికైన ఆమె నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అనుచరుడు, తన భర్త శ్రీనివాస్తో కలిసి హైదరాబాద్లో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ను కూడా కలిశారు. కాంగ్రెస్లో ముఖ్య నేత అయిన కోమటిరెడ్డిఅనుచరుడు టీఆర్ఎస్లో చేరడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీ కోమటిరెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు ఈ పరిణామం జరగడం మరింత ఆసక్తిని కలిగిస్తూ.. పలు రకాల చర్చలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా... మరో ముగ్గురు మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్లు (కాంగ్రెస్) కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం.. మరికొందరు నల్లగొండ కౌన్సిలర్లు కూడా అదే బాటలో పయనిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఎప్పటినుంచో... నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో భారీ చేరికలు జరిగిన సందర్భంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒక దశలో నేడో, రేపో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ చేరికకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అనూహ్యంగా, ఎవరూ ఊహించని సమయంలో ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఈమె చేరికపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డిని నియోజకవర్గంలో ఒంటరిని చేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. కానీ.. నల్లగొండకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రం మాజీ మంత్రి కోమటిరెడ్డికి బాసటగా నిలుస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము ఎమ్మెల్యే కోమటిరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని కరాఖండిగా చెప్పేశారు. తాను టీఆర్ఎస్లో చేరుతున్న అంశాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్లో ఉన్న కౌన్సిలర్లు వ్యతిరేకించారని.. ఆ పరిస్థితుల్లోనే కౌన్సిలర్లు ఎవరూ లేకుండానే చైర్పర్సన్ ఒక్కరే వెళ్లి టీఆర్ఎస్లో చేరినట్లు చర్చ జరుగుతోంది. ‘మిర్యాల’ మినహా.. తాజా పరిణామాలతో జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపాలిటీ మినహా అన్ని చోట్లా చైర్పర్సన్లు, చైర్మన్లు టీఆర్ఎస్లో చేరినట్లే. తొలుత సూర్యాపేట, ఆ తర్వాత దేవరకొండ, భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, ఇప్పుడు నల్లగొండ చైర్పర్సన్లు టీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేటలో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచిన ప్రవళ్లిక టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ అయ్యారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి మాత్రమే కాంగ్రెస్లో మిగిలినట్టయింది. ఈమె కూడా టీఆర్ఎస్లో చేరతారని, భర్త భార్గవతో కలిసి ఆమె అధికార పార్టీ కండువా కప్పుకోనున్నారనే ప్రచా రం జరిగింది. కానీ.. భార్గవ ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖం డిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే చైర్మన్ను వ్యతిరేకిస్తూ ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరేం దుకు సిద్ధమవుతుండడంతో మిర్యాలగూడ రాజకీ యం ఏ మలుపు తిరుగుతుందోననేది ఆసక్తికరంగా మారింది. కీలక పరిణామాలు నల్లగొండ కేంద్రంగా జిల్లాలో త్వరలోనే కీలక రాజకీయ పరిణామాలు జరుగుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కోమటిరెడ్డికి అండగా ఉన్న మరికొందరు కౌన్సిలర్లకు కూడా గాలం వేశామని, వారు కూడా త్వరలోనే (ఈనెల 17లోపు) టీఆర్ఎస్లోకి వస్తారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఆ కౌన్సిలర్లు తమతో టచ్లోకి వచ్చారని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి చేత నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తాను మరోమారు చాటేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నల్లగొండ కేంద్రంగా రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే. -
'కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది'
నల్లగొండ: అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఐక్యత లేదన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగనీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వలేక పోతోందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. -
వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి
సాక్షి, హైదరాబాద్: వచ్చే శాసన సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లోని ఏడెనిమిది స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలనూ ఒకే పార్టీ గెలుచుకుంటుందని, అది తామేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన ముచ్చటించారు. 2018 లోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘2018 నుంచి చెట్టూ.. పుట్టా.. ఊరూ.. వాడా తిరుగుతానని అన్న ప్రకటిస్తడు.. తమ్ముడేమో 2018 లోనే ఎన్నికలు అంటడు.. వారిది పిచ్చివాళ్ల స్వర్గం’ అని మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. -
సంక్షేమ నిధులన్నీ ఖర్చు చేస్తాం
శాసనమండలిలో సంక్షేమ పద్దులపై లఘు చర్చలో మంత్రులు పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేయాలని సభ్యుల సూచన సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్ను ఖర్చు చే సేందుకు చర్యలు చేపడతామని వివిధ సంక్షేమ శాఖల మంత్రులు తెలిపారు. శాసనమండలిలో సంక్షేమ పద్దులపై ఆదివారం జరిగిన లఘు చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్ భూములతో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పి.సుధాకరరెడ్డి (కాంగ్రెస్), కల్యాణ లక్ష్మి, షాదీముబారక్లకు ఇస్తున్న రూ.51 వేలని రూ.75 వేలకు పెంచాలని ఫారుఖ్ హుస్సేన్ (కాంగ్రెస్) కోరారు. కళ్యాణలక్ష్మికి ఇస్తున్న మొత్తాన్ని రూ.1.16 లక్షలకు పెంచాలని, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని రాములు నాయక్ (టీఆర్ఎస్) కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతమున్న చట్టాలతోనే వాటిని రక్షించవచ్చునని అల్తాఫ్ రిజ్వీ (ఎంఐఎం) సూచించారు. ఏ కులమైనా, మతమైనా అభివృద్ధికి కొలమానం మంచి విద్య, శిక్షణ, ఆరోగ్యమని, ఈ దిశలో ఆయా వర్గాలను తీసుకెళ్లాలని రామచంద్రరావు (బీజేపీ) అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వ్యయం చేయని శాఖలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ (కాంగ్రెస్) కోరారు. రెండింతలు ఖర్చు చేశాం: ఎస్సీ అభివృద్ధి శాఖ జగదీశ్రెడ్డి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎస్సీ సబ్ప్లాన్ నిధులను రెండింతలు ఖర్చు చేశామని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ‘సబ్ప్లాన్ కింద రూ.8,089 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.4,236 కోట్లు వ్యయం చేశాం. ఈ ఏడాది స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల ద్వారా 28 వేలమందికి రూ.283 కోట్ల రుణాలు అందించాం. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.1,550 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. 2014-15లో రూ.2వేల కోట్లు ఇచ్చాం’ అని ఆయన వివరించారు. కల్యాణలక్ష్మి కోసం రూ.300 కోట్లు ఏప్రిల్ నుంచి బీసీలు, ఈబీసీల కళ్యాణలక్ష్మిని ప్రారంభిస్తున్నామని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. 26 సంచార జాతుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని. ప్రస్తుత బడ్జెట్ రూ.2,170 కోట్లలో ఇప్పటివరకు రూ.1,250 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్య, వైద్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, 2015-16లో గిరిజన ఉపప్రణాళిక కింద రూ.2,664.33 కోట్లు విడుదల చేసి, వాటిని పూర్తిగా ఖర్చు చేశామని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. -
అనుమానాలు అక్కర్లేదు
విద్యుత్ ఒప్పందాలపై జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పవర్ ఫీవర్ పట్టుకున్న కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శల గురించి ప్రజలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన సభలో బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపే సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ ప్రభుత ్వంతో ఒప్పందం, భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలకోసం విద్యుత్ను కొనుగోలు చేసి అందిస్తున్నామని, ఎక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన విద్యుత్లో యూనిట్కు అధిక ధర చెల్లించింది ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకేనని చెప్పారు. ఇతర సంస్థలనుంచి గరిష్టంగా యూనిట్కు రూ.5.99 చొప్పున కొనుగోలు చేయగా, ఎన్టీపీసీ నుంచి మాత్రం రూ. 6.80కి తీసుకున్నట్లు తెలిపారు. ఎన్సీసీ థర్మల్ పవర్నుంచి 8 సంవత ్సరాల కోసం యూనిట్ ధర రూ. 4.15 చొప్పున కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొన్నట్లు జగదీశ్రెడ్డి చెప్పారు. అదే పక్కన ఏపీ ప్రభుత్వం రూ. 4.20 యూనిట్ చొప్పున 20 ఏళ్లకు ఒప్పందం చేసుకుందన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కొందరు తప్పు డు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేశంలో అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు లైన్లు లేని పరిస్థితి ఉందని, ఉత్తర, దక్షిణ గ్రిడ్ అనుసంధానం కోసం లైన్ అవసరం ఉందని, అందుకోసం దీర్ఘకాలిక ఒప్పందం కోసం వెళ్లినట్లు చెప్పారు. బీహెచ్ఈఎల్ సంస్థ 270 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే నష్టం లేదని అందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘కుడా’ ద్వారా పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మూసీ అభివృద్ధి, సుందరీకరణ కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ లక్షాయాభైవేల కోట్ల రూపాయలతో పూర్తవుతాయని తెలిపారు. వచ్చే బడ్జెట్లో రూ. 35 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. గడువులోగా వీటిని పూర్తి చేస్తామన్నారు. జానారెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రేవంత్రెడ్డిలు మంత్రుల వివరణకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ప్రజలకు నిజాలు తెలిసేం దుకే తాను ప్రశ్నిస్తున్నానే తప్ప రాజకీయ కోణంలో కాదని జానారెడ్డి సభకు తెలిపారు. -
ఆత్మవిశ్వాసం పెంచుతాం
♦ అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: అణగారిన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించడంతోపాటు... సమాజంలో వెనుకబడి ఉన్నామనే భావనను వారిలోంచి దూరం చేసేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జి.జగదీశ్రెడ్డి చెప్పారు. దళితులకు భూపంపిణీలో ఈ ఏడాది వేగం పెంచుతామని తెలిపారు. అణగారిన వర్గాల్లో ఏర్పడిన ఆత్మన్యూనతాభావాన్ని దూరం చేసి అన్ని రంగాల్లో ఇతరులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో తీసుకోబోయే చర్యలు, పలు ఇతర అంశాలపై మంత్రి జగదీశ్రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ రంగంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. స్పష్టమైన కార్యాచరణతో ముందుకు.. విద్యార్థులు పీజీ పూర్తిచేసేలోగా నచ్చిన వృత్తి, ఉద్యోగం లేదా ఇతర రంగంలో స్థిరపడేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగమే కావాలనే ఆలోచన నుంచి బయటపడేలా చేస్తామన్నారు. చదువు పూర్తయ్యేలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కాలేజీ నుంచి బయటపడే నాటికి పూర్తిస్థాయి నైపుణ్యాన్ని సంతరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ దృష్టి అంతా ప్రధానంగా దానిపైనే ఉందని తెలిపారు. విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారుంటే ఎక్కువ ఖర్చయినా భరించేందుకు వెనుకాడవద్దని... అర్హత లేని వారికి ఇచ్చి దుర్వినియోగం చేయవద్దని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని చెప్పారు. ‘‘పరిశ్రమల శాఖ ద్వారా రూ.కోటి వరకు కూడా రుణాలిచ్చి దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన. ఆ పారిశ్రామికవేత్తలు సమాజానికి రోల్మోడల్ గా నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తాము ఎవరికన్నా తక్కువ కాదనే భావనను కలిగించి, వారిలోని భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపే కృషి జరుగుతోంది. సమాజంలో అసలైన మార్పునకు అదే పునాది’’ అని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. భూపంపిణీకి ఆటంకాలు తొలిగాయి దళితులకు భూపంపిణీకి ఉన్న ఆటంకాలు తొలిగిపోయాయని, ఈ ఏడాది గణనీయమైన సంఖ్యలో భూములు ఇస్తామని జగదీశ్రెడ్డి చెప్పారు. ఎస్సీలకు భూమి కొనుగోలు, అభివృద్ధి విషయంలో ఈ ఏడాది కచ్చితంగా వేగం పెంచుతామన్నారు. పథకం దుర్వినియోగం కాకూడదని ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనల వల్ల ఇప్పటివరకు కిందిస్థాయి అధికారుల్లో అయోమయం నెలకొందని, ఇప్పుడు దానిని అధిగమించామని పేర్కొన్నారు. వినియోగంలో ఉన్న భూమి, నీటి వసతి ఉన్న భూమి అని చూడకుండా... సాగు కు అనువుగా ఉన్న భూమి ఉంటే చాలు పంపిణీ కోసం తీసుకోవాలని అధికారులను ఆదే శించామని తెలిపారు. నీటి వసతి, భూమి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. ఇక తాజా బడ్జెట్(2016-17)లో నిర్దేశించిన లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసే అవకాశం ఉందని జగదీశ్రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి నిజంగా ఎంత ఆదాయం వస్తుందనేది ఈ ఏడాదే అర్థమైందని... ప్రభుత్వ ఆదాయం, సవాళ్లు ఏయే రంగాల్లో ఉన్నాయో 90శాతం పైగా అవగాహన ఏర్పడిందని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని వాస్తవ దృక్పథంతో పెట్టిన బడ్జెట్ ఇదని, సీఎం ఆలోచనలు ఏమిటనేది అన్నిస్థాయిల్లో అధికారులకు అర్థమైంది కాబట్టి ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోగలుగుతామని చెప్పారు. -
క్లాస్ టీచరు లేడు.. హెడ్మాస్టరు రాలే..
సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు ప్రతిపక్షాలది పైచేయి అయినట్లుంది. క్లాస్ టీచరు లేడు.. హెడ్ మాస్టరు రాలేదు. అందుకే అధికారపక్షంతో ప్రతిపక్షపార్టీ ఆడుకున్నది. సభలోని టీచర్లంటే ప్రతిపక్ష సభ్యులకు భయం లేనట్లుంది’ అని మంత్రి జగదీశ్రెడ్డితో విలేకరులు సరదాగా వ్యాఖ్యానించారు. ఆదివారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం బయటకు వచ్చిన జగదీశ్ విలేకరులతో కాసేపు సరదాగా ముచ్చటిం చారు. క్లాస్ టీచరంటే ఎవరు.. హెడ్ మాస్టరంటే ఎవరు అని ఆసక్తిగా ఆయన అడిగారు. మంత్రి హరీశ్రావు క్లాస్ టీచరైతే, సీఎం కేసీఆర్ హెడ్మాస్టర్ అని విలేకరులు సమాధానం ఇచ్చారు. కరువు, సాంఘిక సంక్షేమం పద్దులపై చర్చల సందర్భంగా ప్రతిపక్షం దూకుడుగా ఉన్నట్లు కనిపించిందని ఓ సీనియర్ విలేకరి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల దగ్గర విషయం లేకనే లొల్లి చేస్తున్నాయని కొట్టిపారేశారు. వారికి కావాల్సింది సభ వాయిదానే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం విపక్ష సభ్యులకు కష్టంగా ఉన్నట్లుందని జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సభ ఎందుకు నడుపుతున్నారని విపక్షాలు అడుగుతున్న ట్లు పేర్కొన్నారు. సభ వాయిదా పడాలనే వారి కోరికను మన్నించామని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ కాంగ్రెస్ తీరును ఎలా ఎండగట్టారో అంతా చూశారని, మొన్నటి గాయాలకు ఇవాళ మందు పూసుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. సభలో సీఎం ఉంటే ఇవన్నీ జరిగేవి కావన్నారు. ‘వాస్తవానికి సీఎల్పీ నేత జానారెడ్డి సరైన లైన్లనే ఉన్నరు. కానీ కాంగ్రెస్ నేతలే ఆయనను ముందల పడనిస్తలేరు’ అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీదే గెలుపని పేర్కొన్నారు. -
తెలంగాణలో ఏ పార్టీ మిగలదు
టీఆర్ఎస్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు ఖాళీ లేదు: మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక ఏ రాజకీయ పార్టీ మిగలదని, వచ్చేసారి కూడా అధికారం టీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో అన్ని పార్టీల పని అయిపోయింది. వచ్చేసారి కూడా ప్రభుత్వం మాదే. 16 ఎంపీ స్థానాలూ గెలుచుకుంటాం. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పోదు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నిలదొక్కుకుంటుందేమో కానీ, టీడీపీకి మాత్రం ఆ అవకాశమే లేదు. మా పార్టీలో చేరడానికి రెండేళ్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎదురు చూస్తున్నారు.. ఏడాది కిందటే దరఖాస్తు చేసుకున్నారు. అయితే పార్టీలో వారికి బెర్తు లేదు. సభ్యత్వ పుస్తకాలు కూడా ఎప్పుడో అయిపోయాయి. వారి అవసరం మాకేం ఉంది?... పీసీసీ చీఫ్ పదవి కోసం వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ కల్లా రాజగోపాల్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అవుతాడేమో.. ’ అని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా సరఫరా చే స్తున్నామని, హైదరాబాద్ వంటి నగరాల్లో అప్పుడప్పుడు అంతరాయం జరుగుతున్నా అది కేవలం లైన్ల మార్పిడి పనుల కోసమేనని వివరించారు. -
వెయ్యి పంచాయతీలకు కొత్త భవనాలు
130 కోట్ల నిధుల కేటాయింపు ♦ మలి విడతలో మరో 1,271 పంచాయతీలకు.. ♦ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 8770 గ్రామ పంచాయతీలకుగాను 1,650 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని పురపాలక, పంచాయతీరాజ్శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తొలి విడతగా రూ. 130 కోట్లతో వెయ్యి పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, మిగిలిన 650 పంచాయతీలతోపాటు మరో 621 ‘ఒకే గది’ పంచాయతీలకు (మొత్తం 1,271) మలి దశలో భవనాలను నిర్మిస్తామన్నారు. సర్పంచ్, సిబ్బంది, ఈ-పంచాయతీకి ప్రత్యేక గదులు, సమావేశ మందిరంతో కూడిన భవనాలకు ప్రత్యేక డిజైన్ రూపొందించామని చెప్పారు. గతంలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయింపులు జరగ్గా తాము రూ. 13 లక్షలకు పెంచామన్నారు. ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, బోడిగ శోభ, చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఐదు వేలు జనాభాగల మేజర్ గ్రామ పంచాయతీల భవనాలకు మరిన్ని నిధులిస్తామని...మండల కేంద్రాల్లో సచివాలయాల నిర్మాణం కోసం స్థానిక పంచాయతీలు రూ. 25 లక్షల చొప్పున నిధులు సమకూర్చితే ప్రభుత్వ వాటాను రూ. 25 లక్షలకు పెంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 220 కోట్లు ఎంఎంటీఎస్ రెండో దశను భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్-రాయిగిర్ (యాదాద్రి) వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసిం దని ఈ అంశంపై సభ్యులు వేముల వీరేశం, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, కె.ప్రభాకర్రెడ్డిల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రూ. 330 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ. 110 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్ల వాటాను భరిస్తుందన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 3,773 కోట్ల ఖర్చు: మంత్రి జగదీశ్రెడ్డి ఎస్సీ ఉప ప్రణాళిక కింద 2015-16లో కేటాయించిన రూ. 8,089.24 కోట్లలో రూ. 3,773.33 కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వ సాయం వల్ల 48,98,069 మంది ఎస్సీలు లబ్ధిపొందారని రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి, విద్యుత్శాఖల మంత్రి జి. జగదీశ్రెడ్డి తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించిన రూ. 5,035.687 కోట్లలో రూ. 2,671.67 కోట్లు ఖర్చుపెట్టామని, దీనివల్ల 15,38,726 మంది ఎస్టీలు లబ్ధి పొందారని ఈ అంశంపై సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య, ఎ.రేవంత్రెడ్డి, సున్నం రాజయ్య, మల్లు భట్టి విక్రమార్క, జెట్టి గీత, ఎస్.ఎ సంపత్ కుమార్, చల్లా వంశీచంద్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, రవీంద్ర కుమార్ రమావత్ల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. విద్యుత్ పొదుపు చర్యల కోసం ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రోగ్రాం (డీఈఎల్పీ)ను అమలు చేస్తున్నామని సభ్యులు సతీశ్ కుమార్, బానోత్ మదన్లాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎస్.సత్యనారాయణ, వేముల వీరేశం, చల్లా ధర్మారెడ్డి, డి.కె అరుణల ప్రశ్నలకు జగదీశ్రె డ్డి సమాధానమిచ్చారు. ఉర్దూ బడులకు మౌలిక సదుపాయాలు: కడియం రాష్ట్రంలోని 1,571 ఉర్దూ మాధ్యమ పాఠశాలలకుగాను 219 పాఠశాలలు మౌలిక సదుపాయాలతో ఉన్న ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1:25 దామాషాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఉందన్నారు. స్థల లభ్యత ప్రాతిపదికన పాఠశాలల భవనాలను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని ఈ అంశంపై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్ఖాన్, మొజంఖాన్, జాఫర్ , అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉద్యానవన కార్పొరేషన్: పోచారం ఉద్యానవనాలు, పూల పెంపకం, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సభ్యులు మనోహర్రెడ్డి, చింతా ప్రభాకర్, వేముల వీరేశంల ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు, 46.75 లక్షల మేకల యూనిట్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే ఎ.అంజయ్య అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు. -
కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్రెడ్డి
♦ నల్లగొండలో పరిస్థితిపై మండలిలో వాగ్వాదం ♦ జిల్లాల్లో రాజకీయం రౌడీల చేతికి వెళ్లిందన్న రాజగోపాల్రెడ్డి ♦ టికెట్లు కొనుక్కొని రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి జగదీశ్ సాక్షి, హైదరాబాద్: ‘‘శాంతిభద్రతలు అంటే ఒక్క హైదరాబాద్లోనే కాదు. జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రౌడీయిజం సాగించారు. సీఎం సహా నేతలంతా గెలుపు కో సం ఎంతకైనా తెగించమని ఆదేశించారు. నల్లగొం డ రాజకీయం రౌడీల చేతుల్లోకి వెళ్లింది..’’ అంటూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శనివారం మండలిలో చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మా ట్లాడవద్దంటూ హితవు పలికారు. టీఆర్ఎస్కు ప్రజ లు అనుకూల తీర్పునిచ్చారని, ప్రజా తీర్పును జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. సభలో ఉన్న నల్లగొండ జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘పైసలు పెట్టి టికె ట్లు కొనుక్కొని కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. పైసలతో ఏమైనా చేయొచ్చని భావించారు. రాజకీ య వ్యభిచారం చేస్తున్నారు. జిల్లాలో అరాచకం చే సిన విస్నూర్ రాంచంద్రారెడ్డి వారసులుగా కొం ద రు తయారయ్యారు. అదే సమయంలో రావి నారాయణరెడ్డి వంటి వారి వారసులు కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు నమోదు కాలే దు. కొందరి వల్ల జిల్లా కలుషితం అయింది’’ అని అన్నారు. దీనిపై రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మా సోదరులం (కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజ గోపాల్రెడ్డి) వ్యాపారం చేసుకొని రాజకీయం చేస్తున్నాం. దొంగనోట్లు, ఇసుక దందాలు, అక్రమాలకు పాల్ప డే వారు కొందరు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. తాను ఎంపీగా ఉండి ఢిల్లీలో తెలంగాణ కో సం పోరాడితే మా అన్న మంత్రి పదవికి రాజీనా మా చేశాడు. తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్లం కాదు. మా నల్లగొండ జిల్లాలో రౌడీలే రాజ్యమేలుతున్నారు..’’ అని ఆవేశంగా అన్నారు. దీంతో కడియం జోక్యం చేసుకుంటూ.. ప్రజాతీ ర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీని పట్టుకొని రౌ డీలు రాజ్యమేలుతున్నారు అనడం మంచిది కాదు. మనల్ని మనమే కించపరుచుకోవద్దు’’ అన్నారు. రౌడీలు అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశించాల్సిందిగా చైర్మన్ స్వామిగౌడ్కు విజ్ఞప్తి చేశారు. దీంతో చైర్మన్ స్పందిస్తూ... నల్లగొండను ఆంగ్లేయులు పాలించడం లేదని, ఈ ప్రభుత్వమే న డుపుతోందన్నారు. రౌడీలు అన్న పదాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. దీంతో ఆ పదాన్ని ఉప సంహరించుకున్నట్లు రాజగోపాల్రెడ్డి చెప్పారు. -
తెలంగాణ మున్సిపాలిటీలకు ఎల్ఈడీ కాంతులు
హైదరాబాద్ : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ కాంతులు విరజిమ్మనున్నాయి. తెలంగాణలోని 25 మున్సిపాలిటీల్లో రాబోయే 100రోజుల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐటీ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇందనశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ మరియు డిస్కమ్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కె.తారకరామరావు ఈ సంస్ధ ఎండీని సాధ్యమైనంత తక్కువకి ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 25 మున్సిపాలిటీల్లోని 6లక్షల గృహాలకు 12 లక్షల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. త్వరలోనే మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ బల్బులను అందిస్తామన్నారు. గ్రామపంచాయితీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పంచాయితీరాజ్ శాఖ అధికారులను అదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో ఎల్ఈడీ బల్బుల ఉపయోగాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిపారు. మూడో దశలో ప్రజలకు సబ్సిడీ ద్వారా ఎల్ఈడీ బల్బుల సరఫరా అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. సమావేశానంతరం మాట్లాడిన ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన వినియోగాన్ని పొదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తమ విద్యుత్ శాఖా సిబ్బంది బల్బులను బిగించే భాద్యత తీసుకుంటారన్నారు. త్వరలోనే నల్లగొండ, మెదక్ , నిజామాబాద్ జిల్లాల్లో మెత్తం ఎల్ఈడీ బల్బుల బిగింపును చేపట్టనున్నట్లు తెలిపారు. మెత్తం రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల గృహాల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపే లక్ష్యమన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి ఇంధన ఖర్చు తగ్గుతుందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు బల్బులను ప్రజలకు పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి చేసే ఖర్చు విద్యుత్ సరఫరా సంస్ధలకు కరెంట్ ఆదా రూపంలో తిరిగి వస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మున్సిపల్ శాఖాధికారులు, డిస్కమ్ , విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడండి
మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న స్కాలర్షిప్లు, హాస్టళ్ల స్థితిగతులు తదితరాల వివరాలను తెలుసుకున్నారు. గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఉన్న బకాయిలు, ఈ 2015-16 ఫీజుల కోసం వివిధ శాఖలకు అవసరమైన నిధులు తదితర వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సహకార శాఖ వినూత్న రీతిలో పనిచేయాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. రైతులకు ఎరువుల సరఫరా, ధాన్యం సేకరణ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మార్క్ఫెడ్, హౌజ్ఫెడ్, హాకాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. -
రైలు సౌకర్యం కల్పించాలి..
సూర్యాపేటపై కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభుకి మంత్రి జగదీశ్రెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ : నల్లగొండ జిల్లా సూర్యాపేటకు రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి విన్నవించారు. బుధవారం ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రుతో కలసి రైల్వేమంత్రితో భేటీ అయ్యారు. సూర్యాపేటను కలుపుతూ మూడు రైల్వే లైన్లను ప్రతిపాదిస్తూ ఒక నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. భవిష్యత్లో సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతోపాటు ఆ ప్రాంతంలో పలు సిమెంటు పరిశ్రమలున్నాయని, భవిష్యత్తులో ఓ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాబోతున్నందున సిమెంటు, బొగ్గు తరలించేందుకు భారీ డిమాండ్ ఉంటుందన్నా రు. బోనకల్ నుంచి చిట్యాల(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి నల్లగొండ(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి మిర్యాలగూడ (వయా సూర్యాపేట) రైల్వే లైన్లను జగదీశ్రెడ్డి ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి వీలుగా సర్వేలు చేపట్టాలన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేందు కు కేంద్ర మంత్రిమండలి సమ్మతించిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ఈ సర్వే పనులు ప్రారంభించవచ్చని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హైవే ప్రమాదాలపై గడ్కారీతో చర్చ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీ య రహదారిపై నార్కట్పల్లి వద్ద కామినేని ఆసుపత్రి కూడలి, దురాజపల్లి గ్రామం, జనగామ-సూర్యాపేట కూడలి, సూర్యాపేట పట్టణం ప్రధాన కూడలి, మునగాల మండలం ముకుందాపురం వద్ద వీయూపీలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో నూతన పవన విద్యుత్... తెలంగాణ రాష్ట్రం 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ పవన విద్యుత్ సంస్థ(ఎన్ఐడబ్ల్యూఈ) అధ్యయనంలో తేలిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. 2017-18లోగా 361 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభించనున్నామన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘పునరుత్పాదక విద్యుత్’ అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామన్నారు. -
‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర’ గొప్ప ప్రయత్నం
వి.ప్రకాశ్ రచించిన పుస్తక ఆవిర్భావంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు వి.ప్రకాశ్ రచించిన ‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర - రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తక రచన ఒక గొప్ప ప్రయత్నమని, ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంతవరకు ఎవరూ కూడా గ్రంథస్తం చేయలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకాశ్ను అభినందించారు. ఈ పుస్తకం చదివితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని, ఇది అవశ్య పఠనీయమని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అనేక పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీలతో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల గ్రంథాలయాల్లో కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచితే మంచిదని అన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాశ్ దంపతులను సన్మానించారు. రచయిత ప్రకాశ్ ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అంకితం ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, మంత్రి జగదీశ్రెడ్ది, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కారెక్కిన జానా అనుచరులు
-
కారెక్కిన జానా అనుచరులు
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి... పోచారం సమక్షంలో వర్ని మండల ఎంపీటీసీల చేరిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి అనుచరులు టీఆర్ఎస్లోకి వలస బాట పట్టారు. సుదీర్ఘ కాలంగా ఆయనతో కలసి పనిచేసిన ముఖ్య నేతలు ముగ్గురు శుక్రవారం నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్రెడ్డి, మరో నాయకుడు ఎం.సి కోటిరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ధన మల్లయ్యలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండలో కాంగ్రెస్ ధన బలంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని, కానీ, నల్లగొండలో ఎప్పుడో టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం ఖాయమై పోయిందన్నారు. ఈ ముగ్గురు నాయకులతో పాటు పధ్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు కూడా ఆ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పోచారం సత్యనారాయణపురం, లక్ష్మాపూర్ ఎంపీటీసీ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
అటు పైరవీలు.. ఇటు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ సంస్థల్లోని కొందరు అధికారులే పైరవీలకు తెరతీసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో ఓ డెరైక్టర్పై కొందరు వ్యక్తులు ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్కు రాతపూర్వకంగా ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది. వాస్తవానికి నోటిఫికేషన్లు రాక ముందే దళారులు రంగ ప్రవేశం చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అప్పట్లో హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. ట్రాన్స్కోలో 206, జెన్కోలో 856, టీఎస్ఎస్పీడీసీఎల్లో 201, టీఎస్ఎన్పీడీసీఎల్లో 162 ఏఈ పోస్టులు కలిపి మొత్తం 1,425 పోస్టులకు విద్యుత్ సంస్థలు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించాయి. పోస్టులు పరిమిత సంఖ్యలోనే ఉన్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇటీవలే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లు రాత పరీక్ష నిర్వహించాయి. ఈ నెల 22న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), 29న ట్రాన్స్కో సంస్థ రాత పరీక్ష జరగనుంది. భారీగా ఫిర్యాదులు వస్తుండటంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్ రావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రకటనలతో గందరగోళం ఒకే కేటగిరీ పోస్టులు.. ఒకే తరహా అర్హతలు.. విద్యుత్ సంస్థలు మాత్రం నాలుగు వేర్వేరు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అభ్యర్థులు వ్యయప్రయాసలకోర్చి నాలుగు పరీక్షలకు హాజరయ్యేందుకు తంటాలు పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒకే అర్హతలతో ఒకే కేటగిరీ పోస్టులుంటే ఒకే ప్రకటన ద్వారా టీఎస్పీఎస్సీ నియామకాలు జరుపుతుండగా, ఒకే శాఖలోని ఒకే కేటగిరీ పోస్టుల కోసం నాలుగు ప్రకటనలు ఎందుకుని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఏఈ రాత పరీక్షలో తాము లీనమై ఉంటే.. హాల్టికెట్ల పరిశీలన, గుర్తింపు నిర్ధారణ పేరుతో ఇన్విజిలేటర్లు ఆటంకం కలిగించి సమయం వృథా చేశారని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఇప్పటికే టీఎస్ఎన్పీడీసీఎల్, జెన్కో రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత హాల్ టికెట్ల పరిశీలన, సంతకాలు, వేలి ముద్రల సేకరణ పాటు గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ గల ఫొటోలు కావాలంటూ సమయం వృథా చేస్తున్నారని తెలిపారు. ఇకపై రాత పరీక్షకు అర్ధగంట ముందే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు. -
నేడు అమరావతికి సీఎం కేసీఆర్
సీఎం వెంట వెళ్లనున్న ముగ్గురు మంత్రులు సాక్షి, హైదరాబాద్/ సూర్యాపేట: దసరా పర్వదినం సందర్భంగా గురువారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాల్గొననున్నారు. తనతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిలను కూడా ఈ కార్యక్రమానికి తీసుకుని వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రమే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నివాసంలో ఆయన బుధవారం రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 10.15 గంటలకు సూర్యాపేట ఎస్వీ కళాశాల మైదానం నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా అమరావతికి బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలోని గొల్లబజార్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చేరుకుంటారు. ఎర్రవల్లిలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో నర్సన్నపేట గ్రామానికి చేరుకుని అక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేస్తారు. తిరిగి రాత్రి 7.10 గంటలకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు. -
నిధులన్నీ కొడుకూ, అల్లుడికే!
♦ కేసీఆర్పై రమణ, ఎర్రబెల్లి మండిపాటు ♦ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు టీడీపీ, బీజేపీ ధర్నా సాక్షి, రంగారెడ్డి/నల్లగొండ: రుణమాఫీకి మొత్తం నిధుల ను ఒకే దఫాలో చెల్లించడానికి వెనుకాడుతున్న సీఎం కేసీఆర్.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రం హడావుడిగా ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్ల బిల్లులు చెల్లించడం ఏమిటని టీడీపీ ప్రశ్నించింది. స్వయంపాలనతోనే మనుగడ అన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రాజెక్టుల కింద వేల కోట్ల రూపాయలను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంలో అంతర్యమేంటని నిలదీసింది. రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ, బీజేపీ సంయుక్తంగా ధర్నా నిర్వహిం చాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సీఎం తన కుమారుడు, అల్లుడి శాఖలకు మాత్రమే భారీగా నిధులిస్తున్నారని, మిగతా శాఖలను నీరుగార్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదల కాంట్రాక్టర్లకు బిల్లులను రుణమాఫీ కింద జమ చేయాలని, లేనియెడల సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ జీవో ప్రతులు దహనం చేస్తామన్నారు. బీజేపీ శాసనసభ పక్షనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ చేతకావడంలేదని కుర్చీ దిగితే.. కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల, వివేకానంద, గాంధీ పాల్గొన్నారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన రైతుదీక్షలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీడీపీ నేతలను చీపుర్లతో కొట్టాలన్న మంత్రి జగదీశ్రెడ్డి ఓ గుంటనక్క అని మండిపడ్డారు. ‘ఏ గ్రామానికెళ్లినా జగదీశ్రెడ్డినే చీపుర్లు, చెప్పులతో కొడతారు.’ అని అన్నారు. -
2018 నాటికి మిగులు విద్యుత్
మండలిలో మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణను 2018 చివరకల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబెడతామని విద్యుత్శాఖమంత్రి జగదీశ్రెడ్డి తెలి పారు. పవర్ కట్ అనేది ఉండకుండా చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలకు 2018-19 నాటికి 24 వేల మెగావాట్ల మేర ఒకేసారి పంపిణీచేసే వ్యవస్థను రూపొం దించుకునే దిశలో పనిచేస్తున్నట్టు చెప్పారు. అన్ని పవర్ ప్రాజెక్టులకు ఆర్థికవెసులుబాటును సాధించామని, అనుకున్న సమయానికి వాటిని పూర్తిచేస్తామని తెలిపారు. స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలతో 3,300 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నామన్నారు. మంగళవారం శాసనమండలిలో విద్యుత్పై స్వల్పకాలిక చర్చ కు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్వల్పకాలంలో వాటిని సాధించిందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి రూ.700 కోట్లతో ఒక 400 కేవీ, ఆరు 200 కేవీ, ఇరవై 132 కేవీ, అరవై 33 /11 కేవీల కోసం పనులు చేపడుతున్నామని, దీంతోపాటు అండర్గ్రౌండ్ వైరింగ్ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఆయా దశల్లో అవసరమైన చర్యలు తీసుకుని రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తామని, వచ్చే ఏప్రిల్ నుంచి పగటిపూటే 9 గంటల విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ఎస్కలేషన్ భారం 3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 25 ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేం దుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోం దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న అడ్డంకులను అధిగమించడంతోపాటు ధరల సర్దుబాటు(ఎస్కలేషన్)కు తుదిరూపు ఇస్తున్నామన్నారు. ధరల సర్దుబాటుతో ప్రభుత్వంపై రూ.2,700కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. కొత్తగా టెండర్లు పిలిస్తే న్యాయపరమైన చిక్కులు, సమయం వృథాతోపాటు భారం రూ.15 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నందునే ధరల సర్దుబాటుకు నిర్ణయించామని వివరించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గాదరి కిశోర్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 13 మేజర్, 12 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు చూపిన ఉత్సాహం.. వాటిని పూర్తి చేయడంలో చూపలేదని విమర్శించారు. భూసేకరణ కోసం జీవో 123 తెచ్చామని, దీనిద్వారా మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో భూమి కొనుగోలు వేగం గా జరుగుతోందని తెలిపారు. ఈ 25 ప్రాజెక్టుల కింద 41 వేల ఎకరాల భూమి అవసరం ఉందని, ఇవి పూర్తి చేసి 29 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా రూ.2,950 కోట్లు ఇవ్వగా, అందులో రూ.2,674 కోట్లు రికవరీ చేసినట్లు వివరించారు. రూ.1,024 కోట్లతో గోదాములు ప్రతి మండలంలో అందుబాటులో ఉండేలా 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం కోసం రూ.1,024 కోట్లు ఖర్చు చేయనున్నట్లు హరీశ్రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తామని సభ్యులు శ్రీనివాస్గౌడ్, హన్మంత్ షిండే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 6.25లక్షల దీపం కనెక్షన్లు: జగదీశ్రెడ్డి రాష్ట్రంలో 6.25 లక్షల దీపం కనెక్షన్లు మం జూరు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే ఏడాది 3.50 లక్షల మందికి కనెక్షన్లు ఇస్తామని సభ్యులు కొండా సురేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 227 చైన్ స్నాచింగ్లు: నాయిని ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిరవకు 227 చైన్ స్నాచింగ్లు జరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు జె.గీత, డీకేఅరుణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గతేడాది 582 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కృష్ణాపుష్కరాలపై 8న సమావేశం వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్నగర్లో16, నల్లగొండలో 19స్నాన ఘట్టాలున్నాయని, కొత్త వాటిపై ప్రతిపాదనలు కోరామని వివరించారు. పుష్కరాలపై ఈనెల 8న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమక్క-సారక్క జాతరకు రూ.107 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు అందాయని సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, పుట్టా మధు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారని వివరించారు. -
ఆరు నెలల్లో పరిష్కరించాం
విద్యుత్ సమస్యపై మంత్రి జగదీశ్రెడ్డి ♦ విపక్షాలు లోపాలే వెతుకుతున్నాయని విమర్శ ♦ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని వెల్లడి ♦ డిస్కంలకు రూ.4 వేల కోట్ల రాయితీలిచ్చాం ♦ ‘సీలేరు’ కోసమే ఏపీలో ఏడు మండలాల విలీనం ♦ రాష్ట్రానికి విద్యుత్ రాకుండా బాబు కుట్రలు చేశారని మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాత్రింబవళ్లు పని చేసి 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, నిరంతర సమీక్షలు, శ్రద్ధతోపాటు జెన్కో, ట్రాన్స్కో, డిస్కం సీఎండీల కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఇంత చేసినా ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశంసించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నాయని, లోపాలు వెతికి నెపం నెట్టేం దుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వరినాట్లు వేయొద్దని సీఎం పిలుపునివ్వడం వల్లే విద్యుత్ సరఫరాలో రాష్ట్రం గట్టెక్కిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2013-14తో పోలిస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014-15, 2015-16లో అధిక విద్యుత్ సరఫరా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉచిత విద్యుత్ కోసం గతంలో ఎన్నడూ డిస్కం లకు ఇచ్చిన రాయితీలు రూ.3 వేల కోట్లకు మించలేదని, 2015-16లో తాము రూ.4 వేల కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సోమవారం శాసనసభ స్వల్పకాల చర్చలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన 53.89 శాతం విద్యుత్ వాటాను ఇవ్వకుండా ఏపీ సీఎం ఇబ్బంది పెట్టారని, సీలేరు, కృష్ణపట్నం, సాంప్రదాయేతర ఇంధన ప్లాంట్ల నుంచి రావాల్సిన 1,559 మెగావాట్లకు గండి కొట్టారన్నారు. సీలేరు జల విద్యుత్కేంద్రం కోసమే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ సర్కారు వీలినం చేసుకుందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్పై లక్ష కోట్ల పెట్టుబడులు ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ విద్యుత్ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు కేవలం 2,282 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను మాత్రమే నిర్మించారన్నారు. తాము మాత్రం 2018-19 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,272 మెగావాట్లకు పెంచే దిశగా కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగంలో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామన్నారు. మణుగూరు, దామరచర్ల, కొత్తగూడెంలలో తలపెట్టిన ప్లాంట్లకు పర్యావరణ, అటవీ అనుమతులు రికార్డు స్థాయిలో లభించాయన్నారు. ఈ ప్లాంట్లకు బొగ్గు గనుల కోసం అన్వేషిస్తున్నామన్నారు. పునర్విభజన చట్టం హామీ ప్రకారం రామగుండంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటు కానుందన్నారు. విద్యుదుత్పత్తి జరగకపోయినా రూ.వేల కోట్లను తమ వాళ్లకు కట్టబెట్టేలా గత పాలకుల హయాంలో పీపీఏలు జరిగేవన్నారు. తాము మాత్రం ప్రభుత్వ రంగంలోనే కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టామని, బీహెచ్ఈఎల్కు బాధ్యతలు అప్పగించామన్నారు. 2016 డిసెంబర్ నాటికి 3,300 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి పంటలకు పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసి తీరుతామని ఆయన వివరించారు. విపక్షాలు లేకుండానే.. విపక్ష సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో ఎంఐఎం మినహా ఇతర విపక్షాలు లేకుండానే సభలో విద్యుత్ అంశంపై ప్రభుత్వం చర్చ జరిపింది. తొలుత టీఆర్ఎస్ సభ్యులు శ్రీనివాస్గౌడ్, ఎన్.సత్యనారాయణ, వేముల వీరేశం మాట్లాడుతూ.. గత పాలకులు విద్యుత్ రంగంలో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించారన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లు, నిధులతో ఏపీలో విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకున్నారని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. విద్యుత్ కోసం ఏపీపై తెలంగాణ ఆధారపడేలా కుట్రలు చేశారని సత్యనారాయణ ఆరోపించారు. గత నాలుగు నెలలుగా పాతబస్తీలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషాఖాద్రి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. త్వరలో నగర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. మిగులు విద్యుత్పై మండలి ప్రశంస సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే చీకట్లో మగ్గిపోవాల్సిందే అంటూ హేళన చేసిన వలస పాలకులకు కళ్లు బైర్లు కమ్మేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర విద్యుత్ అందిస్తున్నారని శాసనమండలి అభిప్రాయపడింది. మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారు చేసేందుకు సీఎం నిరంతర కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ విద్యుత్ అంశంపై చర్చకు అవకాశం ఇచ్చారు. సభలో మంత్రులు మినహా 12 మంది టీఆర్ఎస్ సభ్యుల్లో 10మంది మాట్లాడారు. సభ్యులు జనార్దన్, డి. రాజేశ్వర్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పాతూరి సుధాకర్రెడ్డి, సలీం, రాములు నాయక్, వెంకటేశ్వర్లు, గంగాధర్ గౌడ్లు మాట్లాడుతూ మూడేళ్లలో 24వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈచర్చ అనంతరం మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభను వాయిదా వేశారు. -
వారంలో ‘విద్యుత్’ నోటిఫికేషన్లు!
1,422 అసిస్టెంట్ ఇంజనీర్ల భర్తీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి వారం రోజుల్లో వేర్వేరుగా నియామక ప్రకటనలు విడుదలకానున్నాయి. మొత్తంగా 1,422 ఏఈ పోస్టులను భర్తీ చేయనుండగా... అందులో 963 ఎలక్ట్రికల్, 194 సివిల్, 70 ఎలక్ట్రానిక్స్, 195 మెకానికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం జేఎన్టీయూహెచ్కు అప్పగించింది. నవంబర్లో పరీక్షలు నిర్వహించి డిసెంబర్ చివరిలోగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జనవరి 1 నుంచి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ల జారీకి వారం రోజులు పట్టవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి. రాతపరీక్ష ఆఫ్లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థుల వయోపరిమితిపై పదేళ్ల వరకు సడలింపు ఇవ్వనున్నారు. పక్కాగా లోకల్ నియామకాలు తెలంగాణ స్థానికత గల అభ్యర్థులే విద్యుత్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఖాళీలన్నింటినీ జోనల్ స్థాయి పోస్టులుగా ప్రకటించనున్నారు. తద్వారా ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అవుతారు. ఇక ఓపెన్ కేటగిరీలో సైతం జోన్లతో సంబంధం లేకుండా తెలంగాణ స్థానికత గల అభ్యర్థుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. గతంలో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన ఉండగా.. ఇటీవలే తెలంగాణ అభ్యర్థులే అర్హులుగా ఉండేలా సవరించారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం జరిపిన అభ్యర్థులు అనర్హులు కానున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా పొరుగు రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ అభ్యర్థుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్లో ‘ఎస్ఈ’ నోటిఫికేషన్..! ఏఈతో పాటు సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతించినా... వీటికి సంబంధించి డిసెంబర్లో నోటిఫికేషన్ను జారీ చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రాన్స్కోలో 174, ఎస్పీడీసీఎల్లో 153, ఎన్పీడీసీఎల్ 278 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. బ్రోకర్లను నమ్మొద్దు: జగదీశ్రెడ్డి విద్యుత్ ఇంజనీర్ల భర్తీలో పైరవీలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి సోమవారం విద్యుత్ నియామకాల మంత్రి వివరాలను వెల్లడించారు. కింది స్థాయిలో ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టర్లు ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే 8332983914 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
చైనా టూర్కు జగదీశ్రెడ్డి
విద్యుత్శాఖకు సంబంధించి పెట్టుబడులపై చర్చించే అవకాశం డాంగ్ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సందర్శించనున్న సీఎం బృందం జిల్లాలో విద్యుత్ రంగంలో పెట్టుబడులకు చైనాను ఆహ్వానించనున్న మంత్రి చైనా దేశంలో మంత్రి పర్యటన వివరాలు సోమవారం ఉదయం సీఎంతో కలిసి చైనా వెళ్తారు. అక్కడ డల్లాన్ నగరానికి చేరుకుంటారు. అక్కడినుంచి 10న షాంగైకి వెళతారు. 11వ తేదీన చైనా రాజధాని బీజింగ్లో పర్యటిస్తారు. 12న బీజింగ్ నుంచి షెన్జెన్కు 13న షెన్జెన్ నుంచి హాంగ్కాంగ్కు 16న హాంకాంగ్ నుంచి హైదరాబాద్కు వస్తారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడిగా పేరున్న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను చైనా దేశంలో ప్రచారం చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సీఎం నేతృత్వంలో ఆ దేశానికి వెళ్లిన రాష్ట్ర బృందంలో జగదీశ్రెడ్డి ఉన్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఆయన చైనా దేశంలో పర్యటిస్తారు. చైనా పర్యటన కోసం ముఖ్యమంత్రి తయారుచేసిన అధికార, రాజకీయ బృందంలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో పరిశ్రమల మంత్రి జూపల్లితో పాటు జగదీశ్రెడ్డి ఉండడం, అదీ విద్యుత్ శాఖ మంత్రి హోదాలో వెళుతుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో చైనా కంపెనీల పెట్టుబడుల కోసం వెళుతున్న రాష్ట్ర బృందంలో సభ్యుడిగా ఉన్న మంత్రి జగదీశ్ జిల్లాలో కూడా ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి పవర్.... రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న పవర్ప్లాంట్లు, ఇతర విద్యుత్ సంబంధ పరిశ్రమలపై చైనా పారిశ్రామిక దిగ్గజాలు, విద్యుత్ కంపెనీలతో చర్చించేందుకు గాను మంత్రి జగదీశ్రెడ్డి చైనా వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చైనా పెట్టుబడులతో పాటు ప్రత్యేకించి జిల్లాలో విద్యుత్ రంగ పెట్టుబడుల గురించి ఆయన అక్కడి కంపెనీలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఖరారైన యాదాద్రి విద్యుత్ ప్లాంట్... లేదంటే రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక హబ్లో పెట్టుబడుల గురించి మంత్రి చైనా కంపెనీలతో మాట్లాడనున్నట్టు సమాచారం. అయితే, విద్యుత్రంగానికి సంబంధించి చైనాలోని డాంగ్ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ప్రతినిధి బృందం ఇటీవలే మన రాష్ట్రాన్ని సంప్రదించింది. ఆ కార్పొరేషన్తో రాష్ట్రంలో విద్యుత్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మంత్రి జగదీశ్రెడ్డి ఈ పర్యటనలో ఆ దేశ పారిశ్రామిక దిగ్గజాలతో జరిగే చర్చల్లో పాల్గొంటారు. పలు పారిశ్రామికవాడలను సందర్శించనున్నారు. షెంగ్వాన్ నగరంలో పారిశ్రామిక వేత్తల భేటీలో మంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
బాలశాస్త్రవేత్తలుగా ఎదగాలి
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి భువనగిరి : విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికితీసి ఇలాంటి ప్రదర్శనల్లో చాటిచెబితేనే భవిష్యత్తులో వారు బాలశాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశముంటుందని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. భువనగిరిలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా ఇన్స్పైర్ అవార్డ్స్ 2015ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు తమ మేథస్సుకు పదును పెట్టాలని, వారి అభిరుచికి అనుగుణంగా ఉపాధ్యాయుల సహకారం అవసరముంటుందన్నారు. ప్రతి పనిలో పరిశోధన చేయాలని, అపుడే దేశం గర్వించదగ్గ విద్యావంతులు పుట్టుకొస్తారన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేసిన పరిశోధనల ఫలితంగా ప్రపంచంలో భారత్ సూపర్సానిక్ దేశంగా తలెత్తుకుని నిలిచిందని, అగ్రదేశాలతో సమానంగా ఆయుధ సంపత్తిని రూపొందించన ఘనత కలాంకు దక్కుతుందన్నారు. శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల వల్ల ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని, ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమేనన్నారు. బంగారు తెలంగాణకోసం కలలు కంటున్న కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ముందుకెళ్లాలన్నారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించాలి గ్రామాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి విద్యార్థుల ను ఉపాధ్యాయులు గుర్తించాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. దేశానికి కావాల్సిన పరిశోధనలు చేసేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మాట్లాడారు. పిల్లలు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కుటుంబ సహకారం అవసరమని, చదువుతోపాటు సాంకేతిక తెలివితేటలు కూడా అవసరమవుతాయన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మతకు ఇన్స్పైర్ అవార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్లు మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనలు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, వాటిని విద్యార్థులు సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. విశ్వనాధరావు, ఆర్డీఓ ఎన్. మధుసూదన్, డీఎస్సీ సాధు మోహన్రెడ్డి, ఎంపీపీ తోటకూర వెంకటేష్యాదవ్, జెడ్పీటీసీ సందెల సుధాకర్, సర్పంచ్ రాయపురం అశోక్, డెప్యూటీ డీఈఓ మదన్మోహన్, సైదానాయక్, ీహర్యానాయక్, పాండునాయక్, తహసీల్దార్ కె. వెంకట్రెడ్డిలు పాల్గొన్నారు. ప్రదర్శనలో అబ్బురపరిచిన నమూనాలు ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత బయటపడింది. విద్యార్థులు వివిధ అంశాలపై తయారుచేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 394 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. భువనగిరికి చెందిన బీచ్మహల్లా, ఆలేరుకు చెందిన జెఎంజే పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే యంత్రాలను చూసి మంత్రి మెచ్చుకున్నారు. అలాగే స్పీడ్ బ్రేకర్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన, మిషన్ కాకతీయ, రోప్వే, ఇసుకతరలింపుతో ఇంకే భూగర్బజలాలు, సోలార్ హీటర్, ప్లాస్టిక్ను తినే బ్యాటరీలు, బోటానికల్ఫుడ్, ఆవుపేడ నుంచి విద్యుత్ ఉత్పాదన, మధ్యాహ్న భోజనంలో అందని పోషకాలు, నీటిలో తేలే ఇటుక, ఉప్పు నీటినుంచి విద్యుత్ తయారుచేయుట వంటి నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
మంత్రి జగదీశ్రెడ్డి పర్యటనలో దొంగల హల్చల్
హాలియా : మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గురువారం వచ్చిన రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి కార్యక్రమంలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. తిరుమలగిరి గ్రామంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి భూమిపూజ కార్యక్రమంలో బీజీగా ఉండగా, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల ఆసక్తిగా గమనించారు. మంత్రి పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించేందుకు పోలీసులు అక్కడ ఉండగానే జేబు దొంగలు తమ పని కానిచ్చారు. సుమారు రూ.18,500 కాజేశారు. స్థానికులు దుర్గారావు జేబులో రూ.7500, రమేశ్ దగ్గర రూ.8000, వీఆర్ఏ సత్రశాల నర్సింహా వద్ద రూ.3000, ఇరిగి నాగయ్య జేబులో రూ.200లు కాజేశారు. తమ జేబుకు చిల్ల్లుపడటంతో బాధితులు లబోదిబోమన్నారు. -
లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి కృషి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఈదులగూడెంలో రూ.1.13 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొరత లేకుండా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోందన్నారు. థర్మల్ ప్లాంట్ పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తొలగనున్నాయన్నారు. చీప్ లిక్కర్పై ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంత మంది రాజకీయ స్వార్థం కోసం రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. గుడుంబా వ్యవస్థను పూర్తి స్థాయిలో నివారించేందుకు రెండు వేల కోట్ల రూపాయలు నష్టమైనప్పటికీ తక్కువ ధరలతో మద్యంను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, స్థానిక ఎమ్మెల్యే ఎన్. భాస్కర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగ రు నాగలక్ష్మిభార్గవ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, జిల్లా నాయకులు తేరా చిన్నపరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి, మన్నెం దేవకమ్మ లింగారెడ్డి, పశ్యా శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ కిషన్రావు, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ట్రాన్స్కో డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ రావిరాల ధనుంజయ, అమృతం సత్యం, తమ్మన్న, జొన్నలగడ్డ రంగారెడ్డి, షహనాజ్బేగం తదితరులున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి హాలియా: జిల్లా సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురానం, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండలాల్లో పలు గ్రామాల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాలియా మండలం రామడుగు గ్రామంలో రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం తిరుమలగిరిలో సుమారు రూ. 3 కోట్లతో నిర్మించనున్న మార్కెట్ గిడ్డంగులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరులేకపోవడంతో రైతులు బోరుబావుల కింద వరి, ఇతర పంటలు సేద్యం చేస్తున్నారని రైతులకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ నియోజకరవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య, ఎంపీపీ అల్లినాగమణి, జెడ్పీటీసీ నాగమణి, ఆర్డీఓ కిషన్రావు, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డిరెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి పాల్గొన్నారు. -
'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం'
హాలియా (నల్లగొండ జిల్లా) : లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. మండలంలోని రామడుగు గ్రామంలో 33-11 సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లోవేల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. -
‘డిండి’ భూసేకరణ వేగవంతం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అవసరమయ్యే భూమిని ఈ నెలాఖరులోగా కొనుగోలు చేయాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సాగునీటి పారుదల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి తన చాంబర్లో డిండి ఎత్తిపోతల పథకంపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ నిపుణులు, సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి 26 వేల ఎకరాలు అవసరం కాగా.. దీంట్లో నల్లగొండ జిల్లాలో 16 వేలు, మహబూబ్నగర్ జిల్లాలో పదివేల ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ మొత్తం భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మొదట విడత రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐదు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. దీంట్లో మొదటి రిజర్వాయర్ సింగరాయపల్లి, రెండోది గొట్టిముక్కల, మూడో రిజర్వాయర్ అర్కపల్లి, నాలుగైదు రిజర్వాయర్లు కిష్టరాంపల్లి, సువర్ణగూడెంలో నిర్మిస్తారు. ఈ ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి 15 వే ల ఎకరాల భూమి అవసరం. దీంతో పాటు డిండి ఎత్తిపోతల నుంచి చౌటుప్పుల్ వరకు ప్రధాన కాల్వ 90 కి.మీ మేర తవ్వుతారు. దీనికి 11 వేల ఎకరాలు కావాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.6,190 కోట్లు కాగా...పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిఅయితే 3.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. దీంట్లో నల్లగొండ జిల్లాలో మూడు లక్షలు ఎకరాలు కాగా..మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల ఎకరాలు ఉంది. మంత్రి నిర్వహించిన ఈ స మావేశంలో ఇరిగేషన్ నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ప్రసాద్ రెడ్డి, ఎమ్మార్పీ ఎస్ఈ పురుషోత్తం రాజు, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వరరెడ్డి, కర్నె ప్రభాకర్, జిల్లా నీటి పారుదల అధికారులు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
నా సభలోనే కరెంట్ కట్ చేస్తారా?
విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి అసహనం చౌటుప్పల్: హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం గ్రీన్గ్రోవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కరెంట్ కట్ అయింది. మైకు రాకపోవడంతో సౌండ్స్ ప్రాబ్లమ్ అనుకున్నారు. కానీ సౌండ్స్ బాగానే ఉన్నాయి, కరెంట్ కట్ అయిందని మంత్రికి చెప్పడంతో, ఏమయ్యా.. ఏఈ లేడా? నేను పాల్గొన్న సభలోనే కరెంట్ కట్ చేస్తారా.. అని అసహనం వ్యక్తంచేశారు. వెంటనే స్కూలు వాళ్లు జనరేటర్ స్టార్ట్ చేయడంతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. -
3 నెలల్లో సూర్యాపేటకు తాగునీరు
మంత్రి గుంటకండ్ల సాక్షి, హైదరాబాద్/సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీకి రానున్న మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. గురువారం హైదరాబాద్లో మున్సిపాలిటీ అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు 40 ఏళ్లుగా కలుషితమైన నీటితో అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. మూసీనది మురికి నీళ్లు కావడంతో ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం లేకపోయేదన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలకు ఆ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కృష్ణానది నీటిని తరలిస్తామన్నారు. ప్రస్తుతం నాలుగైదు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోందని, వీలైనంత త్వరలో రెండు రోజులకు ఒకసారి అందజేస్తామన్నారు. రానున్న మూడునెలల్లో ప్రతీరోజూ మంచినీళ్లు అందేలా ప్రణాళిక తయారుచేశామని మంత్రి వివరించారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలి సూర్యాపేట పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లో సూర్యాపేట పట్టణంలోని నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. దోసపహాడ్ పథకం ద్వారా అనాజిపురం గాండ్ల చెరువును కృష్ణా జలాలతో నింపి రోజు విడిచి రోజు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనాజిపురం నుంచి కొత్తపైపులైన్ను పాత ఫిల్టర్బెడ్ల వరకు నిర్మాణం చేసేందుకు కావాల్సిన నిధులు, మోటార్ల రీప్లేస్మెంట్ కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఇంతియాజ్ అహ్మద్ను ఆదేశించారు. నీటి సరఫరా మెరుగునకు తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్, పబ్లిక్హెల్త్ ఎస్ఈ డి.యాదగిరి, ఈఈ ప్రవీణ్చంద్ర, టీఆర్ఎస్ నేతలు గండూరి ప్రకాష్, మున్సిపల్ ఈఈ విద్యాసాగర్, డీఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉద్యమ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతాం
ఉద్యమ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతాం నల్లగొండ తెలంగాణ ఉద్యమ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. 60 ఏళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈ ఐదేళ్లలో భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...జిల్లాలోని ప్రధాన ప్రతిపక్ష నాయకులైన జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యేతో సహా అందరి సహకారంతో ఈ ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా దామరచర్ల పవర్ ప్లాంట్ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతగానో సహరించారని అన్నారు. ఇదే పద్ధతిలో వచ్చే నాలుగేళ్లలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ గుత్తా మాట్లాడుతూ.. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. తమ పార్టీకి ఎదురొడ్డి పార్లమెంట్లో రాష్ట్రం కోసం తమ వంత పోరాటం చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రతి ఒక్క రు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల రూపాయాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడు తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్ర చిరకాలం గుర్తుం డిపోతుందన్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంద న్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సత్యనారయణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, చినవెంకటరెడ్డి పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరింపజేశాయి. ముఖ్యంగా అలరులుకురియగ ఆడెనదే అనే అన్నమాచార్య కీర్తనకు లలిత సుమాంజలి కూచిపూడి నృత్యం, వెంకటరమణారెడ్డి అన్నమాచార్య కీర్తనల ఈల పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంకా బాలు బృందం చేసిన జయజయహే తెలంగాణ, కిట్టు బృందం ఉస్మానియా క్యాంపస్లో ఉదాయించిన కిరణమా, ఎంవీఆర్ పాఠశాల విద్యార్థిని బి.అశ్రీత చేసిన భారతవేదముగా నిరత నాట్యముగా అనే నృత్య రూపకం, జాగృతి పోలీసు బృందం అమరవీరులను తలుస్తూ పాడిన పాట, పరమేష్ బృందం పల్లె సుద్దులు, జెవివి మ్యాజిక్ షో, నాగదుర్గ శాస్త్రీయ కూచిపూడి నృత్యం, జిసహదేవ మిమిక్రి, గోపికమ్మ చాలును లే అమ్మ పాటకు కిట్టు బృంద నృత్యం అలరించాయి. -
17,950 కోట్లతో ‘యాదాద్రి’
* దామరచర్లలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణం * బీహెచ్ఈఎల్, టీ.జెన్కోల మధ్య కుదిరిన ఒప్పందం * వివరాలను వెల్లడించిన మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం సచివాలయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు జరిగాయి. రూ.17,950 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టును నిర్మించేం దుకు బీహెచ్ఈఎల్ సమ్మతించింది. చర్చల అనంతరం జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, బీహెచ్ఈఎల్ చైర్మన్ ప్రసాదరావుతో కలసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 థర్మల్ పవర్ ప్లాంట్లను దామరచర్లలో నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా నిర్మిస్తున్న దాదాపు 6వేల కోట్ల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.27,367 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. -
గులాబీ గూటికి ముత్తవరపు?
త్వరలోనే టీఆర్ఎస్లోకి డీసీసీబీ చైర్మన్! హైదరాబాద్లో కేసీఆర్తో మంతనాలు జిల్లాపై పూర్తిస్థాయి ఆధిపత్యం కోసం చక్రం తిప్పుతున్న మంత్రి జగదీష్రెడ్డి ఖమ్మం జిల్లా నేతల మధ్యవర్తిత్వం కూడా కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాక తేదీ ఖరారు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తవరపు పాండురంగారావు త్వరలోనే అధికార టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలోగ్రీన్సిగ్నల్ లభించిందని, వారం రోజుల్లో ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీష్రెడ్డి చక్రం తిప్పడంతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన నేతల మధ్యవర్తిత్వం నెరపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం సాధించేందుకు గాను స్వయంగా మంత్రి జగదీష్రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నారని సమాచారం. అయితే, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముత్తవరపు .. పార్టీలో ఎప్పుడు చేరతారనేది తేలనుంది. సీఎం ఓకే డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ కేంద్ర సహకార బ్యాంకు (టీక్యాబ్) చైర్మన్గా వరంగల్ జిల్లాకు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి (ఆదిలాబాద్)లు ఎన్నికైన సందర్భంగా రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా ముత్తవరపు పార్టీలో చేరిక వ్యవహారంపై చర్చలు జరిగాయి. పాండురంగారావుకు మిత్రుడైన ఖమ్మం జిల్లాకు చెందిన ఓనాయకుడు ఈ విషయంలో కొంత చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సహకార బ్యాంకులు రైతులకిచ్చే దీర్ఘకాలిక రుణాలపై రిబేటు అంశాన్ని ముత్తవరపు సీఎం దృష్టికి తీసుకెళ్లారని, ఇందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముత్తవరపును పార్టీలో చేర్చుకునేందుకు కూడా సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేటీఆర్, జగదీష్లతో త్వరలోనే భేటీ అయితే, ఇటీవలే ముత్తవరపు పాండురంగారావుకు వ్యతిరేకంగా ఉన్న ఏడెనిమిది మంది డీసీసీబీ డెరైక్టర్లు టీఆర్ఎస్లో చేరాలని భావించినప్పటికీ ఆ కార్యక్రమం పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ముత్తవరపుతో పాటు ఆయన అనుచరులు, ఆయన వ్యతిరేకులందరినీ కలిపి పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచించింది. ఈ మేరకు ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి తిరిగివచ్చాక జిల్లాకు చెందిన మంత్రి జగదీష్రెడ్డితో కలిసి డీసీసీబీ చైర్మన్, డెరైక్టర్లు సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం చైర్మన్తో పాటు డెరైక్టర్లు కూడా టీఆర్ఎస్లో చేరే తేదీ ఖరారు కానుందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లోనే ఈ తతంగం అంతా పూర్తి చేసుకుని డీసీసీబీ కార్యాలయంలపై గులాబీ జెండా ఎగురవేసే కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకత్వం నిమగ్నమైంది. ఈవిషయమై పాండురంగారావు సాక్షితో మాట్లాడుతూ.. డీసీసీబీలో చైర్మన్లకు సీఎం ఇచ్చిన విందు కార్యక్రమానికి వెళ్లానని, జిల్లా బ్యాంకు అభివృద్ధికోసమే మాట్లాడానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని చెప్పడం గమనార్హం -
ఒలింపిక్ సంఘం చైర్మన్గా మంత్రి జగదీష్ రెడ్డి
-
శభాష్ జగదీశ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్లోని మారియెట్ హోటల్లో ప్రారంభమైన రెండు రోజుల్లో కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరెంట్ కోతల గురించి ప్రస్తావించారు. గతంలో ఎండాకాలంలో కోతలుండేవని, ప్రస్తుతం విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో సంబంధింత శాఖ మంత్రి, విద్యుత్శాఖాధికారులు కలిసి కృషి చేశారని ప్రశంసించారు. భూసేకరణలోనూ.. దామరచర్లలో నిర్మించతలపెట్టిన 7800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని కూడా కేసీఆర్ అభినందించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంతోపాటు అటవీ భూములకు పరిహారం చెల్లించడంలో పాత కలెక్టర్ చిరంజీవులు, కొత్త కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణలు ఎంతో శ్రమించారని, వారికి ప్రత్యేకంగా అభినందులు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సలో అటు జిల్లా మంత్రికి, ఇటు జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ నుంచి అభినందనలు అందడం విశేషం. -
అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు
సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలు, వ్యాపారులు కాం గ్రెస్ పీడ వదిలించేందుకే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే శాంతివంతమైన వాతావరణంలో పరిసాలన కొనసాగిస్తున్నానన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరకుపోయి శిక్షలు పడిన దాఖలాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించే ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుకుంటూ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి వెలుగు వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలైతే తమకు రాజకీయం లేకుండా పోతుందనే అక్కసుతో ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై దుయ్యబట్టారు. తాను అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోర్టుకు హాజరు కాలేదని, ఒక సాధారణ వ్యక్తిగా తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఉద్యమ నాయకులను అరెస్టు చేసిన చరిత్ర మీదన్నారు. సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా పాలన అందిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర వేశాలు ఇకనైనా మానేయాలని హెచ్చరించారు. నేరస్తులకు తప్పకుండా శిక్ష పడుతుందని, తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ఉద్యమం, కేసీఆర్ ఉద్యమానికి భయపడే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మంత్రిపై చౌకబారు ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఒక్క ఆధారం కూడా చూపలేదు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ గుత్తాసుఖేందర్రెడ్డి అవినీతికిసంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీపీ వట్టె జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవిచారణ కోసం మంత్రి పదవినుంచి తొలగించాలి
సూర్యాపేట : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్రెడ్డిపై న్యాయ విచారణ కోసం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కరీనంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్చేశారు. గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతి రహిత పరిపాలన అందించడానికి హిట్లర్ను అని చెప్పిన సీఎం ఎలాంటి ఆరోపణలు రాకపోయినా దళితుడైన రాజయ్యను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 28న లోకాయుక్త విచారణకు హాజరై ఆధారాలను చూపించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి తన పది నెలల కాలంలో ప్రజా వ్యతిరేకిగా ముద్రపడడం వల్లనే సూర్యాపేటలో కరపత్రాలు వెలువడడం, ల్యాండ్ మాఫియా, అవినీతి పరులకు అండగా నిలుస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీష్రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఎందుకు న్యాయ విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో సబ్సిడీపై 129 ట్రాక్టర్లు రైతులకు అందించగా.. అందులో అధికార పార్టీకి చెందిన 94 మందికి ట్రాక్టర్లు ఇచ్చారని తెలిపారు. దీనిపై సీఎం, విజిలెన్స్కు లేఖలు రాసినా కూడా ఏ మాత్రం స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. తక్కువ ధర కలిగిన నాసిరకమైన ట్రాక్టర్లు తెచ్చి వాటికి రూ. 9 లక్షల ధరలుగా నిర్ణయించి రైతులకు అంటగడ్డం ఎంతవరకు సమంజసమన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఆంధ్రాకు చెందిన వారికి ఏ విధంగా కాంట్రాక్టర్లు ఇచ్చారని సీఎంను ప్రశ్నించారు. పొన్నంపై వేసిన పరువు నష్టం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రికి హితవుపలికారు. పొన్నంకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మంత్రి జగదీష్రెడ్డి చేసిన అవినీతిని నిరూపించడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ కోర్టుకు హాజరు కానున్న పొన్నం ప్రభాకర్కు పార్టీ పరంగా శాంతియుతంగా ఆహ్వానం పలికేందుకు ముందుగానే పోలీసులను అనుమతి కోరగా.. అనుమతులు ఇవ్వకుండా రాజకీయం చేయడం న్యాయమాఅని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, తూముల భుజంగరావు, తండు శ్రీనివాసయాదవ్, చకిలం రాజేశ్వరరావు, గోపగాని వెంకటనారాయణగౌడ్, రవిబాబు, అబ్దుల్హ్రీం, బైరు వెంకన్నగౌడ్, అమ్జద్షాహీన్బేగం, షేక్ బాషా, అంగిరేకుల నాగార్జున, అయూబ్ఖాన్, అబూబకర్సిద్దీఖ్, నగిరె పిచ్చమ్మ, మంజుల, సువర్ణ, అన్నపూర్ణ, కిషోర్బాబు, మధు తదితరులు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో ‘ మంత్రిగారు చదివిన’ బడి
నల్లగొండ(అర్వపలి):మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం విద్యుత్శాఖ మంత్రిగా చేస్తున్న గుంటకండ్ల జగదీష్రెడ్డి స్వగ్రామం నాగారంలో ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత భవనం కాలం తీరిపోయి పూర్తిగా శిధిలమై ఏక్షణంలోనైనా కూలే దశకు చేరింది. అయితే ఈభవనంనకు కాలంతీరి పోవడంతో పక్కనేకొత్త భవనాన్ని నిర్మించారు. అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈశిధిలమైన గదులను వెంటనే తొలగించాల్సి ఉండగా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో పిల్లలు క్షణమో యుగంగా గడుపుతున్నారు. గత ఏడాది విద్యాశాఖ మంత్రి హోదాలో తాను చిన్ననాడు చదువుకున్న పాఠశాలలో జగదీష్రెడ్డి సందర్శించారు. శిధిలమైన భవనాన్ని చూశారు. ఈభవనాన్ని వెంటనే తొలగించి వేయాలని ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని కూడా ఆయనకు ఇచ్చారు. జడ్పీ లేదా మరే పథకంలోనైనా నిధులు మంజూరు చేయించి పాడుబడిన భవనాన్ని తొలగించి వేయిస్తానని హామీ ఇచ్చినా ఇంత వరకు తీరలేదు. ఈభవనం సమీపం నుంచి పాఠశాలకు పిల్లలు నడిచి వస్తారు. భవనం కూలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది
నకిరేకల్ : ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేకపోయిన ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేహక్కు లేదని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానిక నారాయణ రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రిఏర్పాటు చేసి న నియోజకవర్గ ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. తొమ్మిది నెలల తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నచ్చిందోలేదో అనే అంశాన్ని తెలుసుకోవడానికే ఈ ఓటు రూపేనా మీ ముందుకు వస్తున్నామన్నారు. మేధావులైన పట్టభద్రులంతా ఆలోచించి తమ ప్రభుత్వానికి అండగా నిలవాలనికోరారు. ప్రజల హక్కుల కోసం మాట్లాడని వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మరోవైపు తెలంగాణకు ద్రోహం చేస్తున్న టీడీపీతో బరిలో దిగిన బీజేపీకి ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కమ్యూనిస్టులకు కూడా ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పోరాటాల చరిత్ర గల ఈ ప్రాంతంలోని పట్టభద్రులంతా తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలు టీఆర్ఎస్లోకి వలస బాటపట్టాయన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్,ఎమ్మెల్సీ పూల రవీందర్, డాక్టర్ జేఏసీ జిల్లా కన్వీనర్ రాపోలు రఘునందర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అద్యక్షుడు యానాల పాపిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, టీఆర్ఎస్ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్, ప్రైవేట్ పీఈటీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్, బాణాల రాంరెడ్డి, మారుపాక నర్సయ్య, గూడూరి సుధాకర్రెడ్డి, బొబ్బలి శేఖర్రెడ్డి, పోతుల మల్లయ్య, తాటికొండ కృష్ణరెడ్డి, నర్సయ్య, మాదగోని సైదులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు అండగా నిలవాలి
కోదాడటౌన్ : తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాది తెచ్చింది టీఆర్ఎస్ మాత్రమేనని, రాష్ట్రాని పాలించేది కూడా టీఆర్ఎస్ మాత్రమేనని, ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ మాత్రమే విజయం సాధించే విధంగా తెలంగాణ వాదులు తీర్పునివ్వాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి కోదాడలోని డేగబాబు ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వాటికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కంరెంట్ విషయంలో చంద్రబాబు కరీంనగర్కు వచ్చి పచ్చిఅబద్దాలు చెప్పినా టీడీపీ నాయకులు నోరు మొదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ తొలి రోజు కాంగ్రెస్, టీడీపీలు చేసిన పని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారిని ఈసడించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వరరెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందని, వస్తున్న రిపోర్టుల ప్రకారం 70 శాతం ఓట్లు రాజేశ్వరరెడ్డికి వస్తాయన్నారు. దానిని 80 శాతానికి పెంచాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియమాకాల కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో పట్టభద్రులు చూపిన తెగువ మరువలేనిదని, కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా విద్యావంతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు కోదాడ పట్టణంలో రంగా థియేటర్ నుంచి డేగబాబు ఫంక్షన్హాల్ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జీ కె.శశిధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గింజల రమణారెడ్డి ఆహూతులను ఆహ్వానించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, వేనేపల్లి చందర్రావు, దామోదరరెడ్డి, రావెళ్ల సీతరామయ్య, నాగేంద్రబాబు, డేగరాణి , వసంతమ్మ, ఝాన్సీ,డేగబాబు, గరిణె కోటేశ్వరరావు, కందాళ పాపిరెడ్డి, రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, పల్లా ప్రవీణ్రెడ్డి, పుల్లయ్య, చిలక రమేష్, గట్ల నర్శింహారావు, తుపాకుల భాస్కర్, కుక్కడపు బాబు, వెంకటనారాయణ, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పొన్నంపై చర్య తీసుకోవాలి'
- న్యాయమూర్తి ఎదుట మంత్రి జగదీశ్రెడ్డి వాంగ్మూలం నకిరేకల్: అసత్య ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగం కలిగించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి న్యాయమూర్తిని కోరారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిఫ్కోర్టులో న్యాయమూర్తి డి.కిరణ్కుమార్ ఎదు ట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పొన్నంపై గురువారం సూర్యాపేట కోర్టులో కేసు దాఖలు చేశానని, సూర్యాపేట న్యాయమూర్తి కూడా నకిరేకల్ కోర్టుకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నందున ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. -
కోర్టుకు హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ (నకిరేకల్): తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం సాయంత్రం నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించినందున అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి గురువారం సూర్యాపేట కోర్టులో కేసు వేశారు. శుక్రవారం సూర్యాపేట కోర్టులో జడ్జి లేకపోవడంతో దానికి సంబంధించిన వాగ్మూలం ఇవ్వడానికి నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. -
గెలుపే లక్ష్యం
•మంత్రి జగదీష్రెడ్డి దిశానిర్దేశం •జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులతో సమావేశం •ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్తో పాటు అందరూ హాజరు •నక్కలగండిని కాంగ్రెస్ నేతలు వద్దన్నారనివ్యాఖ్య నల్లగొండ రూరల్ : త్వరలోనే జరగబోయే రెండు శాసన మండలి స్థానాలను గెలుచుకోవడం ద్వారా జిల్లాపై పట్టు నిరూపించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ తహత హలాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రులతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కూడా కైవసం చేసుకోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు పనిచేయాలని, రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉందని నిరూపించాలని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ నేత లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ఏచూరి గార్డెన్లో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు సహా సుమారు 450 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబ్బుతో ప్రజాప్రతినిధులను, ఓటర్లను కొనుగోలు చేస్తామన్న నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఓటర్లను డబ్బుతో కొంటామనే అహంకారంతో మాట్లాడే నాయకులకు భువనగిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇదే ఫలితాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాలని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డినుద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. సీఎంతోను, మంత్రులతో సంబంధాలున్నాయని తప్పుడు ప్రచారం చేసే నాయకులను తిప్పికొట్టాలని కోరారు. కొందరు కాంగ్రెస్ నాయకులు నక్కలగండిని వద్దని తనకు చెప్పారన్నారు. పట్టుదలతో కలిసి పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగిద్దామన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ సమష్టిగా పనిచేసి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజదుందుభి మోగించాలన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్సీలను గెలుపించుకోవాలన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతు భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు బహుమానంగా ఇవ్వాలన్నారు. పార్లమెంటరి కార్యదర్శి గాదరి కిషోర్ మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా గౌరవం దక్కాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు జిల్లా అభివృద్ధి కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు డబ్బు అహంకారానికి, అభివృద్ధికి జరుగుతున్న పోటీగా భావించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, పార్టీ నేతలు కాసోజు నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, శశిధర్రెడ్డి, శంకరమ్మ, చాడా కిషన్రెడ్డి, చకిలం అనిల్కుమార్, బోయపల్లి కృష్ణారెడ్డి, పవళిక, బక్క పిచ్చయ్య, బుర్రి శ్రీనివాస్రెడ్డి, రేగట్టే మల్లిఖార్జున్రెడ్డి, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కారు... జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికలకు ముందు అంతంత మాత్రమే.. ఒకటో, రెండో ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు అనుకున్నారు... కానీ అనూహ్యంగా మారిన సమీకరణల నేపథ్యంలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో జయకేతనం... అదే ఊపులో రాష్ట్రంలో అధికారం.. మంత్రి వర్గంలో స్థానం ...ఇంకేముంది ఆ పార్టీ ముఖచిత్రమే మారిపోయింది... జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సంస్థాగతంగా బలపడుతోంది... వార్డుసభ్యుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తుండడంతో ఇప్పుడు జిల్లా రాజకీయ ముఖచిత్రంలో టీఆర్ఎస్ కేంద్రబిందువుగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా, ఆ తర్వాత టీడీపీకి పటిష్టమైన పునాదిగా ఉన్న జిల్లాలో ఇప్పుడు గులాబీ పార్టీ వేనూళ్లుకుంటోంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ జిల్లా రాజకీయాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవిస్తోంది. అందరి దారి అటువైపే... టీఆర్ఎస్ జిల్లాలో సంస్థాగతంగా బలపడుతుందనేందుకు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల సంఖ్యే నిదర్శనంగా నిలుస్తోంది. ఐదు నెలల కాలంలో 1100 మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరడం గమనార్హం. గ్రామపంచాయతీ వార్డు సభ్యుల నుంచి పెద్దలసభలో సభ్యులైన ఎమ్మెల్సీల వరకు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరిన ముఖ్యుల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, రేపాల శ్రీనివాస్, రుద్రమదేవి, ఇతర పార్టీలకు చెందిన చింతల వెంకటేశ్వరరెడ్డి, రేగట్టె మల్లిఖార్జునరెడ్డి లాంటి ముఖ్య నేతలున్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో 215 మంది సర్పంచ్లు, 120కిపైగా ఎంపీటీసీ సభ్యులు, 800 మంది వార్డు సభ్యులు, 30 మందికిపైగా కౌన్సిలర్లు, నలుగురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డెరైక్టర్లు ఉన్నారు. వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అంతకు ముందు పార్టీకి ఉన్న కొద్దో గొప్పో బలానికి తోడు వలసలు, అధికారం కూడా రావడంతో ఇప్పుడు జిల్లాలో కారు జోరు నడుస్తుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘మంత్ర’దండం అండగా.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో పునాదులున్నా బలమైన శక్తిగా ఎప్పుడూ నిరూపించుకోలేకపోయింది. 2004లో ఆలేరులో మాత్రమే గెలిచిన టీఆర్ఎస్, 2009 ఎన్నికల నాటి జిల్లా నుంచి టీఆర్ఎస్కు ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. ఆ పార్టీ 2014 ఎన్నికలలో మాత్రం అనూహ్యంగా ఆరుస్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అధికారంలోనికి రాగా, తొలి మంత్రివర్గంలోనే జిల్లాకు బెర్తు దక్కింది. సూర్యాపేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ సన్నిహితుడు జి. జగదీష్రెడ్డి కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలు గెలవడం, ఊహించినట్టుగానే మంత్రిపదవి రావడంతో జిల్లా టీఆర్ఎస్కు కొండంత బలం వచ్చినట్టయింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగదీష్రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీని గులాబీపరం చేసిన ఆయన తన నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే దాదాపు 250 మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ గూటికి చే రడం గమనార్హం. అన్ని పార్టీలనుంచి... జిల్లాలో అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జరుగుతుండగా, టీడీపీ నుంచి మాత్రం కొంచెం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ మున్సిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్లోనికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది టీడీపీ నుంచే ఉండడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి రావడం, టీడీపీలో ఉన్న గ్రూపు తగాదాలు లాంటి పరిణామాలు ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలను ప్రోత్సహించే అవకాశాలు లేకపోలేదు. ఇక, మిగిలిన పార్టీలపై కూడా టీఆర్ఎస్ నేతలు దృష్టి సారిస్తుండడంతో అన్ని పార్టీల నాయకులు తమ కేడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మొత్తంమీద సార్వత్రిక ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని స్థానిక సంస్థల్లో పార్టీల బలాబలాలు మారుతుండడం, టీఆర్ఎస్ నానాటికీ బలోపేతం అవుతుండడం ఇటీవలి కాలంలో జరుగుతున్న ముఖ్య పరిణామమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
జీవితానికి ‘ఆసరా’
నల్లగొండ రూరల్ : ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పింఛన్ వృద్ధులకు భరోసా, భద్రత కల్పించినట్లవుతుందని విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. స్థానిక చిన వెంకటరెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పలువురు వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృద్ధులు పింఛను డబ్బులతో సొంత అవసరాలతోపాటు మనవళ్లకు పెన్నులు, పెన్సిళ్లు కొనియవచ్చని తెలిపారు. దీంతో వారి కుటుంబ బంధం ధృడమవుతుందన్నారు. 2004కు ముందు రూ.70 కోట్లతో రూ.70 పింఛన్ ఇస్తే, నేడు తెలంగాణ ప్రభుత్వం రూ.4వేల కోట్లతో పింఛన్లు అందజేస్తోందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలను నెలవారీగా అందజేస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలలకు 65 సంవత్సరాల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకుంటే పింఛను మంజూరు చేస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కాకతీయ కాలంలో కళకళలాడిన చెరువులను ఆంధ్రా పాలకులు ఆక్రమించారని ఆరోపించారు. రూ.2వేల కోట్లతో 45వేల చెరువుల్లో పూడిక తీసి అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులై ఉండి పింఛన్ రానివారు ఆందోళన చెందవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని తెలిపారు. రూ.15వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఆహారభద్రత కార్డులను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి 6కిలోల బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలి పారు. దీనివల్ల రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఆంధ్ర పాలకుల ద్రోహం వల్ల విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు స్పష్టం చేశారని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ఆసరా పథకం పేదలందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. గతంలో పింఛన్ పొందడానికి ఒకరు చనిపోతే తప్ప మరొకరికి వచ్చేది కాదని, 2004 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి రూ.200 రూపాయల ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.1000 అందజేయడం అభినందనీయమన్నారు. ఎప్పుడు అర్హత వస్తే అప్పుడు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ ఆసరా పథకం వల్ల రాష్ట్రంలో భిక్షాటన చేసేవారే లేకుండా అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 5లక్షల 50వేల పింఛను దరఖాస్తులు వచ్చాయని, 3లక్షల 30వేల దరఖాస్తులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. గతం కంటే 40వేలు తగ్గాయని పేర్కొన్నారు. అనర్హులు కూడా రూ.200 రూపాయల పెన్షన్ తీసుకోవడం వల్ల ఈ తేడా ఉందన్నారు. అర్హుల జాబితాను రెండు రోజుల్లో డాటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. శుక్రవారం వరకు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ వృద్ధులను ఆదుకునేందుకు కేసీఆర్ వెయ్యి రూపాయల పింఛను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని అన్నారు. మొదటగా రూ.వెయ్యి పెన్షన్ అందుకున్న కంచనపల్లికి చెందిన మంద ఎల్లయ్య, నర్సింహ, ధనమ్మలు వారి అనుభూతిని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, ఏజేసి వెంకట్రావు, ఎంపీపీ దైద రజితా వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల రాధ, ఆర్డీఓ జహీర్, తహసీల్దార్ వై.అశోక్రెడ్డి, ఎంపీడీఓ శైలజ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్రెడ్డి, కౌన్సిలర్ హారికాఅశోక్, అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల కొలువు
డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సంకాంత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయొచ్చన్న విద్యాశాఖ మంత్రి ప్రకటన ఆశలు రేపింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. నల్లగొండ అర్బన్ : ‘‘రేషనలైజేషన్ పూర్తి చేసి సంక్రాంతి తర్వాత డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వచ్చే విద్యాసంవత్సరం నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తాం’’ - విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి రేషనలైజేషన్ తర్వాత టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే తప్ప భర్తీ ప్రక్రియ ప్రశ్నార్థకం కాగలదనే విశ్లేషణలతో డీలాపడ్డ నిరుద్యోగులకు విద్యాశాఖమంత్రి ప్రకటనతో ఒకింత ఆశలను పదిలం చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కెరీర్ ప్రారంభించడానికి వీలు కల్పించే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ కోసం జిల్లాలో ఉద్యోగార్థులు ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారు. 2012 ఆగస్టులో జరిగిన డీఎస్సీ తర్వాత రెండున్నరేళ్లుగా అదిగో, ఇదిగో నోటిఫికేషన్ విడుదల అంటూ దోబూచులాడటం తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వెలువడవచ్చునని సమాచారంతో ఆశలు చిగురించాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కోచింగ్ సెంటర్లు సైతం కొత్త బ్యాచ్లను ప్రారంభించాయి. మినీ సివిల్స్గా భావించే డీఎస్సీ పరీక్షకు వేలల్లో పోటీ ఉండే అవకాశం ఉంది. జిల్లాలో 1,530 పోస్టులు ఖాళీ... జిల్లా విద్యాశాఖ వారి వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2014 అక్టోబర్ 25వ తేదీ వరకు జిల్లాలో 1,530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు కూడా ఉన్నాయి. అయితే వచ్చే 2015 జూన్ వరకు ఏర్పడే ఖాళీలను కూడా కలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి ప్రకటించడాన్ని బట్టి ఖాళీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఎస్జీటీ-1193, లాంగ్వేజ్ పండిట్లు హిందీ-35, ఉర్దూ-02, పీఈటీ - 34 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 305 పోస్టులు ఖాళీ ... స్కూల్ అసిస్టెంట్లు 305 ఖాళీలుండగా 70 శాతం నేరుగా (213 పోస్టులు), 30 శాతం (92 పోస్టులు) పదోన్నతిపై భర్తీ చేయనున్నారు. బయోసైన్స్ - 30, ఇంగ్లీష్ - 14, హిందీ - 13, తెలుగు - 22, మ్యాథ్స్ - 31, ఫిజికల్ సైన్స్ -12, సోషల్ -91 ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయవచ్చు. ఇవి కాకుండా క్రాఫ్ట్ఇన్స్ట్రక్టర్లు - 53, మ్యూజిక్ - 03, డ్రాయింగ్ మాస్టర్లు - 21 ఖాళీలున్నా వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ‘టెట్’పై రాని స్పష్టత... ఈసారి టెట్, డీఎస్సీలకు కలిపే పరీక్ష నిర్వహిస్తారా...? లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 2012 డీఎస్సీలో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులను ‘టెట్’ మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో నేరుగా 100 మార్కులకు డీఎస్సీ నిర్వహించవచ్చునని భావిస్తున్నారు. -
పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలి
నల్లగొండ క్రైం : తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా హెడ్క్వార్టర్స్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ఒత్తిడికి గురికావద్దని సూచిం చారు. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ అమర పోలీసులను స్మరించుకుని విధి నిర్వహణలో పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఉండే సమాజంలో పోలీస్వృత్తి కష్టసాధ్యమైందన్నారు. నేరస్తుల ను కఠినంగా శిక్షించాలని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసే గుణం ఒక్క పోలీసులకే ఉంటుందన్నా రు. పోలీసులుంటే మానవ శరీరంలో మరో గుండెకాయ అని ప్రశంసించారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు రక్షణ విషయంలో కుటుంబ సభ్యుల కంటే పోలీ సుల వారితోనే ఎక్కువ సమయం గడుపుతున్నామన్నారు. ప్రజాస్వామయ్య పరిరక్షణకు పోలీసులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అమరుల కుటుంబాల సమస్యలను, పోలీసుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మెరుగైన ఆరో గ్య భద్రత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్పీ టి.ప్రభాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 321, జిల్లాలో 25 మంది అమరులైనారని తెలిపారు. వారి కుటుంబాలకు బస్పాస్ సౌకర్యం, ఇంటిస్థలం అందజేస్తామన్నారు. పోలీ సులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ప్రజల భద్రతకు నిత్యం రక్షణగా ఉండేది పోలీసులేనన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అమరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు అమరుల స్థూపం వద్ద నివాళులర్పించా రు. అమరవీరుల వారోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీ ల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీ ప్రీతి మీనా, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఏజేసీ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు వీరేశం, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఏఎస్పీ రామరాజేశ్వరి, ఓఎస్డీ రాధకిషన్రావు, డీఎస్పీ రాంమోహన్రావు, సురేష్రెడ్డి, ఆర్డీఓ జహీర్ పాల్గొన్నారు. బెటాలియన్లో.... అమలరవీరుల దినోత్సవం సందర్భంగా అన్నెపర్తి బెటాలియన్లో అమరవీరుల స్థూపం వద్ద ప్రజాప్రతినిధులు, బెటాలియన్ కమాండెంట్ ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు వారు పోలీసుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే లు గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. బెటాలియన్ కమాం డెంట్ ఎస్ఎన్బీఎస్ బాబూజీరావు, అసిస్టెంట్ కమాండెంట్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది దొంగచూపు
‘‘కేసీఆర్ పాలన సజావుగా సాగనివ్వకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడు. ఈ ఆంధ్రాబాబు వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు.. ఆయనది ముందుచూపు కాదు.. దొంగచూపు. చీమూ, నెత్తురు ఉంటే టీడీపీ నేతలు ఆ పార్టీ విడిచి బయటికి రావాలి.’’ మంత్రి జగదీష్రెడ్డి బీబీనగర్ :ఆంధ్రా సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నదని, ఆయనది ముందుచాపు కాదు.. దొంగ చూపని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. బీబీనగర్లో శుక్రవారం జరి గిన బహిరంగ సభలో మంత్రి సమక్షం లో స్థానిక ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల పనితీరు వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, వాటిని చక్కదిద్దడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్రాపాలకుల జెండాలను పట్టుకొని తిరగుతున్న కాంగ్రెస్, టీడీపీ దద్దమ్మ లు అత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బస్సుయాత్రల పేరుతో తిరుగుతున్న టీడీపీ నాయకులను చీపురుకటక్టలతో తరిమి కొట్టాలని, అసమర్థ పాలన సాగించిన సన్నాసులు జానారెడ్డి, పొన్నాలను నిలదీయాలన్నారు. ఆంధ్రా జెండాలను పాతరేసి రాష్ట్రలోని ప్రతి గ్రామా న్ని గులాబీమయంగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన సజావుగా సాగనివ్వకుం డా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని, ఇప్పటికైనా తెలంగాణలోని టీడీపీ నేతలు పార్టీని వీడాలన్నారు. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిదేందుకు కేసీఆర్ పని చేస్తున్నాడన్నారు. లక్ష మంది దళితులకు 5సంవత్సరాల్లో భూపంపిణీ చేస్తామన్నారు. 20వేల కోట్ల రుణాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పింఛన్లను దోసుకున్న దొంగలు కాంగ్రెస్ నాయకులని ఘాటుగా విమర్శించారు. సాగునీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యా యం చేసిన పొన్నాల గోచీ పీకే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీబీనగర్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శేఖర్రెడ్డి మా ట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు., ఆంధ్రా పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మె ల్యే ప్రభాకర్రెడ్డి, నాయకులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అమరేందర్, సుధాకర్, వెంకటకిషన్, నరేందర్, ప్రభాకర్, రవికుమార్రెడ్డి పాల్గొన్నారు. -
నేడు జిల్లాలో మంత్రి జగదీష్రెడ్డి పర్యటన
రాంనగర్ : రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి.చిరంజీవులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో దక్షిణమధ్య రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం 12 గంటలకు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని 4.30 గంటలకు దేవరకొండలో జరిగే వివిధఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. రాత్రి 7 గంటలకు సూ ర్యాపేటకు చేరుకుని అక్కడే బస చేస్తారని తెలిపారు.