Opposition
-
ప్రజాప్రతినిధులు లేని పాలన ఇంకెన్నాళ్లు?
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కు గత మూడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండానే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిపాలన కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజకీయ పరిణామాల రీత్యా...వాయిదా 2022, మార్చి 7న మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి. గత మూడేళ్లలో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన బాధ్యతలను మొదట ఇక్బాల్ సింగ్ చాహల్ ఆ తరువాత భూషణ్ గగ్రానీ స్వీకరించారు. ఈ మూడేళ్లలో వీరిద్దరూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా మూడు బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా నగరానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా మూడేళ్ల వ్యవధిలో రూ.6,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నలిచ్చారు. ముఖ్యంగా రోడ్లు, మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ప్రాజెక్టులు, దహిసర్–భయందర్ లింక్ రోడ్డులకు అనుమతులు మంజూరుచేశారు. ప్రభుత్వ అప్పుల పెరుగుదల.... 2024–25 ఆరి్థక సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ.1.90 లక్షల కోట్లుగా తేలింది. తాజా లెక్కల ప్రకారం, ఈ సంఖ్య రూ.2,32 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో, బడ్జెట్ వ్యయంపై బహిరంగ చర్చ జరగలేదు. కమిషనర్లు పరిపాలించడమేమిటి? కమిషనర్ల ఆధ్వర్యంలో బీఎంసీ పరిపాలన జరగడమేమిటంటూ విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు లేని పాలన ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు అమల వుతున్నాయని ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత లేదని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని మండిపడుతున్నాయి. మరో 6–7 నెలల తర్వాతే! ప్రస్తుత పరిస్థితి దృష్యా ఎన్నికలు మరో 6-7 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 1984లో అప్పటి కమిషనర్ డి.ఎం.సుక్తాంకర్ కార్యనిర్వాహక పాలన తర్వాత మళ్లీ 38 ఏళ్లకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా పాలన జరుగుతోంది. అయితే ఈసారి ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహించాలని పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన రూలింగ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్ ఆఫ్ ద హౌజ్కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్ అన్నారు. జనసేన ఉండగా.. వైఎస్సార్సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
ట్రంప్పై అదే వ్యతిరేకత
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్ఎస్ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్లైన్లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. -
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ఆ హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం! -
ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..
ఢిల్లీ: ఆప్నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. -
రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్
బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: గులాబ్జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు -
ధన్ఖడ్పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్ఖడ్పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం లాభం?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంపై స్పందించారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం కాబట్టి మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో మాకు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం. అందుకే ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.‘‘అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొస్తాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ.. ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను’’ అని అన్నారాయన. -
స్పెయిన్కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్లో ఉంటున్నారు. – కారకాస్ -
ల్యాటరల్ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలలో ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది.ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ నిర్ణయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని యూపీఎస్సీ ఛైర్మన్కు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా గతవారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో ‘ల్యాటరల్ ఎంట్రీ’ద్వారా నియమాకాల కోసం ప్రతిభావంతులైన భారతీయులు కావాలంటూ యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంత్రిత్వ శాఖలలో 45 పోస్టులు ఉన్నాయి. వీటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్ ఎంట్రీ’అంటారు. మూడేళ్లు, అయిదేళ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని ప్రధానిగా మోదీ తొలి హయాంలో 2018లో అమలు చేశారు.ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ ఈ పద్దతిని తప్పుపట్టారు. దానిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాజ్వాదీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. -
అదానీ–సెబీ చైర్పర్సన్ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. విపక్షాల కుట్ర: బీజేపీ దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది. -
మణిపూర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలకు మోదీ చురకలు
న్యూఢిల్లీ: నీట్ వివాదం, మణిపూర్ హింసపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రం తరపున ఆయన సమాధానమిచ్చారు.మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మణిపూర్లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. మణిపూర్లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.‘మణిపూర్లో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను ప్రస్తావిస్తూ.. మణిపూర్ చరిత్ర తెలిసిన వారికి మణిపూర్లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ సామాజిక సంఘర్షణ మూలం చాలా లోతైనదని ఎవరూ కాదనలేరు. ఇంత చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు మర్చిపోకూడదు.ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. అక్కడి ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారు’. అని పేర్కొన్నారు. -
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
న్యూ లుక్లో రాహుల్.. పీక్లో 20 ఏళ్ల పొలిటికల్ కెరియర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్ప్రెషన్స్లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు. -
‘లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీనే ఎన్నుకోవాలి’
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్గా కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.కాగా, గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీనే లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్ గాంధీ ఉండాలని తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానంలో గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘ నా పార్లమెంట్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పేరు మీదనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాను. నాకు తెలిసి లోక్సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్షనేత ఉండాలి. ఎన్నికైన ఎంపీలందరిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ’’ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా సైతం లోక్సభలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని తలిపారు. ‘‘లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు. లోక్సభలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రాహుల్ గాంధీ తన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ పెద్దలు, ఎంపీలు తీసుకుంటారు. కానీ ఏకగ్రీవంగా ఉన్న ఒకే ఒక అవకాశం.. రాహుల్ గాంధీనే’’ అని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. నా వ్యక్తిగతంగా.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటే అది సరైన నిర్ణయంగా భావిస్తానని అన్నారు. ఇక 2019లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకావటంతో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. -
అటు అధికారం.. ఇటు విపక్ష హోదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్కళ్యాణ్ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్గా ఎలా సాధ్యమో చూడాలంటూ వ్యాఖ్యానించారు.బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన జనసేన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఓటును బాధ్యతగా భావించి జవాబుదారీతనంతో పని చేయాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ సందర్భంగా పవన్ సూచించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కీ లభించని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారన్నారు. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.రూపాయి జీతం మాటలు చెప్పను.. కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతా. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా దానికి వెయ్యి రెట్లు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తా. యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయి. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
2024 లోక్సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్పోర్ట్లను జప్తు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.ఉత్తరప్రదేశ్లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్కు కనీసం 50 సీట్లు కూడా రావు
ఫూల్బాణీ/బోలాంగిర్/బార్గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్లోని ఫూల్బాణీ, బోలాంగిర్, బార్గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు. సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్కు చేతకావట్లేదు. అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.పాండియన్పై విసుర్లు తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్సోర్సింగ్కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా? ‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్వే
ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్నాథ్సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ప్రతిపక్షాలవి నక్కజిత్తుల రాజకీయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. పంచుతున్నాడంటున్నారే గానీ.. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్మోహన్రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్కు చెడు తలపెట్టాలని కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం జగన్ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం. – భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్ పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఈరోజు లోక్సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
లోక్సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితువు పలికారు. 'ఇది తీవ్రమైన సంఘటన. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. సహజంగానే లోపం జరిగింది. పార్లమెంట్ భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉంటుందని అందరికీ తెలుసు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు స్పీకర్ లేఖ కూడా రాశారు. మేము విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదికను త్వరలో స్పీకర్కు పంపుతాం.' అని అమిత్ షా చెప్పారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు పార్లమెంట్ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ భద్రతలో లోపాలు ఉండకూడదని పేర్కొన్న అమిత్ షా.. ఆ ఖాళీలను పూడ్చడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ అంశంగా మార్చవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి.. -
ఇండియా కూటమి భేటి మళ్లీ వాయిదా
ఢిల్లీ: ఇండియా కూటమి భేటీ మళ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 17న నిర్ణయించిన సమావేశాన్ని డిసెంబర్ 19కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బయటకు వెళ్లడించలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చింది. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు రాలేమని స్పష్టం చేశారు. దీంతో సమావేశాన్ని డిసెంబర్ 17కి వాయిదా వేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీల పొత్తుతో భాగస్వామిగా బీహార్, జార్ఖండ్లలో అధికారంలో ఉంది. దేశం మొత్తంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంది. బీజేపీని గద్దే దించే ధ్యేయంతో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరు, ముంబయితో కలిపి ఇప్పటికి మూడు సమావేశాలు జరిగాయి. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
‘ఇండియా’ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున బుధవారం జరగాల్సిన భేటీకి రాలేకపో తున్నట్లు కూటమిలోని కొన్ని పార్టీల నేతలు అశక్తత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో బుధవారం సాయంత్రం తలపెట్టిన సమావేశం మాత్రం కొనసాగనుంది. కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారంలో అందరికీ అనుకూలమైన తేదీలో జరగనుందని ‘ఇండియా’ ప్రచార కమిటీ సభ్యుడు గుర్దీప్ సప్పాల్ తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం జరగాల్సిన భేటీకి తాము రాలేకపోతున్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బిహార్ సీఎం, జేడీయూ నితీశ్ కుమార్ అనారోగ్య కారణాలతో, తమిళనాడు సీఎం స్టాలిన్ తమ రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారని సప్పాల్ వివరించారు. -
Rajasthan Elections 2023: ఫేక్ అని మహిళలను అవమానిస్తారా?
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని ఆరోపించారు. రాజస్థాన్లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్ను నంబర్ వన్గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్వేర్తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి’ -
నితీష్ కుమార్ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్కు చేరిన రెండు విమానాలు -
తెలంగాణలో కరువు, కర్ఫ్యూ లేదు
హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): బీఆర్ఎస్ పాలనలో కరువు, కర్ఫ్యూ అనే మాటే ఎప్పుడూ రాలేదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఒకప్పుడు తిండిలేని తెలంగాణ ఈరోజు దక్షిణాది ధాన్య భాండాగారంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న బీఆర్ఎస్ మేనిఫేస్టోను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారని, ఆ మేనిఫేస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిశంబర్ 3న ఫలితాలు కలిసోచ్చే 3 అనే సంఖ్య రావడంతో బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 3వ సారి గెలిచి హ్యా ట్రిక్ సాధించడం ఖాయమన్నారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్... మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మత కల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ... మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటోందని మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గ్లోబల్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణలో గెలవాలని ఆ పార్టీ చూ స్తోందని దుయ్యబట్టారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ చేస్తోందని మండిపడ్డారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)తో పొత్తు పొట్టుకొని అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని, పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసిందని ఆరోపించారు. మూడు గంటల కరెంట్ రైతులకు చాలన్న కాంగ్రెస్ మంచిదా, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ మంచిదా, మూడు పంటలకు సరిపడా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ మంచోడా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని హరీశ్రావు కోరారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తే అందరూ సంతోషిస్తారని, కానీ ప్రతిపక్షాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీశ్కుమార్ తదితరులు ఉన్నారు. హుస్నాబాద్లో కేసీఆర్కు తొలి ‘ఆశీర్వాదం’ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావానికి మరోసారి హుస్నాబాద్ వేదిక కాబోతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల 15న నిర్వహించే కేసీఆర్ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీశ్కుమార్లతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు ఈశాన్యంలో ఉండే హుస్నాబాద్ను కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తారన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. -
అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన తప్పదా?
వాషింగ్టన్: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది. రిపబ్లికన్ల డిమాండ్ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. అదే జరిగితే 20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు. -
ప్రతిపక్షం పలాయనం
సాక్షి, అమరావతి: తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడానికి అధికార పక్షానికి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షానికి శాసనసభ సమావేశాలు సరైన వేదిక. అధికార పక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ శాసనసభ సమావేశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. చంద్రబాబు చేసిన అక్రమాలతో ఆత్మరక్షణలో పడ్డ ప్రతిపక్షం పలాయనం చిత్తగించి అభాసుపాలైంది. గత 52 నెలల్లో సంక్షేమ, అభివృద్ధి, పథకాల ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంలో అధికార పక్షం విజయవంతమైంది. స్కిల్ స్కామ్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడంపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలిసేలా గళమెత్తుతామని బీరాలు పలికిన ప్రతిపక్ష సభ్యులు చిల్లర చేష్టలు, వెకిలి వేషాలు, అసభ్య సైగలు చేస్తూ లేకి ప్రవర్తనతో ఆత్మరక్షణలో పడి రెండ్రోజుల్లోనే పలాయనం చిత్తగించారు. ఇదీ శాసనసభ సమావేశాలు జరిగిన తీరు. ఈనెల 21న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరిగాయి. ఆత్మరక్షణలో ప్రతిపక్షం స్కిల్ స్కామ్లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, సీఐడీ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. ఈ ఉదంతంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ప్రజలకు వాస్తవాలను వివరించేలా గళమెత్తి అధికార పక్షం కక్ష సాధింపు చర్యలను జనంలోకి తీసుకెళ్తామని టీడీపీ శాసనసభా పక్షం ప్రకటించింది. తీరా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆత్మరక్షణలో పడిపోయింది. స్కిల్ స్కామ్తోపాటు ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు చర్చకు వస్తే చంద్రబాబు అక్రమాల బాగోతం సాక్ష్యాధారాలతో సహా అధికారపక్షం గుట్టురట్టు చేయడం ఖాయమని.. అప్పుడు ప్రజల్లో మరింత చులకనవుతామని భావించిన ప్రతిపక్షం వ్యూహం మార్చింది. ఎలాగైనా సరే సస్పెన్షన్ వేటు వేయించుకుంటే చర్చ నుంచి తప్పించుకోవడంతోపాటు సభ నుంచి బయటకు వచ్చాక అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందంటూ రాద్ధాంతం చేసి చంద్రబాబు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లింపవచ్చని ఎత్తు వేసింది. ఆ వ్యూహంలో భాగంగా తొలి రోజు, రెండో రోజూ స్కిల్ స్కామ్పై చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టం చేసినా వినకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. పేపర్లు చింపి విసిరేస్తూ వీధి రౌఢీల్లా అరుపులు, కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ప్రతిపక్ష సభ్యులు వీరంగం చేశారు. బాలకృష్ణ అయితే మీసం మెలేసి.. అసభ్య సైగలు చేస్తూ లేకిగా ప్రవర్తించి చట్టసభల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించి సస్పెన్షన్ వేటు వేయించుకున్నారు. శాసనభలో మొదటి రోజు, రెండో రోజు ప్రతిపక్షం లేకి ప్రవర్తనను ప్రజలు అసహ్యంచుకోవడంతో.. అకారణంగా తమను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని.. అందుకే తాము శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ ప్రతిపక్షం పలాయన మంత్రం జపించింది. ప్రజాపక్షమై ప్రతిధ్వనిస్తూ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును శాసనసభ సాక్షిగా అధికార పక్షం ప్రజలకు వివరించింది. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం మేరకు స్కిల్ స్కామ్పై చర్చను చేపట్టి.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను అప్పటి సీఎం చంద్రబాబు ఎలా దోచుకున్నారన్నది సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యింది. ఇదే క్రమంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు స్కామ్లతో చంద్రబాబు, లోకేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ప్రభుత్వ ఖజానాను దోచేయడంతోపాటు తమ వందిమాగధులకు ఎలా లబ్ధి చేకూర్చారన్నది సాక్ష్యాధారాలతోసహా ప్రజల ముందు పెట్టింది. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే దర్యాప్తు సంస్థ సీఐడీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఆ సంస్థ అరెస్ట్ చేసిందని వివరించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపులు లేవని.. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అధికార పక్షం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. -
సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు: మోదీ ఫైర్
PM Modi Comments On Sanatan Dharma Row: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ, దాన్ని నిర్మూలించాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఘాటుగా స్పందించారు దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర ఈ మేరకు మధ్యప్రదేశ్లోని బినాలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. తొలిసారి సనాతన ధర్మం వివాదంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశాన్ని వెయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లి, బానిసత్వంలోకి నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. భారతీయుల నమ్మకాలు, విలువలపై దాడి ‘ఇటీవల ఇండియా కూటమి ముంబైలో భేటీ అయ్యింది. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల నమ్మకాలు, విలువలు, సంప్రదాయాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ధ్వజమెత్తారు. చదవండి: Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ #WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak...This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS — ANI (@ANI) September 14, 2023 ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, వాల్మికీ, మహత్మాగాంధీ.. దేవి అహల్యాబాయి హోల్కర్కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని 'ఘమండియ' కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతన ధర్మమే ఓ బలంగా నిలిచిందని. తన ఘాన్సీ ప్రాంతాన్ని వదులుకోనని బ్రిటిష్ వారికి సవాల్ విసిరిందని చెప్పారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించారన్న ప్రధాని మోదీ.. ఆయనకు రాముడు ప్రేరణగా నిలిచారని చనిపోయే ముందు కూడా ‘హేరామ్’ అని సంభోదించారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు యత్నం ఇక స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని మోదీ తెలిపారు. సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్ను ఒక్కటిగా నిలిపిందన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడుల్ని ఉధృతం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టించి. దేశాన్ని 1,000 సంవత్సరాల వెనక్కు బానిసత్వంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కలిసి కట్టుగా ఆ పోరాటాన్ని ఆపాలని.. వారి వ్యూహాలను విజయవంతం అవ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాని కంటే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై స్పందిస్తూ.. దీనిపై చర్యలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్లో మనం చిక్కుకోవద్దు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
మంత్రినైపోయా.. లేకుంటే కొట్టేవాడిని
సంగెం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా సంగెం మండలంలో బుధవారం కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. గవిచర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు అబద్ధపు మాటలు చెబుతుంటే.. ఈడ్చి కొట్టాలని ఉన్నా.. మంత్రి పదవి అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తనకు టీడీపీని వీడాలని లేదని.. చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తివేసి ఆంధ్రాకు వెళ్లడంతో.. ఇక్కడ పార్టీని ఎంత లేపాలని చూసినా లేవదు కాబట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడానికే బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. -
పార్లమెంట్లో ‘మోదీ చాలీసా’ వద్దు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ చాలీసాను తాము కోరుకోవడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశమైంది. పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ప్రభుత్వం ఆ పని చేయలేదని, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆక్షేపించారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై, అధికార బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా చెప్పారు. పరిస్థితి బీజేపీకి సానుకూలంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యావత్ పార్టీ యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో ముఖ్యనేతలు ఆధిపత్య పోరుకు, గ్రూపులకు ఆస్కారం ఇవ్వకుండా ఐక్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో ‘రైతు గోస– బీజేపీ భరోసా’బహిరంగ సభ అనంతరం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీతో సమావేశమైన అమిత్షా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. 5సీ ప్రాతిపదికగా పనిచేయాలి బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో పనిగట్టుకుని సాగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని షా ఆదేశించారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఉన్న సమాచారం, వివిధ రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన వివరాలు వెల్లడించారు. పార్టీ గెలుపు విషయంలో నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని, పార్టీ కేడర్లో నూతనోత్సాహాన్ని నింపాలని సూచించారు. క్లారిటీ, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కోఆర్డినేషన్, క్రెడిబిలిటీ (5 సీ) ప్రాతిపదికగా పనిచేయాలని, ప్రజలకు అన్ని విషయాల్లో స్పష్టత ఇస్తూ నేతలు చిత్తశుద్ధి, సమన్వయంతో పార్టీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా కృషి చేయాలని చెప్పారు. అవినీతిని వెలికితీసి ప్రచారం చేయండి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమిత్షా చర్చించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ రెండు పార్టీలతో పాటు మజ్లిస్ రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో సాగాలని సూచించారు. గత తొమ్మిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు సహా వివిధ కార్యక్రమాలు, పథకాల అమల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని వెలికితీసి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కనివారితో పాటు రెండు పార్టీల అసంతృప్త ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్ను బీజేపీలో చేర్చుకునే విషయంలో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల మేనేజ్మెంట్, వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై లోతుగా సమీక్ష రాబోయే 3, 4 నెలల్లో జరగనున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై అమిత్షా సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. పార్టీపరంగా పట్టున్న, కచి్చతంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలెన్ని? వీటితో పాటు బీజేపీ బలా లు కేంద్రీకరించి విజయం కోసం కృషిచేస్తున్న నియోజకవర్గాలు, పార్టీ రెండోస్థానంలో నిలిచే అవకాశాలున్న సీట్లు ఏవేవి అన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, గరికపాటి మోహన్రావు పాల్గొన్నారు. 29, 30 తేదీల్లో సమీక్ష సమావేశాలు బీజేపీ ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. ఎమ్మెల్యేల ప్రవాస యోజన, అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెపె్టంబర్ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెపె్టంబర్ 17 తదితర అంశాలపై చర్చించనుంది. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్ (మెదక్, ఖమ్మం), అరవింద్ మీనన్ (అదిలాబాద్, నిజమాబాద్), తరుణ్ ఛుగ్ (కరీంనగర్, నల్లగొండ), ప్రకాష్ జవదేకర్ (మహబూబ్నగర్, వరంగల్), బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్) హాజరుకానున్నారు. -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
'ఓటింగ్కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'
కోల్కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. #WATCH | PM Modi addressing BJP's Kshetriya Panchayati Raj Parishad in West Bengal, via video conferencing "We defeated the opposition's no-confidence motion in Parliament and gave a befitting reply to those spreading negativity in the entire nation. The members of the… pic.twitter.com/tZSgBjehkH — ANI (@ANI) August 12, 2023 అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్కతా ఎయిర్పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji was warmly greeted by @BJP4Bengal State President @DrSukantaBJP Ji alongwith other party leaders and karyakartas upon his arrival in Kolkata, West Bengal. pic.twitter.com/uuu8G8ojWK — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 బెంగాల్లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్గా పాల్గొననున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji's Public Programs in West Bengal on 12th August 2023. Watch Live- . https://t.co/YU8s4nWcrF . https://t.co/qpljG4G7Jz . https://t.co/NPs3aOvCXh pic.twitter.com/uxx2XD3byf — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు: మోదీ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవిశ్వాసం అంటే శుభపద్రం, శుభసూచకమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 2028లో కూడా తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పేదల బిడ్డను ప్రజలు కచ్చి తంగా ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి అహంకారులతో నిండిపోయిందని మండిపడ్డారు. అందులో అందరూ పెళ్లికొడుకులేనని ఎద్దేవా చేశారు. మోదీ లోక్సభలో 2.10 గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసలు విషయం మోదీ మాట్లాడడం లేదని వారు ఆరోపించారు. మణిపూర్లో త్వరలోనే శాంతి నెలకొంటుందని ప్రధాని చెప్పారు. ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డ దుండగులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా మీకు అండగా ఉన్నారంటూ మణిపూర్ మహిళలకు భరోసా కల్పించారు. అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఎవరూ మాట్లాడలేదు. మోదీ ప్రసంగం అనంతరం సభలో అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే... 2028లోనూ అవిశ్వాసం పెట్టండి వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో మేము మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యం. రికార్డులను తిరగరాయడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మాకు శుభప్రదమే. 2018లో మాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఆ అవిశ్వాస తీర్మానం మాకు శుభ సూచకమని నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా మాకు శుభాలు చేకూర్చబోతోంది. వచ్చే ఎన్నికల్లో నెగ్గబోతున్నాం. ప్రజలకు కుంభకోణాల రహిత, అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం. 2028లో కూడా మాపై మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం తథ్యం. మా ప్రభుత్వంపై దేశ ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఈ పేదల బిడ్డను ప్రజలు ఆశీర్వదిస్తారు. నార్త్ఈస్ట్... జిగర్ కా తుక్డా ఈశాన్య ప్రాంతం మన దేశం హృదయంలో ఒక భాగం(జిగర్ కా తుక్డా). మణిపూర్లో హింస జరగడం నిజంగా బాధాకరం. మణిపూర్లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుంది. మహిళలపై అరాచకాలను ఎంతమాత్రం సహించబోం. మహిళలను అవమానించిన వారిని, అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. మణిపూర్లో త్వరలోనే శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. మణిపూర్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హామీ ఇస్తున్నా. దేశం మొత్తం మీకు అండగా ఉంది. పార్లమెంట్ మీకు అండగా ఉంది. మణిపూర్లో సమస్యలకు పరిష్కారాన్ని కచ్చి తంగా కనుగొంటాం. మణిపూర్ త్వరలోనే మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మహిళలపై నేరాలు క్షమార్హం కావు మణిపూర్ హైకోర్టు నిర్ణయం తర్వాతే అక్కడ సమస్య మొదలైంది. చిన్నచిన్న సంఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హింస చోటుచేసుకుంది. ఎన్నో కుటుంబాలను సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాలు క్షమార్హం కావు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే నిత్యం ఉభయ సభల్లో ఉద్దేశపూర్వకంగా రగడ సృష్టిస్తున్నాయి. దేశ అభివృద్ధికి సంబంధించిన బిల్లులపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు చర్చ జరగనివ్వడం లేదు. వారికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ప్రజలు వంచిస్తున్నారు. కాంగ్రెస్కు ప్రభుత్వంపై విమర్శలపై ఉన్న శ్రద్ధ పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులపై లేదు. విపక్షాలు నోబాల్స్ వేస్తుంటే అధికార పక్షం సెంచరీలు కొడుతోంది. మణిపూర్ విషయంలో రాజకీయాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రజల భాధలను తగ్గించే ఔషధంగా పనిచేయండి. మా అంకితభావానికి నిదర్శనం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 50 పర్యాయాల కంటే ఎక్కువే పర్యటించా. మా మంత్రులు 400 కంటే ఎక్కువసార్లు అక్కడ పర్యటించారు. ఇవి కేవలం గణాంకాలు కాదు. ఈశాన్యంపై మా ప్రభుత్వానికున్న అంకితభావానికి ఇవొక నిదర్శనం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1966 మార్చి 5న మిజోరాం ప్రజలపై వైమానిక దాడులకు పాల్పడింది. సొంత ప్రజలపై వైమానిక దాడుల చేసిన ఘటన దేశ చరిత్రలో ఇదొక్కటే. 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం గాలికొదిలేసింది. 1980వ దశకంలో పంజాబ్లో అకల్ తఖ్త్పై కాంగ్రెస్ సర్కారు సైనిక చర్యకు దిగింది. మణిపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రవాదులు చెలరేగిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గాందీజీ చిత్రపటాలు పెట్టనివ్వలేదు. స్కూళ్లలో జాతీయ గీతం పాడనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంపై ముష్కరులు బాంబుదాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి. దాడులు చేస్తున్న దేశంతో చర్చలు జరపాలా? కాంగ్రెస్కు, దాని మిత్రపక్షాలకు పాకిస్తాన్ అంటే ఎనలేని ప్రేమ. మనదేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్పై అనురాగం ప్రదర్శిస్తుంటాయి. భారతీయులను మనోభావాలను పక్కనపెట్టి పాకిస్తాన్ను సమర్థిస్తుంటాయి. విపక్షాలు ఎప్పుడూ పాకిస్తాన్నే నమ్ముతుంటాయి. భారతదేశపు అంతర్గత శక్తియుక్తులపై, భారత సైనికుల సామర్థ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేదు. కశ్మీర్లోని వేర్పాటువాదులంటే విపక్ష నాయకులకు ఎంతో మక్కువ. వారు ఎక్కువగా వేర్పాటువాదులనే కలుస్తుంటారు. పాకిస్తాన్ మన సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపిస్తోంది. భారత్లో ఉగ్రదాడులు జరిగితే పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. అయినా మన ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్నే సమర్థి,స్తుంటారు. పాకిస్తాన్ ఏది చెబితే అది నిజమని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. మన గడ్డపై పాకిస్తాన్ ముష్కరులు దాడులు చేస్తున్నా ఆ దేశంతో చర్చలు జరపాలని మూర్ఖంగా వాదిస్తుంటారు. పాకిస్తాన్ జెండాలు మోసినవారే కాంగ్రెస్కు ఇష్టం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద మంటల్లో కశ్మిర్ చిక్కుకుంది. అమాయక జనం బలైపోయారు. అయినా కశ్మిర్లోని సామాన్య ప్రజలను ఏనాడూ కాంగ్రెస్ విశ్వసించలేదు. హురియత్ కాన్ఫరెన్స్ను, వేర్పాటువాదులను, పాకిస్తాన్ జెండాలు మోసినవారిని మాత్రమే కాంగ్రెస్ నమ్మింది. పాకిస్తాన్ భూభాగంలో నక్కిన ముష్కరులపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నానా యాగీ చేశాయి. మన సైనిక దళాల బలాన్ని విశ్వసించలేదు. మన శత్రువులు చెప్పినదాన్నే విశ్వసించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మరింత పెద్దది చేసి చూపి, సంబరపడే శక్తి ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ప్రతిపక్షాలు అహంకారానికి, అవిశ్వాసానికి మారుపేరు. వాటిది నిప్పుకోడి తరహా మనస్తత్వం. భారతదేశ కీర్తిప్రతిష్టలు అంతర్జాతీయ నూతన శిఖరాలకు చేరుతున్నాయి, ప్రజల్లో కొత్త ఉత్సహం, కొత్త శక్తి నిండుతోంది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ఏదో ఉన్నట్టుంది. ఇతరులకు చెడు జరగాలని వారు (విపక్ష నేతలు) కోరుకుంటే మంచి జరుగుతోంది. అందుకు నేనే ఉదాహరణ. గత 20 ఏళ్లుగా నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, నాకు ఏమీ కాలేదు. బ్యాంకింగ్ రంగంపై, ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్పై, భారతీయ జీవిత బీమా సంస్థపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయి. హెచ్ఏఎల్ రికార్డు స్థాయిలో రెవెన్యూ సాధించింది. ఇక ఎల్ఐసీ అద్భుత పనితీరుతో లాభాల బాటలో దూసుకెళ్తోంది. విపక్షాలు ఇప్పుడేం చేయాలో తెలియక చివరకు దేశాన్ని శపిస్తున్నాయి. కానీ, మన దేశం మరింత శక్తివంతంగా మారుతోంది. ప్రభుత్వం సైతం బలోపేతం అవుతోంది. మూడో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. భారత్ ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది. దీని ప్రభావం మరో వెయ్యేళ్లు ఉంటుంది. దేశ ప్రజల బలం, శ్రమ, కష్టపడే తత్వం వచ్చే వెయ్యి సంవత్సరాలకు బలమైన పునాది వేస్తాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. దేశంలో గత ఐదేళ్లలో ఏకంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు పరాయి గడ్డ నుంచి మన దేశంలోకి వస్తున్న ముష్కర మూకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అందుకే కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలు పూర్తి అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్కు ఒక విజన్ గానీ, ఒక విధానం గానీ లేవు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాత్ర గురించి కాంగ్రెస్కు తెలియదు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ది వెనుక తమ నాయకుల పాత్ర ఉందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని సమస్యలకు కాంగ్రెస్, ఆ పార్టీ నీచ రాజకీయాలే మూలకారణం. అక్కడి ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. ఈశాన్యంతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రధానమంత్రిని కాకముందే ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించా. విపక్ష దుకాణం త్వరలో బంద్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అహంకారులైన వారసత్వ రాజకీయ నాయకులతో నిండిపోయింది. విద్వేషం, విభజన, అత్యవసర పరిస్థితి, సిక్కులపై దాడులు, అబద్ధాలు, అవినీతి, కుంభకోణాలు, రెండంకెల ద్రవ్యోల్బణం, అస్థిరత, బుజ్జగింపు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, నిరుద్యోగం, ఉగ్రవాదం.. ఇవన్నీ ప్రతిపక్షాల ఘనతలే. ప్రతిపక్ష నాయకులు గనుక అధికారంలోకి వస్తే దేశాన్ని రెండు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బీటలువారిన ఇంటికి పూతలు పూసే ప్రయత్నంలా ఉంది. మా కూటమి ఎన్డీయే కేవలం అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. దేశం పేరు పెట్టుకున్న విపక్ష కూటమితో ఒరిగేదేమీ లేదు. విపక్షాల కొత్త దుకాణం త్వరలో బంద్ అవుతుంది. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసు. అది కేవలం లూటీ దుకాణం, విద్వేష బజార్. మా కూటమి ఎన్డీయే. దానికి రెండు ‘ఐ’ అక్షరాలు కలిపి ‘ఇండియా’ అని పెట్టుకున్నారు. అందులో ఒక ‘ఐ’ 26 పార్టీల అహంకారం. మరో ‘ఐ’ ఒక కుటుంబ అహకారం. పేరు మార్చుకున్నంత మాత్రాన పాత పాపాలను దాచలేరు. వారసత్వ రాజకీయాలు అంతం కావాలని మహాత్మాగాందీ, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ తదితర గొప్ప నాయకులు ఆకాంక్షించారు. కానీ, వారసత్వ రాజకీయాలు, డబ్బుతోనే ఒక కుటుంబం చుట్టూ ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది. నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు నేను పేద కుటుంబం నుంచి వచ్చా. పేదల బిడ్డ అధికారంలోఉండడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిరుపేద బిడ్డ ఉన్నత పదవిలో ఉండడం ఏమిటని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వారు(కాంగ్రెస్ నాయకులు) గతంలో విమానాల్లో పుట్టిన రోజు కేకులు కట్ చేసుకున్నారు. మనం అదే విమానాల్లో వ్యాక్సిన్లు రవాణా చేశాం. వారు తమ దుస్తులను విమానాల్లో పంపించుకున్నారు. నేడు పేదలు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు నావికాదళం నౌకలను విందులు వినోదాల కోసం వాడుకున్నారు. అది ‘ఇండియా’ కాదు, ముమ్మాటికీ అహంకార కూటమి. అందులోని ప్రతి నాయకుడు పెళ్లి కొడుకు(ప్రధానమంత్రి) కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ను ఒక విదేశీయుడు స్థాపించారు. ఆ పార్టీ జెండా, పార్టీ గుర్తు, సిద్ధాంతాలు ఇతరుల నుంచి దొంగిలించినవే. అహంభావం వల్లే కాంగ్రెస్ 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయింది. బెంగళూరులో ‘యూపీఏ’కు సమాధి కట్టిన విపక్ష స్నేహితులకు ఇదే నా సానుభూతి. రాహుల్.. విఫల ఉత్పత్తి మన భరతమాత మృతి చెందాలని కొందరు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాత హత్య అంటూ అనుచితంగా మాట్లాడడం భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చింది. ప్రజాస్వామ్యం హత్య, రాజ్యాంగం హత్య అంటూ మాట్లాడే ఈ వ్యక్తులే(కాంగ్రెస్ నాయకులు) భరతమాతను మూడు ముక్కలు చేశారు. బానిసత్వం నుంచి భరతమాతకు విముక్తి కలిగించే సమయం వచ్చి నప్పుడు ఆమె అవయవాలను నరికేశారు. కాంగ్రెస్కు రాజకీయాలు చేయడం తప్ప మరేమీ తెలియదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పలుమార్లు రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ఆయన విఫలమయ్యారు. ఆయనొక ‘విఫల ఉత్పత్తి’. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. -
విపక్షాలను సర్కార్ వేధిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ‘విపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీనిని ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నా. మమ్మల్ని అవమానించడం అంటే మా ప్రజలను అవమానించడమే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మా హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంది’అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సూచించారు. పొలాలు కోతకు గురయ్యాయని, ఇసుక మేటలు వేశాయని, పొలాలను బాగు చేసుకోవడానికి గతంలో సీఎం చేసిన ప్రకటన మేరకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతులకు సహాయం చేయాలని ఈటల అన్నారు. పంట రుణమాఫీలో జాప్యంతో రైతులపై రూ.10 వేల కోట్ల వడ్డీల భారం పడిందని, ఎప్పటిలోగా రుణాలు మాఫీ చేస్తారో తెలపాలని కోరారు. రైతు కూలీలకూ రైతుబీమా పథకం వర్తింపజేయాలని ఆయన సూచించారు. సర్కారీ బడులు మూత.. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్సిటీల్లో కోర్సుల ఫీజులను భారీగా పెంచారని, వాటిని తక్షణమే తగ్గించాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కలి్పంచాలని, గెస్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని అన్నారు. భూముల విక్రయాలు వద్దు.. ప్రభుత్వ భూముల విక్రయాలపై పునరాలోచన చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదలనుంచి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులకు కూడా దళితబంధు ఇస్తామనడం సరికాదని, పేదవారికి మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సొంత జాగాలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం అందజేయాలని సూచించారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
దశదిశ లేని కూటమి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇలాంటి దశాదిశా లేని కూటమిని దేశంలో గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్లో కూడా ఇండియా అనే పేరుందని, దేశం పేరును వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విపక్షాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయని తప్పుపట్టారు. నిరాశలో మునిగిపోయిన విపక్ష ఎంపీలు దశాదిశా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. వారి ప్రవర్తనను బట్టి చూస్తే దీర్ఘకాలం విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, శాది ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఉద్ఘాటించారు. తన మూడో టర్మ్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వమే రాబోతోందని పరోక్షంగా తేలి్చచెప్పారు. దేశ అభివృద్ధికి సహకరించాలని, చిత్తశుద్ధితో పని చేయాలని బీజేపీ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యారు ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమిగా ఏర్పడ్డాయని, నిషేధిత ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు సైతం దేశం పేరును వాడుకుంటున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అవినీతి పార్టీలు, అవినీతి నాయకులు కూటమి పేరిట ఒక్కటయ్యారని విమర్శించారు. దేశాన్ని పాలించి, విభజించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా, ఇండియన్ అనే పేర్లతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. వాజ్పేయి, ఎల్కే అద్వానీల వారసత్వమే ఎన్డీయే అని చెప్పారు. -
పార్లమెంట్లో నేడే అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై పార్లమెంట్ వెలుపలా, లోపలా నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఇటీవలే ఒక్కటైన కాంగ్రెస్ సహా 26 విపక్షాలు ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం జరిగిన విపక్షాల భేటీలో అవిశ్వాస తీర్మానంపై కీలక చర్చలు జరిగాయి. బుధవారం నేతలతో మరోసారి సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీర్మాన ప్రతి ఇప్పటికే సిద్ధమైందని, 50 మంది ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ఆ రోజు విధిగా లోక్సభకు హాజరవాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేసింది. మరోవైపు, మణిపూర్పై చర్చిద్దాం రమ్మంటూ ఉభయ సభల్లో విపక్ష నేతలు ఖర్గే, అదీర్ రంజన్ చౌదరిలకు అమిత్ షా లేఖలు రాశారు. లోక్సభలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. 83 రోజులుగా సాగుతున్న మణిపూర్ హింసపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోదీ సమగ్రమైన ప్రకటన చేయాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. అక్కడ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కేంద్రం ఏం చేస్తోందో పార్లమెంటుకు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఖర్గే వర్సెస్ గోయల్ ఉభయ సభల్లోనూ విపక్షాలు మంగళవారం నాలుగో రోజు కూడా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. మణిపూర్పై మోదీ వచ్చి ప్రకటన చేయాలంటూ నినదాలతో హోరెత్తించాయి. ఉదయం రాజ్యసభ ఆరంభానికి ముందే బీఆర్ఎస్తో పాటు 51 మంది విపక్ష ఎంపీలు 267 నిబంధన కింద నోటీసులిచ్చారు. 176 నిబంధన కింద ఇచ్చిన నోటీసులపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని సభా పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 267 కింద నోటీసులిస్తే 176 కింద ఎలా చర్చ చేపడతారని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. తమ ఎంపీ సంజయ్సింగ్ సస్పెన్షన్ను నిరసిస్తూ ఆప్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దాంతో సభ మధ్యాహా్ననికి వాయిదా పడింది. తిరిగి మొదలవగానే విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగాయి. గోయల్, ఖర్గే మధ్య వాగ్వాదం జరిగింది. మణిపూర్ తగలబడుతుంటే దానిపై చర్చకు ‘మోదీ సాబ్’ సభకు ఎందుకు రాలేదని ఖర్గే ప్రశ్నించగా, విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అకృత్యాల మీదా సభలో చర్చిద్దామని గోయల్ అన్నారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడింది. ఎస్టీల రాజ్యంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ బుధవారానికి వాయిదా పడింది. లోక్సభ కూడా నేరుగా మధ్యాహ్నం రెండింటికి, అనంతరం జీవ వైవిధ్య బిల్లును ప్రవేశపెట్టాక సాయంత్రం ఐదింటికి వాయిదా పడింది. తర్వాత సహకార సంఘాల బిల్లును సభ ఆమోదించింది. ప్రతిష్టంభనకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అఖిల పక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లా భేటీ అయినా లాభం లేకపోయింది. మోదీ వచ్చి మణిపూర్ హింసపై స్వయంగా చర్చ మొదలు పెట్టాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఏ రోజైనా చర్చకు సిద్ధమని, కేంద్ర హోం మంత్రి అమిత్షా చర్చ మొదలు పెడతారని అధికార పక్షం ప్రతిపాదించింది. ఇక సంజయ్ సింగ్ సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్ష కూటమి సోమవారం రాత్రంతా బృందాలవారీగా చేసిన ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. మోదీకి ‘ఇండియా’ పేరు నచ్చినట్టుంది: మమత కోల్కతా: ‘‘ప్రధాని మోదీకి థ్యాంక్స్. విపక్ష కూటమి పేరు ‘ఇండియా’ ఆయనకు బాగా నచ్చినట్టుంది’’ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెణకులు విసిరారు. విపక్ష కూటమి గురించి బీజేపీ ఎంతగా విమర్శలు చేస్తే, ‘ఇండియా’ అనే పేరు వారికి అంతగా నచ్చినట్టు అర్థమన్నారు. -
మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ? #WATCH | Defence Minister Rajnath Singh on the Manipur violence says, "I feel the opposition is not serious about the discussion on the Manipur issue. The government wants to discuss the Manipur issue. PM Modi himself said that the country is ashamed of whatever has happened in… pic.twitter.com/GlTZ3sj9uM — ANI (@ANI) July 21, 2023 ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు రూల్ 267 ప్రకారం.. రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది. రూల్ 176 ప్రకారం.. ఈ రూల్ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్ గాంధీ పిటిషన్.. పలువురికి నోటీసులు.. బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇండియా కూటమి తొలి భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మొట్టమొదటి సమావేశం గురువారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో వారంతా భేటీ అయి వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం బెంగళూరులో సమావేశమైన ప్రతిపక్ష నేతలు తమ కూటమికి ఇండియా అనే పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ఉభయసభల్లో చర్చించాలని, అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ను వెంటనే తొలగించి, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు 80 రోజులుగా కొనసాగుతున్నా ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేదు, అక్కడి పరిస్థితిపై స్పందించలేదని చెప్పారు. ‘మహిళా రెజ్లర్లపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ పార్లమెంట్ నాలుగో నంబర్ గేట్ దగ్గర కనిపించగా, అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ప్రధాని మోదీ మహిళల భద్రతపై లెక్చరిచ్చారు. ద్వంద్వ ప్రమాణాలు బీజేపీ డీఎన్ఏలోనే ఉన్నాయి’అని లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. -
'ఇండియా' కూటమి తొలి భేటీ రేపే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టడంపైనే చర్చ..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరు భేటీతో ఏకమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి 'ఇండియా' ఏకతాటిపై నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకు తొలిసారిగా 'ఇండియా' కూటమి తొలిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ మేరకు రాజ్యసభలోని విపక్షాల ఛాంబర్లో భేటీ జరగనుందని సమాచారం. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సందించాల్సిన ప్రశ్నల గురించి చర్చించనున్నారని ఓ విపక్ష పార్టీ నేత తెలిపారు. అయితే.. బెంగళూరులో మంగళవారం 26 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిపై పోరుకు సిద్ధమయ్యాయి. విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరును కూడా సూచించారు. గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నీపార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒకే గొంతుకగా వినిపించనున్నారు. అటు.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్లో నేడు అఖిలపక్షాల భేటీని కేంద్రం నిర్వహించింది. సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. మణిపూర్ హింస, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నాాయి విపక్షాలు. ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. -
'ఆ పార్టీలు రిజిష్టర్ అయినవేనా..?' విపక్షాల భేటీ అనంతరం ఖర్గే కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: ప్రతిపక్ష పార్టీలంటే ప్రధాని మోదీకి భయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారు.. కానీ అవి రిజష్టర్ అయినవేనా? అని బీజేపీని ఎద్దేవా చేశారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన ఖర్గే.. మాహాకూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరు సూచించామని తెలిపారు. #WATCH | Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: Congress President Mallikarjun Kharge in Bengaluru pic.twitter.com/pI66UoaOCc — ANI (@ANI) July 18, 2023 ప్రతిపక్ష పార్టీల కూటమిని సమన్వయ పరచడానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖర్గే వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ముంబైలో తదుపరి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. పాట్నాలో జరిగిన సమావేశానికి 16 పార్టీలు వస్తే నేడు బెంగళూరు భేటీకి 26 వచ్చాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలున్నా వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు..
రాయ్పుర్: ఈ ఏడాది చివర్లో ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అవినీతిలో కూరుకుపోయినవారు ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకరికొకరు తిట్టుకున్నవారు నేడు కలుసుకోవడానికి సాకులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు రాయ్పుర్లో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 'మోదీ భయపడడు..' అవినీతి కోసం హామీలను కాంగ్రెస్ ఇస్తే.. అవినీతిని అంతం చేసే హామీని మోదీ ఇస్తున్నాడని చెప్పారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ శ్వాసించలేదంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ భావాజాలంలోనే అవినీతి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుగోడగా నిలబడిందని అన్నారు. అవినీతిపరులు ప్రతిపక్ష కూటమి పేరుతో తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం తననే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఓడించడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ భయపడేవారు ఎప్పటికీ మోడీ కాలేడంటూ ప్రతిపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాగా.. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యయంతో.. రాయ్పుర్లో ప్రధాని సభకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ సభ ముందురోజు ఛత్తీస్గఢ్లో రూ.7 వేల కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ కార్యక్రమం చేశారు. ఇందులో 6,400 కోట్లతో ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. ఇదీ చదవండి: తీవ్ర పదజాలంతో ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు! కానీ.. -
మతతత్వ పార్టీలకు ఆదరణ ఉండదు
సాక్షి, అమరావతి: బీజేపీ వంటి మతతత్వ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఫిల్మ్ చాంబర్ హాల్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చిట్ఫండ్ చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని మార్గదర్శి నిర్వాహకులు చెబుతున్నారని, అలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనవసరమని, దానికంటే ముందు దేశంలో ఆర్థిక అసమానతలు తొలిగించే దిశగా దృష్టి సారించాలని కోరారు. దీనిపై వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన వ్యతిరేకమా, అనుకూలమా అనే దానిపై వైఖరి ఏమిటో వెల్లడించాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో వివాహ, విడాకుల సంప్రదాయం ఒక్కోలా ఉంటుందని, అన్నిటికీ ఒకే విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్కు కచ్చితంగా మంచి జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల సమావేశ ప్రభావం ఉంటుంది కేంద్ర ప్రతిపక్షాలు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న సమావేశ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రంతోను, పార్లమెంట్తోను, స్పీకర్తోను తాను గొడవ పడుతుంటే సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చే సర్వేలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగాలు అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నదో, బాధ్యులెవరో, దానిని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చువుతుందో, అసలు పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏమిటనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రూ.కోటి 64.5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్రాన్ని అధికార, ప్రతిపక్షాలు ఒక్కమాట కూడా ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మన రాష్ట్రం నుంచి వెళ్లిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తే మనకు సరిపోతుందని.. అప్పులు చేయక్కర్లేదని అన్నారు. -
'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్తో కలిసి తాను కూడా ఆ మీటింగ్కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు. 'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు! -
ఓసారి ఊటీలో.. మరోసారి గోవాలో!
సిమ్లా తర్వాత ఓసారి ఊటీలో మరోసారి గోవాలో పెట్టుకుందాం ఆహ్లాదంగా ఉంటుంది! -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. శరద్ పవార్
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. -
వారితో చేతులు కలపడం దండగ..
శ్రీనగర్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడానికి విపక్షాలు ఏకమవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు మేరకు జూన్ 23న విపక్షాలన్నీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఈ కూటమి వలన ఏ ప్రయోజనం లేదని వ్యాఖ్యలు చేశారు. తమకు ఏమాత్రం లాభం లేకున్నా ఏ విపక్షమైన ఎందుకు మద్దతిస్తుందని అన్నారు. ఏమి తీసుకుంటారు? ఏమి ఇస్తారు? శ్రీనగర్లో జరిగిన ఓ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత పొత్తుల వలన ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో కానీ ఎన్నికలకు ముందు ఈ పొత్తుల వలన ఏ ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి బెంగాల్ రాష్ట్రాన్నే తీసుకోండి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గానీ సిపిఐ(ఎం) పార్టీకి గానీ ఒక్క సీట్ కూడా లేదు. అలాంటప్పుడు వారు బెంగాల్లో ఏమి ఆశిస్తారు.. బదులుగా మమతా బెనర్జీకి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏమివ్వగలరు. అబ్బే పనవ్వదు.. వీరంతా అధికార బీజేపీ పార్టీని ఓడించడానికి మాత్రమే సంకల్పించుకుని ఏకమైతే పర్వాలేదు గానీ పరస్పర ప్రయోజనాల కోసం కలిస్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేను గతంలోనే చెప్పాను కాంగ్రెస్ పార్టీ రాష్టాల్లో కంటే కేంద్రంలోనే ఎక్కువ నష్టపోయిందని. లాభమో నష్టమో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ పుంజుకుంటోంది. ఈ ఘనత ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది. ఇది కూడా చదవండి: దేశంలో ముందస్తు ఎన్నికలు రావచ్చు: సీఎం నితీశ్ -
పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి
ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు. మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. अरे अरे.. हिंदूत्ववादी सरकारचे ढोंग उघडे पडले.. मुखवटे गळून पडले..औरंगजेब यापेक्षा वेगळे काय वागत होता?वारकऱ्यांचा हिंदू आक्रोश सरकार असा चिरडून टाकतआहे. मोगलाई महाराष्ट्रात पुन्हा अवतरली आहे..@BJP4Maharashtra @Dev_Fadnavis @AUThackeray @ https://t.co/pnUc45IZ01 — Sanjay Raut (@rautsanjay61) June 11, 2023 श्री क्षेत्र आळंदी येथे वारकरी बांधवांवर पोलिसांनी लाठीमार केल्याचा प्रकार अत्यंत संतापजनक आहे. वारकरी संप्रदायाचा पाया रचणारे थोर संत ज्ञानेश्वर महाराज यांच्या आळंदीत वारकरी बांधवांचा झालेला हा अपमान अत्यंत निषेधार्ह आहे. वारकरी संप्रदाय, वारकरी बांधव यांच्याबद्दल सरकारची काही… pic.twitter.com/IDtIy1azn3 — Chhagan Bhujbal (@ChhaganCBhujbal) June 11, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. -
ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం
పాట్నా: జూన్ 23న పాట్నా వేదికగా సమావేశం కానున్న అఖిలపక్ష నేతలు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సొరేన్ తదితర ముఖ్యనేతలు హాజరు కానున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఈ నేతలంతా ఒక్కచోట కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికలే లక్ష్యం... వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా అఖిలపక్షాలు పావులు కదుపుతున్నాయి. వన్ ఆన్ వన్ సిద్దాంతానుసారంగా ఒక పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా తమ పార్టీలకు చెందిన ఒకే ఒక బలమైన ప్రత్యర్థిని నిలబెట్టి బీజేపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉంచేందుకు చేతులు కలపనున్నాయి అఖిలపక్ష పార్టీలు. బద్దశత్రువులంతా ఒకే చోట..? ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ఎజెండాగా జూన్ 23న పాట్నాలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనున్నట్లు జనతాదళ్ యునైటెడ్ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా ఎనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క పార్టీ కోసం ఒక్కటయ్యారు.. ఈ సమావేశానికి ముందే అఖిలపక్ష నేతలంతా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకలకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన తర్వాత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి హాజరై పక్క రాష్ట్రాల నేతలంతా తమ బలప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కూడా వీరంతా ఏకతాటిపై నిలిచి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇలా అవకాశమున్నప్పుడల్లా ఐక్యత చాటుకుంటూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: మరో విమానాన్ని సిద్ధం చేసిన ఎయిర్ ఇండియా.. -
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్!
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్! -
2024 ఎన్నికలే ధ్యేయం.. 18 ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద సమావేశం..
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఇందుకు జూన్ 12ను ఖరారు చేశాయి. భావసారూప్యత కలిగిన 18 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. అయితే.. ఇది సన్నాహక సమావేశమేనని, ప్రధాన సమావేశం తర్వాత జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇటీవల ఆయన.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన తేదీ ఖరారైంది. సారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయన యోచిస్తున్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్లను సమన్వయపరడంలో విజయం సాధించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
సొంత పౌరులపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 100 మంది మృతి
మయన్మార్లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. కాగా సగయింగ్ ప్రాంతంలోని పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్తో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించగా.. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు, స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ప్రతక్ష్య సాక్షి ఒకరు స్థానిక మీడియాతో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం వివరాలను బయటకు పొక్కనీయకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. చదవండి: Bathinda: మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇక ఈ దాడి తామే చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ మిలిటరీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అమాయక పౌరులపై సాయుధ దళాల దాడిని ఉగ్రవాద సైన్యం జరిపిన హేయమైన చర్యగా ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి సైన్యం దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం. -
సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విపక్షాలకు చుక్కెదురైంది. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ సహా 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నాయకుల అరెస్టులపై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సామాన్యుడికి, రాజకీయ నాయకులకు వేర్వేరు న్యాయ సూత్రాలు ఉండవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించలేం అని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వీ న్యాయస్థానాన్ని కోరారు. విపక్షాల స్పేస్ తగ్గిందని కోర్టులను ఆశ్రయించడం సరికాదు, దానికి సరైన వేదిక రాజకీయాలే అని సుప్రీకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని హితవు పలికింది. చదవండి: ఛానల్ బ్యాన్.. కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్సభ సెక్రటరీ జనరల్) -
పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యకమాలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ స్కీమ్ను విమర్శించడానికి ప్రయత్నిస్తారో దానిపై ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపై, ప్రజలలో ఆ స్కీమ్ గురించి మంచి చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం, ఆయన ఎక్కడకు వెళ్లినా కొంతమంది అభిమానులు అక్కడకు వెళ్లడం, ఆయనను తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన వేసుకోవడంతో కనీసం ఇప్పుడైనా ఆ స్కీమ్ గురించి ప్రజలకు మరింతగా తెలియచేసే అవకాశం వస్తోంది. చదవండి: అబద్ధాలపై పేటేంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. పేదలకు ఇళ్లు ఇస్తే అక్కసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు 31లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సంకల్పించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా ఈ స్థాయిలో పేదలకు స్థలాలు మంజూరు చేయలేదన్నది వాస్తవం. ఆ స్థలాలలో కేంద్ర ప్రభుత్వం స్కీంను కొంత వాడుకుని, తద్వారా వచ్చే నిధులకు తోడు రాష్ట్ర నిధులను జత చేసి ఇళ్లనిర్మాణం చేపడుతోంది. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న ఈ నిర్మాణాలు ఒకరకంగా చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పాలి. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశంకు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లయింది. ఇది జగన్కు మంచి పేరు తెచ్చే స్కీమ్ కావడంతో దానిని ఎలా బదనాం చేయాలా అని ప్లాన్ చేసి రకరకాల ప్రచారాలు చేపట్టారు. ఆవ భూములని, స్కామ్లని, వర్షం పడితే నీళ్లు నిలుస్తాయని, కాలనీలపై ఒకటి కాదు.. అనేక రకాలుగా విషం కక్కుతూ తెలుగుదేశం మీడియా వార్తా కథనాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కథ నడిపారు. కాని దానివల్ల తమకు నష్టం కలుగుతుందని భావించారో,లేక మరే కారణమో తెలియదు కానీ, ఇళ్ల స్థలాలపై విమర్శల జోరు తగ్గించినట్లు అనిపించింది. రెడీ.. కెమెరా.. యాక్షన్ అదే సమయంలో తమకు పరోక్ష మిత్రుడుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ బాధ్యత అప్పగించినట్లు ఉన్నారు. ఆయన ఒక రకంగా అమాయకుడు, అంత పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి కావడంతో, లేచిందే లేడీకి ప్రయాణం అన్నట్లుగా ఈ స్కీమ్ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయా కాలనీలలోకి వెళ్లి లబ్ధిదారులను పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి విమర్శల వర్షం కురిపించాలని భావించారు. కానీ వారికి విధి వక్రీకరించిందన్నట్లుగా వారు వెళ్లిన ఎక్కువ చోట్ల లబ్ధిదాదారులు నిలదీశారు. దీనికి సంబంధించి వచ్చిన కథనాలు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఆసక్తి కలిగించాయి. కొందరు మహిళా లబ్దిదారులను జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ, తమకు వస్తున్న సదుపాయాన్ని చెడగొట్టవద్దని నిర్మొహమాటంగా చెప్పారు. ఒక్కో చోట పట్టణాన్ని బట్టి లబ్ధిదారులకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు విలువైన స్థలాలు దక్కాయి. ఆ విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలో సైతం ఆయన ఊదరకొట్టిన ఉపన్యాసం తప్ప, లబ్దిదారులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదట. దాంతో ఆయన పార్టీ నేతలను తప్పు పట్టి వెళ్లిపోయారు. జనసేన నేతలు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది ఆయన బాధ కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే చేదు అనుభవాలే మిగులుతాయి. ఇళ్ల స్థలాల స్కీము ఆలోచన చేయడమేపూర్తి సాచ్యురేషన్ మోడ్లో జగన్ చేశారు. అందువల్లే 31 లక్షల మంది పేదలకు ఈ స్కీమ్ను అమలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. దీనిని మెచ్చుకోకపోతే, పోనీ మొత్తం కుంభకోణం అంటూ ప్రచారం చేయడానికి తెగించారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల ఎవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని ప్రస్తావిస్తే తప్పు కాదు. కానీ అసలు స్కీమ్ కింద తీసుకున్న భూముల విలువకన్నా ఎక్కువ మొత్తం స్కామ్ జరిగిందని ఆరోపిస్తే ఎవరు నమ్ముతారు? మొత్తం 71 వేల ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తే, అందులో ప్రభుత్వ భూమి పోను మిగిలిన 25 వేల ఎకరాల కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలే పవన్ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇక్కడ 40 ఇయర్స్ అబద్దాలు ఈ ధోరణి రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం ప్రవేశం తర్వాత బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటు, ముద్దుకృష్ణమనాయుడు వంటివారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో సిద్దహస్తులుగా పేరొందారు. నిజంగానే ఏ అంశంపైన అయినా పరిశీలన చేసి విమర్శ చేయదలిస్తే, క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెళ్లాలి. కానీ ఎక్కువ సందర్భాలలో పవన్ అరకొర పరిజ్ఞానంతో వెళ్లి అభాసుపాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈనాడులో వచ్చిన విషపూరిత కథనాల ఆధారంగా ఆయన ఇలాంటి యాత్రలు పెట్టుకుంటున్నారు. ఒక కుట్ర ప్రకారం ముందుగా ఈనాడు, తదితర తెలుగుదేశం మీడియాలలో సంబంధిత ఆరోపణలతో కథనాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ప్రకటనలు చేయడం నిత్యకృత్యం అయింది. పింగళి గారు.. గమనించారా? జనసేన అధినేత వీకెండ్ షూటింగ్ లేని సమయంలో ఇలాంటి యాత్రలు పెట్టుకుని తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మీడియా అయితే పూర్తి అయిన ఇళ్ల గురించి వార్తలు ఇవ్వదు. పూర్తి కానీ ఇళ్ల గురించే వ్యతిరేక కథనాలు ఇస్తూ, అసలేమీ జరగడం లేదేమో అన్న భావన క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే టీడీపీ మీడియా మాత్రం ప్రతిదానిని తప్పుపడుతూ, నిందలు మోపుతూ ప్రజలను గందరగోళం చేయడానికి తంటాలు పడుతోంది. ఆ సంగతి పక్కన బెడితే సోషల్ మీడియాలో పవన్ గురించి ఒక వీడియో వచ్చింది. ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో జాతీయ పతాకాన్ని తయారు చేసింది జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లుగా ఉంది. అది ఆయన వీడియోలాగే ఉంది. దీనిని బట్టే పవన్ కల్యాణ్ రాజకీయాలలోనే కాదు.. చరిత్ర విషయంలో కూడా అంత పరిజ్ఞానంతో మాట్లాడడం లేదన్నది అర్థం అవుతుంది. రాజకీయాలలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లుగా విషయ పరిజ్ఞానం పంపొందించుకోవాలన్న సంగతి పవన్ కల్యాణ్కు ఎప్పటికి అర్ధం అవుతుందో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్
ముంబై: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో జట్టు కట్టడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం విపక్ష నేతలను అరెస్ట్చేయడం, కేసులు పెట్టించడంలోనే మోదీ సర్కార్ బిజీగా ఉందని పవార్ విమర్శించారు. ‘‘కేంద్ర ప్రాయోజిక ప్రధాన పథకం ఇదేనేమో. పాత్రా చాల్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా పాత్ర లేదని తేలితే నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు’’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: అందరూ కోరితే రెడీ.. అధ్యక్ష పదవికి పోటీపై గెహ్లాట్ వ్యాఖ్యలు -
అవినీతిపరుల కోసం ఒక్కటవుతున్నారు: మోదీ
కొచ్చి: అవినీతిపరులపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త తరహా విభజనకు దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు పలు రాజకీయ సమూహాలు ఒక్కటవుతున్నాయి. ఇందుకోసం బహిరంగంగానే చేతులు కలుపుతున్నాయి. ఈ వైనాన్ని దేశమంతా గమనిస్తూనే ఉంది’’ అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి గ్రూపులతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘దేశాభివృద్ధికి అవినీతే అతి పెద్ద అడ్డంకి. యువత ప్రయోజనాలకూ గొడ్డలిపెట్టు’’ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం మోదీ గురువారం కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా కొచ్చి విమానాశ్రయం వద్ద జరిగిన సభలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్లే ఇది సాధ్యమవుతోంది. కేరళలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే అభివృద్ధిలో రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుతుంది’’ అన్నారు. ‘‘దేశాభివృద్ధికి, సానుకూల మార్పుకు పాటుపడుతున్నది బీజేపీయేనని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తమ రాష్ట్రాభివృద్ధి విషయంలో కూడా బీజేపీ మీద వారు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి పౌరునికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆధునిక మౌలిక వ్యవస్థ నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా కొచ్చి మెట్రో తొలి దశతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కాలడి సందర్శన.. ఎర్నాకుళం జిల్లా కాలడిలో ఆది శంకరుల జన్మస్థలిని ప్రధాని మోదీ సందర్శించారు. పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ప్రాంత సందర్శన గొప్ప అనుభూతినిచి్చందన్నారు. అద్వైత సిద్ధాంతకర్త అయిన ఆది శంకరులు భరత జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్ -
విపక్షాలకు మమత షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం
కోల్కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్ ధన్ఖడ్ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్ దగదీప్ ధన్ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 6న ఓటింగ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి -
'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... వీడియో వైరల్
"Gota Go Home" Chants: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు లంకలో రోజురోజుకి దిగజారిపోతున్న ఆర్థిక స్థితి. మరోవైపు రాజపక్సల పై ప్రజల్లో నెలకున్న ఆగ్రహం ఎంతమాత్రం చల్లారటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే విపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స. ఈ మేరకు మంగళవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాలను హజరైన గోటబయను చూసి పార్లమెంట్ సభ్యులు ' గోట గో హోమ్' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో ఆయన చేసేదేమిలేక అక్కడ నుంచి నిష్క్రమించారు. విదేశీ కరెన్సీ నిల్వలు లేకపోవడంతో అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. నెలలుతరబడి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని, ఇంధన సంక్షోభాన్ని, విద్యుత్ కోతలను ఎదుర్కొంది. ఈ సంక్షోభం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధితో శ్రీలంక కొనసాగిస్తున్న చర్చలు ఆగస్టు నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుతం తాము దివాలా తీసిన దేశంగానే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పార్లమెంట్ నుంచి బలవంతంగా నిష్క్రమించిన వీడియోని పార్లమెంటు సభ్యుడు హర్ష డి సిల్వా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Ouch! This is how the arrival of #SriLanka President @GotabayaR to @ParliamentLK a few minutes ago ended: #GotaGoHome2022. Unplanned and never happened in the history. He had to get up and leave. pic.twitter.com/zuXiyQodAs — Harsha de Silva (@HarshadeSilvaMP) July 5, 2022 (చదవండి: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత) -
Sakshi Cartoon: అది వాళ్ల వల్ల కాద్సార్! తర్వాత మనమే బలంగా పోషించాలి!!
అది వాళ్ల వల్ల కాద్సార్! తర్వాత మనమే బలంగా పోషించాలి!! -
జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు, వారికి సపోర్టు ఇచ్చే మీడియా కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో అసలు ఎన్నడూ చార్జీలు పెరగనట్లు, ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ చార్జీలు పెంచారేమోనన్న అనుమానం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇలా చార్జీలు పెరిగినప్పుడు విమర్శించలేదా అని అంటే కాదనలేం. దానికి ప్రతిగా ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తే ఆక్షేపించనవసరం లేదు. కాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్ కాని మరీ అసహ్యకరమైన విమర్శలు చేయడం బాగోలేదు. జగన్ను ఎంతైనా విమర్శించండి కాని సవ్యమైన భాషలో వ్యాఖ్యానిస్తే బాగుంటుందని చెప్పాలి. ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచవలసి వచ్చిందో అందరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గత కొన్నాళ్లుగా డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచాయి. వారి కారణాలు వారికి ఉండవచ్చు. కాని డీజిల్, పెట్రోల్ ధరలు పంపుదల పేద, మధ్య తరగతి వారిపై అధికంగా ఉంటుంది. అదే సమయంలో డీజిల్ వాడే ఆర్టీసీ బస్సులపైన, ఇతర రవాణా రంగంపైన పెను భారం పడుతోంది. గతంలో లీటర్ వంద రూపాయలు దాటుతుందేమో అని అంతా భయపడేవాళ్లం. అది దాటిపోయి కూడా చానాళ్లయింది. ఇప్పుడు ఏకంగా 115-120 రూపాయల మధ్య ధర ఉంటోంది. అలాగే డీజిల్ ధర కూడా వంద రూపాయలు దాటేసింది. ఇలాంటి పరిస్థితిలో డీజిల్పై ఆధారపడి బస్సులు నడిపే ఆర్టీసీ ఏమి చేయాలి. చార్జీలు పెంచకపోతే సంస్థ మరింత దారుణమైన నష్టాలలో కూరుకుపోతుంది. అప్పుడే ఇదే ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే మీడియా మరింత గగ్గోలు పెడుతూ ఆర్టీసీని ముంచేశారని వ్యాఖ్యానిస్తారు. ప్రజలలోకి ఆ విషయాన్ని బలంగా తీసుకు వెళ్లే యత్నం చేస్తారు. అంటే చార్జీలు పెంచినా గొడవే. పెంచకపోయినా గగ్గోలే అని అర్ధం అవుతుంది. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షం విమర్శలతో సంబంధం లేకుండా ఆర్టీసీని రక్షించుకోవడానికి చార్జీలు పెంచక తప్పదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా తప్పదు. గతంలో చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండేవారు. 1989 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ మెయిన్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ కూడా పలుమార్లు టిక్కెట్ల ధరలు పెంచింది. అలాగే టీడీపీ నేతలు కూడా వ్యవహరించేవారు. అధికారంలో ఉంటే బాద్యత ఎక్కువ ఉంటుందన్నది వాస్తవం. అందువల్ల సంస్థ మునిగిపోతుంటే చూస్తూ కూర్చోలేరు కదా. అక్కడికి జగన్ ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలోకి తీసుకుని వారికి జీతాలు ఇస్తున్నారు. కరోనా సంక్షోభంలో కూడా వారికి ఇబ్బంది ఎదురుకాలేదు. అదే ఆర్టీసీలోనే వారు ఉండి ఉంటే జీతాల సమస్య కూడా వచ్చి ఉండేది. తెలంగాణ ఆర్టీసీలో ఎలాంటి చికాకులు వచ్చాయో అంతా గమనించాలి. అలాంటి స్థితి లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోతే పోనీ, ఏ అవకాశం వచ్చినా రాళ్లు.. కాదు.. బండరాళ్లు వేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్ పేరుతో టిక్కెట్ కు పది రూపాయలు అదనంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అదే కిలోమీటర్ల లెక్కన చార్జీ పెడితే చాలా మొత్తం అవుతుంది. అలా కాకుండా టిక్కెట్కు పది రూపాయలే కనుక కొంత అసంతృప్తి ఉన్నా ప్రయాణికుడు భరించడానికి పెద్దగా ఇబ్బంది పడరు. అయినా టీడీపీ మీడియా సెస్సుల కస్సు బుస్సు, బాదుడే బాదుడు అన్న హెడ్గింగ్లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేయాలని యత్నించింది. పోనీ ఇదే మీడియా తెలంగాణలో ఇప్పటికే వేసిన డీజిల్ సెస్ పైన కూడా ఇలాంగే హెడింగ్లు పెట్టిందా అంటే అలా చేయలేదు. చాలా సాదాసీదాగా ప్రయాణికులపై డీజిల్ సెస్ అంటూ వార్త వరకే ఇచ్చింది. తప్పులేదు. ఇదే వార్తలు ఇచ్చే పద్దతి. కాని ఏపిలో ఏమి చేశారు? ఏకంగా బస్ ప్రయాణికుడు నలిగిపోతున్నట్లు బొమ్మవేసి బ్యానర్గా ఇచ్చారు. రకరకాల విశ్లేషణలు ఇచ్చారు. తెలంగాణలో గత కొద్దికాలంలో మూడు సార్లు రకరకాల రూపాలలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. అయినా ఈ మీడియా దానిని సీరియస్గా తీసుకుని విశ్లేషణలు ఇవ్వలేదు. అదే ఏపీలో అయితే మాత్రం ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. ఇదే అధర్మ యుద్దం అంటే. జగన్ విజయం సాధించినప్పటి నుంచి ఈనాడు అధినేత రామోజీరావు మరికొందరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. దాంతో ఇలా అధర్మ యుద్దం చేసి అయినా జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని తంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా వ్యవహరించి క్రెడిబిలిటిని దెబ్బతీసుకుంటున్నాయి. అయినా వారికి ఏదో అంశం కావాలి కాబట్టి విమర్శలు చేస్తారు. కాని మీడియాకు ఏమైంది. వారే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్రం డీజిల్ ధరలు పెంచినా ఆ విషయం దాచి పెట్టి, అదేదో ఏపీలో పనిలేక ధరలు పెంచారన్న చందంగా కథనాలు ఇస్తున్నారు. దానిని బట్టే వారు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది!.. 5 కీలక అంశాలు
Pakistan Political Crisis: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విపక్షాల మధ్య మొదలైన యద్ధం రసవత్తరంగా మారుతోంది. ఇమ్రాన్ఖాన్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. కాగా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్ఖాన్ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్ఖాన్ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. ఈ అనూహ్య నిర్ణయం ద్వారా ప్రతిపక్షాలకు పెద్ద షాక్ తగిలింది. అంతేకాకుండా ఇమ్రాన్ఖాన్కు పదవీ గండం తప్పింది. ప్రస్తుతం పాక్లోని రాజకీయ సంక్షోభంలో 5 కీలక అంశాలు ఇవే.. 1.ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి చెందిన 12 మందికి పైగా శాసనసభ్యులు, అలానే పార్టీలో కీలకంగా ఉన్న ప్రతిపక్షాలకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత వారం, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ 342 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయింది. ప్రభుత్వం కొనసాగాలంటే 172 మంది సభ్యుల బలాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంది. 2. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సాదిక్ సంజరానీ ఈ అవిశ్వాస తీర్మానమంతా విదేశీ కుట్ర అని ఆరోపిస్తూ సభను రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. 3.ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ప్రజలను ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ప్రతిపక్షాల కుట్ర భగ్నమైందని ఆయన అన్నారు. 4. ‘ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షాలు పార్లమెంటును విడిచిపెట్టడం లేదు. ఈ అంశంపై మా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు’.. అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు. 5.పాకిస్థాన్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ప్రపంచ సమస్యలపై అమెరికా యూరప్ తరపున మాట్లాడనందుకే ఈ పరిణామాలని వివరించారు. ఈ కారణంతోనే ప్రతిపక్షాలు తనను తొలగించడానికి అమెరికాతో కలిసి కుట్ర పన్నుతున్నాయని ఇమ్రాన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ సిపారసుతో జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చారు. దీంతో పాక్లో ముందుస్తు ఎన్నికలు జరగడం ఖాయమైంది. చదవండి: Social Media Ban in Sri Lanka: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు -
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో భారీ షాక్
ఇస్లామాబాద్: చివరి బంతి దాకా బరిలో ఉంటానన్న ఇమ్రాన్ఖాన్ ఆట ఆడకుండానే వెనుదిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్క్యూఎమ్ బుధవారం సంకీర్ణానికి గుడ్బై చెప్పి, ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్ఖాన్ మెజార్టీ కోల్పోయారు. అయితే అవిశ్వాస తీర్మానం విదేశీ శక్తులు సృష్టించిన సంక్షోభమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు. దీనిపై మీడియాకు ఆధారాలు విడుదల చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా, పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకుగాను పీటీఐకి 155 మంది ఉన్నారు. మరో ఆరు పార్టీల నుంచి 23 మంది మద్దతుతో ఇమ్రాన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవిశ్వాస గండం గట్టెక్కాలంటే 172 మంది మద్దతు కావాలి. కానీ 24 మంది సొంత ఎంపీల తిరుగుబాటుతో పాటు, ఐదుగురు సభ్యులున్న ఎమ్క్యూఎమ్ కూడా సంకీర్ణానికి గుడ్బై చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ చివరి బంతిదాకా మ్యాచ్ను కొనసాగించకుండా రాజీనామా చేస్తారని సమాచారం. చదవండి: (యుద్దం ముగిసిపోలేదు: జెలెన్స్కీ) జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తారా ? అవిశ్వాసం తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారంటున్నానరు. జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సన్నిహితులు సూచిస్తున్నారు. ఆదివారం ఇస్లామాబాద్లో ఇమ్రాన్ జరిపిన ర్యాలీ బల ప్రదర్శనేనన్న అభిప్రాయాలున్నాయి. లండన్లో కూర్చున్న వ్యక్తి పాక్లో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ డబ్బును వాడుతున్నారంటూ విపక్ష నేత నవాజ్ షరీఫ్పై ర్యాలీలో ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. ఇదంతా ఎన్నికల ప్రచారం మాదిరిగానే ఉందని, బహుశా ముందస్తుకు ఇమ్రాన్ సై అంటారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
అంకెలపై లంకెబిందె కథలు!
నిజం నిద్ర లేచేసరికి అబద్ధం దేశాన్ని చుట్టేస్తుందంటారు. మసాలా వేసి వండిన వంటకం కనుక అబద్ధపు ఘుమఘుమలు తొందరగా వ్యాపిస్తాయని ఈ సామెత ఉద్దేశం. అటువంటి అబద్ధాలు వ్యవస్థీకృత రూపం దాల్చితే? సమస్త వనరుల్ని తమ గుప్పెట పెట్టుకున్న శక్తిమంతులే ఆ వ్యవస్థ వెనుక నిర్దేశకులుగా నిలబడితే ఏమవుతుంది? – అబద్ధాలు సూపర్సోనిక్ రెక్కల్ని తొడుక్కుంటాయి. నిజాల తరంగదైర్ఘ్యాలు నిస్సహాయపు ముద్ర దాల్చవలసి ఉంటుంది. ఒకానొక చారిత్రక దుర్ముహూర్తంలో పాతికేళ్లకు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థీకృత అబద్ధాలకు విత్తనం పడింది. రాజకీయ వ్యవస్థలో వెన్నుపోటు అనే వినూత్న పద్ధతిలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ శక్తికి అసత్య ప్రచారాలను ఆక్సిజన్ మాదిరిగా ఎక్కించవలసి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాదారుల్లోంచి ఆ రాజకీయ శక్తి ‘క్రోనీ క్యాపిటలిజా’న్ని ప్రోది చేసింది. ఇంతింతై చెట్టంతైన ‘క్రోనీ కేపిటలిజమ్’ ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని పార్శ్వాల్లోనూ తన ఊడలను దించడం ప్రారంభించింది. ఫలితంగా ఆ రాజకీయ శక్తి చుట్టూ డబ్బూ, పలుకుబడి కలిగిన ఒక ముఠా వలయం మాదిరిగా అల్లుకున్నది. సకల వనరులతోపాటు ఈ ముఠా చేతిలో ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి. ఈ కార్ఖానాలు పందిని తయారుచేసి నందిగా బ్రాండింగ్ చేయగలవు. వినియోగదారుడు నమ్మి తీరవలసిందే! తనకు లాభసాటిగా ఉన్న రాజకీయ–ఆర్థిక–సామాజిక పొందికలో ఏ చిన్న మార్పునూ ఈ క్రోనీ ముఠా సహించలేదు. వారి కర్మఫలాన రెండున్నరయేళ్ల క్రితం రాజకీయ పొందికలో ఒక మార్పు జరిగింది. ఫాదర్ ఆఫ్ ఆంధ్రా క్రోనీ క్యాపిటలిజమ్ అధికారానికి దూరమయ్యాడు. అధికారంలోకి వచ్చిన రాజకీయ శక్తి సామాజిక–ఆర్థిక పొందికలోనూ మార్పులు చేయడం ప్రారంభించింది. నిర్భాగ్యులనూ, నిస్సహాయులనూ సాధికారం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాలను క్రోనీ ముఠా ప్రాణాంతకంగా పరిగణించింది. దీనికి చెక్ చెప్పడానికి తమ చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయ ఉత్పత్తి కర్మాగారాలను మూడు షిప్టుల్లో నడపడం ప్రారంభించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన.. జరుగుతున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగి ఉండలేదు. ఈ ప్రచారానికి పునాదిరాళ్లు అబద్ధాలే. నందిని పందిగా, పందిని నందిగా జనం మదిలో ముద్రించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇందుకోసం అన్నిరకాల మార్కెటింగ్ టెక్నిక్లనూ రంగంలోకి దించారు. ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కొంత కాలంపాటు కష్టపడ్డారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా తిప్పికొట్టారు. దాంతో అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని శక్తులనూ ఏకం చేయడానికి ప్రయత్నించారు. పార్టీలను ఏకం చేయగలిగారు కానీ ప్రజలను ఒప్పించ లేకపోయారు. ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం క్వారీల్లో చొరబడి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన ఆనాటి గాయాలు సలపడంతో తోక ముడిచారు. వరసగా ఓ అరడజన్ ప్రచారాలు బోల్తాకొట్టిన తర్వాత అప్పులు – అభివృద్ధి, పెట్టుబడులు అనే అంశాలతో కూడిన ఒక మెగా క్యాంపెయిన్ను ప్రారంభించారు. మల్టీస్టారర్ షోగా దీన్ని మలిచారు. కొత్త ప్రభుత్వం వేలకోట్లు అప్పులు చేసిందనీ, ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనీ, దివాళా పరిస్థితి ఏర్పడింది కనుక ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనీ డిమాండ్ చేసేదాకా ఈ ప్రచారాన్ని నడుపుతున్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి జాడే రాష్ట్రంలో కన్పించడం లేదని ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా–అనే చతురంగ బలాలను యుద్ధప్రాతిపదికపై నడిపిస్తున్నారు. ఈ దుమారంలో కొట్టుకొనిపోకుండా నిజా నిజాలను నిష్పాక్షికంగా దర్శించవలసిన అవసరం ఉన్నది. నిజాలకు నిలువుటద్దాల వంటి అంకెలన్నీ మనకు అందు బాటులోనే ఉన్నాయి. అవును. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేసిన మాట నిజం. కరోనా కాలంలో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ది ఆరో స్థానం. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది. ఇంతకుముందున్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసి, మరో 60 వేల కోట్ల బకాయిల భారాన్ని తలపై మోపి, ఏటా 20 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన వారసత్వాన్ని ఏపీ కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. కరోనా కాలంలో ఏపీ కంటే అధికంగా అప్పులు చేసిన ఐదు రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి ‘ఘనమైన’ వారసత్వ సంపద లేదు. చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఖర్చు పెట్టిన పద్దులేమిటి? చేసిన అభివృద్ధి ఎంత? సంక్షేమం మాటేమిటి? అనే విషయాలను పరిశీలించాలి. అంతకు ముందు ఏపీ పరిణా మాలపై నిపుణులైన ఆర్థికవేత్తలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పీఆర్ఎస్ ఇండియా అనే ఒక ప్రముఖ ఇండిపెండెంట్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో పేదవర్గాలను ఆదుకోవడానికి ఏ రాష్ట్రం ఎంతమేరకు బడ్జెట్ కేటాయింపులు చేసిందనే అంశాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. జాబితాలో 13.1 శాతం బడ్జెట్ కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. 7.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 4.8 శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ చేసింది. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి కూడా ఏపీ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నదని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం బడ్జెట్లో మూలధన వ్యయంగా (Capital expenditure) 35 వేల కోట్లు కేటాయిస్తే రెండేళ్లు తిరిగేసరికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పద్దును 45 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది ఆర్బీఐ లెక్క. ఉద్యోగుల జీతభత్యాల కింద చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ. 32 వేల కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్లలో ఆ పద్దును వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లకు పెంచిందని ఆర్బీఐ వెల్లడించింది. సమ్మిళిత అభివృద్ధి(inclusive growth)లో ఆంధ్రప్రదేశ్ది దేశంలో తొలిస్థానమని ‘ఇండియా టుడే’ సర్వే (2021) తేల్చి చెప్పింది. 2003 సంవత్సరం నుంచి ప్రతియేటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్వయంగా కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటు విప్లవాత్మకమైన ఆలోచనగా ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా ఏఐఎల్ డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్ – సీఓఓ పంకజ్ శర్మ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. గతంలో ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం రాష్ట్రమంతటా మార్మోగితే, ఇప్పుడు ‘జగన్ వచ్చాడు..అభివృద్ధి తెచ్చాడు’ అనే నినాదం వినిపిస్తోందని వ్యాఖ్యా నించారు. కొత్త కంపెనీలు శంకుస్థాపన సమయంలో విస్తరణ కార్యక్రమాలను వివరంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి గుర్తు. ఇక్కడ ఫ్యాక్టరీని నడపలేక కియా మోటార్స్ కంపెనీ వెళ్లిపోతున్నదని మనవాళ్లు ఎంత ప్రచారం చేసినా, ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సెంచురీ ప్లైవుడ్స్ తన పెట్టుబడిని నాలుగింతలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏటీజీ టైర్స్ కూడా తన పెట్టుబడిని రెండింతలకు పెంచింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెద్ద సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని చాలామంది గుర్తించారు. ‘నాడు – నేడు’ కార్యక్రమంతోపాటు కొత్త వైద్యశాలల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం, కొత్త సూపర్ స్పెషాలిటీల నిర్మాణం, వైఎస్ఆర్ విలేజి క్లినిక్స్ కోసం ప్రభుత్వం సుమారుగా రూ. 32 వేల కోట్లు కేటాయించింది. సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. ‘ఆరోగ్యశ్రీ’ కింద బడ్జెట్లో రెండువేల కోట్ల కేటాయింపు, 1,088 కొత్త అంబు లెన్స్ల ప్రారంభం... పైన చెప్పిన ఖర్చుకు అదనం. ఫలితంగా వైద్యరంగం వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నది. పేద – ధనిక, సామాజిక హోదా వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి గడపకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ వెళ్లే లక్ష్యం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల సంఖ్యలో 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపించింది. రెండేళ్ల కిందటి దాకా సుదూరంగా వుండే గిరిజన గూడేల్లోని మహిళలు కాన్పుకు వెళ్లాలంటే డోలీలే శరణ్యం. భగవంతునిపైనే భారం. ఇప్పుడు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా 104 వాహనం ఆమె ఇంటి ముందు ఆగి, మందులిస్తున్నది. కాన్పు సమయంలో అదే వాహనంలో తీసుకెళ్లి కాన్పు తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు. గిరిజన జీవితాలలో 104 అంబు లెన్స్ పెనుమార్పును తెచ్చింది. విద్యారంగంలో ‘నాడు–నేడు’కు 16 వేల కోట్ల రూపా యలు కేటాయించారు. ఇప్పటికే తొలిదశ పూర్తయింది. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం విద్య ప్రతి విద్యార్థికీ ధనిక–పేద తేడా లేకుండా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండేళ్లలో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. వారు ఏటా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వగైరాల కోసం చేసే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు మిగిలిపోయాయి. ఈ సొమ్మును వారు మెరుగైన జీవితం కోసం ఉపయోగించుకోగలుగుతారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకురూ. 3,600 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త హార్బర్లలో 10 వేల మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభిస్తుందని అంచనా ఉన్నది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పదివేల కోట్ల అదనపు ఆదాయం ప్రతియేటా మత్స్యకారులకు లభిస్తుంది. గుజరాత్ సముద్ర తీరాల్లో పొట్టకూటి కోసం శ్రమదోపిడీకి గురయ్యే పరిస్థితి నుంచి మత్స్యకారులు సగర్వంగా నిలబడే స్థితికి చేరుకుంటారు. 31 లక్షల కుటుంబాలకు నిలువనీడ కల్పించే బృహత్తర కార్యక్రమం వైఎస్సార్ – జగనన్న కాలనీల ఏర్పాటు. ఏకబిగిన ఇన్ని ఇళ్లను నిర్మించిన కార్యక్రమం దేశ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం యాభైవేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మహాయజ్ఞంలో మహిళా సాధికారత అనే సామాజిక న్యాయ సూత్రం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇళ్లన్నీ పూర్తయి అక్కడ కాలనీ జీవితం మొదలైన తర్వాత వాటి విలువ అథమపక్షం రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ ఒక్క పథకంలో మూడు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించి మహిళల చేతిలో జగన్ ప్రభుత్వం ఉంచబోతున్నది. ప్రభుత్వరంగంలో విస్తారంగా ఆస్తుల కల్పన జరుగు తున్నది. రూ. 4,200 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణం, 2,300 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం, 416 కోట్లతో బల్క్ మిల్క్ యూనిట్ భవనాల నిర్మాణం, 690 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 13 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, భావన పాడు ఓడరేవుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 13,885 కొత్త ఎంఎస్ఎంఇ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. మరో 42 వేల కోట్ల పెట్టుబడులతో 72 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 96 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రభుత్వరంగ యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ రెండున్నరేళ్ల పరిపాలనా కాలంలో, అందులో రెండేళ్ల సమ యాన్ని 30 వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని, ఇంకెన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని కోవిడ్ మహమ్మారి మింగేసిన కాలంలో స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, అప్పులు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవి. ఉద్యోగాల కల్పన పెరిగింది, పనిదినాల కల్పన పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తున్నది. ఆర్బీకేల ఏర్పాటు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రెండున్నరేళ్లలో సాధించిన సమ్మిళిత అభివృద్ధితో మరే రెండున్నరేళ్ల కాలం కూడా పోటీపడలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంకెలు అబద్ధం చెప్పవు! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి
చండీగఢ్: పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దాకా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్లుగా ఉంది. దీన్ని కేంద్రం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా ఈ పరిధిలో నివసించే ఎవరినైనా విచారించే, అరెస్టు చేసే, సోదాలు చేపట్టే అధికారం బీఎస్ఎఫ్కు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా పంజాబ్ సీఎంæ చన్నీ అభివర్ణించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. -
మూలధన వ్యయంలో.. ఏపీ అత్యుత్తమ ప్రగతి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూల ధన వ్యయంలో అత్యుత్తమ ప్రగతి సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. నిర్ధారించిన లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని తెలిపింది. ఏపీ సహా 11 రాష్ట్రాలు.. ఈ ఘనత సాధించినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రూ.15,721 కోట్ల మేర అదనపు రుణం సమకూర్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అనుమతి మంజూరు చేసింది. ఇందులో ఏపీకి రూ.2,655 కోట్ల రుణానికి అనుమతి లభించింది. ఈ అదనపు రుణం ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 0.25 శాతానికి సమానంగా చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సహాయపడతాయని తెలిపింది. ఈ మూల ధన వ్యయం భవిష్యత్లో ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు మరింత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాలు అలాగే, రాష్ట్రాలు అదనంగా 0.50 శాతం మేర రుణ సేకరణకు అనుమతి పొందాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రతి రాష్ట్రానికి మూల ధన వ్యయం లక్ష్యాలను నిర్ధారించింది. ఇందులో భాగంగా.. మొదటి త్రైమాసికంలో 15 శాతం, రెండో త్రైమాసికంలో 45 శాతం, మూడో త్రైమాసికంలో 70 శాతం, నాలుగో త్రైమాసికం చివరి నాటికి నూరు శాతం సాధించాల్సి ఉంటుంది. మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని సాధించినందున ఆంధ్రప్రదేశ్కు రూ.2,655 కోట్ల మేర అదనపు రుణ పరిమితిని మంజూరు చేసింది. ఇక రాష్ట్రాల మూలధన వ్యయ లక్ష్యాలపై తదుపరి సమీక్ష ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహిస్తామని.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్రాలు సాధించిన మూలధన వ్యయాలను అంచనా వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మూల ధన వ్యయంతో ముడిపడిన ప్రోత్సాహక అదనపు రుణాన్ని లక్ష్లా్యలను సాధించిన రాష్ట్రాలకు తదుపరి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించింది. అప్పులపై విపక్షాలు, ఎల్లో మీడియాది దుష్ప్రచారమే అప్పులపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒట్టి బూటకమని కేంద్రం చేసిన ఈ ప్రకటన రుజువు చేసింది. మరింత ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతివ్వడంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవంలేదని స్పష్టమవుతోంది. కేంద్ర నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు రూఢీ అయినట్లయింది. -
చర్యకు ప్రతిచర్య తప్పదు
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్.. కాలి గోటికి సరిపోని కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు మాట్లాడితే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తరహాలో మేము మాట్లాడాల్సి వస్తుంది, చర్యకు ప్రతిచర్య తప్పదు’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్కు ఎవరూ దిక్కులేక పక్క పార్టీ నుంచి చంద్రబాబు తొత్తును దిగుమతి చేసుకుంది. పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన వాడిని పార్టీ అధ్యక్షుడిగా చేసుకున్నారు. కాంగ్రెస్ను చంద్రబాబు ఫ్రాంచైజీ తీసుకుని నడిపిస్తున్నారు. చంద్రబాబు ఆడించే ఆటలో రేవంత్ ఓ తోలు బొమ్మ’అని దుయ్యబట్టారు. ‘టీపీసీసీ అధ్యక్షపదవితో దేశానికి ప్రధాని అయినట్లు రేవంత్ ఫీల్ అవుతున్నాడు. మేడ్చల్ నియోజకవర్గానికి వెళ్లి మంత్రి మల్లారెడ్డిని రేవంత్ నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఆ ఆవేశంలో మల్లారెడ్డి ఒక మాట అన్నడు. రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉం డాలి. రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంను పట్టుకుని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే ఎన్ని రోజులు భరించాలి. కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభు త్వం ఉన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే అరెస్టు చేశారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’అని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే వీళ్లకు కడుపునొప్పి.. ‘ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపునొప్పి వస్తోందా? అధికార యావతప్ప వేరే జబ్బు ఏముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసమో ప్రజలకు చెప్పాలి. హైదరా బాద్ వరదల్లో నష్టపోయిన వారికి నయాపైసా ఇవ్వకున్నా ఆశీర్వదించమని అడుగుతారా?, రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో భాగంగా ఇంకా ఏవైనా ఆస్తులు ఉన్నాయో గుర్తించేందుకు యాత్ర చేస్తున్నారా?. మౌలాలిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు 4 ఎకరాలు ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు అక్కడే రైల్వేకు సంబంధించిన 21 ఎకరాలు అమ్మేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.11.40 లక్షల ఉద్యోగాల్లో దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలో అమలు చేసేలా సంజయ్.. మోదీకి సలహా ఇవ్వాలి’అని మంత్రి వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2 నుంచి సంస్థాగత కమిటీలు ‘రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సెప్టెంబర్ 2న జెండా పండుగ నిర్వహించి టీఆర్ఎస్ వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభించాలి. అదే రోజు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. సెప్టెంబర్ 12లోగా గ్రామ, వార్డు కమిటీలు, అదే నెల 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి. సెప్టెంబర్ 20 తర్వాత పార్టీ ముఖ్య నేతలతో చర్చించి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్ కమిటీలతో పాటు 1,400కు పైగా నోటిఫైడ్ మురికివాడల్లోనూ బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తాం. పార్టీ నియమావళి ప్రకారం.. అన్ని కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 51 శాతం అవకాశం ఇవ్వడంతో పాటు మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిం చాలి. మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేసి, క్రియాశీలంగా పనిచేసే వారికే పార్టీ కమిటీల్లో చోటు కల్పిస్తాం. జీహెచ్ఎంసీలో కమిటీల ఏర్పాటు గురించి రెండుమూడు రోజుల్లో సమావేశం జరుగుతుంది. పార్టీ ఏర్పడిన 20 ఏళ్లలో ఢిల్లీలో జెండా పాతే స్థాయికి ఎదగడం హర్షణీయం’అని కేటీఆర్ వివరించారు. -
నినాదాలు.. నిరసనలు
న్యూఢిల్లీ: వివాదాస్పద పెగసస్ స్పైవేర్, మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన పర్వం యథావిధిగా కొనసాగాయి. లోక్సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష సభ్యులు వెంటనే వెల్లోకి చేరుకొని నినాదాలు చేశారు. పెగసస్తోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. వెనక్కి వెళ్లి సీట్లల్లో కూర్చోవాలని, సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. 15 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’పై చర్చకు అనుమతించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. సీరియస్ విషయమని సుప్రీం చెప్పిందిగా.. పెగసస్ స్పైవేర్పై వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం లోక్సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’ను తీసుకొచ్చిందని, అదే న్యాయస్థానం పెగసస్ అనేది సీరియస్ విషయమని చెప్పిందని అన్నారు. ఇంతలో ఆయన మైక్రోఫోన్ను స్పీకర్ స్విచ్చాఫ్ చేశారు. తర్వాత ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టినప్పుడు అధిర్ రంజన్ మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ స్పందిస్తూ.. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు. రాజ్యసభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు ఎగువ సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్లోకి దూసుకొచ్చి కాగితాలు వెదజల్లి, బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల కోసం సభ మళ్లీ ప్రారంభమయ్యింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న సురేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఉభయ సభల్లో ఆందోళన సాగిస్తున్నాయి. -
ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ యోగి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హథ్రాస్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ‘అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రయత్నించడం ద్వారా మా ప్రత్యర్థులు మాపై కుట్ర చేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రతిపక్ష పార్టీల అల్లర్లు చూడటానికి ఆసక్తిగా ఉన్నాయి. ఈ కుట్రల మధ్య మేము ముందుకు సాగాలి’ అని అన్నారు. దేశ వ్యతిరేక వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించడం కష్టమని, దేశ అభివృద్ధి పట్ల అంకితభావం చూపాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను కోరారు. ‘బీజేపీ కార్యకర్తలు దేశ అభివృద్ధికి తమను తాము అంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లర్లు, బంద్లతో అట్టుడికే ఉత్తరప్రదేశ్నే దేశ వ్యతిరేక వ్యక్తులు కోరుకుంటున్నారు, వారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించలేరు. కాబట్టి వారు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు’ అని యోగి అన్నారు. చదవండి: హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా? -
ఇమ్రాన్ లాడెన్ను కీర్తిస్తారా..!
ఇస్లామాబాద్ : అమెరికాపై భీకర దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడని సంబోధించడం పట్ల విపక్షం మాజీ క్రికెటర్పై విరుచుకుపడింది. ఇమ్రాన్ గురువారం పాక్ పార్లమెంట్లో మాట్లాడుతూ 2011లో అమెరికన్ దళాలు పాక్ నగరం అబాట్టాబాద్లోని లాడెన్ స్ధావరంపై దాడిచేసి ఆయనను మట్టుబెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ హెలికాఫ్టర్లు లాడెన్ స్ధావరంపై దాడికి తెగబడిన ఆపరేషన్ గురించి పాకిస్తాన్కు తెలియదని, అమెరికన్ దళాలు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చి అమరుడిని చేయడం పట్ల పాకిస్తానీలుగా మనం ఎంత ఇబ్బందులకు గురయ్యామో తాను ఎన్నటికీ మరవలేనని చెప్పుకొచ్చారు. కాగా ఇమ్రాన్ వ్యాఖ్యలను విపక్ష నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ తప్పుపట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిని అమరుడిగా ఇమ్రాన్ ఖాన్ కొనియాడారని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ను అమెరికా మట్టుపెట్టిన సమయంలో అధికారంలో ఉన్న పీపీపీ నేత బిలావల్ బుట్టో జర్ధారి సైతం ఇమ్రాన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హింసాత్మక అతివాదాన్ని ప్రధాని సమర్ధిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి : ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు -
వారంలో మూడుగంటలే!
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి. దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. -
విపక్షాలపై రాంమాధవ్ మండిపాటు
-
'రాష్ట్రంలో టీఆర్ఎస్సే మా ప్రధాన రాజకీయ శత్రువు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తమ ప్రధాన రాజకీయ శత్రువు టీఆర్ఎస్ పార్టీనేనని, టీఆర్ఎస్తో యుద్ధం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక కోలుకునే పరిస్థితి లేదని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. దక్షిణాదిలో పాత రాజకీయాలు పోయి కొత్త రాజకీయాలు రాబోతున్నాయన్నారు. ఆర్టీసీ విషయంలో ప్రజలు, కార్మికుల దృష్టిలో కేసీఆర్ ఓడిపోయారన్నారు. టీఆర్ఎస్కు ఓవైసీ భూతం పట్టిందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్ను ఆ పార్టీ వ్యతిరేకించిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ, ఆ ఎన్నికకు ఇంకా టైం ఉందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నేతలు మురళీధరరావును సన్మానించారు. -
నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి
హాంకాంగ్/బీజింగ్: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను మార్చలేదు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్ స్థానంలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తోసిపుచ్చారు. లామ్కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్. బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్లో తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేసి తిరిగి హాంకాంగ్కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. -
నాయకత్వం వహించండి.. వామ్మో నావల్ల కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న విపక్షాలు తమ నూతన సారథి కోసం అన్వేషిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రతిపక్షాలకు పెద్ద దిక్కుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యయి. గత ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో 2024లో దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల కోసం విపక్షాలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాల్సిందిగా జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఆహ్వానం అందింది. నాయకత్వమా? ఆసక్తిలేదు.. ఈ మేరకు ఆర్జేడీ సీనియర్ నాయకుడు శివానందన్ తివారీ నితీష్ను కోరారు. ‘‘సరైన నాయకుడు లేనందున దేశ వ్యాప్తంగా విపక్షాలు బలహీనపడిపోతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు, మోదీ, అమిత్ షాకు ధీటైన నేత ఎవ్వరూ లేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ముందుండి సమర్థవంతంగా నడిపించగల నేత కనిపించట్లేదు. ఆ బాధ్యతను మీరు (నితీష్) తీసుకోవాలి. దీనికి మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’అంటూ శివానందన్ పేర్కొన్నారు. అయితే దీనిపై నితీష్ కుమార్ గురువారం నాడు స్పందించారు. తాము ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉన్నామని, విపక్షాల విజ్ఞప్తిపై తనకు అంత ఆసక్తి లేదని తోసిపుచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు తాను ఎన్డీయేలోనే కొనసాగుతామని తెలిపినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక దారిలో.. కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ మంత్రివర్గంలో నితీష్ సారథ్యంలోని జేడీయూ చేరలేదన్న విషయం తెలిసిందే. అలాగే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిపుల్ బిల్లును కూడా జేడీయూ వ్యతిరేకించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓటింగ్కు దూరంగా ఉంది. అయితే బీజేపీ వ్యతిరేక ధోరణిలో నితీష్ ప్రయాణిస్తున్నారని పసిగట్టిన విపక్ష నేతలు ఆయన్ని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే విపక్షాల తరఫున నాయకత్వం వహించాలని ఆహ్వానం పంపుతున్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండడంతో నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
చేతులెత్తేసిన ప్రతిపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఆట ఆడకముందే ఓడిపోవడం అంటే ఇదే. రాజ్యసభలో ప్రతిపక్షం చేసిందీ ఇదే. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్, ఆర్టీఐ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయంటే ప్రతిపక్షం చేతులెత్తేయడమే అందుకు కారణం. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు కావాల్సినంత బలం రాజ్యసభలో ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ అలా జరగలేదు. అఖండ మెజారిటీతో తాము అధికారాన్ని చేపట్టినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ కలిగిన ప్రతిపక్షాల వల్ల తమ బిల్లులన్నీ వీగిపోతున్నాయంటూ గతంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ మొత్తుకున్నట్లు ఇంకెవరు ఏడ్వాల్సిన అవసరం లేదు. చదవండి: ట్రిపుల్ తలాక్ ఇక రద్దు వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లును గత లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. ఇంతకుముందు లోక్సభ, నేటి లోక్సభ నాటికి రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయితప్ప, ప్రతిపక్షం మెజారిటీ పెద్దగా పడిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఈ వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. ముస్లిం మహిళలకు మేలుకు ఉద్దేశించిన ఈ బిల్లు వల్ల కీడే ఎక్కువ జరుగుతుందన్నది ప్రతపక్షాల వాదన. ఈ బిల్లును గతవారం రాజ్యసభ 99–84 మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లులోని లోపాలను సవరించేందుకు ఎంపిక కమిటీ పంపించాలంటూ ప్రతిపక్షం ప్రవేశ పెట్టిన తీర్మానం 84–100 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఇక ఆర్టీఐ స్వయం ప్రతిపత్తిని సడలిస్తున్న సవరణ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఎందుకు? ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు వల్ల ఇది జరిగిందా? మరి వారెందుకు గైర్హాజరయ్యారు? ట్రిబుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు నలుగురు కాంగ్రెస్ సభ్యులు, ఆరుగురు సమాజ్వాది పార్టీ సభ్యులు, నలుగురు బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తోపాటు మరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున, డీఎంకే, సీపీఎం, తణమూల్ కాంగ్రెస్ల నుంచి ఒక్కరేసి చొప్పున గైర్హాజరయ్యారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు నిజంగా అనారోగ్య కారణాల వల్ల సభకు హాజరుకాక పోవచ్చు. మరి, ఇంత మంది ఎందుకు గైర్హాజరయ్యారు. రెండోసారి మరింత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఏం చేయలేమనే నిర్లిప్త భావం వారిని అలుముకుందా ? ప్రతిపక్షాల మధ్య సమన్వయం లోపించిందా ? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలనే తపన వారిలో చచ్చి పోయిందా? లేదా అధికార పక్షం ప్రలోభాలకు వారు లొంగిపోయారా? తలాక్ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు అది అవాంఛిత బిల్లని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ముఫ్తీ మెహబూబా విమర్శించారు. అయితే ఆ రోజు సభకు ఆమె పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు కూడా హాజరుకాలేదు. అంటే తమ పార్టీ సభ్యులు హాజరైన అడ్డుకోలేరనా, అదే అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం కొరవడినట్లే. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఆరోజు సభలో కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. ఇతర పార్టీల సభ్యుల గైర్హాజరు పట్లనే అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు కారణంగానే బిల్లులు ఆమోదం పొందినట్లు బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభలో కూడా ఇక ప్రతిపక్షం వీగిపోయినట్లే. పాలకపక్షం ఎలాంటి బిల్లులను తీసుకొచ్చినా చెల్లుబాటు కావడం తప్పదేమో! -
విపక్షాలన్నీ కకావికలం
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ పార్టీ 303 సీట్లతో అఖండ విజయం సాధించడంతో షాక్కు గురైన ప్రతిపక్ష పార్టీలు ఈ పాటికి తేరుకొని పార్లమెంటులో నిర్ణయాత్మక పాత్రను పోషించాల్సిందిపోయి ఇంకా కకావికలం అవుతున్నాయి. ఇతర విపక్షాలను సమీకరించాల్సిన కాంగ్రెస్ పార్టీయే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. యూపీలో కలసికట్టుగా పోటీ చేసిన ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి బీఎస్పీ విడిపోయింది. ఒక్క ఎస్పీతోనేగాదని, ఏ పార్టీతోని భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. పార్లమెంటులోనైనా బీజేపీని సమైక్యంగా ఎదుర్కొందాం, రారండోయ్ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుస్తీ పడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, అసహనంతో ఓటర్లను దూషిస్తున్నారు. ‘ఓట్లేమో బీజేపీకి వేస్తారు. పనులేమో నేను చేసిపెట్టాలా ?’ అంటూ ఇటీవల ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బిహార్లో ‘మహాఘట్బంధన్’కు నాయకత్వం వహించిన తేజశ్వి యాదవ్ ఫలితాల అనంతరం పత్తాలేకుండాపోయి శనివారం నాడు ట్విటర్ ద్వారా జనంలోకి వచ్చారు. బిహార్లో ఎన్సెఫలైటిస్ వల్ల 150 మంది పిల్లలు మరణించడం వల్ల రాలేకపోవడం ఒక కారణమైతే కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిరావడం మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకే కొమ్ముకాస్తోంది. గత కొంతకాలంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ సహా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. జూలై 5వ తేదీ నుంచి జరుగనున్న బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలా జరక్కపోతే 12 లోక్సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొన్నటికంటే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. -
ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కావడంతో శాసనసభలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎల్పీ విలీన ప్రక్రియకు స్పీకర్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. 120 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఏఐఎంఐఎం అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలో పదో వంతు సభ్యుల బలం లేకున్నా.. రెండో అతిపెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే పక్షంలో.. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు. గులాబీ గూటికి మరో ఇద్దరు? కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, మరో శాసనసభ్యుడు ఎవరనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం సాగుతున్నా.. ఆయన చేరికపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విముఖతతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల లోక్సభ ఎన్నికల అనంతరం తనను కలిసిన మెదక్ జిల్లా శాసనసభ్యులకు జయప్రకాశ్రెడ్డి చేరిక అంశంపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. జయప్రకాశ్రెడ్డి చేరికపై తనకు, పార్టీ అధినేత కేసీఆర్కు ఆసక్తి లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేబినెట్లోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం భారీగా పెరుగుతుండగా.. చేరిక ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. వరుసగా రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. మంత్రివర్గంలో 11 మందికి చోటు కల్పించారు. రాష్ట్ర కేబినెట్లో 16 మందికి అవకాశం ఉండగా.. మలి విడత విస్తరణలో మరికొంత మందికి చోటు దక్కనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని సమాచారం. వెనుక బెంచీలకే కాంగ్రెస్ పరిమితం కాంగ్రెస్ శాసనసభా పక్షం గుర్తింపు కోల్పోవడంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు వెనుక బెంచీలకు పరిమితం కానున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సరసన అసెంబ్లీలో చోటు దక్కనుంది. అసెంబ్లీ చర్చల్లో సభ్యుల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్కు దక్కే సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీకి కూడా అసెంబ్లీలో కేవలం ఒక్కో సభ్యుడు మాత్రమే ఉన్నారు. మరోవైపు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో మరింత బలం పెంచుకుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలుపొందిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 91కి పెరిగింది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 103కి చేరింది. -
ఢిల్లీలో ముగిసిన విపక్షాల భేటీ
-
మరోమారు ‘కూటమి’ ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్లీ జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోమారు ‘కూటమి’ ప్రయోగం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేసి భంగపడ్డ ప్రతిపక్షాలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల సందర్భంగా మరోమారు ఏకం కానున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని టీపీ సీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలకు లేఖలు రాయడంతో ఆ దిశగా చర్చ మొద లైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలసి పనిచేసిన సీపీఐ, టీడీపీ, టీజేఎస్లతోపాటు సీపీఎంకు కూడా ఆయన లేఖలు రాశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులు కోమటిరెడ్డి లక్ష్మి (నల్లగొండ), ఇనుగాల వెంకట్రామిరెడ్డి (వరంగల్), కొమ్మూరి ప్రతాపరెడ్డి (రంగారెడ్డి)లకు మద్దతివ్వాలని మంగళవారం అన్ని పార్టీల అధ్యక్షులకు ఉత్తమ్ లేఖలు రాశారు. వాళ్లు ఇచ్చారు కానీ... ఉత్తమ్ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అంగీకరిస్తే మరో సారి ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎన్నికలను ఎదుర్కొన్నట్టవుతుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీఐ, టీజేఎస్, టీడీపీలతో కలసి కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో ఆశాభంగం కావడంతో ఆ తర్వాత కూటమిలోని పార్టీలు తలో దారిలో వెళ్లాయి. కలసికట్టుగా ఎన్నికలు ఎదుర్కొన్న ఆ పార్టీల నేతలు ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై కనీసం ఒక్కచోట కూర్చుని సమీక్ష చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిందే తడవుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా అధికారికంగా కలసి పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ రాసిన లేఖకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రయోగం జరుగుతుందా..? లేదా? అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. -
విపక్షాలకు సవాలు విసిరిన మోదీ
-
‘మహాకూటమి కాదు.. మహాకల్తీ గ్యాంగ్’
భాగల్పూర్/సిల్చార్: కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే తమ అవినీతి దుకాణాలు, వారసత్వ రాజకీయాలు మూతపడతాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. తనను అడ్డుకునేందుకు దేశంలోని విపక్షాలు ‘మహాకల్తీ గ్యాంగ్’గా మారాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్, అస్సాం రాష్ట్రాల్లో గురువారం జరిగిన బహిరంగ సభల్లో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై దుష్ప్రచారం.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పడ్డ మహాకూటమిని మోదీ మహాకల్తీ గ్యాంగ్గా అభివర్ణించారు. ‘‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవనీ, రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ప్రమాదంలో పడతాయనీ, రిజర్వేషన్లు ఎత్తివేస్తాడని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ డా.బీ.ఆర్.అంబేడ్కర్ తీసుకొచ్చిన కోటా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చౌకీదార్ (కాపలాదారు) అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇతరులకు నష్టం జరగకుండా ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూసీ)కు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. మోదీ మళ్లీ అధికారంలోకొస్తే తాము ఫినిష్ అయిపోతామని ఈ వేర్పాటువాద గ్యాంగ్ (ప్రతిపక్షాలు) భయపడుతోంది’ అని అన్నారు. నేటికీ పాక్లో వేధింపులు.. పౌరసత్వ చట్టాన్ని తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అస్సాంలోని సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఎన్డీయే అధికారంలోకిరాగానే సమాజంలోని అన్నివర్గాలతో చర్చించి పౌరసత్వ చట్టాన్ని తెస్తాం. అస్సాం ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ దేశవిభజన సమయంలో పాక్లోని మైనారిటీల గురించి ఆలోచించలేదు. పాక్లోని మతోన్మాదులు మన సోదరుల్ని, సోదరీమణుల్ని చిత్రహింసలు పెట్టారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ దోషి కాదా? మన కుమార్తెలు నేటికీ పాక్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వచ్చినవెంటనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తాం. మన ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. -
మీ స్టేట్మెంట్తో పాక్ హ్యాపీగా ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్లో భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీ మండిపడ్డారు. సరిహద్దుల్లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం భేటీ అయిన 21 విపక్ష పార్టీలు చేసిన ఉమ్మడి ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని, వారి ప్రకటనతో పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ, మీడియా ఆనందంగా ఉన్నాయని జవదేకర్ తప్పుబట్టారు. జైట్లీ కూడా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ‘యావత్ దేశం ఒకే గొంతుకను వినిపిస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో యావత్ దేశం ఒకే గొంతుకను వినిపించాలని నేను అభ్యర్థిస్తున్నాను. పాకిస్థాన్ తనకు అనుకూలంగా జబ్బలు చరుచుకునేలా మీరు (ప్రతిపక్షాలు) ఇచ్చిన దురుద్దేశపూరిత ప్రకటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను’ అని జైట్లీ ట్విటర్లో పేర్కొన్నారు. -
స్టాచ్యూ ఆఫ్ స్వేచ్ఛకు సంకెళ్లు
అమెరికాలో అందరికీ తెలిసిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’.ఆ స్టాచ్యూని ఎక్కి అమెరికాలో నేనున్నాను అని తెలిపిన సాహస మహిళ థెరీస్ పెట్రీషియా ఒకౌమా. ఆమెకిప్పుడు జైలు శిక్ష పడబోతోంది. ఆమెకు శిక్ష పడడం అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకే సంకెళ్లు పడడమే! ఆఫ్రికాలోని కాంగోనదికి పశ్చిమాన ఉన్న కాంగో రిపబ్లికన్లోని బ్రాజవిల్లో పుట్టి అమెరికాకి వలస వచ్చి అక్కడే స్థిరపడిన 45 ఏళ్ల థెరీస్ పెట్రీషియా ఒకౌమా పేరు సాధారణంగా అయితే అమెరికా ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఇప్పటికీ చాలామందికి ఆ పేరు తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా థెరీస్ చేసిన సాహసోపేత నిరసనని మాత్రం అమెరికా ప్రజలే కాదు, పసిబిడ్డల పట్ల ప్రేమ ఉన్న ఏ దేశ మహిళా మర్చిపోదు. మర్చిపోలేదు. కారణం.. అమెరికా చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసం ఆమె చేశారు. ప్రపంచ దేశాల ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న ట్రంప్ సహన శూన్యతకు (‘జీరో టాలరెన్స్’) వ్యతిరేకంగా థెరీస్ గత ఏడాది 2018, జూలై 4 న అమెరికా పోలీసులు కళ్లు గప్పి న్యూయార్క్ సిటీలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వడివడిగా ఎక్కేసారు. థెరీస్ ఎన్నుకున్న ఈ తరహా ధిక్కారాన్ని ఆమెరికా అంతకు మునుపెన్నడూ ఎరగదు. అయితే ఆనాటి ఆమె సాహసోపేత నిరసనకు ఆమె చెల్లించబోతోన్న మూల్యం 18 నెలల జైలు శిక్ష! మార్చి 5 వ తేదీన అమెరికా ట్రయల్ కోర్టు ఇవ్వబోయే ఈ తీర్పుకి ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎక్కడాన్ని పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ, అది క్షమార్హం కాని నేరంగా భావించింది మన్హాట్టన్ జిల్లా కోర్టు. ఆమెపై మోపిన నేరారోపణలకు గాను ఒక్కోదానికి ఆరు నెలల చొప్పున 18 నెలలు శిక్ష పడొచ్చని భావిస్తున్నారు. దుర్మార్గంపై ధర్మాగ్రహం థెరీస్ పెట్రీషియా ఒకౌమా.. ట్రంప్ జీరో టాలరెన్స్ విధానంతో పసిబిడ్డలను కుటుంబాలనుంచి వేరు చేయడం దారుణమని పని అని ఆమె భావించారు. మెక్సికో సరిహద్దు నుంచి యు.ఎస్లోకి వలస వస్తున్న కుటుంబాలలో చివరకు పాలుతాగే పిల్లలని సైతం తల్లుల నుంచి దూరం చేయడం వల్ల ఆ చర్య దీర్ఘకాలంలో పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఆమె అంతరంగాన్ని కల్లోల పరిచింది. ఈ అమానుషత్వాన్ని వ్యతిరేకించడం ఒక మహిళగా తన బాధ్యతని ఆమె అనుకున్నారు. జీరో టాలరెన్స్లోని దుష్ప్రభావాన్ని సమాజం దృష్టిలోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచించారు. థెరీస్కు స్వతహాగా చిన్నప్పటినుంచి ఎల్తైన ప్రదేశాలను అధిరోహించడం ఇష్టం. ప్రధానంగా ఎల్తైన ఇళ్లు ఎక్కడం ఆమెకెంతో ఇష్టమైన పని. ఆమె సోదరులు సైతం ఆమెతో పోటీపడేవారు కాదు. అందుకే ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించడానికి స్వేచ్ఛకి ప్రతీక అయిన లిబర్టీఆఫ్ స్టాచ్యూని ఎక్కడమే మార్గం అనుకున్నారు. తమది కూడా అమెరికాకి వలస వచ్చిన కుటుంబమే కనుక తను ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకించడం లేదని, అది తన బాధ్యతగా భావించాననీ ఆనాడే చెప్పారు థెరీస్. సొంత వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, బతకడాన్నీ ఇష్టపడే థెరీస్, 2016 లో ప్రవేశపెట్టిన ట్రంప్ వలస విధానాన్ని నిరసించి తొలిసారి ప్రపంచానికి కొద్దిగా పరిచయం అయ్యారు. అంతకుముందు ఆమె ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేసేవారు. అమెరికా వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో థెరీస్ ఒక విధంగా ఒంటరి సైనికురాలు. అప్పటివరకు ఆమె తనదైన శైలిలో వివిధ అంశాలపైన ఒంటరిగా నిరసన ప్రదర్శనలు జరిపినా, 2017లో న్యూయార్క్లోని రైజ్ అండ్ రెసిస్ట్ యాక్టివిస్ట్ గ్రూప్లో సభ్యులుగా చేరాక తన ఉద్యమప్రస్థానాన్ని విభిన్నంగా మలుచుకున్నారు. మెరుపులా ఎక్కేశారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడానికి ఒకరోజు ముందు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద రైజ్ అండ్ రెసిస్ట్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. న్యూయార్క్ పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న సందర్భంలో థెరీస్ అక్కడి నుంచి అదృశ్యమై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 20 అడుగులపైకి ఎగబాకి స్టాచ్యూ పాదాల వద్దకి చేరుకున్నారు. 3 గంటల ప్రయత్నం తరువాత న్యూయార్క్ పోలీసులు ఆమెను చేరుకోగలిగారు. ఈమె సాహసోపేత నిరసనని అమెరికా మీడియా విస్తృతంగా కవర్ చేసింది. ప్రసిద్ధ ‘ఎల్’ పత్రిక థెరీస్ చర్యను ‘‘2018లో అత్యంతశక్తిమంతమైన మహిళా కార్యక్రమంగా’’ పేర్కొన్నది. స్ట్రీట్ ఆర్ట్ తో కూడా థెరీస్ పరాక్రమ ప్రదర్శన ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది. -
మజ్బూత్? మజ్బూర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్బూర్) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్బూత్) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు. అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే.. దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రైతులే నవభారత చోదక శక్తులు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాబోయే లోక్సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పేర్కొంది. స్థిరత్వమా? అస్థిరతా? రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. -
దేశమా? తెలుగుదేశమా?
-
సీపీఎస్ను తక్షణం రద్దు చేయండి
సాక్షి, అమరావతి: కమిటీలతో కాలయాపన చేయకుండా రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. సీపీఎస్ రద్దు కోరుతూ విజయవాడలోని దాసరి భవన్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల సమస్యగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం జరుగుతున్న పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని ప్రకటించారు. పోరాటాన్ని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసులను ప్రయోగించడం దారుణమన్నారు. ఛలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా అరెస్టులు చేసినప్పటికీ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకుని ఉద్యమం నిర్వహించడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారికి ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడపై కత్తిలా ఉన్న సీపీఎస్ కన్పించడంలేదని, అందుకే అసెంబ్లీ ముట్టడిలో ఎన్జీవో నాయకుడు అశోక్బాబు లేడని అన్నారు. సీపీఎస్ను రద్దు చేయకుంటే నవంబర్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని రౌండ్టేబుల్ సమావేశం చేసిన తీర్మానం వివరాలను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతామని చెప్పారు. సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత జల్లి విల్సన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పోలారి, ఆమ్ఆద్మీ నేత పోతిన వెంకట రామారావు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ప్రధాన కార్యదర్శులు బాబురెడ్డి, జి.హృదయరాజు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అ«ధ్యక్షుడు చలసాని రామారావు, శ్రామిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు కళ్లేపల్లి శైలజ, వీఆర్వో సంఘ నాయకుడు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. సీపీఎస్ రద్దు ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పొట్టకొట్టే సీపీఎస్ రద్దు కోసం జరిగే ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి చెప్పారు. రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి నుంచి సీపీఎస్ రద్దు కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఉద్యమానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారని తెలిపారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, హెలికాఫ్ట్టర్, విమానాల్లో చక్కర్లు కొట్టేందుకు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్న చంద్రబాబుకు పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయడానికి మనసు రావడంలేదని మండిపడ్డారు. 35 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన వ్యక్తికి పెన్షన్ భరోసా కూడా లేకుండా చేస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ రద్దు విషయంలో ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. -
మోదీని గద్దె దింపడమే పనిగా పెట్టుకున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్షాలకు ఒక ఎజెండాగానీ, విధానంగానీ లేదని, ప్రధాని మోదీని గద్దె దింపడమే వారు పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. 2014 ఎన్నికల కంటే భారీ మెజారిటీతో 2019 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కార్యవర్గం ఆదివారం సమావేశమైంది. 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. మోదీని ఆపడమే తమ పథకంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. అస్సాంలో కల్లోలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ( ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశంలో ఎవరూ ఇల్లు లేకుండా ఉండకూడదనేది తమ విధానమని, ఇదే నవభారత నిర్మాణ లక్ష్యమని చెప్పారు. జన్ధన్యోజన ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి సామాన్యులు అందరూ వచ్చారుని పేర్కొన్నారు. కార్యవర్గ భేటీలో బీజేపీ రాజకీయ తీర్మానాన్ని రాజ్నాథ్ ప్రవేశపెట్టారు. -
పార్లమెంట్ ప్రాంఘణంలో విపక్షల ఆందోళన
-
విపక్ష కూటమిలో చేరం: కేజ్రీవాల్
జింద్: రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన కూటమిలో చేరబోమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ కూటమిలో చేరాలనుకుంటున్న పార్టీలు ఇప్పటిదాకా దేశాభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించలేదని అన్నారు. గురువారం రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ విలేకర్లతో మాట్లాడారు. హరియాణాలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో ఆప్ పోటీచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న అన్ని కార్యక్రమాలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఢిల్లీతో పోలిస్తే హరియాణా అభివృద్ధిలో చాలా వెనకబడిందని, అభివృద్ధిపై ఢిల్లీ నుంచి హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. -
‘రాజ్యసభ బరి’లో కాంగ్రెస్ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార ఎన్డీఏ హరివంశ్ను తమ అభ్యర్థిగా ప్రకటించగా ప్రతిపక్షాలు కాంగ్రెస్కే ఆ అవకాశం ఇచ్చాయి. దీంతో తమ అభ్యర్థి బరిలో ఉంటారని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీయూకు చెందిన హరివంశ్ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో అధికార బీజేపీ మరో అడుగు ముందుకేసింది. బిహార్ సీఎం ద్వారా ఒడిశా సీఎం పట్నాయక్కు ఫోన్ చేయించి అనుకూలమైన ఫలితాలను రాబట్టగలిగిందని సమాచారం. దీంతో బిజూ జనతాదళ్కు చెందిన 9 మంది సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ రేసులో బీజేడీ మద్దతు కీలకంగా మారనుంది. కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే శివసేన కూడా ఎన్డీఏకు సానుకూల సంకేతాలు పంపిందని సమాచారం. అయితే, ఓటింగ్ మొదలయ్యే గంట ముందు తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. తెలంగాణలో టీఆర్ఎస్ హరివంశ్కే ఓటేస్తామని తెలిపింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరగనుండగా నామినేషన్లకు నేడే చివరి తేదీ. కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో ఉంచేందుకు మంగళవారం ఢిల్లీలో పలు దఫాలు చర్చలు జరిపారు. ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీ, వామపక్ష పార్టీలు తమ తరఫున ఎవరినీ బరిలో ఉంచబోమని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కే ఆ అవకాశం వదిలిపెట్టాయి. ఆ పార్టీ ప్రకటించే అభ్యర్థినే బలపరుస్తామని టీడీపీ సహా ప్రతిపక్షం ప్రకటించింది. దీంతో నామినేషన్లకు ఆఖరి రోజైన బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోందని ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారు. తమ మాట వినని పార్టీలు, నేతలపై కేసులు, ఆరోపణలు, సీబీఐ దాడులు తదితర అస్త్రాలతో బెదిరింపులకు పాల్పడుతుందని అంటున్నారు. -
కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్ వారించిన కూడా వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
డొనాల్డ్ ట్రంప్ ఏకాకి
లామాల్బె(కెనడా): ఊహించినట్లుగానే జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు వాడివేడిగా జరిగింది. మిత్ర దేశాల అల్యూమినియం, ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్లు పెంచిన అంశం చర్చలను కుదిపేసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా అమెరికా ఒక వైపు, మిగిలిన ఆరు దేశాలు మరోవైపు చీలిపోయినట్లు తెలుస్తోంది. వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోలేదని తెలిసింది. సుంకాల పెంపుతో ఇతర దేశాల్లో నెలకొన్న వ్యతిరేకతను ఉమ్మడి ప్రకటన లాంటివి దాచలేవని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితంగా కెనడాలోని క్యూబెక్లో జరిగిన రెండు రోజుల సదస్సు శనివారం ప్రతిష్టంభనతోనే ముగిసింది. విభేదాలు ప్రస్ఫుటం.. వాణిజ్య యుద్ధానికి దారితీసేలా ఉన్న పరిణామాల నడుమ..రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సూచనను ఐరోపాకు చెందిన కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయని అన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిందని, అయినా అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని తిప్పికొట్టింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. -
లీడర్ ఎవరో తేల్చుకోవాలి..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏకమయ్యే విపక్షాలు ఎవరి నాయకత్వాన పోరాడుతాయో త్వరగా తేల్చుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సూచించారు. ఎన్నికల అనంతరం నంబర్ గేమ్, రాయబేరాల చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే విపక్ష పార్టీలు అవగాహనకు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు ముందే పొత్తులపై విపక్షాలు అవగాహనకు రావాలని అన్నారు. విపక్ష శిబిరంలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ కుయుక్తులకు పాల్పడే అవకాశం ఉన్నందున తగిన సమయంలో నాయకత్వంపై ఓ నిర్ణయానికి రావాలని విపక్షాలకు సూచించారు. ‘మనందరికీ (విపక్షాలు) మన నాయకుడే కీలకం.. విపక్షాలను ముందుకు నడిపే పార్టీగా కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందువరుసలో ఉంటుంద’ని అన్నారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ నాయకత్వ అంశంపై విపక్షాలన్నీ త్వరలో ఓ నిర్ణయానికి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సంకీర్ణం అవసరమని అభిప్రాయపడ్డారు. సంకీర్ణంపై ఏకాభిప్రాయం ఉంటే..ఆ దిశగా సంకీర్ణ సర్కార్ దిశగా విపక్షాలు అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు బదులిస్తూ తమకూ మంచి కథలు చెప్పే వక్త కావాలని వ్యాఖ్యానించారు. -
బీజేపీకు 3.. విపక్షాలకు 11
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్ స్థానంలో) ఓటమిపాలైంది. ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్ నుంచి గవిట్ బీజేపీలో చేరారు. అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు. బిహార్లో ఆర్జేడీ.. బెంగాల్లో మమత బిహార్లోని జోకిహత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్ కుమార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేరళలోని చెంగన్నూర్ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్ 20,956 ఓట్లతో కాంగ్రెస్పై గెలిచారు. పంజాబ్లో అకాలీదళ్ కంచుకోట షాకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్పై విజయం సాధించారు. జార్ఖండ్లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. యూపీలో హసన్ల హవా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్పూర్, ఫుల్పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్ఎల్డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్ జరిగింది. విపక్షాల (ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్.. యూపీ నుంచి 16వ లోక్సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీముల్ హసన్ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ చెప్పారు. ఎవరేమన్నారంటే.. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. – మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం. – అఖిలేశ్ యాదవ్ నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్–మిత్ర పక్షాల విజయం తథ్యం. – కాంగ్రెస్ యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. – సీతారాం ఏచూరి మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. – ఎన్సీపీ -
నేడు తమిళనాడు బంద్కు విపక్షాల పిలుపు
-
‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం
భువనేశ్వర్/ముంబై: పెట్రో ధరలు పెరగడంపై సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన భువనేశ్వర్లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది. -
మీ చేతగానితనం వల్లే మాకు అధికారం
సాక్షి, సిరిసిల్ల: ‘మీ చేతగానితనం వల్లే ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు. మీరే బాగుంటే తమకు ఈ అవకాశం వచ్చేది కాదు’ అని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్లలో గురువారం నిర్వహించిన రైతుబంధు పథకం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాగూ గెలవలేమని తెలిసి ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. మీ పాలనలో ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని, అసలు మిమ్మల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్నదాతలు బ్యాంకులను అప్పు కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. సబ్బు, పేస్టు తదితర ప్రతీ వస్తువుకు ధర నిర్ణయించే అవకాశం ఉత్పత్తిదారులకు ఉందని, కానీ తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రైతు చేతుల్ని బలోపేతం చేసేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. గతంలో అప్పు చెల్లించకపోతే రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన తీరును చూశామని, ఇప్పుడు దేశంలోనే ఎవరూ చేయని విధంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడానికి రైతుబంధు పథకం ద్వారా రైతుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని మంత్రి వివరించారు. స్వామినాథన్ సిఫారసుల్లో ఒకటైన నాణ్యమైన కరెంటును నిరంతరం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు ధర్నాలు చేస్తే ఇప్పుడు 10 గంటలు కరెంటు చాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది గుణాత్మక మార్పు కాదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల జిల్లాను నంబర్ వన్గా నిలిపినందుకు అధికారులను అభినందించారు. హరీశ్.. వాయువేగంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, పెద్దఎత్తున చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ నీటిబొట్టును సాగుకు యోగ్యమైన భూమికి అందించడానికి మంత్రి హరీశ్రావు వాయువేగంతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రాజెక్టులను సందర్శించిన కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజినీర్లు వాటిని చూసి అబ్బురపడుతున్నారని చెప్పారు. తనకు వ్యవసాయంలో ప్రత్యక్ష అనుభవం లేదని, కానీ మనం పండించిన పంట అందరికీ ఉపయోగపడుతుందంటే అందులోని తృప్తి వేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్బాషా పాల్గొన్నారు. -
‘హెచ్–4 రద్దు’తో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్ పర్మిట్స్) రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలు ఆయా ఉద్యోగుల కుటుంబాలకేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టదాయకం అవుతాయని ఫేస్బుక్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్–1బీ వీసాలు కాగా, ఆ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారు. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం 65 వేల మందికి పైగా భారతీయులు హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే విదేశీయులు అమెరికా ప్రజల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనీ, విదేశీయులకు ఉద్యోగ అనుమతులపై కఠిన నిబంధనలు తెస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల ప్రచారం నాటి నుంచే చెప్తున్నారు. అమెరికాకే నష్టం ‘హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దు చేస్తే వేలాది మంది కొలువులు మాని ఇళ్లలో కూర్చోవాలి. దీని వల్ల నష్టం జరిగేది ఆయా ఉద్యోగుల కుటుం బాలకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు కూడా’ అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థను ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రధాన ఐటీ కంపెనీలు కలసి స్థాపించాయి. ‘ఇప్పుడు హెచ్–4 వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనీసం 80 శాతం మంది మహిళలే. వారంతా వారివారి స్వదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కూడా చేసి పెళ్లి అయ్యాక వారి జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు అమెరికా వచ్చారు. వారు ఇక్కడ పనిచేసి, వేతనాలు తీసుకొని మన ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరికొంత మంది డబ్బు సంపాదించాక వ్యాపారాలు పెట్టి అమెరికా ప్రజలకు కూడా ఉద్యోగాలిస్తున్నారు. ఇప్పుడు హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దుచేస్తే కొంతమంది అమెరికన్ల ఉపాధికీ ప్రమాదమే’ అని ఎఫ్డబ్ల్యూడీ.యూఎస్ పేర్కొంది. భారతీయ కంపెనీలకు భారీగా తగ్గిన ‘హెచ్–1బీ’ అమెరికాలోని భారతీయ కంపెనీలకు జారీ అయిన హెచ్–1బీ వీసాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2015తో పోలిస్తే 2017లో ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలకు కలిపి లభించిన హెచ్–1బీ వీసాల సంఖ్య ఏకంగా 43%తగ్గింది. 7 ప్రధాన భారతీయ కంపెనీలకు కలిపి 2017లో 8,468 హెచ్–1బీ వీసాలు లభించాయనీ, 2015లో ఈ సంఖ్య 14,792 అని ఓ అధ్యయన నివేదిక తెలిపింది. 2017లో అత్యధికంగా టీసీఎస్కు 2,312, ఇన్ఫోసిస్కు 1,218, విప్రోకు 1,210 వీసాలు లభించాయి. 2015తో పోలిస్తే ఈ కంపెనీలు కొత్తగా పొందిన వీసాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా గురువారం ఇక్కడ లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుంటే, అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతి అంశంపై చర్చించడానికి, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 23 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల రూ.200 కోట్ల ప్రజాధనం వృథా అయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి సలంద్రీ శ్రీనివాస్యాదవ్, నాయకులు రాజశేఖర్రెడ్డి, చింత సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విపక్షం.. అభివృద్ధికి ఆటంకం
మోతిహారి: ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుతగులుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. సమాజంలో విభజన తీసుకురావటం ద్వారా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిపనిలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు. ‘గల్లీ నుంచి పార్లమెంటు వరకు ప్రభుత్వం పనిలో విపక్షాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తే.. విపక్షాలు మాత్రం సమాజాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్నాయి’ అని మోదీ ఆరోపించారు. చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా.. బిహార్లోని మోతిహారీలో 20వేల మంది స్వచ్ఛాగ్రహి (స్వచ్ఛత వాలంటీర్లు)లనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఎస్సీ–ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ బంద్ హింసాత్మకంగా మారటం, పార్లమెంటు వరుస వాయిదాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బిహార్ సీఎం భేష్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతి, అసాంఘిక శక్తులతో (పరోక్షంగా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని విమర్శిస్తూ) పోరాటం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రశంసించారు. నితీశ్ ప్రయత్నాలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందన్నారు. ‘ప్రతి మిషన్ను బిహార్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తోంది. మార్పును కోరుకోని వాళ్లకు ఈ ప్రభుత్వ పనితీరు ఇబ్బంది కలిగిస్తోంది. పేదల అభ్యున్నతి జరిగితే.. అసత్యాలను వారిని మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. అందుకే వారి అభ్యున్నతి కోసం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు సృష్టిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. సమాజంలో ఓ వర్గాన్ని మరో వర్గంపైకి రెచ్చగొడుతున్నారన్నారు. స్వచ్ఛభారత్ పథకం అమలులో బిహార్ సాధిస్తున్న విజయాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది స్వచ్ఛాగ్రహిలను మోదీ సన్మానించారు. ఇందులో ఆరుగురు మహిళలున్నారు. ఒక్కొక్కరికి రూ.51వేల నగదు, జ్ఞాపికతో సత్కరించారు. అంతకుముందు, వేదికపై మహాత్ముని విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం భారత దేశ తొలి భారీ విద్యుత్ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ గూడ్స్ రైలు ఇంజన్ను మోదీ ప్రారంభించారు. బిహార్లోని మాధేపుర ఫ్యాక్టరీలో ఉన్న ఇంజన్ను మోతిహారీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. 12వేల హార్స్పవర్ సామర్థ్యమున్న ఈ ఇంజన్ను భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్స్టోమ్ సంయుక్తంగా రూపొందించాయి. మాధేపుర ఫ్యాక్టరీకి ఏడాదికి 110 లోకోలను రూపొందించే సామర్థ్యం ఉంది. 11 ఏళ్లలో 800 లోకోలను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. కతిహార్–పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ముజఫర్పూర్–సాగౌలీ, సాగౌలీ–వాల్మీకీ నగర్ మధ్య రైల్వే లైను డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. తొలిసారిగా ప్రధాని దీక్ష రేపు పార్లమెంటు ఆవరణలో సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రధాని నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 12న బీజేపీ ఎంపీల ఒకరోజు నిరాహార దీక్షలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్షా కూడా పాలు పంచుకోనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను విపక్ష పార్టీలు అడ్డుకున్నందుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మోదీ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, రాజకీయంగా పరిస్థితి చేయిదాటుతున్నట్లు కనబడుతున్న నేపథ్యంలో ఈ దీక్ష చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీక్ష సందర్భంగా మోదీ.. సెలవు తీసుకోకుండా రోజులాగే ఫైళ్లను క్లియర్ చేయటం, ప్రజలు, అధికారులతో మాట్లాడటం వంటివి కొనసాగిస్తారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. అటు, అమిత్ షా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో దీక్షలో పాల్గొంటారు. పార్లమెంటు కొనసాగకపోవటంతో బీజేపీ బాధపడుతోందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకే దీక్ష చేపట్టామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలతో.. ఏప్రిల్ 11న జ్యోతిబా ఫూలే జయంతిని సమతా దివస్గా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికితోడు పార్టీపై పడుతున్న దళిత వ్యతిరేకి ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) నుంచి మే 5 వరకు ఎంపీలు.. 50 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల్లో రాత్రి నిద్ర చేయాలని, ప్రభుత్వం దళితుల కోసం ఉద్దేశించిన పథకాలను వారికి వివరించాలని మోదీ సూచించారు. ప్రధాని దీక్షలో పాల్గొనటం ద్వారా.. బ్యాంకు కుంభకోణాలను నియంత్రించటంలో, ప్రత్యేక హోదా తదితర అంశాలపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని అశక్తతను వెల్లడించినట్లవుతుందని పలువురు బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు సమాచారం. -
బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి
లక్నో: మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 సాధారణ ఎన్నికలకు ముందే మహాకూటమి ఏర్పాటవుతుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయకోసం చేసే ఈ పోరాటంలో ఒంటరిగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీ విస్తరించిన మతతత్వాన్ని అడ్డుకోవాలంటే మహా కూటమిగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటం సామాజిక న్యాయం కోసమే. బీజేపీ విస్తరించిన మతతత్వ వాదానికి అడ్డుకట్ట వేస్తేనే ఇది సాధ్యపడుతుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సమాజంలోని ఏ వర్గం బీజేపీపై సంతోషంగా లేరని, ఈసారి బీజేపీ హిందూ–ముస్లిం అజెండా పనిచేయబోదని చెప్పారు. -
త్రిపురలో లెఫ్ట్కు చెక్
అగర్తలా: త్రిపురలో 25 ఏళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి భారీ మెజారిటీతో పట్టంగట్టారు. ఇంతవరకు త్రిపురలో ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ఫిబ్రవరి 18న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి 43 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీ సొంతంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా.. ఐపీఎఫ్టీ 8 చోట్ల విజయం సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 సీట్లకే పరిమితమైంది. గత అసెంబ్లీలో 10 స్థానాలతో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఒక్క సీటుకూడా దక్కలేదు. విపక్ష మొత్తం 60 స్థానాలకు గానూ 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. వామపక్షానికి షాకింగ్ ఓటమి త్రిపురలో సీపీఎంకు ఇంత దారుణమైన ఓటమి ఎన్నడూ ఎదురుకాలేదు. 1988లో కాంగ్రెస్–త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి అధికారం సంపాదించినా.. ఇంత తక్కువ సీట్లను పొందలేదు. అటు, కౌన్సిలర్ సీటుకూడా లేని స్థానం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా వినియోగించుకుని వ్యూహాత్మక ప్రచారంతో దూసుకెళ్లింది. మొత్తం 51 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా దాదాపు 43 శాతం ఓట్లు సంపాదించింది. 9 చోట్ల అభ్యర్థులను నిలిపిన ఐపీఎఫ్టీ దాదాపు 7.5 శాతం ఓట్లను పొందింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ దేవ్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 50–60 శాతం ఓట్లను పొందిన వామపక్ష కూటమి ఈసారి 42.7 శాతం ఓట్లు సాధించింది. ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ రెండు శాతానికన్నా తక్కువ ఓట్లు పొందింది. గిరిజనుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ భారీ మెజారిటీ సంపాదించింది. ప్రజలు మార్పుకు ఓటేశారు త్రిపుర ప్రజలు మార్పును కోరుకోవటమే తమ ఘనవిజయానికి కారణమని బీజేపీ నేత రాంమాధవ్ పేర్కొన్నారు. ‘మేం ‘పరివర్తన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలు కూడా మార్పును బలంగా కోరుకున్నారు. అందుకే మాకు పట్టంగట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. అస్సాం మంత్రి, త్రిపుర బీజేపీ ఇంచార్జ్ హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. ‘మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. 25 ఏళ్లుగా వారే పాలిస్తున్నా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకే ప్రజలకు వారిని గద్దెదించి బీజేపీకి అవకాశమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉన్న ఐపీఎఫ్టీ కూడా బీజేపీ విజయంలో కీలక భాగస్వామి. త్రిపుర జనాభాలో 35 శాతం ఓట్లు గిరిజనులవే. వారు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు’ అని వెల్లడించారు. మైనారిటీలు మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదని.. వారంతా మనస్ఫూర్వకంగా బీజేపీకి మద్దతు తెలిపారని శర్మ పేర్కొన్నారు. ‘త్రిపుర ప్రజలు రాష్ట్రంలో బీజేపీ కూటమికి అధికారమిచ్చారు. 25 ఏళ్లుగా వారికి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ త్రిపురతోపాటు దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలకు పాల్పడుతోంది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. నేను సిద్ధమే.. కానీ పార్టీ నిర్ణయిస్తుంది త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావటంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ను సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అయితే అవకాశం ఇస్తే సీఎంగా సేవలందించేందుకు తాను సిద్ధమేనని.. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ పార్లమెంటరీ బోర్డేనన్నారు. ‘బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధమే. నాకు అప్పజెప్పిన పనినుంచి నేనెప్పుడూ పారిపోను. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చారు. దీన్ని నా సామర్థ్యానికి అనుగుణంగా నెరవేరుస్తున్నాను’ అని విప్లవ్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన పిలుపుతో 25 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కూకటివేళ్లతో పెకిలించి.. తమకు అధికారాన్ని కట్టబెట్టిన త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్షాలు తనను వెన్నంటి ప్రోత్సహించారన్నారు. ఇక త్రిపురను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘సీపీఎం పాలనలో రాష్ట్రం నష్టపోయింది. మేం సుపరిపానలతో పరిస్థితిలో మార్పు తీసుకొస్తాం’ అని దేవ్ పేర్కొన్నారు. విప్లవ్ కుమార్ దేవ్ -
గుప్తా స్కాం: బీవోబీకి సౌత్ ఆఫ్రికా దెబ్బ
జోహన్నెస్బర్గ్: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్ అలయన్స్(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పై క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతోంది. ఈ మేరకు హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. ది హిందూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ బీవోబీపై చర్యలకు దిగనుందని నివేదించింది. సీనియర్ బ్యాంకు అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్బర్గ్లో బీవోబీ బ్రాంచ్లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016 లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29 , 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ భారీకుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు. 1990లలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సహకారంతో బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు సన్నిహిత్ సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జుమా రాజీనామాకు దారితీసింది. అదే రోజున, జోహెన్నెస్ బర్గ్లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగేమాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది. -
మా గొంతు నొక్కేస్తున్నారు..!
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాజ్యసభ కార్యకలాపాల్ని బహిష్కరించాయి. రెండు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ సమావేశం కావాల్సి ఉండగా.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండానే సభ ప్రారంభం కాగానే వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నారని, ఇది సభా నియమావళికి విరుద్ధమని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే సభలో అంతరాయాల్ని తగ్గించే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం వాయిదా వేశానని చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశమైన రాజ్యసభ.. ప్రతిపక్షాలు లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగించింది. ‘సభలో మాట్లాడేందుకు, ప్రశ్నలు లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతించనందుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభను బహిష్కరించాయి’ అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విలేకరులకు తెలిపారు. గత రెండు రోజులుగా జీరో అవర్లో ప్రశ్నల్ని లేవనెత్తాలని ఎంపీలు లేచినప్పుడల్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నారని, గడచిన వారం నుంచి ప్రతిపక్ష సభ్యుల విషయంలో చైర్మన్ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంపై చైర్మన్ను కలిసి మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ విజ్ఞప్తి చేయగా.. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్లు నిరాకరించారు. చైర్మన్ చర్యలు సభా నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఏక్షపక్షంగా ఎవరూ సభను నడపకూడదని ఆజాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. ప్రతిపక్షాలు లేకుండానే కొనసాగిన చర్చ అనంతరం సమావేశమైన రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘సభలో అంతరాయాల్ని తగ్గించేలా సభ్యుల మధ్య ఉమ్మడి బాధ్యతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం వాయిదా వేశాను’ అని చెప్పారు. తరచూ అంతరాయాలతో సభ ప్రతిష్ట, విశ్వసనీయతపై ప్రభావం పడుతోందన్నారు. ప్రజలకు మరిన్ని ఇక్కట్లు: కాంగ్రెస్ లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని ఆరోపించారు. మోదీ కేర్ పథకం కేవలం ఎన్నికల జిమ్మిక్కని, రూ. 2 వేల కోట్ల పథకం అమలు సాధ్యం కాదని అన్నారు. నేడు ప్రసంగించనున్న మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ బుధవారం లోక్సభలో సమాధానమివ్వనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు.. ఉద్యోగకల్పన, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, విదేశీ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. వీటిపై ప్రధాని సమాధానమిచ్చిన అనంతరం ఓటింగ్ జరగనుంది. దీంతోపాటు గురువారం ప్రభుత్వం ముఖ్య బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున బుధ, గురువారాల్లో సభ్యులంతా హాజరుకావాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసింది. -
లాల్బహదూర్ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి సైద్ధాంతికపరంగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం కాదని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ పేర్కొన్నారు. తరచూ ఆర్ఎస్ఎస్ చీఫ్ గురు గొల్వాల్కర్ను పిలిపించుకుని సమావేశమయ్యేవారని చెప్పారు. ఆర్ఎస్ఎస్కు చెందిన ‘ఆర్గనైజర్’ అనే వారపత్రిక 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చిన ఓ కథనంలో శాస్త్రిని ‘అంకితభావం కలిగిన కాంగ్రెస్వ్యక్తి’ అని కొనియాడారు. ‘నెహ్రూ మాదిరిగా కాకుండా జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై శాస్త్రికి ఎటువంటి వ్యతిరేకత లేదు. జాతీయ సమస్యలపై గురూజీతో శాస్త్రి తరచూ సమావేశమయ్యేవారు’ అని పేర్కొన్నారు. ఈ కథనాన్ని అడ్వాణీ స్వీయచరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ నుంచి తీసుకున్నారు. 1960లో ఆర్గనైజర్లో అసిస్టెంట్ ఎడిటర్గా అడ్వాణీ చేరారు. ఆ సమయంలో చాలాసార్లు శాస్త్రిని ఆయన కలిసే వారు. ‘ఆయనను కలిసినప్పుడల్లా పెద్ద మనసున్న ప్రధాని అని ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడేది’ అని అడ్వాణీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ధోతీ–కుర్తా ధరించేవాడినని, అయితే జర్నలిస్టుకు ఆ దుస్తులు కాకుండా ప్యాంటు చొక్కా అయితే బాగుంటుందని సహోద్యోగులు ఇచ్చిన సలహా మేరకు తన వస్త్రధారణ కూడా మార్చుకున్నానని అడ్వాణీ వివరించారు. -
‘ఆ మంత్రిని తీసేస్తేనే సభలో కూర్చుంటాం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్రాన్ని నిలదీశారు. సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అలా చేస్తేనే తాము సభను జరగనిస్తామని, సభలో కూర్చుంటామని స్పష్టం చేశారు. అటు లోక్సభతోపాటు రాజ్యసభ కూడా ఇదే విషయం పెద్ద ధుమారంగా మారింది. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తికి సభలో కూర్చునే అర్హతే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఇక రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడి పోడియం చుట్టూ చేరిన సభ్యులు ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు జరిగిన అవమానం అని నినాదాలు చేశారు. ఇలాంటి వాటిని మరోసారి జరగనివ్వకూడదని వెంటనే దీనిపై కేంద్రం స్పందించి కేంద్రమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కేంద్రమంత్రి విజయ్ గోయెల్ రాజ్యసభలోలో మాట్లాడుతూ ప్రభుత్వానికి అనంతకుమార్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. మరోపక్క, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ హెగ్డే వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేశామని, సమావేశాలు మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నాయని, తాను ప్రతిపక్షం ఈ విషయం అర్ధం చేసుకొని సభలోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. -
ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు. -
ప్రతిపక్షం లేకుండా ఎలా?
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ప్రతిపక్షం లేకపోయినా తమ పార్టీ వారితోనే ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానం చెప్పించాలని నిర్ణయించారు. మంగళవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రశ్నలను తయారు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సింగపూర్లో ప్రతిపక్షం పాత్ర పెద్దగా ఉండదని, అధికార పక్షమే పార్లమెంటు సమావేశాల్లో సమస్యలను లేవనెత్తి పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని చెప్పిన చంద్రబాబు ఈ సమావేశాల్లో అదే విధానాన్ని అనుసరించాలని చెప్పారు. ఈ నెల 26న మంగళగిరిలో పార్టీ నూతన కార్యాలయానికి శంకుస్థాపనకు, భవన డిజైన్లకు పలు సూచనలు చేశారు. -
రైతుల పట్ల ఇంత చిన్నచూపా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు తడి సి, రంగు మారి సరైన మద్దతుధర లభించక రైతులు విలవిల్లాడుతున్నా, బోనస్ ప్రకటించ డంలో, రుణాలను ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తాయి. రుణమాఫీ చేశామ ని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా, వాటిపై వడ్డీ భారం తొలగించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ దృష్ట్యా వారికి మద్దతుధర కల్పించాలని, బోన స్ ప్రకటించాలని, తడిసిన పంటను కొను గోలు చేసే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశా యి. రుణమాఫీ, మద్దతుధర తదితర అంశా లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. బోనస్ ప్రకటించాలి: జీవన్రెడ్డి అనావృష్టితో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని, ఉన్న పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు వరి, పత్తి, మొక్కజొన్న పంట లను దెబ్బతీశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపా ల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పత్తికి మద్ధతుధర రూ.4,320 ఉన్నా.. 2 వేలకు మించి దక్కడం లేదన్నారు. వరి, మొక్కజొన్నపై రూ.500, పత్తిపై రూ.వె య్యి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాని కి చేరిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుం టుంటే వచ్చే ఏడాది పెట్టుబడి సాయం చేస్తా మంటున్నారని, సబబేనా అని ప్రశ్నించారు. బీమా అమల్లో నిర్లక్ష్యం: కిషన్రెడ్డి కేంద్రం వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, కానీ రాష్ట్రంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి ఆరోపిం చారు. 55 లక్షల మంది రైతులుంటే 6 లక్షల మందే బీమా చేయించుకున్నారని, పథ కం అమలును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విత్తన భాండాగారం చేస్తామ న్న రాష్ట్రంలోనే నకిలీ విత్తనాల బెడద ఎక్కువైం దని, డీలర్లపై కేసులు పెడితే లాభం లేదని, విత్తన కంపెనీలపైనే పీడీ కేసులు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాం డ్ చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిం చేందుకు అధికారులు లేరని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. కాల్చి చంపిందెవరు: గాదరి కిశోర్ రూ.2 లక్షలు మాఫీ చేస్తామని కొన్ని పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు అవే పార్టీలు రైతులను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని మాట్లాడుతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు గాదరి కిశోర్ మండిపడ్డారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన ఘనత ఆ పార్టీలదేనని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు ఎక్కడ?.. మీ సీఎం ఎక్కడ? వ్యవసాయంపై ప్రధాన పార్టీలన్నీ మాట్లాడటం పూర్తయిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క సభ్యుడు కూడా సభలో లేకపోవడంపై శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు స్పందించారు. కీలకాంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత జానారెడ్డి సహా ఎవరూ లేరంటే.. వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదే సమయంలో సభలోకి వచ్చిన జానారెడ్డి.. ఇంత ముఖ్యమైన సమయంలో మీ సీఎం ఎక్కడికి పోయారని ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సభలో లేరు. -
టీడీపీలో మంత్రి సుజయ్ రంగరావుకు వ్యతిరేకత
-
విపక్షాల నిరసన గళం
► దళితులకు భూపంపిణీలో అన్యాయంపై ధ్వజం ► ఆత్మహత్యకు యత్నించిన బాధితులను పరామర్శించిన విపక్ష, ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ : దళితులకు భూపంపిణీలో అన్యాయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భూపంపిణీలో న్యాయం జరగలేదని ఎమ్మెల్మే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన బాధితులను వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సోమవారం పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ (35), యాలాల పరశురాం(24) ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 40 శాతం గాయాలకు గురైన శ్రీనివాస్ కిడ్నీలు పాడైపోయాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 48 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. 35 శాతం గాయాలైన పరశురాం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన శ్రీనివాస్ భార్య తల్లి పోశవ్వ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీమంత్రులు జీవన్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఆస్పత్రికి వచ్చారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ నాయకులు రేవంత్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడ్క జగదీశ్వర్గుప్త, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్వెస్లీ, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, గోపాల్, జనార్దన్, శ్రీరాం నాయక్, రచయిత్రి సుజా త తదితరులు బాధితులను పరామర్శించారు. దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీ సులు మోహరించారు. ఆస్పత్రి ఎదుట టీ మాస్ ఫోరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వంపై నేతల ఆగ్రహం హామీలు నెరవేర్చాలి: భట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఎంత నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయో ఈ ఘటనలో బయటపడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొని హామీలను నెరవేర్చాలి. సీఎంపై కేసు పెట్టాలి: వీహెచ్ దళిత యువకుల ఆత్మహత్య ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఆయనపై కేసు నమోదు చేయాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లంచాలు అడిగితే చెప్పుతో కొట్టమని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మాటలు సినిమా డైలాగుల్లా ఉంటున్నాయి. కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలి: రేవంత్ దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. దళితులపై దాడుల ఘటనల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం, 3 ఎకరాల భూమి ఇవ్వాలి. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలపై పడి లంచాలు వసూలు చేస్తున్నారు. పరిహారం చెల్లించాలి: కోదండరాం గ్రామ స్థాయిలో పరిపాలన కుప్పకూలిపోయిందనడానికి ఇదే నిదర్శనం. దీన్ని ఒక ఘటనగా తీసుకోకుండా పాలనాపరమైన లోపంగా గుర్తించాలి. ఎమ్మార్వో, ఆర్డీవో తదితర అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ బాధితులు తిరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. దీంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం, భూమి అందించాలి. వారి వైద్య ఖర్చులను భరించాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ: చాడ బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. కేవలం వీఆర్వోనే కాకుండా ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులపై పూర్తి స్థాయి విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అధికారులు భూమి ఉన్నవారినే భూపంపిణీకి ఎంపిక చేసి, ఇంచ్ భూమి లేనివారిని విస్మరించారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో దళిత యువకులు ఆత్మహత్యకు యత్నించారు. రాజకీయ రాబందులే కారణం: తమ్మినేని భూ పంపిణీలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ అవినీతికి పాల్పడి అర్హులకు భూ పంపిణీలో చోటు లేకుండా చేశారు. రాజకీయ రాబందులే ఈ ఘటనకు కారణం. చిన్న, చిన్న అధికారులను బలి చేయకుండా రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలి. మంగళవారం నుంచి టీ మాస్తో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వానిదే బాధ్యత: విమలక్క పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలు విస్మరించి దళితులకు భూ పంపిణీ చేయడం లేదు. అందుకే ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మూల్యం చెల్లించక తప్పదు: మంద కృష్ణ కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 120 మంది దళితులను హత్య చేశారు, 50 మందిపై అత్యాచారం జరిగింది, 5 వేల మందిపై దాడులు జరిగాయి. దీనికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజా ఘటనపై ఈ నెల 5, 6వ తేదీల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తాం. 7వ తేదీన భూ పంపిణీపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ విడుదల చేస్తాం. హామీలు విస్మరించారు: జగదీశ్వర్గుప్తా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించినా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఈ ఘటనలో హరీశ్రావు బంధువు జడ్పీటీసీ డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. -
‘ధర్నా చౌక్’ కోసం ధర్నా
జంతర్ మంతర్ వద్ద గళమెత్తిన విపక్షాలు సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి. ధర్నాలను నిషేధించి సీఎం కేసీఆర్ నిజాం పాలనను మరిపించేలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. సోమవారం విపక్ష పార్టీలు జంతర్మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీనికి టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్కుమార్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి, ఆప్ నేత ప్రొ.విశ్వేశ్వరరావు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. ధర్నాచౌక్ను తిరిగి సాధించుకున్నప్పుడే తెలంగాణలో ప్రజాస్వామ్య జీవితాన్ని పునరుద్ధరించుకున్నట్టని అన్నారు. తెలంగాణ సాధించుకున్నా ఏ వర్గమూ సంతోషంగా లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్కు తన పాలనపై నమ్మకం లేకనే.. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు యత్నిస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దందాలు, భూ కుంభకోణాల్లో మునిగితేలుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. భావస్వేచ్ఛను హరిస్తూ పోలీసుల పహారాలో ప్రభుత్వం పాలన సాగిస్తోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలకు అనుమతించకపోతే హైదరాబాద్ అంతా ధర్నాచౌక్గా మారుతుందని తమ్మినేని హెచ్చరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఉంది కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ధర్నాచౌక్ ఉంది. పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తోంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ధర్నాచౌక్ వద్ద ఎందుకు అనుమతి ఇవ్వదు. ఉద్యమ సమయంలో ధర్నాచౌక్లో చేసిన ధర్నాలు కేసీఆర్కు గుర్తుకు లేవా? – సురవరం సుధాకర్రెడ్డి బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఢిల్లీ బైట్ క్లబ్లో ఉన్న ధర్నాచౌక్ను అప్పటి కేంద్రం ఢిల్లీ వెలుపలకు తరలించింది. కానీ అప్పుడు పోరాడి జంతర్మంతర్ను సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో ధర్నా చౌక్ను సాధించుకుంటాం. – సీతారాం ఏచూరి ధర్నాచౌక్ను పునరుద్ధరించేలా ఆదేశాల్విండి రాజ్నాథ్కు నేతల విన్నపం ఇందిరాపార్క్ వద్ద ప్రభుత్వం ఎత్తేసిన ధర్నాచౌక్ను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను నేతలు కోరారు. ఎంపీ డి.రాజా నేతృత్వంలో కోదండరాం, వీహెచ్, చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితరులు సోమవారం రాజ్నాథ్ సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
రూ. 1000 నాణెం వస్తుందా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2 వేలనోటు రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో దుమారం రేగింది. ముఖ్యంగా రూ. 2వేల నోటు రద్దు వార్తల ఆందోళన, వెయ్యి రూపాయల నాణెం ప్రవేశం లాంటి పుకార్ల నేపథ్యంలో పెద్దల సభలో ప్రతిపక్షాలు బుధవారం ప్రశ్నలు గుప్పించాయి. ఈ వార్తలపై ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాయి. ముఖ్యంగా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ 1,000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ."1,000, 100 , 200 నాణాలపై తాము ప్రతిరోజూ చదువుతున్నామనీ అసలు వాస్తవం ఏమిటో తమకు తెలియాలన్నారు. వీటిపై ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఆజాద్ చేశారు. 1,000 రూపాయల నాణాలను మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్ కొనుగోలు చేయాలా? తమకు తెలియాలంటూ చమత్కరించారు. అటు జీరో అవర్లో ఎస్పీ నాయకుడు నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ .2,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రూ .2,000 లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు. అయితే దీనికి డిప్యూటీ ఛైర్మన్ పి.కె. కురియన్ జోక్యం చేసుకుని ఇది ఆర్బీఐ పని వివరించారు. దీనికి స్పందించిన అగర్వాల్ ఆర్బీఐ వ్యతిరేకించిన డీమానిటైజేషన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చురకలేశారు. ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తిరుచి శివ (డిఎంకె) డిమాండ్ చేయగా, పుకార్లు బలంగా ఉన్నందున ఈ సమస్య తీవ్రమైనదని శరద్ యాదవ్ (జెడి-యు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ద్వారా పుకార్లకు చెక్ పెట్టాలని కోరారు. కాగా ప్రతిపక్ష సభ్యులు ఎంత వాదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మౌనాన్నే ఆశ్రయించడం గమనార్హం. -
చక్రబంధం !!
– జేసీ బ్రదర్స్కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు – నేడు బీజేపీలో చేరనున్న ప్రభోదానందస్వామి కుమారుడు వివేకానంద – కేంద్ర, రాష్ట్ర మంత్రులు రవిశంకరప్రసాద్, మాణిక్యాలరావు తాడిపత్రికి రాక – ఇటీవల జేసీపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు – మట్కా, పేకాటపై డీఐజీ, ఎస్సీ సీరియస్...74మందితో జాబితా సిద్ధం ! – అందులో అధికశాతం మంది అధికార పార్టీ నేతలు, జేసీ అనుచరులే సాక్షిప్రతినిధి, అనంతపురం తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రభోదానంద ఆశ్రమం విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్ డైలమాలో ఉన్నారు. దీంతోపాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట, మట్కాపై డీఐజీ, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో అధికశాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్తో పాటు వారి అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితోనూ విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లలో జయచంద్రారెడ్డి బలమైన నేత. ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్షసభ్యులు జేసీ బ్రదర్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరైనా మా మాట వినాల్సిందే. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాం’. అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహాటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు.. జేసీ ప్రభాకర్రెడ్డిపై గతనెల 29న హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేశ్ అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదేరోజు తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్యకు చికిత్స విషయంలోనూ జేసీపీఆర్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈక్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది, మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలే అధికంగా ఉన్నారు. వెరసి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో ‘బ్రదర్స్’ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. నేడు బీజేపీలోకి వివేకానంద ప్రభోదానంద ఆశ్రమనిర్వహణకు జేసీ బ్రదర్స్ అడ్డుపడుతున్నారనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారు. దీంతో వీరిని రాజకీయంగానే ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభోదానంద స్వామి కుమారుడు వివేకానందచౌదరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇతను కాకినాడలో ఉంటున్నారు. తాడిపత్రిలో ఆశ్రమంలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి నేడు చిన్నపొడమల ఆశ్రమానికి రానున్నారు. వీరి సమక్షంలో వివేకానంద పార్టీలో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేపనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో టీడీపీ నుంచి బలమైన వర్గం వైఎస్సార్సీపీకి దగ్గరవుతోంది. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండటంతో వారి నుంచి ఇబ్బందులు ఎదురవుకుండా టీడీపీలో కొనసాగుతున్నారు. మంచి సమయం చూసి వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో బీజేపీ రూపంలో మరోదెబ్బ తగలడం, అందులోనూ టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటం, ఇందులో జేసీని వ్యతిరేకించేవారు చేరడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే! అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ అశోక్కుమార్ తాడిపత్రి పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా 74మందితో ఓ జాబితాతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా మట్కా, పేకాట రాయుళ్ల జాబితాను ఎస్పీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాడిపత్రి పోలీసులు చురుగ్గా లేరనే కారణంతో అనంతపురం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి తనిఖీలు చేయించే యోచనలో ‘పోలీస్ బాస్లు’ ఉన్నారు. అరెస్టుల తర్వాత ఇన్నిరోజులు పేకాట, మట్కా నిర్వహణలో తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై కూడా వారు ఆరా తీసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికశాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లు తాడిపత్రి వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అధికార పార్టీ నేతలను కాపాడితే పేకాట, మట్కాకు అండగా నిలిచిలిన వాళ్లవుతారు? వదిలిస్తే సొంతపార్టీ నేతలు తమను కాపాడలేదు అనే ధోరణిలో పార్టీకి దూరం అవుతారు. ఈ క్రమంలో మొత్తం పరిణామాలతో జేసీ బ్రదర్స్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లు తాడిపత్రి వాసులు చర్చించుకుంటున్నారు. -
విపక్షానికి కాంగ్రెస్ ఎజెండా నిర్దేశించాలి
► జేడీయూ చీఫ్ నితీశ్ సూచన ► ప్రధాని రేసులో లేనని వెల్లడి పట్నా: రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై విపక్షాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు తాము మద్దతివ్వడాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్పై జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు సంధించారు. ‘కాంగ్రెస్ పెద్ద పార్టీ. విపక్షానికి ఎజెండా నిర్దేశించాలి.. విపక్షాలకు ఉమ్మడి ఎజెండా ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికలు ప్రధానంగా మారడంతో కీలకమైన రైతు సమస్యలపై దృష్టి తగ్గింది. విపక్షం ప్రభుత్వ చర్యలపై విమర్శలకు మాత్రమే పరిమితం కాకుం డా ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై దృష్టి సారించాలి’ అని పిలుపునిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను విపక్ష అభ్యర్థిగా ప్రధాని పదవి రేసులో ఉంటానని వచ్చిన వార్తలను నితీశ్ తోసిపుచ్చారు. ‘మాది చిన్న పార్టీ. ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెంచుకోవడం వ్యర్థం అని తెలుసు’ అని స్పష్టం చేశారు. రేసులో పేరు వినిపించే వ్యక్తికి ఆ పద వి ఎన్నడూ దక్కకపోవడం చూశామన్నారు. ఆయన సోమవారమిక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. అన్ని కోణాల్లో విస్తృతంగా చర్చించే కోవింద్కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకున్నారు. రైతుల సమస్యలు, గోరక్షణ వివాదం వంటి సమస్యలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ సంక్షేమం కోసం ప్రజల వద్దకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు. ఆ ప్రత్యామ్నాయానికి మీరే ఎందుకు నాయకత్వం వహించకూడదు? అని అడగ్గా, ‘నేనేమైనా అత్యంత సమర్థుడినా?’ అని ఎదురు ప్రశ్నించారు. బిహార్లోని అధికార మహాకూటమి పటిష్టంగా ఉందని, విభేదాలు మీడియా సృష్టి మాత్రమేనన్నారు. ప్రభుత్వం తన ఏడు సూత్రాల కార్యక్రమానికి తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు. -
గెలుస్తారని తెలిసీ పోటీ సరికాదు
- విపక్షాలపై సీఎం చంద్రబాబు విమర్శ - పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.. వివిధ అంశాలపై చర్చ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారని తెలిసి కూడా విపక్షాలు పోటీకి దిగడం సరికాదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు ఘట్టంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్, జలవనరుల మంత్రి ఉమాభారతి, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధానికి అటవీ భూమి ఇవ్వాలని కోరా.. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎం వెల్లడించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాజ్నాథ్సింగ్ను శుక్రవారం కలసి పరామర్శించానని తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని 1998లో తానే తీసుకొచ్చానని, కాంగ్రెస్ పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ తానొచ్చాక అందరినీ ఒప్పించానని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం లభించడానికి కారణమైన హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్టు పేర్కొన్నారు. పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ను కలసి రాజధానికి 12,500 హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కోరినట్టు సీఎం తెలిపారు. -
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత వ్యక్తిని బరిలోకి దింపి ప్రతిపక్షాలను సందిగ్ధంలో పడేసిన బీజేపీకి...విపక్షాలు కూడా దీటుగా సమాధానం ఇచ్చాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను ప్రతిపక్షాలు ఎంపిక చేశారు. గురువారం సాయంత్రం సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్తో ఎన్నికల్లో తలపడనున్నారు. మీరా కుమార్ ఈ నెల 27 లేదా 28వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. విపక్షాల భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...మీరా కుమార్కు 17 పార్టీల మద్దతు ఉందని తెలిపారు. సైద్ధాంతికంగానే మీరా కుమార్ పోటీ చేస్తున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆమె నామినేషన్ పై ప్రతిపక్షాలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. బిహార్ రాష్ట్రం పట్నాకు చెందినమీరా కుమార్.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కుమార్తె. ఆమె అయిదుసార్లు ఎంపీగా పని చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అలాగే 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరి మీరా కుమార్ దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. ఆమె1985లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా తొలి మహిళా స్పీకర్గా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. కాగా యూపీఏ హయాంలో ప్రతిభా పాటిల్ను రాష్ట్రపతిగా పని చేసిన విషయం తెలిసిందే. -
మీ దమాక్లే బోగస్
► టీఆర్ఎస్ సర్వేలు బోగస్ అన్న ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్ ► కాంగ్రెస్ నేతలకు సవాల్.. పౌరుషం ఉంటే మీరంతా రాజీనామా చేసి ఎన్నికలకు రండి ► సర్వేలో బీజేపీకి దేశంలో 46% ఓటింగ్ ఉందంటున్నరు ► మాది బోగస్ సర్వే అయితే.. మీది కూడా బోగసేనా? ► రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు జీర్ణం కావడం లేదు ► వాళ్ల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి.. ► మీకు డిపాజిట్లు కూడా రావు.. అవాకులుచెవాకులు మానండి.. ► కడుపు నిండా పనిచేస్తం.. ప్రజల దగ్గరికి వెళ్తం.. ► చంద్రబాబులాంటి మోసగాళ్లకు ఇక్కడ చోటు లేదని మండిపాటు కొన్ని పార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న పురోభివృద్ధి చూసి ఏం అర్థం కావడం లేదు. అంగీ, లాగు చింపుకొంటున్నరు. చరిత్రలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడటం కూడా అలాంటిదే.. కరెంటు కోసం కాంగ్రెస్, టీడీపీలు 30 ఏండ్లు ఏడ్పించినయి. మేం ఆరు నెలల్లో సరిచేశాం. నాణ్యమైన కరెంటు ఇచ్చినం. పవర్ కట్ లేదు.. మోటార్లు కాలుడు లేదు.. ట్రాన్స్ఫార్మర్లు పేలుడు లేదు.. ఈ ఒక్క పాయింట్ చాలదా మా పనితీరుకు? ఒక్క ఇసుక దందా చాలదా మీరు(కాంగ్రెస్) ఎంత మెక్కారో చెప్పడానికి.. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం? ఏ రైతుల ప్రయోజనం కోసం? పిచ్చి మాటలు మానుకోండి. ప్రాజెక్టులు ఆపలేరు. మీ జేజమ్మ తరం కూడా కాదు. మీరు కోర్టులకు వెళ్లినా న్యాయమూర్తులు ధర్మం కాపాడుతరు. చంద్రబాబూ.. మొదట నీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పింది ఏందీ? డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నావ్. ఇప్పుడు మాట మార్చినవ్.. తిమ్మిని బమ్మిని చేసినవ్. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు. నీ కథ ఇక అయిపోయింది.. నీ జాగల ప్రజలకు సేవ చేసుకో..’’ సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ నాయకులకు చాలెంజ్ చేస్తున్నా. మీపై మీకు ఆత్మవిశ్వాసం బాగా ఉంది కదా? అయితే రాజీనామాలు చేయండి. ఎలక్షన్కు పోదాం. మీరు గెలుస్తరో, మేం గెలుస్తమో తెలుస్తుంది. మీ మీద మీకు విశ్వాసం ఉంటే.. ప్రజల్లో టీఆర్ఎస్పై విశ్వాసం పోయిందనుకుంటే మీరే రాజీనామా చేయండి. మేమెందుకు చేయాలే? చేసి చేసి అలిసిపోయినం. మా రాజీనామాలు ఇసిరి పారేసినం. నేనే అయిదారుసార్లు చేసిన. ఉద్యమం పుట్టినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన. రాష్ట్రంలో ఆరుగురు మంత్రులతో రాజీనామాలు చేయించి ఇసిరి మీ ముఖాన కొట్టినం. పౌరుషం ఉంటే మీరందరూ రాజీనామాలు చేయండి...’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ సర్వేలు బోగస్ అంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. తమ సర్వే బోగస్ అంటున్నవారి దమాక్(మెదడు)లే బోగస్ అంటూ దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, కాంగ్రెస్కు చెందిన పీసీసీ కార్యదర్శి పైడిపల్లి రవీందర్రావు తమ అనుచరులతో కలసి సోమవారం సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. మరి మీది బోగస్ సర్వేనా? దేశంలో బీజేపీకి 39 శాతం ఓటింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం 46 శాతం అంటున్నరు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మా సర్వే తప్పంటడు. మా సర్వే బోగస్ అయితే మీది కూడా బోగస్ సర్వేనా? అసలు మీ దమాక్లే బోగస్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు జీర్ణం కావడం లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. వారికి ఎలాంటి శషబిషలు ఉండవు. కొత్త రాష్ట్రమైనా దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇది చరిత్ర. ఉద్యమ సందర్భంలో చెప్పినవన్నీ నూరు శాతం నిజమవుతున్నాయి. రైతాంగానికి రెండు పంటలకు రూ.8 వేలు ఇవ్వడం అన్నది చరిత్రాత్మకం. ఉమ్మడి ఏపీలో ఇది సాధ్యమయ్యేది కాదు. కొన్ని పార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న పురోభివృద్ధి చూసి ఏం అర్థం కావడం లేదు. అంగీ లాగు చింపుకొంటున్నరు. చరిత్రలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడడం కూడా అలాంటిదే.. కాంగ్రెస్కు ఎందుకు ఓట్లెయాలె? కాంగ్రెస్కు ఎందుకు ఓట్లేయాలె? అదేమన్నా కొత్త పార్టీనా? స్వర్గం నుంచి ఊడిపడిందా? మీ పాలనను ప్రజలు చూడలేదా? రైతులు టీఆర్ఎస్కు ఓటేయకుండా ఉంటరా? కరెంటు కోసం కాంగ్రెస్, టీడీపీలు 30 ఏండ్లు ఏడ్పించిండ్రు. మేం ఆరు నెలల్లో సరిచేశాం. దేశం మొత్తంలో ఎవరూ ఇయ్యలేదు. నాణ్యమైన కరెంటు ఇచ్చినం. పవర్ కట్ లేదు.. మోట్లార్లు కాలుడు లేదు. ట్రాన్స్ఫార్మర్లు పేలుడు లేదు. ఈ ఒక్క పాయింట్ చాలదా మా పనితీరుకు. మేం కడుపు, నోరు కట్టుకుని అవినీతికి దూరంగా పాలన చేస్తున్నం. ఒక్క ఇసుక దందా ఉదాహరణ చాలు కదా మీరెంత మెక్కారో చెప్పడానికి. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పుడు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.22 కోట్ల ఆదాయం వచ్చేది. పదేళ్ల పాలన తర్వాత ఆ ఆదాయం రూ.5 లక్షలకు చేర్చారు. మేం అధికారం చేపట్టాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్లు, 2016–17లో రూ.432 కోట్ల ఆదాయం తెచ్చాం. ఈ ఏడాది అది రూ.650 కోట్లకు పోతది. నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తున్నామనడానికి ఈ ఉదాహరణ చాలాదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. వాళ్లు ఒక్క ఇసుకలోనే రూ.400 కోట్లు తిన్నరు. మాకు ఓట్లేయకుండా మీకేస్తరా? ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నం. మత్స్యకారులు, గొల్ల కుర్మలు, చేనేత కార్మికుల గురించి మీరు ఎన్నడన్నా ఆలోచించిండ్రా? చేనేత కార్మికులు చచ్చిపోతే పట్టించుకున్నరా? నేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు ఇస్తం. మిగిలిపోయిన వస్త్రాన్ని ప్రభుత్వమే కొంటది. అంగన్వాడీ వర్కర్లను ఎన్నడన్నా మనుషులుగా చూశారా? 50 వేల మంది ఉన్నరు. వాళ్లకు మీరిచ్చిన నెల జీతం రూ.4,200. మేం దాన్ని రూ.10,500కు పెంచినం. అంగన్వాడీలు మీకు ఓట్లేస్తరా? మాకు వేస్తరా? మత్స్యకారుల కోసం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో పెట్టినం. వీరు మీకేస్తరా ఓట్లు.. మాకేస్తరా? 25 వేల మంది విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయబోతున్నం. 24వేల మంది హోంగార్డులున్నరు. వాళ్లకు మీరిచ్చింది రూ.3 వేలు. ఆ తర్వాత రూ.6 వేలకు పెంచారు. మేం రూ.12 వేలు చేసినం. వారిని పర్మినెంట్ చేస్తం. వీరు కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లేస్తరా? టీఆర్ఎస్కు వేస్తరా? ఆశా వర్కర్లకు మానవత్వంతో వేతనాలు పెంచాం. ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చారా. వాళ్లు మీకేస్తరా.. మాకు వేస్తరా? మీరు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు. మైనారిటీలకు, ఎస్టీలకు మేం రిజర్వేషన్ ఇచ్చి తీరుతం. సోమవారం శాసనసభ సచివాలయానికి ఫైలు వచ్చింది. దాన్ని ఢిల్లీకి పంపుతం. ప్రధాని హామీ ఇచ్చిండు. ఇయ్యకపోతే కేంద్రంతో ఫైట్ చేస్తం. గర్భిణిలకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ ఇస్తాం. మీ జీవితంలో ఎప్పుడన్నా వీటి గురించి ఆలోచించిండ్రా? మీ గుండెల్లో బాంబులు పేలుతున్నయ్. మీకు డిపాజిట్లు కూడా రావు. అవాకులు, చవాకులు మానండి. కడుపు నిండా పనిచేస్తం. ప్రజల దగ్గరకు వెళ్తం. అధికారం ఇస్తే ఓకే. లేదంటే లేదు. మీలా ఆగమై కిందా మీదా అయిపోం. ప్రాజెక్టులను అడ్డుకుంటరా? సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. పదిహేను రోజుల్లో నాలుగుసార్లు కోర్టుకు వెళ్లి స్టే కోసం ప్రయత్నించారు. దేనికోసం పనులు ఆపించాలనుకుంటున్నరు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? ఏ రైతుల ప్రయోజనం కోసం ఆపుతున్నరు? కరువు బారిన పడిన రాష్ట్రాన్ని గట్టెక్కించడం మీకిష్టం లేదు. టీఆర్ఎస్కు మంచి పేరు రావొద్దు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గులు. దేశంలో తొలిసారిగా రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇవ్వనున్నాం. తమషాగా ఇస్తున్నామనుకుంటున్నరా? మీ పాలనతో రైతులు ఆగమైండ్రు, ఆత్మహత్యలు చేసుకుండ్రు, బొంబాయి–బొగ్గుబాయి–దుబాయి బతుకులు అయినయ్. సమైక్య పాలనలో నీళ్లిలేదు. భూగర్భ జలమే దిక్కదయింది. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆగమైండ్రు. పూర్వవైభవం కోసం నీళ్లు ఇస్తం. కాళేశ్వరం నీళ్లను రెండేళ్లలో తెస్తం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తం. 30–40 ఏళ్లు మోసం చేసిండ్రు. మేం నిజాయితీతో పనిచేస్తున్నం. మేలు చేసిన వారికే ప్రజలు పట్టం కడతరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏంది? ఇది రిపీట్ కాకూడదనేముంది? గతంలో తమిళనాడులో డీఎంకే తుడిచిపెట్టుకపోలేదా? పిచ్చి మాటలు మానుకోండి. ప్రాజెక్టులు ఆపలేరు. మీ జేజమ్మ తరం కూడా కాదు. మీరు కోర్టులకు వెళ్లినా న్యాయమూర్తులు ధర్మం కాపాడుతారు. దుర్మార్గం కట్టిబెట్టండి. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను ఓట్లుగానే చూసింది. బాబూ.. నీలాంటి మోసగాళ్లకు ఇక్కడ తావు లేదు రైతులకు ఇక్కడ రూ.17 వేల కోట్ల రుణం మాఫీ చేసినం. పక్కరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలేదు. ఆంధ్రా రైతులను, ఆంధ్రా డ్వాక్రా మహిళలకు శఠగోపం పెట్టి, ఇగ తెలంగాణకు వచ్చి వెలగబెడతడట! మేమే తెలంగాణలో గెలుస్తమని సిగ్గులేకుండా వైజాగ్ మహానాడులో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడూ.. మొట్టమొదట నీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏందీ? ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నావ్. ఇప్పుడు మాట మార్చినవ్.. తిమ్మిని బమ్మిని చేసినవ్. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు. నువ్వూ అవసరం లేదు. ఇక అయిపోయింది నీ కథ. నీ జాగల ఉన్న ప్రజలకు సేవ చేసుకో. తెలంగాణకు నువ్వొచ్చినా.. నీకు వచ్చేదేమీ ఉండదు. ఇక్కడ డిపాజిట్ రాదు. ఉనికి కోల్పోయిన టీడీపీ, అడ్రస్ లేని బీజేపీ, కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నరు. -
సోనియాగాంధీ విందు రాజకీయం
-
పాలకుల అసహనానికి నిదర్శనం: సురవరం
సాక్షి,, హైదరాబాద్: నిరాహార దీక్షలు, ధర్నాలు అత్యంత శాంతి యుతమైన కార్యక్రమాలని, వాటిని అడ్డుకోవడం అసంబద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ప్రజల నిరసనలు సహించలేని పాలకుల అసహనానికి ధర్నాలను అడ్డుకోవడం నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యుడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కేంద్రం ఎక్కడుంటే దానికి దగ్గర్లోనే నిరసన తెలిపే స్థలముండాలని పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున అసెంబ్లీ, సెక్రటేరియట్ ఉన్నంత కాలం ధర్నా చేసే హక్కుండాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు, సమస్యలు, నిరసనలు, డిమాండ్లను వివిధ రూపాల్లో వ్యక్తం చేసే హక్కుందని పేర్కొన్నారు. -
ఇది ప్రతిపక్షాల కుట్ర
- ధర్నా చౌక్ ఘటనపై మంత్రులు నాయిని, తలసాని - ప్రభుత్వం ధర్నా చౌక్ను తరలిస్తామని ఎప్పుడూ అనలేదు - టీఆర్ఎస్ ప్రభుత్వ మంచి పనితీరుతో ప్రతిపక్షాలకు దడ - కోదండరాం ఎప్పుడూ ఎవరికో ఒకరికి డబ్బా కొట్టాల్సిందేనని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న అక్కసు, కుట్రతోనే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ధర్నాచౌక్ ఘటనతో ప్రతి పక్షాల పన్నాగం బయట పడిందని వ్యాఖ్యా నించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. ధర్నా చౌక్ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని నాయిని పేర్కొన్నారు. ధర్నా చౌక్ ఆక్రమణ పేరుతో విపక్షాలన్నీ కలసి స్థానిక ప్రజలు, పోలీసులపై దాడులు చేశారని ఆరోపించారు. ధర్నాలను మరో ప్రాంతంలో చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారని.. ఆ డిమాండ్తోనే శాంతి యుతంగా ధర్నా చేస్తున్న స్థానికులపై ప్రతిపక్షాలు దాడులు చేయడం దారుణ మని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కోదండరాం.. దానిపై తీర్పు రాకముందే ఎందుకు ఉపసంహరిం చుకున్నారని, న్యాయస్థానం మీద గౌరవ ముంటే తీర్పు కోసం ఎదురుచూడాల్సింది కదా అని పేర్కొన్నారు. కోదండరాం అందరినీ రెచ్చగొడుతున్నారని, ఇది ఆయనకు తగదని వ్యాఖ్యానించారు. సీపీఎం, సీపీఐ, మధ్యలో ఎక్కడి నుంచో వచ్చిన జనసేన అంటూ ఆందోళనకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎవరినీ అడ్డు కునే ప్రయత్నం చేయలేదన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వచ్చిన తర్వాతే ధర్నా చౌక్ వద్ద విధ్వంసం జరిగిందని.. అనవసరంగా రెచ్చిపోతే చచ్చిపోతారని నాయిని వ్యాఖ్యానించారు. ఎవరో ఒకరి తోక పట్టుకుంటేనే కమ్యూనిస్టులకు బతుకుదెరువు అని ఎద్దేవా చేశారు. ‘‘కోదండరాం ఎవరికో ఒకరికి డబ్బా కొట్టాల్సిందే. మేం పోతే కాంగ్రెస్సో, బీజేపీనో అధికారంలోకి వద్దాయనుకుందాం.. కోదండరాం అయితే రాడుకదా..’అని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కక్ష పెంచుకున్నవిపక్షాలు: తలసాని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కక్ష పెంచు కున్నాయని.. చివరకు సీఎంను కూడా ఏకవచనంతో దూషిస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. ‘సీఎం కేసీ ఆర్ను, ఆయన కుటుంబాన్ని దూషిస్తే ప్రజలు మీ నాల్క చీరేస్తరు. ఇలా అయితే చంద్రబాబు గురించి మేం రోజూ మాట్లా డాల్సి వస్తుంది. ధర్నాచౌక్కు ఏం సాధిం చారు. ప్రతిపక్షాల ఆస్తులేమైనా గుంజు కున్నామా? భవిష్యత్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’ అని విపక్షాలను హెచ్చరిం చారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వం ఎంతో హుందాగా ఉందన్నారు. పోలీసులను మఫ్టీలో పెట్టాల్సి వస్తే వెయ్యి మందిని పెట్టేవారు కదా అని వ్యాఖ్యానించారు. ప్రజలపై విపక్షాలు దాడి చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ధర్నా చౌక్ ఘటనలో పోలీసులు, ప్రభుత్వం ఎంతో సంయమనం పాటించాయన్నారు. స్థాని కులపై జరిగిన దాడిలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపించారు. చిన్న సమస్యలకే ప్రతిపక్షాలు రాబందుల్లా వాలిపోతున్నాయని మండిపడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత
-
'పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం'
హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సభలో సమయం ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. మహిళగా డిప్యూటీ స్పీకర్ను గౌరవించాలని సూచించారు. సభలో ప్రభుత్వ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుందని స్పష్టం చేశారు. సభలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మంగళవారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సమయం ఇవ్వలేదని విపక్ష సభ్యులు సభలో బుధవారం ఉదయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. పద్దులపై మాట్లాడేందుకు ప్రతి సభ్యునికి డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారని, పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయించామని, అన్ని విషయాల్లో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. -
ఆత్మహత్యలపై దద్దరిల్లిన పార్లమెంటు
అన్నదాతలకు సాయం అందలేదన్న విపక్షాలు ⇒ సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించారని ధ్వజం న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలు, ఉపాధి హామీ పథకం, నోట్ల రద్దు తదితర అంశాలపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం విపక్ష, అధికార పక్షాల వాగ్యుద్ధంతో దద్దరిల్లాయి. పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల నిధులకు ప్రభుత్వంకోత పెట్టిందని విపక్షాలు మండిపడ్డాయి. నోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశాయి. గ్రామీణ ఉపాధి హామీకి పెంచిన రూ. వెయ్యి కోట్ల నిధులు ఏ మూలకూ సరిపోవని లోక్సభలో కాంగ్రెస్ ఆరోపించింది. నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై జరిగిన చర్చలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) మాట్లాడుతూ.. ఉపాధి పథకాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ దానికి కేవలం ఒక శాతం నిధులే పెంచారన్నారు. సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమిళనాడులో చనిపోయిన రైతుల పుర్రెలతో జంతర్మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నారని వెల్లడించారు. గోవాలో బీజేపీకి తగినంత బలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనైతికమని మండిపడ్డారు. పుర్రెల వార్త అబద్ధమని అన్నాడీఎంకే పేర్కొనగా.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే జోక్యం చేసుకుని, దేశవ్యాప్తంగా రైతులు కష్టాలుపడుతున్నారన్నారు. స్థూల దేశీయోత్పత్తి రేటును నోట్ల రద్దు దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు కిరీట్ సోమయ్య కల్పించుకుంటూ.. నోట్ల రద్దును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ యూపీలో విలువ కోల్పోయిందన్నారు. దేశం నాశనం కావడం లేదని, మోదీకి అడ్డుపడుతున్న వాళ్లే నాశనం అవుతున్నారన్నారు. రాజ్యసభలో.. రైతు రుణాలను రద్దుచేస్తామన్న బీజేపీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఒక్క మహారాష్ట్రలోనే 117 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్యసభలో కాంగ్రెస్ ఆరోపించింది. జీరో అవర్లో ప్రమోద్తివారీ ఈ అంశాన్ని లేవనెత్తారు. కరువు పరిస్థితుల వల్ల రైతులు చనిపోవడం లేదని, పంటకు గిట్టుబాటు ధరలేక చనిపోతున్నారని అన్నారు. నోట్ల రద్దుకుS ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని, ఆర్థిక వ్యవస్థలో 33.7 శాతంగా ఉన్న బ్లాక్ మార్కెట్కు భారీ దెబ్బ తగిలిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ చెప్పారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రాజెక్టులతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చార్జీలను ఉపసంహరించాలి: ఠాకూర్ వినియోగదారుల లావాదేవీలపై చార్జీలు విధించాలన్న బ్యాంకుల ప్రతిపాదనను, క్రెడిట్ కార్డులపై 3% పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సీపీఎం తదితర విపక్షాలు కూడా ఇదే డిమాండ్చేశాయి. మంత్రుల గైర్హాజరుపై అన్సారీ అసంతృప్తి రాజ్యసభలో ప్రశోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన విద్యుత్, పర్యావరణ, నౌకాయాన శాఖల మంత్రులు లేకపోవడంపై చైర్మన్ అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మీ హయాంలో ఒక్కరికైనా సాయమందిందా?
కాంగ్రెస్ను ప్రశ్నించిన ఈటల ⇒ అలాగని నిరూపిస్తే రాజీనామా చేస్తా ⇒ కాంగ్రెస్కు మరో పదేళ్లు భవిష్యత్తుండదు ⇒ ఆ తరహాలో సంక్షేమ పాలన అందిస్తం ⇒ కులవృత్తులను కించపరుస్తున్న విపక్షాలు ⇒ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు నీరందకున్నా ముక్కు నేలకు రాస్తా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో ఒక్క కుటుంబానికైనా రూ.5 లక్షల ఆర్థిక ప్రయోజనం కలిగించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సవాలు విసిరారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్పై చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఎస్సీలకు భూ పంపిణీ కోసం కాంగ్రెస్ పాలనలో రూ.76 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.406 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి భూముల కొనుగోలు కోసం రూ.15 నుంచి 20 లక్షలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది’’ అని చెప్పారు. ‘‘ఏడాదిలోనే బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటుంటే ముక్కు నేలకు రాస్త. కరెంట్ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు కరెంట్ రాకపోయినా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం’’ అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అంకెలు పట్టుకుని ఆరోపణలు చెయ్యొద్దు.. ఆచరణలో జరుగుతున్న పనులను చూడాలంటూ హితవు పలికారు. వికలాంగులకూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. నాయకులకు సోయి ఉండాలె అభివృద్ధి, సంక్షేమ కార్యకమాలతో కాంగ్రెస్కు మరో పదేళ్లు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని ఈటల అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలే తప్ప కులాలను కించపరుస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. గొర్రెలు, మేకలు, పందులు అంటూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తద్వారా కులవృత్తులను కించపరిచేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు. తాను కోళ్ల ఫామ్ నడిపిన స్థాయి నుంచి ఆర్థికమంత్రిగా ఎదిగానన్నారు. ‘‘విపక్షాలు ఆరోపణలు, లెక్కలతో ప్రజలను నమ్మించజూస్తున్నయి. కానీప్రజలు తెలివైనవారు. ఎవరేం చేశారో తేల్చేది వారే. నేతలంటే కేవలం విమర్శలు చేయడం కాదు. సమస్యల పరిష్కార బాధ్యత ఉందనే సోయి ఉండాలి. లేదంటే ప్రమాదం. మూడేళ్లలోనే దేశ చిత్రపటంపై గొప్ప రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నదని చెప్పగలిగినం. ప్రభుత్వం తెచ్చిన 350 జీవోలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. మా ప్రభుత్వానికి మానవత్వముంది. ఉత్తర్వులపై కంటే ప్రజలపై నమ్మకముంది. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య బారిన పడ్డ రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర ఇస్తే మా ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తున్నది. ప్రకృతి వైపరీత్యంతో మరణిస్తే రూ.5 లక్షలిస్తున్నం. బడ్జెట్ నిధులు మొత్తం ఖర్చు కాలేదంటున్నరు. ఛత్తీస్గఢ్, హరియాణా, కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ 79–86 శాతం మధ్యే ఖర్చు చేశాయి. చివరకు కేంద్రంలోనూ అంతే’’ అని వివరించారు. రెండున్నరేళ్లలో 42 వేల మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 60 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. పీసీ సర్కార్ బడ్జెట్: షబ్బీర్ అలీ తామెవరినీ కించపరచలేదని విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. పందుల పెంపకానికి ఆధునిక ఫాంలను ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే సూచించామన్నారు. ‘‘ప్రజల నమ్మకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసింది. బడ్జెట్ పీసీ సర్కార్ మ్యాజిక్లా ఉంది. అల్లావుద్దీన్ అద్భుత బడ్జెట్ అయితే తప్ప రూ.1.49 లక్షల కోట్లను వ్యయం చేయలేరు. జెన్కో ద్వారా ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారు. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్లలో 48– 60 శాతమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చనిపోయిన వారికి అంబులెన్సులకు దిక్కు లేదు గానీ గొర్రెలకు ఏమైనా అయితే అంబులెన్సుల్లో తీసుకెళతామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. డీఎస్సీ, గురుకుల టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేశారు. పిల్లీ ఎలుక ఆటాడుతున్నారు. పలు పంటలకు ధర లేదు. అక్షరాస్యతలో దేశంలోనే చివరి స్థానంలో ఉంది’’ అన్నారు. చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శాసన మండలిని ఈనెల 24వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
బడ్జెట్పై చర్చను ప్రతిపక్షం ప్రారంభించదా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విస్మయం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్పై చర్చను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రారంభించాల్సి ఉన్నా, బుధవారం శాసనసభలో చర్చ జరిగిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్ను సోమవారం ప్రవేశపెట్టగా, బుధవారంనాడు దీనిపై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చను ప్రారంభించడం ఇప్పటిదాకా ఆనవాయితీ. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చను ప్రారంభించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం సభకు హాజరుకాకపోవడం వల్లనే బీజేపీ సభ్యులు చర్చను ప్రారంభిం చినట్టుగా కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. కీలకమైన బడ్జెట్ ప్రారంభ చర్చ అవకాశా న్ని మరో పార్టీకి వదిలివేయడంపై ఆ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్ర అభివృద్ధి
కరీంనగర్ రుణం తీర్చుకోకుంటే ‘తెలంగాణ’కు అర్థముండదు: తుమ్మల కొత్తపల్లి(కరీంనగర్): ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ రూరల్ 2 మండలం ఎలగందులలో రూ.60 కోట్లతో ఎల్ఎండీ రిజ ర్వాయర్పై నిర్మించ తలపెట్టిన పాత రహదారి పునరు ద్ధరణ పనులకు ఆదివారం ఆర్థిక మంత్రి ఈటలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తే అడ్డు తప్పించైనా పనులు చేపడతామన్నారు. బంగారు, ఆకుపచ్చ, భాగ్యవంతమైన తెలంగాణ నిర్మించి తీరు తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఉన్నత స్థానంలో నిలిపిన కరీంనగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోకుంటే తెలంగాణ సాధించిన అర్థమే ఉండదని తుమ్మల వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ కరీంనగర్ను పర్యాటక కారిడార్గా తీర్చిదిద్ది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. -
రిజర్వేషన్లపై ‘వైద్య’ దుమారం
• పునఃసమీక్ష అవసరమన్న ఆరెస్సెస్ ప్రతినిధి • తీవ్రంగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. దళిత ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు వైద్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. దళిత వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీని విమర్శిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లకు పునఃసమీక్ష అవసరమని చెప్పారని జైపూర్లోని సాహిత్య వేడుకలో వైద్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శల దాడి మొదలవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ అధినేత, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ రిజర్వేషన్ దళితులకు ఎవరో ఇస్తున్న దానం కాదన్నారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కనీ, దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. గతంలో మోదీ కూడా తన ఒంట్లో ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అనడాన్ని గుర్తు చేశారు. మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మట్లాడుతూ రిజర్వేషన్లను తొలగిస్తే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గోవాలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల సామాజిక స్థితిగతులు మెరుగుపడే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగించేంత బలం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వస్తుందనీ, బిహార్లోలా ఇక్కడా బీజేపీకి బుద్ధి చెప్పాలని బహుజన సమాజ్పార్టీ అధినేత్రి మాయావతి ప్రజలను కోరారు.