Reliance Industries
-
రిలయన్స్కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి కేంద్రం షాకిచ్చింది. ఓఎన్జీసీకి చెందిన క్షేత్రం నుంచి గ్యాస్ అక్రమంగా ఉత్పత్తి చేసినందుకు, గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనందుకు గాను రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మొదటి దానికి సంబంధించి రూ.24,500 కోట్ల నష్టపరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సుమారు 3.1 కోట్ల పెనాల్టీ విధించింది.కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్–బీపీ, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓఎన్జీసీ క్షేత్రం నుంచి తమ క్షేత్రంలోకి వచ్చిన గ్యాస్ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెలికితీసి, విక్రయించుకుని, లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్, బీపీ నష్టపరిహారం కట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఈ వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14న వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పాటు నికో (గతంలో భాగస్వామి)కి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ డిమాండ్ నోటీసులు పంపినట్లు ఎక్ఛ్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్మరోవైపు, 10 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికిగాను అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్కి భారీ పరిశ్రమల శాఖ పెనాల్టీ విధించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్ఎన్ఈబీఎస్ఎల్ కోరినట్లు వివరించింది. జనవరి 1 నుంచి మార్చి 3 వరకు లెక్కేస్తే జరిమానా రూ. 3.1 కోట్లు ఉంటుంది. -
మార్కెట్ ‘కింగ్’ రిలయన్స్
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. అన్లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. గ్రూప్లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలు .. ⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది. ⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది. ⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది. -
అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)
-
రిలయన్స్ అనుబంధ సంస్థగా కొత్త కంపెనీ
మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వయాకామ్18 (Viacom18) మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) తాజాగా పేర్కొంది. తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లు వెల్లడించింది.దీంతో ప్రత్యక్ష సబ్సిడియరీగా మారినట్లు తెలియజేసింది. ఇప్పటివరకూ రిలయన్స్ అనుబంధ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కు వయాకామ్18 మీడియా మెటీరియల్ సబ్సిడియరీగా వ్యవహరించేది. కాగా.. తాజా మార్పు కారణంగా వయకామ్18లో రిలయన్స్ వాటా 70.49 శాతం నుంచి 83.88 శాతానికి ఎగసింది.అంతకుముందు 2024 మార్చిలో పారామౌంట్ గ్లోబల్ నుంచి వయాకామ్18లో 13.01 శాతం వాటాను రిలయన్స్ చేజిక్కించుకుంది. ఇందుకు రూ. 4,286 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది నవంబర్ 14న వాల్ట్ డిస్నీ దేశీ మీడియా బిజినెస్తో రిలయన్స్ మీడియా విభాగాలను విలీనం చేయడంతో రూ. 70,000 కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం ఆవిర్భవించిన విషయం విదితమే. -
నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!
కొన్ని చీరలు మన భారతీయ హస్తకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. కాలాలు మారుతున్న వాటి ఉనికి ప్రకాశవంతంగా నిలిచే ఉంటుంది. ఎన్నో వెరైటీ డిజైన్లు వచ్చినా.. పురాతన హస్తకళతో కూడిన చీరలే అగ్రస్థానంలో అలరారుతుంటాయి. తరతరాలు ఆ చీరలను ఆదరిస్తున్నే ఉంటారు. అలాంటి చీరల కళా నైపుణ్యానికి సెలబ్రిటీలు, ప్రముఖులు దాసోహం అంటూ వాటిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరాలు తెలసుకునేలా.. ఆ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు కూడా. అలాంటి 900 ఏళ్ల నాటి హస్తకళా నైపుణ్యానికి పేరుగాంచిని పటోలా చీరల విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి సైతం ఈ చీరలంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఇటీవల గ్రాండ్గా నిర్వహించిన చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహంలో ఈ చీరలనే అతిధులకు గిఫ్ట్గా ఇచ్చారు. అంతలా కట్టిపడేసేలా ఆ పటోల చీరల్లో ప్రత్యేకత ఏముందంటే..?ఎక్కడ నుంచి వచ్చాయంటే..ఈ పటోలా చీరలు గుజరాత్లోని పటాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ చీరలు శక్తిమంతమైన రంగుల కలయికతో క్లిష్టమైన డిజైనలతో ఉంటాయి. ఈ చీరల తయారీ అనేది శ్రమతో కూడిన హస్తకళ అని చెప్పాచ్చు. అంబానీల ఇంట జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత నుంచి వీటి అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చాలామంది మగువలు ఏరికోరి ఈ పటోలా చీరలను తెప్పించుకుని మరీ కొంటున్నారు. ప్రత్యేకతలు..పటోలా చీర తయారీ అంత ఈజీ కాదు. తొందరగా అయ్యిపోయే పనికూడా కాదు. ప్రతిభాగానికి దాదాపు పది నుంచి పన్నెండు మంది కళాకారుల బృందంతో సుమారు ఆరు నెలల శ్రమ ఫలితం ఈ చీరలు. చక్కటి పట్టు దారాలతో నేసిన చీరలివి. భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా చక్కటి మనికతో ఉంటాయి. వీటి సరిగ్గా వాడితే శతాబ్దం వరకు చెక్కు చెదరవట. అయితే ఈ పటోలా చీరలను మాములు పద్ధతిలో వాష్ చేయకూడదు. వీటిని డ్రై-క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి..పటోలా చీరల కీర్తీ సరిహద్దులు దాటి..జర్మనీ, యూఎస్ఏ, రష్యా వంటి దేశాల అభిమానం కూడా సంపాదించుకుది. బనారసీ చీరల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సాంప్రదాయ వస్త్రాలలో ఇవి ఒకటి. అయితే వీటి ధరలు ప్రారంభ ధర రూ. 10 వేల నుంచి మొదలై దాదాపు ఏడు లక్షలుదాక పలికే లగ్జీరియస్ చీరలు కూడా ఉన్నాయి. (చదవండి: ప్రమాణ స్వీకారంలో కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
రిలయన్స్-వాల్ట్ డిస్నీ విలీనం ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ఇటీవలి ఒప్పందం మేరకు... రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన మీడియా ఆస్తుల్లో వాల్ట్ డిస్నీ ఇండియా ఈ డిసెంబర్ త్రైమాసికంలోపు విలీనం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందంటూ స్టాక్ ఎక్స్చేంజ్ లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారం ఇచ్చింది. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతులు లభించడం గమనార్హం. ‘‘మిగిలిన అనుమతుల కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.విలీన లావాదేవీ 2024–25 సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగుస్తుందని అంచనా వేస్తున్నాం’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రిలయన్స్ మీడియా విభాగాలైన టీవీ18 బ్రాడ్కాస్ట్, ఈ18, నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విలీనానికి ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదం తెలియజేసిందని.. అక్టోబర్ 3 నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన వయాకామ్ 18 పరిధిలోని నాన్ న్యూస్ (వార్తలు కాకుండా), కరెంట్ ఎఫైర్స్ టీవీ ఛానళ్ల లైసెన్స్లను స్టార్ ఇండియాకు బదిలీ చేసేందుకు సెపె్టంబర్ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధిట్రీ సిస్టమ్స్కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యాపారానికి వయాకామ్ 18 హోల్డింగ్ కంపెనీగా ఉంది. విలీనం తుది దశలో ఉందని, సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారాల్లో సర్దుబాట్లు చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. అతిపెద్ద మీడియా సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగాలు, వాల్ట్డిస్నీ ఇండియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. విలీనానంతర సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. పోటీ సంస్థలైన సోనీ, నెట్ఫ్లిక్స్ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రూ.11,500 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిగా పెట్టనుంది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్ అయ్యారు.ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్లు గత ఏడాది అక్టోబర్లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించిన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు అందుకున్నారు.ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. -
బుల్.. కొత్త రికార్డుల్
ముంబై: ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. తొలిసారి సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, టీసీఎస్, ఇన్ఫోసిస్ 2%, అ్రల్టాటెక్ సిమెంట్ 5%, ఎన్టీపీసీ 3% పెరిగి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు, కాసేపటికే పుంజుకొని తాజా రికార్డులు నమోదు చేశాయి. మిడ్సెషన్ నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ఇరు సూచీలు సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి.ట్రేడింగ్లో సెన్సెక్స్ 721 పాయింట్లు ఎగసి 79,396 వద్ద ఆల్టైం హైని అందుకుంది. చివరికి 569 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 219 పాయింట్లు బలపడి 24,087 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 176 పాయింట్లు బలపడి 24,044 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ ఫైనాన్స్, పారిశ్రామిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.17 % లాభపడగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ అరశాతానికి పైగా నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 83.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ సూచీలు బలహీనంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ‘‘జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయి. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది. ర్యాలీ ఇలానిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం 20,000 51 రోజులు 21,000 60 రోజులు 22,000 25 రోజులు 23,000 88 రోజులు 24,000 25 రోజులు -
'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్గా సరిలేరామెకు'! దటీజ్ నీతా!
అందిరిలానే ఓ సాధారణ అమ్మాయి నీతా. అనుకోకుండా ఓ సంపన్న కుటంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది. అందరిలా ఎగిరి గంతేయ్యలేదు. ఇద్దరి మనసులు కలిసాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆఖరికి కోడలిగా అడుగుపెట్టిన తన ఉద్యోగం మాత్రం వదిలేయనని తెగేసి చెప్పింది. నిజానికి ఆమె గొప్పింటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చొవచ్చు అందుకు ఆమె అంగీకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది. కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్జించుకన్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విలక్షణమే అమెను పవర్ ఫుల్ విమెన్గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కేలా చేసింది. పైగా సక్సెస్ఫుల్ విమెన్కి అసలైన నిర్వచనంగా నిలిచింది నీతా అంబానీ. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. ఆమె కామర్స్లో డిగ్రీ చేశారు. భరత నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఎప్పటిలానే ప్రదర్శన ఇచ్చి ఇచ్చారు. అది ధీరుబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది. ఆమె నృత్య ప్రదర్శన, చలాకీతనం ధీరుబాయ్ దంపతులకు ఎంతాగనో నచ్చింది. తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబమని మంచి ఫేమ్ ఉంది. అయితే ఈ విషయం నీతా చెవిన పడింది. కానీ ఆమె ఎగిరి గంతెయ్యలేదు. పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది. అయితే అప్పుడూ ఆమె జీతం రూ. 800/-. అయినా ఇప్పుడూ అంబానీ కోడలివి అది ఏ పాటిదన్న ససమేరా అంది. పైగా అది తన ఆత్మగౌరవం అని తేల్చి చెప్పింది. ఓ తల్లిగా పిల్లలను.. ఆమె పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారేమె. తన పిల్లలను మధ్య తరగతి పిల్లల్లానే పెంచేవారట. అయితే ప్రతి శుక్రవారం పిల్లలకు కొనుక్కోవడానికి రూ.5/- ఇచ్చేవారట. ఒకరోజు చిన్న కొడుకు అనంత్ నువ్వు రూ. 5లే తెచ్చుకుంటున్నావ్.. అంబానీ కొడుకువేనా అని స్నేహితులు హేళన చేస్తున్నారని మారం చేశాడు. ఆ ఘటన నీతాను కదిలించినా చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో సర్ది చెప్పి పంపించారట. అలాగే వారిపై ఆంక్షలు విధించేవారట. స్వేచ్ఛగా వారి నిర్ణయాలు తీసుకుని కెరియర్లో రాణించేలా చేసేవారట. సమానత్వానికే పెద్ద పీట.. ఎవ్వరైనా మీకు ఇద్దరు వారసులు కదా అని అడిగితే కాదు ముగ్గురు అని సవరించేవారట నీతా. అంతేగాదు తన కూతురు ఇషా అంబానీని నువ్వు ఎవ్వరికీ తీసిపోవంటూ కూతురిని వ్యాపారం రంగంలో ప్రోత్సహించారు నీతా. అదుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆఖిరికి అనంత్ అంబానీ బరువు విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురయ్యేవాడో పలు ఇంటర్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకోసం ఆమె అతని తోపాటు యోగా, వ్యాయామాలు చేసి 90 కేజీలు బరువున్న ఆమె కాస్త 50 కేజీలకు వచ్చి కొడుకుకి ఆదర్శంగా నిలిచి చూపించింది. అయితే అనంత్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బరువు తగ్గి చూపించాడు. అయితే అనారోగ్యం కారణంగా మళ్లీ అనూహ్యంగా చాలా బరువు పెరిగిపోవడం జరిగింది. ఆ సమయంలో మరింతగా బాధపడుతున్న అనంత్కి తనలో ఉన్న లోపాలను చూడొద్దని, సానుకూలతలనే చూడమని చూపింది. అందువల్లే ముగ్గురు పిల్లలు కూడా 'అమ్మే మా ధైర్యం' అని పలు ఇంటర్యూల్లో ముక్త కంఠంతో చెప్పారు. తొలి మహిళా బోర్డు సభ్యురాలు ఆమె.. ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పుడే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్పర్సన్ కూడా నీతానే!. ఇలా కెరీర్ పరంగాను సక్సెస్ఫుల్గా దూసుకుపోయారామె. ఈ విజయాలే ఆమెను పవర్ఫుల్ బిజినెస్ విమెన్’గా ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది. ఎన్నెన్నో పురస్కారాలను అందుకునేలా చేసింది. సేవలోనూ ముందుటారామె.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే 1997 జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారు. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు... వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అలాగే హర్ సర్కిల్’ పేరుతో మహిళా సాధికారతకు ఎంతగానో కృషిచేశారు. (చదవండి: లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!) -
భారత్లో తొలి కంపెనీగా రిలయన్స్ - రూ.20 లక్షల కోట్లు..
ఫిబ్రవరి 13న ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 14 శాతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 20 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. 2024లో షేర్ విలువ ఇంత పెరగటం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ బిఎస్ఇలో ఫిబ్రవరి 13న రూ. 2,957కు చేరింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 1.7 శాతం పెరిగి రూ. 2953వద్ద ట్రేడ్ అయింది. దీంతో మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్లు దాటేసింది. 2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్ కొత్త సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ పెరుగుదల వైపు అడుగులు వేసింది. జనవరిలో 10.4 శాతం పెరిగిన షేర్ ఇప్పటికి (ఫిబ్రవరి) మరో నాలుగు శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకోగలిగింది. (మార్కెట్లో ఒడుదుడుకులు ఏర్పడితే విలువలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వ్యాల్యూలో తేడాలు రావొచ్చు.. గమనించగలరు.) -
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్లు 2023 ఎడిషన్లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్నగర్లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..!
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియాలో అత్యధికంగా కనిపించే (విజిబిలిటీ) కార్పొరేట్ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వార్తల్లో కార్పొరేట్ల విజిబిలిటీని విశ్లేషించే విజికీ న్యూస్ స్కోర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023కి గాను రిలయన్స్ 96.46 స్కోరుతో నంబర్ వన్ స్థానంలో ఉంది. గతేడాది ఇది 92.56గా, 2021లో 84.9గా నమోదైంది. నివేదికలోని మిగతా సంస్థల స్కోరుకు, రిలయన్స్ స్కోరుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎస్బీఐకి 85.81, హెచ్డీఎఫ్సీకి 84.06, ఐసీఐసీఐ బ్యాంక్కి 81.9, భారతి ఎయిర్టెల్కు 80.64 స్కోరు లభించింది. 4,00,000 పైచిలుకు ప్రచురణ సంస్థల్లో వార్తలు, హెడ్లైన్స్, సదరు పబ్లికేషన్ విస్తృతి, రీడర్షిప్ మొదలైన వాటి ఆధారంగా ఈ స్కోరు ఇచ్చారు. ఇందుకోసం కృత్రిమ మేథ, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. విజికీ పరిశోధన ప్రకారం పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)పరంగా కూడా రిలయన్స్ పటిష్టంగా ఉంది. నాలుగేళ్ల క్రితం విజికీ న్యూస్ స్కోర్ ప్రారంభమైనప్పటి నుంచి రిలయన్సే అగ్రస్థానంలో ఉంటోంది. కంపెనీ స్కోరు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. -
‘డిస్నీ–స్టార్’పై రిలయన్స్ కన్ను!
న్యూఢిల్లీ: భారత్లో డిస్నీ–స్టార్ వ్యాపారాన్ని దక్కించుకోవడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా దృష్టి పెట్టింది. 51% మెజారిటీ వాటా కొనుగోలుకు సంబంధించి వచ్చే వారం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు, స్టాక్ రూపంలో ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. ఒప్పందం కుదుర్చుకున్నాక ఇరు సంస్థలు వ్యాపార మదింపు ప్రక్రియ చేపడతాయని తెలిపాయి. ఒప్పందం సాకారమైతే మీడియా రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుంది. పలు సవాళ్ల నేపథ్యంలో భారత విభాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ ఇటీవల సంకేతాలిచ్చిన నేపథ్యంలో తాజా డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్సాలిడేషన్ దిశగా .. ఇప్పటికే జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని ఎలార క్యాపిటల్ ఎస్వీపీ కరణ్ తౌరానీ తెలిపారు. రెండు మీడియా దిగ్గజాలకు (సోనీ/రిలయన్స్) టీవీ/ఓటీటీ మార్కెట్లో సింహభాగం వాటా ఉంటుందని పేర్కొన్నారు. డిస్నీ–స్టార్ భారత వ్యాపార విభాగంలో స్టార్ ఇండియా తదితర టీవీ చానళ్లు, డిస్నీప్లస్హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫాం ఉన్నాయి. డీల్ అనంతరం డిస్నీ–స్టార్కు దేశీ వ్యాపారంలో మైనారిటీ వాటాలు ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం అమలైతే విలీన సంస్థ దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18కి చెందిన 38 చానళ్లు, స్టార్ ఇండియాకి ఎనిమిది భాషల్లో ఉన్న చానళ్లతో కలిపి మొత్తం 70 టీవీ చానళ్లు ఉంటాయి. వాటితో పాటు 2 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు–డిస్నీప్లస్హాట్స్టార్, జియోసినిమా కూడా ఉంటాయి. 2019లో స్టార్ను ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ నుంచి డిస్నీ కొనుగోలు చేసింది. -
వినాయక చవితికి జియో ఎయిర్ఫైబర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి వారసుల ఎంట్రీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అంబానీ సోదరులకు శాట్లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్ఏఎస్టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
దేశంలో విలువైన కంపెనీ రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘2022 బుర్గుండీ ప్రైవేటు హరూన్ ఇండియా 500’ జాబితా మంగళవారం విడుదలైంది. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. రూ.9.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం అనంతరం రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరికొన్ని ప్రత్యేకతలు కూడా సొంతం చేసుకుంది. 2022–23 సంవత్సరానికి రూ.67,845 కోట్ల లాభంతో అత్యంత లాభదాయక సంస్థగానూ ఉంది. అలాగే, అత్యధికంగా రూ.16,297 కోట్ల పన్నును చెల్లించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ అన్లిస్టెట్ కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.1.97 లక్షల కోట్లుగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ రూ.1.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. రూ.69,100 కోట్లతో బైజూస్ మూడో అత్యంత విలువైన అన్లిస్టెడ్ సంస్థగా ఉంది. 2022 అక్టోబర్ 30 నుంచి 2023 ఏప్రిల్ 30 మధ్య ఆరు నెలల కాలంలో దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువల వ్యత్యాసాన్ని బర్గుండీ ప్రైవేటు, హరూన్ ఇండియా ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించాయి. మార్కెట్ విలువ ఆధారంగానే వాటికి ర్యాంకులను కేటాయిస్తుంటాయి. దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువ 2022 అక్టోబర్ 30 నాటికి రూ.227 లక్షల కోట్లుగా ఉండగా, 2023 ఏప్రిల్ 30 నాటికి 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు పరిమితమైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.71.5 లక్షల కోట్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 37 శాతానికి సమానం. అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. అదానీ గ్రూపులో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 52 శాతం క్షీణించింది. -
అంబానీకి అప్పు కావాలంట! విదేశీ బ్యాంకులతో టచ్లో రిలయన్స్..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. రూ.7,35,000 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల (రూ. 16,386 కోట్లు) రుణం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత విజయవంతమైన వ్యాపారాల శ్రేణిని కలిగి ఉన్న రిలయన్స్ గ్రూప్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రుణాన్ని కోరుతోంది. రుణం కోసం రిలయన్స్ విదేశీ వాణిజ్య రుణ మార్గాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. బ్లూమ్బెర్గ్ నివేదక ప్రకారం.. ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్ కంపెనీ ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది. టచ్లో ఉన్న బ్యాంకులు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లతో కంపెనీ టచ్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముఖేష్ అంబానీ గత 10 సంవత్సరాలుగా టెలికాం, కన్జ్యూమర్ బిజినెస్ రంగాల్లో వైవిధ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలను ప్రారంభించారు. అవి భారీగా విజయవంతమయ్యాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు ముడి చమురు శుద్ధి ప్రధాన వ్యాపారంగా ఉంది. జియో, రిటైల్ వ్యాపారాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ కంపెనీ కొత్త ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ను 2020లోనే ముఖేష్ అంబానీ రుణ విముక్తంగా ప్రకటించారు. కానీ టెలికాం, రిటైల్ రంగాలలో విస్తరణలో భాగంగా ఇటీవల నిధుల సేకరణ జరుపుతోంది. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా 3 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. అనంత్ అంబానీ నేతృత్వంలో కంపెనీ 2030 నాటికి గ్రూప్కు 10-15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెస్తుందని ఇటీవల ఒక విదేశీ సంస్థ అంచనా వేసింది. -
ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ సాలరీపై సోషల్మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. వామ్మో.. అంత సాలరీ ఎందుకు సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్స్టైల్కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు. వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
తెలుగు రాష్ట్రాలకు జియో సంక్రాంతి కానుక.. మరిన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు 5జీ నెట్వర్క్ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ప్రారంభంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 5జీ సేవల్ని ప్రారంభించిన జియో.. తాజాగా మరో 16 నగరాల్లో యూజర్లు వినియోగించేలా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. జియో అందుబాటులోకి తెచ్చిన 16 నగరాల్లో కర్నూలు,కాకినాడ (ఆంధ్రప్రదేశ్), సిల్చార్ (అస్సోం), దేవనగరి, శివమొగ్గ, బీదర్, హోస్పేట్, గడగ్-బెటగేరి (కర్ణాటక),మలప్పురం,పాలక్కాడ్,కొట్టాయం, కానూర్ (కేరళ), తిరుపూర్ (తమిళనాడు), నిజామాబాద్, ఖమ్మం (తెలంగాణ), బరేలీ(ఉత్తర్ ప్రదేశ్)లు ఉన్నాయి. అధిక నగరాల్లో జియో 5జీ సేవలు దేశంలో తొలిసారి అధిక నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన టెలికం సంస్థగా జియో ప్రసిద్ది చెందింది. ఇక జియో 5జీ నెట్ వర్క్ వినియోగించుకునేందుకు సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా 1జీబీపీఎస్ వరకు అన్లిమిటెడ్ డేటా పొందవచ్చని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర్ఖండ్,బీహార్,జార్ఖండ్లలో కనెక్టివిటీ సర్వీసుల్ని వినియోగంలోకి తెచ్చిన జియో.. విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవల్ని యూజర్లకు అందిస్తామని జియో ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జియో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. జియో 5 జీ నెట్ వర్క్ వాణిజ్యం, టూరిజం, ఎడ్యూకేషన్ హబ్స్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చాం. జియో 5జీ నెట్ వర్క్తో టెలికం సేవలతో పాటు ఈ-గవర్నెన్స్,ఎడ్యుకేషన్, ఆటోమెషిన్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్,గేమింగ్, అగ్రికల్చర్, ఐటీ, చిన్న మధ్యతరహా పరిశ్రమ వంటి రంగాలు గణనీయమైన వృద్ది సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ధీరూభాయ్ రోల్ మోడల్..ముఖేష్ అంబానీ నాకు మంచి స్నేహితుడు : అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీని రోల్ మోడల్గా, అతని కుమారుడు ముఖేష్ అంబానీని స్నేహితుడిగా భావిస్తున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ తెలిపారు. అంతేకాదు దేశంలోనే అత్యంత సంపన్న అదానీ - అంబానీ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ధీరూభాయ్ మాకు రోల్ మోడల్, స్ఫూర్తి అని చెప్పారు. ఈ సందర్భంగా ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతనిని గౌరవిస్తాను. సంప్రదాయిక పెట్రోకెమికల్స్ వ్యాపారంతో పాటు జియో, టెక్నాలజీ, రిటైల్ వంటి వ్యాపారాలకు కొత్త దిశానిర్దేశం చేశారు. అంతేకాదు దేశ పురోగతికి దోహదపడుతున్నారని కొనియాడారు. గత ఏడాది ముకేశ్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో చేరినప్పుడు మీకేమనిపించింది అన్న ప్రశ్నకు అదానీ స్పందించారు. నేను ఈ సంఖ్యల ఉచ్చులో ఎప్పుడూ పడలేదని సమాధానం ఇచ్చారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 117 బిలియన్ల విలువ కలిగిన అదానీ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తర్వాత ఆసియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన అదానీ, అంబానీలు భారత్ తన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసుకునే సమయంలో వ్యాపార రంగాల్లో అడుగు పెట్టి ఏసియా దేశాల్లో ధనవంతులుగా చెలామణి అవుతున్నారు. -
‘భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలి’
ముకేశ్ అంబానీ. భారతదేశంలో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత. రిటైల్ రంగాన్ని పరుగులు తీయిస్తున్న కార్పొరేట్ దిగ్గజం. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను అందించేందుకు శ్రమిస్తున్న వ్యాపారవేత్త. ‘రిలయన్స్ ఇండియా’ను హరిత కార్పొరేట్గా మలచాలని కలలు కంటున్న వ్యూహకర్త. ఏటా తన తండ్రి ధీరూబాయి పుట్టిన రోజును ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ గా నిర్వహిస్తారు. కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులతో సంభాషిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. గత ఏడాది ఇదే కార్యక్రమంలో తన పిల్లలు ముగ్గురికి కంపెనీ వారసత్వ పగ్గాలను అప్పగించారు. టెలికాం, డిజిటల్ బిజినెస్ పెద్ద కొడుకు ఆకాశ్కి, కవల సోదరి ఇషాకు రిటైల్, చిన్న కొడుకు అనంత్కు ఎనర్జీ బిజినెస్ అప్పగించారు. ఈ సారి ఫ్యామిలీ డే సందర్భంగా ఆయన ప్రసంగం మరింత ఉత్తేజ భరితంగా సాగింది. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, సంస్థల్లోని నాయకులు, ఉద్యోగులు అంతా అంచనాలను అందుకోవాలని చెప్పారు. అర్జెంటీనా జట్టును ప్రేరణగా తీసుకుని ముందుకు సాగిపోవాలని చెప్పారు. భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాక్షించారు. ఇతర అంశాలు ఆయన మాటల్లోనే... జనహృదయాల్లో చిరస్థాయిగా రిలయన్స్ ‘‘కాలం పరిగెడుతుంది. రిలయెన్స్ సంస్థ మర్రిచెట్టు మాదిరిగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. దాని కొమ్మలు విశాలమవుతాయి. వేళ్లు మరింత లోతుకు చొచ్చుకుపోతాయి. ఎందరో భారతీయుల జీవితాలను అది స్పృశిస్తుంది. సుసంపన్నం చేస్తుంది. వారికి సాధికారతను ఇస్తుంది. పెంచి పోషిస్తుంది. సంరక్షిస్తుందన్నారు ముకేశ్ అంబానీ. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు ‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని ఏ ఇతర దేశాలలో కంటే భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2023 నాటికి 5G మోహరింపు పూర్తవుతుంది. జియో ప్లాట్ ఫామ్స్ అన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్ను, పరిష్కారాలను అందిస్తూ తమకు దక్కిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ప్రతి గ్రామానికి 5జీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీనివల్ల గ్రామీణ-పట్టణ అన్న అంతరం తొలుగుతుంది. అత్యున్నత విద్య, అత్యున్నత ఆరోగ్య సంరక్షణ, అత్యున్నత వాణిజ్య కలపాలు సాధ్యమవుతాయి. జియో వల్ల సంఘటిత అభివృద్ధి వేగవంతం అవుతుందని’ అన్నారు. భారత సంఘటిత అభివృద్ధిలో పాత్ర ‘ఇషా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం కూడా విస్తృతంగా, మరింత లోతుగా చొచ్చుకుపోతోంది. మరింత ఉన్నతమైన లక్ష్యాలు, గమ్యాలను వెతుక్కుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అధిక ఉపాధి కల్పన, రైతులకు అధిక ఆదాయం, చిన్న, మధ్యతరహా తయారీ రంగం మరింత ఉత్పాదను సాధించటం, వ్యాపారులు మరింత సంపన్నులు కావటం ద్వారా భారత్ లోని సంఘటిత అభివృద్ధిలో రిటైల్ వ్యాపారం కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు’ ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు, పెట్రో కెమికల్ ప్లాంటులతో ఆయిల్–టు-కెమికల్ వ్యాపారంలోనూ గ్రూపు తన నాయకత్వ స్థానాన్ని నిలుపుకుంటోంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను డిజిటల్ సర్వీసెస్ తో అనుసంధానం చేయటం వల్ల పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఎనర్జీ బిజినెస్లో.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయటంతో పాటు, హైడ్రోజన్ బిజినెస్ లోకి ప్రవేశించటం వంటి అంశాలు కంపెనీ స్వరూప స్వభావాలనే మార్చివేస్తాయి. కొత్తతరం వ్యాపార ప్రపంచంలోకి అనంత్ ప్రవేశించారు. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వేగవంతంగా ముందుకు వెళుతున్నాం. విస్తృతిలోనూ, విలువ పరంగానూ ఖ్యాతి గడించిన రిలయెన్స్ ‘గ్రీన్ కార్పొరేట్’గా దిశగా అడుగులు వేస్తోంది. ఇంధన రంగంలో స్వయంసమృద్ధి ఇంధనరంగం ముందు స్పష్టమైన లక్ష్యాలున్నాయి. దిగుమతులపైన ఆధారపడటం తగ్గించి భద్రతను, స్వయంసమృద్ధిని సాధించాలి. చురుగ్గా, సాంకేతికంగా ముందుండటం వల్ల దీనిని సాధించవచ్చుని అన్నారు. అర్జెంటీనా విజయమే ప్రేరణ వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే, నాయకత్వం, బృంద సభ్యుల పనితీరు ముఖ్యం. అర్జెంటీనానే అందుకు గొప్ప ఉదాహరణ. నాయకత్వం, మంచి బృందం కలవటం వల్లనే ఫుట్బాల్లో ఆ దేశం ప్రపంచకప్ గెల్చుకోగలిగింది. మెస్సీ తను సొంతంగా కప్ గెల్చుకోలేదు. అదే సమయంలో మెస్సీలాంటి సమర్థ నాయకత్వం లేకపోతే అర్జెంటీనా జట్టు విజయం సాధించి ఉండేది కాదు. మొదటి గేమ్లో వారు అపజయం పాలయ్యారు. విజయాన్ని శ్వాసించి.. విజయాన్ని కలగని.. విజయం సాధించేందుకు అవసరమైనదంతా చేసి.. చివరి పెనాల్టీ షాట్ వరకూ విజయాన్ని వెంటాడుతూ.. చివరికి గెలుపును సొంతం చేసుకున్నారు. వివేకానందుని మంత్రం మా తండ్రి ధీరుబాయి అంబానీ మాదిరిగానే నేనూ వివేకానందుని నుంచి ప్రేరణ పొందుతాను. ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంగా మలుచుకోండి. దాని గురించి ఆలోచించండి. దానిపైనే జీవించండి. మీ మనసు, శరీరం, నరాలు, కండరాలు, మీ శరీరంలోని అణువణువునూ అదే ఆలోచనతో నింపి, మిగిలిన ఆలోచనలన్నింటిని పక్కన పెట్టండి. అదే విజయానికి మార్గం. అదే గెలుపు మంత్రమంటూ ముగించారు ముకేశ్ అంబానీ. చదవండి: కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్! -
రిలయన్స్ కిట్టీలో సోస్యో డ్రింక్
కార్బొనేటెడ్ పానీయాల కంపెనీ సోస్యో హజూరీ బెవరేజెస్లో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ గుజరాత్ కంపెనీలో మిగిలిన 50 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు హజూరీ కుటుంబం కలిగి ఉంటుందని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. తాజా కొనుగోలుతో పానీయాల విభాగం మరింత బలపడనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ పేర్కొంది. శత వసంతాల పురాతన కంపెనీ సోస్యో కార్బొనేటెడ్ పానీయాలు, జ్యూస్ల తయారీలో ఉంది. కాగా.. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ సుప్రసిద్ధ బ్రాండ్ క్యాంపాకోలాను సొంతం చేసుకోవడం తెలిసిందే. 1923లోనే..: సోస్యో హజూరీ బెవరేజెస్ను 1923లో అబ్బాస్ అబ్దుల్రహీమ్ హజూరీ ఏర్పాటు చేశారు. గుజరాత్లో తయారీ యూనిట్ ఉంది. ప్రధాన బ్రాండ్ సోస్యో పేరుతో గుజరాత్తోపాటు పొరుగు రాష్ట్రాలలోనూ పానీయాలు విక్రయిస్తోంది. పానీయాలను యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా స్థానిక హెరిటేజ్ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడంతోపాటు.. వృద్ధి అవకాశాలకు తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
గురువాయూర్ శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కేరళలోని గురువాయూర్ శనివారం శ్రీకృష్ణుని స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు. అంబానీ సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలలో గురువాయుర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఆయన కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఆలయంలోని సోపానం (అంతర్గత గర్భగుడి) వద్ద నెయ్యి సమర్పించడంతో పాటు ఆలయ ఏనుగులు చెంతమరక్షన్, బలరామన్లకు నైవేద్యాలు సమర్పించారు. కాగా కొన్ని రోజులుగా రిలయన్స్ అధినేత కాబోయే కోడలితో కలిసి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే తిరుపతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. -
మొదట 5 మెట్రో నగరాల్లో 5జీ సేవలు: రిలయన్స్
-
రిలయన్స్ రిటైల్ ఐపిఒ పై సర్వత్రా ఉత్కంఠ
-
ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్లుక్ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి. చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా? -
రంకెలేసిన బుల్, 18 లక్షల కోట్లను క్రాస్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ!
ముంబై: ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చల ద్వారా సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో పాటు మార్కెట్ల అనిశ్చితిని అంచనా వేసే వీఐఎక్స్ ఇండెక్స్ భారీగా దిగిరావడం (20 స్థాయికి దిగువకు)ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 58,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు బలపడి 17,498 వద్ద నిలిచింది. ఈ ముగింపు సూచీలకు ఆరువారాల గరిష్టస్థాయి కావడం విశేషం. విస్తృతస్థాయి మార్కెట్లో బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో ఒక్క జపాన్ స్టాక్ మార్కెట్ మాత్రమే నష్టపోయింది. మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండు శాతం వరకు రాణించాయి. ఇటీవల భారీ ర్యాలీ నేపథ్యంలో యూరప్ మార్కెట్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1357 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,126 కోట్ల షేర్లను కొన్నారు. మూడురోజుల్లో రూ.3 లక్షల కోట్లు గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1321 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈ నమోదిత కంపెనీలు మొత్తం రూ.3 లక్షల కోట్లను ఆర్జించాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఇదే మూడురోజుల్లో నిఫ్టీ సూచీ 345 పాయింట్లు లాభపడింది. ఒడిదుడుకులమయంగా సాగిన మార్చి ట్రేడింగ్లో మొత్తం రూ.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ‘‘ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ తేదీ(నేడు)న నిఫ్టీ 17,450 స్థాయి నిలుపుకోలిగే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కీలక నిరోధం 17,900 స్థాయిని చేధించేందుకు వీలుంటుంది. ఇటీవల గరిష్టాలను చేరిన కమోడిటీ, క్రూడ్ ధరలు దిగిరావడంతో కార్పొరేట్లపై నెలకొన్న మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చనే అంచనాలు సూచీల ర్యాలీకి తోడ్పడ్డాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రూపాయి 21 పైసలు పతనం: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 21 పైసలు క్షీణించి 75.94 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల రికవరీతో పాటు వడ్డీరేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు రూపాయి కరిగేందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 75.65 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.62 వద్ద గరిష్టాన్ని, 75.97 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. రిలయన్స్ : రూ.18 లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో రెండుశాతం లాభపడి రూ.2,673 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.18 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►టాటా కాఫీ(టీసీఎల్)ని విలీనం చేసుకుంటామని టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రకటనతో టీసీఎల్ షేరు తొమ్మిది శాతం లాభపడి రూ.215 వద్ద స్థిరపడింది. ఒక దశలో 13 శాతం పెరిగి రూ.222 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ►ఎస్అండ్పీ బ్రోకరేజ్ సంస్థ పాజిటివ్ అవుట్లుక్ను కేటాయించడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు మూడుశాతం లాభపడి రూ.7,254 వద్ద ముగిసింది. ► ఓఎన్జీసీ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ఇష్యూ మొదలుకావడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఐదు శాతం క్షీణించి రూ.162 వద్ద స్థిరపడింది. -
అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార కార్యకలాపాల్నీ దేశ విదేశాలకు విస్తరిస్తున్నారు. ఇటీవల లండన్ స్టోక్ పార్క్ ఎస్టేట్ను కొనుగోలు చేసిన ఆయన తాజాగా అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రముఖ ఐకానిక్ లగ్జరీ హోటల్ 'మాండరీయన్ ఓరియంటల్'ను కొనుగోలు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాసియా దేశాల్లోనే అపరకుబేరుల జాబితాల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ నగరంలోని 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో కేపిటల్ ఆఫ్ కొలంబస్ సెంటర్ కార్పొరేషన్కు చెందిన ఐకానిక్ లగ్జరీ హోటల్ మాండరీయన్ ఓరియంటల్ 73.37శాతం స్టేక్తో 98.15మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ భారీ మొత్తాన్ని విలాసవంతమైన హోటల్లో పరోక్షంగా వాటాను కలిగి ఉన్న కేమాన్ ఐలాండ్స్ షేర్ ను కొనుగోలు చేయడంతో.. హోటల్ ముఖేష్ అంబానీ సొంతమైంది. హోటల్ ప్రత్యేకతలు 2003లో స్థాపించిన మాండరిన్ ఓరియంటల్ 80 కొలంబస్ సర్కిల్లో ఉన్న ఐకానిక్ లగ్జరీ హోటల్. ఇది నేచురల్ సెంట్రల్ పార్క్, కొలంబస్ సర్కిల్కు నేరుగా ఆనుకుని ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో ప్రసిద్దికెక్కిన హోటల్స్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అందుకుగాను ఆ హోటల్కు ఏఏఏ ఫైవ్ డైమ్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్స్టార్ స్పా అవార్డ్లను గెలుచుంది. కాగా ఈ హోటల్ 2018లో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,54,19,12,500.00, 2019లో రూ.8,39,33,57,500.00, 2020లో రూ.1,11,41,62,500.00 ఆదాయాల్ని గడించింది. ఇప్పుడు ఇదే హోటల్ ఎక్కువ వాటాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఆస్తులు రెట్టింపు అయినట్లు రిపోర్ట్లు పేర్కొన్నాయి. మొన్నిటిక మొన్న స్టోక్ పార్క్ ఎస్టేట్ రిలయన్స్ సంస్థ ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్), ముంబైలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఇళ్లను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం లండన్ బకింగ్ హామ్ స్టోక్ పార్క్లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లను వెచ్చించింది. కాగా, ఈ స్టోక్ పార్క్ ఎస్టేట్ను హెరిటేజ్ ప్రాపర్టీకింద వినియోగిస్తున్నట్లు రిలయన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం..! -
ఆ వార్త నిజం కాదు: రిలయన్స్
దేశ టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో (Reliance Jio) తన జెండాను రెపరెపలాడించింది. ఈ నేపథ్యంలో తర్వాతి అడుగుగా విదేశీ మార్కెట్లపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) దృష్టిసారించిందనే వార్త సోమవారం అంతా చక్కర్లు కొట్టింది. బ్రిటన్లోని అతిపెద్ద కంపెనీ బీటీ గ్రూప్(BT Group) కోసం బిడ్ వేయనుందనేది ఆ వార్త సారాంశం. కొంతకాలం క్రితం రిలయన్స్ T-Mobile డచ్ యూనిట్ను కొనుగోలు చేయడానికి బిడ్ను వేసింది. అంతకు ముందు లండన్లోని ఐకానిక్ స్టోక్ పార్క్ను 57 మిలియన్ పౌండ్లతో కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ అండ్ బిటిల ఒప్పందంపై వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ కథనాలను కొట్టిపారేసింది రిలయన్స్. ఇది పూర్తిగా నిరాధారమైన, ఊహాజనితమైన కథనమని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బీటీ అనేది ఫిక్స్డ్ లైన్ టెలికాం సేవల యూకే ఆపరేటర్. గత కొన్ని సంవత్సరాలుగా ఫైబర్ బ్రాడ్బ్యాండ్, ఐపి టివి, టెలివిజన్, స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్, మొబైల్ సేవలను అందిస్తుంది, అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు అందిస్తుంది. బిటి స్టాక్ ఐదేళ్లలో 53% పడిపోయింది, 2020-21లో 11 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. అయితే రిలయన్స్ బిడ్ కథనాలు నేపథ్యంలో ఒక్కసారిగా షేర్ల దూసుకుపోవడం విశేషం. ఇక రిలయన్స్కు చెందిన జియో ప్రస్తుతం భారత్లో అతిపెద్ద ఆపరేటర్గా ఉంది. ట్రాయ్ డాటా ప్రకారం.. సెప్టెంబర్, 2021 నాటికి 42.48 కోట్ల మొబైల్ సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు జియోకి. ఇక ఈమధ్యే ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాతో పాటు జియో కూడా టారిఫ్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ
ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఫీట్ను సాధించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు. షేర్.. హుషారు శుక్రవారం ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో రియలన్స్ షేర్ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్ డాలర్లతో వరల్డ్ వైడ్ బిలియనీర్ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయరన్ను వెనక్కి నెట్టారు. 92.60 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అపర కుబేరుడు వారెన్ బఫెట్ 103 బిలియన్ డాలర్లతో 10వస్థానంలో ఉన్నారు. కలిసొచ్చిన కామెంట్స్ దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు కోసం రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ వాటాల్ని కొనుగోలు చేసినట్లు గురువారం తెలిపింది. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు (శుక్రవారం) నేషనల్ షాక్ ఎక్ఛేంజీలో 4.5 శాతానికి ఎగసి జీవితకాల గరిష్ట స్థాయిల్ని టచ్ చేయడంతో రియలన్స్ షేరు రూ .2,389.65 వద్ద ముగిసింది. దీంతో పాటు 'గ్రీన్ ఎనర్జీ' ద్వారా 100గిగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించడంతో రిలయన్స్ కు కలిసొచ్చింది. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
మరింత లాభం, చైనా కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను
ముంబై: సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్ (కెమ్చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1–1.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! త్వరలోనే ఈ డీల్ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ఈసీ గ్రూప్ .. యూరప్లోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ. సింగపూర్లో రిజిస్టర్ అయ్యింది. ఫొటోవోల్టెయిక్ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్ను తయారు చేస్తుంది. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఆర్ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆర్ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్కి ఏటా 3 గిగావాట్ల సోలార్ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సోలార్ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
రిలయన్స్ వ్యాక్సిన్: ట్రయల్స్కు గ్రీన్సిగ్నల్!
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలోకి అడుగుపెట్టింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వృద్ధి చేసిన రీకాంబినెంట్ ఆధారిత వ్యాక్సిన్.. రెగ్యులేటరీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ను పరిశీలించిన ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హ్యూమన్ ట్రయల్స్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిధిలోని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్.. ఇప్పుడు లైన్ క్లియన్ కావడంతో త్వరగా ఫేజ్-1 ట్రయల్స్ను మొదలుపెట్టనుంది. మొత్తం 58 రోజులపాటు ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ముంబై ధీరూబాయ్ అంబానీ లైఫ్ సైన్సెస్ సెంటర్లో నిర్వహించనుంది. అది అయిపోయిన వెంటనే.. రెండో, మూడో ట్రయల్స్ నిర్వహిస్తుంది. రెండో డోసుల ఈ వ్యాక్సిన్ అన్ని సక్రమంగా జరిగితే.. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలో వ్యాక్సినేషన్ రేటు పుంజుకునే టైంలో.. రిలయన్స్ వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రజలను ఆకర్షించేందుకు రిలయన్స్ ఎలాంటి అడుగులు వేయనుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, క్యాడిల్లా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: అంబానీ ‘డబుల్’ మాస్టర్ ప్లాన్ -
10 లక్షల ఉద్యోగులకు రిలయన్స్ ఉచిత వ్యాక్సిన్
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదేవిధంగా అసోసియేట్లు, భాగస్వాములకు కలిపి 10 లక్షలకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ ఏప్రిల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన మొత్తం ఉద్యోగుల్లో 98 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్నారు. అంతేగాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కమ్యూనిటీలకు ఉచిత వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో 'వి కేర్ ఇనిషియేటివ్' కింద అదనంగా 10 లక్షల మోతాదులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇది అతి పెద్ద ఉచిత కార్పొరేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రస్తుత కరోనా సంక్షోభంపై పోరాడటానికి ఇది ఒక్కటే మార్గం. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా ఎమ్. అంబానీ సాధారణ సమాజానికి టీకాలు వేయదనీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. "ఈ మిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయడం ఒక అతిపెద్ద పని. ప్రతి భారతీయుడి భద్రత, రక్షణ మా వాగ్దానం" అని ఆమె చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి రిలయన్స్ ఫౌండేషన్ అంతర్గత, బాహ్య సమాజాలను రక్షించే తమ సామాజిక బాధ్యత అని సంస్థ పేర్కొంది. -
Reliance Digital: ‘డిజిటల్ ఇండియా సేల్’లో బంపర్ ఆఫర్లు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ డిజిటల్ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్-డిజిటల్ ఇండియా సేల్’ పేరిట సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లను రిలయన్స్ డిజటల్ అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ జూలై 26 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ అన్ని మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్ www.reliancedigital.in. ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చును. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభించును. జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస లావాదేవీపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ను అందిస్తోంది.ఈ ఆఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఈఎమ్ఐ లావాదేవీలపై కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ పై యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభించును. వన్ప్లస్ నార్డ్2 స్మార్ట్ఫోన్ సేల్భాగంగా జూలై 28 నుంచి లభిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ వాచ్ సీరీస్ 6, శాంసంగ్ గాలక్సీ ఆక్టివ్ 2 స్మార్ట్ వాచ్లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త ఫైర్ బోల్ట్ అగ్ని స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. ల్యాప్ ట్యాప్ కేటగిరీలో బ్యాంక్ క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. దాంతో పాటుగా మ్యాక్ బుక్ ప్రో స్టూడెంట్స్, టీచర్లకు ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే రూ. 7000 క్యాష్ బ్యాక్ తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. ల్యాప్ టాప్లపై స్పెషల్ డీల్ జూలై 26 నుంచి జూలై 27 న మాత్రమే లభించును. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.32 ఇంచుల స్మార్ట్ టీవీలు రూ. 12,990 నుంచి ప్రారంభం కానున్నాయి. రిఫ్రిజరేటర్లు రూ. 11,990, ప్రారంభం కానున్నాయి. అంతేకాకుంగా కొనుగోలుపై ఉచితంగా రూ. 1,999 విలువైన వస్తువులు లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధరతో ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్టోర్ల నుంచి మూడు గంటలలోపు డెలివరీ పొందవచ్చును. -
75వేల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేశాం: ముఖేశ్ అంబానీ
-
ప్రారంభమైన రిలయన్స్ 44వ వార్షిక సభ్య సమావేశం
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి మరో కంపెనీ
బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. బ్రిటన్కు చెందిన లిమిటెడ్ స్టోక్ పార్కును 79 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. హోటల్తో పాటు గోల్ఫ్ కోర్స్ కలిగిన స్టోక్ పార్క్ను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్ పార్క్ కూడా భాగం కానుంది. 1964 బ్లాక్ బస్టర్ మూవీలో జేమ్స్ బాండ్, ఆరిక్ గోల్డ్ ఫింగర్తో కలిసి గోల్ఫ్ కోర్స్ ఆట ఆడినప్పటి నుంచి రోలింగ్ గోల్ఫ్ కోర్సు భాగ ఫేమస్ అయ్యింది. ముఖేష్ అంబానీ తన సామ్రాజ్యాన్ని ఇంధనేతర రంగంలోకి విస్తరిస్తున్న తరుణంలో 2019లో బ్రిటిష్ బ్రాండ్ అయిన ప్రముఖ ఆటబొమ్మల సంస్థ హామ్లిస్ను కొనుగోలు చేశారు. దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలు ఉన్న ఈ రంగంలోకి హామ్లిస్తో ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. గత ఏడాది రిలయన్స్ రిటైల్ & డిజిటల్ యూనిట్లలో ఉన్న వాటాను విక్రయించిన తర్వాత వచ్చిన 27 బిలియన్ డాలర్ల తాజా మూలధనంతో వినియోగ ఆధారిత సేవా రంగాలపై ముకేశ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్లోకి ప్రవేశించారు. చదవండి: 2021లో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల జోరు! -
రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గడువు మార్చి 31, 2021 నాటికి ముగిసిపోయింది. తాజాగా కొనుగోలు ఒప్పందం గడువు సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత ఏడాది కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వాటాలున్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ-కామర్స్ దిగ్గజం దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. 2020 ఆగస్టు 29న ప్రకటించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం, సిసిఐ, సెబీ, బోర్సెస్ వంటి రెగ్యులేటర్ల నుంచి ఇప్పటికే క్లియరెన్స్ పొందింది. ఈ ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడటంతో రిలయన్స్ గడువును పొడిగించాల్సి వచ్చింది. చదవండి: మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు -
గూగుల్, ఫేస్బుక్తో రిలయన్స్ జట్టు
రిటైల్ పేమెంట్స్ లైసెన్స్ కోసం టెక్ దిగ్గజం గూగుల్, ఫేస్బుక్ సంస్థలతో కలిసి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ(ఎన్యూఐ)ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) మాదిరిగానే వాటా పొందేందుకు రిలయన్స్ ఆసక్తి కనబరుస్తుంది. దీనికోసం రిలయన్స్, గూగుల్, ఫేస్బుక్ సంస్థలు సో హమ్ భారత్ అనుబంధ సంస్థ ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ లిమిటెడ్ సంస్థతో కలిసి ఎన్యూఐ లైసెన్స్ కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బృందంలో గూగుల్, ఫేస్బుక్ తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. దేశ డిజిటల్ ఎకానమీని బలోపేతం చేయడానికి తమ బృందం ఒక ప్లాన్ను ఆర్బీఐకి సమర్పించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు విజయవంతం కావడంతో ఆర్బీఐ 2020 ఆగస్టులోఎన్యూఐ బిడ్లను ఆహ్వానించింది. ఆర్బిఐ ఇటీవల ఎన్యుయు దరఖాస్తుల గడువును మార్చి 31, 2021కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేస్తుంది. రిలయన్స్తో పాటు టాటా గ్రూప్, అమెజాన్-ఐసీఐసీఐ బ్యాంక్-యాక్సిస్ బ్యాంక్, పేటీఎం-ఓలా-ఇండస్లాండ్ బ్యాంక్ వేర్వేరుగా ఎన్యూఐల కోసం ఆర్బీఐకి దరఖాస్తులు చేసేందుకు సిద్ధం అయ్యాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
2 దశాబ్దాల్లో టాప్–3లోకి..
న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ’ఫేస్బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ కార్యక్రమంలో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్తో వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా మొత్తం కుటుంబాల్లో 50 శాతం పైగా వాటా ఉండే మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఏడాదికి మూడు.. నాలుగు శాతం మేర వృద్ధి చెందుతుందని అంబానీ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థికంగా, సామాజికంగా మరింత వేగంగా వృద్ధి చెందబోతోందని, ఫేస్బుక్, జియో సహా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కంపెనీలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఇది బంగారంలాంటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ‘‘వచ్చే రెండు దశాబ్దాల్లో టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. యువ జనాభా ఊతంతో ప్రీమియర్ డిజిటల్ సమాజంగా కూడా ఎదుగుతుంది. మా తలసరి ఆదాయం 1,800–2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది’’ అని అంబానీ పేర్కొన్నారు. సంక్షోభానికి వెరవడం మా డీఎన్ఏలోనే లేదు.. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ దృఢసంకల్పంతో, దీటుగా ఎదుర్కొందని అంబానీ చెప్పారు. ‘‘కోవిడ్–19 మహమ్మారి భారీ స్థాయిలో విరుచుకుపడటం.. మిగతా అందరిలాగే భారత్లో ప్రజల్నీ కలవరపర్చింది. అయితే, సంక్షోభాలకు వెరవడమన్నది బహుశా భారతీయుల డీఎన్ఏలో లేదేమో. అందుకే మేం దీన్ని దీటుగా ఎదుర్కొనగలిగాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ సంక్షోభం.. ఒక కొత్త అవకాశం కల్పిస్తుందని అంబానీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అత్యంత భారీ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. డిజిటల్ ఊతం... డిజిటల్ ఇండియా నినాదం ఊతంతో కనెక్టివిటీ పెరగడం వల్ల కరోనా వైరస్పరమైన పరిస్థితులను భారత్ దీటుగా ఎదుర్కొనగలిగిందని అంబానీ పేర్కొన్నారు. సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేందుకు డిజిటైజేషన్ ప్రక్రియ తోడ్పడగలదన్నారు. ‘భారత్, భారతీయులకు, దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలకు.. ఫేస్బుక్, జియో భాగస్వామ్యం ఎంతో ప్రయోజనం చేకూ ర్చనుంది. రాబోయే రోజుల్లో మన మాటల కన్నా చేతలే దీనికి నిదర్శనంగా ఉండబోతున్నాయి’ అని జకర్బర్గ్తో అంబానీ చెప్పారు. -
బిల్గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కి చెందిన బ్రేక్థ్రూ ఎనర్జీ వెంచర్స్ (బీఈవీ)లో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో విడతలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలు కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది. సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ఇంధనాలు మొదలైన వాటిని ఆవిష్కరించేందుకు వెచ్చించనుంది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్ తెలిపింది. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్బస్టర్ డీల్కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన 1,800లకుపైగా బిగ్బజార్, ఎఫ్బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్లో భాగంగా రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు ఆర్ఆర్వీఎల్కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్స్టైల్ లిమిటెడ్కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలు ఆర్ఆర్వీఎల్కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ గ్రూప్ రిటైలింగ్!
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రిటైల్ బిజినెస్ను బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్తో నగదు రూపేణా డీల్ కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. డీల్ విలువ రూ. 30,000 కోట్లవరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఒకే సంస్థగా.. రుణ భారంతో కొద్ది రోజులుగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తద్వారా రిటైల్ బిజినెస్ను ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం ఆర్ఐఎల్కు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డీల్పై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. తొలుత గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్, కన్జూమర్ బిజినెస్లతో కూడిన ఐదు లిస్టెడ్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనం కానున్నాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం గ్రూప్నకు చెందిన రిటైల్ బ్యాకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెరసి ఫ్యూచర్ రిటైల్, లైఫ్స్టైల్, సప్లై చైన్, మార్కెట్స్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనంకానున్నట్లు అంచనా. విలీనం తదుపరి మొత్తం రిటైల్ ఆస్తులను ఒకే యూనిట్గా ఆర్ఐఎల్కు విక్రయించనుంది. చెల్లింపులు ఇలా! పరిశ్రమవర్గాల అంచనా ప్రకారం రిలయన్స్ తొలుత రూ. 13,000 కోట్లను ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మరో రూ. 7,000 కోట్లను భూయజమానులు, వెండార్స్కు చెల్లించనుంది. మరో రూ. 7,000 కోట్లవరకూ ప్రమోటర్ గ్రూప్నకు విడుదల చేసే అవకాశముంది. తదుపరి దశలో రూ. 3,000 కోట్లు వెచ్చించడం ద్వారా ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో 16 శాతం వరకూ వాటాను సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్ కన్జూమర్కు చెందిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, టెక్స్టైల్ మిల్స్, బీమా విభాగాలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కలిగి ఉండవచ్చని అంచనా. ఫుడ్, ఫ్యాషన్ సరఫరాలకు వీలుగా ఆర్ఐఎల్తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కుదుర్చుకోనుంది. ఈ వివరాలపై రెండు కంపెనీలూ స్పందించేందుకు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. షేర్ల జోరు బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 4.3 శాతం జంప్చేసి రూ. 136కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ 4.7 శాతం ఎగసి రూ. 145ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 2 శాతం ఎగసి రూ. 19.6 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 2 శాతం బలపడి రూ. 151 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 26.65 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 2 శాతం పుంజుకుని రూ. 11.15 వద్ద కదులుతోంది. -
రిలయన్స్కు షాకిచ్చిన బ్రోకరేజ్లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్కు షాక్నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్గ్రేడ్ రేటింగ్ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్ను ‘‘అవుట్ఫెర్ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
మార్క్ జుకర్బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ
దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. వారాంతానికల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటంతో శుక్రవారం ఒక్క రోజులోనే వ్యక్తిగత సంపదకు 3.5 బిలియన్ డాలర్లు జమకావడం ఇందుకు సహకరించింది. రెండు వారాల క్రితమే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ను అధిగమించిన ముకేశ్ తాజాగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ అధినేత ఎలన్ మస్క్, గూగుల్ సహవ్యవస్థాపకులు సెర్జీ బ్రిన్, లారీ పేజ్లను సైతం వెనక్కి నెట్టినట్లు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు సరదాగా పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. జియో ప్లాట్ఫామ్స్ స్పీడ్ గత నెలలో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10వ ర్యాంకులో నిలిచారు. తదుపరి గ్రూప్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో సాగడంతో వ్యక్తిగత సంపద మరింత బలపడుతూ వచ్చింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే ముకేశ్ సంపద 22.3 బిలియన్ డాలర్లు పెరిగింది. మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే గ్రూప్లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 145 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫామ్స్లో 25 శాతం వాటా విక్రయం ద్వారా భారీగా విదేశీ నిధులను సమీకరించడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం ప్రస్తావించదగ్గ విషయంకాగా.. దీనికి జతగా ఇటీవల రిలయన్స్ రిటైల్లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలు ఇటీవల సెంటిమెంటుకు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది అత్యంత భారీగా సంపదను పెంచుకున్న వ్యక్తులలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలవడం విశేషం! బెజోస్ సంపద 2020లో ఇప్పటివరకూ 64 బిలియన్ డాలర్లమేర బలపడింది! -
ఆర్ఐఎల్- రోజారీ బయోటెక్ రయ్రయ్
ఇటీవల ప్రతిరోజూ సరికొత్త గరిష్టాలను తాకుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్(ఆర్ఐఎల్)కు మరోసారి డిమాండ్ నెలకొంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ షేరు మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో గురువారం భారీ లాభాలతో లిస్టయిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఆర్ఐఎల్ రికార్డ్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ దిగ్గజాలు క్యూకట్టడం, రైట్స్ ఇష్యూ పూర్తి నేపథ్యంలో ఆర్ఐఎల్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే రుణరహితంకావడంతోపాటు రిలయన్స్ రిటైల్, జియోమార్ట్ వంటి విభాగాలపైనా వ్యూహాత్మక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్లో ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు రూ. 2150కు చేరింది. ఇది ఆల్టైమ్ హై.. కాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2120 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 14 లక్షల కోట్లను తాకడం గమనార్హం! గత నెల రోజుల్లో ఆర్ఐఎల్ షేరు 22 శాతం లాభపడిన సంగతి తెలిసిందే. రోజారీ బయోటెక్ గత ఐదేళ్ల కాలంలో లిస్టయిన తొలి రోజే 75 శాతం జంప్చేయడం ద్వారా రికార్డ్ సృష్టించిన రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజు లాభాలతో దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం ఎగసి రూ. 794కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా తదుపరి వెనకడుగు వేసింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 743 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల రెండో వారంలో ఐపీవో పూర్తిచేసుకున్న రోజారీ బయోటెక్ గురువారం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. చివరికి 75 శాతం లాభంతో రూ. 742 వద్ద ముగిసింది. గత ఐదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్లో 50 శాతానికిపైగా లాభపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి రోజు బీఎస్ఈలో ఇంట్రాడేలో రూ. 804 వద్ద గరిష్టాన్ని తాకగా.. ఈ కౌంటర్లో 30 లక్షలకుపైగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మెన్ శాక్స్, సీఎల్ఎస్ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్వెయిట్ రేటింగ్ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్ఫామ్లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్బుక్తో ఒప్పందం జియో మార్ట్కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్ఎస్ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్ల హవా
గత నెల రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో గత నెల రోజుల్లో ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 8 శాతమే బలపడగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎంటర్టైన్మెంట్, మీడియా కంపెనీల షేర్లు 46-98 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ సైతం 12 శాతం స్థాయిలో పుంజుకోవడం గమనార్హం! జియో ఎఫెక్ట్? మొబైల్, డిజిటల్ సర్వీసుల అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు క్యూ కట్టినప్పటి నుంచీ మాతృ సంస్థ ఆర్ఐఎల్ జోరందుకుంది. జియో ఇన్ఫోకామ్లో 22 శాతం వాటా విక్రయంతో రూ. 1.04 లక్షల కోట్లను సమీకరించగా.. రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,000 కోట్లకుపైగా సమకూర్చుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రూప్లో ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. ఇతర బిజినెస్ల విస్తరణపై దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గ్రూప్లోని కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. జోరు తీరిలా ముకేశ్ అంబానీ గ్రూప్లోని ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ గత నెల రోజుల్లో 11 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫలితంగా ఆర్ఐఎల్ షేరు మంగళవారం(16న) రూ. 1648 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది కూడా. ఈ బాటలో ఇతర కౌంటర్లు మరింత జోరందుకున్నాయి. హాథవే భవానీ కేబుల్టెల్ 98 శాతం ఎగసి రూ. 16 నుంచి రూ. 32కు చేరింది. టీవీ18 బ్రాడ్క్యాస్ట్ 75 శాతం జంప్చేసి రూ. 22 నుంచి రూ. 38కు ఎగసింది. నెట్వర్క్ 18 మీడియా రూ. 25 నుంచి రూ. 40కు చేరింది. ఇది 61 శాతం వృద్ధికాగా..డెన్ నెట్వర్క్స్ 53 శాతం పురోగమించి రూ. 80ను తాకింది. ఇదే విధంగా హాథవే కేబుల్ 46 శాతం పుంజుకుని రూ. 34ను అధిగమించగా.. రిలయన్స్ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా 12 శాతం బలపడి రూ. 306కు చేరింది. -
రిలయన్స్... ‘రైట్ రైట్’!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోంది. రేపు (గురువారం–ఈ నెల 30న) జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో రైట్స్ ఇష్యూ, డివిడెండ్, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలపై చర్చ జరగనున్నది. ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ఇష్యూ ద్వారా షేర్లు జారీ చేసే అంశం డైరెక్టర్ల బోర్డ్ పరిశీలనలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ ఇలాంటి ఇష్యూతో రావడం ఇదే మొదటిసారి. రూ.40,000 కోట్లు సమీకరణ... రుణ రహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఇదొక అడుగు అని నిపుణులంటున్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటా షేర్లను జారీ చేయొచ్చని వారంటున్నారు. అంటే ప్రతి వంద షేర్లకు 5 కొత్త షేర్లు లభిస్తాయి. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.40,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రుణ భారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,53,719 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద నికర రుణ భారం రూ.1,53,132 కోట్లు. కాగా ఇటీవలనే రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్ఫామ్లో 10% వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఇంధన రిటైల్ విభాగంలో సగం వాటాను రూ.7,000 కోట్లకు బీపీకి విక్రయించింది. అలాగే టెలికం టవర్ బిజినెస్ను రూ.25,200 కోట్లకు అమ్మేసింది. ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో 20% వాటా ను సౌదీ ఆరామ్కో కంపెనీకి విక్రయించడానికి గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీలన్నింటి ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని రిలయన్స్ యోచిస్తోంది. -
అందుకే జియోతో జతకట్టాం: జుకర్ బర్గ్
సాక్షి, న్యూడిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దేశీయ ఇంధన దిగ్గజం రిలయన్స్ జియో ఒప్పందంపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయనొక వీడియోను షేర్ చేశారు. డిజిటల్ ఇండియాగా మారుతున్న తరుణంలో తమ ఒప్పందం దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ డీల్ ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, మొత్తం జియో బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తమ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఇ-కామర్స్ వెంచర్ జియో మార్ట్ మధ్య సహకారాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. (రిలయన్స్ జియోలో ఫేస్బుక్ భారీ పెట్టుబడి ఫేస్బుక్ జియో ప్లాట్ఫామ్లతో జతకట్టింది ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నాం, అంతకన్నా ఎక్కువ, భారతదేశం అంతటా ప్రజలకు వాణిజ్య అవకాశాలను తెరిచే కొన్ని ప్రధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాని మిస్టర్ జుకర్బర్గ్ తన అధికారిక ఫేస్బుక్ పోస్ట్ లో రాశారు. ఫేస్ బుక్, వాట్సాప్ కు సంబంధించిన భారీ వినియోగదారులు, చాలామంది ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలకు భారతదేశం నిలయం.. దేశం ఒక పెద్ద డిజిటల్ పరివర్తన క్రమంలో ఉంది. ముఖ్యంగా జియో వంటి సంస్థలు వందల మిలియన్ల భారతీయులను, చిన్న వ్యాపారాలను ఇందులో మిళితం చేయడంలో పెద్ద పాత్ర పోషించాయని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు ప్రతి ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనవి, ఈ నేపథ్యంలో వాటికి మా మద్దతు అవసరం. దేశంలో 60 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలున్నాయి. మిలియన్ల మంది ప్రజలు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా లాక్డౌన్లో ఉన్న కారణంగా డిజిటల్ సాధనాల ప్రాముఖ్యత చాలా వుంది. చిన్న సంస్థలు కస్టమర్లను కనుగొని కమ్యూనికేట్ చేయడంతో పాటు, వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ డీల్ ఉపయోగపడనుంది. భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు, చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికే తాము జియోతో జతకట్టామని ఫేస్ బుక్ అధినేత వెల్లడించారు. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) కాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని జియోతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో తన డిజిటల్ పరిధిని మరింత విస్తరించుకోవాలనే ప్రణాళికలో భాగాంగా జియోతో 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడుల ఒప్పందాన్ని చేసుకుంది. (అమెజాన్, ఫ్లిప్కార్ట్కు షాకివ్వనున్న జియో మార్ట్) -
రిలయన్స్, ఫేస్బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బహుళార్ధసాధకంగా వన్స్టాప్ సూపర్ యాప్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. వీచాట్ మాదిరిగానే ఈ కొత్త యాప్ ద్వారా, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, గేమింగ్తో పాటు హోటల్ బుకింగ్, తదితర సేవలతో వన్-స్టాప్ ప్లాట్ఫామ్ను తీసుకురానున్నాయి. ఇందుకు మోర్గాన్ స్టాన్లీని కూడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్గా నియమించుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఈ యాప్ తుది రూపు ఎలా వుంటుందనే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ ప్రధానంగా వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని రూపొందించనుంది. ఈ యాప్ లో అన్ని అంశాలను మిళితం చేసేలా అమెరికాకు చెందిన టాప్ కన్సల్టెంట్లను నియమించుకుందిట. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..) కాగా రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను కొనుగోలుకు ఫేస్బుక్ రంగం సిద్దం చేసుకున్న సంగతి విదితమే. ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ నిషేధంతో చర్చలు ఆగిపోయాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రాజెక్టు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఫేస్బుక్ భారతదేశంలో తన డిజిటల్ పరిధిని విస్తరించుకోవాలని భావిస్తోంది. చదవండి: (ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త) 76.80 స్థాయికి పడిపోయిన రూపాయి -
రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నివారణకు ఎలాంటి మందు లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్టాక్ స్టార్ కు పాజిటివ్) తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. ఎందుకుంటే ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించడం గమనార్హం. సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
కరోనాపై పోరుకు రిలయన్స్ సిద్ధం..
సాక్షి, ముంబై : కరోనాతో పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మేము సైతం అంటూ నడుం బిగించింది. ప్రభుత్వ చర్యలకు తోడు తమ వంతు సాయంగా తోడ్పాటు నందించడానికి ముందుకొచ్చింది. కరోనాపై పోరుకు మాస్కులు అత్యవసరం కావడంతో రోజుకు లక్ష ఫేస్మాస్క్లు ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ సోమవారం ప్రకటించింది. దీంతోపాటు కరోనా పేషెంట్లను తరలించే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని వెల్లడించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగానికి చెందిన ముంబయి నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో 100 పడకలను సిద్ధం చేశామని రిలయన్స్ తెలిపింది. (కరోనా అలర్ట్ : నిర్లక్ష్యానికి భారీ మూల్యం) మరోవైపు లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో జీవనాధారం కోల్పోయినవారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని పేర్కొంది. తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని స్పష్టంచేసింది. కాగా.. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు తమవంతుగా సహాయం చేయడానికి వ్యాపార వేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని, బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ @10,00,000
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్కు, మొత్తం నిఫ్టీ స్మాల్క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్గా వ్యవహరిస్తారు. ఆ రెండు విభాగాల జోరు.... అతి తక్కువ కాలంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు. 25 సెషన్లలోనే లక్ష కోట్లు అప్.... ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్ సెషన్లలోనే మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 14 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తుండటం, టెలికం టారిఫ్లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. వచ్చే నెల నుంచి మొబైల్ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. కాగా ఈ క్యూ2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రికార్డ్ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనే ట్యాగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్కు, రిలయన్స్కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం. రుణ భారం పెరుగుతూ ఉన్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్లో కదలాడింది. రిలయన్స్ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్ ఘనతకు కారణం. నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్పై విశ్వాసాన్ని కోల్పోలేదు. ‘టార్గెట్’ పైపైకి... రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం వచ్చే ఆరి్థక సంవత్సరంలో సాకారం కావచ్చని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తాఫా నదీమ్ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు వాటా విక్రయం, రిలయన్స్ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్కు కొనచ్చు రేటింగ్ను ఇచ్చాయి. టార్గెట్ ధరలను పెంచాయి. -
రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ–డీ6 బ్లాక్లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాక్లోని ఆర్–క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది. -
జియో లిస్టింగ్కు కసరత్తు షురూ
రిలయన్స్ జియో (ఆర్జియో) లిస్టింగ్ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అను బంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్ఐఎల్కు రిలయన్స్ జియో 100%అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచి్చన బ్యాంకులు, డిబెంచర్ హోల్డర్లు అనుమతి వచ్చినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది. -
రిలయన్స్ ‘రికార్డు’ల హోరు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, నికర లాభం రూ.16.1 నుంచి రూ.18.6కు పెరిగింది. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్ కంపెనీగా తన రికార్డ్ను తానే రిలయన్స్ ఇండస్ట్రీస్ బద్దలు కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ కంపెనీ రూ.10,362 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో ఈ రికార్డ్ను బ్రేక్ చేసింది. స్టాండ్అలోన్ పరంగా చూసినా, ఈ క్యూ2లో రికార్డ్ నికర లాభం, రూ.9,702 కోట్లను ఈ కంపెనీ సాధించింది. రిటైల్, జియోల జోరు..... సాంప్రదాయ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ విభాగాల లాభాలు బలహీనంగా ఉన్నా, రిఫైనింగ్ మార్జిన్లు టర్న్ అరౌండ్ కావడం, రిటైల్, టెలికం... ఈ రెండు కన్సూమర్ వ్యాపారాలు జోరుగా పెరగడం వల్ల ఈ రికార్డ్ స్థాయి లాభాలను సాధించామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వివరించారు. ఇక ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారం నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ.2,322 కోట్లకు చేరిందని, టెలికం విభాగం, జియో రూ.990 కోట్ల నికర లాభం సాధించిందని తెలి పారు. ఈ రెండు విభాగాలు రికార్డ్ స్థాయి స్థూల లాభాలు సాధించాయని పేర్కొన్నారు. మొత్తం కంపెనీ నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా మూడో వంతుకు చేరిందని చెప్పారు. రిటైల్ పరుగు... రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 67% పెరిగి రూ.2,322 కోట్లకు, ఆదాయం 27% పెరిగి రూ.41,202 కోట్లకు చేరాయి. స్టోర్ ఉత్పాదకత, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణే దీనికి కారణం. క్యూ2లో కొత్తగా 337 రిటైల్ స్టోర్స్ను ప్రారంభించింది. దీంతో 6,700 నగరాల్లో మొత్తం రిటైల్ స్టోర్స్ సంఖ్య 10,901కు చేరింది. మరిన్ని విశేషాలు... ►9.9 మిలియన్ టన్నుల రికార్డ్ ఉత్పత్తిని సాధించినప్పటికీ, పెట్రో కెమికల్స్ వ్యాపారం స్థూల లాభం 6 శాతం తగ్గి రూ.7,692 కోట్లకు చేరింది. ఈ విభాగం స్థూల లాభం తగ్గడం ఇది వరుసగా ఆరో క్వార్టర్. ►స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్క బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే మార్జిన్) గత క్యూ2లో 9.5 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 9.4 డాలర్లకు తగ్గింది. క్యూ1 జీఆర్ఎమ్(8.1 డాలర్లు)తో పోలి్చతే పెరిగింది. ►ఈ ఏడాది జూన్ చివరికి రూ.2,88,243 కోట్లుగా ఉన్న రుణభారం సెప్టెంబర్ నాటికి రూ.2,91,982 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్లకు పెరిగాయి. జియో...జిగేల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 45 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.681 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.990 కోట్లకు ఎగసింది. నిర్వహణ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 34 శాతం వృద్ధితో రూ.12,354 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో 35 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటిందని రిలయన్స్ ఎమ్డీ ముకేశ్ అంబానీ తెలిపారు. సీక్వెన్షియల్గా చూస్తే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ.2 తగ్గి రూ.120కు చేరింది. కాగా ఈ క్యూ2లో కొత్తగా 2.4 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్ జియోకు జతయ్యారు. రిలయన్స్ మార్కెట్ విలువ రికార్డ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ శుక్రవారం మరో రికార్డ్ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను తాకిన తొలి భారత కంపెనీ ఇదే. ఆరి్థక ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి) ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,428ను తాకింది. చివరకు 1.3% లాభంతో రూ.1,428 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను తాకిన ఈ షేర్ మార్కెట్ క్యాప్ రూ. రూ.8,97,179 కోట్లకు చేరింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను ఈ కంపెనీ గత ఏడాది ఆగస్టులోనే సాధించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 14 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా ఎగియడం విశేషం. మరో రెండేళ్లలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల డాలర్ల(రూ.14 లక్షల కోట్లకు)కు పెరగగలదని ఇటీవలే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. వినియోగదారుల వ్యాపారాల జోరు కారణంగా రికార్డ్ స్థాయి లాభం సాధించాం. రిటైల్ వ్యాపారం వృద్ది కొనసాగుతుండటం సంతోషదాయకం. వినియోగదారులకు ఉత్తమ విలువ అందించడమే లక్ష్యంగా రిలయన్స్ రిటైల్ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగం రికార్డ్ స్థాయి ఆదాయాన్ని, నిర్వహణ లాభాన్ని సాధించింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ సరీ్వసుల కంపెనీగా రిలయన్స్ జియో నిలిచింది. ప్రతి నెలా కొత్తగా కోటిమంది వినియోగదారులవుతున్నారు. వినియోగదారులు, ఆదాయం పరంగా రిలయన్స్ జియో కంపెనీ భారత్లోనే అతి పెద్ద కంపెనీగానే కాకుండా, డిజిటల్ గేట్వే ఆఫ్ ఇండియాగా కూడా నిలిచింది. ఇళ్లకు, వ్యాపార సంస్థలకు బ్రాడ్బాండ్ సేవలందించడానికి జియో ఫైబర్ పేరుతో మరో విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టాం. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్ : దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. డిజిటల్ ఇండియాకు పూల దారి ప్రారంభమయింది. ప్రపంచమే భారత్వైపు చూసే సమయం ఆసన్నమయింది. రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ మరో సంచలనానికి తెరతీసింది.ఇప్పటికే జియోతో జిల్జిల్ జిగేల్ అంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ నంబర్ వన్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్తో జత కట్టింది. భారత డిజిటల్ రూపు రేఖలు మరింత మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా, భారతీయ టెక్నాలజీ స్టార్టప్లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్ను ఉచితంగానే అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్ను నెలకు కేవలం రూ.1500లకే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. -
ఇక రిలయన్స్, బీపీ బంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్ ప్రకారం కొత్త వెంచర్లో బీపీకి 49 శాతం, రిలయన్స్కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్వర్క్ను 5,500 పెట్రోల్ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్కు ఉన్న ఇంధన రిటైలింగ్ నెట్వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్కో కూడా భారత్లో ఇంధనాల రిటైలింగ్ కార్యకలాపాల వెంచర్పై దృష్టి పెట్టింది. మూడో జేవీ.. 2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కానుంది. 2011లో రిలయన్స్కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్ సోర్సింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ (ఐజీఎస్పీఎల్) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంధన రిటైలింగ్లో పీఎస్యూల హవా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్ షెల్కు ప్రస్తుతం 151 అవుట్లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. -
ఆదాయంలోనూ రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను చాటుకుంది. ఆదాయం పరంగా ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను (ఐవోసీ) అధిగమించి దేశంలో అగ్ర స్థానానికి చేరుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ.6.23 లక్షల కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. పోటీ సంస్థ ఐవోసీ టర్నోవర్ 6.17 లక్షల కోట్లుగానే ఉంది. ఇక లాభం విషయంలోనూ నంబర్ 1 రిలయన్స్ ఇండస్ట్రీలే కావడం గమనార్హం. ఐవోసీ లాభంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రెట్టింపు స్థాయింలో రూ.39,588 కోట్లను నమోదు చేసింది. ఐవోసీ నికర లాభం 17,274 కోట్లకే పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.22,189 కోట్లతో పోలిస్తే 23 శాతం క్షీణించింది. కానీ, అదే సమయంలో ఆర్ఐఎల్ లాభంలో 13 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్కెట్ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీసీఎస్తో తరచూ పోటీ పడుతూ ఉంటుంది. దశాబ్దం క్రితం ఐవోసీ సైజులో ఆర్ఐఎల్ సగం మేరే ఉండేది. ఈ మధ్య కాలంలో టెలికం, రిటైల్, డిజిటల్ సేవలు వంటి వినియోగ ఆధారిత వ్యాపారాల్లోకి రిలయన్స్ పెద్ద ఎత్తున విస్తరించడం అగ్ర స్థానానికి చేరుకునేందుకు దోహదపడింది. గతేడాది వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018–19లో ఓఎన్జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్జీసీ మార్చి క్వార్టర్ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉండగా, డిసెంబర్ నాటికే 9 నెలల్లో రూ.22,671 కోట్ల లాభం సొంతం చేసుకుంది. ఈ ప్రకారం చూసినా ఐవోసీని వెనక్కి నెట్టేసినట్టే అనుకోవాలి. ఐవోసీ ఆదాయం ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, గ్యాస్ వ్యాపారాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఏ విధంగా చూసినా.. తాజా రికార్డులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడు రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా మెరుగైన స్థానంలో, దేశంలో నంబర్1గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్ ఆదాయం 2018–19లో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 44 శాతం వృద్ధి చెందింది. అదే ప్రధానంగా ఐవోసీని రెండో స్థానానికి నెట్టేసేందుకు ఉపయోగపడింది. 2010–19 మధ్య వార్షికంగా ఆర్ఐఎల్ ఆదాయ వృద్ధి 14 శాతం ఉండడం గమనార్హం. ఇక ఐవోసీ ఆదాయం 2018–19లో 20 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2010–19 మధ్య వార్షికంగా 6.3 శాతం పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటి స్టాక్ క్లోజింగ్ ధర ప్రకారం ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.8.52 లక్షల కోట్లు. ఇక గమనించాల్సిన మరో అంశం... మరే కంపెనీకి లేని విధంగా ఆర్ఐఎల్ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉండడం. అంతే కాదండోయ్... స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్ఐఎల్ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. -
రిలయన్స్ రిటైల్ చేతికి ఐటీసీ ‘జాన్ ప్లేయర్స్’
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మగవాళ్ల దుస్తుల బ్రాండ్, జాన్ ప్లేయర్స్ను రిలయన్స్ రిటైల్కు విక్రయించింది. డీల్లో భాగంగా ట్రేడ్మార్క్, మేధోపరమైన హక్కులనూ రిలయన్స్ రిటైల్కు బదిలీ చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్ను బ్రాండ్ను రిలయన్స్ రిటైల్కు విక్రయించామని ఐటీసీ తెలిపింది. డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ రూ.150 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం. ఈ బ్రాండ్ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్, ఈ సంస్థ ఆన్లైన్ప్లాట్ఫామ్, అజియోడాట్కామ్లు మరింత పటిష్టమవుతాయని నిపుణుల అంచనా. 2002లో ఆరంభమైన జాన్ ప్లేయర్స్ బ్రాండ్...యూత్ ఫ్యాషన్ అప్పారెల్ బ్రాండ్గా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్స్ను ఐదేళ్లలో 2,500కు పెంచాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది. -
స్వల్ప లాభాలతో సరి..
ముంబై: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా... శుక్రవారం దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఇండెక్స్లోని బడా షేర్లవైపే మొగ్గు చూపడంతో చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 13 పాయింట్లు పెరిగి 36,387 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.75 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 379 పాయింట్లు (సుమారు 1 శాతం), నిఫ్టీ 112 పాయింట్లు (దాదాపు 1 శాతం) మేర పెరిగాయి. ఫార్మా షేర్లు, బలహీన రూపాయి తదితర అంశాలు సెంటిమెంట్కి ప్రతికూలంగా మారాయని, అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నా దేశీ మార్కెట్లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చి విభాగం) వినోద్ నాయర్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, మళ్లీ మాంద్యం భయాల కారణంగా సమీప భవిష్యత్లో భారత మార్కెట్లు స్థిర శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్లో కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, టీసీఎస్ దాదాపు 1.41 శాతం దాకా లాభపడ్డాయి. ఎయిర్టెల్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాŠంక్, యస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్గ్రిడ్ మొదలైనవి కూడా అదే బాటలో 6.42 శాతం దాకా క్షీణించాయి. రిలయన్స్ జూమ్... క్యూ3లో రికార్డు స్థాయిలో రూ. 10,000 కోట్ల పైగా నికర లాభాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సెన్సెక్స్లో అత్యధికంగా 4.34 శాతం లాభపడి రూ. 1,183 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 4.89 శాతం ఎగిసి రూ. 1,185.50 స్థాయిని కూడా తాకింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఒక్కరోజులోనే రూ. 31,209 కోట్లు పెరిగి రూ. 7,49,830 కోట్లకు చేరింది. -
ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..
(సాక్షి, బిజినెస్ విభాగం) జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యావసర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్లైన్ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ బలాన్ని ఆన్లైన్కు ఉపయోగించుకోవటానికి స న్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్లైన్లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... దాని ద్వారానే ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెం దుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ–కామర్స్ అనుభవాన్ని అం దించేందుకు తనకు మూలమూలనా ఉన్న జియో పాయింట్ స్టోర్స్ను వినియోగించుకోనుంది. చౌక చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ తాజాగా రిటైల్ రంగంలోనూ అదే తరహాలో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ప్రారంభించే రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జియో పాయింట్ స్టోర్స్ను ఉపయోగించుకోబోతున్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు నగరాల్లో 5,100 పైగా చిన్న స్థాయి జియో పాయింట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రణాళికల ప్రకారం ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేని ప్రాంతాల వారికి, ఆన్లైన్ షాపింగ్ చేయని వారికి చేరువయ్యేందుకు వీటిలో ఈ–కామర్స్ కియోస్క్లను ఏర్పాటు చేస్తారు. కొనుగోలుదారులు ఆన్లైన్లో ఆర్డర్లిచ్చేందుకు వీటిలో ఉండే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ సహాయం అందిస్తారు. పప్పులు, పంచదార, సబ్బులు వంటి నిత్యావసరాలు మొదలుకుని సౌందర్య సంరక్షణం, దుస్తులు, పాదరక్షల దాకా అన్నింటినీ వీటి ద్వారా ఆర్డరివ్వొచ్చు. రిలయన్స్ రిటైల్ ఈ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికే ఈ స్టోర్స్కు సిమ్కార్డులు, మొబైల్ హ్యాండ్సెట్స్, యాక్సెసరీస్ మొదలైనవి సరఫరా చేస్తున్న జియో పంపిణీ వ్యవస్థ... ఇకపై ఈ–కామర్స్ ఆర్డర్స్ను కొనుగోలుదారుల ఇంటి వద్దకే చేరుస్తుంది. ‘ఇన్స్టాలేషన్ అవసరం లేని, షెల్ఫ్ లైఫ్ ఉండే చాలా మటుకు ఉత్పత్తులను ఈ నెట్వర్క్ ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంది. కస్టమర్ ఆయా ఉత్పత్తులను జియో పాయింట్ వద్దే తీసుకోవచ్చు కూడా. కావాలనుకుంటే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తారు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే జియో పాయింట్ స్టోర్స్ నుంచి టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లకు సంబంధించి ఈ తరహా ఆర్డర్లు తీసుకుంటోంది. మొత్తం కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వీటి వాటా 10 శాతం దాకా ఉంటోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా వర్తింపచేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ–కామర్స్ వెంచర్.. కంపెనీ వర్గాల కథనం ప్రకారం.. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 95% జనాభాకు చేరువవ్వాలని రిలయన్స్ రిటైల్ లకి‡్ష్యస్తోంది. ఈ–కామర్స్, జియో పాయింట్ స్టోర్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని కూడా భావిస్తోంది. దాదాపు 10,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 50,000 పైచిలుకు జియో పాయింట్ స్టోర్స్ను కొత్తగా ప్రారంభించాలని రిలయన్స్ భావిస్తోంది. కస్టమర్ సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్స్గానే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉత్పత్తుల పంపిణీకి కూడా వీటిని ఉపయోగించుకోనుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మూడునెలల్లో కొత్తగా 500 జియో పాయింట్స్ను ప్రారంభిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ దిగ్గజాలతో పోటీ! ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు దీటుగా రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ ఉండబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఉడాన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద చిన్న పట్టణాల్లో 12,000 పైచిలుకు చిన్న రిటైల్ సంస్థలు, స్థానిక ఎంట్రప్రెన్యూర్స్తో చేతులు కలిపింది. ఈ షాపుల ద్వారా ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్లు పెట్టొచ్చు. ఉత్పత్తుల డెలివరీ తీసుకోవచ్చు. దీంతో పాటు దిగ్గజ సంస్థలకు దీటుగా వీడియో, మ్యూజిక్, మ్యాగజైన్స్, న్యూస్ వంటి రంగాల్లోనూ రిలయన్స్ భారీగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్.. కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అంచనాల ప్రకారం భారత ఈ–కామర్స్ విభాగంలో గ్రామీణ ప్రాంత మార్కెట్ వచ్చే నాలుగేళ్లలో 10–12 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ విక్రయాలు 32 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను పెరుగుతున్న ఆదాయాలు, వినియోగం, వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, సానుకూల వ్యవసాయ పరిస్థితులు, ఇంటర్నెట్ వినియోగం మెరుగుపడుతుండటం, చిన్న కుటుంబాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. -
లాభాల్లో రిలయన్స్ కొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)... ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్ త్రైమాసిక లాభంలో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8,109 కోట్లతో పోలిస్తే 17% వృద్ధి చెందగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం 0.6 శాతమే పెరిగింది. రూ.9,629 కోట్ల లాభాన్ని ఆర్జించొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. రిటైల్, జియో, పెట్రోకెమికల్ వ్యాపారాలు కళకళలాడాయి. దీంతో రిఫైనరీ వ్యాపారం దెబ్బకొట్టినా, కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయగలిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 54.5% పెరిగి రూ.1,56,291 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్, రిఫైనరీ ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం ఆదాయం పెరిగేందుకు తోడ్పడింది. కొత్త పెట్రోకెమికల్ తయారీ సదుపాయాలు అందుబాటులోకి రావడం అధిక విక్రయాలకు కారణమని కంపెనీ తెలిపింది. రిటైల్ వ్యాపారం భళా రిటైల్ వ్యాపారంలో పన్నుకు ముందస్తు లాభం ఏకంగా 213 శాతం పెరిగి రూ.1,392 కోట్లకు చేరింది. దుకాణాల విస్తరణ, ఉన్న దుకాణాల్లో అమ్మకాలు పెరగడంతో ఆదాయం సైతం రెట్టింపై రూ.32,436 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా 5,800 పట్టణాల్లో కంపెనీకి 9,146 స్టోర్లు ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంలో రిటైల్ వ్యాపారం రూ.444 కోట్ల పీబీడీఐటీ (తరుగుదల, వడ్డీ, పన్నుకు ముందు లాభం) నమో దు చేసింది. ఆదాయం రూ.14,646 కోట్లుగా ఉంది. జియోకు లాభాలు టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం రూ.681 కోట్లుగా ఉంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 11.3 శాతం పెరిగింది. కంపెనీ చందాదారుల సంఖ్య 25.2 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో పన్నుకు ముందు రూ.271 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా 3.7 కోట్ల కస్టమర్లు జియో నెట్వర్క్కు తోడయ్యారు. జూన్ క్వార్టర్లో నూతన చం దాదారుల సంఖ్య 2.87 కోట్లుగా ఉంది. ఓ యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.134.5గా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.131.7కు తగ్గింది. రిఫైనరీ మార్జిన్ రిఫైనింగ్ వ్యాపారంలో ఆదాయం 3.25 శాతం వృద్ధితో రూ.98,760 కోట్లకు చేరుకుంది. ఎబిట్ (వడ్డీ, పన్నుకు ముందస్తు ఆదాయం) 19.6 శాతం క్షీణించి రూ.5,322 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలోనూ ఎబిట్ 16.8 శాతం తగ్గడం గమనార్హం. బ్యారెల్ చమురుపై స్థూల రిఫైనరీ మార్జిన్ 9.50 డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 12 డాలర్లు కాగా, జూన్ త్రైమాసికంలో 10.5 డాలర్లుగా ఉంది. అయితే, జీఆర్ఎం అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే ఫ్లాట్గా 10.6–10.9 డాలర్ల మధ్య ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేశారు. చమురు ధరలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చితే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 45 శాతం పెరిగాయి. బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ 75 డాలర్లకు చేరుకుంది. పెట్రోకెమికల్ వ్యాపారం పన్నుకు ముందస్తు లాభం 63 శాతం వృద్ధితో రూ.8,120 కోట్లుగా ఉంది. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. పన్నుకు ముందు రూ.480 కోట్ల నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నష్టాలు రూ.272 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన రుణ భారం జియో కోసం రిలయన్స్ పెట్టుబడులు పెడుతూనే ఉంది. దీంతో కంపెనీ రుణ భారం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,58,701 కోట్లకు పెరిగింది. జూన్ క్వార్టర్లో ఇది రూ.2,42,116 కోట్లు. కంపెనీ నగదు నిల్వలు క్రితం త్రైమాసికంలో ఉన్న రూ.79,492 కోట్ల నుంచి రూ.76,740 కోట్లకు తగ్గాయి. సవాళ్ల మధ్య బలమైన పనితీరు స్థూల ఆర్థికపరమైన సవాళ్ల మధ్య కూడా మా సంస్థ బలమైన నిర్వహణ, ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఆదాయాల్లో మంచి వృద్ధి నెలకొంది. కమోడిటీ, కరెన్సీ మార్కెట్లో తీవ్ర అస్థిరతల మధ్య మా సమగ్ర రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారం బలమైన నగదు ప్రవాహాలను నమోదు చేసింది’’ అని ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కన్జ్యూమర్ వ్యాపారం ఊపందుకుంటోందని చెప్పారు. రిటైల్ వ్యాపారం ఎబిట్డా వార్షికంగా చూస్తే మూడు రెట్లు పెరగ్గా, జియో ఎబిట్డా 2.5 రెట్లు పెరిగినట్టు అంబానీ తెలిపారు. రిలయన్స్ చేతికి హాత్వే, డెన్నెట్వర్క్ కేబుల్ టీవీ, వైర్డ్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో రిలయన్స్ వేగంగా విస్తరించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా డెన్ నెట్వర్క్లో 66 శాతం వాటా తీసుకోనున్నట్టు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2,045 కోట్లు, సెకండరీ మార్కెట్లో రూ.245 కోట్లతో ప్రస్తుత ప్రమోటర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే, హాత్వే కేబుల్లోనూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2,940 కోట్ల పెట్టుబడితో 51.34 శాతం వాటా కొనుగోలు చేయనుంది. 90.8 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ.32.35 ధరపై జారీ చేయనున్నట్టు హాత్వే కేబుల్ ప్రకటించింది. హాత్వే, హాత్వే భవానీ కేబుల్ టెల్ అండ్ డేటాకామ్ సంయుక్త సంస్థ అయిన జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ మైనారిటీ వాటాదారులకు ఆర్ఐఎల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. -
అదరగొట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ముఖ్యంగా జియో బూస్ట్తో లాభాల్లోనూ, ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించి ఎనలిస్టులు అంచనాలను బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్ 2లో 9,516 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికరలాభాల్లో 17శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .9,516కోట్లు. ఎబిటా మార్జిన్లు రూ. 3573కోట్లుగా ఉంది. ఆర్ఐఎల్ చరిత్రలో భారీ లాభాలను సాధించిన త్రైమాసికం ఇదేనని ఎనలిస్టులు చెబుతున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీల తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీలలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఉంది. నేటి ముగింపు సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ .7.28 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. మరోవైపు కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. -
రిలయన్స్ ‘కేబుల్’ వేట!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్ నెట్వర్క్స్, హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్లో వాటాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నాయి. బుధవారం వీటికి సంబంధించి డీల్స్ను ప్రకటించవచ్చు‘ అని వివరించాయి. మరోవైపు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై అక్టోబర్ 17న (బుధవారం) తమ తమ బోర్డులు సమావేశం కానున్నట్లు హాథ్వే, డెన్ నెట్వర్క్స్ సంస్థలు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి. హాథ్వే ప్రస్తుతం నాలుగు మెట్రోలు సహా 16 నగరాల్లో హై స్పీడ్ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీకి సుమారు 35,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉండగా, 8 లక్షల మంది బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఇక 15 నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న డెన్ కేబుల్.. 2–3 ఏళ్లలో 500 నగరాల్లో సర్వీసులు అందిం చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మనోళ్లు ముగ్గురు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో ఈ యేటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నంబర్–1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్ జాబితా గనక ఇప్పుడు వెలువరించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల కోట్లకన్నా తక్కువే ఉండేదన్నది మార్కెట్ వర్గాల మాట. ఇక 1.5 లక్షల కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రెండవ స్థానంలో నిలిచారు. మొదటి– రెండు స్థానాల మధ్య తేడా దాదాపు సగానికన్నా అధికంగా ఉండటం గమనార్హం. భారతీయ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఈయన సంపద దాదాపు 1.3 లక్షల కోట్లు. తరువాతి స్థానాల్లో వరసగా హిందూజా సోదరులు, పల్లోంజీ మిస్త్రీ, హెచ్సీఎల్ గ్రూప్ అధిపతి శివ్ నాడార్, గోద్రెజ్ కుటుంబం నిలిచాయి. ఫోర్బ్స్ మొత్తంగా 100 మందితో ఈ జాబితాను వెలువరించింది. తెలుగు వారు ముగ్గురు!! భారతదేశంలోని టాప్–100 శ్రీమంతులతో ఫోర్బ్స్ రూపొందించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. దాదాపు రూ.22,300 కోట్ల సంపదతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి.రెడ్డి ఈ రెండు రాష్ట్రాల నుంచీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే మాత్రం జాబితాలో ఈయనది 47వ స్థానం. దాదాపు రూ.20వేల కోట్లతో అరబిందో ఫార్మా అధిపతి పి.వి.రామ్ప్రసాద్ రెడ్డి, రూ.19,800 కోట్లతో దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళి ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ జాబితాలో వీరు 50, 53 స్థానాల్లో నిలిచారు. (గమనిక: ఫోర్బ్స్ ఈ జాబితాలో సంపదను డాలర్లలో లెక్కించగా... రూపాయిల్లోకి మార్చేటపుడు డాలర్ విలువను రూ.72గా పరిగణించటం జరిగింది.) -
హాథ్వేపై రిలయన్స్ కన్ను
ముంబై: గిగాఫైబర్ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సం బంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్ పూర్తిగా కుదురుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, రిలయన్స్ మాత్రం హాథ్వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో డెన్ కొనుగోలుకు యత్నం .. కేబుల్ టీవీ రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్ మన్చందా ప్రమోటరుగా ఉన్న డెన్ నెట్వర్క్స్ను కొనేందుకు ప్రయత్నించింది. చర్చలు తుది దశ దాకా కూడా జరిగాయి. కానీ ఆ డీల్ కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కింద తమ గిగాఫైబర్ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎస్వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహం. వాటికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. కానీ కీలకమైన మార్కెట్లలో స్థానిక కేబుల్ ఆపరేటర్స్ (ఎల్సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో .. యూజర్ల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గిగాఫైబర్ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు. ఒకవేళ హాథ్వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ‘ఆర్ఐఎల్కి ఇప్పటికే ఎంఎస్వో లైసెన్సు ఉండటంతో పాటు ఫైబర్ నెట్వర్క్ను కూడా విస్తరించింది. ఇక కావాల్సినదల్లా స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు మాత్రమే. ఏదైనా ఎంఎస్వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే‘ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాథ్వే కథ ఇదీ .. కేబుల్ బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ సర్వీసులు అందిస్తున్న హాథ్వే కేబుల్లో ప్రమోటరు రహేజా గ్రూప్నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్ కేబుల్ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. జూన్ త్రైమాసికం గణాంకాల ప్రకారం హాథ్వే బ్రాడ్బ్యాండ్ ప్రతి యూజరుపై సగటున నెలకు (ఏఆర్పీయూ) రూ. 710 ఆదాయం ఉంటోంది. మార్చి ఆఖరు నాటికి సంస్థకు రూ. 1,617 కోట్ల రుణభారం ఉండగా.. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 500 కోట్ల మేర తగ్గించుకోవాలని భావిస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో హాథ్వే ప్రమోటర్లు.. ఈక్విటీతో పాటు దీర్ఘకాలిక అన్సెక్యూర్డ్ రుణాల రూపంలో రూ. 350 కోట్లు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జూలైలో తొలి విడతగా రూ. 100 కోట్లు ఇవ్వగా, మరో రూ. 100 కోట్లు ఆగస్టు ఆఖరు నాటికి ఇవ్వనున్నట్లు గతంలో కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో రూ. 150 కోట్లు 2020 మార్చి నాటికి లభించనున్నాయి. రాబోయే రోజుల్లో కార్యకలాపాల ద్వారా మరో రూ. 150 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.డీల్ వార్తల నేపథ్యంలో బుధవారం హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్ షేరు బీఎస్ఈలో సుమారు 9 శాతం పెరిగి రూ. 27.60 వద్ద క్లోజయ్యింది. -
రూపీ రికవరీ : మార్కెట్లు జంప్
ముంబై : స్టాక్ మార్కెట్లను, ఇన్వెస్టర్లను వణికిస్తున్న రూపీ రికవరీ అయింది. రూపీ రికవరీతో మార్కెట్లు హమ్మయ్య అనుకున్నాయి. ఆల్-టైమ్ కనిష్ట స్థాయిల్లో 72.10 వద్ద నమోదైన రూపాయి, ట్రేడింగ్ ముగింపులో కోలుకుంది. దీంతో నిఫ్టీ 11,500 మార్కును పునరుద్ధరించుకుంది. సెన్సెక్స్ 200 పాయింట్లు పైగా జంప్ చేసింది. కరెన్సీ సహకారంతో పాటు, హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ స్టాక్ సూచీలకు లాభాల పంట అందించాయి. ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ, ఇన్ఫ్రాక్ట్ర్చర్ రంగాలు కూడా మార్కెట్లకు బలంగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 225 పాయింట్ల లాభంలో 38,242.81 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 11,536 వద్ద స్థిరపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా టాప్ గెయినర్లుగా నిలువగా.. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, హిందాల్కో ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో అత్యంత కనిష్ట స్థాయి 72.10 మార్కు నుంచి కోలుకుని, 71.85 వద్ద నమోదైంది. కాగా, గత కొన్ని రోజులుగా పాతాళ స్థాయికి పడిపోతున్న రూపాయితో, మార్కెట్లు కూడా భారీగానే నష్టపోతున్నాయి. ఆరు సెషన్ల నుంచి మార్కెట్లు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. నేడు ఈ నష్టాలకు తెరపడి, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. -
ట్రెండ్ సృష్టించిన జియో : హ్యాపీ బర్త్డే
ముంబై : సరిగ్గా రెండేళ్ల క్రితం.. టెలికాం మార్కెట్ను హడలెత్తిస్తూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోను ఎవరూ మర్చిపోయి ఉండరు. ముఖ్యంగా యువత. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఆలోచన... జియో రూపంలో ఓ సంచలనానికి తెరలేపింది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ.. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. నేడు(సెప్టెంబర్ 5) రిలయన్స్ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఇప్పటి వరకు దేశీయ టెలికాం సర్వీసులపై చూపిన ప్రభావమెంతో ఓ సారి తెలుసుకుందాం... జియో ఎంట్రీ తర్వాత మొబైల్ డేటా వినియోగం భారత్లో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో లాంచ్ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. ఇలా తన నెట్వర్క్ను పెంచుకుంటూ పోతూ.. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది. భారత్లో ఎల్టీఈ కవరేజ్ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్ చేయబోతుంది. అన్ని టారిఫ్ ప్లాన్లపై ఉచిత అపరిమిత కాలింగ్ ఆఫర్ చేసిన కంపెనీ జియోనే. అప్పటి వరకు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి. జియో లాంచ్ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. అంటే అంతకముందు డేటా ఛార్జీల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో లాంచింగ్ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో పరుగులు పెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్గా టారిఫ్ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. ఇలా టెలికాం మార్కెట్లో అసాధారణమైన పోటీ నెలకొంది. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది. 4జీ నెట్వర్క్ కవరేజ్లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్ స్పీడ్టెస్ట్ పోర్టల్ వెల్లడించింది. జియో ఎంట్రీ అనంతరం, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు యూజర్ బేస్ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్ అయినప్పటి నుంచి గూగుల్, ఫేస్బుక్లకు భారత్ మోస్ట్ యాక్టివ్ మార్కెట్గా మారింది. ఎల్వైఎఫ్ బ్రాండ్ కింద వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్లను కూడా రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్ల సరుకు రవాణా పెరిగింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్ ఫోన్లో హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఆవిష్కరించింది. దీంతో పాటు బ్రాడ్బ్యాండ్ మార్కెట్లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత వైర్లైన్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. భారత్ను గ్లోబల్గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ పలుమార్లు పునరుద్ఘాటించారు. -
రిలయన్స్ @రూ.8 లక్షల కోట్లు
ముంబై: ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డ్ను సాధించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను సాధించి భారత్లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా నిలిచింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,274ను తాకిన ఈ షేర్ చివరకు 1.8% లాభంతో రూ.1,270 వద్ద ముగిసింది. ఈ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం ఒక్క రోజే రూ.15,527 కోట్లు పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ రూ.8,04,691 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం వరకూ లాభపడింది. ఏజీఎమ్ నుంచి జోరు...: గతనెలలో జరిగిన ఏజీఎమ్లో ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో గిగా ఫైబర్(ఫైబర్–టు–ద హోమ్ సర్వీస్)ను ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఈ షేర్ గత నెల 12న 10, 000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించింది. 2007లో ఈ ఘనత సాధించిన ఈ కంపెనీ మళ్లీ అదే ట్యాగ్ను ఈ ఏడాది పొందింది. గత నెల 13న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్రూ.7 లక్షల కోట్లను అధిగమించింది. నెలన్నర రోజుల్లోనే మరో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ను జత చేసుకొని 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా గురువారం అవతరించింది. -
జియో గిగాఫైబర్ టారిఫ్ ప్లాన్స్ ఇవేనట!
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా బ్రాడ్బ్యాండ్ మార్కెట్లోనూ తన సత్తా చూపేందుకు వచ్చేస్తోంది. జియోగిగాఫైబర్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 41వ వార్షిక సాధారణ సమావేశంలో లాంచ్ చేసింది. ఇళ్లకు, ఆఫీసులకు, దుకాణాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా హై-స్పీడ్ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా జియోగిగాఫైబర్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లోనే జియోగిగాటీవీ సేవలను అందించబోతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు 41వ ఇన్వెస్టర్ల సమావేశంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఆ సమయంలో జియోగిగాఫైబర్ టారిఫ్లను రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ టారిఫ్ ప్లాన్లపై కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో జియోగిగాఫైబర్ టారిఫ్ ప్లాన్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో కొన్ని టారిఫ్ ధరలు చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటో ఓ సారి చూద్దాం.. 500 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... జియోగిగాఫైబర్ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్ తగ్గిపోనుందని సమాచారం. 750 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... తర్వాత ప్లాన్ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్. ఈ ప్లాన్ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్లోకి వస్తుందని టాక్. 999 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... 600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్పై పొందవచ్చట. దీని స్పీడ్ 100 ఎంబీపీఎస్ అని తెలుస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం. 1,299 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... ఈ ప్లాన్ ఎఫ్యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట. 1,599 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... జియోగిగాఫైబర్ కింద అందించే హైయస్ట్ ప్లాన్ ఇదేనట. ఈ ప్లాన్ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్. జియోగిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు... జియోగిగాఫైబర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను రిలయన్స్ జియో ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో మొబైల్ అప్లికేషన్ నుంచే దీని రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్ కాబోతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో అక్కడ తొలుత దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
మళ్లీ మార్కెట్ కింగ్ రిలయన్స్..
న్యూఢిల్లీ: ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జోరుగా పెరుగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో 3.5 శాతం లాభంతో ఆల్ టైమ్ హై, రూ.1,190ను తాకిన ఈ షేర్ చివరకు 3.1 శాతం లాభంతో రూ.1,186 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,51,550 కోట్లకు పెరిగింది. దీంతో అతి పెద్ద మార్కెట్ క్యాప్ కంపెనీ అనే ఘనతను మళ్లీ సొంతం చేసుకుంది. రూ.7,43,222 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న టీసీఎస్ను అధిగమించి అగ్రస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగబాకింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ల తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ.5,75,185 కోట్లు), హిందుస్తాన్ యూనిలీవర్ (రూ.3,74,828 కోట్లు), ఐటీసీ(రూ.3,63,150 కోట్లు)లు నిలిచాయి. జూలైలో 21 శాతం పెరిగిన షేర్... ఐదేళ్ల క్రితం అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానాన్ని టీసీఎస్ ఎగరేసుకుపోయింది. తాజాగా ఈ స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ చేజిక్కించుకుంది. ఈ నెల ఆరంభంలోనే 100 బిలియన్ డాలర్ల కంపెనీగా రిలయన్స్ నిలిచింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ టీసీఎస్ షేరు విలువ 28 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 29 శాతం లాభçపడింది. ఇక ఈ నెలలో బీఎస్ఈ సెన్సెక్స్6 శాతం లాభపడగా, టీసీఎస్ 4.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్21 శాతం చొప్పున ఎగబాకాయి. -
ధనాధన్ రిలయన్స్
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరోసారి రికార్డుల లాభాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.9,459 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,108 కోట్ల పోలిస్తే 4 శాతం మేర వృద్ధి నమోదైంది. ఒక క్వార్టర్లో కంపెనీ సాధించిన అత్యధిక నికర లాభం ఇదే. కాగా, క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ వాటా విక్రయం ద్వారా కంపెనీకి రూ.1,087 కోట్ల అసాధారణ ఆదాయం లభించింది. దీన్ని కలపకుండా చూస్తే లాభం రూ.7,992 కోట్లు మాత్రమే. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో రిలయన్స్ నికర లాభం 18.6% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 56.5 శాతం వృద్ధితో రూ.1.41 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ.90,537 కోట్లు. ప్రధాన వ్యాపారాల్లో ఒకటైన పెట్రోకెమికల్స్ జోరుతో పాటు రిటైల్ ఇతర అనుబంధ విభాగాలు కూడా భారీ లాభాలతో కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. జీఆర్ఎం తగ్గింది...: చమురు శుద్ధి రంగానికి సంబంధించి స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ1లో 10.5 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో జీఆర్ఎం 11.9 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికంలో(2017–18, క్యూ4) 11 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్ఎంగా వ్యవహరిస్తారు. ముఖ్యాంశాలివీ... ►పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో దాదాపు రెట్టింపయింది. 94.9 శాతం వృద్ధితో రూ.7,857 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో స్థూల లాభం రూ.4,031 కోట్లు. ►మార్జిన్లు తగ్గడంతో రిఫైనింగ్ విభాగం స్థూల లాభం 16.8 శాతం క్షీణించింది. రూ.7,476 కోట్ల నుంచి రూ.5,315 కోట్లకు దిగజారింది. ►చమురు–గ్యాస్ వ్యాపారం నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది క్యూ1లో రూ.373 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడగా... ఈ ఏడాది క్యూ1లో నష్టం రూ.447 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా కేజీ బేసిన్లో ఉత్పత్తి పతనం దీనికి కారణంగా నిలిచింది. ►రిటైల్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో266 శాతం ఎగబాకి రూ.1,069 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్వార్టర్లో స్థూల లాభం 292 కోట్లు మాత్రమే. ఆదాయం రూ.11,571 కోట్ల నుంచి రూ.25,890 కోట్లకు దూసుకెళ్లింది. ►కంపెనీ వద్ద నగదు నిల్వలు ఈ ఏడాది జూన్ చివరినాటికి స్వల్పంగా పెరిగి రూ.79,492 కోట్లకు చేరాయి. ఇక మొత్తం రుణ భారం రూ.2,42,116 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది మార్చి నాటికి రుణ భారం రూ.2,18,768 కోట్లుగా ఉంది. ►రిలయన్స్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 1.73 శాతం లాభంతో రూ.1,130 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. ‘ మా వ్యాపార విభాగాలన్నింటిలో అత్యుత్తమ నిర్వహణ పనితీరును సాధించడంపైనే ప్రధానంగా దృష్టిసారించాం. పెట్రోకెమికల్స్ వ్యాపారం రికార్డు స్థాయి స్థూల లాభాన్ని(ఎబిటా) సాధించింది. పాలియెస్టర్ చైన్లో మార్జిన్ల జోరు ఇందుకు ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో ఈ రంగంలో మేం చేసిన పెట్టుబడుల ప్రతిఫలమే ఇది. ఇక సీజనల్ బలహీనతలు ఉన్నప్పటికీ... రిఫైనింగ్ వ్యాపార పనితీరు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. రిటైల్, ఇతర కన్సూమర్ వ్యాపారాలు కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రెట్టింపు ఆదాయం, మూడు రెట్ల ఎబిటాను నమోదు చేశాం. ఇక టెలికం అనుబంధ సంస్థ జియో క్యూ1లో రికార్డు స్థాయిలో వినియోగదారులను జతచేసుకుంది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో జోరు... ముకేశ్ అంబానీ సంచలన టెలికం వెంచర్ రిలయన్స్ జియో... లాభాల బాటలో దూసుకెళ్తోంది. 2018 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.612 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 2018 జనవరి–మార్చి త్రైమాసికంలో లాభం రూ.510 కోట్లతో పోలిస్తే 20 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతం వృద్ధితో 8,109 కోట్లకు చేరింది. ఇక గతేడాది జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.21.27 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో జియో నికరంగా 2.87 కోట్ల కొత్త కస్టమర్లను చేజిక్కించుకుంది. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తర్వాత ఒక క్వార్టర్లో ఇంత భారీగా యూజర్లు జత కావడం ఇదే తొలిసారి. క్రితం క్వార్టర్లో జతైన కొత్త యూజర్ల సంఖ్య 2.65 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి ఆదాయం(ఏఆర్పీయూ) క్యూ1లో రూ. 134.5గా నమోదైంది. జూన్ నాటికి మొత్తం యూజర్ల సంఖ్య 21.53 కోట్లకు చేరింది. -
మాన్సూన్ హంగామా ఆఫర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కంపెనీ పెద్ద పెద్ద ప్రకటనలో చేసింది. జియో గిగాఫైబర్ లాంచింగ్, జియో ఫోన్ హై ఎండ్ మోడల్ జియో ఫోన్2 విడుదల, జియోఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ యాప్లు అందుబాటు వంటి వాటిని ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్ కూడా ఒకటి. అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్. పాత ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త జియోఫోన్ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు. జూలై 21 నుంచి జియో మాన్సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ రిజిస్ట్రేషన్లను కంపెనీ ప్రారంభించింది. ‘రిజిస్టర్ యువర్ ఇంటరెస్ట్’ గా జియో ఈ ప్రాసెస్ను మొదలుపెట్టింది. ఈ ఆఫర్ను రిజిస్ట్రర్ చేయాలనుకునే వారు, జియో.కామ్ లేదా మైజియో యాప్లోకి లాగిన్ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ అనంతరం సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్సూన్ హంగామా ఆఫర్ను రిజిస్టర్ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్కు లేదా ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది. జియో తొలుత మార్కెట్లో సిమ్ కార్డులను లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్ లేదా రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. జియోఫోన్ కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్ అనుసరించింది. అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది. ఇది, కేవలం ఆఫర్ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్తో ఆఫర్ లైవ్లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది. ఆధార్ ఐడీ, పాస్పోర్ట్ సైజు ఫోటోను జియో స్టోర్కు తీసుకెళ్తే, మాన్సూన్ ఆఫర్లో జియోఫోన్ను కొనుగోలు చేసుకోవచ్చు. -
అంబానీ ‘బ్రాడ్బ్యాండ్’ బాజా
ముంబై: చౌక చార్జీలతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... తాజాగా బ్రాడ్బ్యాండ్ సేవల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లకి, సంస్థలకు జియో గిగా ఫైబర్ పేరిట అత్యంత వేగవంతమైన అల్ట్రా హై–స్పీడ్ ఫిక్స్డ్ లైన్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించనుంది. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2025 నాటికి రిలయన్స్ను 125 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే దిశగా భారీ ప్రణాళికలను ఆవిష్కరించారు. ‘జియో గిగాఫైబర్’ పేరిట అందించే బ్రాడ్బ్యాండ్ సేవలను ఎప్పటినుంచి ప్రారంభించేదీ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ... కనెక్షన్ల కోసం ఆగస్టు 15 నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారాయన. ‘ప్రస్తుతం వేల సంఖ్యలో ఇళ్లలో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. మొబైల్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయికి చేరినప్పటికీ, ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ విషయంలో మాత్రం ఇంకా వెనకబడి ఉంది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో 134వ ర్యాంకులో ఉన్నాం. దీనికి సంబంధించి మన దగ్గర సరైన మౌలిక సదుపాయాలు లేవు. అదంతా ఇక మారుతుంది’ అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రిలయన్స్ కీలక మలుపు దగ్గరుంది. ఈ స్వర్ణ దశాబ్దిలో... కంపెనీ టర్నోవర్లో ఇంధన, పెట్రోకెమికల్ వ్యాపారాల ఆదాయ వాటా ఎంత ఉంటుందో, కన్జూమర్ బిజినెస్ విభాగం వాటా కూడా ఆ స్థాయికి చేరబోతోంది‘ అని అంబానీ చెప్పారు. 2025 నాటికి భారత ఎకానమీ పరిమాణం రెట్టింపు కానున్న నేపథ్యంలో... అదే వ్యవధిలో రిలయన్స్ పరిమాణం కూడా రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 21 కోట్లకు జియో యూజర్లు.. గడిచిన ఏడాది కాలంగా జియో కస్టమర్స్ సంఖ్య రెట్టింపై 21.5 కోట్లకు చేరిందని, 2.5 కోట్ల జియోఫోన్లు అమ్ముడయ్యాయని అంబానీ వెల్లడించారు. అత్యంత స్వల్పకాలంలో 10 కోట్ల మంది యూజర్ల సంఖ్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2016 సెప్టెంబర్లో టెలిఫోనీ, డేటా సర్వీసులతో టెలికంలో జియో సంచలనం సృష్టించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొబైల్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సేవల కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రిలయన్స్ ఇప్పటికే రూ.2,50,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. జియో రావడానికి ముందు దేశీయంగా డేటా వినియోగం నెలకు 125 కోట్ల జీబీగా ఉండగా... ప్రస్తుతం 240 కోట్ల జీబీలకుపైగా ఉందని అంబానీ వివరించారు. ఈ–కామర్స్ ప్లాట్ఫాం ఏర్పాటు.. అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు దీటుగా రిలయన్స్ కూడా ఈ–కామర్స్ ప్లాట్ఫాం ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తోంది. తమ రిటైల్ వ్యాపారానికి అనుబంధంగా ఇది ఉంటుందని అంబానీ చెప్పారు. ‘హైబ్రీడ్, ఆన్లైన్–టు–ఆఫ్లైన్ కామర్స్ ప్లాట్ఫాంలో మరిన్ని వృద్ధి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ప్లాట్ఫాం కంపెనీగా రిలయన్స్ రూపాంతరం చెందుతోంది. రిలయన్స్ రిటైల్ స్టోర్స్కి జియో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసులను అనుసంధానం చేయడం ద్వారా ఈ కొత్త ఈ–కామర్స్ ప్లాట్ఫాం సృష్టించబోతున్నాం‘ అని ముకేశ్ వివరించారు. తుది దశలో పెట్రో పెట్టుబడులు.. రిలయన్స్ ప్రధాన వ్యాపార విభాగాలను ప్రస్తావిస్తూ.. భారీ పెట్టుబడులతో తలపెట్టిన విస్తరణ ప్రణాళికలు దాదాపు తుది దశకు వచ్చాయని అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పారాక్సిలీన్ కాంప్లెక్స్, పెట్కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్, ఆఫ్–గ్యాస్ క్రాకర్ ఏర్పాటు చేశామని, బుటైల్ రబ్బర్ ప్రాజెక్టు ఈ ఏడాది ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. 2022 నాటికి కేజీ–డీ6 బ్లాక్ నుంచి రోజుకు 30–35 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేయడంపై భాగస్వామ్య సంస్థ బీపీతో కలిసి రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. జియోఫైబర్తో బ్రాడ్బ్యాండ్లో విప్లవాత్మక మార్పులు.. రిలయన్స్ ప్రారంభించబోయే జియోగిగాఫైబర్ సర్వీసులు బ్రాడ్బ్యాండ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. స్వల్పవ్యవధిలోనే జియో ఏకంగా 20 కోట్ల మొబైల్ యూజర్స్ను సాధించడం ప్రశంసనీయమన్నారు. కొత్త ప్రణాళికల ఊతంతో జియో టెలికం సర్వీస్ ప్రొవైడర్గా మిగిలిపోకుండా విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా ఎదగగలదని కొనియాడారు. గిగాటీవీ సెట్టాప్ బాక్స్ కూడా.. ఏజీఎంలో గిగాటీవీ సెట్టాప్ బాక్స్ను ముకేశ్ ఆవిష్కరించారు. పలు ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్కి కూడా అనుగుణంగా వ్యవహరించడం దీని ప్రత్యేకత. యూజర్లు తమ టీవీ ద్వారా మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జియో గిగాటీవీ సెట్టాప్ బాక్స్తో 600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు, అసంఖ్యాకంగా పాటలు కూడా రిలయన్స్ జియో అందించనుంది. జియో గిగాఫైబర్, గిగాటీవీ సెట్టాప్ బాక్స్లకు కనెక్టయిన ఇతరత్రా టీవీ యూజర్లకు వీడియో కాలింగ్ చేసే సదుపాయం కూడా జియోటీవీలో ఉండనుంది. 1 జీబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్, 100 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్తో జియో గిగాఫైబర్ సర్వీసులు ఉండనున్నాయి.ప్రస్తుతం చాలా మటుకు నెట్ సంస్థలు.. భవంతి దాకా ఒక లైను, ఆ తర్వాత బయటి నుంచి ఇంటికి మరో లైను ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల స్పీడ్ తగ్గిపోతోందని, గిగాఫైబర్తో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఇంటిదాకా ఒకే ఫైబర్తో కనెక్షన్ ఉంటుందని, ఫలితంగా స్పీడ్పరమైన కష్టాలు ఉండబోవని అంబానీ చెప్పారు. ఒకే ఫైబర్తో హైస్పీడ్ ఇంటర్నెట్, పెద్ద టీవీల్లో అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్టైన్మెంట్, మల్టీ–పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ మొదలైన సర్వీసులు జియో గిగాఫైబర్తో లభిస్తాయి. జియో ఫోన్ 2 .. మాన్సూన్ హంగామా.. క్వెర్టీ కీప్యాడ్ ఫీచర్తో రెండో తరం జియోఫోన్ను అంబానీ ఆవిష్కరించారు. ఇందులో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సైట్స్ను కూడా నిరాటంకంగా ఉపయోగిం చుకోవచ్చు. దీని ధర రూ.2,999. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రూ.1,500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్తో అందిస్తున్న జియోఫోన్ విక్రయాలు కూడా కొనసాగుతాయని అంబానీ తెలిపారు. కావాలనుకుంటే రూ.501 చెల్లించి, పాత ఫీచర్ ఫోన్స్ను కొత్త జియో ఫోన్స్తో ఎక్సే్చంజ్ చేసుకోవచ్చని వివరించారు. ’మాన్సూన్ హంగామా’ పేరిట ఈ ఆఫర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, క్వెర్టీ కీప్యాడ్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ (128 జీబీ దాకా ఎక్స్పాండబుల్), 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్స్ జియోఫోన్2లో ఉంటాయి. ఏజీఎంలో అంబానీ కాబోయే కోడలు సందడి... ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ను పెళ్లాడనున్న కాబోయే కోడలు శ్లోకా మెహతా.. ఈసారి ఏజీఎంలో ప్రత్యేక ఆకర్షణగా నిల్చారు. ముకేశ్ రెండో కుమారుడు అనంత్, తల్లి కోకిలాబెన్ అంబానీతో కలిసి ముందువరుసలో కూర్చున్నారు. హై స్పీడ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్, కొత్త తరం జియో ఫోన్ మొదలైన వాటిపై ఆకాశ్, ఆయన సోదరి ఈషా ఇచ్చిన ప్రెజెంటేషన్ను ఆసాంతం ఆసక్తిగా చూశారు. సమావేశం మధ్యలో.. షేర్హోల్డర్లతో ప్రశ్నోత్తరాల సమయంలో ఈషాతో కలిసి శ్లోకా బయటకు వెళ్లిపోయారు. బ్లూ డైమండ్స్ సంస్థ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా... ఈ ఏడాది డిసెంబర్లో ఆకాశ్ను పెళ్లాడనున్నారు. అదే నెలలో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాల్ కుమారుడు ఆనంద్తో ఈశా అంబానీ వివాహం కూడా ఉంది. డివిడెండ్లపై ప్రశ్నలు.. ఒక మోస్తరు డివిడెండ్లపై ఈసారి ఏజీఎంలో పలువురు షేర్హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. వాటాదారులకు మెరుగైన రాబడులు అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని అంబానీ భరోసానిచ్చారు. ఈసారి అంబానీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలైన డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి గానీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత ఏజీఎంలో మోదీ డిజిటల్ ఇండియా గురించి అంబానీ పలుమార్లు ప్రస్తావించారు. ఏజీఎం నేపథ్యంలో గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 2.53 శాతం క్షీణించి రూ. 965 వద్ద క్లోజయ్యింది. -
జియోఫోన్ 2 ఫీచర్లు ఇవే!
ముంబై : ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియోఫోన్కు సక్ససర్గా హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఫోన్కు స్మార్టర్గా ఈ కొత్త జియోఫోన్ 2ను మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్తో జియోఫోన్ 2ను రిలయన్స్ రూపొందించింది. 25 మిలియన్ పాత జియోఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన అనంతరం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్ జియోఫోన్ 2ను లాంచ్ చేశారు. జియోఫోన్ 2 స్పెషిఫికేషన్లు.. డిస్ప్లే : అంతకముందు జియోఫోన్కు ఉన్న డిస్ప్లే మాదిరిగానే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే. కీప్యాడ్ ఏరియాలో మార్పు. బ్లాక్బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్ సాఫ్ట్వేర్ : జియోఫోన్ 2, అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్ చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది ర్యామ్ : 512 ఎంబీ ర్యామ్ స్టోరేజ్ : 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ బ్యాటరీ : 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ : వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో వెనుక కెమెరా : 2 మెగాపిక్సెల్ సెన్సార్ ముందు కెమెరా : వీజీఏ సెన్సార్ స్పెషల్ ఫీచర్లు... క్వర్టీ కీప్యాడ్ కొత్త జియోఫోన్ 2లో కీలక ఫీచర్. జియోఫోన్తో పోలిస్తే మొత్తం డిజైన్ను రిలయన్స్ మార్చింది. జియోఫోన్ బేసిక్ ఫీచర్ ఫోన్ మాదిరి ఉంటే, జియోఫోన్ 2 ఎంట్రీ-లెవల్ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్కు హై-ఎండ్ వెర్షన్ జియోఫోన్ 2గా కంపెనీ అభివర్ణించింది. జియోఫోన్ 2 డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్ కార్డు స్లాట్ లాక్ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్గా జియో సిమ్ కోసమే రూపొందించారు. రెండో సిమ్ కార్డు స్లాట్ అన్లాక్తో ఉంది. దీనిలో ఇతర నెట్వర్క్లు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్లు వేసుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ పాపులర్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ను ఈ ఫోన్లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి జియోఫోన్ 2 విక్రయాలు కమర్షియల్గా ప్రారంభమవుతాయి. జియోఫోన్ 2 లో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. జియోఫోన్ కోసం మాన్సూన్ హంగామా ఆఫర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా కొత్త జియోఫోన్ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్ జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫోన్ 2 ధర : రూ.2999కే ఈ ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. బ్లాక్ రంగులో ఈ ఫోన్ లభ్యమవుతుంది. జియోఫోన్ 2 రిటైల్ పార్టనర్లు ఎవరన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించలేదు. -
బిగ్గెస్ట్ గేమ్ఛేంజర్ : ‘జియో గిగాఫైబర్’
ముంబై : దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు‘ జియోగిగాఫైబర్’ ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్బాక్స్ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టీవీ కాలింగ్లు జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది. మూడు ముఖ్యమైన యాప్స్ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లను జియో ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్, ఇషాలు చెప్పారు. జియో ఫోన్లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఇషా, ఆకాశ్లు ప్రవేశపెట్టారు. గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ను ఆఫర్చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ - 5 బ్రాడ్బ్యాండ్ దేశాల్లో భారత్ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ముఖేష్ అంబానీ ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు : 2,999 రూపాయలకే జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 జియోఫోన్కు మాన్సూన్ హంగామా ఆఫర్, కేవలం రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొత్త జియోఫోన్ జియోగిగాపైబర్ నెట్వర్క్ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీసుమెన్ ఇన్స్టాల్ బ్రాడ్బ్యాండ్ వాడకంలో ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ 134వ స్థానంలో ఉంది. దీనిలో ప్రపంచంలో టాప్-5లో భారత్ను ఒకటిగా చేరుస్తాం ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్దే రాబోయే భవిష్యత్తు కాలం బెస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ను జియోగిగాఫైబర్ హోమ్ ద్వారా యాక్సస్ రియల్ టైమ్ మెడికల్ సూచనలు అందుబాటు జియోగిగా టీవీ లాంచ్ చేసిన రిలయన్స్, 4కే రెజుల్యూషన్లో వీడియో ప్లే అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు కేవలం 22 నెలల కాలంలోనే జియోకు 215 మిలియన్ కస్టమర్లు డేటా వాడకం నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పైగా పెరిగింది వాయిస్ వాడకం ప్రతి రోజూ 250 కోట్ల నిమిషాల నుంచి 530 కోట్ల నిమిషాలకు చేరింది వీడియో వాడకం 165 కోట్ల గంటల నుంచి 340 కోట్ల గంటలకు పెరిగింది అనూహ్యమైన నెట్వర్క్ వృద్ది గుర్తింపును సాధిస్తూనే నెంబర్ వన్ స్థానాన్ని విజయవంతంగా కలిగి ఉండగలిగాం. గతేడాది ప్రతి నెలలోనూ ట్రాయ్ స్పీడ్ టెస్ట్ డేటాలో భారత్లో ఫాస్టెస్ట్ నెట్వర్క్ గుర్తింపును తెచ్చుకుంది భారత ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 8.9 శాతం 20.6 శాతం పెరిగిన రిలయన్స్ నికర లాభాలు ప్రైవేట్ కంపెనీలో అత్యధిక పన్ను చెల్లింపుదారు రిలయన్స్ ఇండస్ట్రీస్, 2018లో రూ.9844 కోట్ల పన్ను చెల్లింపు రిలయన్స్ రిటైల్ : గతేడాది 3500 స్టోర్లు ప్రారంభం, ఈ ఏడాది 4 వేలకు పైగా ప్రారంభించనున్నట్టు తెలిపిన ముఖేష్ 5 లక్షల టన్నుల గ్రోసరీలు అమ్మిన రిలయన్స్ రిటైల్ -
రిలయన్స్ నిధుల మళ్లింపుపై పిల్
సాక్షి, హైదరాబాద్: డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి నిధులను మళ్లించిన రిలయన్స్ ఇండస్ట్రీస్పై చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్, ఎండీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేల కోట్ల రూపాయలను డమ్మీ కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ దారి మళ్లించిందని, దీని వల్ల వాటాదారులకు రూ.27వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన టి.గంగాధర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.శ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇవ్వడం లేదన్నారు. సంబంధిత ఫైల్ కనిపించడం లేదని చెబుతున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ప్రతివాదుల తరఫు న్యాయవాదుల్లో ఒకరు స్పందిస్తూ, కోరిన సమాచారం ఇవ్వకపోతే అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉందని, దానిని వినియోగించుకోకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచారం ఇవ్వనప్పుడు దానిని ప్రశ్నిస్తూ అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చునంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. -
రిలయన్స్ చేతికి అలోక్ ఇండస్ట్రీస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి టెక్స్టైల్స్ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్ దక్కనున్నది. బ్యాంక్లకు రూ.23,000 కోట్ల మేర బకాయిల చెల్లింపుల్లో విఫలం కావడంతో అలోక్ ఇండస్ట్రీస్ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూపొందించిన పరిష్కార ప్రణాళికకు అలోక్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఆమోదం తెలిపారు. రుణదాతల్లో 72 శాతం మంది తమ ప్రణాళికకు ఆమోదం తెలిపారని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మరోవైపు అలోక్ ఇండస్ట్రీస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. -
ముకేశ్ అంబానీకి మరో ఐదేళ్లు అవకాశం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి మరో ఐదేళ్ల పాటు చైర్మన్, ఎండీగా అవకాశం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వాటాదారుల అనుమతి కోరింది. 41వ వార్షిక వాటాదారుల సమావేశానికి సంబంధించి నోటీసు పంపింది. ఈ సమావేశం జూలై 5న ముంబైలో జరగనుంది. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీని మరోసారి చైర్మన్, ఎండీగా ఎన్నుకునే తీర్మానాన్ని వాటాదారుల ముందు ఉంచుతుంది. ప్రస్తుత పదవీ కాలం 2019 ఏప్రిల్ 19తో ముగుస్తుంది. వాటాదారులు తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ తదుపరి మరో ఐదేళ్ల పాటు ఆయనే కంపెనీ సారథిగా కొనసాగుతారు. 61 ఏళ్ల ముకేశ్ అంబానీ 1977 నుంచి ఆర్ఐఎల్ బోర్డులో ఉన్నారు. 2002 జూలై 6న తండ్రి ధీరూబాయి అంబానీ మరణానంతరం ముకేశ్ ఆర్ఐఎల్కు చైర్మన్ అయ్యారు. వాటాదారులకు పంపిన నోటీసులోనే ముకేశ్ అంబానీకి చెల్లించే వేతన, భత్యాల వివరాలను కూడా కంపెనీ పేర్కొంది. ఏటా రూ.4.17 కోట్ల వేతనం, రూ.59 లక్షల ప్రయోజనాలు, అలవెన్స్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. లాభాల ఆధారిత బోనస్ అందుకునే అర్హత కూడా ఉందని పేర్కొంది. వ్యాపార పర్యటనల సమయాల్లో ముకేశ్, ఆయన సతీమణి, సహాయకుల ప్రయాణ ఖర్చులు, వసతి, ఆయన కుటుంబానికి భద్రత ఖర్చులను చెల్లించనున్నట్టు తెలిపింది. -
రిలయన్స్ కేజీ–డీ6 క్షేత్రాల మూత!
న్యూఢిల్లీ: కృష్ణా–గోదావరి బేసిన్లోని ప్రధాన చమురు–గ్యాస్ క్షేత్రాల(కేజీ–డీ6)ను మూసివేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) సమాయత్తమవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అంతకంతకూ దిగజారుతూ కొత్త కనిష్టాలకు పడిపోతుండమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లకు వెల్లడించిన సమాచారంలో ఈ అంశాలను ఆర్ఐఎల్ తెలిపింది. ‘కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేజీ–డీ6లోని ప్రధాన ఉత్పత్తి క్షేత్రాలను(డీ1, డీ3, ఎంఏ) వచ్చే కొద్ది నెలల్లో మూసివేయనున్నాం. ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసేందుకు(డీకమిషనింగ్) వీలుగా బ్యాంక్ గ్యారంటీలను కూడా సమర్పించాం’ అని వివరించింది. కొత్తగా మూడు మొదలు... కేజీ బేసిన్లో ఆర్ఐఎల్ ఇప్పటివరకూ 19 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. ఇందులో ఒకే ఒక చమురు క్షేత్రమైన ఎంఏ నుంచి 2008 సెప్టెంబర్లో క్రూడ్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇక ధీరూభాయ్ 1, 3(డీ1, డీ3) క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2009 ఏప్రిల్లో ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కేజీ–డీ6లో రోజుకు 4.3 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.9 ఎంఎస్సీఎండీల ఉత్పత్తి కంటే మరింత పడిపోయింది. 2010 మార్చిలో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి 69.43 ఎంఎస్సీఎండీల గరిష్టస్థాయిని తాకింది. కాగా, ఎంఏ చమురు క్షేత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్నాటికి మూసివేసే అవకాశం ఉందనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రాలను మూసివేయాలంటే ఏడాది ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కేజీ–డీ6 బ్లాక్లో కొత్తగా ప్రస్తుతం మూడు నిక్షేపాల వెలికితీత పనులు కొనసాగుతున్నాయని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ మూడింటిపై(ఆర్–క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే క్షేత్రాలు) రూ.40,000 కోట్లను పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. వీటినుంచి గరిష్టంగా 30–35 ఎంఎస్సీఎండీల గ్యాస్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, 2020 నుంచి ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వివరించింది. ఆర్–క్లస్టర్లో బావుల తవ్వకం(డ్రిల్లింగ్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. -
ధనాధన్ రిలయన్స్!
రిలయన్స్కు 2016–17 ఆర్థిక సంవత్సరం ఒక అద్భుతమైన ఏడాదిగా నిలిచిపోతుంది. అటు నిర్వహణపరంగా, ఇటు ఆర్థికంగాను అనేక రికార్డులను కంపెనీ సాధించింది. 10 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని ఆర్జించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా ఆవిర్భవించింది.రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ సేవలు(జియో).. ఈ నాలుగు కీలక వ్యాపారాల మెరుగైన పనితీరుతో రికార్డు పనితీరును నమోదుచేయగలిగాం. రిటైల్, డిజిటల్ వ్యాపారాల్లో ప్రపంచ స్థాయి నిర్వహణ ప్రమాణాలు, నెట్వర్క్ మౌలిక సదుపాయాలతో అత్యంత పటిష్టమైన పునాదులు వేశాం. మా కస్టమర్లకు అత్యంత మెరుగైన సేవలను అందించేందుకు ఇవి దోహదం చేస్తాయి. భారత్లో విస్తరిస్తున్న మార్కెట్ అవకాశాలతో వ్యాపారాల వృద్ధికి, వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత విలువను చేకూర్చేందుకు వీలవుతుంది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో రూ.9,435 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.8.046 కోట్లతో పోలిస్తే 17.3 శాతం వృద్ధి చెందింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం. పెట్రోకెమికల్స్ వ్యాపారంలో మెరుగైన మార్జిన్లకు తోడు కంపెనీ టెలికం విభాగమైన రిలయన్స్ జియో, రిటైల్ వ్యాపార లాభాలు కలిసొచ్చాయి. మొత్తం ఆదాయం 39 శాతం ఎగబాకి రూ.92,889 కోట్ల నుంచి రూ.1,29,120 కోట్లకు దూసుకెళ్లింది. కాగా, గతేడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో లాభం రూ.9,423 కోట్లతో పోలిస్తే క్యూ4లో సీక్వెన్షియల్గా 0.1 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. ఆదాయం సీక్వెన్షియల్ ప్రాతిపదికన(క్యూ3లో రూ.1,09,905 కోట్లు) 17.5 శాతం ఎగసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో రిలయన్స్ రూ.9,635 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. తగ్గిన రిఫైనింగ్ మార్జిన్... స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) గతేడాది క్యూ4లో 11 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేసి పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్ఎంగా వ్యవహరిస్తారు. పూర్తి ఏడాదికీ రికార్డులు... గత ఆర్థిక సంవత్సరం(2017–18) పూర్తి కాలానికి రిలయన్స్ రికార్డు లాభాలను ఆర్జించింది. రూ.36,075 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2016–17లో లాభం రూ.29,901 కోట్లతో పోలిస్తే 20.6% దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 30.5% ఎగబాకి రూ.3,30,180 కోట్ల నుంచి రూ.4,30,731 కోట్లకు చేరింది. 2017–18లో రిలయన్స్ స్థూల లాభం రికార్డు స్థాయిలో రూ.74,184 కోట్లు(10 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. 100 బిలియన్ డాలర్లకు చేరువలో.. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈ ఇంట్రాడేలో ఈ షేర్ దాదాపు 3 శాతం లాభంతో రూ.1,011ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.995 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,30,185 కోట్లకు చేరింది. టీసీఎస్ తర్వాత విలువ పరంగా అత్యంత పెద్ద భారత కంపెనీ ఇదే. వంద బిలియన్ డాలర్ల విలువ ఉన్న కంపెనీగా ఇటీవలనే టీసీఎస్ అవతరించిన విషయం తెలిసిందే. టీసీఎస్ తర్వాత ఆ ఘనత సాధించే సత్తా రిలయన్స్ ఇండస్ట్రీస్కు మాత్రమే ఉందని నిపుణులంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రూ.1,045ను దాటితే 100 బిలియన్ డాలర్ల కంపెనీ ఘనతను సాధిస్తుంది. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 15.8 శాతంగా నమోదైంది. ♦ పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం 12 శాతం ఎగబాకి రూ.5,753 కోట్ల నుంచి రూ.6,435 కోట్లకు ఎగబాకింది. ఇది కూడా రికార్డే. అయితే, మార్జిన్ 17.1 శాతం నుంచి 16.9 శాతానికి తగ్గింది. ♦ ఇక రిఫైనింగ్ వ్యాపారం విషయానికొస్తే.. స్థూల లాభం 9 శాతం తగ్గుదలతో రూ.6,165 కోట్ల నుంచి రూ.5,607 కోట్లకు చేరింది. దీనికి స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) తగ్గడమే ప్రధాన కారణం. ♦ చమురు–గ్యాస్ వ్యాపార విభాగం నష్టాలు క్యూ4లో రూ.486 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగిపోయాయి. ఉత్పత్తి క్షీణత కొనసాగుతుంటం దీనికి కారణం. ♦ ఇక రిటైల్ వ్యాపారం స్థూల లాభం 208 శాతం వృద్ధితో రూ.1,086 కోట్లకు ఎగబాకింది. ఆదాయం కూడా రెట్టింపుస్థాయిలో రూ.24,183 కోట్లకు చేరింది. అయితే, ఈ వ్యాపారంలో ఇంకా మొదటి నికర లాభాన్ని కంపెనీ సాధించలేదు. కొత్తగా 86 రిలయన్స్ రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 750 నగరాల్లో 3,837కు చేరింది. ♦ ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్ మొత్తం రుణం రూ.2,18,763 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి చివరికి ఇది రూ.1,96,601 కోట్లు. కంపెనీ నగదు నిల్వలు రూ.78,063 కోట్లుగా నమోదయ్యాయి. ♦ రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.6 చొప్పున డివిడెండ్ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. జియో దూకుడు ఆరంభంతోనే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రిలయన్స్ టెలికం కంపెనీ జియో... లాభాల జోరును కొనసాగిస్తోంది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ.510 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ3లో లాభం రూ.504 కోట్లతో పోలిస్తే 1.2 శాతం పెరిగింది. కంపెనీ 4జీ సేవల ద్వారా ఒక్కో యూజర్ నుంచి ఆదాయం(ఏఆర్పీయూ) రూ.154 నుంచి రూ.137.10కు తగ్గింది. అయితే, ఆదాయం మాత్రం 3.6 శాతం వృద్ధితో రూ.6,879 కోట్ల నుంచి రూ.7,128 కోట్లకు పెరిగింది. 18.66 కోట్ల మంది వినియోగదారులతో జియో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ డేటా నెట్వర్క్గా నిలిచింది. 2016 సెప్టెంబర్లోనే కార్యకలాపాలను మొదలుపెట్టినప్పటికీ.. ఆర్థిక ఫలితాల విషయంలో 2017–18 తొలి పూర్తి ఆర్థిక సంవత్సరం. ఆరంభ ఏడాదిలోనే కంపెనీ రూ.723 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం. -
రికార్డులు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్లు రూ.1000 మార్కును చేధించాయి. ఈ రోజు సాయంత్రం కంపెనీ తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్లో జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ షేరు 2.39 శాతం లాభంలో రూ.998.70 వద్ద కొనసాగుతోంది. కంపెనీ మార్చి క్వార్టర్లో రూ.9,635.2 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏడాది ఏడాదికి ఇది 19.8 శాతం పెంపుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రిలయన్స్ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న సంగతి తెలిసిందే. పెట్రో కెమికల్, రిఫైనరీ బిజినెస్లను మాత్రమే కాక, పెట్టుబడిదారులు టెలికాం రంగంపై కూడా ఎక్కువగా దృష్టిసారించారు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు 11.6 డాలర్ల నుంచి 11.3 డాలర్లకు పడిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్కు చెందిన జియో టెలికాం వ్యాపారాలు లాభాలను నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఏడాది కంపెనీ షేర్లు 34 శాతం ర్యాలీ జరిపాయి. నేడు వెల్లడించే ఫలితాల్లో ఈక్విటీ షేర్లపై డివిడెండ్ను కూడా కంపెనీ ప్రకటించనుందని తెలుస్తోంది. -
జియో మరో సంచలనం
టెలికాం మార్కెట్, ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, ఇక డీటీహెచ్ స్పేస్లోనూ తన హవా చాటేందుకు వచ్చేస్తోంది. జియోహోమ్ టీవీ సర్వీసు కింద జియో ఎస్డీ, హెచ్డీ ఛానల్స్ను రూ.400కే అందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెలికాంటాక్ రిపోర్టు ప్రకారం జియో రూ.200కు ఎస్డీ ఛానల్స్ను, రూ.400కు ఎస్డీప్లస్హెచ్డీ ఛానల్స్ను జియోహోమ్ టీవీ సర్వీసుతో ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అయితే జియోహోమ్ టీవీ సర్వీసులను ప్రత్యేకంగా అందించనుందని రిపోర్టు చెబుతోంది. కంపెనీ ఎప్పటి నుంచో సొంతంగా డీటీహెచ్ సర్వీసులను భారత్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. జియోహోమ్ టీవీ సర్వీసులు, ఎప్పటి నుంచో మార్కెట్లో రూమర్లు కొడుతున్న జియో సెటాప్ బాక్స్ సర్వీసులను రీప్లేస్ చేయనున్నాయా? లేదా వీటిని వేరుగా లాంచ్ చేయనుందా? అనేది క్లారిటీగా తెలియరాలేదు. రిపోర్టుల ప్రకారం మెరుగైన మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) కింద జియోహోమ్ టీవీ రన్ అవనున్నట్టు తెలిసింది. ఈఎంబీఎంఎస్ అనేది హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకే సారి పెద్ద మొత్తంలో యూజర్లను పొందగలదు. గత రెండేళ్లుగా ఈ సర్వీసులను జియో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో క్వార్టర్లో రానున్నట్టు సమాచారం. -
రెండేళ్ల గరిష్టానికి గ్యాస్ ధరలు పెంపు
న్యూఢిల్లీ : దేశీయంగా నేచురల్ గ్యాస్ ధర రెండేళ్ల గరిష్టానికి పెరుగబోతోంది. వచ్చే వారంలో ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం ప్రకటించబోతుంది. ఈ ప్రభావం సీఎన్జీ ధర, ఎలక్ట్రిసిటీ, యూరియా ఉత్పత్తి వ్యయాలపై కూడా పడనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్ గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్కు 3.06 డాలర్లకు పెరుగనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ ధర 2.89 డాలర్లుగా ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ధరలను నిర్ణయిస్తారు. దేశీయ రేటు కంటే కూడా భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్పైనే ఎక్కువగా వ్యయమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఒక్కో ఎంఎంబీటీయూ రేటు 3.06 డాలర్లుగా ఉండబోతుంది. 2016 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ ధరల పెంపుతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రొడ్యూసర్లకు భారీగా రెవెన్యూలు రానున్నాయి. దీంతో సీఎన్జీ ధర పెరగడంతో నాటు, యూరియ, పవర్ ఉత్పత్తి వ్యయాలను పెంపుకు దోహదం చేయనుంది. గత ఆరు నెలల కాలం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి వరకు ఒక్కో ఎంఎంబీటీయూ ధర 2.89 డాలర్లుగా ఉంది. 2.48 డాలర్ల నుంచి అక్టోబర్లో ఈ మేరకు పెంచారు. ఐదు సార్లు తగ్గింపు అనంతరం అక్టోబర్లో ఈ పెంపు చేపట్టారు. -
కేజీ డి–6లో రూ.26,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం ( బీపీ)సంయుక్తంగా కేజీ డి–6 బ్లాక్ పరిధిలో 4బిలియన్ డాలర్లు (రూ.26,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) అధ్యక్షతన గల మేనేజింగ్ కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. తూర్పు తీరంలో ఇవి ఇన్వెస్ట్ చేయనున్నాయని, వీటితో 20 ఎంఎంఎస్సీఎండీల గ్యాస్ అదనంగా అందుబాటులోకి వస్తుందని డీజీహెచ్ ప్రకటన తెలిపింది. కేజీ డి–6కు ఆర్ఐఎల్ ఆపరేటర్కాగా, బ్రిటన్కు చెందిన బీపీకి 30%, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్కు 10% వాటాలు కలిగి ఉన్నాయి. మరోవైపు ఎంజే, ఆరు శాటిలైట్ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు కూడా ఆమోదం లభించింది. కేజీ డి–6 పరిధిలో ఉత్పత్తిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రూ.40,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆర్ఐఎల్, బీపీ గతేడాది జూన్లో ప్రకటించాయి. 2020–22 నాటికి రోజువారీ ఉత్పత్తిని 30–35 మిలియన్ క్యూబిక్ మీటర్లకు తీసుకెళ్లాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కేజీ డి–5లో ఉత్పత్తి ఆలస్యం: ఓఎన్జీసీ కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని డి–5 బ్లాక్లో ఉత్పత్తి 2019 జూన్ నాటికి ప్రారంభించడం సాధ్యం కాదని ఓఎన్జీసీ స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వ విధానాల్లో మార్పులే కారణమని పేర్కొంది. జీఎస్టీ రావడం, స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధన, ప్రభుత్వరంగ సంస్థలు దేశీయంగానే ఐరన్, స్టీల్ను సమీకరించుకోవాలన్న నిబంధనలను అవరోధాలుగా పేర్కొంది. ముఖ్యంగా స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధనల వల్ల ఉత్పత్తి ఆలస్యం కావచ్చంటూ స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం అందించింది. కేజీ డి–5 బ్లాక్లో నిక్షేపాలను వెలికితీసేందుకు గాను 5.07 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికకు ఓఎన్జీసీ బోర్డు 2016 మార్చిలో ఆమోదం తెలిపింది. అయితే, గతేడాది మే నెలలో కేంద్ర కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు మౌలిక ప్రాజెక్టుల కోసం దేశీయంగానే ఐరన్, స్టీల్ను సమకూర్చుకోవాలన్నది ఆ నిర్ణయం. కేజీ డి–5 పరిధిలో ఉత్పత్తి జాప్యం కావడం వాస్తవానికి ఇది రెండోసారి. 2014 నాటి ఓఎన్జీసీ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది చమురు, వచ్చే ఏడాది గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. -
రిలయన్స్కి ఈరోస్ ఇంటర్నేషనల్లో 5 శాతం వాటా
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మీడియా సంస్థ, ఈరోస్ ఇంటర్నేషనల్లో 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో లిస్టయిన ఈరోస్ ఇంటర్నేషనల్లో 5 శాతం వాటాను ఒక్కో షేర్ను 15 డాలర్లకు (సోమవారం ఈరోస్ ఇంటర్నేషనల్ ముగింపు ధరతో పోల్చితే ఇది 18 శాతం అధికం)రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీ ద్వారా కొనుగోలు చేయనున్నది. అన్ని భారత భాషల్లో సినిమాలు నిర్మించడానికి, అన్ని భారత భాషల్లో నిర్మితమవుతున్న సినిమాల డిజిటల్ హక్కులను పొందడానికి రిలయన్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీలు చెరో రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. -
తమ్ముడు ఆస్తులు కొనుగోలు : రేటింగ్పై ప్రభావమెంత?
తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తుల కొనుగోలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్పై ఏ మాత్రం ప్రభావం చూపదని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. రూ.25వేల కోట్ల కంటే తక్కువకే జరిగే ఈ డీల్, రిలయన్స్ రేటింగ్ను పెంచదని పేర్కొంది. ఇప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద నగదు, నగదుతో సమానమైనవి రూ.77వేల కోట్ల వరకు ఉన్నాయని, ఈ ఫండ్లను వాడుతూ ఈ కొనుగోలు చేపడుతుందని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలాన్ చెప్పారు. ప్రస్తుతం స్టేబుల్ అవుట్లుక్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ 'బీఏఏ2'గా కొనసాగుతోందని తెలిపారు. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్ రేటింగ్ను గత నవంబర్లో మూడీస్ ఉపసంహరించింది. కంపెనీ డాలర్ బాండ్హోల్డర్స్కు చెల్లింపులు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా రేటింగ్ను ఉపసంహరించినట్టు తెలిపింది. ఆర్కామ్కు చెందిన టవర్లు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్స్, స్పెక్ట్రమ్, మీడియా కన్వర్జెన్సీ నోడ్స్ వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముందుకొచ్చింది. దీని కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.25వేల కోట్ల కంటే తక్కువగానే ఖర్చు చేస్తుందని ఏజెన్సీ అంచనావేస్తోంది. అయితే మున్ముందు కొనుగోళ్లను పెంచితే రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ కింద కంపెనీ పరిపుష్టిని తగ్గిస్తామని, ముఖ్యంగా టెలికాం వ్యాపారాల్లో తను ప్రణాళిక బద్ధమైన మూలధన ఖర్చులను తగ్గించకపోతే, ఈ చర్యలు చేపడతామని ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఆర్కామ్ ఆస్తులను తాము కొనుగోలు చేయబోతున్నామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి వరకు ఈ డీల్ను ముగించవచ్చని తెలిపింది. ఈ కొనుగోలు, ఆర్కామ్కు చెందిన టెలికాం మౌలిక సదుపాయాల ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి సాయపడుతుందని, అయితే ఆర్కామ్ 4జీ స్పెక్ట్రమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యర్థుల చేతుల్లోకి పోదని మూడీస్ తెలిపింది. -
అన్న చేతికి తమ్ముడు : దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. తమ్ముడు అనిల్ అంబానీ చెందిన ఆర్కామ్ వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దక్కించుకోబోతున్నట్టు ప్రకటించగానే, ఆర్కామ్ షేర్లు మరింత దూకుడుగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆర్కామ్ షేర్లు దాదాపు 35 శాతం పైకి ఎగిశాయి. అంతేకాక గత మూడు వారాల్లో ఆర్కామ్ షేరు 280 శాతం లాభాలు పండించింది. ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా స్వల్పంగా 0.6 శాతం లాభపడ్డాయి. ఇరు కంపెనీలు ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 -25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్కామ్కు కొంత ఊరట లభించనుంది. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగు కేటగిరీలు స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) ఆర్కామ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దక్కించుకోబోతుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. డీల్ ప్రకారం జియో దక్కించుకోబోతున్న ఆర్కామ్ ఆస్తులు 800/900/1800/2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్ 43వేలకు పైగా టవర్లు సుమారు 1,78,000 ఆర్కేఎం ఫైబర్ 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్ -
గ్రాండ్గా రిలయన్స్ ఫ్యామిలీ డే : సర్వత్రా ఆసక్తి
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతుంది. నేటితో రిలయన్స్ ఇండస్ట్రీస్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేవి ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో గ్రాండ్ ఈ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. మొత్తం 50వేల మందికి సరిపడ ఈ పార్క్ ఉంది. 3 గంటల వ్యవధి కంటే ఎక్కువ సేపు జరుగబోయే ఈ ఫంక్షన్లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్లు సందడి చేయనున్నారు. వీరితో పాటు వరుణ్ ధావన్, అలియా భట్, సోను నిగమ్లు పాలు పంచుకోనున్నారు.0అయితే ముఖేష్ అంబానీ నిర్వహించబోయే ఈ ఈవెంట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జియో లాంటి కంపెనీలతో దూసుకెళ్తున్న రిలయన్స్ గ్రూప్, భవిష్యత్తు ప్రణాళికలను నేడు వెలువరచనుందని తెలుస్తోంది. అంబానీ కవలలు ఇషా, ఆకాశ్ అంబానీలతో పాటు అంబానీ చిన్న కొడుకు అనంత్ కూడా ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలువబోతున్నారు. అంబానీ తర్వాత జనరేషన్, వారి భవిష్యత్తు ప్రణాళికలు ఈ ఈవెంట్లో భాగం కాబోతున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
జియో కోసం రిలయన్స్ మరో ప్రణాళిక
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన జియో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 31 బిలిలయన్ డాలర్ల(రూ.1,99,779కోట్లు) పెట్టుబడుల అనంతరం రిలయన్స్ జియో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్కు వస్తోంది. 2018 చివరిలో కాని, 2019 ప్రారంభంలో కాని జియోను ఐపీఓకి తీసుకురావాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు తెలిపాయి. జియో ఐపీఓ కోసం అంతర్గత చర్చలు కూడా ప్రారంభమైనట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో నేటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 0.29 శాతం లాభంలో రూ.918.60 వద్ద ముగిసింది. 2017 సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ.270.59 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. గత సెప్టెంబర్లో ఈ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అప్పటి నుంచి కంపెనీ సబ్స్క్రైబర్ బేస్ 138.6 మిలియన్లకు పెరిగింది. టెలికాం సర్వీసుల ప్రారంభం అనంతరం రిలయన్స్ జియో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా పేరులోకి వచ్చింది. సగటున రోజుకు ఆరు లక్షల సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకుంటోంది. 29 రాష్ట్రాల్లో 18వేలకు పైగా అర్బన్, రూరల్ టౌన్లలో, 2 లక్షలకు పైగా గ్రామాల్లో జియో తన కార్యకలాపాలు సాగిస్తోంది. -
రిలయన్స్ క్రెడిట్ అవుట్లుక్కు కోత
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రుణ పరపతికి సంబంధించి భవిష్యత్తు అంచనా(క్రెడిట్ అవుట్లుక్)ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. ప్రస్తుతం ఉన్న సానుకూలం(పాజిటివ్) నుంచి స్థిరం (స్టేబుల్) స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఆర్ఐఎల్ రేటింగ్ను మాత్రం యథాతథంగా ‘బీఏఏ2’ స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే 18 నెలల్లో రిలయన్స్ భారీ మొత్తంలో రుణాలను తిరిగిచెల్లించాల్సిన నేపథ్యంలో కంపెనీ నగదు ప్రవాహంపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న కారణంతోనే క్రెడిట్ అవుట్లుక్ను తగ్గించినట్లు మూడీస్ పేర్కొంది. ‘టెలికం, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల విస్తరణ కోసం గడిచిన కొన్నేళ్లలో రుణాలు, బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ భారీగా నిధులను సమీకరించింది. వీటిలో చాలావరకూ వచ్చే 18 నెలల్లో రుణదాతలకు తిరిగి చెల్లించాల్సి ఉంది. దీనివల్ల కంపెనీ నుంచి నగదు భారీగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. రిలయన్స్ ఇప్పటికే అతిపెద్ద విదేశీ రుణ గ్రహీతగా కొనసాగుతోంది. విదేశీ రుణాలను మరింతగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల రుణ భారం తగ్గకపోగా... కంపెనీ నుంచి నగదు ప్రవాహాలు పెరుగుతాయి’ అని మూడీస్ హెచ్చరించింది. సెప్టెంబర్ చివరినాటికి రిలయన్స్ నగదు నిల్వలు రూ.77,014 కోట్లు కాగా, రుణ భారం రూ.2,14,145 కోట్లకు పెరిగింది. మరోపక్క, షేరు ధర కొత్త ఆల్టైమ్ గరిష్టాలకు ఎగబాకడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. -
ఒక్కరోజులోనే ఈ ప్రత్యర్థులకు 1.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం మార్కెట్లో జరుగుతున్న యుద్ధంలో ఒక్కరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ ఇద్దరు మాత్రం తగ్గడం లేదు. ఇటు మార్కెట్ క్యాపిటలైజేషన్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు, భారతీ ఎయిర్టెల్ షేర్లు నేటి మార్కెట్లో మైలురాయిలకు దగ్గరగా మెరుపులు మెరిపించాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లీడర్గా ఉన్న భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.2 లక్షల కోట్లకు చేరుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్ల దగ్గరగా వచ్చేసింది. దీంతో కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, ఆ కంపెనీ అధినేతలు కూడా భారీగా లబ్ది పొందారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం సోమవారం రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన నికర సంపద మరో 1.1 బిలియన్ డాలర్లను చేర్చుకోగా.. భారతీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ సునిల్ భారతీ మిట్టల్ 433 మిలియన్ డాలర్లను పెంచుకున్నారు. ఇరు కంపెనీల షేర్లు నేటి మార్కెట్లో భారీగా పెరగడంతో, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్తో పాటు వారి సంపద కూడా పైకి ఎగిసింది. మొత్తంగా అంబానీ నికర సంపద 41.3 బిలియన్ డాలర్లు. మిట్టల్ సంపద 10.1 బిలియన్ డాలర్లు. ఒక్కరోజులోనే తమ సంపదను భారీగా పెంచుకున్న టాప్-3 గెయినర్లలో ఈ ప్రత్యర్థులున్నారు. నేటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు 3 శాతానికి పైగా, ఎయిర్టెల్ షేర్లు 5 శాతం మేర జంప్ చేశాయి. -
రికార్డు స్థాయిలను తాకిన రిలయన్స్
ముంబై : ఒడిదుడుకులుగా సాగిన నేటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకొనిపోయాయి. తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.900 లెవల్ మార్కును దాటాయి. కంపెనీ ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో బలమైన రీఫైనింగ్ మార్జిన్లు, జియో రాబడులు ప్రకటించడంతో కంపెనీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. దీంతో రిలయన్స్ ఇంట్రాడేలో 3.7 శాతం పైకి జంప్ చేసింది. ఈ స్టాక్పై మెజార్టి పెట్టుబడిదారులు సానుకూలంగా వ్యవవరించడంతో పాటు, డిసెంబర్ నుంచి వారి టెలికాం వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయని కంపెనీ ప్రకటించడం షేర్లపై మంచి ప్రభావాన్ని చూపింది. విశ్లేషకులు కూడా రిలయన్స్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాలపై సానుకూలంగా ఉన్నారు. 2017లో ఇప్పటివరకు కంపెనీ స్టాక్ 68 శాతం ర్యాలీ జరిపింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. నేటి ఇంట్రాడేలో కంపెనీ స్టాక్ రూ.915.55 వద్ద రికార్డు గరిష్టాలను తాకింది. నాలుగు రోజుల క్రితం ప్రకటించిన క్యూ2 ఫలితాల్లో కంపెనీ రూ.8,109 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని, రూ.101,169 కోట్ల రెవెన్యూలను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.5 శాతం పైకి ఎగిసింది. -
పేమెంట్స్ బ్యాంకు ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి చిన్న స్థాయి పేమెంట్స్ బ్యాంకును ఏర్పాటు చేయటానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రంగంలో దిగ్గజ స్థాయి బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ... చిన్న పేమెంట్స్ బ్యాంకు కోసం రిలయన్స్తో కలిసి ఇప్పటికే దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో రిలయన్స్కు 70 శాతం వాటా, ఎస్బీఐకి 30 శాతం వాటా ఉంటాయి. ‘‘చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకోసం నియంత్రణ సంస్థల పరమైన విధివిధానాలను పూర్తిచేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా నిర్దిష్ట గడువేదీ విధించుకోలేదు’’ అని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అప్పట్లో చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకు 11 సంస్థలు లైసెన్సులు పొందగా.. మూడు సంస్థలు లైసెన్సుల్ని తిరిగి ఇచ్చేశాయి. ఎయిర్టెల్, పేటీఎం సంస్థలు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించాయి కూడా. డిపాజిట్లు తీసుకోవటంతో పాటు, పేమెంట్ సర్వీసులకు మాత్రమే ఈ బ్యాంకులు పరిమితమవుతాయి. రుణాలివ్వడానికి ఉండదు. -
టాప్–3 ఇంధన సంస్థ.. ‘రిలయన్స్’
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఎస్అండ్పీ గ్లోబల్ ప్లాట్స్ రూపొందించిన ఈ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7వ స్థానంలో నిలిచింది. ఇది గతేడాది 14వ స్థానంలో ఉంది. మరోవైపు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. 2017 ర్యాంకింగ్స్లో మొత్తం 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నట్లు గ్లోబల్ ప్లాట్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్దదైన కోల్ ఇండియా మాత్రం... ఈ జాబితాలో 38వ స్థానం నుంచి 45వ స్థానానికి పడిపోయింది. లిస్టులో భారత్ పెట్రోలియం(39), హిందుస్తాన్ పెట్రోలియం (48), పవర్ గ్రిడ్ (81), గెయిల్ (106) ర్యాంకులు దక్కించుకున్నాయి. అమెరికన్ సంస్థ ఎక్సాన్ మొబిల్ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్ప్రోమ్ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అటు జర్మనీకి చెందిన ఇ.ఆన్ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరడం గమనార్హం. ఇక ఇ.ఆన్ తరువాతి స్థానాల్లో రిలయన్స్, కొరియా ఎలక్ట్రిక్, చైనా పెట్రోలియం, రష్యన్ సంస్థ పీజేఎస్సీ లుక్ ఆయిల్ వరుసగా నిలిచాయి. ఎక్సాన్ మొబిల్ ఈసారి 9వ స్థానానికి పడిపోయింది. ఆస్తుల విలువ, ఆదాయాలు, లాభాలు, పెట్టుబడులపై రాబడులు అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఎస్అండ్పీ గ్లోబల్ ప్లాట్స్ ఈ జాబితాను రూపొందించింది. టాప్ 10 కంపెనీల నికర లాభాలు గతేడాది 63.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
సాక్షి, ముంబై : ట్రాయ్ మంగళవారం ఇచ్చిన షాక్తో టెల్కోలు భారీగా దెబ్బతిన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు బుధవారం మార్కెట్లో 7 శాతం పైగా నష్టపోయాయి. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటన టెల్కోలకు తీవ్ర షాకింగ్కు గురిచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ట్రాయ్ పేర్కొంది. 2020 జనవరి నుంచైతే ఏకంగా ఈ ఛార్జీలను జీరోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపింది. టర్మినేషన్ చార్జీ అన్నది ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్కు తన నెట్వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. దీంతో ప్రధాన టెల్కోలన్నీ తమ రెవెన్యూలను భారీగా కోల్పోనున్నాయి. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా ఉందని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని టెల్కోలు కోరుతున్నాయి. ట్రాయ్ నిర్ణయంతో ఐడియా 7 శాతం నష్టపోయి రూ.76.85 వద్ద, ఎయిర్టెల్ 6 శాతం పడిపోయి రూ.370 వద్ద ట్రేడైంది. ట్రాయ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండుగ చేసుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్ షేర్లు, ట్రాయ్ నిర్ణయంతో జియోకు వార్షికంగా రూ.3,800 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో ఎయిర్టెల్ రూ.1500-2000 కోట్లు, వొడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.1200 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. జియో రాకతో ఇప్పటికే పతనమైన టెలికాం ఇండస్ట్రి, మరింత కుదేలు కానున్నట్టు ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. -
150 పాయింట్ల సెన్సెక్స్ లాభం ఆవిరి
ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా అమ్మకాలు జరుపుతున్నందున, భారత్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల వరకూ లాభపడి 31,815 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 31,660 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు కేవలం 0.77 పాయింట్ల పెరుగుదలతో 31,662.74 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,965 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 9,917 పాయింట్ల వద్దకు తగ్గింది. చివరకు 13.70 పాయింట్ల లాభంతో 9,930 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ప్రారంభం పటిష్టంగా వున్నప్పటికీ, ఉత్తర కొరియా ఉద్రిక్తతలు వెంటాడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో ఒడుదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగా నెలరోజుల నుంచి బ్లూచిప్ షేర్లు పరిమితశ్రేణిలో కన్సాలిడేటెడ్ అవుతున్నాయని, అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు పటిష్టంగా ట్రేడవుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నప్పటికీ, దేశీయ ఫండ్స్ కొనుగోళ్లతో మార్కెట్లో పెద్ద పతనం సంభవించలేదని ఆయన వివరించారు. క్రితం రోజు రూ. 1300 కోట్లకుపైగా నికర విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గురువారం మరో రూ. 500 కోట్లకుపైగా ఉపసంహరించుకున్నారు. -
రిలయన్స్, బీపీకి మరో రూ.1,700 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం కేజీ–డీ6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్ డాలర్లకి(దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం రూపంలో ఈ జరిమానా ఉంటోంది. వాస్తవానికి ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్సీ) ప్రకారం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ముందుగా తమకైన వ్యయాలను గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి తగ్గించుకుని మిగతా లాభాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. అయితే, వ్యయాల రికవరీకి అనుమతించని పక్షంలో లాభాల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. 2011–12లో కేజీ–డీ6 బ్లాక్లోని ధీరూభాయ్–1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 35.33 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తయ్యింది. ఆతర్వాత నుంచి తగ్గుతూ ప్రస్తుతం 4 ఎంసీఎండీ కన్నా తక్కువకి క్షీణించింది. గడిచిన సంవత్సరాలకు సంబంధించి వ్యయాల రికవరీని అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్ఐఎల్, బీపీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. -
మరో సంచలనం: టాటా, రిలయన్స్ జోడి?
ముంబై : టెలికాం మార్కెట్లో మరో సంచలనం చోటుచేసుకోబోతుంది. ఇప్పటికే మెగాడీల్స్ను ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలకు పోటీగా రిలయన్స్ జియో కూడా భారీ డీల్ చేసుకోబోతుందని తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ టాటా గ్రూప్కు చెందిన టెలికాం వ్యాపారాలను, అత్యంత విలువైన కంపెనీగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సొంతం చేసుకోబోతుందని సమాచారం. టాటా గ్రూప్ నష్టాల్లో ఉన్న తన వ్యాపారాన్ని, ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్కు అమ్ముతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. రిపోర్టుల ప్రకారం తొలిసారి రెండు అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు కలిసి ఈ డీల్ను నిర్వహించబోతున్నాయని తెలుస్తోంది. అయితే మార్కెట్లో వస్తున్న ఈ ఊహాగానాలపై టాటా గ్రూప్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ స్పందించలేదు. గతంలో మాత్రం ఈ రెండు కార్పొరేట్ సంస్థలు ఎలాంటి మేజర్ ఒప్పందాలను కలిగి లేకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే ఆర్ఐఎల్ నిర్వహిస్తున్న పురుషుల ప్రొఫెషనల్ ఫుట్బాట్ లీగ్లో ఇండియన్ సూపర్ లీగ్కు చెందిన జమ్షెడ్పూర్ ఫ్రాంచైజ్ను టాటా సొంతం చేసుకుంది. గత దశాబ్దం కాలంగా టెలికాం వ్యాపారాల్లో టాటాలు, అంబానీలు తీవ్రంగానే పోటీ పడుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల టాటాల టెలికాం వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోయాయి. గత కొంతకాలంగా తమ గ్రూప్కు చెందిన టెలికాం, ఓవర్సీస్ కేబుల్, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్, డీటీహెచ్ టీవీ వ్యాపారాలను విక్రయించేందుకు టాటా గ్రూప్ అన్వేషణ ప్రారంభించింది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్తో కూడా ఒప్పందం చేసుకోబోతున్నట్టు తెలిసింది. కానీ ఈ మెగా డీల్ను భారతీ ఎంటర్ప్రైజ్ రద్దుచేసుకున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో ఎయిర్టెల్కు గట్టి పోటీగా ఉన్న రిలయన్స్ జియోకి వీటిని విక్రయించాలని టాటాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జియో, టాటా టెలి ఈ డీల్ కోసం ఆప్షన్లను అన్వేసిస్తున్నాయని, కానీ ఇది పురోగతిలోకి రావాలంటే చాలా కష్టతరమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా టెలిలో మెజార్టీ వాటా టాటా గ్రూప్ చేతుల్లో ఉంది. 49 శాతం లిస్టు అయిన టాటా కమ్యూనికేషన్ వద్ద ఉంది. అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ కూడా టాటా టెలిని కొనడానికి మొగ్గుచూపిందని కానీ ఇప్పటికే తమకున్న తీవ్ర నష్టాలు, ఎయిర్సెల్ విలీనంలో చోటుచేసుకున్న అనిశ్చిత పరిస్థితులతో వెనక్కి తగ్గిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
సరికొత్త రికార్డ్ స్థాయికి రిలయన్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డ్ హైని నమోదు చేసింది. రూ. 1649 వద్ద ఆర్ఐఎల్ 9 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.గత రెండు వారాల్లో 6.5 శాతం వృద్ధిని సాధించింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 5.35 లక్షల కోట్లను అధిగమించింది. ఇటీవల ప్రకటించిన జూన్ క్వార్టర్ మంచి ఫలితాలు, 1:1బోనస్ సిఫార్సు, సహా షెల్ కంపెనీ ప్రమాద వార్త కూడా తోడ్పడిందని అంచనా. ప్రపంచ చమురు దిగ్గజం షెల్కు యూరప్లోని రోటర్డామ్లో గల అతిపెద్ద రిఫైనరీ భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకుందన్న వార్తలు దేశీ ప్రయివేట్ రంగ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్కు జోష్నిచ్చాయి. అంతేకాదు రోజుకి 4 లక్షల బ్యారళ్ల చమురు శుధ్ది సామర్థ్యం కలిగిన రోటర్డామ్ రిఫైనరీని మూసివేయనున్నారనే ఆందోళన కూడా వ్యాపించింది. ఫలితంగా సింగపూర్ తదితర ఆసియా రిఫైనరీ సంస్థలకు మేలు చేకూరనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడే వీలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పిసిఎల్), ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, మాగ్మా ఫిన్కార్ప్, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ బిఎస్ఇ ఎస్ అండ్ పి లో టాప్ లో నిలిచాయి. కాగా ఆర్బీఐ వడ్డీరేట్ల కోత కారణంగా ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయింది. దేశీయ స్టాక్మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది. -
హాంకాంగ్ టైకూన్ను దాటేసిన ముఖేష్ అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలన రికార్డును కొట్టేశారు. హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లి కా-షింగ్ను అధిగమించేసి, ఆసియాలోనే రెండో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ సంపదకు ఈ ఏడాది మరో 12.1 బిలియన్ డాలర్లు అంటే సమారు రూ.77,000 కోట్లు కలిసినట్టు బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ రిపోర్టు చేసింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు ముఖేష్ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్లో రికార్డులు సృష్టిస్తుడటంతో ఆయన సంపద ఈ మేర ఎగిసినట్టు బ్లూమ్బర్గ్ పేర్కొంది. అంబానీ ఇటీవలే మొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి జీరోకే జియో ఫోన్ను లాంచ్ చేశారు. దీంతో ఆయన మార్కెట్ను మరింత విస్తరించనున్నారని తెలిసింది. గతేడాది సెప్టెంబర్లో లాంచ్చేసిన టెలికాం బిజినెస్ల నుంచి ఇంకా ఆయన, ఆయన షేర్ హోల్డర్స్ లాభాలను ఆర్జించాల్సి ఉంది. 2012 మార్చి నుంచి గ్రూప్ రుణాలు మూడింతలు అయినట్టు కూడా తెలిసింది. అయితే ఆయన 90 శాతం రెవెన్యూలు రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లు, రిటైల్, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్ అధినేత ముఖేష్ తన సంపదను భారీగానే పెంచుకుంటున్నారు. పెరుగుతున్న రుణాలపై మాత్రం స్పందించడానికి రిలయన్స్ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2016లో బ్లూమ్బర్గ్ బిలీనియర్ ఇండెక్స్లో 29వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19 స్థానానికి చేరుకున్నారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ లో పెడుతున్న పెట్టుబడులతో ప్రస్తుత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్కి భారీగానే లాభాలు రానున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అనాలిస్ట్ విశాల్ కుల్కర్ణి చెప్పారు. 2019 మార్చి వరకు ఈ వ్యాపారాల నుంచి ఆపరేటింగ్ లాభాలు 50 శాతం పెరుగనున్నట్టు చెప్పారు. జియో నుంచి 1 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ లాభాలు ఆర్జించి, వచ్చే ఏడాది వీటిని మూడింతలు చేసుకోనున్నట్టు అంచనావేస్తున్నారు. -
ఇవీ అంబానీ లెక్కలు
న్యూఢిల్లీ : పోటీ సంస్థలకు గట్టి షాకిచ్చేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం సమావేశంలో బ్లాక్బస్టర్ ప్రకటనలు చేశారు. జీరోకే జియో ఫీచర్ ఫోనంటూ ఇటు టెలికం కంపెనీల నుంచి అటు మొబైల్ సంస్థల వరకు గుండెల్లో హడలు పుట్టించారు. జియో 4జీ ఫీచర్ ఫోన్ కొన్నవారికి ఉచిత వాయిస్ కాల్స్, చౌకైన డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క కస్టమర్లకు మాత్రమే కాక, ఇన్వెస్టర్లకు బంపర్ కానుక ఇచ్చారు. ఒక షేరుకు మరో షేరును బోనస్గా ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో కంపెనీ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. మొత్తంమీద ఈసారి ఏజీఎంలో ముకేశ్ ప్రసంగం, అనూహ్య నిర్ణయాలు ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లెక్కలు గురించి, ఈ సమావేశంలోనే ముఖేష్ ప్రకటించారు. ఆయన ప్రకటించిన లెక్కలేమిటో ఓసారి మీరే చూడండి... రూ.3.3 ట్రిలియన్: గత 5 ఏళ్ల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ మూలధన వ్యయాలు రూ.12.5 బిలియన్ : జియో యూజర్లు ఒక్కో నెలలో వాడే డేటా వాడకం(జీబీలో). ఆరునెలల్లో ఆరింతలు పెరిగింది. రూ.2.5 బిలియన్ : ప్రతిరోజూ జియో యూజర్లు చేసే వాయిస్, వీడియో కాల్స్ నిమిషాలు 500 మిలియన్ : జియో ఫోన్ టార్గెట్గా పెట్టుకున్న ఫీచర్ ఫోన్ యూజర్లు 100 మిలియన్ : జియో చెల్లింపు కస్టమర్లు. 5 మిలియన్ : ప్రతి వారం జియో ఫోన్ విక్రయానికి పెట్టుకున్న టార్గెట్ రూ.16.54 లక్షలు : 1977లో రిలయన్స్ షేర్లలో రూ.1000 పెట్టుబడి పెడితే, ఇప్పుడు వచ్చే విలువ 10,000 సార్లు : గత 40 ఏళ్లలో సంస్థ నికరలాభాల్లో వృద్ధి 4700 సార్లు : 1977 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి రూ.153 : జియో ఫోన్ కస్టమర్లు అపరిమిత డేటా వాడకానికి చేయించుకోవాల్సిన నెలవారీ టారిఫ్ రూ.0 : జియో ఫోన్ ధర -
32,000పైన సెన్సెక్స్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభావం ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు శుక్రవారం పటిష్టంగా ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు ఎగిసి, తిరిగి 32,000 పాయింట్లస్థాయిపైన 32,029 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,900 స్థాయిని అధిగమించి 42 పాయింట్ల పెరుగుదలతో 9,915 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తీవ్ర హెచ్చుతగ్గులు...: క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాల్ని ఆర్ఐఎల్ వెల్లడించడంతో శుక్రవారం ఈ షేరుతో పాటు సూచీలు కూడా గ్యాప్అప్తో ప్రారంభమయ్యాయి. అయితే అటుతర్వాత ఐటీ మినహా ఇతర రంగాల షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకూ నష్టపోయి 31,800 పాయింట్ల వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం 9,838 పాయింట్ల స్థాయికి క్షీణించింది. అయితే అటుతర్వాత రిలయన్స్ ఏజీఎంలో ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 1ః1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన చేసిన తర్వాత ఆర్ఐఎల్ షేరు 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,590 వద్దకు చేరడం...కనిష్టస్థాయిల వద్ద ఇతర షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్ తిరిగి వేగంగా కోలుకుంది.జియో విస్తరణ, వినూత్న ప్రణాళికల్ని ప్రకటించడంతో మార్కెట్లో ఉత్తేజం కలిగిందని, ఐటీ షేర్లు, ప్రైవేటు బ్యాంకు షేర్లలో జరిగిన కొనుగోళ్లతో ఒడుదుడుకుల నుంచి సూచీలు కోలుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. -
రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై : ఫ్లాట్గా ట్రేడవుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మరలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో షేర్లు మద్దతుతో సెన్సెక్స్ 119.15 పాయింట్లు లాభాల్లోకి ఎగిసి 32,023 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 9,904 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. గురువారం మార్కెట్ అవర్స్ తర్వాత ప్రకటించిన అదరగొట్టే లాభాలు, నేటి ఏజీఎంలో ఫీచర్ ఫోన్ వివరాలు ఈ కంపెనీ షేర్లకు బూస్ట్ ఇచ్చాయి. 3.9 శాతం మేర పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, తొమ్మిదన్నర ఏళ్ల గరిష్టంలో రూ.1,588 వద్ద నమోదవుతున్నాయి. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ను లాంచ్చేసిన ముఖేష్ అంబానీ, ఈ డివైజ్తో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులకు డేటా సేవలను మరింత దగ్గర చేయనున్నామని చెప్పారు. అంతేకాక తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులను జియో సర్వీసుల్లోకి మారేలా ఈ ఫీచర్ ఫోన్ దోహదం చేస్తుందని తెలిపారు. ఆయిల్ నుంచి టెలికాం వరకు మార్కెట్లో తన హవా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లోనూ విశ్లేషకుల అంచనాలను మించింది. రూ.9,108 కోట్ల రికార్డుస్థాయి కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. ఇవన్నీ నేటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకుపోవడానికి సహకరిస్తున్నాయి. 2008 జనవరి తర్వాత ఇవే అత్యధిక గరిష్టస్థాయిలు. మరోవైపు టెలికాం దిగ్గజాలు జియో ఫీచర్ ఎఫెక్ట్కు భారీగా కుప్పకూలాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్లు 4.1 శాతం, 7.3 శాతం కిందకి పడిపోయాయి. -
రిలయన్స్ ఏజీఎం హైలైట్స్
-
రిలయన్స్ ఏజీఎం హైలైట్స్
ముంబై: అందరూ ఊహించినట్టుగా రిలయన్స్ అధినేత సంచలన ప్రకటన చేశారు. జియో ఫోన్ భారతీయులందరికీ పూర్తిగా ఉచితమని రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ముకేశ్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫీచర్ ఫోన్ లాంచ్ చేశామన్నారు. ఇండియాస్ ఇంటిలిజెంట్ ఫోన్ అంటూ అంబానీ వాయిస్ కమాండ్తో పనిచేసే ఈ ఫోన్ను ఆవిష్కరించారు. ఉచిత వాయస్ కాల్స్, ఉచిత డేటా అంటూ సునామీ సృష్టించిన జియో ఇపుడిక జియో ఫోన్ఉచితమంటూ ప్రత్యర్థులు బాంబులు పేల్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) హైలైట్స్ ఆర్ఐఎల్ ఐపీఓకు వచ్చిన తర్వాత ఇది 40వ సంవత్సరం 1977లో రూ. 33 కోట్ల టర్నోవర్ 2017లో రూ. 3.3 లక్షల కోట్ల టర్నోవర్ 40 సంవత్సరాల్లో టర్నోవర్లో 4700 శాతం వృద్ధి రేటు 32 శాతం వృద్ధి రేటు సాధించిన రిలయన్స్ గత 40 ఏళ్లలో 10వేల రెట్లు పెరిగిన నికర లాభం 50 వేల రెట్లు పెరిగిన మార్కెట్ క్యాప్ 3,500 నుంచి 2.5 లక్షలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య ప్రతీ రెండున్నరేళ్లకు రెట్టింపు అయిన మదుపర్ల సంపద 1977లో రూ. 1000 పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 16.5 లక్షలు 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను అందుకున్న రిలయన్స్ జియో గత 40 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించిన కంపెనీలలో ఒకటి దేశంలో మరే ఇతర కార్పొరేట్ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించలేదు.. తండ్రిని తలుచుకుని భావోద్వేగం ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వృద్ధి కనబరిచిన కంపెనీలు కొన్నే 10 కోట్ల కస్టమర్లను జియో అధిగమించింది ప్రస్తుతం రిలయన్స్ జియోకు 12.5 కోట్ల మంది కస్టమర్లు సగటున ప్రతీ 7 సెకన్లకు ఒక కస్టమర్ ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా జియోకు ఆదరణ వీడియోలకు నెలకు 125 కోట్ల జీబీ ఇంటర్నెట్ వినియోగం ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాల కాల్స్ మొబైల్ డేటా వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో ఇండియా ఫ్రీ నుంచి పెయిడ్ సబ్స్క్రైబర్లుగా మారడం అతి పెద్ద రికార్డ్ ఉచిత కస్టమర్లను పెయిడ్ కస్టమర్లుగా మార్చగలిగాం.. 10 కోట్ల మంది కంటే అధికంగా పెయిడ్ కస్టమర్లు జియో ప్రైమ్, ధన్ ధనా ధన్ ప్లాన్స్ కొనసాగుతాయి ఇండియాలో 78 కోట్ల మొబైల్ ఫోన్స్ ఇందులో 50 కోట్ల ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి డిజిటల్ ఇండియా లక్ష్యంలో వీరు భాగం కాలేకపోతున్నారు డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అందరికీ డిజిటల్ సాధికారత లేకపోవడం బాధాకరం.. దీన్ని మేము సాధిస్తాం. రాబోయే 12 నెలల్లో దేశంలోని 99 శాతం మందికి అందుబాటులో జియో సేవలు ఇండియాలో 2జీ కవరేజ్ కంటే 4జీ కవరేజ్ ఎక్కువ పోటీ కంపెనీలకు 2జీ కవరేజ్ నిర్మాణానికి 25 ఏళ్లు పట్టింది.. 3 ఏళ్లలోనే అంతకు మించిన 4జీ నెట్వర్క్ 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులకు డేటా సేవలను మరింత దగ్గర చేయనున్నాం మేడ్ బై ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 10వేల జియో ఆఫీస్లు ఇంటెలిజెంట్ 4 జీ ఫీచర్ ఫోన్ "జియో ఫోన్" ఆవిష్కరణ జియో కస్టమర్లకు 100శాతం 4జీ వీఓఎల్టీఈ జియో ఫోన్ ఉచితం రూ. 153 లకే నెలకు అన్ని సేవలు ఉచితం 1500 వన్ టైం సెక్యూరిటి డిపాజిట్ 3 సం.రాల తరువాత పూర్తిగా ఈ డిపాజిట్ రిఫండ్ భాషా అనేక్ భారత్ ఏక్ 22 భాషల్లో ఆగస్టు 15నుంచి ట్రయల్ రన్ ఆగస్టు 24 నుంచి ప్రీ బుక్ ఆఫర్ సెప్టెంబర్ నుంచి ఈ డివైస్లుఅందుబాటులో ప్రతి ఈక్విటీ షేరుకు ఒక షేరు బోనస్- రిలయన్స్ ముకేశ్ అంబానీ -
మరికొద్ది సేపట్లో రిలయన్స్ సంచలనం?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుందనే అంచనాలు భారీ గా నెలకొన్నాయి. గురువారం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన 40వ (ఏజీఎం) వాటాదారుల సాధారణ వా ర్షిక సమావేశం జరుగుతోంది. అనంతరం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో ఎలాంటి ప్రకటనలతో ముందుకు రానున్నారనే ఆసక్తి, ఉత్కంఠ ఈ సందర్భంగా మార్కెట్ వర్గాల్లో, ఖాతాదారుల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం కంపెనీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉచిత వాయిస్, డేటా సేవలకు నాంది పలికిన జియో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. తాజా ఏజీఎంలో జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు దూరం చేసే మరో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ను లాంచ్ చేయనుంది. ఆ కంపెనీ నుంచి రానున్న రూ.500 .1000 4జీ ఫీచర్ ఫోన్ను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. అలాగే సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు రిలయన్స్ ప్రకటించిన ఫలితాల నేపథ్యంలో ఎనలిస్టులు కూడా ఆర్ఐఎల్ పై సానుకూలంగా ఉన్నారు. ప్రధానంగా రిఫైనింగ్ పెట్రో కెమికల్ బిజినెస్ లో ఆర్ఐఎల్ సాధించిన పురోగతి ఈ షేరును కొత్త రికార్డు స్థాయిలకు చేర్చనుందని భావిస్తున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాల్లో 28 శాతం జంప్ చేసి 9,108 కోట్లకు చేరింది. సినిమాలు, టీవీ సీరియల్స్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న బాలాజీ టెలిఫిలిమ్స్లో రూ. 403 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రూ. 403 కోట్ల పెట్టుబడితో బాలాజీ టెలిఫిలిమ్స్లో 24 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ. 164/ షేర్ చొప్పున 2.5 కోట్ల షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేసేందుకు బాలాజీ టెలిఫిలిమ్స్ సిద్ధమైంది. అలాగే బాలాజీ టెలిఫిలిమ్స్లో రిలయన్స్కు చెందిన ఇద్దరికి బోర్డు సభ్యత్వం లభించనుంది. ఈ డీల్ తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్ ప్రమోటర్ వాటా 32 శాతానికి తగ్గనుంది. అలాగే రిలయన్స్ జియో రూ. 20 వేల కోట్ల రైట్స్ ఇష్యూకు రాబోతోన్న సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన రిలయన్స్
లాభం 28% పెరుగుదల... క్యూ1లో రూ. 9,108 కోట్లు... ఆదాయం రూ. 90,537 కోట్లు; 27 శాతం వృద్ధి ♦ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల జోరు... ♦ స్థూల రిఫైనింగ్ మార్జిన్ 11.9 డాలర్లు... ♦ రూ. 20 వేల కోట్లు సమీకరించనున్న జియో ♦ నేడు ఏజీఎం; ముకేశ్ అంబానీ ప్రసంగం ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీ ఈ ఏడాది తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో రూ.9,108 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,113 కోట్లతో పోలిస్తే 28 శాతం ఎగబాకింది. ఒక క్వార్టర్లో ఇంత అత్యధిక లాభం ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, క్యూ1 లాభంలో రూ.1,087 కోట్ల అసాధారణ రాబడి (గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్లో వాటా విక్రయం ద్వారా) కూడా కలిసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వన్టైమ్ రాబడిని తీసేస్తే లాభం రూ.8,021 కోట్లుగా లెక్కతేలుతుంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.90,537 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.71,451 కోట్లతో పోలిస్తే... 26.7 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ వ్యాపారాల జోరు కంపెనీ లాభాలు పుంజుకోవడానికి దోహదం చేసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఆర్ఐఎల్రూ.7,960 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. తొమ్మిదేళ్ల గరిష్టానికి రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) జూన్ క్వార్టర్లో 11.9 డాలర్లకు ఎగబాకింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లు. దీంతో పోలిస్తే 3.5 శాతం పెరిగింది. కాగా, క్యూ1లో రిలయన్స్ జీఆర్ఎం 11 డాలర్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్ఎంగా వ్యవహరిస్తారు. రంగాల వారీగా చూస్తే... పెట్రోకెమికల్స్: ఈ కీలక విభాగం ఆదాయం క్యూ1లో రూ.25,461 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.20,718 కోట్లతో పోలిస్తే... 23% ఎగబాకింది. స్థూల లాభం(పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు–ఎబిటా) 44% భారీ వృద్ధితో రూ.2,806 కోట్ల నుంచి రూ.4,031 కోట్లకు దూసుకెళ్లింది. ఎబిటా మార్జిన్ 15.8%తో ఆల్టైమ్ గరిష్టస్థాయిని నమోదు చేసింది. రిఫైనింగ్: మరో కీలక వ్యాపారమైన ఈ విభాగంలో ఆదాయం రూ. 56,568 కోట్ల నుంచి రూ.66,945 కోట్లకు పెరిగింది. 18.3 శాతం వృద్ధి చెందింది. స్థూల లాభం రూ.6,593 కోట్ల నుంచి రూ.7,476 కోట్లకు ఎగసింది. 13.3 శాతం వృద్ధి నమోదైంది. చమురు–గ్యాస్: ఈ విభాగంలో ఆదాయం 1.2 శాతం తగ్గుదలతో రూ.1,340 కోట్ల నుంచి రూ.1,324 కోట్లకు చేరింది. స్థూల నష్టం రూ.373 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ1లో స్థూల నష్టం రూ.312 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర ఎగబాకినట్లు లెక్క. ప్రధానంగా కేజీ–డీ6 క్షేత్రాల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోతూ వస్తుండటం నష్టాలు పెరిగిపోయేందుకు కారణమవుతోంది. రిటైల్: ఈ విభాగంలో ఆదాయం భారీ స్థాయిలో 73.5% దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో రూ.6,666 కోట్ల నుంచి ఈ ఏడాది క్యూ1లో రూ.11,571 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.148 కోట్ల నుంచి రూ.292 కోట్లకు ఎగబాకింది. 97.3% వృద్ధి నమోదైంది. టెలికం: గతేడాది సెప్టెంబర్లో కార్యకలాపాలను ప్రారంభించిన రిలయన్స్ జియో టెలికం విభాగం ఆదాయం, స్థూల లాభాలను కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్లకుపైగా యూజర్లను దక్కించుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా జియో నిలిచిందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో యూజర్లకు బిల్లింగ్ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, నేడు(శుక్రవారం) జరగనున్న కంపెనీ ఏజీఎంలో జియోకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.25,192 కోట్ల మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో ఖర్చు చేసింది. ⇔ ఇతర ఆదాయం రూ. 2,124 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో ఈ మొత్తం రూ. రూ.2,378గా ఉంది. ⇔ కంపెనీ మొత్తం రుణ భారం జూన్ చివరి నాటికి రూ.2,00,674 కోట్లకు ఎగబాకింది. మార్చి చివరికి ఇది రూ.1,96,601 కోట్లు. ⇔ ఇక నగదు నిల్వలు జూన్ ఆఖరినాటికి రూ.72,107 కోట్లకు తగ్గాయి. మార్చి చివరికి ఈ మొత్తం రూ.77,226 కోట్లు. ⇔ ఇజ్రాయెల్కు చెందిన జెరూసలెం ఇన్నోవేషన్ ఇంకుబేటర్(జీఐఐ) అనే సంస్థలో 2.5 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ మొత్తానికిగాను జేఐఐలో 20% వాటా దక్కుతుందని తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఫిన్టెక్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సంబంధిత ప్రారంభస్థాయి స్టార్టప్లలో జేఐఐ పెట్టుబడులు పెడుతుంది. ⇔ గురువారం బీఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు స్వల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.1,529 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. బాలాజీ టెలి ఫిల్మ్స్లో 25 శాతం వాటా కొనుగోలు... మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ బాలాజీ టెలిఫిల్మ్స్లో 24.92 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోనుంది. ఈ ప్రతిపాదనకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఇందుకోసం రిలయన్స్ దాదాపు రూ.413 కోట్లను చెల్లించనుంది. కాగా, రిలయన్స్కు ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా (షేరు రూ.164 చొప్పున) 2.52 కోట్ల షేర్లను కేటాయించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని బాలాజీ టెలిఫిల్మ్స్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఈ లావాదేవీ ద్వారా లభించనున్న మొత్తాన్ని కంటెంట్ డెవలప్మెంట్కు ఉపయోగించనున్నట్లు పేర్కొంది. తమ కంపెనీలో రిలయన్స్ భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని బాలాజీ టెలిఫిల్మ్స్ చైర్మన్ జితేంద్ర కపూర్ వ్యాఖ్యానించారు. గురువారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర 1.74 శాతం నష్టంతో రూ. 187 వద్ద ముగిసింది. అయితే, గతనెల 28న రూ.130గా ఉన్న షేరు ధర 16 ట్రేడింగ్ సెషన్లలో (ఈ నెల 20న) రూ.190కి చేరుకోవటం గమనార్హం. అంటే కేవలం 20 రోజుల్లో ఈ షేరు ధర ఏకంగా 40 శాతం పెరిగిందన్న మాట. రిలయన్స్ జూన్ క్వార్టర్లో మరోసారి అత్యంత పటిష్టమైన పనితీరును నమోదుచేసింది. లాభాల జోరుకు మా కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల్లో భారీ మార్జిన్లు దోహదం చేశాయి. ఇక రిటైల్ వ్యాపారం 74% ఆదాయ వృద్ధిని సాధించి దూసుకెళ్తోంది. భారత టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి మా రిలయన్స్ జియో నాంది పలికింది. దేశంలో డేటా వినియోగం, టెలికం సేవల స్వరూపంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో రూ. 20 వేల కోట్ల సమీకరణ... రైట్స్ ఇష్యూ రూపంలో రూ.20 వేల కోట్ల నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ఒక్కొక్కటి రూ.50 విలువగల 400 కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను(ఓసీపీఎస్) ఆర్ఐఎల్ వాటాదారులకు జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఈ నిధులను సేవల విస్తరణకు వినియోగించనుంది. ఇప్పటికే రిలయన్స్ జియోపై ఆర్ఐఎల్ దాదాపు రూ.1.9 లక్షల కోట్ల నిధులను వెచ్చించిన సంగతి తెలిసిందే. తాజా నిధులతో ఈ మొత్తం రూ.2.1 లక్షల కోట్లకు చేరనుంది. -
తిరుగులేకుండా దూసుకెళ్తున్న రిలయన్స్
దేశంలో అత్యంత విలువైన సంస్థగా పేరున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొట్టమొదటిసారి సోమవారం ట్రేడింగ్లో రూ.5 లక్షల కోట్ల మార్కును బీట్ చేసింది. గతేడాది సెప్టెంబర్లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుమీద ఈ కంపెనీ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ షేర్లు తిరుగులేకుండా దూసుకెళ్తున్నాయి. నేటి ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.49 శాతం పెరిగి, రూ.1,553.90 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పెంపుతో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.5,05,287 కోట్లకు పెరిగింది. రూ.1,534.30 వద్ద ప్రారంభమైన కంపెనీ షేర్లు రూ.1,558.80 వద్ద గరిష్ట స్థాయిలను తాకాయి. అంతేకాక 52 వారాల్లో 52 శాతం వృద్ధిని కూడా కంపెనీ షేర్లు నమోదుచేశాయి. ఈ పెంపుతో బ్లూచిప్ కంపెనీల్లో అత్యధిక వెయిటేజీ ఉన్న షేర్లుగా ఇవి నమోదవుతున్నాయి. ఇన్వెస్టర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బంపర్ బొనాంజగా ఉన్నాయి.. ముఖ్యంగా టెలికాం, పెట్రోకెమికల్స్, రిటైల్ బిజినెస్ల పెట్టుబడులు వీటికి బాగా సహకరిస్తున్నాయి. తాజాగా జియో ఆఫర్ చేస్తున్న ధన్ ధనా ధన్ ఆఫర్ ముగుస్తున్న క్రమంలో కంపెనీ టారిఫ్ ప్లాన్లను సవరించింది. కొత్త రూ.309 ప్లాన్లో తక్కువ వాలిడిటీ, డేటాను అందిస్తోంది. దీంతో కంపెనీ తన లాభాలను మెరుగుపరుచుకోవడానికి ఒక్కో యూజర్పై ఆర్జించే కనీస రెవెన్యూలను(ఆర్పును) పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 120 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లున్నారు. దీర్ఘకాలికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో చాలా పాజిటివ్ వాతావరణాన్ని చూస్తున్నామని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. జియో వల్ల మరింత మార్కెట్ షేరు పొందే అవకాశముందని కొటక్ సెక్యురిటీస్ వైస్ ప్రెసిడెంట్-పీసీజీ రీసెర్చ్ సంజీవ్ బార్బాడే పేర్కొన్నారు. జియో ప్లాన్లను సవరించడంతో, టెలికాం ఇండస్ట్రీకి గుడ్న్యూస్గా మారింది. జియో తన డేటా ప్లాన్లను పెంచుకుంటూ పోవడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. -
2016–17లోనూ ముకేశ్ వేతనం రూ. 15 కోట్లే
వరుసగా తొమ్మిదో సంవత్సరం న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సంవత్సరమూ రూ. 15 కోట్ల వార్షిక వేతనానికే పరిమితమయ్యారు. సీఈవోల జీతభత్యాలు సముచిత స్థాయిలోనే ఉండాలన్న వాదనలు 2008–09లో తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఆయన జీతభత్యాలు, కమిషన్లు మొదలైనవి ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. మేనేజింగ్ స్థాయి కీలకోద్యోగుల వేతనాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండాలని, దానికి తనే ఉదాహరణగా నిలవాలని ముకేశ్ అంబానీ భావిస్తారని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ జీతభత్యాలు రూ. 38.75 కోట్ల మేర ఉండాలని బోర్డు ఆమోదించినప్పటికీ.. ఆయన అభిప్రాయం మేరకు దీన్ని రూ. 15 కోట్లకే పరిమితం చేసినట్లు వివరించింది. 2016–17లో ముకేశ్ అంబానీ రూ. 4.16 కోట్లు జీతంగాను, మరో రూ. 60 లక్షలు భత్యాలుగాను, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు, లాభాలపై కమీషన్ల కింద రూ. 9.53 కోట్లు అందుకున్నారు. మరోవైపు కంపెనీలో ఇతర ఉద్యోగుల జీతభత్యాలు మాత్రం పెరిగాయి. అంబానీ కజిన్లు నిఖిల్ ఆర్ మేస్వాని, హితల్ ఆర్ మేస్వాని వేతనం రూ. 16.58 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం వీరు రూ. 14.40 కోట్ల స్థాయిలో అందుకున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం రూ. 7.23 కోట్ల నుంచి రూ. 7.87 కోట్లకు పెరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ .. రూ. 4 లక్షలు సిటింగ్ ఫీజు కింద. రూ. 1.35 కోట్లు కమీషన్ కింద పొందారు. సిటింగ్ ఫీజు గతంలో అందుకున్న రూ. 6 లక్షలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ 2015–16లో అందుకున్న రూ. 1.20 కోట్ల కమీషన్ కన్నా తాజాగా మరింత ఎక్కువ పొందారు. -
గ్యాస్ ధరపై న్యాయపోరాట విరమణ!
రిలయన్స్, బీపీ నిర్ణయం న్యూఢిల్లీ: గ్యాస్ ధర సమీక్ష, నిర్ణయం అంశాలు ఆలస్యం అవుతుండడాన్ని సవాలుచేస్తూ, ప్రారంభించిన న్యాయపోరాటం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ– బ్రిటిష్ భాగస్వామి బీపీలు వెనక్కు తగ్గాయి. మూడేళ్ల క్రితం ఆయా అంశాలను సవాలు చేస్తూ, రెండు సంస్థలూ ఆర్బిటేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. రిలయన్స్ చీఫ్ ముఖేశ్ అంబానీ, బీపీ సీఈఓ బోబ్ డూడ్లేలు ఈ నెల 15 ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇంతక్రితమే రెండు సంస్థలూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ముందు తమ పిటిషన్ ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ వచ్చే కొద్ది వారాల్లో పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. ఫలితం ఇదీ... ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత రోజు ముఖేశ్ అంబానీ, బోబ్ డూడ్లేలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లోని డీ6 బ్లాక్ పరిధి సముద్ర గర్భంలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాల అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. తాజా ఆర్బిట్రేషన్ ప్రక్రియ విరమణ వల్ల ఆయా కొత్త క్షేత్రాల నుంచి తాము ఉత్పత్తి చేసిన సహజ వాయువు గ్యాస్పై మార్కెటింగ్, ప్రైసింగ్ స్వేచ్ఛకు రెండు కంపెనీలకు వీలు కలుగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2015 జనవరిలో ఒకసారి మోడీతో బీపీ సీఈఓ సమాశమయ్యారు. సముద్ర గర్భం వంటి క్లిష్ట ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్యాస్ క్షేత్రాలకు గ్యాస్ ప్రైస్ ప్రీమియంను కొనసాగించాలని కోరారు. లేకపోతే తమ పెట్టుబడుల విషయలో పునఃసమీక్ష పరిస్థితి ఏర్పడుతుందనీ వివరించారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వ గ్యాస్ ధర విధానంపై ఎటువంటి న్యాయ పోరాటాన్నీ కొనసాగించరాదని ప్రభుత్వం షరతు పెట్టిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికి న్యాయపోరాటం ఉపసంహరణపై రెండు సంస్థల మధ్యా ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం. -
రిలయన్స్ నుంచి విడిగా జియో..
ముంబై: టెలికాం దిగ్గజాలకు చుక్కులు చూపిస్తున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటివరకు అధికారిక త్రైమాసిక ఫలితాలను ప్రకటించలేదు. కానీ జియో ఇన్ఫోకామ్ త్రైమాసిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిగా ప్రకటించాలని ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యూ2(జూలై-సెప్టెంబర్ కాలం) నుంచి రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాలు అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ విషయంలో బోర్డు తుది ఆమోదం తెలుపాల్సి ఉందని, కానీ ఇంకా యోచన ప్రక్రియలోనే ఉన్నట్టు తెలిసింది. కంపెనీ వ్యాపారాలు అన్ని పూర్తిగా మార్కెట్లో సర్దుకున్నాక, ఫలితాలను విడిగా ప్రకటించనున్నామని ఓ అధికారి చెప్పారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఎలాంటి చట్టపరమైన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే మార్చితో ముగిసిన ఆరు నెలల కాలంలో జియోకు వచ్చిన నష్టాన్ని మాత్రం ప్రకటించారు. ముందటేడాది జియో నష్టం రూ.7.46 కోట్లు ఉంటే, అవి ఈ ఏడాది రూ.22.50 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాలు కూడా కేవలం బాండ్ హోల్డర్స్ కోసం తీసుకొచ్చారు. గత సెప్టెంబర్ లో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ ఉచిత ఆఫర్లతో సంచలన రేపిన సంగతి తెలిసిందే.మార్చి 31తో ఈ కంపెనీ ఉచిత సర్వీసులకు స్వస్తి చెప్పి, టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. అయితే ఈ నెట్ వర్క్ పై కాల్స్ మాత్రం జీవితకాలం ఉచితమే. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లను కూడా సొంతం చేసుకుంది. కానీ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్ బేస్ యాడ్ చేసుకోవడంలో కంపెనీ కాస్త నెమ్మదించింది. జియో దెబ్బకు ఓ వైపు నుంచి టెలికాం దిగ్గజాలు భారీగా రెవెన్యూలు కోల్పోతున్నాయి. ఆ కంపెనీలు ప్రకటించే ఫలితాల్లో జియో వల్ల భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నట్టు ప్రకటిస్తున్నాయి. -
8ఏళ్ల తర్వాత రిలయన్స్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల విరామం అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఓ కీలక ప్రకటన చేసింది. కేజీ-డీ6 బ్లాక్ లో కొత్త గ్యాస్ ఫీల్డ్స్ ను అభివృద్ధి చేయడం కోసం రూ.40వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తమ భాగస్వామ్య చమురు సంస్థ బీపీతో కలిసి ప్రకటించింది. ఈ రెండు సంస్థలు కలిసి సాధారణ, అసాధారణ రీతిలో ఇంధన వర్తకానికి కొత్త అవకాశాల కోసం వ్యూహాత్మక సహకారం అందించుకోవాలని నిర్ణయించినట్టు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. బీపీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త వనరులను అభివృద్ధి చేసుకోవడానికి మార్చిన తమ విధానాలు సహకరిస్తాయని బీపీ సీఈవో బాబ్ డూడ్లీ చెప్పారు. బీపీ-రిలయన్స్ కలిసి కేజీ-డీ6 బ్లాక్ లో ఆర్-సిరీస్ గ్యాస్ ఫీల్డ్ అభివృద్ధి కోసం అంగీకరించినట్టు, దీనికి 6 బిలియన్ డాలర్లు పెట్టుబులు పెట్టనున్నట్టు డూడ్లీ కూడా తెలిపారు. ఈ గ్యాస్ ప్రాజెక్ట్ తో దేశీయ దిగుమతులను 10 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. రిలయన్స్-బీపీ కలిసి చాలా ఏళ్ల తర్వాత 40వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు అంబానీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. ఇంధనం, కర్బన్ ఉద్గారాల ట్రేడింగ్ లో కొత్త అవకాశాలను వెలికి తీయడానికి ఇదో కొత్త, చరిత్రాత్మకమైన సహకారమని అభివర్ణించారు. ముఖేష్ అంబానీ, బాబ్ డూడ్లీ సమావేశ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేటి మార్కెట్లో 2.2 శాతం మేర పైకి ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లో నమోదైనప్పటికీ, రిలయన్స్ మాత్రం లాభాలు పండించింది. -
ఆర్ఐఎల్కు జియో జోష్
ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జోష్తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పుంజుకుంది. ఏప్రిల్ నెలలో జియో కస్టమర్లు పెరగడంతో మార్కెట్లో రిలయన్స్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. దాదాపు 3.37 శాతం జంప్చేసి బుధవారం నాటి మార్కెట్ లో టాప్ విన్నర్గా నిలిచింది. 4జీ సేవల మొబైల్ సంస్థ జియోకు కొత్తగా 3.9 మిలియన్లమంది వినియోగదారులు జత కలిశారు. ఏప్రిల్ నెలలో భారీగా వినియోగదారులు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా లాభపడింది. మంత్ ఆన్ మంత్ 3.56 వృద్ధిని సాధించి మార్కెట్ లీడర్లు భారతి ఎయిర్టెల్, వోడాఫోన్లను అధిగమించింది. టెలికాం రెగ్యులేటర్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 30, 2017 నాటికి రిలయన్స్ జియో మొత్తం చందాదారులు మార్చిలో 10.86 కోట్ల నుంచి 11.26 కోట్లకు పెరిగింది .ఽ వైర్లెస్ సబ్స్క్రైబర్ల విషయంలో జియో మార్కెట్ వాటా మార్చి నెలాఖరు 9.29 శాతం నుంచి 9.58 శాతానికి చేరింది. ఉచిత 4జీ సేవలకు స్వస్తి చెప్పినప్పటికీ కంపెనీ వినియోగదారులు పెరగడంతో ఈ కౌంటర్కు డిమాండ్ పుంజుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో జియో చిన్నభాగమే అయినప్పటికీ కీలక పాత్ర పోషిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. జయో ఉచిత సేవలు, సరసమైన ధరల నిర్ణయం కొంతకాలంగాభారీ చందాదారులను సంపాదించడానికి సహాయపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని అంచనా. -
9,300 పాయింట్లను దాటిన నిఫ్టీ
ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ నిఫ్టీ రికార్డ్లు ∙ బ్యాంక్ నిఫ్టీదీ ఇదే జోరు సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ∙ జోష్నిస్తున్న క్యూ4 ఫలితాలు ఎన్ఎస్ఈ నిఫ్టీ మంగళవారం మెరుపులు మెరిపించింది. తొలిసారిగా 9,300 పాయింట్లను దాటింది. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా రికార్డ్లు బద్దలు కొట్టాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 22వేల పాయింట్లపైన ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 30వేల పాయింట్లకు చేరువలో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర బ్లూ చిప్ కంపెనీల క్యూ4 ఫలితాలు బాగుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల పంట పండించింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 29,943 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 9,307 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది 3 వారాల గరిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ కొత్త శిఖరాలకు... ఈ నెల 5నాటి 9,274 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయి నిఫ్టీ రికార్డ్ మంగళవారం బద్దలైంది. 9,273 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ జోరు రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 9,309 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 9,307 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నిఫ్టీ 14 శాతం వరకూ లాభపడింది. ఇక సెన్సెక్స్ 29,962–29,781 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. ఎందుకు ఈ పరుగు.. ప్రపంచ మార్కెట్ల జోరు: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్లో యూరోపియన్ యూనియన్లో ఉండేందుకే మొగ్గు చూపే సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రాన్ నెగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. ఆర్థిక ఫలితాల జోష్: ఇప్పటివరకూ అంతంతమాత్రంగానే కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు సోమవారం నుంచి అంచనాలను మించడం స్టాక్ మార్కెట్ను పరుగులు పెట్టిస్తోంది. రూపాయి పరుగులు: డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో 64.21 స్థాయికి బలపడడం సెంటిమెంట్కు మరింత జోష్నిచ్చింది. నేడు చివరకు రూపాయి 65.26 వద్ద ముగిసింది. షార్ట్ కవరింగ్: ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో 2 రోజుల్లో ముగుస్తుండడంతో ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్కు దిగారు. అధిక వెయిటేజ్ షేర్ల పరుగు: సూచీల్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు పెరుగుతుండటంతో మార్కెట్ జోరుగా దూసుకుపోతోందని నిపుణులంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. బీఎస్ఈలో మొత్తం 293 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. క్యూ4 ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.2 శాతం లాభపడి రూ.1,433కు చేరింది. రూ.125 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.125 లక్షల కోట్లకు చేరింది. సోమవారం రూ.124 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రూ.1.11 లక్షల కోట్లు పెరిగి రూ.1,25,53,561 లక్షల కోట్లకు చేరింది. 6,000 పాయింట్లను దాటిన నాస్డాక్ అమెరికా షేర్లు దూసుకుపోతున్నాయి. అమెరికా స్టాక్ సూచీల్లో ఒకటైన నాస్డాక్ తొలిసారిగా 6,000 పాయింట్లను దాటింది. ఫ్రాన్స్ ఎన్నికల సానుకూల ఫలితాలు, అమెరికా బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండటం, అమెరికా అధ్యక్షుడు పన్ను సంస్కరణల హామీతో స్టాక్ సూచీలు మంచి లాభాలను సాధిస్తున్నాయి. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
రిలయన్స్.. లాభాల రికార్డ్
-
రిలయన్స్.. లాభాల రికార్డ్
క్యూ4లో రూ.8,046 కోట్లు ♦ పెట్రోకెమికల్స్ నుంచి అధిక ప్రతిఫలం ♦ 2016–17లో లాభం 29,901కోట్లు ♦ కంపెనీ చరిత్రలోనే అత్యధికం ♦ రిలయన్స్ రిటైల్లోనూ చక్కని వృద్ధి న్యూఢిల్లీ/ముంబై: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.8,046 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీకి వచ్చిన లాభం రూ.7,167 కోట్లతో పోలిస్తే 12.5 శాతం వృద్ధి నమోదయింది. కంపెనీ ప్రధాన వ్యాపార విభాగమైన పెట్రోకెమికల్స్ ఈ స్థాయి లాభాలు ఆర్జించడానికి ప్రముఖంగా దోహదపడింది. చమురు శుద్ధి మార్జిన్లు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిలో ఉండడం కూడా కలసివచ్చింది. కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.92,889 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2015–16 మార్చి క్వార్టర్లో వచ్చిన ఆదాయం రూ.63,954 కోట్లతో పోలిస్తే 45% వృద్ధి చెందింది. డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కో షేరువారీ ఆర్జన రూ.25.5గా ఉండగా, అది మార్చి త్రైమాసికంలో రూ.27.3కు పెరిగింది. 2016–17 పూర్తి ఏడాదికి కంపెనీ లాభం రూ.29,901 కోట్లుగా ఉంది. కంపెనీ చరిత్రలో ఒక ఏడాదిలో ఈ స్థాయి లాభాలు రావడం ఇదే ప్రథమం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే లాభం 18.8 శాతం పెరిగింది. పెట్రో కెమికల్స్ జోష్... మార్చి త్రైమాసికంలో పెట్రోకెమికల్స్ విభాగం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధితో రూ.3,441 కోట్లకు చేరుకుంది. ప్రతి బ్యారల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 11.5 డాలర్ల ఆదాయం లభించగా, 2015–16 సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది 10.8 డాలర్లుగానే ఉంది. మొత్తం మీద పెట్రోకెమికల్స్ వ్యాపారం ఎబిటా మార్జిన్ ఐదేళ్ల గరిష్ట స్థాయి అయిన 14 శాతానికి చేరుకుంది. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి... ఈ విభాగంలో కంపెనీ నష్టాలు రెండింతలు పెరిగిపోయాయి. పన్నుకు ముందు ఈ విభాగం నష్టాలు రూ.486 కోట్లకు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో నష్టాలు రూ.153 కోట్లే. ఉత్పత్తి తగ్గడం, దేశీయంగా గ్యాస్ ధర తక్కువగా ఉండడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. రుణాలు, నగదు నిల్వలు మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అప్పులు రూ.1,96,601 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఇవి రూ.1,94,381 కోట్లుగానే ఉన్నాయి. కంపెనీ వద్ద నగదు నిల్వలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.76,339 కోట్లుగా ఉండగా, మార్చి త్రైమాసికంలో రూ.77,266 కోట్లకు పెరిగాయి. జియోకు రూ.22.50 కోట్ల నష్టం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియో ఉచిత సేవల కారణంగా గడచిన ఆరు నెలల కాలంలో రూ.22.50 కోట్ల నష్టాలను చవిచూసింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎదురైన నష్టం ఇది. ఈ కాలంలో కంపెనీ ప్రమోషనల్ ఆఫర్ల పేరిట ఉచితంగా వాయిస్, డేటా సేవలు అందించిన విషయం తెలిసిందే. ప్రైమ్ సభ్యత్వం కింద ఖాతాదారుల నుంచి రూ.99 మాత్రమే వసూలు చేసింది. జియో 4జీ సేవలు గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పూర్తి ఏడాదికి (2016–17) నష్టాలు రూ.31.37 కోట్ల నష్టం వచ్చింది. 10.9 కోట్ల కస్టమర్లు కంపెనీ ఉచిత సేవల కోసం చేరగా, వారిలో 7.2 కోట్ల మంది పెయిడ్ చందాదారులుగా మారారు. రిటైల్ లాభం రూ.366 కోట్లు రిలయన్స్ రిటైల్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 65.6 శాతం అధికంగా రూ.366 కోట్ల లాభాలను ఆర్జించడం విశేషం. ఆదాయం రూ.10,332 కోట్ల మార్కును చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.5,646 కోట్లతో పోలిస్తే 83 శాతం వృద్ధి చెందింది. పూర్తి ఏడాదికి రిలయన్స్ రిటైల్ ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.33,765 కోట్లుగాను, లాభం (వడ్డీ, పన్నులకు ముందు) 40 శాతం పెరుగుదలతో రూ.857 కోట్లుగానూ ఉంది. ఏడాదిలో కంపెనీ 63 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసింది. వృద్ధిని కాపాడుకుంటాం... 2016–17లో రిలయన్స్ బృందం కన్జూమర్, ఎనర్జీ, మెటీరియల్స్ విభాగాల్లో భవిష్యత్తు వృద్ధికి అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లకు రూపునిచ్చింది. నిర్వహణపరంగా మేము ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాం. ఆర్ఐఎల్ తన చరిత్రలోనే అత్యధిక వార్షిక లాభం రూ.29,901 కోట్లను 2016–17లో ఆర్జించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ముడి సరుకును పోటీ ధరలకే సమకూర్చుకునే సామర్థ్యం వల్ల అధిక ఆపరేటింగ్ మార్జిన్లను కొనసాగిస్తూ మా ఉత్పత్తులను వృద్ధి మార్కెట్లకు అందించగలం. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులతో మా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో మరింత బలోపేతం, సమీకృతం అవుతుంది. దీంతో దీర్ఘకాలానికి లాభాల వృద్ధిని కాపాడుకోగలం. ప్రపంచంలోనే సరసమైన ధరలకు జియో డేటా, వాయిస్ సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ మార్కెట్ విలువలో ఆర్ఐఎల్ మళ్లీ నంబర్ 1 దేశంలో మార్కెట్ విలువ పరంగా ఆర్ఐఎల్ మరోసారి నంబర్ 1 స్థానానికి చేరుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీసీఎస్ను వెనక్కి నెట్టేసి తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం ఆర్ఐఎల్ షేరు ముగింపు ధర ప్రకారం మార్కెట్ విలువ రూ.4,60,518.80 కోట్లు. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.4,58,932.37 కోట్లు. టీసీఎస్ కంటే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.1,586.43 కోట్లు అధికం. బీఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు ధర 1.19 శాతం లాభంతో రూ.1,416.40 వద్ద ముగియగా, టీసీఎస్ షేరు ధర 0.77 శాతం లాభంతో రూ.2,329.10 వద్ద క్లోజయింది. నాలుగేళ్ల క్రితం మార్కెట్ విలువ పరంగా అగ్ర స్థానంలో ఉన్న ఆర్ఐఎల్ను దాటుకుని టీసీఎస్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా, ఇటీవలి కాలంలో ఐటీ రంగ షేర్లకు ప్రతికూలతలు ఎదురవడం, అదే సమయంలో జియో ప్రవేశంతో ఆర్ఐఎల్ షేరు ధర ఎగబాకడంతో తిరిగి పూర్వపు స్థానాన్ని దక్కించుకునేలా చేసింది. -
రిలయన్స్కు పంచ్: మళ్లీ టాప్లోకి టీసీఎస్
న్యూఢిల్లీ : రికార్డు సృష్టించిన రిలయన్స్ జియోను టెక్ దిగ్గజం టీసీఎస్ వెనక్కి నెట్టేసింది. మళ్లీ తన స్థానాన్ని తాను ఆక్రమించుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.ఇటీవలే టీసీఎస్ స్థానాన్ని రిలయన్స్ అధిగమించి టాప్లో నిలిచింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ను టీసీఎస్ అధిగమించినట్టు వెల్లడైంది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్తో టాటా గ్రూప్కు చెందిన ఈ టెక్ సంస్థ మార్కెట్ విలువ రూ.4,55,405.31 కోట్లగా నమోదైంది. ఇది రిలయన్స్ మార్కెట్ విలువ కంటే 299.98 కోట్లు అధికం. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 4,55,105.33 కోట్లగా ఉంది. నాలుగు ఏళ్ల క్రితమే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానాన్ని టీసీఎస్ దక్కించుకుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ షేర్ల జోరుతో, టీసీఎస్కు దగ్గరి స్థానంలోకి రిలయన్స్ వచ్చేసింది. ఈ ఏడాదిలో రిలయన్స్ షేర్లు 30 శాతం పైకి పెరుగగా.. టీసీఎస్ షేర్లు 2 శాతం పడిపోయాయి. అదేవిధంగా వీటి తర్వాత మార్కెట్ విలువ ప్రకారం ఓఎన్జీసీ మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్కు ఓకే
♦ ఒక్కో షేర్ బైబ్యాక్ ధర రూ.2,850 ♦ మొత్తం బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు న్యూఢిల్లీ: టీసీఎస్ వాటాదారులు రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్కు ఆమోదం తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో 99.81% ఓట్లు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. ఈ బైబ్యాక్లో భాగంగా చెల్లించిన ఈక్విటీ మూలధనంలో 2.85 శాతం వాటాకు సమానమైన 5.61 కోట్ల షేర్లను ఒక్కో షేర్ను రూ.2,850కు టీసీఎస్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. కాగా టీసీఎస్ కంపెనీ టెండర్ ఆఫర్ విధానంలో షేర్లను బైబ్యాక్ చేయనున్నది. మంగళవారంనాడు 2016–17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ఈ కంపెనీ వెల్లడించనున్న నేపథ్యంలో షేర్ల బైబ్యాక్కు వాటాదారుల ఆమోదం లభించడం విశేషం. ఈ బైబ్యాక్ విజయవంతమైతే భారత్లో ఇదే అతి పెద్ద బైబ్యాక్ కానున్నది. 2012లో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,400 కోట్ల బైబ్యాక్.. ఇప్పటిదాకా అతి పెద్దది. -
సెన్సెక్స్ @ 30,000
మళ్లీ రికార్డ్ల మోత ⇒ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ ⇒ 64 పాయింట్ల లాభంతో 29,974 వద్ద ముగింపు ⇒ 27 పాయింట్ల లాభంతో 9,265కు నిఫ్టీ స్టాక్ సూచీలు బుధవారం మళ్లీ రికార్డ్ల మోత మోగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీల దూకుడుతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 30,000 పాయింట్లను, నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ముగింపులోనూ సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్లు సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్లకు కొంచెం దిగువన, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 9,250 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 29,974 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,265 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు స్టాక్ సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. అయితే సెన్సెక్స్ 2015లో సాధించిన జీవిత కాల గరిష్ట స్థాయి 30,025కు 51 పాయింట్ల దూరంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ నేడు(గురువారం) వెల్లడించనున్న సందర్భంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. దాంతో సెన్సెక్స్ చరిత్రాత్మక రికార్డుస్థాయిని సాధించలేకపోయింది. కీలక రేట్ల విషయంలో యథాతధ స్థితిని ఆర్బీఐ కొనసాగిస్తుందనే అంచనాలున్నాయి. అయితే మొండి బకాయిల సమస్య, అధికంగా ఉన్న లిక్విడిటీ విషయమై ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటుందనే ఆశలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంకింగ్, వాహన, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 30,007 పాయింట్లను తాకింది. ఆ తర్వాత 29,818 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ ఒక దశలో 93 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 97 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద 190 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక ఇంట్రాడేలో 9,274 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ ఆ తర్వాత గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరకు 27 పాయింట్ల లాభంతో 9,265 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ దూకుడు.. రిలయన్స్ దూకుడు కొనసాగుతోంది. ఈ షేర్ 3.1 శాతం లాభపడి రూ.1,415 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,262 కోట్లు పెరిగి రూ.4.6 లక్షల కోట్లకు చేరింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.6,356ను తాకిన మారుతీ సుజుకీ చివరకు 4.4 శాతం లాభపడి రూ.6,339 వద్ద ముగిసింది. అమ్మకాల పరంగా మారుతీ బ్రెజా అగ్రస్థానాన్ని సాధించిందని, యుటిలిటి వెహికల్ మార్కెట్లో 2015–16లో 15 శాతంగా ఉన్న మారుతీ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతానికి పెరిగిందన్న వార్తలతో మారుతీ సుజుకీ దూసుకుపోయింది. ఎల్ అండ్ టీ షేర్ 2.1 శాతం లాభపడి రూ.1,697 వద్ద ముగిసింది. -
సెబీ షాక్తో ఆర్ఐఎల్ డీలా
ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సెబీ షాక్ భారీగానే తాకింది. ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో సంవత్సరంపాటు సెబీ నిషేధంతో సోమవారం ఈ కౌంటర్లో మదుపర్ల అమ్మకాలు భారీగాకొనసాగుతున్నాయి. ఒక దశలో దాదాపు 2 శాతానికి పైగా పతనమైంది. గతం ముగింపుతో పోలిస్తే ఆర్ఐఎల్ షేరు ధర 1.57 శాతం నష్టపోయి 1,266.50 వద్ద బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలోనే బలహీనంగా ఉన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బలహీనంగా మొదలైన మార్కెట్లలో ఆర్ఐఎల్ అమ్మకాల ప్రభావం బాగా కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 29,266వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 9,055 దిగువకు చేరింది. పదేండ్ల క్రితం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో(ఎఫ్ అండ్ వో) మోసపూరిత ట్రేడింగ్కు పాల్పడి మూటగట్టుకున్న రూ.447 కోట్ల సొమ్మును 12 శాతం వార్షిక వడ్డీతో సహా కలిపి వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థకు ఇటీవల సెబీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు నవంబర్ 29, 2007 నుంచి 12 శాతం చొప్పున లెక్కగట్టి సుమారు రూ.500 కోట్లు చెల్లించాలని తెలిపంది. అంటే, ఈ ఆదేశాలతో సంస్థపై దాదాపు రూ.1,000 కోట్లు భారం పడనుంది. ఈ సొమ్మును 45 రోజుల్లో చెల్లించాలని సెబీ హోల్ టైం మెంబర్ మహాలింగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ ఎక్సేంజ్లలో ఈక్విటీ డెరివేటివ్ల ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ ట్రేడింగ్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకుండా రిలయన్స్, మరో 12 కంపెనీలపై ఏడాది కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ పెట్రోలియంను ఇప్పటికే మాతృ సంస్థలో విలీనం చేశారు. ఈ కేసును సెటిల్ చేసుకుందామని గతంలో రిలయన్స్ కోరినప్పటికీ సెబీ నిరాకరించింది. కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సవాల్ చేయనుంది. -
ఒడిదుడుకుల వారం!
► ఈ వారంలోనే ఎఫ్ అండ్ ఓ ముగింపు ► స్వల్పకాలంలో ‘అంతర్జాతీయ’ ప్రభావం ► రిలయన్స్పై సెబీ నిషేధం ప్రతికూలం ► ఐఎండీ అంచనాలు సానుకూలం ► మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే(గురువారం–ఈ నెల 30న) ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో మార్కెట్ దిశను అంతర్జాతీయ సంకేతాలు ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోకడలు.. ఈ అంశాలన్నింటి ప్రభావం కూడా స్టాక్ సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్లో పాల్గొనకుండా మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ నిషేధం విధించడం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. ఎల్నినో ప్రభావం వర్షాకాలం పూర్తయిన తర్వాతనే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)గత శుక్రవారం వెల్లడించడం మార్కెట్కు సానుకూలాంశమని నిపుణులంటున్నారు. సుదీర్ఘ కన్సాలిడేషన్.. మొత్తం మీద మార్కెట్ సుదీర్ఘకాల కన్సాలిడేషన్లోకి వెళుతోందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఇప్పటికే సానుకూల అంశాలన్నింటినీ మార్కెట్ గ్రహించిందని, ఇక మరింత పైకో, లేక కిందకో వెళ్లడానికి ముందు దీర్ఘకాల కన్సాలిడేషన్లోకి ప్రవేశిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్పై ఉంటుందని పేర్కొన్నారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 12న ముగుస్తాయి. మార్చి సిరీస్ డెరివేటివ్స్ ముగియనున్నందున ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ అభ్నిష్ కుమార్ ఆధ్య చెప్పారు. ఒబామాకేర్ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన హెల్త్కేర్ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి తగిన ఓట్లు రావనే అంచనాలతో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారని ఈ ప్రభావం కూడా మన స్టాక్ మార్కెట్పై ఉండనున్నదని వివరించారు.. మరోవైపు వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడ కూడా మన మార్కెట్పై ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి పేర్కొన్నారు. మార్కెట్ పై స్థాయిల్లో ఎంత బలంగా నిలదొక్కు కోగలదో అన్న అంశం కూడా ప్రభావం చూపుతుందని ట్రేడ్బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. మరింత ముందుకే మార్కెట్ ! అత్యంత కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నందున మార్కెట్ జోరు కొనసాగుతుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. ఈ వారంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,000–9,250 పాయింట్ల రేంజ్లో(గత శుక్రవారం నిఫ్టీ 9,108 పాయింట్ల వద్ద ముగిసింది) కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా స్టాక్ సూచీలు గత వారంలో నష్టాలపాలయ్యాయి. గత మూడు వారాల్లో స్టాక్ సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. బీఎస్ఈ సెన్సెక్స్228 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ మన క్యాపిటల్ మార్కెట్లో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ భారీగా విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ.22,268 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.16,177 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో వీరి ఇన్వెస్ట్మెంట్స్ ఈ నెలలో ఇప్పటివరకూ రూ.38,445 కోట్లుగా(584 కోట్ల డాలర్లు) ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.30,994 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.19,818 కోట్లు, వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.50,811 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని బజాజ్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాలా చెప్పారు. గత నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో ఎఫ్పీఐల నికర పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి. -
రిలయన్స్పై సెబీ కొరడా
⇒ ఎఫ్ అండ్ఓలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధం ⇒ రూ.1,300 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో 12 సంస్థలు డెరివేటివ్స్ ట్రేడింగ్లో పాల్గొనకుండా ఏడాది పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐఎల్లో ఆర్పీఎల్ను విలీనం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం ఫ్యూచర్స్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ జరిపారని, ఈ లావాదేవీల్లో ఆర్ఐఎల్, ఇతర 12 సంస్థలు రూ.513 కోట్లు అక్రమ లాభాలు పొందాయని సెబీ ఆదేశాలు పేర్కొన్నాయి. ఇందుకు గాను ఆర్ఐఎల్, మరో 12 ఇతర సంస్థలు ఈక్విటీ డెరివేటివ్స్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకుండా సెబీ హోల్ టైమ్ మెంబర్ జి. మహాలింగమ్ నిషేధం విధించారు. అంతేకాకుండా రూ.513 కోట్ల అక్రమ లాభాలపై ఏడాదికి 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున రూ.1,300 కోట్లు 45 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొన్నారు. సెబీ నిషేధం విధించిన ఇతర 12 సంస్థలు.. గుజరాత్ పెట్కోక్, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్పోల్ ప్లాస్టిక్ ప్రొడక్టŠస్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటెక్ సాఫ్ట్వేర్, దర్శన్ సెక్యూరిటీస్, రెలోజిస్టిక్స్(ఇండియా), రెలోజిస్టిక్స్(రాజస్థాన్), వినమర యూనివర్శల్, ధర్తి ఇన్వెస్ట్మెంట్ . కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో సవాల్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. -
మరింత తగ్గిన రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన కేజీ–డీ6 బ్లాక్లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యించిన దానిలో 9 శాతానికి తగ్గిపోయింది. 2013–15లో 31,793 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్సీఎం) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. అందులో 16% ఉత్పత్తి చేసినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు తెలిపారు. ఈ ఏడాది(2016–17)లో 29,317 ఎంఎస్సీఎం ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. కేవలం 2,642 ఎంఎస్సీఎం మాత్రమే ఉత్పత్తయింది. దీంతో దాదాపు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల రికవరీని ప్రభుత్వం అనుమతించలేదని ప్రధాన్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకి 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ .. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక అమల్లో విఫలమైందని ప్రధాన్ చెప్పారు. -
రిలయన్స్ రూ.51 వేల కోట్ల షేర్ల బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ప్రమోటర్ల కంపెనీల్లో షేర్ హోల్డింగ్ పునరవ్యవస్థీకరణలో భాగంగా బీఎస్ఈలో రూ.51,000 కోట్ల విలువైన సుమారు 39 కోట్ల షేర్లు చేతులు మారాయి. ప్రమోటర్ల కంపెనీల్లో నాలుగు కంపెనీలు 39.6 కోట్ల షేర్లను మరో రెండు కంపెనీల్లోకి బదిలీ చేశాయి. ఆదిశేష్ ఎంటర్ప్రైజెస్, త్రిలోకేశ్ కమర్షియల్స్, అభయప్రద ఎంటర్ప్రైజెస్, తరన్ ఎంటర్ప్రైజెస్...ఈ నాలుగు కంపెనీలు 12.21 శాతం వాటాకు సమానమైన 39.6 కోట్ల షేర్లను దేవరుషి కమర్షియల్స్, తత్వం ఎంటర్ప్రైజెస్కు బదలాయించాయి. ఒక్కో షేర్ సగటు ధర రూ.1,284 చొప్పున ఈ డీల్ విలువ రూ.50,859 కోట్లు. ఇది అంతర్గత బదిలీ అయినందున మొత్తం ప్రమోటర్ల షేర్ హోల్డింగ్లో ఎలాంటి మార్పు ఉండదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ బదిలీ నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.3 శాతం తగ్గి రూ.1,287 వద్ద ముగిసింది. ప్రమోటర్ గ్రూప్లోని 15 సంస్థలు 118.99 కోట్ల షేర్లను ఇదే గ్రూప్లోని మరో 8 సంస్థల్లోకి బదిలీ చేయనున్నాయని ఈ నెల 2న రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్లో చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషాలను కూడా కలుపుకొని మొత్తం 63 ప్రమోటర్ గ్రూపులున్నాయి. ఈ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు ఆర్ఐఎల్లో 45.24 శాతం వాటా (146.39 కోట్ల షేర్లు) ఉంది. ముకేశ్ అంబానీకి ఆర్ఐఎల్లో నేరుగా 36.15 లక్షల షేర్లు, నీతా అంబానీకి 33.98 లక్షలు, ఆకాశ్, ఇషాలకు చెరో 33.63 లక్షలు, అనంత్కు లక్ష చొప్పున షేర్లు ఉన్నాయి. -
రిలయన్స్ బ్లాక్ డీల్
ముంబై: ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రమోటర్ గ్రూపు సంస్థలో బ్లాక్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా సుమారు 10 శాతానికి పైగా వాటాలు చేతులు మారాయి. బీఎస్ఈలో 12.58 శాతం వాటాకు సమానమైన 39.6 కోట్ల షేర్లు ఈ లావాదేవీ ద్వారా ట్రేడయ్యాయి. ప్రతిపాదిత బదిలీలు ప్రమోటర్ గ్రూప్లోనే జరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు మార్చి 2 న 2017 ఆర్ఐఎల్ స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం అందించింది. 'ఇంటర్ సే' బదిలీ ద్వారా 1,190 మిలియన్ షేర్లను ఇతర ప్రమోటర్ గ్రూపు సంస్థలకు బదిలీ జరిగినట్టు తెలిపింది. ఈ డీల్ ప్రకారం 38. 74 శాతం ఓటింగ్ హక్కులు లేదా 36.7 శాతం షేర్ క్యాపిటల్ బదిలీ అయినట్టు. కాగా ఈ బ్లాక్ డీల్ వార్తలతో రిలయన్స్ షేరు 1 శాతానికిపై గా నష్టపోయింది. -
కొనసాగుతున్న రిలయన్స్ దూకుడు
ముంబై: జియో సేవల ఎంట్రీతో తన పూర్వ వైభవాన్ని సంతరించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచీ జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకోనుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ దూకుడుగా ఉంది. తాజాగా ఆర్ ఐఎల్ షేరు ధర రూ .1300 మార్క్ని దాటి మరోసారి 52 వారాల గరిష్ఠానికి చేరింది. గత వారమే 9ఏళ్ల గరిష్టాన్ని తాకిన 3.5 శాతానిపై పైగా లాభపడుతోంది. గత వారం, పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ షేరుకు రూ 1,506 టార్గెట్ను నిర్దేశించింది. మయాంక్ మహేశ్వరీ, రాకేష్ సేథియా, అమృతా పబాల్కర్ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు ఆర్ ఐ ఎల్ మరింత దూసుకుపోనుందని అంచనావేశారు. అటు విదేశీ బ్రోకింగ్ సంస్థలు సీఎల్ఎస్ఏ, బీవోఎఫ్ఏ-ఎంఎల్ ఏడాది కాలానికి ఆర్ఐఎల్ షేరు టార్గెట్ ధరను వరుసగా రూ. 1,500, 1375గా అంచనా వేయగా.. క్రెడిట్స్వీస్ సైతం షేరు టార్గెట్ ధరను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పాజిటివ్ అంచనాల నేపథ్యంలో కొత్త టార్గెట్ ను చేధించే దిశగా పరుగులు తీస్తోంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 4.22 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా అత్యంత విలువైన మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలలో టీసీఎస్ తదుపరి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీసీఎస్ రూ. 4.87 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 21, 2017 నాటి ప్రకటన కంపెనీ షేర్లు కేవలం రెండు వారాల్లో దాదాపు 30శాతం రాబడిని సాధించడం విశేషం. -
కొనసాగుతున్న రిలయన్స్ హవా
ముంబై: మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతోంది. సోమవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు 6 శాతం లాభపడి రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో బలమైన ర్యాలీ తో ఈ షేర్ ధర రూ 1,253.45 వద్ద దాదాపు 9 సంవత్సరాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ తొలిసారి రూ. 4.05 లక్షల కోట్లను దాటింది. 2008 జనవరి 18 తరువాత ఈ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి. వరుసగా నాలుగు సెషన్ల లాభాలతో దాదాపు 17శాతం పుంజుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రెండవస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టిసిఎస్ రూ 4.88 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్తో ప్రథమ స్థానంలో ఉంది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్పై పాజిటివ్ అంచనాలను వ్యక్తం చేస్తోంది. అటు రిలయన్స్ అండతో స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్లు ప్రస్తుతం లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో28,940 వద్ద నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8945వద్ద కొనసాగుతున్నాయి. కాగా ఉచిత 4జీ సేవలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిలయన్స్ జియో ఏప్రిల్ నుంచి అమలుకానున్న టారిఫ్ ప్లాన్లు , వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ అండతో పుంజుకుంటున్న మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభయ్యాయి. మార్చి డెరివేటివ్ సిరీస్ ఆరంభంలో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ పాజిటివ్గా మారాయి. సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో28,940 వద్ద నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8945వద్ద ట్రేడ్అవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్మెరుపులు ఈ రోజుకూడా కొనసాగుతూ మార్కెట్లకు మంచి ఊతమిస్తున్నాయి. ఈ కౌంటర్ 4.4 శాతం లాభపడి 52 వారాల గరిష్టాన్ని నమోదుచేసింది. దీంతోపాటు ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఎనర్జీ , షేర్లు స్వల్ప లాభాలతో, బ్యాకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అరబిందో, విప్రో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాభపడగా, ఐడియా, యాక్సిస్, జీ, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 29 పైసలు బలపడి రూ. 66.68 వద్ద ఉంది. ఎంసీఎక్స్మార్కెట్ లో పది గ్రాపుత్తడి 179 ఎగిసి, రూ. 29,630 వద్ద ఉంది -
రిలయన్స్ ర్యాలీ
⇒ 103 పాయింట్ల లాభంతో 28,865కు సెన్సెక్స్ ⇒ 19 పాయింట్ల లాభంతో 8,927కు నిఫ్టీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు నేడు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 28,865 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,927 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్ 709 పాయింట్లు లాభపడింది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతుండడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇంట్రాడేలో 202 పాయింట్లు లాభం... బీఎస్ఈ సెన్సెక్స్ 28,822 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. ఇంట్రాడేలో 28,964 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 202 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ చివరకు 103 పాయింట్ల లాభంతో 28,865 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర ప్రపంచ మార్కెట్లలాగానే మన మార్కెట్ కూడా లాభపడుతోందని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనజర్(ఈక్విటీస్)కార్తీక్ రాజ్ లక్ష్మణన్ పేర్కొన్నారు. ఐటీ, మీడియా, లోహ, ఫార్మా షేర్లు నష్టపోయాయని, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. 11 షేర్లకు లాభాలు 30 సెన్సెక్స్ షేర్లలో 11 షేర్లు లాభాల్లో, 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం పెరిగింది. ఈ బ్యాంక్ షేర్ 3.9 శాతం లాభపడింది. వొడాఫోన్తో విలీనమైన తర్వాత ఏర్పడే కంపెనీలో 15–20 శాతం వాటాను ఆర్థిక సంస్థలకు విక్రయించనున్నారన్న వార్తల కారణంగా ఐడియా సెల్యులర్ 4 శాతం లాభంతో రూ.112 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్ 2.9 శాతం, కోల్ ఇండియా 2.6 శాతం, హీరో మోటొకార్ప్1.1 శాతం, ఎస్బీఐ 0.4 శాతం, టాటా మోటార్స్0.2 శాతం లాభపడ్డాయి. 9 ఏళ్ల గరిష్ట స్థాయికి రిలయన్స్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డేటా సర్వీసులకు చార్జీలు వసూలు చేయడం ప్రారంభించనున్నామని రిలయన్స్ జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రివ్వున దూసుకుపోయింది. 11 శాతం లాభంతో రూ.1,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 11.3 శాతం ఎగసి రూ.1,212ను తాకింది. రిలయన్స్ షేర్ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడడం ఎనిమిదేళ్లలో ఇదే మొదటిసారి. 2009, మే 18న ఈ షేర్ 21 శాతం లాభపడింది. ఎన్నికల్లో యూపీఏ విజ యం సాధించడంతో ఆ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నిమిషానికే 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకడంతో ఆ రోజుకు ట్రేడింగ్ను పూర్తిగా నిలిపేశారు. ఆ రోజే మిగిలిన హెవీవెయిట్ షేర్లతో పాటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 21 శాతం లాభపడింది. బుధవారం ఈ షేర్ ధర దాదాపు 9 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ముగిసింది. 2008, మే 29 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. 2008, మే 29న ఈ షేర్ రూ.1,233(సవరించిన ధర–2009, నవంబర్లో 26న 1:1 బోనస్ ఇచ్చింది)కు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే రూ.38,761 కోట్లు పెరిగింది. ఇది మరో టెలికం కంపెనీ ఐడియా సెల్యులర్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్తో దాదాపు సమానం. మొత్తం రూ.3,91,745 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో అతి పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న భారత కంపెనీగా అవతరించింది. మొదటి కంపెనీ టీసీఎస్. ఇక డెరివేటివ్స్ సెగ్మెంట్లో కూడా రిలయన్స్ లాభాల బాట పండించింది. రూ. 4.3 ధర ఉన్న రూ.1,100 రిలయన్స్ కాల్ ఆప్షన్(ఫిబ్రవరి సిరీస్) రూ.99 లాభంతో రూ.103.40కు ముగిసింది. అంటే రూ.2,050 పెట్టుబడికి రూ.49,450 లాభం వచ్చినట్లు లెక్క. కానీ ఆ కాల్ ఆప్షన్ విక్రయించిన ట్రేడరు అంతే మొత్తాన్ని నష్టపోతారు. కాగా కోటి మంది వినియోగదారులను 170 రోజుల్లోనే సాధించిన రిలయన్స్ జియో వారిలో కనీసం సగం మందినైనా ఏడాది పాటు అట్టిపెట్టుకోగలిగినా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇబిటా బ్రేక్ఈవెన్కు రాగలదని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. -
రిలయన్స్ షేర్ రూ.2వేలు దాటుతుందా?
ముంబై: జియో బొనాంజా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సుదీర్ఘకాలం తరువాత మెరుపులు మెరిపించి చరిత్ర సృష్టించింది. తద్వారా మార్కెట్ వర్గాలను, విశ్లేషకులు విస్మయపర్చింది. సెన్సెక్స్ 0.36 లాభాలతో సరిపెట్టుకుంటే.. రిలయన్స్ఇడస్ట్రీస్ ఏకంగా 11.17 శాతం లాభపడింది. మంగళవారం నాటి అంబానీ ప్రెస్మీట్ తరువాత బుధవారం మార్కెట్ లో ఆర్ఐఎల్ టాప్ విన్నర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఎనలిస్టులు ఈ షేర్ పెర్ఫామెన్స్ గా సానుకూలంగా మారిపోయారు. అంతేకాదు ఆర్ఐఎల్ మార్కెట్ విలువ కూడా భారీగా పుంచుకుంది. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. 2009 మే 18 తరువాత ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్ 11 శాతం పైగా జంప్చేసి 1,211 వద్ద ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం విశేషం. ఆర్ఐఎల్ షేరు1133 స్థాయియిని బ్రేక్ చేసి దూసుకుపోవడంపై విశ్లేషకులు పాజిటివ్గా స్పందించారు. గత 5,6 ఏళ్లుగా బలహీనంగా రిలయన్స్ కీలక మద్దతుస్తాయి 1200కి స్థాయికిపైన నిలబడటం, ఎంకేజింగ్ గా ఉండటం సంతోషం దాయకమంటున్నారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ హరీష్ కృష్ణన్ జియో కార్యకలాపాల ద్వారా వచ్చిన పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లాభపడిందని చెప్పారు. రాబోయే 18-24 నెలలో ఇది రూ.2 వేల స్థాయిని టచ్ చేస్తుందని ఇండస్ ఈక్విటీస్ డైరెక్టర్ సుశీల్ చాక్సీ తెలిపారు. ఉచిత సేవలనుంచి టారిఫ్ ప్లాన్ లోకి జియో మారడంపై ఎనలిస్టులు పాజిటివ్ గా స్పందించారు. అంబానీ మార్పు స్వాగతించిన విశ్లేషకులు ఇది టెలికం రంగానికి మరింత హేతుబద్ధ పోటీని తీసుకొస్తుందన్నారు. ఇకముందు మరింత వేగంగా దూసుకుపోనుందని పాజిటివ్ గ్లోబల్ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ ఒక నోట్ లోతెలిపింది. రిలయన్స్ జియో టెలికాం కార్యకాలాపాలు తన తొలి సంవత్సరం చివరినాటికి అంచనాలకు మించి రికార్డ్ లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ కౌంటర్లో గత ఏడేళ్లలోలేని విధంగా భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదైంది. దీంతో మార్కెట్ విలువలో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది ఆర్ఐఎల్. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. టీసీఎస్ తరువాత రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా ఇటీవల రెండవ స్థానానికి ఎగబాకిన హెచ్డీఎఫ్సీ బ్యాంకును వెనక్కి నెట్టేసింది. కాగా ఒకపుడు రిలయన్స్ షేర్ ధర స్పందన ఆధారంగా స్టాక్మార్కెట్ కదలికలను అంచనా వేసేవారంటే అతిశయోక్తి కాదు. మరి తాజా మార్పులతో మరోసారి ఆక్రెడిట్ నిలబెట్టుకుంటుందా? వేచిచూడాలి. -
ట్రంప్తో మన ఐటీకి ఊహించని మేలు..!
• దేశీ మార్కెట్పై దృష్టి పెట్టేందుకు అవకాశం • రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలతో దేశీ ఐటీ రంగానికి ఊహించని మేలే జరగవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు దేశీ మార్కెట్లో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు తోడ్ప డగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ట్రంప్ రక్షణాత్మక ధోరణులు భారత ఐటీ రంగంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ట్రంప్ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు. అతి పెద్ద మార్కెట్ అయిన మన దేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమ.. ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటాన్ని పట్టించుకోనవసరం లేదని.. దేశీ పరిశ్రమలు దేశ సామర్థ్యాన్ని పెంపొందించడంపైనే దృష్టి సారించాలని అంబానీ సూచించారు. ప్రస్తుతం డిజిటైజేషన్ ప్రపంచంలో అపార అవకాశాలు ఉన్నాయని వీటిని అందిపుచ్చుకోవాలంటే భాగస్వామ్యాల ద్వారానే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ‘ప్రపంచం మన చుట్టూ అడ్డుగోడలు కట్టేందుకు ప్రయత్నించవచ్చు. కానీ ఆ పరిణామాల గురించి మనం ఆందోళన చెందకుండా ఉండటం ముఖ్యం’ అని ఆయన సూచించారు. ఇప్పటికే పది కోట్ల యూజర్ల మైలురాయి అధిగమించిన రిలయన్స్ జియో ప్రస్తుతం భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉందని అంబానీ తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను ధృవీకరణకు ఆధార్ ఆధారిత విధానాన్ని పాటించడం వల్లే ఈ ఫీట్ సాధ్యపడిందన్నారు. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను కోట్ల మందికి అందుబాటులోకి తేవడం, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకోవాలని అంబానీ సూచించారు. డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ప్రైవసీ, భద్రత, డేటా చౌర్యంపరమైన సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరించగలిగితే అడ్డంకులన్నీ అధిగమించగలమని, సమస్యలన్నింటికీ తగు పరిష్కారాన్ని కనుగొనగలమని చెప్పారు. వెఫల్యాలు ఎదురైనా వెనుతిరగలేదు.. వ్యాపారవేత్తగా విజయం సాధించాలంటే ఇన్వెస్టర్ల సొమ్మును మన డబ్బుకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలని, సరైన టీమ్ ఉండాలని, తక్షణ ప్రయోజనాల ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలని అంబానీ సూచించారు. వ్యాపార విధానాల గురించి తన తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి తొలి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. వ్యాపారాల్లో వైఫల్యాలు సర్వసాధారణమేనని అంబానీ చెప్పారు. తాను కూడా విజయాలు సాధించడానికి ముందు వ్యక్తిగతంగా అనేక వైఫల్యాలు చవిచూశానని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి డేటానే ఇంధనం.. ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత నాలుగో పారిశ్రామిక విప్లవంగా ప్రపంచాన్ని చుట్టేస్తోందని అంబానీ చెప్పారు. దీనికి డేటానే ’కొత్త ఇంధనం’గా మారిందన్నారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవానికి పునాదులు కనెక్టివిటీ, డేటానే. డేటానే మనకినప్పుడు సరికొత్త సహజ వనరు. ఇదే కొత్త ఇంధనంగా మనం కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం’ అని అంబానీ పేర్కొన్నారు. దీనిలో భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి సంబంధించి 2015లో అత్యంత దిగువన 155వ స్థానంలో ఉన్న భారత్ను.. రాబోయే రోజుల్లో టాప్–10లోకి చేర్చేందుకు తమ జియో సేవలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు. నాస్కామ్ వృద్ధి అంచనాలు వాయిదా.. ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక పాలసీ విధానాల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్.. వచ్చే ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలను మే నెలలో ప్రకటించే అవకాశముంది. ‘ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రంగ అంచనాలను వచ్చే త్రైమాసికంలో అంటే దాదాపుగా మే నెలలో ప్రకటిస్తాం. కస్టమర్లు, పరిశ్రమ సంబంధిత నిపుణులతో లోతుగా చర్చించాల్సి ఉంది’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ట్రంప్ అక్కడ పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొస్తుండటంతో పలు సవాళ్లు ఎదురుకానున్నాయని తెలిపారు. అదేవిధంగా గ్లోబల్ ఐటీ వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు వృద్ధితో 5%కి చేరుతాయనే అంచనాలు సానుకూల అంశమన్నారు. నాస్కామ్ 2016–17 ఏడాది ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 10–12% నుంచి 8–10%కి సవరించింది. హెచ్1బీ వీసాలపై ఆందోళన వద్దు: టీసీఎస్ చంద్రశేఖరన్ హెచ్1బీ వీసా సమస్యలను గోరంతలు కొండంతలుగా చేయడం జరుగుతోందని ఐటీ దిగ్గజం టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. 155 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ పరిశ్రమ దీనిపై అనవసర ఆందోళనలకు లోను కావొద్దని, ఇప్పుడు కూడా అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణపరమైన మార్పులు ఏ కాస్త జరిగినా.. లేదా ఏ చిన్న సవాలు ఎదురవ్వొచ్చని అనిపించినా.. మన పరిశ్రమ.. అంతా కూడా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది’ అని గోరంతలు కొండంతలుగా చెప్పుకోవడం జరుగుతోంది. అది హెచ్1బీ వీసాల విషయం కావొచ్చు లేదా మరోటి కావొచ్చు’ అని చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ప్రాథమికంగా ప్రతి వ్యాపారానికి టెక్నాలజీనే ఊతం కానున్న నేపథ్యంలో సాంకేతికతకు అవకాశాలు.. డిమాండ్ గణనీయంగానే ఉండగలదని ఆయన చెప్పారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్
• క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం • రూ.8,022 కోట్లు; 10 శాతం వృద్ధి • ఆదాయం 9 శాతం అప్; రూ.66,606 కోట్లు • స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.8 డాలర్లు భావిభాతర అవసరాలకు అనుగుణంగా అనుసంధానమైన మా వ్యాపార విభాగాలు, అత్యుత్తమ నిర్వహణ ప్రక్రియలతో మరోసారి రికార్డు పనితీరును సాధించాం. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులను దీటుగా ఎదుర్కొన్నాం. రిఫైనింగ్ వ్యాపారం దూసుకెళ్తోంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ జీఆర్ఎంలో రెండంకెల వృద్ధిని సాధించాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరగడం ఈ జోరుకు దోహదం చేస్తోంది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరోసారి రికార్డు స్థాయిలో లాభాల మోతమోగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ స్టాండెలోన్(కీలకమైన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, మార్కెటింగ్ వ్యాపారం) ప్రాతిపదికన రూ.8,022 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,296 కోట్లతో పోలిస్తే.. 10 శాతం వృద్ధి చెందింది. వ్యయాలు పెరిగినప్పటికీ.. ఇతర ఆదాయం భారీగా ఎగబాకడం లాభాల జోరుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం క్యూ3లో రూ.66,606 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.61,125 కోట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్గా ఇలా... అనుబంధ సంస్థలతో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) చూస్తే రిలయన్స్ క్యూ3లో రూ.7,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 7,245 కోట్లతో పోలిస్తే 3.6 శాతం వృద్ధి చెందింది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 16.1 శాతం వృద్ధితో రూ. 72,513 కోట్ల నుంచి రూ.84,189 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చిచూస్తే(సీక్వెన్షియల్గా) స్టాండెలోన్ లాభం 4.1 శాతం, ఆదాయం 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఇక కన్సాలిడేటెడ్ లాభం సీక్వెన్షియల్గా 4.1 శాతం, ఆదాయం 3.1 శాతం చొప్పున వృద్ధి చెందాయి. జీఆర్ఎం పెరిగింది... రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) మూడో త్రైమాసికంలో 10.8 డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ క్వార్టర్లో 10.1 డాలర్లతో పోలిస్తే వృద్ధి సాధించింది. అయితే, క్రితం ఏడాది మూడో క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లతో పోలిస్తే తగ్గింది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్ఎంగా వ్యవహరిస్తారు. కాగా, సింగపూర్ ప్రామాణిక జీఆర్ఎం డిసెంబర్ క్వార్టర్లో సీక్వెన్షియల్గా 5.1 డాలర్ల నుంచి 6.7 డాలర్లకు పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ క్యూ3లో రిఫైనింగ్, మార్కెటింగ్ విభాగం ఆదాయం 7.5 శాతం వృద్ధితో రూ.61,693 కోట్లకు చేరింది. అయితే, స్థూల లాభం మాత్రం 4.3 శాతం క్షీణించి రూ.6,194 కోట్లుగా నమోదైంది. ⇔ పెట్రోకెమికల్స్ ఆదాయం 17.8% వృద్ధితో రూ.22,854 కోట్లకు చేరింది. స్థూల లాభం 3.4% తగ్గి రూ.3,301 కోట్లుగా నమోదైంది. ⇔ ఇక చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారం ఆదాయం క్యూ3లో 31 శాతం క్షీణించి.. రూ.1,762 కోట్ల నుంచి రూ. 1,215 కోట్లకు పడిపోయింది. గతేడాది క్యూ3లో రూ.258 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించగా.. ఈసారి రూ.295 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ⇔ కేజీ–డీ6 క్షేత్రాల్లో ఉత్పత్తి డిసెంబర్ క్వార్టర్లో 0.26 మిలియన్ బ్యారెల్స్(ఎంఎంబీబీఎల్)కు, సహజవాయువు ఉత్పత్తి 24.4 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్)కు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఉత్పత్తి వరుసగా 28 శాతం, 29 శాతం చొప్పున దిగజారింది. ⇔ పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రభావం ఉన్నప్పటికీ... క్యూ3లో రిలయన్స్ రిటైల్ విభాగం ఆదాయం ఏకంగా 47.2% ఎగబాకి రూ.5,901 కోట్ల నుంచి రూ. 8.688 కోట్లకు ఎగబాకింది. ఇక స్థూల లాభం 41% ఎగసి రూ.237 కోట్ల నుంచి రూ.333 కోట్లకు ఎగసింది. ⇔ ఇతర ఆదాయం రూ.2,440 కోట్ల నుంచి రూ.2,736 కోట్లకు చేరింది. ⇔ డిసెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణం రూ.1,94,381 కోట్లకు పెరిగింది. సెప్టెబర్ నాటికి రుణభారం రూ.1,89,132 కోట్లుగా ఉంది. ఇక కంపెనీవద్ద నగదు, తత్సబంధ నిల్వలు డిసెంబర్ నాటికి రూ.82,533 కోట్ల నుంచి రూ.76,339 కోట్లకు తగ్గాయి. ⇔ డిసెంబర్ చివిరినాటికి టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ⇔ కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1.21 శాతం క్షీణించి రూ.1,077 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రూ. 30 వేల కోట్ల రైట్స్ ఇష్యూ... ముంబై: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.30 వేల కోట్ల మేర నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్ సోమవారం ప్రకటించింది. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీద్వారా దీన్ని పూర్తిచేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను జియో సేవల విస్తరణకోసం వినియోగిస్తామని వివరించింది. రూ.10 ముఖ విలువగల ఒక్కో డిబెంచర్పై 9 శాతం వడ్డీరేటును కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
ఇది ‘భారతీయ శకం’ కావాలి
యువతకు ముకేశ్ పిలుపు • ముంబై వర్సిటీ 160వ స్నాతకోత్సవంలో ప్రసంగం ముంబై: భారత శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో చాటిచెప్పేందుకు దేశంలోని యువత, విద్యార్థులు పాటుపడాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దాన్ని ‘భారతీయ శకం’గా మార్చేందుకు కృషిచేయాలని కోరారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, యంత్రాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మానవీయ కోణం మాత్రం కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ముంబై విశ్వవిద్యాలయం 160వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ముకేశ్ ఈ వ్యాఖ్య లు చేశారు. ‘మానవ చరిత్రలో ప్రపంచం ఇప్పుడు మౌలికంగా కొత్త దశలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రిక ఉత్పాదకత కోసం నీరు, ఆవిరి శక్తిని ఉపయోగించుకున్నారు. ఆతర్వాత విద్యుత్ శక్తితో భారీస్థాయి ఉత్పాదకతను సాధించగలిగాం. ఇక మూడో పారి శ్రామిక విప్లవంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ వినియోగం కీలకంగా నిలిచాయి. ఇప్పుడు నడుస్తున్న నాలుగోది.. డిజిటల్ విప్లవం. దీనిద్వారా భౌతిక, డిజిటల్, బయలాజికల్ ఆవరణాల మధ్య నెలకొన్న తెరలన్నీ కలగలిసిపోతున్నాయి. ఒక సరికొత్త ప్రపంచం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. గతంతో పోలిస్తే ఇది చాలా విభిన్నమైనది’ అని అంబానీ పేర్కొన్నారు. ప్రపంచం మీ మునివేళ్లపై... ‘ఇప్పుడు మనమంతా సాంకేతిక విప్లవం ముంగిట్లో నిలుచున్నాం. ప్రజల జీవన గమనం, ఇతరులతో మన సంబంధాలు, పనితీరుకు సంబంధించి మూలాలను ఇది మార్చేయనుంది. ఉదాహరణకు కొత్త పరిజ్ఙానాల ఆధారంగా పుట్టుకొచ్చిన కొన్ని వ్యాపారాలన్నీ రాత్రికిరాత్రే ఆవిర్భవించాయి. పదేళ్లక్రితం వాటిని మనం ఊహించలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు ఈ వ్యాపారాలు బహుళజాతి కార్పొరేట్ దిగ్గజాలుగా విస్తరించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి చేరాయి. భవిష్యత్తులో ప్రపంచ జీడీపీలో 65 శాతం గడిచిన రెండు దశాబ్దాల్లో పురుడుపోసుకున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన వ్యాపారాల ద్వారానే సమకూరనుంది. గడిచిన 300 ఏళ్ల నాగరికతలో ప్రపంచం సాధించినదాని కంటే మరెంతో ప్రగతిని వచ్చే 30 ఏళ్లలోనే మనం చూడబోతున్నాం’ అన్నారు. మానవ చరిత్రలో నిజమైన చరిత్రాత్మక దశలో ప్రస్తుత తరం పట్టభద్రులవుతున్నారని... ఇదే అత్యంత విద్యావంతమైన తరమని అంబానీ పేర్కొన్నారు. ‘ప్రపంచం ఇప్పుడు మీ మునివేళ్లపై ఆవిష్కృతమవుతోంది. అవకాశాలు కోకొల్లలు. అయితే, మానవీయ కోణంలోనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉంది. ఇప్పటికీ కోట్లాది మంది సరైన తిండి, నీరు, ఇళ్లు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఈ సవాళ్లను అధిగమించి ఒక సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి అందరూ పాటుపడాలి’ అని ముకేశ్ విద్యార్థులకు సూచించారు. ముంబై వర్సిటీలోనే తాను కెమికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నానని.. 4 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటానని ఎన్నడూ ఊహించలేదని అంబానీ వ్యాఖ్యానించారు. -
దూసుకుపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
వరుసగా ఏడో త్రైమాసికంలోనూ ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో దూసుకుపోయి రూ.8,022 కోట్ల లాభాలను నమోదుచేసింది. రిఫైనింగ్ మార్జిన్లలో మంచి లాభాలను ఆర్జించడంతో గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో స్వతంత్ర నికర లాభాలను రూ.8,022 కోట్లకు పెంచుకోగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం కంపెనీ రూ.7,856 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. ఫలితాల్లో ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది. మార్కెట్ అవర్స్ అనంతరం రిలయన్స్ ఫలితాలు వెల్లువడ్డాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్ 1.3 శాతం పడిపోయి రూ.1,077 వద్ద ముగిసింది. టెలికాం సేవలందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ సబ్స్క్రైబర్ బేస్ కూడా డిసెంబర్ 31 వరకు 7 కోట్ల మార్కును చేధించినట్టు కంపెనీ తెలిపింది. 90 శాతం కంటే ఎక్కువ జనాభాను జియో ఆపరేషన్లను త్వరలోనే కవర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా రిలయన్స్ జియో పేరొందుతోంది. వరుసగా ఎనిమిది త్రైమాసికాల నుంచి కంపెనీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లను రెండంకెల సంఖ్యలో నమోదుచేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. గ్లోబల్గా వస్తున్న డిమాండ్తో జీఆర్ఎమ్లు గణనీయమైన వృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. యేటికేటికి కంపెనీ మొత్తం ఆదాయాలు సుమారు 10 శాతం పెరిగి రూ.69,631 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరం ఇదే కాలంలో రూ.63,406 కోట్ల ఆదాయాలను కంపెనీ ఆర్జించింది. -
కార్పొరేట్ ఫలితాలతో మార్కెట్ ట్రెండ్..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో వంటి బ్లూ చిప్ కంపెనీలు ఈ వారంలో వెల్లడించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మన స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం గమనం.... తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. ఫలితాలే కీలకం... ఎలాంటి దేశీయ ప్రధాన సంఘటనలేమీ లేనందున ఈ వారంలో వెలువడే ఆల్ట్రాటెక్ సిమెంట్(ఈ నెల17న-సోమవారం), హిందుస్తాన్ జింక్(బుధ-ఈ నెల19న), రిలయన్స్ ఇండస్ట్రీస్, యస్ బ్యాంక్(గురు-ఈ నెల20న), ఏసీసీ, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కెయిర్న్ ఇండియా(శుక్రవారం-ఈ నెల21న) కంపెనీల ఆర్థిక ఫలితాలు.. స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పెట్రో ఇంధన ధరల పెంపు నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభమైనందున ఫలితాలు వెల్లడించే కంపెనీలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ అబ్నిష్ కుమర్ సుధాంశు పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలు, యూరోజోన్కు సంబంధించిన పరిణామాలపై కూడా ఇన్వెస్టర్ల కన్ను ఉంటుందని వివరించారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, ట్రంప్ల మద్య మూడవది, చివరి చర్చా కార్యక్రమం ఈ బుధవారం(ఈ నెల19న) జరగనున్నది. సోమవారం(ఈ నెల17న) అమెరికా సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, బుధవారం(ఈ నెల19న) చైనా క్యూ3 జీడీపీ, ఐఐపీ, రిటైల్ అమ్మకాల సంబంధిత గణాంకాలు వెలువడుతాయి. గురువారం (ఈ నెల 30న) ఈసీబీ గవర్నింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. జోరు తగ్గిన విదేశీ పెట్టుబడులు ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ.6,000కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల రెండు వారాల్లో స్టాక్ మార్కెట్లో కేవలం రూ.180 కోట్ల నికర పెట్టుబడులు మాత్రమే పెట్టారు. ఆర్బీఐ ఇటీవల రేట్ల కోత కారణంగా బాండ్ ఈల్డ్లపై ప్రతికూల ఒత్తిడి కారణంగా డెట్ మార్కెట్ ఆకర్షణీయంగా లేదని ఎస్ఏఎస్ ఆన్లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ చెప్పారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన జియో!
ఫ్రీ ఇంటర్నెట్ అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సిమ్ సర్వీస్ జియో. మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే జియో అంచనాలకు మించి యూజర్లను సంపాదించుకుంది. కేవలం నెలరోజుల్లోనే 16 మిలియన్ల(1.6 కోట్లు) మంది సబ్ స్క్రైబర్స్ (యూజర్లు)ను సొంతం చేసుకుని జియో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు. ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ కూడా ఈ స్థాయిలో యూజర్లను తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని ముఖేశ్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, కస్టమర్ల కోసం తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. (చదవండీ: జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!) జియో వెలకమ్ ఆఫర్ అంటూ మై జియో యాప్ ద్వారా ప్రోమోకోడ్ పొందిన కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో జియో సిమ్స్ తీసుకోవచ్చు. డిసెంబర్ 31వరకూ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్రీ ఇంటర్ నెట్ బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ సౌకర్యాలతో మార్కెట్లోకి వచ్చిన జియో సర్వీస్ కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వాయిస్ కాల్స్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా జియోకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆగస్టులోనే మార్కెట్లోకి ట్రయల్ వర్షన్ అంటూ జియో సిమ్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా లాంచ్ చేశారు. 50 మిలియన్ల కస్టమర్లు లక్ష్యంగా పెట్టుకున్న జియో ప్రాజెక్టులో ఇప్పటికే 16 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతుంది. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 106.48 పాయింట్ల లాభంతో 28,399 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31.35 పాయింట్ల లాభంలో 8,776 వద్ద ట్రేడ్ అవుతోంది.అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు ఆయిల్, గ్యాస్, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సూచీల్లో కొనుగోలు మద్దతు కొనసాగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలను పండిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్పొలు సెన్సెక్స్లో టాప్లో నడుస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేడు మార్కెట్లో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.334కు 1.5 శాతం డిస్కౌంట్తో రూ.329గా స్టాక్ ప్రారంభమైంది. అంటే దాదాపు 2 శాతం పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెంచడానికి ఉత్పత్తిని తగ్గిస్తామని ఓపెక్ సభ్యులు నిర్ణయించడంతో ఆసియన్ స్టాక్స్ గురువారం ట్రేడింగ్లో లాభాలను రాణిస్తున్నాయి. మరోవైపు ఓపెక్ సభ్యుల ఒప్పందం యూఎస్ స్టాక్స్కు మద్దతు పలికింది. డోజోన్స్ ఇండస్ట్రియల్, ఎస్ అండ్ పీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. -
మార్కెట్లో రిలయన్స్ మెరుపులు
ముంబై: అతిపెద్ద ప్రైవేటు సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మార్కెట్లో దూసుకుపోతోంది. ఒక వైపు సోమవారం నాటి ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండగా రిలయన్స్ షేర్లు హై వాల్యూమ్స్ తో మెరుపులు మెరిపిస్తోంది. గత 14 ట్రేడింగ్ సెషన్స్లో వరుసగా 10 సెషన్స్ లో భారీ లాభాలను నమోదు చేస్తూ ఏడు సంవత్సరాల గరిష్టాన్ని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.42 శాతం లాభాలతో ఇంట్రాడేలో రూ.1,122 కు ఎగిసింది. ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ..టెలికాం జియో సేవలను ప్రకటించిన తరువాత నిఫ్టీ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 5 తరువాత నిఫ్టీతో పోలిస్తే రిలయన్స్11శాతం జంప్ చేయగా, నిఫ్టీ ఫ్లాట్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం ఆర్ఐఎల్ టాప్ టెన్ ప్రపంచ చమురు కంపెనీల మధ్య ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అటు స్టాక్ మార్కెట్లు 329 పాయింట్ల భారీ నష్టంతో, నిఫ్టీ వంద పాయింట్లు పతనమై 88 వేల దిగువకు పడిపోయింది. , -
ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?
ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్నీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ముఖ్యమైన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కంపెనీలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతిభ గల టాప్ వంద మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. సగటున రెండుకోట్ల జీతం తీసుకుంటున్నఉద్యోగులకు వారి వేతనాల్లో 10-15శాతం మేరకు సంస్థ షేర్ల రూపంలో అందించనున్నారు. లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ అని పేరు పెట్టిన ఈ పథకం ప్రకారం సగటున రూ .2 కోట్ల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకాలు రిలయన్స్ అందించనుందని సంస్థకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 20-30 లక్షల విలువ చేసే షేర్లను ఆయా ఉద్యోగులకు ఎలాట్ చేయనుంది. దీనికి నిర్దేశించిన కాలపరిమితి మూడు సంవత్సరాలు పూర్తికాగానే ఈ ఎలాట్ మెంట్ ఉంటుంది. ఈ బోనస్ సంస్థలో టాప్ 100 ఉద్యోగులకోసమే మాత్రమే ఉద్దేశించబడిందనీ, ఇతర స్థాయిల్లో ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అయితే ఈ వార్తలపై రిలయన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ వార్తలను ధృవీకరించిన సంస్థ ఉన్నతోద్యోగి ఎలాంటి షేర్లను కేటాయించాలి అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. రిలయన్స్ లాంటి షేర్లను కేటాయిస్తామంటే ఎవరు మాత్రం కాదంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ లాభాలను, సంపదను ఉద్యోగులకు పంచి ఇచ్చే సాంప్రదాయం రిలయన్స్ గ్రూపునకు కొత్త అని మరో ఆర్ఐఎల్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇది సంస్థ వ్యాపారవృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా సాధారణంగా ఐటీ, ఈ కామర్స్ రంగాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. టాప్ లెవల్ ఉద్యోగుల రాజీనామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు వెలుగులోకి వస్తాయని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి. గత రెండేళ్లకాలంలో ఆర్ఐఎల్ ఉన్నతోద్యోగులు సంస్థకు రాజీనామా చేయడం ఈ పథకానికి దారి తీసి వుండొచ్చని అంచనా వేశారు. -
ప్రపంచ టాప్-10 చమురు కంపెనీల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 ఎనర్జీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది ఇది 14వ స్థానంలో ఉండేది. ప్లాట్స్ నిర్వహించిన ‘టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలు-2016’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఆయిల్ కార్ప్ 66వ స్థానం నుంచి 14 స్థానానికి ఎగబాకింది. ఇక హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ 133వ స్థానం నుంచి 48వ స్థానానికి చేరింది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటమే వీటి స్థానాల మెరుగుదలకు కారణమని ప్లాట్స్ పేర్కొంది. ఓఎన్జీసీ స్థానం మాత్రం 17 నుంచి 20కి పడింది. కోల్ ఇండియా 38వ స్థానంలో ఉంది. ఇక అదాని పవర్ 250వ స్థానంలో నిలిచింది. -
రిలయన్స్ పరిహారం ఇవ్వాల్సిందే!
ఏడేళ్లుగా ఓఎన్జీసీ గ్యాస్ను రిలయన్స్ తోడుకుంది... * కేంద్రానికి జస్టిస్ ఏపీ షా కమిటీ సమగ్ర నివేదిక * భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సూచనలు * ఓఎన్జీసీ కోల్పోయిన గ్యాస్ విలువ రూ.11 వేల కోట్లు..! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో గ్యాస్ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన బ్లాక్ల నుంచి రిలయన్స్ ఆర్ఐఎల్ గత ఏడేళ్లుగా గ్యాస్ను తోడేసుకున్నట్లు జస్టిస్ ఏపీ షా కమిటీ తేల్చిచెప్పింది. ఇందుకుగాను ఓఎన్జీసీకి నష్టపరిహారాన్ని ఆర్ఐఎల్ చెల్లించాలని బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సమర్పించిన సమగ్ర నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన సూచనలను కూడా నివేదికలో కమిటీ పొందుపరిచింది. కేజీ బేసిన్లో ఆర్ఐఎల్ తమ బ్లాక్ల నుంచి అక్రమంగా గ్యాస్ను తరలించేస్తోందంటూ ఓఎన్జీసీ ఆరోపణలు చేయడంతో కేంద్రం ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కేజీ బేసిన్లో ఓఎన్జీసీకి ఉన్న గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్లు ఆర్ఐఎల్కు ఉన్న కేజీ-డీ6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009, ఏప్రిల్ 1 నుంచి 2015, మార్చి 31 మధ్య కాలంలో ఆర్ఐఎల్ కేజీ-డీ6కు 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్ఎం గతేడాది నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ.11,055 కోట్లు)గా లెక్కగట్టింది. తమ బ్లాక్ల నుంచి ఆర్ఐఎల్ క్షేత్రాలకు గ్యాస్ తరలిపోతోందని 2013లో గుర్తించిన ఓఎన్జీసీ.. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిహారం ఇప్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఓఎన్జీసీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఈ వివాదంపై స్వతంత్ర కన్సల్టెంట్ సంస్థ నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి నిర్దేశించింది. అయితే, పీఎస్సీ ప్రకారమే తాము నడుచుకున్నామని, కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే బావుల తవ్వి ఉత్పత్తి చేపట్టినట్లు ఆర్ఐఎల్ చెబుతూవస్తోంది. నెలరోజుల్లో తగిన నిర్ణయం: ప్రధాన్ నివేదికలో అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించిన జస్టిస్ షా... అన్ని అంశాలతో సమగ్రంగా దీన్ని కేంద్రానికి ఇచ్చినట్లు చెప్పారు. పెట్రోలియం శాఖ భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో సూచించామన్నారు. ‘గ్యాస్ తరలింపు అంశంపై జస్టిస్ షా సమగ్ర నివేదికను ఇచ్చారు. నెల రోజుల్లో దీనిపై పెట్రోలియం శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశానికి సంబంధించి స్వతంత్ర సంస్థ డీఅండీఎం ఇచ్చిన నివేదిక(ఇది కూడా ఓఎన్జీడీ గ్యాస్ ఆర్ఐఎల్ బావుల్లోకి తరలిపోయిందని తేల్చింది) మాదిరిగానే షా కమిటీ కూడా తరలింపు జరిగినట్లు తేల్చిందా అన్న ప్రశ్నకు ప్రధాన్ అవుననే సమాధానమిచ్చారు. ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్సీ) ప్రకారం గ్యాస్ తరలింపు కారణంగా తలెల్తే ఆర్థిక, న్యాయపరమైన అంశాలన్నింటినీ షా కమిటీ నివేదికలో వివరించిందని, తాము దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బయటపెడతామని ఆయన వెల్లడించారు. -
రేపు వెల్లడికానున్న జియో భవిష్యత్
ముంబై : టెలికాం కంపెనీల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళిక గురువారం వెల్లడికానుంది. రేపు జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్లాన్ వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న టారిఫ్ ప్లాన్ వివరాలు ఈ సమావేశంలో ముకేశ్ వివరించనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.ఎల్వైఎఫ్ వంటి ప్రత్యేక కేటిగిరీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ టారిఫ్ ప్యాకేజీలను ప్రకటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే జియో గుబులుతో రేట్లలో భారీగా కోత విధిస్తున్న టెలికాం పరిశ్రమ ఈ టారిఫ్ వివరాలపై ఎక్కువగా దృష్టిసారించింది. అదేవిధంగా టారిఫ్ ప్లాన్స్ కు సంబంధించిన వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కు కూడా త్వరలోనే ఫైల్ చేయాలని జియో భావిస్తోంది. అయితే ఈ సమావేశంలో వెల్లడించబోయే టారిఫ్ వివరాల్లో ఎల్వైఎఫ్ కస్టమర్లకు స్పెషల్ ప్లాన్స్ అందనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎక్స్క్లూజివ్గా ఎల్వైఎఫ్ కస్టమర్లతో పాటు లీడింగ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు జియో తన ప్రీవ్యూ ఆఫర్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్వైఎఫ్ హ్యాండ్ సెట్ విక్రయాలను పెంచి, భారత్ టాప్ -3 బ్రాండ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ టారిఫ్ ప్లాన్స్ను ఈ ఫోన్లకు అందించాలని ముకేశ్ భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలోనే జియో కమర్షియల్ లాంచింగ్ ఆపరేషన్ తేదీలు కూడా వెల్లడికానున్నాయట. ఈ ప్రతిపాదిత లాంచింగ్ తేదీ వివరాలు కేవలం ముకేశ్ అంబానీకి, కీ ఎగ్జిక్యూటివ్లకు మాత్రమే తెలుసని కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. . -
ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!
ముంబై: ‘జియో’ ఫోన్లే వాడాలని తమకు ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) సూచింది. ప్రస్తుతం ఇతర సెల్ఫోన్ సంస్థల సేవలు వాడుతున్న ఉద్యోగులు 'జియో'కు మారాలని రిల్ కోరింది. ఎయిర్ టెల్, వొడా ఫోన్ లాంటి ఇతర ఆపరేటర్ల సర్వీసులు వాడుతున్న రిలయన్స్ ఉద్యోగులు తమ సొంత కంపెనీ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన హైస్పీడ్ 4జీ జియోకు మారాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు వాణిజ్య సంస్థ అయిన 'రిల్'లో 40 వేల మందిపైగా ఉద్యోగులున్నారు. 'మన కంపెనీ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ఫోన్ కనెక్షన్లు జియోకు మార్చుకోవాల్సిన అవసరముంద'ని రిలయన్స్ ఉద్యోగులకు రాసిన లేఖలో హెచ్ ఆర్ విభాగం పేర్కొంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్ పీ) ద్వారా ఆపరేటర్ ను మార్చుకోవచ్చని సూచించింది. అంతేకాదు ఎంఎన్ పీకి బంధించిన విధానాన్ని స్టెప్-బై-స్టెప్ ఉద్యోగులకు వివరించింది. కాగా, జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని రిల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 సర్వీస్ ఏరియాల ద్వారా 18వేల పట్టణాలు, 2 లక్షలకుపైగా గ్రామాల్లో జియో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. -
‘స్కాచ్ అండ్ సోడా’తోరిలయన్స్ బ్రాండ్స్ భాగస్వామ్యం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్స్టర్డామ్కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. రిలయన్స్ బ్రాండ్స్ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో ‘స్కాచ్ అండ్ సోడా’ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది 2017 నాటికి పూర్తవుతుంది. అలాగే రిలయన్స్ బ్రాండ్స్ ఈ ఫ్యాషన్ బ్రాండ్కు చెందిన ప్రొడక్ట్లను దేశంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ‘స్కాచ్ అండ్ సోడా’కు అంతర్జాతీయంగా 160 స్టోర్లున్నాయి. భారత్ వంటి ప్రధానమైన మార్కెట్లో తమ బ్రాండ్ మరింత మందికి చేరువ చేయడానికి రిలయన్స్తో ఒప్పందం దోహదపడుతుందని ‘స్కాచ్ అండ్ సోడా’ సీఈవో డిర్క్ జాన్ స్టోఫెలెన్బర్గ్ తెలిపారు. ప్రీమియం రిటైల్ మార్కెట్లో వృద్ధికి ఈ భాగస్వామ్యం తమకు ఉపయోగపడుతుందని రిలయన్స్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ దర్శన్ మెహ్తా పేర్కొన్నారు.