Sakshi Interview
-
రాగిముద్ద, జొన్న సంకటితో అందరికీ ఆరోగ్యం
కర్నూలు (హాస్పిటల్): ‘ఇటీవలి కాలంలో చాలా మంది యువత అర్ధాంతరంగా మరణిస్తున్నారు. కొందరు నడుస్తూ.. మరికొందరు ఆడుతూ పాడుతూ, ఇంకొందరు జిమ్ చేస్తూ తనువు చాలిస్తున్నారు. దీనికంతటికీ కారణం వారిలో అంతర్లీనంగా కొవ్వు నిల్వలు పెరిగి పోవడమే. వారికి తెలియకుండానే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరిగిపోతోంది.దీనికి చెక్ పెట్టకపోతే దేశంలో అధిక శాతం బీపీ, షుగర్, గుండె జబ్బులతో బాధపడే వారే కనిపిస్తారు’ అని హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోమా హెల్త్కేర్ సెంటర్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సురేంద్ర నెహ్రూ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంఈ, ఆలుమ్ని మీట్కు హాజరైన ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..తెలియకుండానే కొవ్వు నిల్వలుసాధారణంగా మనిషి బరువెక్కితే పొట్ట భాగంతో పాటు కాళ్లు, చేతులు కూడా లావు కావాలి. కానీ పొట్ట మాత్రమే లావుగా ఉండి, కాళ్లూ.. చేతులు సన్నగా ఉంటున్నాయి. దీని కారణంగా పొట్ట చుట్టు కొలత పెరిగిపోతోంది. సాధారణంగా మనిషి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18 లోపు ఉంటే తక్కువగా ఉన్నట్లు. 35 పైన ఉంటే హై, 45 పైన ఉంటే సివియర్ హైగా ఉన్నట్లు గుర్తించాలి. మన దేశంలో ఎక్కువ మంది 60–80 కిలోల బరువు ఉంటున్నారు. సగటు ఎత్తు 5.5 అడుగులు.ఈ ఎత్తుకు ఆ బరువు ఎక్కువ. మన దేశంలో 1977కు ముందు ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే స్థూలకాయులుండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వంద మందిలో 20కి చేరింది. పొట్ట చుట్టు కొలత 33 ఇంచులు దాటితే వారికి భవిష్యత్లో బీపీ, షుగర్, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు కూడా మనవాళ్లు బియ్యమే అన్నం వండుకుని తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పట్లో దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.వరికి దిగుబడి తక్కువగా వచ్చేది. వరికి జీన్ మార్పిడి చేయడం వల్ల దిగుబడి పెరిగింది. ఇప్పుడు యంత్రాల ద్వారా పాలిష్ పట్టుకుని తింటున్నారు. దీనివల్ల బియ్యంలో నాణ్యత దెబ్బతింటోంది. దీనివల్లే స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి భవిష్యత్లో బీపీ, షుగర్, గుండె జబ్బులు అధికం అవుతున్నాయి.మందుల కంటే ఆహారమే ముఖ్యంస్వాతంత్య్రానికి పూర్వం మనవాళ్లు రోజుకు వెయ్యి గ్రాముల ఫైబర్ తినేవారు. కానీ ఇప్పుడు 100 గ్రాములు కూడా తినడం లేదు. ఇప్పటి అవసరాలకు రోజుకు కనీసం 500 గ్రాములైనా ఫైబర్ తినాలి. ఒకప్పుడు రాయలసీమలో తినే ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఎంతో మేలు చేస్తాయి. రాగుల ద్వారా చేసే సంకటి (రాగిముద్ద), సజ్జలు, కొర్ర బియ్యం, దంపుడు బియ్యం, దొడ్డు బియ్యంతో చేసిన ఆహారాలు వ్యాధులను తగ్గిస్తాయి. రోజుకు 7–8 గంటల నిద్రతోపాటు కనీసం నాలుగైదు కిలోమీటర్లు నడవాలి.మోకాళ్ల నొప్పులున్న వారు స్విమ్మింగ్ ఫూల్లో నడిచినా, ఈత కొట్టినా సరిపోతుంది. ఇసుకలో చెప్పులు లేకుండా నడిస్తే మోకాళ్ల నొప్పులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. షుగర్కు ఇప్పుడు కొత్త కొత్త మందులంటూ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికం అవుతాయి. ముఖ్యంగా హోమియో స్టాసిస్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్ టెస్ట్ (హోమా) చేయించుకోవాలి. దీనివల్ల భవిష్యత్లో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. -
పత్తి తీసే యంత్రం రెడీ!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.పత్తి తీతలో 95% సామర్థ్యంట్రాక్టర్కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.అనువైన వంగడాల లేమి!పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు. -
తొలి కల నెరవేరింది
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను. ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన? 2023లో జరిగిన ప్రపంచకప్లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్కప్నకు ముందు ఎలాంటి సాధన చేశారు? కెరీర్లో అత్యధికంగా హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది. జట్టు సభ్యులతో మీ అనుబంధం? చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఈ వరల్డ్కప్లో మీకు అప్పగించిన బాధ్యతలు? ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం. గత ప్రపంచకప్నకు, ఈ వరల్డ్కప్నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి? 2023లో జరిగిన ప్రపంచకప్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి. మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది? కేవలం ఈ ప్రపంచకప్లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. టోర్నీలో త్రిష గణాంకాలు మ్యాచ్లు 7 ఇన్నింగ్స్లు 7 పరుగులు 309 అత్యధిక స్కోరు 110 సగటు 77. 25 సెంచరీలు 1 ఫోర్లు 45సిక్స్లు 5 అభినందనల వెల్లువఅండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రివరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్ ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిఅండర్–19 ప్రపంచకప్లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్డీ శిబులాల్
డి.ఎస్.పవన్కుమార్, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్డీ శిబులాల్ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్ కుటుంబం ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్కు వచి్చన శిబులాల్తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్లోకి.. ఇన్ఫోసిస్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్ 2.0గా చెప్పొచ్చు. మార్పులు ఆహ్వానించాలి – ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి. – ఇన్ఫోసిస్లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా. ఎంటర్ప్రెన్యూర్షిప్.. నాట్ ఫర్ ఎవ్రిబడీ – ప్రస్తుతం దేశంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. – సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది. – చాలామంది ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్.. ఫెయిల్యూర్ వెంచర్స్గా మారుతున్నాయి. – మా రోజుల్లో ఫండింగ్ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్ ఇన్వెస్టర్స్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ను అందించే స్టార్టప్స్కు ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. ఏఐతో కొత్త ఉద్యోగాలు: – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి. – ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది. – ఐటీలో కూడా కంప్యూటర్ ఆపరేషన్స్తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం. 4‘సీ’స్ సూత్రాన్ని పాటించాలి – నేటి తరం యువత కెరీర్లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్) అమలు చేసుకోవాలి. – మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. – దేశంలో కెరీర్ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్ జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్పై పట్టు ముఖ్యం – ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్ సైన్సెస్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది. – నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్ మీడియం అనేది గ్లోబల్ లాంగ్వేజ్. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. సైన్స్ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్లోకొచ్చా.. వాస్తవానికి నాకు బేసిక్ సైన్స్ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్లో సిస్టమ్స్ ఇంజనీర్గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ (ఎస్ఎఫ్పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. డ్రాప్ అవుట్స్ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్ అవుట్స్ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్ఎఫ్పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. -
ఊతమిస్తేనే వైద్యం బలోపేతం
సాక్షి, అమరావతి : దేశంలో ఎయిమ్స్ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే గ్రామ స్థాయిలోని వెల్నెస్ సెంటర్లు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ హానరరీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2025–26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలన్నారు. 2023–24తో పోలిస్తే 2024–25లో ఆరోగ్య రంగానికి బడ్జెట్ 12.59 శాతం పెరిగిందన్నారు. విజన్ 2047 లక్ష్యాలను అధిగమించాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఏడాది 50 శాతం మేర ఆరోగ్య బడ్జెట్ పెరగాలన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆరోగ్య రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతల గురించి ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వైద్యం సులభతరం కావాలి దేశంలో ప్రజారోగ్య అవసరాలకు తగ్గట్టుగా ఎంబీబీఎస్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరు. గ్రామీణ ప్రాంత ప్రజలు నేటికీ వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న టెలీ మెడిసిన్, ఇతర డిజిటల్ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు హెల్త్ ఇన్నోవేషన్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. వైద్య సేవలను మరింత సులభతరం చేయాలి. హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని మెరుగు పరచేలా కేటాయింపులు ఉండాలి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే టైర్ 2, 3 నగరాలు, పట్టణాల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చిన్న చిన్న పట్టణాలకు సైతం సేవలను విస్తరించాలి.సేవలు విస్తృతం చేయాలిఆయుష్మాన్ భారత్ను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సైతం వర్తింపజేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు చేస్తూ బడ్జెట్ ద్వారా ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం. సమాజంలో నివసిస్తున్న 10 శాతం మంది ధనికులు స్వతహాగా ఇన్సూరెన్స్లు పొందుతున్నారు. 50–60 శాతం మంది పేదలకు ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తోంది. మిగిలిన 30 శాతం మంది మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కరవవుతోంది. చాలా కొద్ది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. వీరు కొంత ప్రీమియం చెల్లిస్తే ఆయుష్మాన్ భారత్ వర్తింపజేసేలా ప్రతిపాదనలున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత విస్తృతపరచాలి.. మరింత బలోపేతం చేయాలి. ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో పూల్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అవలంభిస్తున్నారు. టాటా మెమోరియల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. క్యాన్సర్ మందులు, వైద్య పరికరాలను పూల్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా ప్రోత్సహించాలి.ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి. ముఖ్యంగా ఆరోగ్య బీమా, ఔషధాలు, రోగ నిర్ధారణ పరీక్షలు వంటి వాటిపై పన్నులు మినహాయించాలి. కొత్త ఆస్పత్రుల ఏర్పాటును ప్రోత్సహించాలి. వైద్య రంగం నుంచి రాబడి మార్గాలను ప్రభుత్వం అన్వేషించకూడదు. అవసరమైతే లగ్జరీ కార్లు, బైక్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల వంటి విలాసాలకు సంబంధించిన అంశాలతో పాటు.. పొగాకు, మద్యం వంటి వ్యసనాలతో ముడిపడి ఉన్న వాటిపై పన్నులు పెంచాలి. -
అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే
‘అక్కడ చేపలు పట్టడమంటే చెరువుల్లో బాంబులు వేయడమో.. కరెంటు షాక్ ఇచ్చి లేదా నీటిలో రసాయనాలు కలిపి చేపలు చచ్చేలా చేసి పట్టుకోవడమో మాత్రమే తెలుసు. అంతేగానీ.. ప్రత్యేకంగా చేపలు పట్టేందుకు స్థానికులకు శిక్షణలేదు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో దీనిని గమనించాను. తద్వారా విషపూరితమైన చేపలను తినడమో.. చేపలతో పాటు ఇతర ప్రాణులు చనిపోవడమో జరుగుతోంది. అందుకే ప్రత్యేకంగా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర) 20 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్నాం’.. అని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్ తెలిపారు. అక్కడ మత్స్య సంపదను పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై కూడా ఈ ఐదురోజుల శిక్షణలో భాగం చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు అక్కడకెళ్లి స్థానికంగా ఉండే మత్స్యకారులతో పాటు స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీ) శిక్షణ ఇస్తే వారి ఆదాయ మార్గాలను పెంచేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంలో వీరికి ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్ష్రి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంమత్స్యసంపదకు తీవ్ర నష్టం!ఈశాన్య రాష్ట్రాల్లో చేపలు పట్టేందుకు ప్రధానంగా మెకానికల్ స్టుపెఫైయింగ్ పద్ధతిలో రాళ్లు విసరడం, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం చేస్తుంటారు. దీనిని సాధారణంగా బ్లాస్ట్ లేదా డైనమైట్ ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి చాలా హానికరం. ఈ పద్ధతిలో కేవలం మనం ఆహారంగా తీసుకునేందుకు అవసరమయ్యే చేపలతో పాటు వాటి గుడ్లు, ఇతర జలచరాలు కూడా చనిపోతాయి. ఇక మరో పద్ధతి.. ఫిష్ పాయిజనింగ్. ఈ పద్ధతిలో రాగి, సున్నం వంటి రసాయనాలను వినియోగిస్తారు. గిరిజన సంఘాలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకూ చనిపోతాయి. అంతేకాక.. చేపలలో విష రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ పారే నీటిని కిందనున్న ప్రాంతాల వారు తాగేందుకు వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ఇక మూడో పద్ధతి.. ఎలక్ట్రికల్ ఫిషింగ్. ఈ పద్ధతిలో కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా చేపలు కదలకుండా పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తద్వారా వాటిని వలలతో పట్టుకోవడం సులభమవుతుంది. ఈ అన్ని పద్ధతుల్లో మత్స్యసంపద దెబ్బతినడంతో పాటు పర్యావరణ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ప్రతీచోట ఏపీ ఫిష్ మార్కెట్..ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో రెండు చేపల మార్కెట్లు ఉన్నాయి. ఒకటి స్థానిక చేపల మార్కెట్ కాగా.. మరొకటి ఆంధ్రప్రదేశ్ ఫిష్ మార్కెట్. అక్కడ ఏపీ చేపలకు అంత డిమాండ్ ఉంది. మేం చూసిన ప్రతీ ప్రాంతంలో చేపల మార్కెట్ ఎక్కడా అని ఆరాతీస్తే.. ఏ మార్కెట్ కావాలి? లోకల్ ఫిష్ మార్కెటా? ఏపీ ఫిష్ మార్కెట్ కావాలా అని అడిగే వారు. ఇక విమానాశ్రయాల్లో కూడా చేపల ఉత్పత్తుల విక్రయం జరుగుతుంది.ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన చేపలను అక్కడ విక్రయిస్తున్నారు. వాటికి స్థానికుల నుంచి మంచి డిమాండ్ ఉంటోంది. అయితే, మన విమానాశ్రయాల్లో అటువంటి పరిస్థితిలేదు. మరింతగా చేపల వినియోగాన్ని, మార్కెట్ను పెంచేందుకు ఇటువంటి పద్ధతులను మనం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది.తాబేళ్ల రక్షణకు ప్రత్యేక వలలు..సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు వినియోగిస్తున్న వలల్లో తాబేళ్లు కూడా చిక్కుకుంటున్నాయి. తద్వారా తాబేళ్లు మృతువాత పడుతున్నాయి. దీనిని నివారించేందుకు తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజ్ (టెడ్)లను అభివృద్ధి చేశాం. తాబేళ్ల రక్షణ కోసం ఈ వలలను ప్రత్యేకంగ ఉపయోగించే దిశగా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. మొదటి దశలో 60 వేల వరకూ తయారుచేస్తున్నాం. అయితే, వీటి ధర అధికంగా ఉంది. వీటిని సబ్సిడీపై అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
ఈవీ వాహనాల్లో గేమ్ఛేంజర్.. నానో పీసీఎం
రవాణా రంగంలో విద్యుత్తు వాహనాలు ఒక సంచలనం...పర్యావరణ హితమైనవి. ఖర్చు తక్కువ. లాభమెక్కువ!ఈ కారణంగానే ఇటీవలి కాలంలో స్కూటర్లు మొదలుకొని..ఆటోలు, మోటార్బైకులు, కార్లు అనేకం విద్యుత్తుతోనే నడుస్తున్నాయి!అయితే... వీటిల్లో సమస్యలూ లేకపోలేదు.కొన్ని స్కూటర్లు రోడ్లపైనే కాలి బూడిదవుతూంటే..ఇంకొన్నింటి బ్యాటరీలు టపాసుల్లా పేలిపోతున్నాయి!ఈ సమస్యలకు కారణాలేమిటి? పరిష్కారం ఉందా?విద్యుత్తు వాహనాల్లో ఇప్పుడు వాడుతున్న...లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ‘సాక్షి.కాం’డాక్టర్ నిశాంత్ దొంగరి.. (Nishanth Dongari) విద్యుత్తు వాహన రంగంలో చిరపరిచితమైన పేరిది. హైదరాబాద్లోని ఐఐటీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూనే.. ఇక్కడ మొట్టమొదటి విద్యుత్తు వాహన స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఈయన. ప్యూర్ ఈవీ (Pure EV) పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్తు స్కూటర్లు డాక్టర్ నిశాంత్ సృష్టే. ఇటీవలి కాలంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అనేక సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి.కాం’ ఆయన్ను సంప్రదించింది. ఆ వివరాలు..బ్యాటరీలు ఎందుకు కాలిపోతున్నాయి?ఛార్జ్ చేసేటప్పుడు.. వినియోగించే సమయంలోనూ అన్ని బ్యాటరీలూ వేడెక్కుతూంటాయి. ఇది సహజం. అయితే సక్రమంగా నియంత్రించకపోతే ఈ వేడి కాస్తా ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు వాహనాల బ్యాటరీలు అన్నింటిలోనూ వేడిని పసికట్టేందుకు సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి.‘‘ప్యూర్ -ఈవీలో మేము ఇంకో అడుగు ముందుకేశాము. బ్యాటరీల్లో వేడిని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారి ఫేజ్ ఛేంజ్ మెటీరియల్ (PCM)ను ఉపయోగించాం. వేడి ఎక్కువైనప్పుడు ఈ పదార్థం ద్రవరూపంలోకి మారిపోతుంది. వేడిని బ్యాటరీల నుంచి దూరంగా తీసుకెళుతుంది. తరువాతి కాలంలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాము. నానోస్థాయి పదార్థాన్ని చేర్చడం ద్వారా బ్యాటరీల్లోని వేడి మరింత సమర్థంగా తగ్గించగలిగాం. ఈ నానోపీసీఎం కారణంగా ప్యూర్-ఈవీ బ్యాటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలిపోవు అని గ్యారెంటీగా చెప్పగలం.’’విద్యుత్తు వాహనాల్లో ఏఐ వాడకం ఎలా ఉండబోతోంది?వాహనాల్లో కృత్రిమ మేధ వాడకం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. విద్యుత్తు వాహనాల్లో కూడా. ప్రస్తుతం ప్యూర్-ఈవీలో బ్యాటరీ ప్యాక్లలోని ఒక్కో సెల్ను పరిశీలించేందుకు మేము కృత్రిమ మేధను వాడుతున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు పరిష్కార మార్గాలు సూచించేందుకూ జనరేటివ్ ఏఐను వాడే ఆలోచనలో ఉన్నాం. ఉదాహరణకు.. మీ వాహనం అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయిందనుకుందాం. స్మార్ట్ఫోన్లోని అప్లికేషన్లో మీ సమస్య వివరాలు ఎంటర్ చేస్తే జనరేటివ్ ఏఐ ‘‘స్విచ్ ఆన్/ఆఫ్ చేసి చూడండి’’ లేదా ఇంకో పరిష్కార మార్గం సూచిస్తుంది.లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకెంత కాలం?విద్యుత్తు వాహనాలతోపాటు అనేక ఇతర రంగాల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలే అధికం. రానున్న 30 - 50 ఏళ్ల వరకూ ఇదే పంథా కొనసాగనుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది 20 - 25 ఏళ్ల ముందు మాత్రమే. కాథోడ్, ఆనోడ్, ఎలక్ట్రొలైట్, సెపరేటర్ వంటి అనేక అంశాల్లో మెరుగుదలకు చాలా అవకాశాలున్నాయి. నిల్వ చేయగల విద్యుత్తు, భద్రత అంశాలు కూడా బాగా మెరుగు అవుతాయి. సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో 220 వాట్ల విద్యుత్తు నిల్వ చేయగలిగితే సాలిడ్ స్టేట్ బ్యాటరీల్లో ఇది 800 వాట్లకు చేరుకోగలదు. రానున్న ఐదేళ్లలో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు అవసరమైనంత వేగాన్ని ఇచ్చే టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత్ లాంటి దేశాలు లిథియంపై మౌలిక రంగ పరిశోధనలు మరిన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముడి ఖనిజం నుంచి లిథియం అయాన్ను మరింత సమర్థంగా వెలికితీయగలిగితే, వాడేసిన బ్యాటరీల నుంచి మెరుగ్గా రీసైకిల్ చేయగలిగితే బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ ఈ విషయాల్లో చొరవ చూపాలి. ముడి ఖనిజం ద్వారా వెలికితీసే లిథియంకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదు. లిథియం అయాన్ బ్యాటరీల్లో మరింత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసేందుకు కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం (మైలేజీ) మరింత పెరుగుతుంది. కాబట్టి.. సమీప భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదనే చెప్పాలి.హోండా లాంటి కంపెనీలు హైడ్రోజన్పై దృష్టి పెడుతున్నాయి కదా?నిజమే. కానీ హైడ్రోజన్తో వ్యక్తిగత వాహనాలు నడుస్తాయని నేను భావించడం లేదు. లారీలు, ట్రక్కులు, రైళ్లు, చిన్న నౌకల వంటి భారీ వాహనాలకు హైడ్రజన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ కూడా ఇటీవలి కాలంలో హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకునే విషయంలో చొరవ చూపుతోంది. పరిశోధనలపై దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో రవాణా రంగంలో హైడ్రోజన్ కీలకం కాగలదు. చిన్న వాహనాల విషయానికి వస్తే హైడ్రోజన్ను నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. -
సాగుకు ఊతమిద్దాం
‘ఒకప్పుడు బెగ్గింగ్ బౌల్గా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగింది. వరి, గోధుమ వంటి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఏటా 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 345 మిలియన్ టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయడమే కాకుండా ఏటా 55 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. 142 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి సంపూర్ణ ఆహార భద్రత సాధించగలిగాం. అందులో సందేహం లేదు. కానీ పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో బాగా వెనుకబడ్డాం. ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన పప్పులు, నూనె గింజల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ట్రైనీ సైంటిస్ట్ నుంచి ఐఏఆర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం, భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతిబెట్టను తట్టుకునే మరిన్ని రకాలు రావాలిదేశ జనాభా 142 కోట్లు దాటింది. 14 కోట్ల మంది రైతులున్నారు. దేశంలో 6 లక్షల గ్రామాలుండగా, 15 కోట్ల కమతాలున్నాయి. 80–85 శాతానికి పైగా చిన్న కమతాలే. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు. అర్బనైజేషన్ కారణంగా గ్రామాలతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక రైతులు సాగును వదిలేసే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో 50 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సాగు విస్తీర్ణంలో 50 శాతానికి పైగా నేటికీ వర్షాధారమే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ సాగు విస్తీర్ణం వర్షాధారమే. 30–40 ఏళ్లుగా వర్షాలకు లోటులేదు. కానీ బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పొలంలో నీళ్లు పొలంలో, గ్రామంలో నీళ్లు గ్రామంలో, ఫామ్ ఫాండ్స్లో నీళ్లు నిల్వ చేసుకొని ఎప్పుడు బెట్ట వస్తే అప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించొచ్చు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్లో పెనుముప్పు తప్పదు. వర్షాధారం కింద అధిక దిగుబడులు సాధించే రకాల వంగడాలను, ప్రధానంగా బెట్టను తట్టుకునే వాటిని అభివృద్ధి చేయాలి. కర్బన్ శాతాన్ని సంరక్షించుకోకపోతే ముప్పేప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వెజిటబుల్స్, పండ్లు తినే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల వారీగా అనువైన వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి.కరువు ప్రాంతాల్లో సైతం అధిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు తగిన వంగడాలను అభివృద్ధి చేయాలి. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. నేలల్లో కర్బన్ శాతాన్ని సంరక్షించగలిగినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫామ్ మెకనైజేషన్ (యాంత్రీకరణ) ద్వారా పెట్టుబడి ఖర్చులను నియంత్రించగలుగుతాం. కొత్త వంగడాలు వేగంగా అందించాలిమన శాస్త్రవేత్తలు ఏటా వందలాది వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అవి రైతు పొలానికి చేరినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అది ఆశించినంత వేగంగా జరగడం లేదు. పరిశోధనా కేంద్రాలు అందించే ఫౌండేషన్ సీడ్ నుంచి మల్టిపుల్ సీడ్ ఉత్పత్తి చేసి రైతులకు వేగంగా అందించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, సీడ్ ఏజెన్సీలు, సీడ్ కంపెనీలు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో సీడ్ రీప్లేస్మెంట్ జరగాలి. ఉత్తమ వంగడాల డెమో, చీడపీడల నియంత్రణ, నీటి వినియోగం వంటి ప్రయోగాలన్నీ రైతు క్షేత్రంలోనే జరగాలి. పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్ట్ మార్చడం, తక్కువ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా అడుగులు వేయాలి. రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ఓ రైతును ఓ మాస్టర్ ఫార్మర్గా తయారు చేయాలి. వారి ద్వారా ఆ గ్రామంలో పరిశోధనా ఫలాలు వేగంగా రైతులకు చేరువవుతాయి. పంట సాగు వేళ, కోత, కోత అనంతరం, నిల్వ సమయంలో ఉత్పత్తి నష్టాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పంట ఉత్పత్తిని ప్రాసెసింగ్ వ్యాల్యూ ఎడిషన్తో మార్కెట్లోకి తీసుకెళ్లగలిగితే రైతులకు మేలు జరుగుతుంది.ఏపీ, తెలంగాణలో జిల్లాకో కేవీకేదేశ వ్యాప్తంగా 113 పరిశోధనా సంస్థలు, 731 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఉన్నాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో కూడా కేవీకేల సంఖ్య సమీప భవిష్యత్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పెరిగిన జిల్లాలకనుగుణంగా కనీసం 10–15 మధ్య కొత్తగా కేవీకేలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రీసెర్చ్ స్టేషన్ల ఏర్పాటు కంటే ఉన్న రీసెర్చ్ స్టేషన్లను బలోపేతం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఆ విషయంలో అవసరమైన నిధులు సాధించి పరిశోధనలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తాను. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పరిశోధనలకు ఏటా రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్లో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వర్షాధారం, బెట్ట పరిస్థితులతో పాటు వరదలు, తుపాన్లు వంటి వైపరీత్యాలను తట్టుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా మల్టిపుల్ టాలెంటెడ్ వంగడాలను అభివృద్ధి చేయడంతో పాటు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.వాతావరణంలో అనూహ్య మార్పులు, ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయ రంగానికి పెనుసవాళ్లుగా మారాయి. పూర్వం జూన్లో వర్షాలు కురిసేవి. ఆ వెంటనే నాట్లు వేసుకునే వారు. కానీ నేడు జూలై–ఆగస్టుల్లో వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో వర్షపాతానికి లోటు లేదు. ఏటా సగటున 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కానీ పడితే కుండపోత.. లేకుంటే కరువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొన్నేళ్లుగా దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన ప్రాంతాలను సైతం కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ సీజన్లను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పంట దిగుబడి సాధిస్తే.. మార్కెటింగ్ తీరుతో రైతులు నష్టపోతున్నారు. ఈ సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఐఏఆర్ఐ ముందుకెళ్తోంది. – డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఐఏఆర్ఐ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ -
డిజిటల్ ఇండియాకు బ్లాక్చెయిన్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్చెయిన్ టెక్నాలజీ సంస్థ అల్గోరాండ్ భారత్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తమ సాంకేతికత ఊతమివ్వగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో బ్లాక్చెయిన్ టెక్నాలజీతో గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దేశీయంగా వివిధ రంగాల్లో పలు సవాళ్లను పరిష్కరించేందుకు అల్గోరాండ్ బ్లాక్చెయిన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఉదాహరణకు మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక పెద్ద సహకార బ్యాంకు ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరుకార్డ్ను రూపొందిస్తోంది. అలాగే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) తమ సభ్యుల కోసం డిజిటల్ హెల్త్ స్కోర్కార్డును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఇలాంటివి అందరికీ ఆరి్థక సేవలను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేవే. ఇక సప్లై చెయిన్లో పారదర్శకత సాధించేందుకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసేందుకు, ఇతరత్రా ప్రజలకు మేలు చేకూర్చే పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదు. బ్లాక్చెయిన్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మొదలైన వాటిపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రోడ్ టు ఇంపాక్ట్, స్టార్టప్ ల్యాబ్లాంటి కార్యక్రమాలు స్థానికంగా ప్రతిభావంతులను, ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తోడ్పడతాయి. అల్గోరాండ్ టెక్నాలజీతో ప్రధానంగా ఫైనాన్స్, సప్లై చెయిన్, హెల్త్కేర్, సస్టైనబిలిటీ వంటి కీలక రంగాలు లబ్ధి పొందగలవు. ఫైనాన్స్ విషయానికొస్తే అల్గోరాండ్ బ్లాక్చెయిన్ టెక్నాలజీవల్ల లావాదేవీలను వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చు. పారదర్శకత వల్ల సినిమాల నిర్మాణానికి, సీమాంతర వాణిజ్యానికి అవసరమయ్యే నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరిన్ని వనరులు అందుబాటులోకి రాగలవు. సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను చూస్తే ఏఆర్వీవో, ఎల్డబ్ల్యూ3 లాంటి కంపెనీలు మా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. హెల్త్కేర్ విభాగంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చడంలో సేవా వంటి సంస్థల కార్యకలాపాలకు ఇది తోడ్పడుతోంది. టెరానోలాంటి సస్టైనబిలిటీ ప్రాజెక్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ దన్నుతో సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా టీ–హబ్, మన్ దేశీ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. భారత్లో ప్రాజెక్టులు.. టీ–హబ్లో మా స్టార్టప్ ల్యాబ్ అనేది టెరానో, ఆ్రస్టిక్స్, ఫిల్మ్ఫైనాన్స్, ఎల్డబ్ల్యూ3లాంటి బ్లాక్చెయిన్ అంకుర సంస్థలకు తోడ్పాటు అందిస్తోంది. 2024 స్టార్టప్ ల్యాబ్లో తొలి బ్యాచ్ కంపెనీల్లో ఇప్పటికే అయిందింటిలో ఇన్వెస్ట్ చేసింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్లాక్చెయిన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నాస్కామ్వంటి సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాం.ప్రణాళికలు.. స్టార్టప్ ల్యాబ్లలో మరిన్ని కొత్త బ్యాచ్లు ప్రారంభించడం, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం తదితర ప్రయత్నాల ద్వారా భారత్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు అల్గోరాండ్ కట్టుబడి ఉంది. రోడ్ టు ఇంపాక్ట్ వంటి కార్యక్రమాలను విస్తరించడం, భారతదేశపు విశిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు మరిన్ని బ్లాక్చెయిన్ ఆధారిత ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ను ఆవిష్కరించండంపైనా దృష్టి పెడుతున్నాం. డెవలపర్లకు తోడ్పాటు.. రోడ్ టు ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలతో డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై అల్గోరాండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. 2024లో హైదరాబాద్లోని తొలి అల్గోరాండ్ స్టార్టప్ ల్యాబ్లో 21 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. మరో ఇరవై అంకుర సంస్థలు 2025 నాటికి ప్రోడక్ట్, మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ అంశాలకు సంబంధించి సన్నద్ధంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్లలో సుమారు 70 అల్గోరాండ్ బ్లాక్చెయిన్ క్లబ్లతో యువ డెవలపర్లకు అవసరమైన వనరులు, మెంటార్íÙప్, పోటీపడే అవకాశాలను అందిస్తున్నాం. -
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు
కడప సెవెన్రోడ్స్: ‘నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు రాజధానిని కోల్పోవాల్సి వచి్చంది. ఆ తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం. అభివృద్ధి అంతా ఒకేచోట పోగు వేయడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు అంతా సంపద సృష్టే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవు’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పౌరహక్కుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఓ సదస్సులో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా బాగా వెనుకబడి ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ అనుమతులు, నిర్వహణ వంటివి గవర్నరే చేపడతారని చెప్పారు. రాయలసీమకు కూడా అలాంటి పరిపాలనా ఏర్పాటు జరగాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఉండేదని, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ఇది కూడా ఓ కారణమైందని చెప్పారు. అలాంటివి పునరావృతం కాకుండా రాయలసీమ సమగ్రాభివృద్ధికి నీటి పారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అవసరం ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ దిశగా కొంతమేరకు కృషి చేశారు. విదర్భ తరహాలో ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపు కోసం ఒక పరిపాలనా ఏర్పాటు జరగాలి. అభివృద్ధినంతా ఒకే చోట పోగేయడం సరికాదు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగినా, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడం సమంజసం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా ఉంటుంది? సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదు. అందువల్లే ప్రాంతీయ అసమానతలు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ఒకప్పుడు అది కరువు ప్రాంతంగా ఉండేది. కరువును పారదోలడం, వరదల ముప్పు తప్పించడం కోసం 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు నిర్మించడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది.అక్కడి రైతులు వ్యవసాయంలో వచ్చిన అదనపు ఉత్పత్తిని మద్రాసులోని సినిమా రంగం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. అలా సంపద పెరుగుతూ ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నదీ జలాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉన్న రాజకీయ ప్రాబల్యం వెనుకబడ్డ ప్రాంతాలకు ఉండదు. అందుకే రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కోస్తాంధ్రుల ప్రాబల్యం వల్ల ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. విభజన అనుభవాలు మరువకముందే.. రాజకీయ ప్రాబల్యాన్ని అనుసరించే అభివృద్ధి నమూనా ఉంటోంది. రాష్ట్ర విభజన అనుభవాలు ఇంకా మరిచిపోకమునుపే మళ్లీ అవే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఇక్కడి నాయకులు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. వివిధ చారిత్రక, రాజకీయ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.గతంతో పోలిస్తే ఫ్యాక్షన్ ప్రభావం చాలా మేరకు తగ్గినప్పటికీ రక్షణ ఉండదని భావిస్తున్న ప్రజలు నేటికీ ఏదో ఒక నాయకుడి ప్రాబల్యం కింద ఉన్నారు. వీటి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన ప్రజా ఉద్యమం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. సీమకు నదీ జలాల విషయంలో వైఎస్సార్ శ్రద్ధ రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనేదానిని కాదనలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పనులు చేపట్టడంతో పాటు సీమ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయనపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 290 కిలోమీటర్ల పరివాహక ప్రాంతమున్న కృష్ణా నీటిలో మా తెలంగాణ వాటా ఏమిటని మేము కూడా అడిగాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న సందర్భంలో కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కోరారు. పునః పంపిణీకి కోస్తాంధ్ర వాళ్లు ససేమిరా ఒప్పుకోరన్న విషయం రాజకీయ పరిణితి చెందిన వైఎస్కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అయిపోయిందని ఆయన మాతో అన్నారు. ఏది ఎలా ఉన్నా సీమకు నదీ జలాలు ఇచ్చే విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని త్యాగాలు తప్పవు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కోస్తాంధ్రులు తమ నీటి వినియోగాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజన్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉంటాయి. విధాన పరంగా, ఒత్తిడి లేకుండా ఒక ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు లేవు. -
లైఫ్కి బీమా తప్పనిసరి
జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ కాస్పరస్ జేహెచ్ క్రామ్హూట్ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి, క్లెయిమ్ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. బీమా కంపెనీలు ‘టర్మ్’పై కాకుండా ఇన్వెస్ట్మెంట్తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్ పాలసీలపై ఫోకస్ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? నిజమే! ఇలాంటి మిస్ సెల్లింగ్ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి. మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే భారీ ప్రీమియం చెల్లించాలి కదా? నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్ టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్మెంట్కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం. మీ వ్యాపారంలో ఆన్లైన్ శాతమెంత? మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్ గ్రూప్ కంపెనీల ఔట్లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్లైన్ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్ లామ్’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి అడుగులు వేస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. -
బీచ్ శాండ్ పరిశ్రమలో అవకాశాలు అపారం
సాక్షి, విశాఖపట్నం: బీచ్ శాండ్ ఇండస్ట్రీలో అపారమైన అవకాశాలున్నాయని.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చేఖనిజాలు బీచ్ సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మాజీ జాయింట్ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్ పద్మభూషణ్ ప్రొ.పద్మనాభయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోనూ అపారమైన తీర ప్రాంత ఖనిజ సంపద ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు.అవసరమైన మేరకే ఖనిజాలు వెలికితీస్తే మంచిదని.. అదే సమయంలో అక్రమ మైనింగ్ నియంత్రించాలి్సన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. లేదంటే పర్యావరణ విఘాతం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఏపీ మినరల్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో కరెంట్ ట్రెండ్స్ ఇన్ మైనింగ్, బీచ్ శాండ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు అనే అంశంపై శుక్రవారం ఏయూలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ. పద్మనాభయ్య ‘సాక్షి’తో పలు అంశాలు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..దేశంలో 130 బీచ్ మైనింగ్ డిపాజిట్స్..దేశంలోని తీర ప్రాంతాల్లో 130 మైనింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒడిశాలోని ఛత్రపూర్, తమిళనాడులోని మనవల్లకురిచి, కేరళలోని చేవరాలో మాత్రమే పనులు నడుస్తున్నాయి. అన్ని మైనింగ్ బ్లాక్స్ను ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి.. బీచ్ శాండ్ మైనింగ్ ఇండస్ట్రీలో మేజర్ గ్లోబల్ ప్లేయర్గా భారత్ మారేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడాలేని అత్యంత విలువైన నాణ్యమైన అరుదైన ఖనిజ సంపద భారత సాగర తీరంలో ఉంది. అద్భుతమైన ఎలిమినైట్ ఖనిజం నిల్వలున్న దేశంగా మూడో స్థానంలో ఉంది. అదేవిధంగా.. మన దేశ తీర ప్రాంతంలో మోనోజైట్ ఖనిజం కూడా అత్యధికంగా లభ్యమవుతుంది. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే.. భారత్ ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉంటుంది. ప్రభుత్వాలే ఖనిజ సంపదను వెలికితీసే బాధ్యతని భుజానికెత్తుకోవాలి. ముఖ్యంగా పీపీపీ విధానాన్ని ఇందులో అవకాశాలు కల్పించాలి. అప్పుడే అక్రమ మైనింగ్ని నిరోధించవచ్చు. అలాగే, బీచ్ శాండ్ అక్రమ తవ్వకాలపై నమోదవుతున్న కేసుల విచారణ ఆలస్యమవుతుండటం విచారకరం. వీలైనంత త్వరగా.. ఈ తరహా అక్రమ కేసుల విచారణ వేగవంతమైతే వీటిని నియంత్రించే అవకాశం ఉంటుంది. -
Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం.... వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో... ఏం చేస్తే నేరాలు తగ్గుతాయి? ‘చట్టం మారాలి... అమ్మాయిలు నిర్భయంగా ఉండేలా సమాజం మారాలి’ అంటున్నారు ఈషా రెబ్బా. అంతేకాదు... నెగటివిటీని ఇంధనంలా చేసుకుని అమ్మాయిలు ముందుకు సాగాలని కూడా అంటున్నారు. ఇంకా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఈ విధంగా పంచుకున్నారు. → రిపోర్ట్ చేయనివి ఎన్నో! హత్యాచారాలు జరిగినప్పుడు ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తులతో నిరసన... ఇలా చాలా చేస్తుంటాం. ఈ అన్యాయాలకు మన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాం. కానీ ఒకటి జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకోటి. ఈ మధ్యే కోల్కతాలో జరిగింది ఒక ఘటన. ఆ తర్వాతా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏం చేస్తే ఇవి ఆగుతాయి? ఆగడానికి పరిష్కారమే లేదా? అనే భయం ఉంది. ఇలాంటి వార్తలు విన్నా, చూసినా చాలా ఆవేదన. రేప్ అనేది చాలా పెద్ద క్రైమ్. మన దగ్గర రేప్ కేస్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సోషల్ మీడియా వల్ల మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్ చేసిన కేస్లు... రిపోర్ట్ చేయనివి ఎన్నో! మన న్యాయ వ్యవస్థని మరింత కఠినంగా మార్చుకోవాలి. అలా ఉంటే అయినా ఇలాంటి ఘటనలు కాస్త తగ్గుతాయని నా అభి్రపాయం. → భయపెట్టాలి రేప్ జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని మొన్న ఏదో సర్వే చేశారు. అందులో ఓ క్యాబ్ డ్రైవర్తో పాటు ఎక్కువ శాతం మంది చెప్పిన సమాధానం... అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం... ఇంకొంత మంది ఇంకేదో కారణం. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉందో చూడండి. మన రాజకీయ నాయకులు కూడా కొందరు ఇంకా ఓల్డ్ స్కూల్ స్టయిల్లోనే ఆలోచిస్తున్నారు. వాళ్లు కూడా సమస్య బట్టల్లోనే ఉందంటారు. కొన్ని దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా అవుతుంది. వెంటనే ఉరి తీసే దేశాలు ఉన్నాయి. లా స్ట్రిక్ట్గా ఉండటం అంటే చంపేయమని కాదు. ఇన్వెస్టిగేషన్ త్వరగా, క్లియర్గా చేయడం. తప్పు చేశాడని రుజువు అయిన వెంటనే శిక్షించాలి. అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయాలంటేనే భయపడతారు. పాయింట్స్ తగ్గిపోతాయేమో అని. చిన్న చిన్న విషయాల్లో అంత కఠినంగా ఉన్నారంటే ఆలోచించండి. అనుకున్న వెంటనే చట్టం అయిపోదు. మన లా కూడా రేపిస్ట్ల మీద అంత కఠినంగా లేకపోవడం. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని తెలిసేలా చేయాలి. ఇలా చేస్తే ఆగిపోతాయని నేను అనను. అలా అయినా ఎంతో కొంత భయం కలుగుతుందేమో. ముందు భయపెట్టాలి. ఇంట్లోవాళ్లు హెల్మెట్ పెట్టుకో అంటున్నా పెట్టుకోరు చాలామంది. కానీ 2000 రూపాయలు జరిమానా విధిస్తారంటే ఆ భయంతో అయినా పెట్టుకుంటారు. → అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు హీరోయిన్ అనే కాదు ఏ అమ్మాయి అయినా తన శరీరం... తన ఇష్టం. అబ్బాయిలు వాళ్లకు నచ్చినట్టు కూర్చుంటారు. నచ్చిన చోటుకి వెళ్తారు. నచ్చిన టైమ్లో వెళ్తారు. మాక్కూడా ఆ స్వాతంత్య్రం కావాలి. అమ్మాయిలకు బోలెడన్ని ఆంక్షలు.. ఇలా కూర్చోవాలి... అలా కూడదు. ఇలా మాట్లాడాలి... అలా కూడదు. చిన్నప్పటినుంచి ఇలా పరిమితులు పెట్టిన వాతావరణంలోనే దాదాపు అందరం పెరిగి ఉంటాం. అమ్మాయిలందరూ నిర్భయంగా ఉండే సమాజం ఏర్పాటు జరగాలి. భయం పెట్టాలి... → కంఫర్ట్ జోన్లో ఉండకూడదు నేను ఇంట్రావర్ట్ని. నాకు తెలిసిన అతి కొద్ది మంది దగ్గర మాత్రమే హైపర్ ఎనర్జీతో ఉండగలను. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే రోజూ ఓ వంద మంది ఉంటారు సెట్లో. కానీ చేయాలి. మనల్ని మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో పెట్టుకుని ఉండకూడదు. మనకున్న భయాలను ఫేస్ చేస్తూ ముందుకెళ్లడమే. ఉదాహరణకు నాకు నీళ్లంటే చాలా భయం. దాంతో నీళ్లల్లో దిగేదాన్ని కాదు. కానీ ఎన్నాళ్లని అలా దాటేస్తాను? ధైర్యం తెచ్చుకున్నాను. స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకున్నాను. ప్రతి భయాన్ని అధిగమిస్తామో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. చిన్న చిన్న భయాల్ని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద సవాళ్లని, సమస్యలను ఎదుర్కోవచ్చు. → లీవ్ ఇస్తే బెటరే ఆడవాళ్లకు గవర్నమెంట్ అధికారికంగా పీరియడ్ లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మనమే సెలవు పెడతాం. అయితే గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొంత మంది తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది నడవలేరు కూడా. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్ అవుతుంది లేదా ఆల్రెడీ ఆ నెలకు సరిపడా లీవ్స్ తీసేసుకోవడం వల్ల మళ్లీ లీవ్ అంటే ఆలోచించాలి. అందుకే ఆ ఇబ్బందిని భరిస్తూనే పనులకు వెళ్తుంటారు. ఆ మూడు రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తే బాగుంటుందని నా అభి్రపాయం. → నిన్ను నువ్వు నమ్మాలి మన జీవితంలో ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరు మనల్ని ‘నువ్వు చేయలేవు అనో, నీ వల్ల కాదు’ అనో అంటారు. వాళ్లకు పూర్తిగా తెలియదు కదా మన గురించి. అందుకే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడమే. ఎందుకంటే అనేవాళ్లు ఎప్పుడూ అక్కడే ఆగిపోతారు. నిన్ను నువ్వు నమ్మాలి... కష్టపడాలి. నెగటివిటీని మనల్ని కిందకు తోసేలా కాకుండా పైకి తీసుకెళ్లే ఇంధనంలా వాడుకోవాలి. వెరీ హ్యాపీ కెరీర్ పరంగా నేను చాలా హ్యాపీ. మంచి కథలన్నీ వస్తున్నాయి. కోవిడ్, ఓటీటీ తర్వాత కథల్లో వైవిధ్యం పెరిగింది. రియలిస్టిక్గా ఉండే కథలు. అన్ని జానర్స్ కథలు చెప్పడానికి ఓటీటీ మాధ్యమాలు ఉన్నాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి యాక్టర్స్కి ఇది మంచి టైమ్ అని చెపొ్పచ్చు. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత నాకు వచ్చే కథల్లో తేడా తెలుస్తోంది. సినిమాల్ని, కథల్ని చూడటంలో ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. సబ్ టైటిల్స్తో అన్ని భాషల్లో సినిమాలను చూస్తున్నారు కూడా. అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. సో... సినిమా బాగుంటేనే థియేటర్స్కి వస్తున్నారు. అలా థియేటర్స్ రప్పించాలంటే కచ్చితంగా ఏదో ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అందించాలి.– డి.జి. భవాని -
‘హైడ్రా’ నోటీసులు ఇవ్వదా?
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైడ్రాకు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.‘‘హైడ్రాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయంగా ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసినట్లు సమాచారం ఉంటే ఇవ్వండి. వాటిని కూడా కూల్చేస్తాం. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణ వల్లే వరదలు. మూడు నాలుగేళ్లలో చెరువుల ఆక్రమణ భారీగా పెరిగింది.’’ అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.స్కూల్స్, కాలేజీల విషయంలో ఆక్రమణలు రుజువైతే చర్యలు ఎప్పుడు ఉంటాయి?. ఓవైసీ కాలేజీని కూల్చేస్తారా?. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంది. నాగార్జున ఆక్రమణలు చేశారా? కూల్చివేతల అంశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారాయన. హైడ్రాపై పలు సందేహాలను రంగనాథ్ నివృత్తి చేశారు.హీరో నాగార్జున సినిమాలు చూస్తానన్న ఆయన.. ఇంకా ఏమన్నారో.. పూర్తి ఇంటర్వ్యూలో చూడొచ్చు.. -
వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు. భయంతో వైద్యం ఎలా చేస్తారు?కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు? రోగుల సహాయకులను నియంత్రించాలిప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్సింగ్, హర్షవర్ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
Vijay Devarakonda: మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్లో థియేటర్ ఆర్టిస్ట్స్ని కలిసేవాడిని. అప్పుడే విజయ్ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్తో చేశాం. నా వల్ల విజయ్కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్సైడర్గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్లో విజయ్ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్ని ఫ్యామిలీ మేన్గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్మేన్’.మీ బాయ్స్కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్గారి ఫ్రెండ్గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్రెడ్డి) కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కుపైగా లోక్సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్ఎస్కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్ మళ్లీ సీఎం అవుతారు వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా.. -
బీజేపీ మళ్లీ వస్తే.. హైదరాబాద్ యూటీనే!
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ చిన్నాభిన్నం అవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 స్థానాలు వచ్చి అధికారం చేపట్టిన మరుక్షణమే హైదరాబాద్ను ఢిల్లీ నుంచి పాలించే కుట్రను అమలు చేస్తారని.. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండటం లేదన్న మాజీ సీఎం కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఎవరు అసమర్థులో, దోపిడీదారులో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు నిర్ధారిస్తారన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..‘‘ఐదు నెలలుగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం సంతృప్తికరంగానే కాదు చాలెంజింగ్గా ఉంది. రాష్ట్ర ప్రజలకు రూ.500కే సిలిండర్, రూ.10లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు.. ఇలా సంక్షేమ కార్యక్రమాల అమలు సంతోషాన్నిస్తోంది. మరోవైపు అస్తవ్యస్తమైన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాల్సి రావడం, ఆదాయాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉండటం చాలెంజింగ్గా ఉన్నాయి.ప్రజాభవన్కు ఎప్పుడైనా రావొచ్చు..గతంలో ఉన్న ప్రగతిభవన్ను ప్రజాభవన్గా మార్చాం. వాస్తవానికి సీఎంకు కూడా ఇంత పెద్ద భవనం అవసరం లేదు. అందుకే ప్రజాభవన్ ద్వారాలు తెరిచిపెట్టాం. ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. సమస్యలపై దరఖాస్తులు ఇవ్వొచ్చు. సీఎం, నేను ఇతర మంత్రివర్గ సహచరులమంతా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. మా ప్రభుత్వ పాలనకు 100కు 100 మార్కులు వేయొచ్చు. ప్రతి మంత్రి కార్యాలయాల డోర్లు తెరిచే ఉంటున్నాయి. ప్రజలు ఎప్పుడైనా వెళ్లి కలవచ్చు.కేసీఆర్వన్నీ అబద్ధాలే..ఐదు నెలల్లో తెలంగాణ ఇంత ఆగమైతదా అని కేసీఆర్ అంటున్న మాటలు వింటే నవ్వు వస్తోంది. అబద్ధాల పునాదులపై ఆయన బీఆర్ఎస్ను నడుపుతున్నారు. వాళ్లే కట్క బంద్ చేసుకుని కరెంటు కట్ అయిందంటారు. ఆ పెద్దమనిషి అంతగా దిగజారిపోయాడు. కరెంటుకు ఏం మాయరోగం వచ్చిందని అంటున్న కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుంది. వాస్తవానికి వెలుగును చూడలేని మాయరోగం కేసీఆర్కే వచ్చింది. ఆయన ఎక్కువగా చీకట్లో, ఒంటరిగా ఉంటూ.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలో ఆలోచిస్తుంటారు.చక్కదిద్దేందుకు పదేళ్లు పడుతుందితెలంగాణ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల వలయంలోకి నెట్టారు. దీన్నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం ఒక్కరోజులోనో, ఒక్క ఏడాదిలోనో అయ్యేది కాదు. కనీసం పదేళ్లు పడుతుంది. తెచ్చిన అప్పులను కూడా నిరర్థక ఆస్తులపై పెట్టి.. అప్పు చేసి పప్పుకూడు అన్నట్టు వ్యవహరించారు. అప్పులు చేస్తే సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి ప్రాజెక్టులు కట్టాలి. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్, మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి రవాణా వ్యవస్థలను నెలకొల్పాలి. కాళేశ్వరం లాంటి గుదిబండను కట్టడం కాదు.బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం‘‘దేశంలో రిజర్వేషన్లను అమలు చేయడం బీజేపీకి ఇష్టం లేదు. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ రాహుల్ గాంధీ పదేళ్లుగా నినదిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎగ్గొట్టడంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కులగణన చేస్తాం. ఓబీసీలకు రాజ్యాంగపరంగా వాటా ఇస్తాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే ఓట్లేశారు. ఇప్పుడు మా గ్రాఫ్ పెరిగింది. గతంలో ఓటేయని వారు కూడా మాకు ఓటేస్తామంటున్నారు.’’ పద్ధతి ప్రకారమే టికెట్లు ఇచ్చాంబీజేపీ, బీఆర్ఎస్ల్లాగా నియంతృత్వ ధోరణుల్లో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉండదు. పార్టీ రాజ్యంగంలోని అన్ని పద్ధతులను పాటించి అభ్యర్థులను ఖరారు చేశాం. అందుకే జాప్యం జరిగింది. పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించాకే టికెట్లు ఇస్తుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారుబీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నాం, ఉండలేకపోతున్నామని అంటున్నారు. చాలా మంది నాతో మాట్లాడారు కూడా. అయితే ఎందరు చేరతారు, ఎప్పుడు చేరతారనేది బయటికి చెప్పలేం. బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతుందని ఎవరైనా అంటే నవ్వు కోవాల్సిందే. అది అయిపోయిన పార్టీ. ఈ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అర్థమై పోయింది. అందుకే బయటకు వచ్చేస్తున్నారు.కాంగ్రెస్కు పట్టం కట్టండిప్రజా ప్రభుత్వం మాది. ఇందిరమ్మ రాజ్యం మాది. ప్రజలకోసమే పనిచేస్తాం.. మతతత్వ, నియంతృత్వ ధోరణులతో కూడిన బీఆర్ఎస్, బీజేపీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పట్టం కట్టాలి..’’ అని భట్టి పేర్కొన్నారు.-(మేకల కల్యాణ్ చక్రవర్తి) -
అది ప్రాణాలు తీసేంత దాడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి ప్రాణాలు తీసేంత తీవ్రమైనదేనని ప్రముఖ న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి అంటున్నారు. అదృష్టవశాత్తు ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్రగాయంతో సరిపోయిందని, అదే ఎడమ కణతపై లేదా తల వెనుక భాగంలో తగిలితే కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోవడంతోపాటు ప్రాణాపాయం సంభవించేందుకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయని ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్రతను పలు కోణాల్లో విశ్లేషించారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పదునైన ఆయుధంతో దాడి సీఎం వైఎస్ జగన్పై పదునైన రాయి లేదా ఇతర పదునైన వస్తువుతో బలంగా దాడి చేశారు. ఎడమ కనుబొమ్మ పై భాగంలో బలంగా తగలడంతో చర్మం ఛిద్రమై తీవ్ర గాయమైంది. దాంతోనే కుట్లు వేయాల్సి వచ్చింది. ఆయన కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ప్రస్తుతం ఆయన ఒకట్రెండు రోజుల విశ్రాంతి తరువాత రోజువారి పనుల్లో నిమగ్నమైనప్పటికీ, వైద్యులు తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కణతపై తగిలి ఉంటే.. ఆ పదునైన రాయి లేదా వస్తువు కాస్త పక్కన ఎడమ కణతపై తగిలి ఉంటే పెనుముప్పు సంభవించేది. ఆ భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇక ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. ఆ నాళం తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసి ఉండేంది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాకు ఇబ్బంది కలిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల వెనుకభాగంలో తగిలితే.. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయి లేదా మరో పదునైన వస్తువుతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నారు. ఆ వస్తువు తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తూ అది ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైద్యులు కొన్నిరోజులపాటు పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి దోషుల్ని శిక్షించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేస్తున్నాయి. ఆయన్ని హత్యచేయాలనే ప్రణాళిక ప్రకారం దాడిచేశారు. ఇది ప్రతిపక్షాల కుట్రే. దీనివెనుక ఎంతటి పెద్దవారున్నా పూర్తిస్థాయిలో విచారించి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చంద్రబాబు చెప్పడంతోనే.. జగన్మోహన్రెడ్డిని రాళ్లతో కొట్టమని శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు తన ప్రసంగంలో సూచించారు. ఆ వీడియోలు ఉన్నాయి. జగన్ను రాళ్లతో కొట్టండి, అతడు దుర్మార్గుడు, దున్నపోతు, సైకో రాళ్లతో దాడి చేయండి అని.. చంద్రబాబు చెబితే ఈ దుర్మార్గులు, పచ్చకుక్కలు, తెలుగుతమ్ముళ్లు, పిచ్చి పరాకాష్టకు చేరిన కులగజ్జి పట్టిన కుక్కలు సీఎం జగన్ను చంపడానికి కుట్ర పన్నారు. చంద్రబాబునాయుడు ప్రణాళికతో జగన్మోహన్రెడ్డి మీద గత ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు ఈ దారుణం చేయించారు. తక్షణమే ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలి. – కొడాలి నాని, ఎమ్మెల్యే ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దురాగతాలకు ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల వీడియో క్లిప్లు పరిశీలిస్తే వాస్తవం ఇట్టే అర్థమవుతుంది. జగన్పై హత్యాయత్నం ప్రతిపక్షాల కుట్రలో భాగమే. జగన్ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. చంద్రబాబు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి. – కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జగన్ను చంపాలనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్యచేయాలనే ప్రయత్నించారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ముఖ్యమంత్రికి ఏమీకాలేదు. కుల ఆధిపత్యంతో, అసూయతో ఇలా చేశారు. ఈ కుట్రను ప్రధాని నరేంద్రమోదీ వెలికి తీయించాలి. పొత్తులతోను, డబ్బుతోను అధికారం చేజిక్కించుకోవాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించదని తెలియడంతో ఈ కుట్ర చేశారు. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ఉంది. వారిద్దరి దుర్మార్గపు ఆలోచనతోనే సీఎంపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్పై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దారుణానికి పాల్పడ్డారు. – సింహాద్రి రమేష్బాబు, ఎమ్మెల్యే నైతికంగా దెబ్బతీయాలని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం అధికంగా ఉండడం గమనించి, ఆయన్ని నైతికంగా దెబ్బతీయాలనే హత్యాయత్నం చేశారు. వైఎస్సార్సీపీకి గ్రాఫ్ పెరుగుతోందని గ్రహించి ఓర్వలేక ఈ దారుణానికి తెగబడ్డారు. గతంలో విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య వంటివి చూస్తే.. ఎదుటి వ్యక్తులను కుట్రలతో దెబ్బతీయడం టీడీపీకి అలవాటేనని అర్థమవుతోంది. – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనం పడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దుర్ఘటలకు పాల్పడడం దారుణం. దాడిచేసిన వారిని గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ప్రజానాయకుడిపై హత్యాయత్నం ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు. పేదల పెన్నిధి, విద్య, వైద్యం, సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం దుర్మార్గం. గాయపడిన జగన్కు ప్రథమ చికిత్స చేశా. ఆయనలో ఎలాంటి భయం లేదు. – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం హేయం. ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటెలిజెన్స్పై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేయడం తప్పు. దీన్లో పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ మీద చర్యలు తీసుకోవాలి. – వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే -
ఇంటింటా డాక్టర్
‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్ అడ్వయిజర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్’ ఉండాలి. ఆ డాక్టర్ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్ అడ్వయిజర్ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్లో కోర్సు చేసి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు రీ డిజైన్ చేస్తున్నా’’నని చె΄్పారు. ‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఫార్మసీ డిపార్ట్మెంట్గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్లో ఎంబీబీఎస్లో సీట్ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది. కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్ఎమ్ఎస్లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్ వెళ్లిన తర్వాత సీనియర్ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్లో సొంతంగా క్లినిక్ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. పేషెంట్ల వల్లనే తెలిసింది! నేనిప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్యానల్ డాక్టర్గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్ అవేర్నెస్ ్రపోగ్రామ్స్ చేస్తున్నాను. హెల్త్ కేర్ అవేర్నెస్ ్రపోగ్రామ్ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్లే. డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో ఒక్క మెసేజ్ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్స్ట్రువల్ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్కు కూడా శ్రీకారం చుట్టాను. వారం రోజుల శిక్షణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్ అడ్వైజర్లు పేషెంట్ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్– పేషెంట్ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది. వెయ్యి మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్ అడ్వైజర్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్ సరళ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్ఘడ్లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్కుమార్ మోర్ల -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్రెడ్డి -
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్లో వయోలిన్ ఇన్స్ట్రక్టర్గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్క్లాస్కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
‘‘ఆయన్ని నమ్మకద్రోహి, అవకాశవాది అనడం మేలు’’
ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును కీర్తిస్తూ చాలామంది చాలా మాటలు అంటూంటారు. మీడియా మొఘల్ వంటి భుజకీర్తులు చాలానే తొడుగుతూంటారు. ఈ జాబితాలోకి నమ్మకద్రోహి, అవకాశవాదీ వంటివి కూడా చేరిస్తే బాగుంటుందేమో అంటున్నారు ఆయన తోడల్లుడు... డాల్ఫిన్ అప్పారావు! విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఈనాడు కార్యాలయం డాల్ఫిన్ అప్పారావు, ఈయన మేనమామలదే. వ్యాపారం కోసమని 33 ఏళ్లపాటు వాడుకోమని లీజుకిస్తే రామోజీరావు మోసం చేశాడని, గడవు తీరిన తరువాత కూడా రకరకాల కారణాలు, పేచీలతో కోర్టుల చుట్టూ తిప్పుతూ స్థలం ఖాళీ చేయకుండా తనకు ద్రోహం తలపెట్టారని ఆయన ఈమధ్యే ‘సాక్షి’ టీవీతో తన గోడు వెళ్లబోసుకున్నారు. రామోజీరావు నమ్మిన వాళ్లను మోసం చేయడం ఇదే మొదటిసారి కాదులెండి. 1974లో విశాఖపట్నంలో ఈనాడు మొదలైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వార్తా పత్రికల్లోనూ అచ్చు అయ్యాయి. అక్కడేం జరిగింది? విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ స్థలం ఎవరిదన్న విషయం తెలిసింది కొద్దిమందికే. ఈశ్వర కుమార్ వర్మ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రామోజీరావుకు లీజుకిచ్చారు. దీర్ఘకాలిక లీజు. కచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్లు. హైదరాబాద్లోని సోమాజీగూడలో ఉన్న ఈనాడు ప్రధాన కార్యాలయం కూడా ఈ కుటుంబానిదేనని, రెండు చోట్లా లీజు గడువు ముగిసిన తరువాత కూడా స్థలం ఖాళీ చేసి యజమానులకు అప్పగించకుండా రామోజీ తన పేచీకోరు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని డాల్ఫిన్ అప్పారావు సాక్షి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదంత ఒక ఎత్తు అయితే లీజుకు తీసుకున్న స్థలం తన సొంతమైనట్లు రోడ్డు విస్తరణ కోసమని ప్రభుత్వానికి అప్పగించడం.. ప్రతిగా అందే పరిహారాన్ని కూడా తన ఖాతాల్లో, తనవారి ఖాతాల్లో వేయించుకోవడం ఇంకో ఎత్తు. విశాఖపట్నం స్థలం 2.70 ఎకరాల్లో సుమారు 517 చ.మీటర్ల స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి (రోడ్డు విస్తరణ కోసం) అప్పగించినందుకు గాను పరిహారంగా ఇచ్చిన 872 చ.మీటర్ల స్థలాన్ని రామోజీ తన పేరుతో రాయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. అందుకేనేమో.. డాల్ఫిన్ అప్పారావు కూడా రామోజీని ‘కఠిన దుర్మార్గుడు’ అని అభివర్ణించారు. ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికే చెందిన స్థలంలో హైదరాబాద్లోని ఈనాడు కేంద్ర కార్యాలయం నిర్మించారని చెప్పుకున్నాం కదా.. ఈ విషయంలోనూ రామోజీరావు ఆడిన డ్రామా అంత ఇంత కాదని డాల్ఫిన్ అప్పారావు చెబుతారు. లీజు ముగిసిన తరువాత స్థలాన్ని ఖాళీ చేయకపోగా...స్థలాన్ని తనకే అమ్మేయాలని డిమాండ్ చేయడం.. అది కూడా పావల అర్ధకు ఇచ్చేయాలని చెప్పడం రామోజీరావు నైజాన్ని బయటపెడుతుందన్న విమర్శలున్నాయి. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత గతిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేయాల్సి వచ్చింది! ఏతావాతా.. లీజు పేరుతో స్థలం తీసుకోవడం.. గడువు తీరినా ఖాళీ చేయకపోవడం.. పత్రికను అడ్డుపెట్టుకుని లీజుదారులను బెదిరించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా అలసిపోయేలా చేసి రాజీకి ఒప్పించడం! ఇదీ రామోజీ మోడస్ ఆపరాండీ అంటారు డాల్ఫిన్ అప్పారావు. హైదరాబాద్, విజయవాడ స్థల వివాదాలను పరిశీలిస్తే ఇవన్నీ నిజమేనని అంగీకరించక తప్పదు! డాల్ఫిన్ అప్పారావు మాటల్లోనే చెప్పాలంటే న్యాయం జరగడంలో కొంత ఆలస్యమైతే కావచ్చు కానీ.. ఎప్పటికైనా సత్యం, ధర్మం గెలిచి తీరుతాయి! ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! -
నాన్న ఎక్కుపెట్టిన గన్!
(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే.. నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను. జూనియర్ వరల్డ్కప్లో గోల్డ్ మెడల్.. ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్కప్లో గోల్డ్మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్షిప్, ఏసియన్ చాంపియన్íÙప్లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే. ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం. ‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం. -
జేఎన్–1 అంత ప్రమాదకరం కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 అంత ప్రమాదకరమేమీ కాదని.. దాని గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి దీని తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియెంటే కాబట్టి ఎక్కువ మందికి సోకవచ్చన్నారు. అంతేతప్ప తీవ్ర లక్షణాలు ఉండటంగానీ, ప్రమాదకరంగా మారే అవకాశంగానీ తక్కువని స్పష్టం చేశారు. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా అంచనా ప్రకారం.. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని చూస్తే ఈ వైరస్ అంతగా ప్రమాద కారి కాదు. సాధారణ జలుబు, దగ్గు, సైనసైటిస్, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. అందరూ అన్నిచోట్లా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కేన్సర్, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తే చాలు. డబ్ల్యూహెచ్వో పరిశీలిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) జేఎన్–1ను వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది. అంటే వచ్చే 10– 15 రోజులు ఇది ఎంతగా విస్తరిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది (ఇన్ఫెక్టి విటీ), సీరియస్ ఇన్ఫెక్షన్గా మారుతుందా (విరులెన్స్) అన్న అంశాలను పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న డేటా మేరకు ఈ వైరస్కు విరులెన్స్ అంత ఎక్కువగా లేదు. వ్యాపించే సామర్థ్యం ఒమిక్రాన్ అంతలేదు.. కానీ డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్కు సంబంధించి కేరళలో ఎక్కువగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. యూఎస్, యూరప్లోనూ నమో దవుతున్నాయి. రోగ నిరోధక శక్తి ముఖ్యం ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీముఖ్యం. ప్రస్తుతం మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందనే దానిపై ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నాం. వారం, పదిరోజుల్లో ఇది పూర్తవుతుంది. బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నవారు బూస్టర్ డోస్ను వేసుకోవాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది ‘‘మళ్లీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అమెరికాలో అయితే 65ఏళ్లు దాటినవారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు . అదే భారత్లో చాలా వరకు వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా సోకి ఉండటంతో ఏర్పడిన ‘హైబ్రిడ్ ఇమ్యూనిటీ’ ఉంది. ఒకవేళ వైరస్ సోకినా అది తీవ్ర వ్యాధిగా మారకుండా ఈ ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్లలో మార్పులతో జేఎన్–1 వేరియంట్ ఏర్పడినందున గతంలో తీసుకున్న వ్యాక్సినేషన్, కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇది తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనితో జ్వరం, గొంతునొప్పి, గొంతులో గరగర, దగ్గు, తలనొప్పి వంటి స్వల్ప అస్వస్థతే కలుగుతోంది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చినవారికి లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. ’’ – డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
బార్ కౌన్సిల్కు సాయం అందించిన ఒకే ఒక్క సీఎం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనంత నరసింహారెడ్డి.. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. వరుసగా మూడు సార్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఒక న్యాయవాది 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సేవలందించడం దేశంలోనే రికార్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బార్ కౌన్సిల్ తొలి చైర్మన్గానూ ఆయనే ఎన్నికయ్యారు. ఐదుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ కో–ఆప్షన్ సభ్యుడిగానూ పనిచేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బార్ కౌన్సిల్కు నేరుగా సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అని పేర్కొంటున్న నరసింహారెడ్డి వివరాలు ఆయన మాటల్లోనే.. సేవా భావంతోనే బార్ కౌన్సిల్కు... జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో సివిల్ కోర్టులో ఎక్కువగా కేసులు వాదించే వాడిని. అప్పటి నుంచే న్యాయవాదుల సంక్షేమానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. దీంతో నన్ను బార్ కౌన్సిల్కు పోటీ చేయమని చాలా మంది న్యాయవాదులు ప్రోత్సహించారు. నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా ఆహ్వానించారు. అలా 1995లో తొలిసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యా. సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడి న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. సహచరులు దేశాయ్ ప్రకాశ్రెడ్డి(మాజీ ఏజీ), జస్టిస్ ఏ.గోపాల్రెడ్డి (జడ్జి)తో కలసి పలు కార్యక్రమాలు చేపట్టాం. మహానేత వైఎస్సార్తో అనుబంధం... 2006లో తొలిసారి బార్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టా. కొద్ది రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ను కలిసే అవకాశం వచ్చింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేద్దాం అని ఆయన అడగడంతో కొన్ని వివరాలను చెప్పా. ఒక్కొక్కటిగా చేస్తూ పోదాం అంటూ న్యాయ శాఖ మంత్రిని పిలిచి వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. అప్పటికే ఇతర రంగాలు సాంకేతిక వైపు పరుగులు ప్రారంభించడంతో నాటి సీజే జస్టిస్ మదన్లోకూర్ సూచన మేరకు బార్ అసోసియేషన్లలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాం. వాటి వినియోగంపై న్యాయవాదులకు శిక్షణనిచ్చాం. స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవాదులు సంక్షేమం కోసం బార్ కౌన్సిల్కు రూ.100 కోట్లు కేటాయించి.. రూ.25 కోట్లు మంజూరు చేశారు. అక్కడ కొత్త న్యాయవాదులకు ఐదేళ్ల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నా.. న్యాయవాదులు వినియోగించే స్టాంప్ల ద్వారా న్యాయవాదుల సంక్షేమ నిధికి కొంత మేర నిధులు చేకూరుతాయి. ప్రభుత్వ అధికారులు కూడా విధిగా ఈ స్టాంప్లు వినియోగించాలని చట్టం చెబుతున్నా వారు పాటించడంలేదు. అడ్వొకేట్ లా అకాడమీ ఏర్పాటు నా కల.. రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేయలన్నది నా కల. యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వ డం, సీనియర్ న్యాయవాదులతో మార్గనిర్దేశం చేసే కార్యక్రమాలు చేయాలని భావించాం. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా దీనిపై అడుగు ముందుకు పడటం లేదు. మీడియేషన్ చట్టబద్ధం కానుంది.. కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులకు మీడియేషనే పరిష్కారం. న్యాయవాదులకు మీడియేషన్పై అవగాహన కల్పించాలి. ముందుగా ఏ కేసునైనా మీడియేషన్కు పంపిన తర్వాతే విచారణ చేపట్టాలి. ఆ దిశగా కేంద్ర చట్టం చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే అధికారికంగా మీడియేటర్లను నియమిస్తారు. వారిచ్చే ఉత్తర్వులు చట్టబద్ధం అవుతాయి. అలాగే, పాత కాలపు పద్ధతులకు స్వస్తి పలికే చర్యలు తీసుకున్నాం. కోర్టుల్లో యువరానర్, మైలార్డ్ పదాలు అవసరం లేదని సర్, మేడమ్ అంటే చాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాయవాదులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు. -
మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్(బాల్కొండ) ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ► నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? ► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్ సబ్స్టేషన్ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? ► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు? ► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే. ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్ఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్లో మేం బలంగా ఉన్నాం. కిషన్రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
‘‘అధికార బీఆర్ఎస్పై ప్రజల ఆగ్రహ జ్వాలల అగ్నిపర్వతం నవంబర్ 30న బద్దలవుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. తెలంగాణలోని యువత మొత్తం భారతీయ జనతాపార్టీ వైపే ఉంది.’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిణామాలపై అంచనా వేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా విధ్వంసానికి గురికాగా.. ఒకవేళ కాంగ్రెస్ వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడి ఉద్యోగులకు జీతాలివ్వలేక తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే బీసీ సీఎం నినాదంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి కదా ? ఎన్నికల్లో మాకు, బీఆర్ఎస్కే ప్రధాన పోటీ. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అనేక నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదు. గ్యారంటీల పేరుతో హైప్ సృష్టించే ప్రయత్నంతోపాటు బీజేపీపై బురదచల్లి తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్నిపర్వతం బద్ధలవుతుందో తెలియదన్నట్టుగా పరిస్థితి ఉంది. వారు ఎంత ప్రచారం చేస్తే ఏమి లాభం, ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నేతల బలాన్ని చూసి ఇప్పుడు బయటకు చెప్పకపోవచ్చు. కానీ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ బింకాలు పోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పడితే అక్కడకు వెళ్లాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. మంత్రులను నియమించుకుంటున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కేవలం భ్రమల్లో బీఆర్ఎస్ నేతలు బతుకుతున్నారు. ఇక మా పార్టీకి ఊహించని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఇది మామూలు పరిస్థితుల్లో రాదు. మాది యూత్ఫుల్ పార్టీ. ఎక్కడి చూసిన యువతే పార్టీని నడిపిస్తోంది. ప్రచారాన్ని ఎప్పుడు ముమ్మరం చేస్తారు ? నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక.. మొత్తంగా దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాం. బీజేపీకి పోలింగ్బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఎవరు అభ్యర్థులు ఐనా ఒరిజినల్గా ఉన్న ఆర్గనైజేషన్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అభ్యర్థుల ఖరారులో ఆలస్యం వల్ల ప్రచారానికి ఇబ్బంది కాదా ? బీజేపీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఖరారులో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఆయా స్థానాలకు ఖరారు చేసిన వారు ఇప్పటికే మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న వాళ్లే. ప్రజలకు బాగా తెలిసినవారే. అందువల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. రాబోయే ఇరవై రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, అమిత్షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఇలా హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిస్తాం. పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తాం. పాత వారికి కాకుండా కొత్త వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు ? మాది పెరుగుతున్న పార్టీ. బలపడుతున్న పార్టీ. అందువల్ల మిక్స్డ్గా ఆలోచించాలి. పాత–కొత్త కలయికగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్తో ప్రజల మద్దతు పొందాల్సి ఉంటుంది. పాత వారికే ఇస్తామని మడికట్టుకు ఉండలేం. పూర్తిగా కొత్తవారికీ ఇవ్వలేం. ఆ దిశలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి మంచి ఫలితాలు సాధించాం. అదే ఎక్స్పర్మెంట్తో ఇప్పుడూ మంచి ఫలితాలు సాధిస్తాం. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడుతుందని మీరు పదే పదే అంటున్నారు ? ఎందువల్ల ? కాంగ్రెస్ చరిత్ర ఏమిటి? పుట్టుక ఏమిటి? అవినీతి చరిత్ర ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ? అని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడి దుస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో ఎలక్షన్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అవినీతి పాలన గురించి ప్రజలకు వివరిస్తూనే...కాంగ్రెస్ తనకు తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా అబద్ధపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పార్టీల చరిత్రను వివరించి, అవి ఏరకంగానూ తెలంగాణను ఆదుకోలేవనే విషయాన్ని ఉదా«హరణలతో చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని చెబుతున్నాం. ఇక్కడా యూపీ తరహా పాలన అంటున్నారు ? కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం వంతపాడుతూ వస్తోంది. పాతబస్తీలో మజ్లీస్ దౌర్జన్యమే నడుస్తోంది. కరెంట్ బిల్లు, ఇంటి పన్నులు వసూలు చేయలేకపోతున్నారు. 90 శాతం ఇళ్లు మున్సిపల్ అనుమతులు లేకుండానే కడతారు. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండగా నిలవడమే కారణం. యూపీలో యోగి ఆదిత్యనాధ్ పాలనలో బుల్డోజర్ ప్రభుత్వంతో ఆ రాష్ల్ర ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణలోనూ అలాంటి బుల్డోజర్ ప్రభుత్వం తెస్తాం. మాఫియాపై, అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. మజ్లిస్ పార్టీ కాదు వారి జేజమ్మలు వచ్చినా ఏమీ చేయలేరు. అక్రమాలు, దాడులకు, నేరాలకు పాల్పడే మజ్లిస్ నేతలు ఉండాల్సింది పాతబస్తీలో కాదు చంచల్గూడ, చర్లపల్లి జైళ్లల్లో.. .. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ పక్కన కూర్చుని చర్చలు జరుపుతున్నారు. -
Revanth Reddy Interview: నేడు ఇక్కడ..రేపు ఢిల్లీలో..
నిన్న కర్ణాటకలో గెలిచాం..ఇప్పుడు తెలంగాణలో గెలుస్తాం... రేపు ఢిల్లీలోనూ గెలిచి తీరుతాం అని అంటున్నారు టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75–80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. బీఆర్ఎస్కు 25, బీజేపీ, ఎంఐఎంలకు కలిపి 10 స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఐదు రోజుల రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరిన సందర్భంగా రేవంత్రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలకాంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కామారెడ్డిలో సీఎంపై పోటీ ఎందుకు చేస్తున్నారు? రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలున్నా కేసీఆర్ కామారెడ్డికి వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉంది. అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ కలిసి మా పార్టీలోని సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్అలీని ఓడించేందుకు కుట్ర చేశారు. ఆయన స్థానంలో నేను అక్కడ పోటీ చేస్తే పదేళ్ల కేసీఆర్ వైఫల్యాలు, తప్పులను ప్రజలకు చేరవేయడం సులభమవుతుంది. కేసీఆర్ పాలనా వైఫల్యాలపై జాతీయస్థాయిలో చర్చ జరగడంతో పాటు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గట్టిగా పోరాడుతుందనే సంకేతాన్ని పంపాలనేది మా అధిష్టానం ఉద్దేశం. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేస్తున్నారు? అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఢిల్లీ నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించారు. కిందిస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ అవసరాలను కూడా అంచనా వేసి అధిష్టానం ఒకట్రెండు మార్పులు చేసింది. మీ పార్టీలో ఉన్న నేతలు బలంగా లేరనే వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని తీసుకుని టికెట్లు ఇస్తున్నారా? లేదంటే కాంగ్రెస్ బలహీనంగా ఉందా? పార్టీ వేరు, నాయకులు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీలోని బలమైన 160 మంది నేతలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చిన వారిలో చాలా మంది పాత కాంగ్రెస్ వాళ్లే. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్రెడ్డి లాంటి వారు బయటకు వెళ్లి కేసీఆర్ను ఓడించాలనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని మళ్లీ పార్టీలోకి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వారు మమ్మల్ని సంప్రదిస్తే మరికొన్ని సార్లు మేమే వాళ్లను సంప్రదించి టికెట్లు ఆఫర్ చేశాం. టికెట్ల కేటాయింపులో రేవంత్ వర్గానికే ప్రాధాన్యం ఉందా? 119 మంది కూడా నా వర్గమే. సోనియా, ఖర్గే వర్గమే. రేవంత్ ఒక్కడే టికెట్లు నిర్ణయించడు. సీఈసీ నిర్ణయిస్తుంది. ఆ సీఈసీలో 16 మంది ఉద్ధండులుంటారు. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలో కూడా భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు. అది పార్టీ సమష్టి నిర్ణయం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి సహజంగానే జరుగుతున్న పరిణామాలన్నీ నాకు ఆపాదిస్తారు. కాళేశ్వరం వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారా? రాహుల్గాంధీ, నేను, భట్టి విక్రమార్క వెళ్లి ప్రాజెక్టును చూసి ప్రపంచానికి నిజం చెప్పాం. అన్ని స్థాయిల్లో చర్చలు పెట్టాం. ఎన్నికల నేపథ్యంలో మీడియా అంతా ఎన్నికల వివాదాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అందుకే చర్చ జరగడం లేదు. సింహం సింగిల్గానే వస్తుందని, కోహ్లీలాగా మళ్లీ సెంచరీ కొడతామని మంత్రి కేటీఆర్ అంటున్నారు కదా? కృష్ణానగర్ పోతే ఇలాంటి మాటలు చెప్పేటోళ్లు చాలా మంది ఉంటారు. అవన్నీ ఉద్దెర మాటలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏదో లేఖ రాశారని అబద్ధం చెప్పి కేటీఆర్ ఇరుక్కున్నాడు. తర్వాత ఫేక్ అని ఒప్పుకున్నాడు. సైలెంట్ అయిపోయాడు. ఒక్కరోజు వార్తతో లబ్ధి పొందాలని చూశాడు. సైబర్ క్రైమ్లో కేసు అయ్యింది. కర్ణాటక çపోలీసులు వచ్చి గుంజుకుని పోయి జైల్లో వేస్తే కానీ కేటీఆర్కు అర్థం కాదు. ఢిల్లీ దొరల మధ్య తెలంగాణ ప్రజల మధ్య పోటీ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా? సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడడంలో పోటీ పెడితే కేసీఆర్ కుటుంబమే ఫస్ట్ వస్తుంది. ఢిల్లీకి పోయి నా కొడుకుని సీఎం చేస్తానని మోదీని అడిగింది మేమా? కేసీఆరా? అడుక్కున్నది కేసీఆర్. ఢిల్లీకి బానిసలై ఇక్కడ గులాబీలమని చెప్పే వారికి ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసే హక్కు లేదు. కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ నాశనమైందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీరేమంటారు? కేసీఆర్ విశ్వాసం కోల్పోయిన నాయకుడు. అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్సిటీ, ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లైఓవర్లు నిర్మించి రూ. 60వేల కోట్ల ఆదాయం ఇక్కడి నుంచి వచ్చేలా చేసింది కాంగ్రెస్ కాదా..? అభివృద్ధి చేస్తే నాశనం చేసినట్టా..? నాగార్జునసాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, జూరాల, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీరాంసాగర్, ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టినందుకు తెలంగాణ నాశనమైందా? టికెట్లు అమ్ముకున్నారని మీ పార్టీలో టికెట్లు రాని వారంటున్నారు... ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు మీ పేరు మార్చి పిలుస్తున్నారు కదా? టికెట్లు అమ్ముకున్నారనడంలో వాస్తవం లేదు. టికెట్ల నిర్ణయంలో రేవంత్రెడ్డి ఒక్కడికే ఆ అధికారం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరువయ్యారని బిల్లా అంటుంటే... కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారని రంగా అంటున్నాడు. బిల్లా రంగాల మధ్యనే ఈ విషయంలో వైరుధ్యం ఉంది. కాంగ్రెస్ టికెట్లు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయని అంటే ఓట్ల విషయంలో బాహుబలి కలెక్షన్లు వచ్చినట్టే కదా? వాళ్లు నోట్ల రూపంలో చూస్తే నేను ఓట్ల రూపంలో చూస్తున్నా. వచ్చే ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు? కాంగ్రెస్ పార్టీకి 75–80 స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్కు 25 కంటే ఎక్కువ రావు. బీజేపీకి 4 మించవు. ఎంఐఎంకు 5–6 మాత్రమే వస్తాయి. తెలంగాణపై మీ పార్టీ అధిష్టానం ఎందుకు అధిక ఫోకస్ పెట్టింది? నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీ... తెలంగాణలో గెలుపు ద్వారా ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు మార్గం ఏర్పడుతుంది. అందుకే అధిష్టానం ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదా..? టీడీపీ నుంచి పోయినోళ్లు 90 శాతం మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులే. తలసాని, నిరంజన్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో సహా కేసీఆర్ కూడా తెలుగుదేశం వాళ్లే కదా? మరి, టీడీపీ పోటీ పెట్టకపోతే వారికి లాభం వస్తుందని అనుకోవచ్చు కదా? తెలుగుదేశం సానుభూతిపరులందరూ నాకే ఓటు వేస్తే మంచిదే కదా? వారు వస్తే ఆహ్వానించదగ్గ విషయమే కదా? తప్పేముంది అందులో? -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
తెలంగాణను ద్రోహులచేతిలో పెట్టే కుట్ర.. మంత్రి హరీష్
కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని.. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నవారు తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్పై కక్షగట్టి, కుట్రలు చేసి నిందలు వేసి తెలంగాణవాదాన్ని దెబ్బతీయాలనుకున్న ద్రోహులంతా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పంచన చేరారని పేర్కొన్నారు. బ్యారేజీ పిల్లర్లు ఒకటో రెండో కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందంటూ విపక్షాలు పైశాచిక ఆనందంతో వికృత వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హరీశ్రావు ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలతో పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. మీ ఒంటరి పోరు ఫలితాన్నిస్తుందా? రాష్ట్రం ఏర్పడితే కొన్నిరోజులు అన్నం మానేసిన పవన్కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. టీడీపీతో కాంగ్రెస్ పరోక్షంగా పొత్తు పెట్టుకుంది. కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోంది. తెలంగాణవాదాన్ని దెబ్బతీయాలనుకున్న ద్రోహులు కాంగ్రెస్, బీజేపీలను అడ్డం పెట్టుకుని తెలంగాణను, కేసీఆర్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి తెలంగాణ ద్రోహులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సమైక్యవాదులతో అంటకాగుతున్నారు. ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయని కిషన్రెడ్డి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఆయనకు సలహాదారు. తెలంగాణ ద్రోహుల పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేం తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉన్నాం. బీజేపీ, కాంగ్రెస్ మాకు సమాన ప్రత్యర్థులే. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు, నివేదికల సంగతేంటి? నాయకులకు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశం లేదు. కాళేశ్వరం మునిగితే కేసీఆర్ను బద్నాం చేయ డం ద్వారా నాలుగు ఓట్లు సాధించే తాపత్రయం. కాళేశ్వరం అంటే 21 పంపుహౌస్లు, 22 లిఫ్ట్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ పైప్లైన్, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 19 రిజర్వాయర్లు, మూడు బ్యారేజీలు.. ఇంత భారీ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మునిగిపోయిందంటూ పైశాచిక ఆనందంతో విపక్షాలు వికృత వ్యాఖ్యలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద నయాపైసా భారం పడకుండా టెక్నికల్ రిపోర్టుల ఆధారంగా ఏజెన్సీల ద్వారా పునరుద్ధరణ జరుగుతుంది. కాళేశ్వరానికి రూ.80వేల కోట్లు ఖర్చు పెడితే రాహుల్గాంధీ రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ మతిలేని మాటలు అంటున్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్లో 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 10 టీఎంసీలు, అనంతగిరి, రంగనాయక్ సాగర్లలో మూడేసి టీఎంసీలు, మిడ్మానేరులో 25 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలపై మీ స్పందన? రైతుబంధు, ఆసరా వంటి మా పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టింది. గతంలో నీటి తీరువా, భూమిశిస్తు, కరెంటు బిల్లులు, మార్కెట్ శిస్తు రూపంలో రైతుల ముక్కుపిండి వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ది. అవన్నీ బంద్ చేసి ‘రైతుబంధు’తో ఆదుకుంటున్నది కేసీఆర్. కానీ కాంగ్రెస్ రైతులను అవమానిస్తూ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. మీ ప్రచారంలో కాంగ్రెస్ కర్ణాటక నేతలపై విమర్శలు ఎందుకు? ఇక్కడి ప్రజాసమస్యలను గాలికొదిలేసి తెలంగాణలో ‘కర్ణాటక మోడల్’ అమలు చేస్తామనడం తెలంగాణ పురోగతిని 20 ఏళ్లు వెనక్కి నెట్టడమే. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని గతంలో తెలంగాణ ప్రజలకు అనుభవమే. 24గంటలు ఇస్తున్నచోట 5 గంటలు ఇచ్చేవాళ్లు ప్రచారం చేయడం విడ్డూరం. కర్ణాటక నుంచి తెచ్చిన డబ్బుతో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. నేతలను అంగడి సరుకులా కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ ‘బీసీ సీఎం’ ప్రకటనపై... ‘తల్లిని చంపి బిడ్డను తీశారు’ అని తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీకి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీపై... గజ్వేల్లో కేసీఆర్ కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. కేసీఆర్ గతుకుల గజ్వేల్ను బతుకుల గజ్వేల్గా మార్చారు. వందేళ్ల అభివృద్ధిని పదేళ్లలోనే చేసి చూపించారు. సీఎంపై పోటీ ద్వారా తాను పెద్ద నాయకుడినని చెప్పుకోవడానికి ఈటల ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేటలో మీ మెజారిటీ రికార్డును మళ్లీ బ్రేక్ చేస్తారా? పార్టీ కోసం పనిచేయడం నా బాధ్యత. నిరంతరం నియోజకవర్గ ప్రజల నడుమ ఉంటూ శక్తివంచన లేకుండా వారి కష్టసుఖాల్లో తోడున్నా. వారంతా నా కుటుంబ సభ్యులు. ఈసారి ఎన్నికల పరీక్షలోనూ మంచి మార్కులు వేస్తారనే భావిస్తున్నా. మైనంపల్లి హన్మంతరావు మీపై ఆరోపణలు ఎందుకు చేశారు? సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికిపై టికెట్లు ఇచ్చాం. అందువల్ల కొందరు ఆశించినవి నెరవేరలేదు. మైనంపల్లికి, ఆయన కుమారుడికి టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్ మంచివారు, లేకపోతే కాదా? మైనంపల్లి తన కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించలేదని స్పష్టమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతల ప్రచారాన్ని ఏమంటారు? టికెట్ల కోసం ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. చివరికి ప్రచారం కోసం కూడా ఆ నాయకులపైనే ఆధారపడటం సిగ్గుచేటు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తరాది నేతల కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారు. రేపు పాలన కూడా ఢిల్లీ నేతల రిమోట్లోనే ఉంటుంది. కేసీఆర్ ఉండగా పరాయిపాలన అవసరమా? కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మీ ప్రచార సరళి ఎలా ఉండబోతోంది? హుస్నాబాద్ సహా ఉమ్మడి మెదక్లోని 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూనే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రచారంలో పాల్గొంటున్నా. మొదటి దశలో సీఎం ప్రచార సభలు పూర్తయిన చోట అవసరాన్ని బట్టి, పార్టీ వ్యూహం మేరకు నేను, కేటీఆర్ పర్యటనలు చేస్తాం. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడిని ఎలా చూస్తున్నారు? కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ నాయకులు సహా ఏ ఇతర శక్తులున్నా వదిలి పెట్టేది లేదు. రాష్ట్రంలో ప్రత్యర్థులను నిర్మూలించే సంస్కృతి లేదు. ఆస్పత్రిలో ఉన్న ప్రభాకర్రెడ్డితో నామినేషన్ వేయించేందుకు ఎలా తరలించాలనే అంశంపై వైద్యులతో మాట్లాడుతున్నాం. ప్రభాకర్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం, అవసరమైతే దుబ్బాక ఎన్నికల ప్రచార బాధ్యత కూడా తీసుకుంటా. -
విలువలకు నిదర్శనం రావి జీవితం
కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. హరిజనులను ప్రేమించే వారు.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్నగర్లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. తాతయ్యతో ఎంతో అనుబంధం .. చిన్నతనం నుంచి హిమాయత్నగర్లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు. ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది.. తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. నేటి రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. - యంబ నర్సింహులు -
తెలంగాణను గుప్పిట్లో పెట్టుకునే కుట్ర
కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై రెండు రోజుల్లో బీజేపీ ఆఫీసులో అడ్డగోలుగా నివేదికను వండివార్చారని.. ఇది రాజకీయ కక్షతో కేసీఆర్ను బద్నాం చేసి తెలంగాణను గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాలోచన మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అక్కడ నమూనాలు ఏమైనా సేకరించారా? ల్యాబ్ టెస్ట్లు చేశారా? ఆ రిపోర్టులేవైనా బయటపెడ్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల హయాంలో నిర్మించిన ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు, బెంగాల్లోని ఫరక్కా ప్రాజెక్టుల్లోనూ తొలినాళ్లలో సాంకేతిక లోపాలు తలెత్తితే వాటిని సరిచేశారని. ఇదీ అంతేనని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. సాక్షి: బీఆర్ఎస్ గత హామీలేవని బీజేపీ, తమ గ్యారంటీలను కాపీ కొట్టారని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై స్పందన? కేటీఆర్: మా మేనిఫెస్టోను ‘కేసీఆర్ భరోసా’గా పిలుస్తూ 15 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం. రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచుతూ కొత్తగా తెల్లరేషన్ కార్డున్న 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, సన్నబియ్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష కింద రూ.15 లక్షల కవరేజీ, మహిళలకు నెలకు రూ.3వేలు భృతి, రూ.400కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతీ ఇంటికీ తాగునీరు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వంటి ఎన్నో హామీలను మోదీ సర్కారు నెరవేర్చలేదు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా బీజేపీ తీరు ఉంది. రైతుబంధును కాపీ కొట్టిన కాంగ్రెస్ మా మేనిఫెస్టోను విమర్శించడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ కంటే తమ పాలనే బెటర్ అంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యలను ఏమంటారు? కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు, కల్లోలం, కష్టాల కడలి. తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఉండేవి. ఇప్పుడు తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానంతోపాటు విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాం. వాళ్లకు మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీరు అభ్యర్థులకు బీఫారాలు కూడా ఇచ్చేశారు. విపక్షాల్లో ఇంకా ఎంపికే పూర్తికాకపోవడంపై కామెంట్! విపక్షాలు సీట్లు పంచుకునేలోపు మేం స్వీట్లు పంచుకుంటాం. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని రాహుల్ అడుగుతున్నారు. 1952 నుంచి 2013 దాకా తెలంగాణను వేధించినది ఆ ఢిల్లీ దొరలే. రాష్ట్రాన్ని ఇవ్వ కుండా వందలమంది చావులకు కారణమైందీ వారే. 2014 నుంచి నేటివరకు తెలంగాణను వేధిస్తున్న మరో ఢిల్లీ దొర ప్రధాని మోదీ. ఈ ఎన్నిక కూడా ఢిల్లీ దొరల అహంకారం.. తెలంగాణ ఆత్మగౌరవానికి నడుమ సాగుతున్న పోరాటం. ఇప్పటికే బీఆర్ఎస్ ‘ఓవర్ ఫ్లో’అయిందని చెప్పి.. మళ్లీ పెద్ద సంఖ్యలో చేరికలేమిటి? మేం బలపడి, ఇతరులు బలహీనపడాలనే యుద్ధనీతి, రణతంత్రంలో భాగంగా చేరికల ఎ త్తుగడను అనుసరిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీలు చివరి నిమిషంలో చేరుతున్న పారాచూట్ లీడ ర్లకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. మేం 95% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చాం. ఇతర పార్టీ లు సుదీర్ఘకాలం పనిచేసిన నేతల గొంతు నొక్కు తుంటే.. పొన్నాల, నాగం, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పి.విష్ణువర్ధన్రెడ్డి, దరువు ఎల్లన్న వంటి ఎందరో నేతలు బయటికి వచ్చారు. బీజేపీ ‘బీసీ సీఎం’ నినాదంపై మీరేమంటారు? గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు.. అధికారం రాదని తెలిసి బీజేపీ ఈ నినాదం ఎత్తుకుంది. బీసీ ని రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొ లగించిన బీజేపీ.. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్ నూ పట్టించుకోవట్లేదు. వ్యక్తికి కులం కాదు గుణం ముఖ్యం. దళితులు, బీ సీలు, కులవృత్తులకు మేలుచేస్తున్న కేసీఆర్కు అందరి ఆశీర్వాదం ఉంది. మోదీ, అమిత్ షా, సోనియా, రాహుల్ వంటి ఢిల్లీ నేతల ధాటిని తట్టుకోగలరా? ఢిల్లీ నేతలకు సామంతులుగా ఉండే కీలుబొమ్మలు కావాలి. కానీ మోదీ, రాహుల్లకు కొరుకుడు పడని కొయ్య కేసీఆర్. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ పార్టీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతరులను దిగుమతి చేసుకుని దాడికి దిగుతున్నాయి. మేం తెలంగాణను గెలిపించే పనిలో ఉన్నాం. వాళ్లు తెలంగాణను గెలుచుకునే పనిలో ఉన్నారు. అవగాహన రాహిత్యంతో రాహుల్ విమర్శలను చూసి పప్పు అనక తప్పలేదు. వారు ఇటుకతో కొడితే మేం రాయితో కొడుతాం. బీజేపీ–జనసేన పొత్తు, కాంగ్రెస్కు వైఎస్సార్టీపీ, టీజేఎస్ మద్దతు, బీఎస్పీ పోటీ వంటి వాటిని ఎలా చూస్తున్నారు? ఆ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు ఏకోన్ముఖంగా ఉంటారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ప్రజలకు స్పష్టత ఉంది. జేబులో ఉన్న నోటు వంటి కేసీఆర్ను వదులుకుని.. చిల్లర నాణేల లాంటి పార్టీలను ప్రజలు ఏరుకోరు. తాత్కాలికంగా పాలపొంగు లాంటి అసంతృప్తి, ఆవేశం అక్కడక్కడా ఉన్నా కేసీఆర్ తమ ఇంటి మనిషి అని ఓటర్లు అనుకుంటున్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ అంటోంది? కేసీఆర్ నిరాహార దీక్ష, వందలాది యువత ఆత్మ బలిదానాలు, వైఎస్ జగన్ ఏపీలో కొత్త పార్టీ పెట్టడంతో.. కాంగ్రెస్కు నూకలు చెల్లి అనివార్య స్థితిలో తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ రాకపోతే రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేవాడే కాదు కదా. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి? అది అత్యంత దారుణమైన అమానవీయ చర్య. తెలంగాణలో రాజకీయంగా విభేదాలున్నా హత్యా రాజకీయాలు లేవు. రేవంత్ నాయకత్వంలో ఈ సంస్కృతి వస్తోంది. సిట్టింగ్లపై వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు? మేం విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. కొన్ని తప్పులు, పొరపాట్లు, అసంతృప్తి వంటివి ఉన్నా ఈ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ ఉండాలా వద్దా అనే అంశానికే ప్రాధాన్యం. త్వరలోనే మిగతా అభ్యర్థులకు బీఫారాలు ఇస్తాం. కేసీఆర్ చేస్తున్న యాగం మీద విమర్శలపై స్పందన? హిందువులు రెండు రకాలు. ఒకరు కేసీఆర్లా నిజమైన ధార్మిక భావాలు కలిగినవారు. మరికొందరు కేవలం రాజకీయంగా వాడుకునే సన్నాసులు. అలాంటి వారే క్షుద్రపూజలు అంటూ విమర్శలు చేస్తారు. కేంద్రంతో ఘర్షణ వైఖరిపై మీ వివరణ? కేంద్రంతో ఎన్నడూ మా అంతట మేం తగాదా పెట్టుకోలేదు. కెలికి కయ్యం పెట్టుకుంటే తగినరీతిలో సమాధానం చెప్పాం. రాబోయే రోజుల్లో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో పోటీచేసి, 25 స్థానాల్లో గెలిచినా ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం. ప్రజల అసంతృప్తి పాలపొంగు మా ప్రభుత్వంపై తాత్కాలికంగా పాలపొంగు వంటి అసంతృప్తి అక్కడక్కడా ఉన్నా.. ‘కేసీఆర్ మా ఇంటి మనిషి.. ఆయనపై గులుగుడే గులుగుడే.. ఓట్లు గుద్దుడు గుద్దుడే’ అని ఓటర్లు అనుకుంటున్నారు. కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి లో గెలుపు ఖాయం. ఈటల రాజేందర్ అటు హుజూరాబాద్, ఇటు గజ్వేల్లో ఓటమి ఖాయం. రేవంత్ కూడా అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో ఓడిపోతారు. కేసీఆర్ చేతిలో ఓటమి ద్వారా పరువు కాపాడుకునేందుకు ఇద్దరూ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్కు మేలు చేసేందుకే టీడీపీ పోటీకి దూరం ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ కు మేలు చేసేందుకే. కాంగ్రెస్, తెలుగుదేశం లోపా యికారీగా కలవడం కలికాలమే. గత ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలసి పోటీచేశాయి. అధికారం కోసం కలలు కనడం కాంగ్రెస్కు కొత్త కాదు. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ వైషమ్యాలు, విభేదాలు తెలంగాణకు పాకవద్దు. నిరసన తెలిపే హక్కు ఉన్నా అందుకు అనువైన వేదికలు ఉన్నాయి. ధర్నాచౌక్లో నిర భ్యంతరంగా నిరసన వ్యక్తం చేయొచ్చు. ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిచ్చుపెట్టవద్దని కోరుకుంటున్నా. – మంత్రి కేటీఆర్ - కల్వల మల్లికార్జున్రెడ్డి -
సహజ వనరుల బ్యాలెన్స్షీట్స్ ఏవీ?
చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా, చైర్మన్ బోర్డ్ఆఫ్ స్టడీస్గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్గా సేవలందించారు. 1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ? ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి. పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య... అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్ఈసీ) ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ? ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి. సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ? అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది. పర్యావరణ అంశాలపై .. దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్చాంబర్గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు. -కె. రాహుల్ -
పొలిటీషియన్ కాదు..పొలిటికల్ లీడరే ముఖ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.... దృక్కోణంలో మార్పు కావాలి పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది. రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి. యువశక్తిలో ఉద్వేగమెందుకు? రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి. వలసలు తగ్గాయి.. జీవనం మారింది ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్గా మారింది. దీంతో అన్స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. -వనం దుర్గాప్రసాద్ -
మేనిఫెస్టోకు న్యాయప్రాతిపదిక లేదు: జస్టిస్ రామలింగేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు న్యాయప్రాతిపదిక లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లో విచారించాల్సి ఉందన్నారు. అయితే సిబ్బందిలేమి, ఇతర కారణాలతో ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ బాధితుడికి న్యాయం అందడం లేదని చెప్పారు. స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ (ఈసీ).. కేంద్ర ప్రభుత్వ ఆదీన సంస్థగా పనిచేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్ అధికారుల నియామకం ప్రభుత్వాల పరిధి నుంచి ఏదైనా అత్యున్నత స్థాయి కమిటీకి అప్పగిస్తే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జస్టిస్ రామలింగేశ్వర్రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: ఎన్నికల సమయంలో పారీ్టలు సాధ్యాసాధ్యాలను చూడకుండా మేనిఫెస్టో ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక వీటిని అమలుచేయకుంటే ప్రజలు ఏమి చేయాలి? జవాబు: ఎన్నికల సమయంలో పార్టీలు ఉచితాల పేరుతో ఇష్టం వచి్చనట్లు మేనిఫెస్టో ప్రకటిస్తున్నా యి. దీన్ని ఈసీకి అందజేస్తాయి. అయితే, వాటిని అమలు చేయాల్సిన చట్టబద్ధత పార్టీలకు లేదు. చట్టప్రకారం ఎవరూ ప్రశ్నించలేరు. మేనిఫెస్టో అ మలు చేసి తీరాల్సిందేనని తాము కూడా ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రశ్న: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సంస్కరణలు రావాల్సి ఉంది? జవాబు: డబ్బున్న వారే ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారే విజయం సాధించి ప్రజలను ఏలుతున్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో పేద, మధ్యతరగతికి చెందిన వారు అసెంబ్లీ మెట్లెక్కేందుకు ఆస్కారం లేకుండా ఉంది. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ల సేవలు వినియోగించుకోవాలి. ఎన్నికల పరిశీలకులుగా అధికారంలో ఉన్న వారు ఉంటే పారీ్టకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రశ్న: ఎన్నికల పిటిషన్లపై విచారణ ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోంది? జవాబు: ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 86(7) ప్రకారం రోజువారీ విచారణ చేపట్టయినా ఆరు నెలల్లో తీర్పునివ్వాలి. దురదృష్టవశాత్తు ఇది ఎక్కడా అమలు కావట్లేదు. ఐదేళ్లు దాటినా విచారణ సాగుతుండటంతో బాధితుడికి న్యాయం అందడం లేదు. ఇందులో మార్పు రావాలంటే న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలి. హైకోర్టులో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పు వెల్లడించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెబుతున్నా.. అడుగు ముందుకు పడట్లేదు. దీంతో ఇది అక్రమార్కులకు వరంలా మారింది. ప్రశ్న: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎలా ఉంది? జవాబు: కొన్ని దేశాల్లో ఎన్నికల కమిషన్ను ప్రజలే ఎన్నుకునే వ్యవస్థ ఉంది. మన వద్ద కూడా అలాంటి వ్యవస్థ వస్తే.. ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుంది. టీఎన్ శేషన్, లింగ్డో హయాంలో ఉన్న ఈసీకి.. ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఈసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. దీని నిర్ణయాలు ఎవరికీ లోబడి ఉండవు. అధికారుల నియామకం ప్రభుత్వాల పరిధిలో ఉండటంతో వారు స్వామి భక్తి పరాయణులుగా మారుతున్నారు. ఈ విధానం మారాలి. ప్రశ్న: ఈసీ అధికారాల్లో కోర్టులు కలుగజేసుకోగలవా? జవాబు: ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. ఆరి్టకల్ 324 ప్రకారం ఈసీ స్వతంత్రంగా పనిచేయాలి. ఇందులో కోర్టు కలుగజేసుకోవడం స్వల్పమే. ఏవైనా పిటిషన్లు వచ్చినప్పుడు కోర్టులు విచారణ చేపడతాయి తప్ప.. నేరు గా ఈసీ అధికారాల్లో వేలుపెట్టవు. ఎన్నికల సంస్కరణలు రావాలంటే ఈసీ మారాలి. అప్పుడే ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టే అస్కారం ఉంటుంది. ప్రశ్న: ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో సీజేఐ కూడా ఉండాలన్న చర్చ జరిగింది.. కానీ అది అమలు కాలేదు? జవాబు: ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. ఆ ప్యానెల్లో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తుండటంతో కార్యరూపం దాల్చలేదు. ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసి ఈసీ అధికారుల నియామకాన్ని దానికి అప్పగిస్తే సంస్కరణలకు అవకాశం ఉంటుంది. ప్రశ్న: ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు బాధిత పార్టీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వ కాలపరిమితి ముగిసే వరకు స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు? జవాబు: స్పీకర్ అంశం శాసనసభకు సంబంధించినది. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఒకదాని పరిధిలో మరొకటి కలుగజేసుకోవడం స్వల్పమే. ఒకదానిపై మరొకటి గౌరవంతో మెలగాలి. దీంతో స్పీకర్ విధుల్లో ఎక్కువగా కోర్టులు కలుగజేసుకోవు. సూచనలు చేస్తాయి తప్ప.. ఆదేశాలివ్వలేవు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 దీని గురించి స్పష్టంగా చెప్పింది. ‘సమత’ కేసుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి జస్టిస్ రామలింగేశ్వర్రావు 1982లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1983–84లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్లో ఫెలో గా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల రక్షణ కోసం ఈయన వాదించిన కేసు దేశమంతా ‘సమత’కేసుగా ప్రసిద్ధి చెందింది. న్యాయమూర్తిగా 20 వేలకుపైగా తీర్పులిచ్చారు. వీటిలో వందకుపైగా తీర్పులు లా జర్నల్లో ప్రచురించారు. ఆయనకు సాహిత్యం, కళలపై మక్కువ ఎక్కువ. -
CBN IT Notices: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు!
సాక్షి, హైదరాబాద్ : ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్కమ్ట్యాక్స్ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో, టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..? ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. ఈ కేసులో నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్ను విచారించే అవకాశం ఉందా? ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్కు సైతం లోకేశ్ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా? చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్ ఇన్వాయిస్లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..? ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్లో చార్జిషీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా? గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు.. ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు. తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్ 153 సీ, సెక్షన్ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్డిక్షన్ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..? గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్గా రాదు. అక్కడ జ్యుడీషియల్ పవర్స్ ఉండే జ్యుడీషియల్ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్ పవర్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో సీరియస్ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్వాయిస్లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా.. నా పీఎస్ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్ శ్రీనివాస్ ద్వారా తమను వేధించడంతోనే డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి. డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్లో పేమెంట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది. :::ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్ రాంబాబు -
మెగా ఫ్యాన్స్ సపోర్ట్తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్తో గ్లోబల్గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్కి గురై, నన్ను హత్తుకుంది. -
తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నైవేలీ సిద్ధం.. చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ను ఉత్పత్తి చేసి అప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిందే. భారీ పరిమాణంలో విద్యుత్ను నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవడానికి అవసరమైన సాంకేతికత, సదుపాయాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారిగా 8 మెగావాట్ల భారీ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బెస్)ను దక్షిణ అండమాన్ దీవిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) ఏర్పాటు చేసి విజయవంతంగా గ్రిడ్కు అనుసంధానం చేసింది. ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతంగా స్టోరేజీ సిస్టంను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, దానికి అనుసంధానంగా 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. 101.94 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.136.61 కోట్లను ఖర్చు చేసినట్టు నైవేలీ సంస్థ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలిపారు. సాధారణంగా యూనిట్ సౌర విద్యుదుత్పత్తికి రూ.2.60 నుంచి రూ.2.8 పైసల వ్యయం అవుతుండగా, బ్యాటరీ సిస్టంలో నిల్వ చేసేందుకు అవుతున్న వ్యయాన్ని కలుపుకుని.. మొత్తంగా యూనిట్కు రూ.7.41 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆయన గత జనవరి 12న నైవేలీ సంస్థ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఏర్పాటైన తొలి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైవేలీ సంస్థ తరఫున పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అండమాన్లో మరో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్.. దక్షిణ అండమాన్ విద్యుత్ అవసరాలు 35 మెగావాట్లు. పూర్తిగా డీజిల్ జనరేటర్లతోనే ఆధారపడేవారు. పెద్ద ఎత్తున కాలుష్యం, డీజిల్ వ్యయం ఉండేది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఈ సమస్య కొంత మేరకు తగ్గింది. అండమాన్ విజ్ఞప్తి మేరకు రెండో విడత కింద మరో 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ను ఏర్పాటు చేయబోతున్నాం. రెండో దశ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే విద్యుత్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతిక విశేషాలు.. - లిథియం అయాన్ బ్యాటరీల మోడ్యూల్స్ - 1260 - 0.96 ఎంవీఏ సామర్థ్యం గల 9 బెస్ కంటైనర్లు - 0.96 ఎంవీఏల సామర్థ్యం గల బై-డైరెక్షనల్ పవర్ కండిషనింగ్ సిస్టంలు- 18 - యూనిట్ విద్యుత్ ధర రూ.7.4 ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం.. వ్యాపార విస్తరణలో భాగంగా పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, లిగ్నైట్ నుంచి మిథనాల్, గ్యాస్, డీజిల్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ, ఏపీతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాలపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల రంగ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లో నైవేలీ ఆధ్వర్యంలో ఎలక్రి్టక్ వాహనాల పరిశ్రమ స్థాపనకు పరిశీలిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ఇంధన శాఖలతో చర్చలు సైతం జరిపాం. రెండు రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్.. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం. ఆ వెంటనే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణకు 311 మెగావాట్లు తెలంగాణకు, 230 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. మా విద్యుత్ అత్యంత చౌక.. మా లిగ్నైట్ గనుల దగ్గరే విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. లిగ్నైట్ రవాణా ఖర్చులుండవు. దీంతో దేశంలోనే అత్యంత చౌక విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. ధరలపరంగా మెరిట్ ఆర్డర్లో టాప్ పోజిషన్లో ఉన్నాం. రూ.24000 కోట్ల పెట్టుబడులు.. దేశంలోనే 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ మాదే. 2030 నాటికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 6000 మెగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం నైవేలీ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ఎల్ను నెలకోల్పాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలిస్తాం. -
ప్రపంచ బ్యాంక్లో మన తెలుగమ్మాయి
ఇందుది కృష్ణా జిల్లా పెనమలూరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్. తల్లి గృహిణి. ఎం.ఎస్. చేయడం కోసం యూఎస్ వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం... స్పష్టమైన గమ్యం... లక్ష్యంపై ఏకాగ్రత... నిండైన ఆత్మవిశ్వాసం ఇందు సొంతం. తల్లిదండ్రులు మాధవి, సత్యనారాయణ. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.ఎస్. పబ్లిక్ పాలసీ చేసింది. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించిన వైనాన్ని ఆమె ‘సాక్షి’తో వివరించింది. ► పర్యావరణ పరిరక్షణ ‘‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత నా దృక్కోణం విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్– మేసన్’లో ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లు, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం ఇచ్చింది. ► దక్షిణ ఆసియా వాతావరణం నాకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా, జాయింట్ మల్టీ బ్యాంకు డెవలప్మెంట్ మధ్య సమన్వయకర్తగా, విధానాల రూపకల్పనలు, వాటికి సాంకేతికతను అన్వయించడం, అమలు చేయటం, వివిధ దేశాలలో ఉండవలసిన కచ్చితమైన వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, సంబంధిత దేశాల వాతావరణ కాలుష్య కార్యక్రమాల్లో అమలు తేడాలను విశ్లేషించడం నా విధులు. వీటికి సంబంధించిన నివేదికల తయారీ, ఒప్పందాల అమలు పర్యవేక్షణ, సమావేశాల్లో చర్చించటం మా విభాగం నిర్వర్తించాల్సిన ప్రత్యేక విధులు. అమెరికా ప్రభుత్వం నాకు ప్రత్యేకంగా జీ4 వీసా జారీ చేసింది. విధులకు హాజరుకావాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి విధుల్లో చేరాలి’’ అని చెప్పారు ఇందు కిలారు. సాధించిన విజయాలివి ► కంప్యూటర్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయి క్యాంపస్ ఇంజినీరు పరీక్షకు హాజరై రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఇందు ఒకరు. ► యూఎస్ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా యూనిటీ అండ్ డైవర్సిటీ సంఘానికి ఏకగ్రీవంగా కోఆర్డినేటర్గా ఎన్నిక. ఆ బాధ్యతల్లో విదేశీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి. విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులకు మధ్య వారధిగా పనిచేసి మల్టీ టాస్కింగ్ విజర్డ్గా గుర్తింపు. ► క్రిసాలిస్ అనే ఎన్జీఓ సంస్థలో మేనేజ్మెంట్ బోర్డు అడ్వయిజర్గా సేవలు అందించడం. ► టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీచ్ ఫర్ చేంజ్ సంస్థలకు సేవలు అందించడం. ► ఎం.ఎస్.లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ 65 లక్షల రూపాయల ఉపకార వేతనం పొందడం. ► విదేశీ విద్యార్థినిగా స్నాతకోత్సవ సభలో యూనివర్సిటీ ఫ్లాగ్ బేరర్గా ఎన్నిక. ఔట్స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారం. ► ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు. గ్లోబల్ వార్మింగ్పై అధ్యయనం ప్రపంచ బ్యాంకు టీమ్తో కలిసి దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలి. ప్రధానంగా భారత్–పాకిస్థాన్ దేశాలలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తాను. ఇండియన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రౌండ్ లెవల్లో కూలింగ్ సొల్యూషన్స్పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తాను. ఉష్ణోగ్రతలు 1.5–2 డిగ్రీల వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుంది. – ఇందు కిలారు – పోలవరపు వాసుదేవ్, సాక్షి, పెనమలూరు, కృష్ణా జిల్లా. -
ఆ మాటలే నాకు దీవెనలు
‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా? సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను. ► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి? విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను. ► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా? ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది. ► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు? ‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు. ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి. ► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి.. నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను. -
జగన్ సంక్షేమ పథకాలతో బాబు, రామోజీలకు భయం
జగన్ సంక్షేమ పథకాలతో చంద్రబాబు, రామోజీరావులకు భయం పట్టుకుందని ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు తోడల్లుడు అప్పారావు తెలిపారు. వారికి ఇక భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని వెల్లడించారు. అందుకే జర్నలిజం విలువలకు పాతరేసి ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సహకారంతో రామోజీరావు శంషాబాద్ విమానాశ్రయం వద్ద 450 ఎకరాలు కొన్నారన్నారు. అలాగే అమరావతిలోనూ బినామీల ద్వారా భూములు కొనిపించారని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండానే రాజధానిని ప్రకటించారని తప్పుబట్టారు. అమరావతి ప్రాంతంలో మంచి పంటలు పండే భూములను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు రామోజీరావు తోడల్లుడు అప్పారావు సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... మా అబ్బాయిని రామోజీరావు వేధించారు.. డాల్ఫిన్ హోటల్కు మా అబ్బాయి శ్రీనివాస్ రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. కానీ.. మా అబ్బాయిని రామోజీ వేధించారు. దీంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత.. డాల్ఫిన్ హోటల్కు ఎండీగా తన కోడలు విజయేశ్వరిని రామోజీ నియమించుకున్నారు. ఇక కళాంజలిని మా అమ్మాయి ఎంతో అభివృద్ధి చేసింది. ఆమెని కూడా బయటకు తరిమేశారు. రామోజీరావు, చంద్రబాబు గురుశిష్యులు చంద్రబాబు సహకారంతో రామోజీ అన్నింటినీ నిలబెట్టుకుంటూ వచ్చారు. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నప్పుడు 400 నుంచి 450 ఎకరాలు రామోజీరావు కొనుగోలు చేశారు. అదేవిధంగా అమరావతిలో రాజధాని అని ముందుగానే చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో అక్కడ కూడా రామోజీ తన బినామీలతో భూములు కొనిపించారు. ఆ విషయంలో చంద్రబాబు, రామోజీ ఇద్దరూ గురుశిష్యులు... టూ ఇన్ వన్. చంద్రబాబుది పవర్.. రామోజీది కోరిక. జగన్ను చూసి రామోజీ, చంద్రబాబులో భయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసి.. రామోజీ, చంద్రబాబులో భయం ఏర్పడింది. ఇదే తరహాలో జగన్ వెళ్తే.. తమకు భవిష్యత్తు ఉండదనివారిద్దరూభయపడుతున్నారు. అందుకే పూర్తిగా బరితెగించి.. జర్నలిజం విలువల్ని రామోజీరావు దిగజార్చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంపైనా ఇష్టం వచ్చి నట్లుగా రాతలు రాస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ద్వారా బయటవాళ్లకు మాత్రం నీతులు చెబుతూ.. తాను మాత్రం పాటించననే అహం రామోజీరావుకే సొంతం. రామోజీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు.. రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త. ఆ సమయంలో ఎన్టీఆర్ రామోజీని విశ్వసించేవారు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తుంటే ముందు రామోజీకి చెప్పేవారు. క్రమంగా ఎన్టీఆర్ జాతీయ నేతగా ఎదుగుతున్న సమయంలో కొన్నిసార్లు రామోజీకి చెప్పకుండానే కొన్ని పనులు చేశారు. దీంతో రామోజీకి భయం పట్టుకుంది. ఎన్టీఆర్ తన గుప్పిట నుంచి జారిపోతున్నారని భావించారు. యూఎల్సీకి సంబంధించి ఈనాడుకు చెందిన ఫైల్ వెళ్తే ఎన్టీఆర్ దాన్ని పక్కన పెట్టమని అధికారులకు చెప్పారు. అప్పట్లో ఉపేంద్ర అనే వ్యక్తి ఎన్టీఆర్కు పీఏగా ఉండేవారు. అయితే.. అతడి వ్యవహారం నచ్చక ఎన్టీఆర్ పక్కన పెట్టేశారు. ఆ సమయంలో చంద్రబాబు వచ్చారు. అప్పటి నుంచి రామోజీరావు, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్కు ప్రతికూలంగా మారిపోయారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా దుర్మార్గానికి తెరతీసి ఆయనను పదవీచ్యుతుడిని చేశారు. అప్పట్లో లిక్కర్ కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబుకు భారీగా నిధులు ముట్టిన విషయం తెలిసి.. ఈనాడులో దీనిపై కార్టూన్ వేశారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు రామోజీ కాళ్లు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒక్కటైపోయారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే రాజధాని ప్రకటన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ కమిటీ నివేదికను పూర్తిగా మార్చేశారు. నారాయణను బినామీగా పెట్టుకొని.. ఆయనతో పనికిరాని నివేదిక ఇప్పించారు. అలాగే శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే అమరావతిని ప్రకటించారు. రామోజీరావుతో శంషాబాద్ వద్ద 450 ఎకరాలు కొనిపించినట్లుగానే అమరావతి ప్రకటనకు ముందు అక్కడ వాళ్ల వాళ్లతో భూములు కొనిపించారు. మంచి పంటలు పండే భూములను నాశనం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖను రాజధాని చేయడం అవసరం. అలాగే కర్నూలును కూడా న్యాయ రాజధానిగా చేయాలి. ప్రజలు వైఎస్ జగన్తోనే ఉంటారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో 2019లో విజయం సాధించారు. ప్రస్తుతం అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా సామాన్య ప్రజల అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కూడా బాగా జరిగింది. ప్రజలు తప్పకుండా జగన్తోనే ఉంటారు. ఆయనను మించిన మగాడెవరూ కనిపించడం లేదు. రామోజీలో మానవత్వం లోపించింది మనుషుల్లో ఆప్యాయత, అనురాగం ఉండాలి. కానీ రామోజీలో మానవత్వం లోపించింది. ఆనాడు మేము బయటకు రావడానికి, ఈనాడు ప్రజలు ఆయనకు దూరమవ్వడానికి ఇదే కారణం. ఆయన ప్రజలను పూర్తిగా విశ్వసించి ఉంటే ఈనాడులో ఈ తరహా రాతలు ఉండేవి కాదు. ప్రతి ఊరు రాజధాని అయినంత సంతోషంగా ఉంది అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతుంటే ఇబ్బంది ఏముంది? ఒక దగ్గరే పాలన చేయాలనేముంది? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత హ్యాపీగా ఉంది. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఎవరూ రాజధానికి వెళ్లాల్సిన పనిలేదు. అందరికీ వారున్న గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎలా తన ఛరిష్మాతో జనంలో నాటుకుపోయారో.. అదే తరహాలో జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. -
మాది చతుర్ముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు అవసరమైన వ్యూహాలు, అంచనాలు తమకున్నాయని, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాలసీ, క్యాలుక్యులేషన్, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ (పీసీసీఈ) అనే చతుర్ముఖ వ్యూహంతో తాము ముందుకెళుతున్నామని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 72 స్థానాలు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 25కి మించిరావని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీల డీఎన్ఏ ఒక్కటే అన్న రేవంత్, టీఆర్ఎస్, కేసీఆర్లు గతమని వ్యాఖ్యానించారు. ♦ హాథ్సే హాథ్జోడో యాత్రల్లో భాగంగా గురువారం కరీంనగర్లో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. రేవంత్ ఏమన్నారంటే...! మాతో పోటీపడే వారు లేరు పార్టీ సభ్యత్వ నమోదును మేం క్యాజువల్గా తీసుకోలేదు. చాలా క్యాలుక్యులేటెడ్గా చేశాం. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా 80లక్షల ఓట్లు అవసరమని మా అంచనా. 75–80 లక్షల ఓట్ల వరకు వస్తే గెలుస్తాం. మా పార్టీలో 43 లక్షల మంది సభ్యులుగా చేరారు. రాష్ట్రంలోని 36,594 పోలింగ్ బూత్లలో 42వేల మందిని బూత్ ఎన్రోలర్స్గా చేర్చాం. పార్టీ సానుభూతిపరులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకునే వారు కాకుండానే 43 లక్షల మంది కాంగ్రెస్ పార్టీలో బాహాటంగానే సభ్యత్వం తీసుకున్నారు. ఫిరాయింపులే వారికి టాస్క్ రాష్ట్రంలో మాతో పోటీ పడే ప్రధాన రాజకీయ పక్షాలయిన బీఆర్ఎస్, బీజేపీల డీఎన్ఏ ఒక్కటే. రూ. వేల కోట్లు పెట్టి ఎన్నికలు చేయడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఆ రెండు పార్టీలది ఒకటే వైఖరి. ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అమలు ఏ పార్టీకయినా ఒక టాస్క్ లాంటిది. కానీ ఆరెండు పార్టీలకు ఫిరాయింపులే ప్రధాన టాస్క్ . గతంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడేవాళ్లు కాదు. వాళ్లకి బీజేపీనే పోటీ అన్నట్టు వ్యవహరించే వాళ్లు. కానీ, హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రల తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మా తోక పట్టుకుని నడిచే పరిస్థితి వచ్చిం ది. యాత్రలో భాగంగా నేను ఎక్కడకు వెళ్తే కేటీఆర్ అక్కడకు వెళ్తున్నారు. శైవం మీద దాడి కాదా..? కేసీఆర్కు వైష్ణవం మీద నమ్మకం ఉండొచ్చు కానీ శైవంమీద దాడి చేయకూడదు. శ్మశానాలను కూడా వదలకుండా వైష్టవాన్ని రుద్దే ప్రయత్నం చేశాడు. శ్మశానాలంటే శైవ కేంద్రాలు కానీ వాటికి వైకుంఠ ధామా లు అని పేరు పెట్టాడు. కేసీఆర్ హయాంలో ఆచారాల శాశ్వత విధ్వంసం జరుగుతోంది. అప్పుడేం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చేసిన పనులకు, చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి ఉంది. గతంలో ద్రోహులు, దుర్మార్గులు, తెలంగాణ వ్యతిరేకులుగా చిత్రీకరించిన వారందరినీ ఇప్పుడు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మాకు 38శాతానికి పైగానే ఓట్లు వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై మా అంచనాలు మాకున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 25 స్థానాల్లోపే పరిమితం అవుతుంది. ఆ పార్టీకి 28–32 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. బీజేపీకి 12–13 శాతం ఓట్లు వస్తాయి కానీ, సీట్లు సింగిల్ డిజిట్కు మించవు. ఎంఐఎం మళ్లీ 3.5 శాతం ఓట్లతో 7–8 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 38శాతం కంటే ఎక్కువ ఓట్లతో 72 స్థానాల్లో గెలుస్తుంది. మొదటి దశ యాత్రలు పూర్తయ్యాకే కరీంనగర్లో కాంగ్రెస్ పని అయిపోయింది. అంతా బీజేపీనే అన్నారు. ఇప్పుడు నేను హాథ్సే హాథ్జోడో యాత్రలకు వెళ్తుంటే వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. మొదటి దశలో భాగంగా మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంటు స్థానాల్లో నేను యాత్ర చేస్తా. ఆ తర్వాత ఏం చేయాలన్నది పార్టీ నేతలందరం కూర్చుని నిర్ణయించుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలూ లేవు. అందరం కలిసే ఉన్నాం. నా యాత్రకు అందరూ వస్తారు.’అని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. కేసీఆర్ ముసలోడయ్యాడు ఇప్పుడు టీఆర్ఎస్, కేసీఆర్ అనేది గతం. తాను ముసలోడిని అయ్యానని ఆయనే చెపుతున్నాడు. ఆ పార్టీ మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. అందుకే ఆ పార్టీ విషయంలో టీఆర్ఎస్–కేసీఆర్లు గతం, బీఆర్ఎస్–కేటీఆర్లే భవిష్యత్తు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ. ఇక, బీజేపీ విషయంలో బండి సంజయ్ ప్రజలతో సంబంధం లేని వ్యక్తి. గత 23 ఏళ్లుగా ప్రజల మధ్యన ఉంటూ, తొమ్మిదేళ్ల కాలంలో టీఆర్ఎస్, కేసీఆర్లతో కొట్లాడిన రేవంత్ను చూడండి. ఈ మూడు కాంబినేషన్లను చూసి ఓట్లు ఎవరికి వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. 60 మంది దాకా అభ్యర్థులు ఖరారయ్యారు అభ్యర్థుల విషయానికి వస్తే మా పార్టీలో 50 శాతానికిపైగా అభ్యర్థులు ఇప్పటికే ఖరారయినట్టే. చాలా చోట్ల పొటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉంది. 60మందికి పైగా నేతల పేర్లు ప్రకటించడమే తరువాయి. వారంతా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. -
హ్యాపీ జర్నీ
సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి. వర్క్ ఫ్రమ్ వెకేషన్! ‘‘కరోనా నా ట్రావెల్ లైఫ్ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్డౌన్ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్ వీకెండ్ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ని వర్క్ ఫ్రమ్ వెకేషన్గా మార్చుకున్నాను. నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కో మార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్లు డాక్టర్ సలహా తీసుకుని బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రకృతి పిలుస్తోంది! కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్ డెస్టినేషన్గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్ జోన్లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్కి మంచి లొకేషన్లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్ కుండ్, కీర్గంగ, రూప్కుండ్, బ్రిబ్లింగ్, థషర్ మషర్ ట్రెక్, బ్రమ్తాల్, పిన్ పార్వతి, హమ్తా పాస్ ట్రెక్లను దాదాపుగా అందరూ చేయవచ్చు. యూత్కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్పాస్ ట్రెక్ మంచి థ్రిల్నిస్తుంది. నేను కశ్మీర్– గుల్మార్గ్, ఉత్తరాఖండ్– ఔలిలలో ఐస్స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్ కరోనా విరామాల్లోనే చేశాను. చార్థామ్ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్లోనే. శాంతియాత్ర లాక్డౌన్ విరమించిన తర్వాత నా ట్రావెల్ లిస్ట్లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్కి వెళ్లి నా వందదేశాల టార్గెట్ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్ చేస్తూ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్’ అనే పదం పుట్టింది. కేర్ఫుల్గా వెళ్లిరండి! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్ కోసం మార్కెట్లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్ ట్రావెల్ డెస్టినేషన్ అయింది. అక్కడ డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. – పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్ – వాకా మంజులారెడ్డి -
మ్యాజిక్ లేదు..మాటలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్రావ్ ఠాక్రే చెప్పారు. ఏ సమ స్యకైనా పరిష్కారం ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న సమస్యలకు కూడా ఎక్కడోచోట పరిష్కారం లభిస్తుందని, ఆ పరిష్కారం కనుగొనేందుకే తాను తెలంగాణకు వస్తున్నానని అన్నారు. తాను రాష్ట్రానికి వచ్చి ఏదో మ్యాజిక్ చేయాలనుకో వడం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమవుతుందనేది తన నమ్మకమని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియా మకమైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంగళవారం ముంబై నుంచి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలుఠాక్రే మాటల్లోనే.. కాంగ్రెస్ బలం తగ్గలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో మా బలం ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుభూతితో ఉన్నారు. నాకున్న అవగాహనకు తోడు పార్టీ నేతల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని, డిస్కషన్స్ (చర్చలు)తోనే తెలంగాణ కాంగ్రెస్ను డీల్ చేయాలనుకుంటున్నా. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడిని విడివిడిగా కలవాలని నిర్ణయం తీసుకున్నా. వచ్చీ రాగానే విడివిడిగా సమావేశం ఎందుకు పెట్టారన్నదానికి ప్రత్యేక సమాధానం ఏం లేదు.. కానీ ఒంటరిగా కలిసిన ప్పుడే కొంతమంది అన్ని విషయాలు మాట్లాడతా రు. రాజకీయ పార్టీల్లో ఈ ఒరవడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేర్వేరుగా కలవాలని నిర్ణ యం తీసుకున్నా. రాష్ట్రానికి చెందిన మరికొందరు సీనియర్ నేతలతో కూడా విడిగా భేటీ అవుతా. పార్టీ పటిష్టత, గెలుపు కోసం వారి మనసులో మాట ఏంటో తెలుసుకుంటా. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జ రుగుతాయి. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే టాస్క్ ఏఐసీసీ నాకిచ్చింది. ఆ టాస్క్ను విజయవంతం చేయడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా.’ రాష్ట్రంలో బీజేపీ గాలిబుడగలాంటిది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నా యం. ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీల ప్రభావం కొంతమేర ఉన్నా మేం లేకుండా ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ అయినా మరే కొత్త పార్టీ వచ్చినా అది సాధ్యం కాదు. తెలంగాణలో బీజేపీ గాలిబుడగ లాంటిది. కాంగ్రెస్ పార్టీని దాటి ముందుకెళ్లే పరిస్థితి ఇప్పట్లో జరిగేది కాదు. తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి వచ్చి తీరతాం. -
పెట్టుబడులకు థీమ్... భారత్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు.. ► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా మూడు థీమ్లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్లోనూ ఇదే ధోరణి కనిపించనుంది. ► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి? ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు? ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్/హైబ్రిడ్ ఫండ్స్కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది. -
వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో " స్ట్రెయిట్ టాక్ "
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..
కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). ►మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. ►దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. -
అలా బతకలేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా, ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు అని అడిగితే.. 'నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు.. నాకు అనిపించింది నేను చేస్తా. నచ్చినట్లు ఉంటా. అన్నింటికంటే నాకు ఇదే ముఖ్యం. నచ్చినట్లు బతకలేకపోతే సూపర్ స్టార్ అయినా, ఎంత సంపాదించినా లాభం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తనను చాలా బాగా అర్థం చేసుకుంటారని, తన గురించి తనకే చెప్తారంటూ పేర్కొన్నాడు. ఇక విజయ్ అందరికీ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం అతని నిజాయితీ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. ప్రతిరోజూ విజయ్ తనకు కొత్తగానే కనిపిస్తాడని, పని విషయంలో చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చింది. -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్లకు ఒక్కొక్కటీ, సౌత్కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
పల్లెపల్లెకు వెళ్తేనే పరిష్కారం.. చేతిరాత పహాణీలతో ధరణిని ఆధునీకరించాలి
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా భూ సమస్యలు తీరకపోవడంతో సర్కారు సహా అన్ని రాజకీయ పక్షాలు మళ్లీ భూసర్వే రికార్డులు, సమస్యలపై దృష్టి సారించాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి ప్రభుత్వం మండల స్థాయి రెవెన్యూ సదస్సులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ శిబిరాలతో భూ సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్న భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్ర: మళ్లీ రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారమవుతాయా? జ: భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సులు జరగడానికంటే ముందే ఆ ఊరిలోని భూ సమస్యలను గుర్తించాలి. ఇందుకోసం ఆ గ్రామ యువతకు తర్ఫీదు ఇచ్చి వారిని ఇందులో భాగస్వాములను చేయాలి. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి. చేతిరాతతో పహాణి రాసి ఆ తరువాత ధరణి రికార్డును సవరించాలి. ప్రతి గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేసి వారికి కనీసం 3–6 నెలల గడువు ఇవ్వాలి. ప్ర: కొత్త రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కులకు పూర్తి హామీ ఇస్తుందా? జ: భూ రికార్డుల్లోని వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉంటుంది. రికార్డుల్లో పేరు ఉన్నా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది. అలాంటి వ్యవస్థను తెస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఇంకా అలాంటి చట్టమేదీరాలేదు. భూ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు ఈ దేశంలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఒకప్పటి ఎన్ఎల్ఆర్ఎంపీ, ఇప్పటి డీఐఎల్ఆర్ఎం పథకం అందుకు ఉద్దేశించిందే. టైటిల్ గ్యారెంటీ చట్టం ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ఆధారంగా ఇప్పటికే రాజస్తాన్, ఏపీ చట్టాలు రూపొందించుకున్నాయి. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి వస్తే భూములన్నింటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులోని వివరాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం అందుతుంది. తెలంగాణ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆ భరోసా ఇవ్వదు. ప్ర: భూ సమస్యలను ‘ధరణి’ ఏ మేరకు పరిష్కరించగలిగింది? జ: భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలోకి నిక్షిప్తమయ్యాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగవంతం, సులభతరం అయ్యాయి. కానీ భూ సమస్యల పరిష్కారం క్లిష్టతరంగా మారింది. ధరణిలో తప్పులను సరి చేయించుకోవడం రైతులకు చాలా కష్టంగా ఉంది. ధరణిలో వివరాలను సరిచేయడానికి పెట్టుకున్న వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే రికార్డు (ధరణి)లో తప్పుల సవరణ కోసం రూ. వెయ్యి ఫీజు తీసుకోవడం పేద రైతులకు భారంగా మారింది. అనేక సమస్యలకు ఆప్షన్లు ఇవ్వనేలేదు. ప్ర: రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుతో ఏ మేరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయి? జ: భూ సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో తాత్కాలిక జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి పాత కేసులను పరిష్కరించింది. కొత్త కేసులన్నీ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఓఆర్ చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి తీసివేశారు. కానీ అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పీటీ భూముల సమస్యలు, ఇతర భూ వివాదాలు ఇంకా రెవెన్యూ కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. అయినా ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రెవెన్యూ యంత్రాంగం భూమి సమస్యలను పరిష్కరించకుండా కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ధరణిలోని సమస్యలను పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్త వ్యవస్థ భూ సమస్యల పరిష్కారాన్ని రైతులకు భారంగా మార్చింది. సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. భూ వివాదాలు పరిష్కారం కావాలంటే జిల్లాకొక ట్రిబునల్ను ఏర్పాటు చెయ్యాలి. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కారమయ్యేలా భూ వివాద పరిష్కర చట్టాన్ని రూపొందించాలి. ప్ర: భూమి హక్కులకు చిక్కులు లేకుండా చూడాలంటే ఏం చేయాలి? జ: భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే వ్యవస్థ కావాలి. భూ చట్టాలన్నీ కలిపి ఒక రెవెన్యూ కోడ్ను రూపొందించాలి. సమస్యల పరిష్కారానికి జిలాకొక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ఒక్కసారన్నా చేతిరాత పహాణీ రాసి దాని ఆధారంగా ధరణిని సవరించాలి. గ్రామ రెవెన్యూ కోర్టులను నిర్వహించి భూ వివాదాలు పరిష్కరించాలి. పారాలీగల్ వ్యవస్థను మళ్లీ తేవాలి. భూముల సర్వే జరగాలి. మొత్తంగా తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అమలు జరగాలి. ప్రజల భూమి ఆకాంక్షలు నెరవేరకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం కావాలంటే భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి. -
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్వీన్గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్ని ఏదైనా పెద్ద యాక్టర్తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చి చేదోడువాదోడుగా నిలిచేందుకే..
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసిగి వేసారి ఉన్న తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చి చేదోడువాదోడుగా నిలిచేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గభేటీ, బహిరంగసభను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు సమావేశ ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశూన్యత్వంతోపాటు వివిధ అంశాలు, సమస్యలపై చేష్టలుడిగి వ్యవహరించడం, పేరుకే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడటం వంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యాన్ని బీజేపీనే పూరిస్తుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఎంతగా కృషి చేసినా శవానికి అలంకరణ చేయడంతప్ప కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం సాధ్యంకాదని అన్నారు. బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కేసీఆర్ కుటుంబ, అవినీతి, అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగివేసారి ఉన్నారు. దీని నుంచి విముక్తి కల్పించడంతోపాటు మేలైన, నీతివంతమైన పాలనను బీజేపీ మాత్రమే ఇస్తుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత రాష్ట్రంలోనే బీజేపీ విస్తరణకు అన్ని అనుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం విశ్వసిస్తోంది. అందువల్లే ఈ సమావేశాలకు, మోదీ విజయసంకల్ప సభకు హైదరాబాద్ వేదికైంది. వివిధ జాతీయ అంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలున్నాయి. 8 ఏళ్ల మోదీ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ‘మోదీ ఛరిష్మా’తో బీజేపీ గెలుపొందుతోంది. ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు... తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి, వారు పడుతున్న కష్టాలు, సమస్యల పరిష్కారానికి మోదీ బహిరంగ సభ ద్వారా భరోసా కల్పిస్తాం. భవిష్యత్ బీజేపీదేనని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అగ్రనేతలంతా పాల్గొనే సమావేశాలు, బహిరంగ సభ తోడ్పడతాయి. కాంగ్రెస్, ఎంఐఎంలు టీఆర్ఎస్కు వంత పాడే పార్టీలని, నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించబోతున్నాం. దానికి జాతీయ నాయకత్వం అండదండలు ఉన్నాయని విషయాన్ని సభ ద్వారా చాటబోతున్నాం. -
కేసీఆర్ ‘ముందస్తు’కు వెళతారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో తీవ్రస్థాయిలో వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడం, కేసీఆర్ కుటుంబం అడ్డగోలు సంపాదనతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని అన్నారు. కేసీఆర్ భాష, వ్యవహారశైలితో ప్రజలతో పాటు, వారి సొంతపార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ, ,గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులివ్వక, వాటి అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమౌతోందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు, తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాల్లో రేగుతున్న అసంతృప్తితో కేసీఆర్ కుటుంబం కుంగుబాటుకు గురైందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, బీజేపీపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి కేంద్రాన్ని ప్రజల దృష్టిలో బద్నామ్ చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని సంజయ్ విమర్శించారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను దారి మళ్లించడం, పేర్లు మార్చడం వంటివి చేస్తుండడంతో ఢిల్లీలో, తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారన్నారు. మళ్లీ కేంద్రంలో బీజేపీ సర్కార్ రావడం ఖాయం కాబట్టి, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ, 3న పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఇక్కడ జాతీయ భేటీ రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కష్టాలను సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఓదార్పు అసలే లేదు. తెలంగాణ పరిస్థితి ఒక అనాథలాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘మీకు అండగా మేమున్నాం.. మీరేం బాధపడొద్దు’ అని ప్రజలకు భరోసా కల్పించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. టీఆర్ఎస్పై గట్టిగా పోరాడుతున్న పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపేందుకు, జాతీయ నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేందుకు ఇక్కడ సమావేశమవుతున్నాం. బతుకులు మారకే టీఆర్ఎస్పై వ్యతిరేకత తెలంగాణ ఎందుకు ఏర్పడింది ? దానివల్ల ఏం లాభం జరిగింది? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల బతుకులు మారలేదు. గతంలో యువకులు ఉద్యమంలో ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకుంటున్నారు. వరికుప్పల పైనే రైతులు చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అందుకే టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి.. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అరాచకాలపై బీజేపీ సింగిల్గా పోరాడుతోంది. తెలంగాణలో బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, లెఫ్ట్ కుమ్మక్కు అయ్యాయి. అవన్నీ ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల దాకా దూరంగా ఉన్నట్టు, అవి వచ్చినప్పుడు కలిసి పోటీ చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్లీ చేరేది టీఆర్ఎస్లోనే కాబట్టి ఉమ్మడిగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఈసారి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ అణచివేతకు కుట్రలు ప్రస్తుతం టీఆర్ఎస్ను బలంగా ఎదుర్కొనే శక్తియుక్తులు బీజేపీకే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం ఎంతగానో కలిసొచ్చే అంశం. తమకు లాభం, పేరు ప్రఖ్యాతుల గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారే తప్ప తెలంగాణకు న్యాయం జరగాలి, ప్రజలకు మేలు జరగాలి అన్న ధ్యాస లేదు. కేంద్రాన్ని బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. సీఎంవోలో ప్రత్యేక విభాగం పెట్టారు. జైలు, గృహ నిర్బంధాలు, కేసులు, దాడులు, వేధింపులతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నా కార్యకర్తలు భయపడటం లేదు. టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం ప్రజా సమస్యలపై పోరాడుతున్నది బీజేపీ మాత్రమే. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను మొదట తక్కువ అంచనా వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. దానికి వచ్చిన ప్రజా స్పందన చూసి బెంబేలెత్తింది. టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్ల గెలుపు, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ విజయఢంకా మోగించడం రుజువు చేశాయి. ఈ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఓటర్లు కూడా టీఆర్ఎస్పై పోరాడేది బీజేపీనే అని అండగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. దిక్కుతోచని స్థితిలో సర్కారు రాష్ట్రం రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాబోయే 2, 3 నెలల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుస్థితి నుంచి ప్రజలను ఎలా కాపాడాలో సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రణాళికలను కేసీఆర్ చురుకుగా సిద్ధం చేస్తున్నారు. మరింత ఆలస్యమయ్యే కొద్దీ పార్టీకి రాజకీయంగా కూడా దిక్కుతోచని గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరలో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారు. -
కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి.. సుపరిపాలన నెలకొల్పడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే పుంజుకుందని.. మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసే దిశగా హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1 నుంచి 3వ తేదీ వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తరుణ్ చుగ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ్య ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు తరుణ్ చుగ్ మాటల్లోనే.. కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత చిన్నరాష్ట్రాల ఏర్పాటు ద్వారా వేగంగా అభివృద్ధి, సంక్షేమం, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది బీజేపీ నమ్మకం. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది. కానీ సీఎం కేసీఆర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తన కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారు. ఈ కుటుంబ, అవినీతి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి.. సుపరిపాలన నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ముందుకొచ్చినా తెలంగాణలోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. మరింత ఊతమిచ్చేందుకు.. నిజానికి కేవలం కార్యవర్గ భేటీ నిర్వహణతోనే ఇక్కడ సాధించేదేమీ లేదు. అయితే రాష్ట్రంలో దుష్టపాలన, మహిళలు, బలహీనవర్గాలపై దాడులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు వంటి అంశాల్లో బండి సం జయ్ నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీలో గణనీయ స్థానాలు సాధించడం ద్వారా పార్టీ బాగా పుంజుకుంది. దీన్ని మరింత విస్తృతపర్చుకుని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేలా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తాం. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ అత్యున్నత కార్యవర్గం చర్చించి.. ప్రాధాన్యతల పరంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మోదీ నామస్మరణ ఒక్కటి చాలు ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం రాష్ట్ర పార్టీ తన వంతు కృషి చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రధాని మోదీ పేరొక్కటి చాలు. దేశ ప్రజలకు ఆయన పేరే ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక మంత్రంగా మారింది. అదే బీజేపీకి శ్రీరామరక్ష. మోదీ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. సభ దిగ్విజయం అవుతుంది. కేసీఆర్, టీఆర్ఎస్ల చెవులు చిల్లులు పడేలా స్పష్టమైన సందేశాన్ని వినిపిస్తుంది. మా అంచనాలు మాకున్నాయి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనడానికి మా అంచనాలు మాకున్నాయి. పార్టీపరంగా ఉన్న వ్యవస్థతో ప్రజల మూడ్ను గమనించగలుగుతున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదన, టీఆర్ఎస్ వైఫల్యాలను చూస్తే.. ‘గోడ మీద రాత’ మాదిరిగా టీఆర్ఎస్ ఓటమి నిర్ణయమై పోయింది. బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదనేది ఒక అపోహ మాత్రమే. బూత్ స్థాయి నుంచీ మాకు పార్టీ యంత్రాంగం ఉంది. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం. ప్రజాకర్షక నాయకులు లేకున్నా మోదీ పేరు ప్రతిష్టలు, దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ప్రగతే ఓట్లు తెచ్చి పెడుతుంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మేం ఒకసారి గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు. అయినా టీఆర్ఎస్, కాంగ్రెస్లకు చెందిన పెద్దనేతలెవరూ మాకు అవసరం లేదు. వారిలో అధికశాతం అవినీతిపరులు, మరకలున్నవారే. కొందరు మంచి నేతలు కాలక్రమంలో బీజేపీలో చేరుతారు. పార్టీలో కుమ్ములాటలేవీ లేవు మాది క్రమశిక్షణ గల పార్టీ. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలేవీ లేవు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఆయా విషయాలపై అందరూ సర్దుకుంటారు. కాంగ్రెస్ అంతర్ధానమై పోయినట్టే.. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని మేం అనుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ కుచించుకుపోయి అంతర్ధానమయ్యే స్థితికి చేరింది. అది టీఆర్ఎస్ వర్గాల ప్రచారమే.. బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఎలాంటి దోస్తీ లేదు. టీఆర్ఎస్ వర్గాలే ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. బీజేపీ సొంతంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్లలో జట్టును ఫైనల్కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్ప్రీత్లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్లాండ్కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్నగర్లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్నెస్పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్నెస్పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
లోకేష్ జూమ్ మీటింగ్ లోకి అందుకే వెళ్ళాం: కొడాలి నాని ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ
-
టీడీపీలో మహిళలకు గౌరవం లేదు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడతూర్పు): ‘నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అచ్చెన్నాయుడి మాదిరిగా పార్టీ లేదు బొక్కా లేదు అనలేదు. సాధినేని యామినిలా విమర్శలు చేయలేదు. నారీభేరీకి డబ్బులు తీసుకుని మేకప్ వేసుకుని కూర్చోలేదు. ఇప్పుడు నన్ను తప్పుబడుతున్న వాళ్లు అచ్చెన్నని ఏం శిక్షించారు. టీడీ జనార్దన్ను ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఏడాది కాలంగా నన్ను అవమానించి నరకం చూపించారు. గౌరవం లేనిచోట ఉండలేను. అందుకే టీడీపీకి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీకి పంపుతున్నా..’ అని సినీనటి దివ్యవాణి చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని చాలామంది చెప్పినా వినలేదని, వారు చెప్పినట్టే పార్టీలో తనకు అన్యాయం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా తనకు ప్రాధాన్యత లేకపోవడానికి దారితీసిన కారణాలను వివరించిన దివ్యవాణి టీడీపీ నేతల తీరుపై సంచలన కామెంట్లు చేశారు. దివ్యవాణి ఇంకా ఏమన్నారంటే.. పార్టీ కోసం బాలకృష్ణకంటే నేనే ఎక్కువ పనిచేశా మత మార్పిళ్లపై చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. నిజం మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే ఆయనకంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చాను. ఈ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ పార్టీలో జరుగుతున్నవి చెబితే టీడీపీ నేతలే నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడలేదు. చంద్రబాబు చుట్టూ దొంగలున్నారు. వాళ్లంతా చంద్రబాబుతో మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు పీఏ రాజగోపాల్ చాలాసార్లు అవమానించాడు. పార్టీలో ఏం జరుగుతున్నదీ లోకేశ్కు చెబితే ఆయన టీడీ జనార్దన్కు చెప్పమన్నారు. చంద్రబాబుకు కళ్లు, ముక్కు, చెవులు అంతా తానై వ్యవహరించే జనార్దన్ నన్ను చాలాసార్లు అవమానించాడు. జనార్దన్ను ప్రశ్నించినందుకు నరకం చూపించారు. పార్టీకోసం బాలకృష్ణ కంటే నేనే ఎక్కువగా పనిచేశాను. బాలకృష్ణ ఏనాడైనా అమరావతిలో బిడ్డల దగ్గరకు వచ్చారా? కరోనా టైమ్లో నేను నా కుటుంబాన్ని వదిలి అమరావతికి వచ్చి పార్టీకోసం పనిచేశాను. మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న కోసం తీర్మానం చేయలేదు. అన్ని జిల్లాల్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేదు. మహానాడులో గ్రీష్మ అలా మగాళ్ల దగ్గర తొడగొట్టడం మంచి పద్ధతి కాదు. అనితకు డబ్బులిచ్చి మేకప్ వేయించి నారీభేరీ నిర్వహించారు. ప్రెస్మీట్ పెట్టడానికి నలుగురి దగ్గరకి తిప్పేవారు. నన్ను కుక్కపిల్లలా ఆడుకున్నారు. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్మీట్ పెట్టించారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. టీడీపీలో ఆడవాళ్లకు అవకాశాలు రావాలంటే ఆ నలుగురి చుట్టూ తిరగాలి. ఆ నలుగురికి ఏం కావాలంటే అది చేస్తేనే పదవులు. అందుకే టీడీపీ నుంచి జయసుధ, జయప్రద బాధతో వెళ్లిపోయారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని నన్నపనేని రాజకుమారి నాకు స్వయంగా ఫోన్చేసి ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించాను. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. నాకు ఇలాంటిరోజు వస్తుందని భావించలేదు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా అన్నారు.. పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా? వైఎస్సార్సీపీలో అయితే బాగుంటుంది. వైఎస్సార్సీపీలో నమ్మినవారికి ద్రోహం జరగదని ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా టీడీపీలో చేరాను. మూడున్నరేళ్లుగా టీడీపీకి సేవలు చేశాను. టీడీపీలో ఉన్నందుకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా పోయాయి. నా నోటికాడ భోజనం పోయింది. అది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేశాను. చంద్రబాబు కోసం మోదీపైన విమర్శలు చేశాను. చదవండి: చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే ధైర్యంగా బయటకు రావాలి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే తనలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి టీడీపీలో జరుగుతున్నది ఏమిటో నిజాలు చెప్పాలి. ఎన్టీఆర్పై అభిమానంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్సీపీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్పై అభిమానంతో మాట్లాడుతుంటారు. అటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి. వాటిని పిల్లల దశలోనే చంపకపోతే అందర్నీ కాటేస్తాయనే ఆవేదనతో గుండె పగిలి ఈ నిర్ణయం తీసుకున్నా.. అని దివ్యవాణి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. -
‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్..
విజయనగరం టౌన్: తెలుగు చలన చిత్రసీమలో దాదాపు 30 సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర నటుడిగానే బాగా గుర్తింపు వచ్చింది. స్టార్ మాలో వచ్చే గృహలక్ష్మి సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. 69 ఏళ్ల వయసులో అలవోకగా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు జిల్లాకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు. ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే.. జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో పుట్టాను. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. 1969లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయినై రెండేళ్ల పాటు చదివి, అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాను. మిత్రుడు నాలుగెస్సుల రాజుతో కలిసి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాను. అనంతరం ఎంఆర్ కళాశాలలో ఇంటర్, బీకామ్ పూర్తిచేశాను. ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లినప్పుడు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ఆధారంగా ఇండియన్ ఎయిర్ లైన్స్కు దరఖాస్తు చేయగా, ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. 28 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి హిందీ, తెలుగు, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాను. సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఢిల్లీ టూర్కి వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడేవారు. ఈ సమయంలో అల్లు అరవింద్ గారితో పరిచయం జరిగింది. వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను కలవడంతో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత స్టాలిన్, డాన్, హోమం, తదితర 30 చిత్రాలలో నటించాను. చిత్రసీమలో అంతగా పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో టీవీ సీరియళ్లపై దృష్టి సారించాను. ఈ సమయంలో స్టార్ మాలో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మిలో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ నా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పటివరకు 26 సీరియళ్లలో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా ఉన్నాను. -
ఆ భావదారిద్య్రం రచయితలకు ఉండదు
ఒకటి మాతృభూమి పాట.. మరొకటి మాతృమూర్తి పాట... ఒకే సినిమాలోæవినపడిన ఈ రెండు పాటలూ భావోద్వేగానికి గురి చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’లో సుద్దాల అశోక్తేజ రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ పాటలవి. ఇవే కాదు.. 28 ఏళ్ల కెరీర్లో 2600 సినిమా పాటల ద్వారా దేశభక్తి, ఆనందం, ప్రేమ, బాధ... ఇలా మనిషి తాలూకు ప్రతి ఎమోషన్ని ఆవిష్కరించారు సుద్దాల అశోక్ తేజ. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ తేజ చెప్పిన విశేషాలు. ► ఈ బర్త్ డే స్పెషల్ అంటే ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి మీరు రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ రెండూ హిట్. ఈ పాటల గురించి మీ అనుభవం? సుద్దాల అశోక్ తేజ: నేనిప్పటి వరకూ రాజమౌళిగారి సినిమాలకు పాట రాయలేదు. విజయేంద్రప్రసాద్గారి ‘రాజన్న’ కి పాట రాశా. ఆ కథలో మా నాన్నకి (సుద్దాల హనుమంతు) సంబంధించిన జీవితం ఉంది. తెలంగాణ, నైజాం పోరాటంలో మా నాన్న, అమ్మ పాల్గొన్న ఘట్టాలు చెబుతూ ఒకానొక సన్నివేశం గురించి ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్గారికి చెప్పాను. దానికి ఆయన బాగా కనెక్ట్ అయిపోయి ఒక కథ తయారు చేశారు.. అదే ‘రాజన్న’ సినిమా. మా నాన్న జీవితంలో జరిగిన సన్నివేశానికి రాజమౌళిగారు ఓ పాట (వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ) నాతో రాయించారు. మా ఇద్దరి మధ్య ఉన్న తొలి పాట అనుబంధం అది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాజమౌళిగారు పిలిపించి, ఎన్టీఆర్ని (కొమురం భీమ్ పాత్ర) ఆంగ్లేయులు శిక్షించే సందర్భంలో వచ్చే పాట రాయమన్నారు. ఈ పాటలో హీరో తనకు తానే ధైర్యం చెప్పుకుంటే బాగుంటుందన్నాను. కానీ, కీరవాణిగారు ‘మీరు పాట రాయండి.. ఆ తర్వాత ట్యూన్ ఇస్తాను’ అన్నారు. మూడు రిథమ్స్లో పాట రాసుకుని వెళ్లా. వాటిల్లో సినిమాలో ఉన్న పాట స్టైల్ అందరికీ నచ్చడంతో రాజమౌళిగారు అదే ఫైనల్ చేశారు. ఇక ‘కొమ్మా ఉయ్యాలా..’ గిరిజన బాలిక పాడే పాట. ఆ అమ్మాయి తల్లికి ఎంత కనెక్ట్ అయి ఉందో అని ఈ పాటలో చెప్పాం. ఆ అమ్మాయి జైలులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా తనకి భరోసా ఇస్తూ ఓ పాట పాడతాడు.. కానీ, నిడివి ఎక్కువ అయిందని ఆ పాట తీసేశారు. ఆ పాట కూడా నేనే రాశాను. ‘కొమురం భీముడో..’ పాట మాతృభూమితో, ‘కొమ్మా ఉయ్యాలా’ పాట మాతృమూర్తితో సంబంధం ఉన్నవి కాబట్టే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ► మీ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఈ ట్రెండ్ రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? పాన్ ఇండియన్ సినిమా అని ఎక్కువ ఆలోచించి, ఓటీటీ సినిమాకి రాస్తున్నామని తక్కువ ఆలోచించి పాటలు రాసే భావదారిద్య్రం రచయితలకు ఉండదు. స్టార్ హీరోనా, కొత్త హీరోనా, స్టార్ డైరెక్టరా, కొత్త డైరెక్టరా? అని కాకుండా ఇచ్చిన సన్నివేశానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అని మాత్రమే రచయిత ఆలోచిస్తాడు. ► పాట మనిషి తేజస్సును పెంచుతుంది అంటారు. మీలోని తేజస్సుకు పాటే కారణమా? నిజమే.. పాట పసివాడిగా చేస్తుంది.. పడుచువాడిగానూ చేస్తుంది. వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు.. ఆలోచనలకు సంబంధించినది. కొత్తదనం ఇవ్వాలనే తపన, తపస్సు వల్ల మనుషుల్లో కనిపించే తేజస్సు వేరుగా ఉంటుంది. ► రెండేళ్ల క్రితం మీకు లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. మీరు ఊపిరి పోసిన మీ అబ్బాయి మీకు ఊపిరి పోయడం గురించి..? జన్మనిచ్చిన పుత్రుడే (అర్జున్ తేజ) తిరిగి నాకు జన్మనివ్వడం నా జీవితంలో జరిగిన ఒక ఊహించని ఘటన. లివర్ ప్లాంటేషన్కి ఎవరూ ముందుకు రాక చనిపోయిన వారిని నేను చూశా. నా అదృష్టం ఏంటంటే.. నా కూతురు, నా కుమారులు లివర్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ వయసులో చిన్నోడు కాబట్టి అర్జున్ తేజని డాక్టర్లు సెలక్ట్ చేసుకున్నారు. మే 23కి ఆపరేషన్ జరిగి రెండేళ్లు అవుతుంది.. అలా కొడుకే తండ్రి అయిన సన్నివేశం నా లైఫ్లో జరిగింది. ► పాట సాహిత్యాన్ని శబ్దం డామినేట్ చేస్తున్న ఈ పరిస్థితి గురించి ఏమంటారు? నిజమే.. 1980 నుంచే ఆ ట్రెండ్ ఉంది. అక్షరాలతో కూడుకున్న దాన్నే పాట అంటారు. సంగీతం కలిసిన సాహిత్యమే గీతం. అలాంటిది అక్షరాలు వినిపించకపోతే మాకు ఎందుకు సంతోషం ఉంటుంది? నేను బాధపడ్డ క్షణాలు కొన్ని లక్షలుంటాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. అయితే కీరవాణిగారి సినిమాల్లో ప్రతి పాట అందరికీ వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎవర్నీ తప్పుబట్టలేం.. ఎవరి ట్రెండ్ వారిది. ► మీ తల్లితండ్రుల పేరుతో ఇస్తున అవార్డు గురించి... మా తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించాను. మా నాన్నగారి పేరుతో గత పదేళ్లుగా జాతీయ పురస్కారం ఇస్తున్నాను. ► రచయితగా మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకున్నారు.. మరి మీ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు? పాటల విషయంలో నా వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేదు.. కాకపోతే మా అమ్మాయి మాత్రం సంగీతం నేర్చుకుంది.. డిప్లొమా పాస్ అయింది. అమెరికా, లండన్లోని పిల్లలకు ఆన్లైన్లో సంగీత పాఠాలు చెబుతుంటుంది. ఒకరకంగా ఆమె నా బాటలో ఉన్నట్లు అనిపిస్తుంది. పాట నా జెండా.. కవిత్వం నా ఎజెండా.. శిఖరం నా నిచ్చెన లోయ నా విశ్రాంతి శయ్య ఓటమి నా ఆలోచనా మందిరం గెలుపంటారా.. చిన్న మలుపు మాత్రమే – సుద్దాల అశోక్తేజ -
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్చాన్స్లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
Rajanna Dora: ధ్యాసంతా గిరిజనంపైనే..
సాక్షి, విజయనగరం: గిరిజన బిడ్డగా, గిరిజన సహకార సంస్థ మాజీ అధికారిగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా పీడిక రాజన్నదొరకు గుర్తింపు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని సాక్షి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మీకు రావడంపై మీ అభిప్రాయం? రాజన్నదొర: సాలూరు నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యాను. మహిళల కు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా గిరిజన, ఎస్సీ, బీసీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తానని సీఎం అప్పుడే చెప్పారు. రెండో దఫాలో నాకు అవకాశం ఇస్తానని నాడే హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పదవి రావడానికి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు కారణం. వారికి సర్వదా కృతజ్ఞుడిని. సాక్షి: గిరిజన బిడ్డగా, వారి కష్టసుఖాలు తెలిసిన మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు? రాజన్నదొర: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 31 తెగల గిరిజనులు ఉన్నారు. వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా కాలానుగుణ పరిస్థితులను బట్టి ప్రణాళికలను రచించారు. గతంలో అటవీ ఉత్పత్తులే గిరిజనులకు ఆధారం కాబట్టి వాటికి మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రణాళికలు అమలు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన పంటలపై కూడా ఆధారపడుతున్నారు. విద్య ప్రాధాన్యం తెలుసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితులకు తగినట్లుగా, ప్రాంతాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, గిరిజన ఎమ్మెల్యేలమంతా చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అందుబాటులోనున్న నిధులను సది్వనియోగం చేసుకుంటూ గిరిజనులకు తక్షణమే లబ్ధి కలిగేలా చూస్తాను. సాక్షి: ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మీరు గుర్తించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు? రాజన్నదొర: గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మెరుగుపడ్డాయి. వారికి నాణ్యమైన విద్యను అందేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారాయి. కొన్నిచోట్ల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అవన్నీ సమకూర్చుతాం. వైద్యం విషయానికొస్తే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సీహెచ్సీల్లో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుచేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతాను. ఒడిశాలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిపైనా ఆయా అధికారులతో చర్చించి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సాక్షి: మంత్రి పదవితో మీ సేవలకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా? రాజన్నదొర: మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. దానితో పాటు నా కష్టం, పనితీరు, నిబద్ధత చూసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పారీ్టకి మంచిపేరు వచ్చేలా పనిచేస్తాను. సాక్షి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగానున్న కొటియా సమస్యపై ఏవిధంగా దృష్టి పెడతారు? రాజన్నదొర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబర్ 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్తో చర్చలు జరిపారు. అప్పటికే ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొటియా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఒడిశాలో సామాజిక పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.2,500 చొప్పున ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అమలు జరుగుతున్నన్ని సంక్షేమ పథకాలు ఒడిశాలో లేవు. పేదలందరికీ ఇళ్లు, రైస్కార్డు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, చేదోడు... నవరత్నాలన్నీ కొటియా గ్రామాల్లో అమలవుతున్నాయి. ఏదేమైనా అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరిహద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతాను. -
ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ఆదర్శప్రదేశ్గా మార్చారు. ఆయన నాకు ఓ గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన చేపట్టిన ఆరోగ్యయజ్ఞంలో భాగస్వామిని చేశారు. ఆ మహాయజ్ఞంలో దివ్య ఔషధమవుతా. నిరంతరం జన శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తా. ఇక నా జన్మ ధన్యమైనట్టేనని భావిస్తున్నా. సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విడదల రజిని ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. చదవండి: హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత జీవితాంతం రుణపడి ఉంటా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. రాజకీయాల్లో బీసీలు, ముఖ్యంగా మహిళలకు జగనన్న ఎంతో గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పడానికి నేనే పెద్ద ఉదాహరణ. నేను ఒక సాధారణ బీసీ మహిళను. చిలకలూరిపేటలాంటి నియోజకవర్గంలో నాలాంటి వారు పోటీ చేయడాన్ని ఎవరూ ఊహించరు. అలాంటిది జగనన్న నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి బరిలో నిలిపి గెలిచేలా చేశారు. నా గెలుపు ఒక చరిత్ర. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం ఆవిర్భవించాక ఇప్పటివరకు బీసీ సామాజికవర్గానికి చెందినవారు ఒక్కరు కూడా గెలవలేదు. చిన్న వయసులోనే ఉత్తమ అవకాశాలు ప్రజలకు సేవ చేద్దామనే ఆకాంక్షతో చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త కుమారస్వామి, ఇతర కుటుంబసభ్యులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. జగనన్న ఎంతో నమ్మకం ఉంచి టికెట్టు ఇచ్చారు. కేవలం ఆయన చరిష్మాతోనే గెలిచాను. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. జగనన్న వల్లే నేను ఈ రోజు ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొందగలిగాను. ఆ తర్వాత మూడేళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించగలిగాను. ఇవన్నీ కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్లే సాధ్యమయ్యాయి. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కచ్చితంగా నిలబెట్టుకుంటాను. వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు ఎంత కీలకమైనదో నాకు తెలుసు. జగనన్న నాపై ఎంత పెద్ద బాధ్యత ఉంచారో నాకు తెలుసు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా, జగనన్న ఆశయాలు సాధించేలా కృషి చేస్తాను. జింఖానా కో–ఆర్డినేటర్లు, సభ్యులతో మాట్లాడతా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్యులకు గుంటూరు మెడికల్ కళాశాల నిలయం. ఉమ్మడి రాష్ట్రంలోనే గుంటూరు మెడికల్ కళాశాలకు ఎంతో పేరు ఉంది. ఇక్కడ చదువుకున్న వారిలో సుమారు 2వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తర అమెరికాలో స్థిరపడి బాగా పేరు, ప్రతిష్టలు సంపాదించారు. ఇప్పుడు వీరంతా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. వారి సంపాదనలో కొంత ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించడం హర్షించాల్సిన విషయం. వీరంతా జింఖానా పేరుతో అసోసియేషన్ స్థాపించి, రాష్ట్రం గర్వించేలా పనిచేస్తున్నారు. నేను అతి త్వరలోనే వీరితో సమావేశమై గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆగిపోయిన మాతా శిశుసంరక్షణ కేంద్రం పనులు పూర్తయ్యేలా చూస్తాను. ఇది పూర్తయితే హైదరాబాద్లో ఒక నీలోఫర్ ఆస్పత్రి, తిరుపతిలో ఒక రుయా ఆస్పత్రి కంటే మెరుగైన సేవలు గుంటూరులోనే అందేటట్లు చేయొచ్చు. ఈ ఆస్పత్రిలో గుండె మార్పిడి, కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. పల్నాడులో అత్యాధునిక ఆస్పత్రులు పల్నాడు గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్యం అవసరమైతే గతంలో గుంటూరు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. పిడుగురాళ్ల సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నరసరావుపేట జిల్లా వైద్యశాలను అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రోజు నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి రోగానికీ వైద్యం అందుతోంది. చిలకలూరిపేటలో కూడా వంద పడకల ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతోంది. బాపట్లలోనూ మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాధాన్య అంశాలే. అందుకే అంటున్నాను.. జగనన్న నాపై పెద్ద బాధ్యతనే ఉంచారు. మా నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టేలా నేను పనిచేస్తాను. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తా. సేవల్లో దేశానికే ‘ఆదర్శ’ప్రదేశ్ మా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు తీసుకొస్తోంది. ఎన్నో సంస్కరణలు చేపడుతోంది. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం సత్వరమే అందేలా ఎంత చేయాలో అంత చేస్తోంది. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి జగనన్న వైద్య ఆరోగ్యశాఖ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిరంతరం తపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే ప్రజలకు మేలైన వైద్యం అందుతోంది. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనంతగా 39వేల పోస్టులు భర్తీ చేయబోతున్నాం. 16 మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరిస్తున్నాం. ప్రతి గ్రామానికీ హెల్త్ క్లినిక్లు తీసుకొస్తున్నాం. కోవిడ్ సమయంలో మన ప్రభుత్వం ప్రజలకు అందించిన ఉచిత వైద్య సేవలు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
ప్రభాస్ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్ ఉండేది కాదు
‘‘మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని స్వచ్ఛంగా చూస్తారు. నా మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు తప్పులు చేస్తామనే భయం ఉండదు. అందుకే రామాయణం లాంటి చరిత్రను భయం లేకుండా ‘ఆదిపురుష్’గా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు ఓం రౌత్. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఇతర పాత్రల్లో పేరున్న నటీనటులతో ఓం రౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘రాముడి జీవితం నాకు ఆదర్శం’’ అన్నారు ఓం రౌత్. శ్రీరామ నవమి సందర్భంగా ‘సాక్షి’తో ఓం రౌత్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు ఈ విధంగా... ► రాముడి గురించి రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమా? ఓం రౌత్: కచ్చితంగా సాధ్యం కాదు. జీవితంలో ఎలా నడుచుకోవాలనేది చెప్పడానికి రాముడు మంచి ఉదాహరణ. ఆయన్ను ‘మర్యాద పురుషోత్తమ్’ అంటారు. మంచి లక్షణాలున్న రఘురాముడి గురించి చెప్పడానికి ఒక్క సినిమా సరిపోదు. అందుకే రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ‘ఆదిపురుష్’ చేశాను. ► మీరు ‘ఆదిపురుష్’ తీయడానికి 30 ఏళ్ల క్రితం రామానంద్ తీసిన ‘రామాయణ్’ సీరియల్ ఆదర్శం అనుకోవచ్చా? రాముడిని అర్థం చేసుకునే ప్రాసెస్ నా చిన్నప్పుడే మొదలైంది. నా గ్రాండ్ పేరెంట్స్ ద్వారా రామాయణం విన్నాను. అలాగే రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొన్ని విశేషాలు తెలియజేసింది. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త విషయం తెలుస్తుంది. రామాయణం ఆధారంగా జపనీస్ డైరెక్టర్ యుగో సాకో తీసిన జపనీస్ సినిమా చూశాక నాకూ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. అది యానిమేషన్ మూవీ. 2000లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ సినిమా చూశాను. రాముడి గురించి విదేశీయులు అంత ఆకట్టుకునేలా తీస్తే భారతీయులమైన మనం ఎందుకు తీయకూడదనిపించింది. కరోనా లాక్డౌన్లో ‘ఆదిపురుష్’ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ► 40ఏళ్ల వయసులో... అది కూడా దర్శకుడిగా తక్కువ సినిమాల అనుభవం ఉన్న మీకు రామాయణం లాంటి పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదేమో? నా చిన్నప్పుడే రఘురాముడికి ఇన్స్పైర్ అయ్యాను. రాముడి జీవన విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తే బాగుంటుందనే ఆలోచన నా చిన్నప్పుడే నాకు కలిగింది. రాముడి క్వాలిటీస్ నన్ను అంతగా ఆకట్టుకున్నాయి. చిన్నప్పటినుంచీ రాముడంటే ఆరాధనాభావం ఉంది. అయినప్పటికీ రాముడి సినిమా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పాత్ర మీద పెంచుకున్న మమకారం ‘ఆదిపురుష్’ తీసేలా చేసింది. నేటి తరానికి రాముడి గురించి తెలియాలి. ► ‘యంగ్ రెబల్ స్టార్’ ఇమేజ్ ఉన్న ప్రభాస్ని సాత్వికంగా కనిపించే రాముడి పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది? తీక్షణంగా ఉండే ప్రభాస్ కళ్లు, తన ఫిజిక్ రాముడి పాత్రకు సూటబుల్. మన కళ్లు మన హృదయానికి ప్రతిబింబాలు అంటారు. మనసులో ఉన్న భావాలను కళ్లు పలికిస్తాయి. అలా ప్రభాస్ తన కళ్లల్లో కరుణ రసాన్ని చూపించగలుగుతారని పూర్తిగా నమ్మి, తనే ఈ పాత్ర చేయాలనుకున్నాను. అలాగే రాముడిలో ఉండే లక్షణాల్లో ‘పరాక్రమ వీర’ ఒకటి. రెబల్ ఇమేజ్తో ప్రభాస్ ఆ వీరత్వాన్ని చూపించగలరని నమ్మాను. ఈ క్యారెక్టర్ గురించి చెప్పి, ‘వి’ షేప్ బాడీ బాగుంటుందన్నాను. ఫిజిక్ని అలానే మలచుకున్నారు. అలాగే హిందీ భాష మీద కూడా ప్రభాస్ పట్టు సాధించారు. ► ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే.. ఈ సబ్జెక్ట్ గురించి ప్రభాస్కి చెప్పడానికి వెళ్లే ముందు కాదనరనే నమ్మకంతో వెళ్లాను. సినిమా గురించి చెప్పగానే ‘ఓకే.. చేస్తాను’ అన్నారు. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్’ ఉండేది కాదు... తీసేవాడిని కాదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నన్ను ఆ ‘ఆల్మైటీ’ (దేవుడు)యే ఎన్నుకున్నాడని నా నమ్మకం. నన్నే కాదు.. నటీనటులు, టెక్నికల్ టీమ్ అందర్నీ ఆ దేవుడే ఎంపిక చేసి, ఈ ప్రాజెక్ట్ చేయించాడని నమ్ముతున్నాను. ► మూడు సీన్లు విని, ప్రభాస్ ఈ సినిమా చేస్తానని అన్నారట.. అవును.. నిజమే. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ప్రభాస్తో నాకంతగా పరిచయం లేదు. కథ చెప్పడానికి ఫోన్ చేశాను. మూడు సీన్లు విని, ప్రభాస్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి కథ చెప్పాను. ► ‘ఆదిపురుష్’ని దేవుడే తీయించాడని చెప్పారు. మీకు భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.. మీరు సెంటిమెంట్స్ని నమ్మితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ‘ఫైర్ యాక్సిడెంట్’ జరిగినందుకు అప్సెట్ అయ్యారా? భయపడ్డారా? ఏమాత్రం భయపడలేదు.. అప్సెట్ అవ్వలేదు. నిజానికి పెద్ద ఘటనే జరిగింది. నా టీమ్ చేసిన హార్డ్వర్క్ (సెట్ వర్క్) వృథా అయిందని బాధపడ్డాను. అయితే ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. చాలా త్వరగానే సెట్ పూర్తి చేసి, షూటింగ్ పూర్తి చేసేలా చేశాడు. జీవితంలో కష్టాలు వస్తాయి... పోతాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే... సెట్ మాత్రమే పాడయింది తప్ప, మా టీమ్లో ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు. అందుకే దేవుడు మా పక్షాన ఉన్నాడని అంటున్నాను. ► ప్రభాస్ మంచి భోజనప్రియుడు.. తన టీమ్కి విందులు ఇవ్వడం ఆయన అలవాటు.. మరి మీ టీమ్కి? ప్రభాస్తో వర్క్ చేయడం నాకో మంచి అనుభూతి. ఇంటి ఫుడ్ తెప్పించి, అందరికీ ఇచ్చేవారు. షూటింగ్ సమయంలో టేస్టీ ఫుడ్స్ చాలానే లాగించాం (నవ్వుతూ). ఇంకో విషయం ఏంటంటే.. షాట్ గ్యాప్లో కూడా ఫుడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. రేపు ఏం తిందాం అని కూడా ముందు రోజు చర్చించుకునేవాళ్లం. ► ఫైనల్లీ.. మీ జీవితంపై రాముడి ప్రభావం? అది చెప్పడానికి మాటలు చాలవు. మనందరం ఉదయం నిద్ర లేచేటప్పుడు ‘మంచి జరగాలి’ అనుకుంటాం. ఆ మంచి ఎక్కడ్నుంచి వస్తుంది? మన నమ్మకంలోంచి పుట్టుకొస్తుంది. ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుంది? మనం నమ్మిన రఘురాముడి నుంచి వస్తుంది. రాముడి నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఆదిపురుష్’తో ప్రేక్షకులను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నా అన్నారు.. మీరు చేసిన రీసెర్చ్ గురించి? నిజానికి రామాయణం గురించి ప్రపంచం చాలానే రాసింది. మన కళ్ల ముందు బోలెడంత మెటీరియల్ ఉంది. ఎక్కువ టైమ్ కేటాయించి, అవి స్టడీ చేస్తే చాలు. నేను ఎక్కువ టైమ్ కేటాయించి, అన్నీ స్టడీ చేశాను. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ బుక్స్ చదివాను. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవి? డిజైన్లు ఎలా ఉండేవి? అనే విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్ టెక్నాలజీతో చూపిస్తున్నాను. నేను నమ్మిన కథను నిజాయితీగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాను. ఒక బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్ ఓ సాధనంలా ఉపయోగపడతాయి తప్ప కేవలం వాటితోనే సినిమాని నడిపించాలనుకోకూడదని నా అభిప్రాయం. అందుకే కథ బాగా రాసుకుని, దాన్ని స్క్రీన్కి ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఆ కథ ఎలివేట్ కావడా నికి వీఎఫ్ఎక్స్ వాడాను. -
మిమిక్రీ ఫన్ జోన్
-
మెగా పంచ్
-
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
వీళ్లిద్దరు కలిస్తే ఫన్ కి నో ఎండ్