Teaser Release
-
డబుల్ ధమాకా
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఫిబ్రవరి 29న తన పుట్టినరోజుని పురస్కరించుకుని డబుల్ ధమాకా ఇచ్చారాయన. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రానికి ‘మృత్యుంజయ్’ టైటిల్ ఖరారు చేశారు. ‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా నటించిన చిత్రమిది.రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా టైటిల్ టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఒంగోలు నేపథ్యంలో... శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు మేకర్స్.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడు జి. నిర్మించనున్నారు. ‘ఒంగోలు పట్టణం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. శ్రీవిష్ణు హిలేరియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: హేమ–షాలిని, సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం. -
బాపులాంటి మూవీని సపోర్ట్ చేయాలి: విశ్వక్ సేన్
‘‘బాపు’ టీజర్(Bapu teaser) చాలా బాగుంది. నిజాయతీగా తీసిన సినిమా ఇది... మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి చిత్రం సక్సెస్ అయితేనే మేకర్స్కు ఉత్సాహం వస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలు చేయాలనుకునే మిగతావాళ్లకు కూడా ధైర్యం వస్తుంది’’ అన్నారు హీరో విశ్వక్ సేన్(vishwaksen). బ్రహ్మాజీ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’. ‘ఎ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ అనేది ట్యాగ్లైన్. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.దయ దర్శకత్వంలో రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుర ఆడియో ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావడంలేదని చాలామంది అన్నారు.కానీ, ‘పెళ్లి చూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాలకు ఎలా వచ్చారో... ‘బాపు’కి కూడా అలానే వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘టీజర్ని మించి సినిమా చాలా బాగుంటుంది’’ అని చెప్పారు దయ. ‘‘ఒక డిఫరెంట్ స్టోరీతో యూనిట్ అంతా మంచి సినిమా చేశాం’’ అన్నారు బ్రహ్మాజీ. -
అంతే తేడా!
‘ఇట్స్ ఓకే.. మూవ్ ఆన్ అవ్వాలిరా.. తప్పదు’ అంటూ అనంతిక సనీల్కుమార్ చెప్పిన డైలాగ్తో ‘8 వసంతాలు’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతిక సనీల్కుమార్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు.మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా టీజర్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల... కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు... అంతే తేడా’’ అంటూ కన్నా పసునూరితో అనంతిక సనీల్కుమార్ చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమేరా: విశ్వనాథ్ రెడ్డి. -
కావాలని మాట్లాడలేదు: దర్శకుడు నక్కిన త్రినాథరావు
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన. త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు. -
'వీర ధీర శూరన్'గా విక్రమ్.. టీజర్ ఎలా ఉంది..?
విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. హెచ్ఆర్ పిక్చర్స్పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్ను సోమవారం విడుదల చేశారు. ‘‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా విడుదల చేసిన టీజర్లో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్స్, యాక్టింగ్, పోలీస్ ఆఫీసర్గా ఎస్జే సూర్య పెర్ఫామెన్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఈ జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
స్కెచ్ వేస్తారా?
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
ప్రేమలో పడ్డాక...
నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్గోపాల్వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. -
రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
-
అందరికి నచ్చేలా ‘ఐ - 20’
సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. తాజాగా ఈ మూవీ పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!!తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు. -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో న్యాచురల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు. -
టీజర్ రెడీ
‘పుష్ప : ది రూల్’ సినిమా టీజర్కు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రూల్’ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక ‘పుష్ప’ సినిమా ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమా సక్సెస్ కావడంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల అప్డేట్స్ కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న వచ్చే అవకాశం ఉంది. ఇంకా అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లోని కొత్త సినిమా ప్రకటన కూడా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. -
అయోమయం.. ఆశ్చర్యం
విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామమూర్తి లీడ్ రోల్స్లో నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘దో ఔర్ దో ప్యార్’. శీర్ష గుహ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘నేను వీగన్... పాలతో తయారైన వాటిని తినను (విద్యాబాలన్)’, ‘మరి.. మీ ఫేస్వాష్లలో మిల్క్ ఉంటుంది కదా (ప్రతీక్ గాంధీ)!’, ‘మనం డేటింగ్లో ఉన్న వారిలా లేము.. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటున్నాం (ఇలియానా)’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘ప్రేమ కన్ఫ్యూజ్ చేస్తుంది. సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నవి కూడా టీజర్లో కనిపించాయి. -
సైకలాజికల్ థ్రిల్లర్
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్ బాగుంది. టీజర్ చూస్తుంటే విజువల్స్తో పాటుగా సౌండ్కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్ కార్తీక్. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్ రెడ్డి. -
ఆకట్టుకుంటున్న ‘డియర్ ఉమ’ టీజర్
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేశ్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: రాజ్ తోట. -
లవ్ డ్రిల్
‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో డాక్టర్గా బిజీగా ఉన్నా సినిమాలపై ఇష్టంతో ‘కెప్టెన్ రాణా ప్రతాప్, టిక్ టిక్, చంద్రహాస్’ వంటి 8 సినిమాలు తీయడంతో పాటు నటించాను. అయితే తెలుగులో ఇప్పటివరకూ లవ్ జిహాదీపై ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఆ కథాంశం ఎంచుకుని ‘డ్రిల్’ తీశా’’ అని హరనాథ్ పోలిచెర్ల అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్. డ్రీమ్ టీమ్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజవుతోంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్... ‘‘అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డ హరనాథ్గారు ఇండియా వచ్చి తెలుగు సినిమాలు తీయడం హ్యాపీ’’ అన్నారు. -
బస్తర్ మూవీ టీజర్ రిలీజ్
-
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్గా విజయ్ ఆంటోని కొత్త లుక్లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
Operation Valentine: గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. రాడార్ ఆఫీసర్గా మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. సోమవారం ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఈ సినిమా టీజర్ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్ తేజ్) వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఊతకొట్టుడు కొట్టేశాడు!
‘ఏం చేస్తాన్నాడెంటి.. మీవోడు.. ’ (ఆషికా రంగనాథ్), ‘నిన్నే మావిడితోటలో ఇరవైమందిని ఊతకొట్టుడు కొట్టేశాడు (‘అల్లరి’ నరేశ్)’, ‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా..కొంచెం తగ్గమను (ఆషికా)’...అన్న డైలాగ్స్తో విడుదలైంది ‘నా సామిరంగ’ సినిమా టీజర్. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ‘ఏం అడగాలో దానికి తెలియదు. ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏం చేయాలో నాకు తెలియదు’ (నాగార్జున) అన్న డైలాగ్స్తో ఈ టీజర్ సాగుతుంది. ‘‘సినిమాలో నాగార్జునగారి గోదావరి యాస చాలా బాగుంటుంది. రొమాన్స్, స్నేహం, యాక్షన్ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి. -
టీజర్ ఆసక్తికరంగా ఉంది
సంబీత్ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్4ఎమ్’. నిర్మాత మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్ హాలీవుడ్లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. ఎంఆర్సీ చౌదరి, రాహుల్ అడబాల మాట్లాడారు. -
అన్నపూరణి
అన్నపూరణి (తెలుగులో అన్నపూర్ణ)గా మారారు నయనతార. ఆమె కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రానికి ‘అన్నపూరణి’ టైటిల్ను ఖరారు చేసి, టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతి అన్నపూరణి పాత్రలో నటిస్తున్నారు నయనతార. అన్నపూరణి పుస్తకం చదువుతూ, ఆ పుస్తకం పేజీల మధ్యలో నాన్ వెజ్ వంటకాల రెసిపీలను చూస్తుండటం, ఆమె అభిరుచులు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వంటి అంశాలు టీజర్లో కనిపిస్తాయి. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ‘‘మోడ్రన్ సబ్జెక్ట్తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్ మదిరాజు. -
Bubblegum Teaser Launch Event Pics: యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్గమ్’చిత్రం టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని
‘‘బబుల్గమ్’ టీజర్ చూస్తే చాలా బలమైన కథ అనిపించింది. రోషన్ని స్క్రీన్పై చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా కనిపించాడు. మరో సక్సెస్ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడని నమ్మకంగా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది’’ అని హీరో నాని అన్నారు. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానసా చౌదరి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘రవికాంత్కి ఒక యునిక్ స్టయిల్ ఉంది. అది టీజర్లో కనిపిస్తోంది. తెలుగులో క్వాలిటీ ఫిలిమ్స్కి మారుపేరుగా మారిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి ‘బబుల్గమ్’ మరో హిట్గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన పని (సినిమాలు) చేయడానికి ప్రోత్సహించిన అమ్మానాన్నలకి థ్యాంక్స్’’ అన్నారు రోషన్ కనకాల. ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రవికాంత్ పేరెపు. ‘‘బబుల్గమ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. హీరోయిన్ మానస, నటుడు రాజీవ్ కనకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సురేష్ రగుతు, క్రియేటివ్ప్రోడ్యూసర్: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక. -
సమాజానికి ఉపయోగపడే సినిమా
‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్ . శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రిత్ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి. -
యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..వరుస సినిమాతో తక్కువ సమయంలో స్టార్గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్కి ఎదిగింది. బాలీవుడ్ పెద్దలను ఎదురించి ఫైర్ బ్రాండ్గా మారింది. అందరి హీరోయిన్లలా కమర్షియల్గా కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చంద్రముఖి 2 విడుదలైంది. త్వరలోనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘తేజస్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా కనిపించనుంది. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ని షూరూ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్ని విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. -
తాంత్రికుడు వస్తున్నాడు
మహేందర్ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ. -
నాకన్నా చెడ్డవాడు లేడు!
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు చేశారు. భూషణ్కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. గురువారం రణ్బీర్ బర్త్ డే సందర్భంగా ‘యానిమల్’ టీజర్ను రిలీజ్ చేశారు. ‘జ్యోతి... క్రిమినల్ను కన్నాం మనం.. (అనిల్ కపూర్), ‘మై ఫాదర్ ఈజ్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ది వరల్డ్.. డోన్ట్ ఎవర్ గో దేర్, నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకెక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను. నాకన్నా చెడ్డవాడు లేడు’ (రణ్బీర్) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
‘హిట్ మ్యాన్’ టీజర్ వైవిధ్యంగా ఉంది: ఏఎం రత్నం
‘‘హిట్ మ్యాన్’ సినిమా టీజర్ చాలా వైవిధ్యంగా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. బిష్ణు చేస్తోన్న ఈ తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలి’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. బిష్ణు అధికారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్ మ్యాన్’. అదితీ శర్మ, ఆంచల్ శర్మ హీరోయిన్లు. 99 సినిమాస్పై దీపక్ అధికారి నిర్మించిన ఈ సినిమా నవంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ను ఏఎం రత్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా బిష్ణు అధికారి మాట్లాడుతూ– ‘‘హిట్ మ్యాన్’ ఒక స్పై థ్రిల్లర్. న్యూ ఏజ్ మూవీ. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. తొలి భాగాన్ని నవంబర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ సముద్ర. ‘‘మా ‘హిట్ మ్యాన్’ సినిమాకు సహకారం అందిస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సహనిర్మాత సి్ర΄ా మిశ్రా, సంగీత దర్శకుడు ‘మంత్ర’ ఆనంద్. ఈ చిత్రానికి లైన్ ్ర΄÷డ్యూసర్: రోహిత్ ఇంగ్లే, అసోసియేట్ ్ర΄÷డ్యూసర్: సన్నీ లల్వానీ, కెమెరా: వైఆర్ శేఖర్. -
భూమి ఉన్నంత వరకే రాజు
‘సూడుండయ్యా... రైతు భూమి ఉన్నంతవరకే రాజు. ఒక్కసారి ఆ భూమి అమ్ముకున్నామా.. అదే భూమికి కూలీలమైపోతాం’ అనే డైలాగ్తో విడుదలైంది ‘‘111 గ్రీన్ జోన్’ సినిమా కాన్సెప్ట్ టీజర్. సినిమా బండి క్రియేషన్స్, యుపిక్ క్రియేషన్స్ పతాకాలపై విజయ రాఘవేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శనివారం ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘111 గ్రీన్జోన్’. మంచి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా ‘111 గ్రీజ్ జోన్’ మూవీ చాలా ప్రత్యేకమైనది. మన సంస్కృతితో ముడిపడిన చిత్రం ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు లియాండర్ లీ. ఈ కార్యక్రమంలో వీఎఫ్ఎక్స్ చంద్ర, లిరిక్ రైటర్ చిత్రన్ మాట్లాడారు. ∙విజయ రాఘవేంద్ర, ఉదయ్ కుమార్ -
కామెడీ అనుకున్నా.. మాస్లా ఉంది
‘‘తిరగబడర సామీ’ కామెడీ సినిమా అనుకున్నా. కానీ, టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా ఉంది. రాజ్ తరుణ్ యాక్షన్ ఇరగదీసినట్లు కనిపిస్తోంది. రాజ్ తరుణ్, రవి కుమార్కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘రవికుమార్ చౌదరిగారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం (యాక్షన్) చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో నాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చిన శివకుమార్గారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏఎస్ రవికుమార్ చౌదరి. ‘‘త్వరలో రిలీజ్ కానున్న మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్. నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు సముద్ర, నటుడు తాగుబోతు రమేష్ తదితరులు మాట్లాడారు. -
ఓటు మన బాధ్యత
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్ని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ‘‘మన దేశంలో కుల, మత, ప్రాంతీయ అభిప్రాయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్తో టీజర్ మొదలవుతుంది. ‘‘మందుకు, నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా?’, ‘ఓటు అనేది హక్కు కాదు.. మన బాధ్యత’’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. హృతిక్ శౌర్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్తో పాటు చాలా ముఖ్యమైన కథతో ‘ఓటు’ రూపొందింది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తన్వి నేగి. నటుడు గోపరాజు రమణ మాట్లా్లడారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్పై కేసు నమోదు) -
వారి బంధం భార్యాభర్తల్లాంటిది: మంచు విష్ణు
‘‘ఇండస్ట్రీలో ఓ యాక్టర్కి, మేకప్ మేన్కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి మేకప్మేన్ చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సులభం కాదు.. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ‘మాధవే మధుసూదనా’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను విష్ణు మంచు రిలీజ్ చేశారు. బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ–‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. మోహన్బాబుగారు సింగపూర్లో ఉండటం వల్ల ఆయన స్థానంలో విష్ణుని పంపించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
కుశలమా!
సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆదివారం(జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కంగువ’ టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులñ ల్ల గెలిచినోడు, ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ‘కుశలమా’ అంటూ సూర్య చెప్పే డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. ‘‘చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ’. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రీడీలో విజువల్ వండర్గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు టీమ్ శ్రమిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య బర్త్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్ని రిలీజ్ చేశాం.. మరో నాలుగు భాషల్లో త్వరలోనే విడుదల చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో ‘కంగువ’ రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏజే రాజా, కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా. -
నా కళ్లతో భయపెట్టాను!
‘‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ అనే డైలాగ్తో ‘ఘోస్ట్’ సినిమా టీజర్ విడుదలైంది. కన్నడ హీరో శివ రాజ్కుమార్ నటించిన చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. బుధవారం శివ రాజ్ కుమార్ పుట్టినరోజుని (జూలై 12) పురస్కరించుకుని ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి ‘ఘోస్ట్’ ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగు నిర్మాతతో... శివ రాజ్కుమార్ హీరోగా తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర పదిరి కన్నడంలో ఓ సినిమా నిర్మించనున్నారు. శివ రాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్సీఎఫ్సీపై (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) సుధీర్ చంద్ర పదిరి నిర్మించనున్న ఈ మూవీ క్యారెక్టర్ కాన్సెప్ట్ ΄ోస్టర్ని బుధవారం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
యాక్షన్ థ్రిల్లర్ 'ఎస్ 99' టీజర్ విడుదల
జగన్మోహన్, శ్వేతా వర్మ, శివన్నారాయణ, రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎస్ 99’. టెంపుల్ మీడియా పతాకంపై యతీష్, నందిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జగన్మోహన్. -
వస్తున్నాం!
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల తర్వాత దర్శక–నటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మాదాడిలతో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీ పాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. వినోదాత్మక పాత్రలో బ్రహ్మానందం, లోకల్ డాన్గా తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. సినిమా షూటింగ్ పూర్తయింది. బుధవారం టీజర్ రిలీజ్ చేశారు. ఏంట్రా అది (బ్రహ్మానందం), గ్రేప్స్.. ఏమో (మరో పాత్రధారి).. గ్రేప్.. గ్రే΄్సా... ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు...(బ్రహ్మానందం), నువ్వు బతుకుతా లేవా..అట్లనే... (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అలాగే టీజర్ చివర్లో ‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అని కూడా కనిపించింది. -
క్వాలిటీ ఫిల్మ్లా అనిపిస్తోంది: మారుతి
చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్డ్రాప్లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు. -
ట్రైలర్ చూస్తే కష్టం అర్థమవుతోంది
‘‘నా దగ్గర ఓ వెబ్ సిరీస్కు సుబ్రమణ్యం అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ‘నెల్లూరి నెరజాణ’ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే టీమ్ అందరూ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, వారందరికీ గొప్ప జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షాఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ‘‘నెల్లూరి నెరజాణ’ సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది’’ అన్నారు చిగురుపాటి సుబ్రమణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సుబ్రమణ్యంగారికి కృతజ్ఞతలు’’ అన్నారు ఎంఎస్ చంద్ర, హరి, అక్షా ఖాన్. -
సాఫ్ట్గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
లైఫ్.. డెత్.. ఫేట్.. ఇదే సర్కిల్
సాయి రోనక్ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్’ టీజర్ను విడుదల చేశారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్ పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్ చంద్ర. -
అది నా అదృష్టం
‘‘ఆర్య’ చిత్రంతో బాల నటుడిగా నా కెరీర్ మొదలైంది. ప్రభాస్, మహేశ్బాబు, సుకుమార్, త్రివిక్రమ్గార్లతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘సిద్ధార్థ్ రాయ్’ వంటి చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అని హీరో దీపక్ సరోజ్ అన్నారు. దర్శకులు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద పని చేసిన వి. యేశస్వి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ఈ చిత్రం టీజర్ని దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ వర్మ దండు, నిర్మాత వంశీ, రైటర్ లక్ష్మీ భూపాల విడుదల చేశారు. వి. యేశస్వి మాట్లాడుతూ– ‘‘సిద్ధార్థ్ రాయ్’ వంటి మంచి కథని చెప్పడానికి నేనూ నిర్మాణంలో భాగమయ్యాను. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు. -
నేతాజీ జీవిత రహస్యాలతో...
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్. -
విమానం: అన్నీ ఇచ్చేవాడిని దేవుడనరు, నాన్న అంటారు!
‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి’ అని తండ్రి అంటాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ వంటి సంభాషణలతో ‘విమానం’ టీజర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రను సముద్ర ఖని, కొడుకు పాత్రను మాస్టర్ ధ్రువన్ చేశారు. విమానం ఎక్కాలని ఆశపడే కొడుక్కి బాగా చదువుకుంటే నువ్వే ఎక్కగలవని తండ్రి అంటాడు. ‘‘తండ్రీ–కొడుకు–విమానం చుట్టూ సాగే భాగోద్వేగాల ప్రయాణమే ఈ విమానం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ , ధన్రాజ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్ , కెమెరా: వివేక్ కాలేపు. -
శాపానికి గురైతే...
యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ పతాకాలపై అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘నా నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి వస్తే నా పరువు తీస్తావా. ఇక నీకు మిగిలింది నిగ్రహమే’, ‘బాబా శాపం ఇచ్చాడా?’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు మూడో సినిమా. పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు కౌశిక్. ‘‘సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్. ‘‘ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇది నా తొలి చిత్రం’’ అన్నారు అపూర్వ. ‘‘ఈ జనరేషన్లోని అబ్బాయి ఓ బాబా శాపానికి గురైతే అతని పరిస్థితి ఏంటి? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కెమెరామేన్ అశోక్. -
'లవ్ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్
‘నేనంటే ఇష్టం లేదా’ అని అబ్బాయి అంటే... ‘లవ్ అంటేనే ఇష్టం లేదు’ అని అంటుంది అమ్మాయి. ఈ ఇద్దరి కథ ఏంటనేది ‘టక్కర్’లో తెలుస్తుంది. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ పైన పేర్కొన్న సంభాషణలతో సాగుతుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంచినాథన్ మురుగేశన్. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పరాక్రమవంతుడు
సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్లతో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. షూటింగ్ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్ను ఫిక్స్ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కథ వెనుక కథ టీజర్ చూశారా?
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఈ మూవీ టీజర్ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించి, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందించాలనే ఆలోచనతో దండమూడి బాక్సాఫీస్ సంస్థని స్థాపించాను. తొలి చిత్రంగా సస్పెన్స్, థ్రిల్ నేపథ్యంలో ‘కథ వెనుక కథ’ తీశాం. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదు, ఓ గ్యాంగ్ అని పోలీసాఫీసర్ సత్య ఎలా తెలుసుకుంటాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. -
‘అన్స్టాపబుల్’ టీజర్ను విడుదల చేసిన నాగార్జున
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘అన్స్టాపబుల్’ టీజర్ను హీరో నాగార్జునతో విడుదల చేయించారు. ‘ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా’ అంటూ 30 ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్తో టీజర్ సాగుతుంది. ‘‘డైమండ్ రత్నబాబు తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్ప్లే రసవత్తరంగా ఉంటుంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ అసెట్. రఘుబాబు, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పాత్రలు నవ్వులు పంచే విధంగా ఉంటాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: వేణు మురళీధర్, కో ప్రొడ్యూసర్: షేక్ రఫీ, బిట్టు, రాము ఉరుగొండ. -
వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్లుక్ టీజర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కతున్న ఈ చిత్రంంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో రవితేజకి లుక్, అప్డేట్ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్లుక్ సంబంధించిన అప్డేట్ వదిలింది. చదవండి: అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సెట్లో ప్రభాస్ సందడి, వీడియో, ఫొటోలు లీక్ రవితేజ ఫస్ట్లుక్ టీజర్ పేరుతో తాజాగా మాస్మహారాజకు సంబంధించిన అప్డేట్ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో రవితేజ తన నట విశ్వరూపం చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ మలిచిన ఈ ఫస్ట్లుక్ టీజర్ మాస్ ఆడియన్స్ చేత కేక పుట్టించేలా ఉంది. ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్ల ను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది’ అనే డైలాగ్తో మాస్మహారాజా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవల్ అని చెప్పవచ్చు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ చూస్తుంటే రవితేజ రోల్ను డైరెక్టర్ బాబీ చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దినట్లు ఉంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టైటిల్ ప్రచార చిత్రాలు సినిమా భారీ అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన రవితేజ లుక్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 13, 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. -
'వెయ్యి ఆడాలి.. కానీ మనం ఆడింది వందే'.. ఆసక్తిగా టీజర్
కరోనా తరువాత ఆడియెన్స్ మైండ్సెంట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలను చూసే అభిప్రాయంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాలైనా ఆదరిస్తున్నారు. అదే తరహాలో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ బ్యానర్పై జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని.. చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ పెంచుతోంది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతోందా?' అనే ఈ డైలాగ్స్తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు. అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది. -
అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. కొండలు, లోయలు, జలపాతాల నడుమ విజువల్ వండర్గా టీజర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు. The Ancients Shall Rise Again✊ Taking you all into a whole new surreal world of #HanuMan 💪#HanuManTeaser OUT NOW❤️🔥 - https://t.co/euGU07T7Ha 🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #PVCU#SuperHeroHanuMan pic.twitter.com/QCcSNvx1Nu — Prasanth Varma (@PrasanthVarma) November 21, 2022 -
రాజమౌళి అంత సక్సెస్ విశాల్ అందుకోవాలి
‘‘సినిమా కథకి ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్కి ఎన్ని రోజులు పట్టినా చేయాలనే జబ్బు విశాల్కి ఉంది. ఆ జబ్బు మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్కి అంటుకుంది (నవ్వుతూ). రాజమౌళి ఎంత సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా అంతే సక్సెస్ అందుకోవాలి’’ అని ప్రముఖ రచయిత–దర్శకుడు, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ని విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘వినోద్ కుమార్ గురించి ‘లాఠీ’ విడుదలయ్యాక సిల్వర్ స్క్రీనే చెబుతుంది. రమణ, నంద చాలా ప్యాషన్తో ఈ సినిమా చేశారు. నా ప్రతి సినిమాలానే ‘లాఠీ’ని ఎంత మంది చూస్తారో టికెట్కి రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అన్నారు. ‘‘లాఠీ’ యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ’’ అన్నారు వినోద్ కుమార్. ‘‘ఈ సినిమాతో విశాల్కి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమణ. మాటల రచయిత రాజేష్ ఎ.మూర్తి, పాటల రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. -
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్... ఎప్పుడంటే?
తమిళ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లాఠీ'. తాజాగా ఈ మూవీ టీజర్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నందా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విశాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. విశాల్ ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నాకు అరెంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదు.. త్వరలోనే ఆ వివరాలు చెబుతా: విశాల్) ఈ సందర్భంగా లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్కు అంకితమిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవనం నిర్మిస్తున్నట్లు వేదికపై వెల్లడించారు. కళాకారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు నా బృందం తీవ్రంగా శ్రమిస్తోందని విశాల్ తెలిపారు. త్వరలోనే భవనాన్ని నిర్మించి పెళ్లిచేసుకుంటానని విశాల్ పేర్కొన్నారు. The grand event of @VishalKOfficial's #Laatti is live now Watch 👇🏼 https://t.co/wF0joReRYO A @thisisysr musical@RanaProduction0 @nandaa_actor @dir_vinothkumar @TheSunainaa @balasubramaniem @DOP_bala @PeterHeinOffl @srikanth_nb @UrsVamsiShekar @Ticket_Factory pic.twitter.com/a1edIdjRuU — Vishal Film Factory (@VffVishal) November 13, 2022 -
‘అలిపిరికి అల్లంత దూరంలో'.. టీజర్ విడుదల
రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత హీరో హీరోయిన్లుగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. జె. ఆనంద్ దర్శకత్వంలో రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. శనివారం దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రావణ్ మాట్లాడుతూ– ‘‘నాటక రంగంలో అనుభవం ఉన్న నాకు యాక్టర్గా వెండితెరపై ఇది తొలి చిత్రం’’ అన్నారు. ‘‘తిరుమలలో షాపు సంపాదించుకోవాలనుకునే ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సవహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి సీన్లో వెంకటేశ్వరస్వామి రిఫరెన్స్ ఉంటుంది’’ అన్నారు ఆనంద్. జె. ‘‘డివైన్ ఎలిమెంట్స్తో థ్రిల్లింగ్గా సాగే రాబరీ డ్రామా ఈ చిత్రం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర. -
రొమాంటిక్ కామెడీ కథగా 'రాజయోగం'.. టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ను యంగ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్లో రిలీజ్ చేశారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రోనక్ ఇచ్చిన మాట ప్రకారమే ఇక్కడికి వచ్చా. సాయి రోనక్ నాలాగే పక్కా హైదరాబాద్ కుర్రాడు. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా.' అని అన్నారు. నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. 'మా చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో విశ్వక్ సేన్కు కృతజ్ఞతలు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. మా టీమ్ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది.' అని అన్నారు. దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో రోనక్ పర్మార్మెన్స్ సూపర్. ఇద్దరు హీరోయిన్స్ బాగా నటించారు. అంకిత క్యారెక్టర్ కొద్దిగా గ్రే షేడ్లో ఉంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో పడిందే అని సాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. మూవీని ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 9న థియేటర్కు రండి.' అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'మా కార్యక్రమానికి వచ్చిన విశ్వక్ అన్నకు థాంక్స్. మా సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. నాకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం లక్కీ. నాకు ఫైట్స్, డాన్స్ చేయడం ఇష్టం. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు.' అని అన్నారు. -
పల్లెటూరి ప్రేమకథగా 'బుట్టబొమ్మ'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్
అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బుట్టబొమ్మ'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘బుట్టబొమ్మ’ టీజర్ రిలీజ్ చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథను తలపిస్తోంది. టీజర్లో పలు సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి ప్రేమకథ, కొన్ని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతమందిస్తుండగా.. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
'హనుమాన్' టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజసజ్జా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో కీలక అప్డేట్ను వదిలారు. ఈ సినిమా టీజర్ను ఈనెల 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు ప్రశాంత్ వర్మ. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. -
ఆ తపన ఎప్పుడూ ఉంటుంది
‘‘మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ‘హిట్ 2’ చేయటానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ని గురువారం విడుదల చేశారు. అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘మహేశ్గారు ‘మేజర్’, నాని ‘హిట్ 2’ సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. ‘హిట్ 2’ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘హిట్’తో హిట్ సాధించాం. ‘హిట్ 2’ని స్క్రీన్పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. ‘‘క్రైౖమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2’. అడివి శేష్ పర్ఫెక్ట్ జెంటిల్మేన్.. సెట్స్లో ప్రొఫెషనల్గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానీగారే.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు శైలేష్ కొలను. సినిమాటోగ్రాఫర్ మణికందన్ .ఎస్, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, హీరోయి¯Œ కోమలీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ∙మీనాక్షీ చౌదరి, అడివి శేష్, ప్రశాంతి, శైలేష్ -
అడివిశేష్ ‘హిట్-2’ మూవీ టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
‘కింగ్ ఖాన్’ బర్త్డే సర్ప్రైజ్.. పఠాన్ టీజర్ వదిలిన మూవీ టీం
నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నటించిన చిత్రం పఠాన్. 2018లో వచ్చిన జీరో మూవీ ప్లాప్తో ఆయన సినిమాలకు కాస్తా విరామం తీసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్తో మూవీతో బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు షారుక్. ఇదిలా ఉంటే నేడు షారుక్ బర్త్డే. ఈ సందర్భంగా కింగ్ ఖాన్ ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు పఠాన్ మేకర్స్. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘పఠాన్ గురించి నీకు ఏం తెలుసు?’ అనే డైలాగ్తో మొదలైన టీజర్ను ఫైట్ యాక్షన్ సీక్వెన్స్తో ఆసక్తిగా మలిచారు. ‘‘మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్లో అతడు పట్టుబడ్డాడు. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ అతడిని వేధించారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు’’ అనే డైలాగ్తో షారుక్ పాత్రని పరిచయం చేశారు. ‘బతికే ఉన్నా’ అంటూ టీజర్లో బాద్షా ఎంట్రీ ఫ్యాన్స్ చేత ఈళలు వేయించడం ఖాయం అనిపిస్తోంది. ఇంతకీ ఈ పఠాన్ ఎవరు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఇందులో జాన్ అబ్రహం పాత్ర ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న ఈసినిమా విడుదల కానుంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
'దీపావళికి మాస్ మహారాజా సర్ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్
మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'ధమాకా' టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రవితేజ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్ను చూస్తే రవితేజ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ను చూస్తే..' నేను మీలో విలన్ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో రవితేజ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే' వార్నింగ్ ఇవ్వడం రవితేజ మాస్ను ఓ రేంజ్కు తీసుకెళ్లింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ ఈ చిత్రంలో లకపాత్రలు పోషించారు. -
మైనస్ డిగ్రీల చలిలో జాన్వీ కపూర్.. ఆకట్టుకుంటున్న టీజర్
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మిలి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో జాన్వీ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని జాన్వీ తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాన్వీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించనుంది. (చదవండి: హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్) టీజర్ను చూస్తే... ' మైనస్ 16 డిగ్రీల చలి ఉష్ణోగ్రతతో ఫ్రీజర్లో ఇరుక్కుపోయిన జాన్వీ కపూర్ తన నోటిని ఉపయోగించి టేపులను చింపివేస్తున్నట్లు సీన్తో టీజర్ ప్రారంభమైంది. ఆమె ఫ్రీజర్ నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం.. స్టిల్స్లో ఆమె ప్లాస్టిక్తో చుట్టేసినట్లు కనిపించడం ఆసక్తిని రెేకెత్తిస్తోంది. టీజర్లో డైలాగ్లు లేకపోయినా.. జాన్వీ కపూర్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) జాన్వీ కపూర్లో లుక్తో ఉన్న మరో పోస్టర్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె ఫ్రీజర్లో ఇరుక్కుపోయి.. ఆమె ముఖంపై ఎర్రటి గుర్తులతో ఉన్నట్లు కనిపించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్తో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహితో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఆమె వరుణ్ ధావన్తో కలిసి బవాల్లో కూడా కనిపించనుంది. -
టీజర్పై ఫ్యాన్స్లో భిన్నాభిప్రాయాలు .. ఆయనపై ప్రభాస్ అసహనం.. వీడియో వైరల్..!
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు విజువల్ వండర్ అని కామెంట్స్ చేయగా.. మరికొందరు బొమ్మల సినిమాలా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ టీజర్పై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని చదవకుండానే సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై హీరో ప్రభాస్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్పై కోపంగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (చదవండి: ‘ఆదిపురుష్ దర్శకుడికి రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు) ఆదిపురుష్ టీజర్పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. టీజర్ కంటే ట్రైలర్, సినిమా బాగుండాలని అభిమానులు ఆశిస్తున్నారు. మైథలాజికల్ ఫిలింగా డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఆదిపురుష్లో నటిస్తున్నారు. గతంలో రిలీజైన సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. తాజాగా ఆదిపురుష్తోనైనా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం 12 జనవరి 2023న విడుదల కానుంది. Om you coming to my room 🙂 pic.twitter.com/kM1UppGVr3 — Venu Prabhas™ (@TheVenuPrabhas) October 3, 2022 -
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్ రిలీజ్
రణధీర్, నందిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఈ సినిమాకు వినయ్ బాబు దర్శకత్వం వహించగా.. శ్రీ ధనలక్ష్మీ మూవీస్ బ్యానర్పై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతులమీదుగా ట్రైలర్ విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ...‘ ఈ సినిమా టైటిల్తో పాటు ట్రైలర్ కూడా చాలా బావుంది. హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’అని అన్నారు. దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ...‘‘మా చిత్రం ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ నచ్చి మా చిత్రం యూనిట్ ప్రశంసించారు. నిజాయితీ గా ప్రేమించుకున్న ప్రతి యువతీ, యువకులు చూడాల్సిన చిత్రమిది' అని అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఈ చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని హీరోయిన్గా నటించింది. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. త్వరలో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. -
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. -
రికార్డులు కొల్లగొడుతున్న ఆదిపురుష్ టీజర్.. విడుదలైన 17 గంటల్లోనే..!
అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో కేజీఎఫ్-2 సాధించిన రికార్డును 'ఆదిపురుష్' బద్దలుకొట్టింది. అలాగే 932 కె లైక్స్ సాధించి నెంబర్వన్గా నిలిచింది. విక్రమ్ వేద 931 కె లైక్స్తో రెండోస్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. (చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్లో అదరగొట్టిన ప్రభాస్) అయోధ్య వేదికగా నిన్న రిలీజైన ఆదిపురుష్ టీజర్ విజువల్ వండర్ను తలపిస్తోంది. కొంతమంది అభిమానులు ప్రభాస్ రాముడి లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల కానుంది. మైథలాజికల్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. -
సినిమా చేయడానికి భయం వేసింది: ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘డార్లింగ్’ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' టీజర్ వచ్చేసింది. ఆదివారం(అక్టోబర్ 2న) అయోధ్యలో గ్రాండ్గా జరిగిన ఈవెంట్లో టీజర్, ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం రామాయణం ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘సాధారణ సినిమాలా ఆదిపురుష్ తీయలేదు. దేవుడి పట్ట భక్తిని చాటుకోవడానికి ఈ చిత్రాన్ని తీశాను. చదవండి: కె భాగ్యరాజ్కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు ఈ పవిత్ర స్థలంలో టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. టీజర్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట భయం వేసింది. దేవుడు మీద ఉన్న భక్తి, ప్రమే, భయమే నన్ను ఈ సినిమా చేయించింది. రాముడిని మనం దేవుడుగా విశ్వసిస్తాం, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు’ అంటూ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ అలాగే హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. ‘జానకి పాత్రం చేయడం నా అదృష్టం. ఈ సినిమా అనుభవాన్ని నేను మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు తాతా నానమ్మలు చెప్పేవారు. ఆ రామయణ గాధలో నేను చేయ్యడం పూర జన్మ సుకృతం’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా మైథలాజికల్ ఫిలింగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. కృతీ సనన్ సీతగా కనువిందు చేయనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా అలరించనున్నాడు. కాగా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 12, 2023లో ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
తండ్రి, తనయుల మధ్య సంఘటనలే 'లోకం ఎరుగని కథ'.. టీజర్ రిలీజ్
సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లోకం ఎరుగని కథ'. ఈ సినిమా ద్వారా పూజిత హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర టీజర్ను విడుదల చేసింది. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీమతి సుజాత సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ..'ఈ సినిమా విషయానికి వస్తే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే లవ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు ఉండే కుమారుడి మధ్య జరిగే అంశమే 'లోకం ఎరుగని కథ'. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ కొప్పుల మాట్లాడుతూ..'ఇంతకుముందు నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను సంగీత దర్శకునిగా ఎంపిక చేశారు. అందరికీ ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చుతాయి. నాకు ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. 'తమిళంలో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరోయిన్ పూజిత మాట్లాడుతూ..'ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చాలా థ్యాంక్స్' అని అన్నారు. -
అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ టీజర్ అవుట్.. కట్టిపడేస్తున్న విజువల్స్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అడ్వెంచరస్ చిత్రం 'రామ్ సేతు'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ అదిరిపోయింది. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..) 'రామ్ సేతు'ను కాపాడేందుకు మన చేతుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి' అనే అక్షయ్ కుమార్ డైలాగ్తో మొదలైన టీజర్.. విజువల్స్ కట్టిపడేలా ఉన్నాయి. నీటి అడుగున ఉన్న రామసేతును చూసేందుకు అతను ప్రత్యేకమైన సూట్లో వచ్చి నీటి అడుగున డైవింగ్ చేస్తున్న సీన్లు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ సూట్లో నాజర్ గ్లింప్స్ హైలెట్గా ఉన్నాయి. రామ్ సేతుని చేరుకోవడానికి తన బృందంతో కలిసి అక్షయ్ చేసే సాహసాలను టీజర్లో చూపించారు. జాక్వెలిన్ కథానాయికగా నటించనుండగా.. తెలుగు హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. -
నయన్-విఘ్నేశ్ లవ్ డాక్యుమెంటరీ.. టీజర్ చూసేయండి..
కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ గురించి అందరికి సుపరిచితమే. ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్డే వేడులకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై 'నయనతార- బియాండ్ ది ఫెయిర్టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేశ్ కలిసి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పలు ప్రశ్నలకు వీరిద్దరు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్లుక్ పోస్టర్) దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు. త్వరలోనే విడుదల ప్రేమజంట డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. కాగా, చిరంజీవి గాడ్ఫాదర్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’.. టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. 1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
ఫ్యాన్స్కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది..
పవర్స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. చదవండి: పవన్ కళ్యాణ్ బర్త్డే.. ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: థియేటర్పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం -
విభిన్న పాత్రల్లో విక్రమ్.. ఆసక్తిగా ‘కోబ్రా’ టీజర్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 31న థియేటర్లోకి రాబోతోంది. ఇక ప్రమోషన్స్ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను రిలీజ్ చేసంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ ఇందులో చియాన్ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్ ఫిదా చేయబోతున్నాడు. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కేఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలెకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ -
ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల పెళ్లి వీడియో వచ్చేసింది..
హీరోయిన్ నిక్కీ గల్రానీతో నటుడు ఆది పినిశెట్టి వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి టీజర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా పెళ్లై మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్లుంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. హల్దీ, మెహందీ సహా పెళ్లి వరకు ప్రతీ మూమెంట్ని ఆది-నిక్కీ ఎంతో అనందంగా సెలబ్రేట్ చేసుకున్నారో వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు!
‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్తో ‘కృష్ణమ్మ’ టీజర్ విడుదల అయింది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ని సాయిధరమ్ తేజ్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. -
పాన్ ఇండియా మూవీగా విజయ్ శంకేశ్వర్ బయోపిక్, టీజర్ అవుట్
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, వీఆర్ఎల్ అనే లాజిస్టిక్ కంపెనీకి అధినేతగా ఎదిగిన డా. విజయ్ శంకేశ్వర్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విజయానంద్’ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ట్రంక్’ మూవీ ఫేమ్ రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటిస్తున్నారు. ఆనంద్ శంకేశ్వర్ సమర్పణలో వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. చదవండి: డ్రెస్సింగ్పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ను మంగళవారం విడుదల చేశారు. విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ప్రవేశించి ఎలా సక్సెస్ అయ్యారు? అనేది టీజర్లో చూపించారు. అనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి. రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నారు. -
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్లో మూడో చిత్రం.. ఆగస్టు 2న
Swadharm Entertainment Masuda Teaser Will Be Released: ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్లో రాబోతోన్న మూడో చిత్రం ‘మసూద’. కంటెంట్ రిచ్ ఫిల్మ్స్కి కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (లలన్ సింగ్ పాత్రధారి) నటిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్రామ్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. -
Vadu Evadu: సస్పెన్స్.. థ్రిల్
‘‘వాడు ఎవడు’ టీజర్ చాలా బాగుంది. వాస్తవ ఘటనలతో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్తికేయ, అఖిలా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘వాడు ఎవడు’. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్పై ఎన్. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సందేశం ఇస్తున్నాం. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘వైజాగ్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’’ అని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్ కుమార్, నేపథ్య సంగీతం: రాజేష్. -
లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య
‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..’ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగులతో ‘థ్యాంక్యూ’ చిత్రం టీజర్ విడుదలైంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ని బుధవారం విడుదల చేశారు.‘నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు కూడా టీజర్లో వినిపిస్తాయి. ‘‘ఈ చిత్రంలో వ్యాపారవేత్త అభిరామ్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఓ సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీసీ శ్రీరామ్. -
VaraLakshmi Sarathkumar : చేజింగ్.. చేజింగ్
వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రలో కె. వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చేజింగ్’. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ చిత్రం టీజర్ని దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి మాట్లాడుతూ– ‘‘చేజింగ్’ మా కాంబినేషన్లో మొదటి సినిమా అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. మరిన్ని తెలుగు, తమిళ సినిమాలు తీయాలనుకుంటున్నాం’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుండు ప్రభాకర్, కె. వీరకుమార్, దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడారు. -
థ్రిల్లర్ ప్రేమ కథగా ‘మాటరాని మౌనమిది’
‘శుక్ర’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్లుగా ‘మాటరాని మౌనమిది’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమై ఉంది. తాజాగా ఈచిత్రం గ్లింప్స్ టీజర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..‘నా మొదటి సినిమా శుక్ర, మంచి విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్ లో 2.2 మిలియన్ మంది వీక్షించారు. ఇప్పుడు ‘మాటరాని మౌనమిది’ అనే మంచి థ్రిల్లర్ ప్రేమ కథ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి కథ, కథనం తో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి అషీర్ లుక్ సంగీతం సమకూరుస్తుండగా, శివరామ్ చరణ్ కెమెరా మెన్గా వ్యవహరిస్తున్నారు. -
కిరీటి లుక్స్ బాగున్నాయి– రాజమౌళి
‘‘కిరీటిని పరిచయం చేస్తూ టీజర్ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తన లుక్స్ చాలా బాగున్నాయి. నటుడికి కావాల్సిన అన్ని అర్హతలు కిరీటిలో ఉన్నాయి. నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. వారాహి బేనర్లో కిరీటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. మంచి తారాగణం, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. జెనీలియా, డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం పతాకంపై తెలుగు–కన్నడ భాషల్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కన్నడ స్టార్ రవిచంద్రన్ వి. కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ– ‘‘నేను నటనకు దూరమై పదేళ్లయింది. కిరీటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సార్ (పునీత్ రాజ్కుమార్) స్ఫూర్తి. యూత్ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు కిరీటి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సెంథిల్ కుమార్. -
సోల్స్ మూవీ టీజర్ విడుదల
మనకు కలిగే ఏ పరిచయమూ కారణం లేకుండా జరగదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సోల్స్’. తినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా శ్రావణ్ దర్శకత్వంలో విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు వెంకటేష్ మహా రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘రెండు సోల్స్ ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ప్రతీక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సంగీతం అందించారు. -
గోదావరి అల్లుడు వచ్చేశాడు.. 'అశోకవనంలో అర్జున కల్యాణం' టీజర్ రిలీజ్
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Teaser Out: టాలీవుడ్కి లవర్ బాయ్గా పరిచమయమై మాస్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నూమా దాస్, హిట్, పాగల్ వంటి చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా అలరించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్స్ను మొదటి నుంచి విభిన్నంగా చేస్తుంది చిత్రబృందం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్ ఆకట్టుకున్నాయి. 'ఓ ఆడపిల్లా' పాటతో విశ్వక్ సేన్ సరసన నటించే హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ అని రివీల్ చేశారు మేకర్స్. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. 'ఇంటర్క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితదారా.. ఇదే ఫస్టా' అంటూ ప్రారంభమైన సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంబాషణలు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్ చేసే ప్రయత్నాలు అలరించాయి. ఈ సినిమాతో సరైనా సమయంలో పెళ్లి చేసుకోకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో హ్యూమరస్గా చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివరిలో విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 4న ప్రేక్షకులముందుకు రానున్నాడు ఈ గోదావరి అల్లుడు. -
సౌందర్య తర్వాత ఆమె అంటేనే నాకు ఇష్టం: సి. కల్యాణ్
‘‘సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో ఎప్పుడూ సక్సెస్ రాదు.. ఒకరికొకరు తోడవ్వాలి. మా గురువుగారు (దాసరి నారాయణరావు) అదే చెప్పేవారు’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్ను సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ వస్తుంది’’ అన్నారు. ‘‘అంజిని చూస్తే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తీసిన దర్శకుడిలా లేడు. బి. గోపాల్, వీవీ వినాయక్లా కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నాడు’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ‘‘మేం ఈ సినిమా ఆరంభించినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతోందని అనుకున్నప్పుడు సపోర్ట్ అవసరమని అడగ్గానే రవి కొల్లిపర ముందుకొచ్చారు ’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘96, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఉంటుంది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేశాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు అవికా గోర్. -
ఫొటోలు చూసి కత్రీనా, విక్కీ కుళ్లుకోవాలి.. ఇది నవీన్ పొలిశెట్టి పెళ్లి
Naveen Polishetty Anaganaga Oka Raju Movie Title Teaser Out: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తానెంటో నిరూపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హోస్ట్గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా నవీన్ హీరోగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, పోర్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. 'అనగనగా ఒక రాజు' అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు నవీన్. తన పెళ్లికి తీసే ఫొటోలు సోషల్ మీడియాలో అదిరిపోవాలని, కత్రీనా, విక్కీ కౌశల్ కుళ్లుకోవాలని చెప్పడం సరదాగా ఉంటుంది. 'నేను చెప్పకూడదు కానీ, ఈ డికెడ్లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా' అంటూ వీడియో ముగించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టికి మరో బర్త్డే గిఫ్ట్.. కొత్త సినిమా అప్డేట్ -
గ్రామీణ నేపథ్యంతో 'బరి'.. ఫస్ట్ లుక్, టీజర్ విడుదల
Bari Movie First Look And Teaser Released: రాజు, సహాన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బరి'. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ను సోమవారం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్, టీజర్తోపాటు టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయని రాజ్ కందుకూరి తెలిపారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ఈ సినిమాతో నేను హీరోగా పరిచయం అవుతున్నా. దర్శకుడు ఎంతో హార్డ్ వర్క్ చేసి అందరికీ నచ్చే విధంగా సినిమా తెరకెక్కించారు. టీమ్ని నమ్మి మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.' అని హీరో రాజు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్రధానంశంగా తెరకెక్కనున్నట్లు డైరెక్టర్ సురేష్ రెడ్డి వెల్లడించారు. రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నాడు. నాలుగు పాటలున్న ఈసినిమా ఆడియోను త్వరలో లాంచ్ చేస్తామన్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 'మాది బెంగళూరు అయినా సినిమాల మీద ఉన్న ఇష్టంతో తొలి సినిమాగా 'బరి' చిత్రాన్ని నిర్మించాను. టీమ్ అంతా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంతా పూర్తయింది. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఇంత వరకు రాని కథాంశంతో ఈ సినిమా చేశాను. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని నిర్మాత మునికృష్ణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. . టీజర్ చూశారా?
Gangastar Gangaraju Movie Teaser Released: లక్ష్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించారు. ‘అదిగదిగో మన గ్యాంగ్స్టర్ గంగరాజు రానే వచ్చాడు’ అంటూ లక్ష్ ఇంట్రో సీన్తో టీజర్ రిలీజ్ చేశారు. ‘‘మాస్ పాత్రలో లక్ష్ కనిపిస్తారు. జయసుధగారి తనయుడు నిహార్ని విలన్గా పరిచయం చేస్తున్నాం. లవ్, యాక్షన్ తదితర అంశాలను మేళవించి ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సత్యదేవ్ పవర్ఫుల్ డైలాగ్లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్
Satyadev Godse Movie Teaser Released By Chiranjeevi: విభిన్న కథా చిత్రాలతో అలరించే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. ఇటీవల 'స్కైలాబ్' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్ గాడ్సేగా రాబోతున్నాడు. దర్శకుడు గోపీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలు, నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న గాడ్సే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ విడుదల చేస్తూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్. విడదల చేసిన టీజర్తో సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. సత్యదేవ్ చెప్పే డైలాగ్లు పవర్ఫుల్గా ఉన్నాయి. 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయయే తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభమవుతుంది. అలాగే 'సేవ చేస్తున్నందుకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్రా?' అనే డైలాగ్ ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది. సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తుంది. నాగబాబు, తనికెళ్ల భరణి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Godse Teaser launch video 🎥 by Mega 🌟 @KChiruTweets garu #GodseTeaser https://t.co/IcruuzHXrn@ActorSatyaDev @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @CKEntsOffl #SunilKashyap @vamsikaka @adityamusic pic.twitter.com/LfGusH5XCt — Vamsi Kaka (@vamsikaka) December 20, 2021 -
కపిల్ దేవ్ బయోపిక్: ఉత్కంఠ రేపుతున్న ‘83’ మూవీ టీజర్
Ranveer Singh 83 Movie Teaser Out:1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా 83 టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్ను వదిలారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ఈ టిజర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కపిల్ దేవ్గా రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్తో ఈ టీజర్ ముగిసింది. ఈ సిన్నివేశంలో చూస్తుంటే క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రాకతప్పదు అనేలా టీజర్ను ఆసక్తిగా మలిచారు మేకర్స్. కాగా ఈ మూవీలో కపిల్ దేవ్గా రణ్వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రొమి భాటియా పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: బిగ్బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో -
నాగ చైతన్య ‘బంగార్రాజు’ టీజర్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది. చదవండి: బిగ్బాస్ 5: బిగ్బాస్ హోస్ట్గా శ్రుతి హాసన్! ఇక ఇప్పటికే ఈ సినిమాలో నాగలక్ష్మిగా విడుదలై కృతిశెట్టి ఫస్ట్లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న చై ఫస్ట్లుక్ విడుదల కాగా, తాజాగా ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశాడు నాగార్జున. దీనిని ‘చిన్న బంగార్రాజు’ అంటూ నాగ్ విడుదల చేశాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య లుక్ అదిరిపోయింది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Presenting our🔥చిన బంగార్రాజ🔥on his birthday ❤️Love you ra❤️ 👉 https://t.co/GCRd9s1GbX @chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuFirstLook #HBDChay — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 23, 2021 -
ఇక కొత్త నానీనే చూస్తారు
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో నేనెప్పుడూ కొత్త, పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. ఇప్పటినుంచి ప్రతి సినిమాలో ఇది వరకు చూడని కొత్త నానీనే చూస్తారు’’ అని హీరో నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్కు వస్తున్నాను.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. మంచి టీమ్ కుదిరినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ‘ఎంసీఏ’తో హిట్ సాధించాను.. ‘శ్యామ్ సింగరాయ్’కి ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను కూడా నాని అభిమానినే. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మా సినిమా ఉంటుంది’’ అని రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ‘‘నాని ఎంతో సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి వెంకట్గారిలాంటి నిర్మాతలు అవసరం ’’ అన్నారు నటుడు రాహుల్ రవీంద్రన్. కథా రచయిత సత్యదేవ్ జంగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట్ రత్నం (వెంకట్). -
చరణ్ వాయిస్తో గని టీజర్, కేక పెట్టిస్తున్న డైలాగ్స్
Varun Tej Ghani Teaser Out Now: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీని నుంచి విడుదలైన ఫస్ట్లుక్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ను వదిలారు మేకర్స్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తుండగా.. రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో టీజర్ మొదలైంది. మధ్యలో ‘ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్లో ఉంటావ్. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్’ అంటూ చెప్పిన డైలాగ్ కేక పెట్టించేలా ఉంది. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చదవండి: కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్ -
ఆకట్టుకుంటున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ టీజర్
‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్.. చాలా గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కల్యాన్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. పులివాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా అజయ్, ‘జబర్దస్త్’ మహేశ్తో పాటు తదితర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్రాజ్
సునీల్, ధన్రాజ్ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్రాజ్. ‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి. -
ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ టీజర్
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రానికి హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. నటుడు సత్యదేవ్ వాయిస్ ఓవర్తో పంచతంత్ర కథలను బెబుతూ విడుదలైన ఈ టీజర్ ఆసక్తిగా సాగింది. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది’ అంటూ ప్రారంభమైంది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్ గుడ్ మూవీగా పంచతంత్రం చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అఖిలేష్ వర్ధన్, సృజన్లు నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు. -
భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్తో బెదిరించిన రానా
Rana Daggubati As Daniel Shekar From Bheemla Nayak : పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో రానా డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. పంచెకట్టులో కనపించిన రానా లుక్ అదిరిపోయింది. 'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో' అంటూ రానా పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ లుక్ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమావచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. 88 రామారెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్ కార్తికేయ, తనికేళభరణి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. టీజర్ విషయానికొస్తే.. కార్తికేయ ఇందులో ఎన్ఐఏ ఎజెంట్గా కనిపించాడు. కొత్తగా అపాయింట్ అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు. చదవండి: ‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్ రాజ్ దీనిపై తనిళకేళ భరణికి, కార్తికేయకు మధ్య జరిగే సంభాషణలు అలరిస్తున్నాయి. అలాగే చివర్లో ‘చిన్నప్పుడు కృష్ణ గారిని.. పెద్దయ్యాక టామ్ క్రూజ్ని చూసి ఆవేశపడి జాబ్లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక కార్తికేయ పాత్రకి యాక్షన్తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా రాజా విక్రమార్కలో కార్తికేయకు జోడిగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: 2 ఓటీటీ ప్లాట్ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్ భారీ ఒప్పందం! -
ఆకట్టుకుంటున్న కల్యాణ్దేవ్ ‘కిన్నెరసాని’ టీజర్
'విజేత' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరో ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది క్యాప్షన్. తాజాగా ఈ మూవీ టీజర్ను హీరో నితిన్ విడుదల చేశారు. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమకైనా'.. అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా టీజర్ ఆద్యంతం సస్పెన్స్ను క్రియేట్ చేస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ శీతల్ ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తుంది. మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. Happy to launch the interesting #KinnerasaniTeaser💥 Wishing the director @RamanaTeja9, dear @IamKalyaanDhev, producer @itsRamTalluri and the entire team all the luck🤗 👉 https://t.co/hRBIGpIP87#Kinnerasani@SRTmovies @annsheetal1 @RavindraVijay1 @Desharaj12 @mahathi_sagar — nithiin (@actor_nithiin) August 27, 2021 చదవండి :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు! -
కేక పుట్టిస్తున్న ‘సూపర్ స్టార్ బర్త్డే బ్లాస్టర్’, ఫ్యాన్స్కు పండగే
Sarkaru Vaari Paata Birthday Blaster Video: మహేశ్ బాబు అభిమానులంతాఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్డే బ్లాస్టర్ వచ్చేసింది. అగష్టు 9 ఆయన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ను అందించాడు. ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో బయటకు వచ్చింది. మహేశ్ బర్త్డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్స్టార్ బర్త్డే బ్లాస్టర్’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు మూవీ యూనిట్. చెప్పిన టైం కంటే కొన్ని గంటలే ముందే మేకర్స్ ఈ వీడియోను విడుదల చేసి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్ మరింత యంగ్గా కనిపించాడు. ఆయన చెప్పే పవర్ఫుల్ డైలాగ్లు, కీర్తిసురేశ్తో లవ్ ట్రాక్ ఇలా ప్రతిదీ వావ్ అనిపిస్తున్నాయి. ఈ స్పెషల్ బ్లాస్టర్ విషయానికి వస్తే.. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ మహేష్ బాబు ఎంట్రీని అద్భుతంగా చూపించారు. ‘ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కేక పుట్టించేలా ఉంది. మొదట యాక్షన్ సీన్స్తోనే ఈ బ్లాస్టర్ను పేల్చేశారు మూవీ యూనిట్. ‘ఇఫ్ యూ మిస్ ది ఇంట్రస్ట్ యు విల్ గెట్ ది డేట్’ అంటూ విలన్ గ్యాంగ్కి వార్నింగ్ ఇచ్చాడు మహేశ్. ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సూరేశ్ మహేశ్కు హారతి ఇస్తూ ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పగానే, మహేశ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. -
Dear Megha: నాకు లవ్లో పీహెచ్డీ ఉంది
‘హాయ్ నేను మేఘా స్వరూప్. నాకు లవ్లో పీహెచ్డీ ఉంది. నిన్ను చూసినన్నిసార్లు బుక్స్ చూసి ఉంటే క్లాస్ టాపర్ అయ్యుండేదాన్ని’ అంటూ మేఘా ఆకాశ్ చెప్పే డైలాగులతో విడుదలైంది ‘డియర్ మేఘ’ సినిమా టీజర్. అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు హీరోలుగా, మేఘా ఆకాశ్ హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్ని మేఘా రిలీజ్ చేశారు. అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– ‘‘సుశాంత్, నేను చాలా కథలు విన్నాం.. వాటిలో ‘డియర్ మేఘ’ కథ నచ్చి, నిర్మించాం. సుశాంత్ రెడ్డి, మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ ఆగస్టులో థియేటర్లలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా వంద శాతం ప్రేక్షకుల మనసులను తాకుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి. ‘‘నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ పలు కారణాలతో ఇక్కడ ఎక్కువగా చేయలేకపోతున్నాను’’ అన్నారు మేఘా ఆకాశ్. ‘‘నా కాలేజ్ డేస్లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి ప్రేమకథా సినిమాలు చేసేవారు.. అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ‘డియర్ మేఘ’లో చూపించబోతున్నాం’’ అన్నారు అదిత్ అరుణ్. సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. -
ఆకట్టుకుంటున్న ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్ గ్లిమ్ప్స్
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘సొగసు చూడ తరమా’. తల్లాడ సాయి కృష్ణ, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మంగళవారం(జూలై 13) హీరోయిన్ నక్షత్ర బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్లో అరకు అందాలలో హీరోయిన్ ఉన్న సన్నివేశాలు, మంచి నేపధ్యం బ్యాక్గ్రౌండ్ సంగీతంతో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ అన్నారు. హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. ‘నేను చేసిన రెండవ సినిమా ఇది, అరకులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథగా మా సినిమా రూపొందుతుంది. ‘సొగసు చూడ తరమా’లో నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వస్తుంది’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తల్లాడ సాయి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పవన్ సంగీతం అందిస్తున్నాడు. -
Kanabadutaledu: డిటెక్టివ్గా సునీల్.. ఆసక్తి రేపుతున్న టీజర్
సునీల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `కనబడుటలేదు`. ఓ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్. బాలరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ని విడుదల చేసింది చిత్రబృందం. . 'పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి'.. అంటూ కీలకమైన కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న సునీల్ను పరిచయం చేశారు. పోలీసులకు అంతుపట్టని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అన్నీ బాగున్నాయి. సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే స్పార్క్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆకట్టుకుంటున్న మహేశ్ మేనల్లుడి ‘హీరో’ టీజర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా ఓ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి హీరో అనే టైటిల్ ఖారారు చేసింది చిత్ర బృందం. తాజాగా ‘హీరో’ ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ను సూపర్ స్టార్ మహేశ్ విడుదల చేశాడు. అంతేగాక తన మేనల్లుడు ఆశోక్ గల్లా, మూవీ యూనిట్కు అభినందనలు కూడా తెలిపాడు. Couldn't be happier to launch the title of your debut film @AshokGalla_!! This looks super interesting! The #HERO journey begins! Good luck to @SriramAdittya and team! @AgerwalNidhi @amararajaenthttps://t.co/bblUZtAkTc — Mahesh Babu (@urstrulyMahesh) June 23, 2021 ఇక టీజర్ విషయానికి వస్తే.. ట్రైన్ వెళ్తుండగా కౌబాయ్ గేటప్లో అశోక్ గల్లా ఎంట్రీ ఇస్తాడు. గుర్రంపై ఆ ట్రైన్ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్ ఎంట్రీ టీజర్కు హైలెట్గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్ గేటప్లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతుంది. కాగా అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. -
Play Back: ఒక్క ఫోన్ కాల్తో 1993 కాలంలోకి హీరో..
హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లే బ్యాక్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కల్యాణ్, అశోక్ వర్ధన్, దివంగత టీఎన్ఆర్, తాగుబోతు రమేష్, మూర్తి, గౌతమ్ రాజు, దీప్తి, తదితరులు నటిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాదిమార్చి 5వ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. క్రాస్ కనెక్షన్ అనే సరికొత్త అంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. మే 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఒక్క ఫోన్ కాల్.. హీరోను 1993 కాలంలో ఉన్న హీరోయిన్ దగ్గరకు ఎలా తీసుకెళ్లిందో చూపించిన ఈ టీజర్ మరింత ఆసక్తిని పెంచుతోంది. -
ఇంటర్నెట్లో అది దొరకదు!
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ను నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు. -
బాబు రావాలి.. రౌడీ కావాలి..
‘బాబు రావాలి... రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’, ‘ఎవరన్నా వాళ్ల మనవణ్ణి ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు... ఈ రౌడీ చేయడమేంట్రా?’, ‘నెపోటిజమ్ రా’.. వంటి డైలాగులు ‘గల్లీ రౌడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం ‘గల్లీ రౌడీ’ టీజర్ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘‘కోన వెంకట్ కథను ఫన్ రైడర్గా మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించే నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. వైవిధ్యమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పంచుతారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. చదవండి: ఆ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్ -
బైక్ రేస్ నేపథ్యంలో సిద్దార్థ్ మూవీ
‘ట్రాఫిక్ రేస్లో నడిపే బండి ముఖ్యం కాదు.. ఎవరు నడుపుతున్నారన్నదే ముఖ్యం, మీరు ఇల్లీగల్ రేసింగ్ చేస్తున్నారు, మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కళ్ల ఇంటికి వెళ్లక్కర్లేదు సర్.. రోడ్లు చెప్పేస్తాయ్ దేశం గురించి’ వంటి డైలాగులతో ‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదలైంది. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ సిద్ధార్థ్ , సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వం వహించారు. కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ కథానాయికలు. రమేష్ పి. పిళ్లై నిర్మించిన ఈ సినిమాని శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్పై ఏ.ఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. టీజర్ని బట్టి చూస్తే బైక్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఇది. సిద్ధార్థ్, ప్రకాష్ పోటాపోటీగా నటించారు. వీరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్స్కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. -
అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!
‘‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్ని నేను వ్యక్తిగతంగానూ ఆచరిస్తా. మీ అందరిలాగే నాకూ భయాలుంటాయి. నేనూ భయపడే క్షణాలుంటాయి. అప్పుడు నేను ‘ధైర్యం చేసి ముందడుగు వేసెయ్. పడిపోయినా ఫరవాలేదు. తగ్గేదే లే’ అనుకుంటా. అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చాననుకుంటున్నా’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయిక. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లో ‘పుష్ప’ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ప్రేమకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా లైఫ్ టేకాఫ్ అయిందే సుకుమార్ ‘ఆర్య’ వల్ల. ఆ సినిమాతోనే నాకు ‘స్టైలిష్ స్టార్’ అని పేరొచ్చింది. ఈ రోజు ‘ఐకాన్ స్టార్’ అని ఓ కొత్త పేరొచ్చింది. నాకు ‘ఆర్య’, ‘ఐకాన్ స్టార్’ ఇచ్చినందుకు సుకుమార్కి థ్యాంక్స్. నేను చేసేది ఏదైనా ఫ్యాన్స్కు నచ్చాలి. నా జీవితాన్నే వారికి అంకితమిస్తున్నా’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘హిందీ సహా పరభాషా ప్రేక్షకుల వల్లే తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. ఇంత పెద్ద మార్కెట్ వచ్చింది. వినోదరంగంలో రానున్న 25 ఏళ్లలో తెలుగు సినిమా ప్రపంచంలోనే పెద్ద స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు. చదవండి: అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన టాప్ 5 చిత్రాలు.. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘మంచి కథతో పాటు నటన, డైలాగ్స్, కెమెరా, సంగీతం, ఎమోషన్స్, ఫైట్స్... ఎంత ముఖ్యమో అవన్నీ కలగలిసినదే మా‘పుష్ప’ సినిమా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సానా బుచ్చిబాబు, హీరో అల్లు శిరీష్, ముత్తంశెట్టి మీడియా రవి పాల్గొన్నారు. ఇక నుంచి బన్నీ ‘ఐకాన్ స్టార్’! – సుకుమార్ ‘‘బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరు ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. కానీ ‘పుష్ప’లో తన అద్భుతమైన నటనను మీకు అందించబోతున్నాం. ప్రామిస్. తన నటనకీ, ‘స్టైలిష్ స్టార్’కీ సంబంధం లేదనిపించింది. తన ప్రతి పాత్ర, ప్రతి సినిమా, తన ప్రతి డ్రెస్ యూనిక్.. ప్రతి విషయంలో యూనిక్ అయినందుకే తను స్టైలిష్ స్టార్ కాదని నేను భావించి ‘ఐకాన్ స్టార్’ అని పెట్టా. బన్నీని ఇదివరకు ‘ఆర్య’ అని పిలిచేవారు. ‘పుష్ప’ తర్వాత రెండే విషయాలు మిగలాలి... ఒకటి ‘ఐకాన్ స్టార్’, రెండోది ‘పుష్ప’ అని పిలవాలి’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. చదవండి: పుష్ప టీజర్: ఊరనాటుగా అల్లు అర్జున్ -
స్పెషల్ లుక్లో రమ్యకృష్ణ.. ఆసక్తి రేపుతున్న రిపబ్లిక్ టీజర్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిప్లబిక్’. సుదీర్ఘకాలం తర్వాత డైరెక్టర్ దేవా కట్ట తీస్తున్న చిత్రం ఇది. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రీల్లర్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవా ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’ తీశారు. ఈ మూవీ టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్గా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ దేవా కట్ట పొలిటికల్ జానర్ ‘రిపబ్లిక్’తో తిరిగి వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టిజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్వవస్థలే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నామంటూ’ సమాధుల్లో కలిసిపోతున్న వ్యవస్థను ప్రశ్నిస్తూ దారిలో పెట్టాలనుకునే యువకుడి కథే రిపబ్లిక్ థీమ్. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలితను తలపించేలా రమ్యకృష్ణ లుక్ టీజర్కు స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకొవచ్చు. దీంతో ఈ మూవీలో రమ్యకృష్ణ సీఎం పాత్రలో కనిపించనున్నారని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే రమ్యకృష్ణ లుక్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభుత్వ అధికారులు నేతలకు బానిసలుగా మారితే సమాజంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేదే మెయిన్ పాయింట్గా చిత్ర యూనిట్ టీజర్ను విడుదల చేసింది. ఇక ఇందులో తేజ్ కీలక పదవిలో ఉండే ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్లు క్లారిటి వచ్చేసింది. చదవండి: ‘వైల్డ్డాగ్ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’ రామ్చరణ్ బర్త్డే సీడీపీ: ఫ్యాన్స్ ట్రోలింగ్! -
స్టోరీ టెల్లింగ్ బాగుంది
‘‘ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు.. దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి...’ అంటూ ‘విరాటపర్వం’ టీజర్ విడుదలైంది. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ట్యాగ్లైన్ . డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను హీరో చిరంజీవి విడుదల చేసి, ‘స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంది.. చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్కు మంచి స్పందన వచ్చింది. రానా బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతికి విడుదల చేసిన రానా–సాయిపల్లవి జంట పోస్టర్కి కూడా సూపర్బ్ రెస్పా¯Œ ్స వచ్చింది. యూనిక్ కాన్సెప్ట్తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో భజ్జీ తన మూవీ టీజర్ను ట్విటర్లో మంగళవారం విడుదల చేశాడు. హిందీ, తెలుగు, తమిళ బాషల్లో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లింక్లను షేర్ చేస్తూ.. ‘నా మూవీ ‘ఫ్రెండ్షిప్’ టీజర్ వచ్చేసింది. లింక్స్ ఇక్కడ ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్’ అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. దీంతో క్రికెటర్ సురేష్ రైనా, మరికొందరు ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని పాట, ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. Sharp,Crisp,Intense #FriendShipMovieTeaser of my Movie is Here.Enjoy it,Guys! Tamil -https://t.co/LSUImD7xUG Telugu-https://t.co/unECTwvJK5 Hindi-https://t.co/BSzIWz05iG @JPRJOHN1 @akarjunofficial @shamsuryastepup #Losliya @actorsathish @JSKfilmcorp @ImSaravanan_P — Harbhajan Turbanator (@harbhajan_singh) March 1, 2021 ఇటీవల విడుదలైన ఓ సాంగ్లో భజ్జీ లుంగీతో మాస్ స్టేప్పులేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న హర్భజన్ అనంతరం ఐపీఎల్లో పాల్గోననున్నాడు. ఇదివరకు భజ్జీ బాలీవుడ్ చిత్రాలు ‘ముజే షాదీ కరోగీ’, ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’తో పాటు ఓ పంజాబీ మూవీల్లో అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. జాన్ పాల్రాజ్, శ్యామ్ సూర్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా వలన ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ను శరవేగంగా పూర్తిచేసుకుంటూ వేసవిలో విడుదలకు సిద్ధంగా అవుతోంది. చదవండి: తమిళ బంధాన్ని తలుచుకుని భావోద్వేగం భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ -
గుడ్న్యూస్ : ప్రేమికుల రోజునే 'రాధే శ్యామ్’ టీజర్
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల కానుంది. అదే రోజున సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా పీరియాడికల్ లవ్స్టోరీ కావడంతో ప్రేమికుల రోజునే ఈ చిత్రం టీజర్ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఇటలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటించింది. రాధాకష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. (రాధేశ్యామ్ స్టోరీలైన్ తెలిసిపోయింది!) యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కు వర్క్ చేస్తుండటం విశేషం. చదవండి: (ఆదిపురుష్ ఆరంభ్.. ప్రభాస్ సర్ప్రైజ్) Get ready for the biggest love announcement of the decade! ✨♥️ 14th Feb, save the date! 💕 #RadheShyamPreTeaser ▶️ https://t.co/ALrESp2z7v Starring #Prabhas & @hegdepooja Directed by @director_radhaa Presented by @UVKrishnamRaju garu pic.twitter.com/TGyV5JVXLD — UV Creations (@UV_Creations) February 6, 2021 -
ఐదు భాషల్లో శింబు ‘రివైండ్’
‘‘శింబు హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అన్నారు హీరో రవితేజ. శింబు, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రివైండ్’. హిందీ–తమిళ్– తెలుగు–కన్నడ–మలయాళ భాషల్లో సురేష్ కామాచి నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మానాడు’, తెలుగులో ‘రివైండ్’ టైటిల్తో రూపొందుతోంది. బుధవారం శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్ని రవితేజ రిలీజ్ చేశారు. ‘మానాడు’ హిందీ టీజర్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ టీజర్ని సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, కన్నడ టీజర్ని హీరో సుదీప్ విడుదల చేశారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శింబు ముస్లిమ్ పాత్ర చేస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శకులు భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, ఎస్.జె. సూర్య, కరుణాకరన్ నటిస్తుండడం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. -
టీజర్: సుశాంత్కు ప్రభాస్ విషెస్
తన లైఫ్లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్ చెబుతున్నాడు. డి.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక చూస్కోండి అంటూ టీజర్ను వదిలాడు. ఈ సినిమా బైక్ పార్కింగ్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్ను బట్టి తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్ను చూస్తే అర్థమవుతోంది. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. -
ఇది నా కలల ప్రాజెక్ట్
అండర్ వరల్డ్ నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘డి–కంపెనీ’. ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అన్నది ఉపశీర్షిక. స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్, రామ్గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్స్టర్గా అండర్ వరల్డ్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది మా చిత్రంలో చూపించబోతున్నాం. గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ‘డి–కంపెనీ’ తల్లి లాంటిది.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా దావూద్ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో కీలకం. ఈ మూవీని ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. కాగా ఈ సినిమా టీజర్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్లో షేర్ చేయడం విశేషం. -
హ్యపీ బర్త్ డే శౌర్య.. అదిరిపోయిన ‘లక్ష్య’ టీజర్
ఆర్చరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''లక్ష్య''. యువ నటుడు నాగశౌర్య జన్మదినం సందర్భంగా గురువారం చిత్రబృందం లక్ష్య టీజర్ విడుదల చేసింది. ఈ సినిమా శౌర్యకు ఇది 20వ చిత్రం. ధీరేంద్ర సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రూపుదిద్దుకుంటోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పార్థు పాత్రలో ఆర్చరీ ఆటగాడుగా నాగశౌర్య నటిస్తున్నాడు. 'చాలా మందికి ఆడితే గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు డైలాగ్తో టీజర్ మొదలవుతుంది. 'పడి లేచిన వాడితో పందెం వేయడం చాలా ప్రమాదకరం' అంటూ వచ్చిన 'లక్ష్య' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శౌర్య సిక్స్ ప్యాక్తో కనిపిస్తున్నాడు. హీరోయిన్గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టీజర్ అదిరిపోవడంతో నాగశౌర్య ఖాతాలో మరో విజయం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఆర్చరీ నేపథ్యంగా దేశంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే. -
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్లైన్తో మరో థ్రిల్లర్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్) 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
‘వీడు ముసలోడు అవ్వకూడదే’
మెగా వారసుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి హీరోహీరోయిన్లు దర్శకుడు బచ్చిబాబు సనా రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, మోషన్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఉప్పెన టీజర్ విడుదల చేసింది. నిమిషం నిడివి గల ఈ టీజర్లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమా కథ లాగే పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ) ఇక టీజర్ విషయానికోస్తే.. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్తో ప్రారంభం అవుతుంది. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్ మీసాలు తిప్పుతూ స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు ఓటీటీ ప్లాట్ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించినా.. థియేటర్లు తెరుచుకొవడంతో సినిమాను బిగ్స్క్రీన్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు) -
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజా టీజర్ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్’ అంటగా అని సాగే డైలాగ్తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్లతో ఉన్న ఈ టీజర్తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ అభిమానులకు ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ హామీ
సాక్షి, హైదరాబాద్: ‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఇటలీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్లుక్, టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘డార్లింగ్’ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ ప్రామిస్ చేశాడు. (చదవండి: రాధే శ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ప్రకటించే యోచన) ‘టీజర్ అప్డేట్ త్వరలోనే మీ ముందుకు రానుంది. అంతవరకూ కాస్తా ఓపిక పట్టండి. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఇది మీ మొహంలో చిరునవ్వులు చిందిస్తుందని ఆశిస్తున్న’ అంటూ ట్వీట్ చేశాడు. అత్యధిక భారీ బడ్జేట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సంక్రాంతికి సర్ప్రైజ్) Teaser update is on the way guys!! Very very soon, till then just be patient!!! I promise your wait be worth a million smiles. #radheshyam — Radha Krishna Kumar (@director_radhaa) January 5, 2021 -
చెక్ మాస్టర్
ఆదిత్య ఓ అద్భుతమైన చెస్ ప్లేయర్. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ ౖజñ ల్లో చిక్కుకున్నాడు. ఈ చెస్ ప్లేయర్ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం విడుదల చేశారు. చెస్ ప్లేయర్ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
టీజర్ ఆసక్తికరంగా ఉంది
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను త్రివిక్రమ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్ థిల్లర్గా రూపొందించాం. కునాల్ శర్మ విలన్గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్ని విడుదల చేసిన త్రివిక్రమ్గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్. -
నాన్నతో సినిమా చేయడం హ్యాపీ
దర్శక–నిర్మాత నట్టి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్ని ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘నా దర్శకత్వంలో నా కూతురు కరుణ హీరోయిన్గా, నా కుమారుడు క్రాంతి నిర్మాతగా చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు నట్టి కుమార్. ‘‘నాన్న డైరెక్షన్లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నట్టి కరుణ. -
‘షకీలా’ సినిమా టీజర్ విడుదల
ముంబై: దక్షిణాది ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్నారు. సామీ మ్యాజిక్ ప్రొడక్షన్లో ఇంద్రజీత్ లంఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ గురువారం విడుదలైంది. తెర వెనుక షకీలా ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇక టీజర్ విషయానికొస్తే.. 1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరు షకీలా. సంక్షోభ సమయంలో 90ల్లో సినిమా హాళ్లను ఆర్థికంగా ఆదుకున్న ఆమె సినిమాలకు అప్పుట్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. అటువంటి నటి జీవితం ఆధారంగా సాగే ఈ సినిమా ఇప్పుడు 2020లో సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనుంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు థియేటర్లలో వినిపించనుంది అంటూ ఈ టీజర్ సాగుతోంది. (చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ) అయితే 1990లో దక్షిణాది సినీ పరిశ్రమలో శృంగార తారగా రాణించిన షకీలా సంప్రదాయ ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. 16 ఏళ్ల వయసులోనే పరిశ్రమకు వచ్చిన ఆమె అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఇక షకీలా టీజర్ విడుదలైన సందర్భంగా నటి రిచా చద్దా స్పందిస్తూ.. ‘చివరికి ఈ సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా వంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రజల జీవితాల్లో నవ్వును, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్న. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన సినిమా హాళ్లను ఈ ఏడాది షకీలా సినిమాతో సంతోషంగా ముగుస్తుందని ఆశిస్తున్న. దక్షిణాదిన ప్రసిద్ది చెందిన ఆమె కథను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలుసుకోవడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. 1990లో సంక్షోభ సమయల్లో సినిమా హాళ్లకు స్థిరమైన వ్యాపారాన్ని అందించిన ఆమె సినిమాలు.. ఇప్పుడు 2020లో థియేటర్లను కూడా ఆర్థికంగా ఆదరిస్తుందో లేదో చూడాలి కూడా’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. (చదవండి: తనిష్క్ యాడ్లో నా జీవితం కనిపిస్తోంది: నటి) -
అసైన్మెంట్ వాలి
లాక్డౌన్లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రం విజయంతో ఫుల్ స్పీడు మీదున్నారు సత్యదేవ్. వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ఈ చిత్రం ట్యాగ్లైన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. శనివారం ‘తిమ్మరుసు’ చిత్రం ఫస్ట్ లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 9న టీజర్ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. సత్యదేవ్ను ఈ సినిమాలో కొత్తగా ఆవిష్కరిం^è బోతున్నాం. చిత్రీకరణ పూర్తయింది, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్ను శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్గా ఉంది. టీజర్తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్కు ముందు ఈ సినిమా షూటింగ్ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీల ఇమేజ్ పెంచేలా...
రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘టెంప్ట్ రాజా’. దివ్యా రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో సే క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ– ‘‘ఫీమేల్ ఓరియంటెడ్గా రూపొందిన చిత్రమిది. మహిళల ఇమేజ్ని పెంచే ఓ మంచి సందేశాత్మక చిత్రం. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఏంటనేది చాలా సున్నితంగా చూపించాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. గతంలో మేం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్కి మంచి స్పందన రాగా, తాజాగా టీజర్కి కూడా ఇంకా మంచి స్పందన వస్తోంది. దివ్యా రావు, ఆస్మ చాలా బాగా నటించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిగారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి. గురువరవ్, కెమెరా: రాజు, సంగీతం: హరి గౌర. -
ఆర్ఆర్ఆర్: రికార్డు సృష్టిస్తోన్న టీజర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్లతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సంచలనమౌతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ స్టార్ హీరోలతో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను దర్శకుడు ఒక్కోక్కోటిగా విడుదల చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22న విడుదలైన కొమురం భీం టీజర్కు ఆన్లైన్లో విశేష స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళం, హింది, మళయాలం భాషల్లో ఒకేరోజు విడుదలైన ఈ టీజర్కు దాదాపు 1.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు టాలీవుడ్లో 2 లక్షలకు పైగా కామెంట్స్ను రాబట్టిన మొదటి టీజర్గా రికార్డు సృష్టించింది. యూట్యూబ్లో మాత్రం కొమరం భీం టీజర్కు 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. (చదవండి: ఆర్ఆర్ఆర్ నుంచి దీపావళి సర్ప్రైజ్) జూనీయర్ ఎన్టీఆర్ కొమురం భీంగా పరిచయం చేసిన ఈ టీజర్ చివరిలో ఎన్టీఆర్ ముస్లిం టోపి ధరించి కనిపిస్తాడు. దీంతో ఇది కాస్తా వివాదంలో చిక్కుకుంది. అప్పట్లో ఈ సన్నివేశాలు తొలగించాలని కొంత మంది డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ టీజర్ కంటే ముందు రామ్చరణ్ అల్లూరి సీతారామారాజు టీజర్ విడుదలైంది. దర్శకుడు రాజమౌళి రామ్చరణ్, ఎన్టీఆర్లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటైర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారవుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీన్ తొలగించాల్సిందే) -
నయన్కు ప్రియుడి స్పెషల్ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో నయన్ 37వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ, అభిమానులనుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేయసికి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నయన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హ్యపీ బర్త్డే బంగారం(తంగమై).. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో, నిజాయితీగా ఉండు. భగవంతుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో నిండిన మరో సంవత్సరాన్ని ఎంజాయ్ చేయ్’ అని పేర్కొన్నారు. ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అంధురాలిగా నయన్.. ట్రెండింగ్లో ఫస్ట్లుక్ కాగా నయన్ పుట్టిన రోజు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' (మూడో కన్ను సినిమాలోని టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్లో..అంధురాలిగా తనకు ఎదురుపడే సవాళ్లను ఛాలెంజ్గా ఎదుర్కొని ఎలా పరిష్కరిస్తుందనేది కనిపిస్తోంది. ఇందులో నయన్ అద్భుతంగా నటించడంతో.. టీజర్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలింద్రావ్ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్ శివన్ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకుడు. గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. చదవండి: బోర్ కొట్టినప్పుడే పెళ్లి: నయన్–విఘ్నేశ్ Big Day ✨💥 🎂 pic.twitter.com/qu6c4WQhLw — Nayanthara✨ (@NayantharaU) November 17, 2020 View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
విందా? విధ్వంసమా?
రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్హాసన్. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ను, టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టీజర్లో కమల్ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్ను వేసేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనబడుతోంది. -
పండగ నాడు వకీల్ సాబ్ టీజర్?!
పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం విడుదల గురించి పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. పండుగ నాడు వకీల్ సాబ్ టీజర్ను విడుదల చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే వకీల్ సాబ్ యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. పండుగ నాడు టీజర్ని రిలీజ్ చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటలకు వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (చదవండి: కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..!) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా వస్తుంది. ఈ మధ్యే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ మొదలైంది. హిందీలో సూపర్ హిట్ అయిన్ పింక్కు రిమేక్గా వస్తున్న వకీల్ సాబ్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిందని.. పవన్కు సంబంధిసంచి కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. నిజానికి ఈ సినిమాను మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. ఇక వకీల్ సాబ్ వచ్చే ఏడాది థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. -
వాడి పొగరు ఎగిరే జెండా
‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే రాజ్యాలు సాగిలబడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్ ...’’ అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీమ్ పాత్ర గురించి తన స్టైల్లో వాయిస్ ఓవర్ చెప్పారు అల్లూరి రామరాజు పాత్ర చేస్తున్న రామ్చరణ్. అక్టోబర్ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ టీజర్ను రామ్చరణ్ గురువారం విడుదల చేశారు. ఎన్టీఆర్, రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్చరణ్ పాత్ర నిప్పైతే, యన్టీఆర్ పాత్రను నీటిలా డిజైన్ చేశారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పునః ప్రారంభమైంది. ఇప్పటికే అగ్రభాగం సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నవంబర్లో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు. 450 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారవుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
పూరి అభిమాని
ఆనంద్ శ్రీకృష్ణ (నందు), రష్మీ గౌతమ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నందు ఫస్ట్ లుక్తో పాటు రష్మీ గౌతమ్ లుక్స్కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నటించాడు. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పాత్రకు సమానంగా రష్మీ పాత్ర కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
వారియర్ అయ్యారు సింగర్
కన్ను గీటి ఆన్లైన్లో బాగా పాపులర్ అయ్యారు మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను కొట్టే సన్నివేశం ప్రియా ప్రకాష్ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. తాజాగా ప్రియా వారియర్ సింగర్గా మారారు. ఓ హిందీ మ్యూజిక్ వీడియోలో నటించి, ఆ పాటను ఆలపించారామె. అశోకన్ పి. దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో త్వరలోనే విడుదల కానుంది. ఈ పాట టీజర్ను మంగళవారం విడుదల చేశారు. క్రిస్టస్ స్టీఫెన్ సంగీతం అందించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మ్యూజిక్ వీడియోను షూట్ చేశామని టీమ్ పేర్కొంది. -
ఇదే టీమ్తో మరో సినిమా ఉంటుంది
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించారు. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ కథానాయికలుగా నటించారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మించారు. విజయ్ రాజా పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా ఈ సినిమా టీజర్ను నటుడు సునీల్ విడుదల చేసి, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘వేయి శుభములు కలుగు నీకు’ టీమ్తోనే మరో సినిమా త్వరలోనే స్టార్ట్ చేస్తాం’’ అన్నారు విజయ్ రాజా. ‘‘మా సినిమాకి మంచి టైటిల్ దొరికింది. నాకు మంచి నిర్మాత కుదిరారు’’ అన్నారు రామ్స్ రాథోడ్. ‘‘మా సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు తూము నరసింహ పటేల్. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యాని సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వనున్న డార్లింగ్?
డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘రాధే శ్యామ్’ చిత్రం గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతోంది. పుట్టిన రోజు సందర్భంగా డార్లింగ్.. అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోన్నట్లు సమాచారం. ప్రభాస్ 41 వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘రాధే శ్యామ్’ టీజర్ను విడుదల చేయాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజున మూవీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయనున్నారట. డార్లింగ్ అభిమానులకు ఇంతకంటే కావల్సింది ఏం ఉంది. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. రాధ కృష్ణ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. (చదవండి: డబుల్ ట్రీట్) ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం. అక్టోబర్ మూడవ వారం నుంచి ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్లో పాల్గొంటారనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్ చేయడం ఇబ్బంది కనుక హైదరాబాద్లోనే వీలైనంత భాగాన్ని సెట్స్ వేసి చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
సారిక మిస్టరీ
సాయిబాబు హీరోగా, ఆశి రాయ్, సురయ పరివిన్ హీరోయిన్లుగా రామ్ పల్లె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టరీ ఆఫ్ సారిక’. బాలాజి సమర్పణలో అనీషా క్రియేషన్స్ బ్యానర్లో సుగుణ సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ తో కూడిన చిత్రమిది’’ అన్నారు రామ్ పల్లె. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. రామ్ పల్లెగారు మా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అని సుగుణ సుబ్రమణ్యం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మిత్ర, కెమెరా: సులమ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: నెహ్రు బాబు. -
లాక్డౌన్ నేపథ్యంలో..
కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్డౌన్ నేపథ్యంలో ‘లాక్డౌన్’ అనే చిత్రం రూపొందింది. ఉమాంతకల్ప, ఆశిరోయ్, హృతికా సింగ్, రాకింగ్ రాకేష్, అపూర్వ ముఖ్య పాత్రల్లో బాబా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షేర్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై మిన్నీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్ని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, అట్లూరి రామకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్’ సినిమాని అనుకున్న బడ్జెట్లో టైమ్కి పూర్తి చేయడం విశేషం. టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా సక్సెస్ అయ్యి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సమర్పకుడు షేర్ మాట్లాడుతూ–‘‘లాక్డౌన్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమాను తెరకెక్కించాం. అమ్మాయిలకు మా చిత్రం ఒక ధైర్యం ఇస్తుంది. ఒక మంచి సందేశంతో పాటు వినోదం ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కిషోర్, సంగీతం, స్టోరీ, స్క్రీన్ ప్లే: షేర్. -
భలే భజరంగీ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘భజరంగీ 2’. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావన కథానాయికగా నటించారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్పై జయన్న, భోగేంద్ర నిర్మించారు. శివరాజ్ కుమార్ పుట్టినరోజు (జూలై 12) సందర్భంగా ఆదివారం ‘భజరంగీ–2’ టీజర్ విడుదల చేశారు. 2013లో ఘనవిజయం సాధించిన ‘భజరంగీ’ చిత్రానికి సీక్వెల్గా ‘భజరంగీ–2’ తెరకెక్కింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ స్పందన చూసి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక–నిర్మాతలు. టీజర్కు వచ్చిన స్పందన గురుంచి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన స్పందనకి అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
వింతైన వాస్తవాలు
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని జంటగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘ఏ’ (ఏడీ ఇన్ఫినిటమ్). ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించారు. ఈ సినిమా టీజర్ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. ‘కొన్నిసార్లు కల్పితాల కన్నా వాస్తవాలే వింతగా ఉంటాయి’ అనే కోట్ టీజర్లో ఉంది. ‘‘తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న మూడు విభిన్నమైన పాత్రలను పోషించారు. ప్రముఖ ఫిలిం మేకర్ సింగీతం శ్రీనివాస్గారిని∙ప్రేరణగా తీసుకుని దర్శకుడు యుగంధర్ మంచి సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్ కె బంగారి, సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్. -
తాతకు బహుమతి
సూపర్స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు అశోక్. కృష్ణ బర్త్డే సందర్భంగా ఆయనకు ఓ బహుమతి అందించింది ఈ చిత్రబృందం. కృష్ణ సూపర్ హిట్ పాటల్లో ‘యమలీల’ సినిమాలోని ‘జుంబారే జుజుంబారే...’ పాట ఒకటి. ఇప్పుడు ఇదే పాటను రీమిక్స్ చేశారు ఆయన మనవడు గల్లా అశోక్. ఈ పాట టీజర్ను ఆదివారం విడుదల చేశారు. కృష్ణ స్టెప్స్ను అనుకరిస్తూ అశోక్ గల్లా ఈ రీమిక్స్కి స్టెప్స్ వేశారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. -
సీక్వెల్కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
తోట బావిలో...
యాంకర్ రవి, గౌతమి జంటగా నటిస్తున్న చిత్రం ‘తోట బావి’. గద్వాల్ కింగ్ సమర్పణలో ఆలూర్ ప్రకాశ్గౌడ్ నిర్మించారు. అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘రవిని చాలాకాలంగా టీవీలో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు’’ అన్నారు. ‘‘రవి ఇచ్చిన సపోర్ట్తో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు అంజి దేవండ్ల. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మా దర్శకుడు సినిమాను ఇంట్రస్టింగ్గా తీశారు. మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు’’ అన్నారు ప్రకాష్ గౌడ్. ఈ చిత్రానికి దౌలు, చిన్నస్వామి, అభిషేక్ .బి సహనిర్మాతలు.