Travis Head
-
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్లు ఇవే..! -
శ్రీలంకతో రెండో టెస్ట్.. ఆసీస్ బౌలర్ల విజృంభణ.. హెడ్ వెరైటీ సెలబ్రేషన్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్కు జతగా లహీరు కుమార (0) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్ అయ్యారు.pic.twitter.com/IRsGEkTBll— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025హెడ్ వినూత్న సంబురాలుఈ మ్యాచ్లో కమిందు మెండిస్ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.కాగా, రెండు టెస్ట్లు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ చేపట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.అయితే, ఈ మెగా ఈవెంట్కు ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో పాటు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఐసీసీ టోర్నీకి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్వయంగా ధ్రువీకరించాడు.చారిత్రాత్మక విజయంకాగా టీమిండియాతో స్వదేశంలో ప్రతిష్టాత్మ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు ప్యాట్ కమిన్స్. పదేళ్ల తర్వాత ఈ సిరీస్ గెలిచి తన కెప్టెన్సీ రికార్డులలో ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కమిన్స్... చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అదే విధంగా తన భార్య తమ రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో మాజీ సారథి స్మిత్ లంక టూర్లో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇంకా కోలుకోలేదని హెడ్కోచ్ మెక్డొనాల్డ్ బుధవారం వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం‘కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటి వరకు ఇంకా శిక్షణ కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటి స్థితిలో అతడు నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం. మరోవైపు.. పేసర్ హాజల్వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ లేదంటే ట్రవిస్ హెడ్ ఆస్ట్రేలియా సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన స్మిత్ మెగా టోర్నీలో నాయకుడిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ‘‘ఈ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాఅయితే, జట్టు గురించి పూర్తి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నేను టెస్టు సిరీస్ మీద దృష్టి సారించాను. ఈ సిరీస్ గెలిచిన తర్వాత వన్డేలపైకి దృష్టి మళ్లిస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేయడం నాకు మరింత ఇష్టం.ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న విషయంపై స్పష్టత ఉంది. పరిస్థితులకు తగ్గట్లుగా పావులు కదపడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతా. సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా’’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగుతోంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య లంక జట్టును ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో స్మిత్ అద్భుత శతకం(141)తో మెరిశాడు.ఇక ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. అనంతరం లంక- ఆసీస్ మధ్య రెండు వన్డేలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్(ప్రాథమిక) జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.చదవండి: Rohit Sharma: బుమ్రా గాయంపై అప్డేట్.. వరుణ్ చక్రవర్తి పోటీలో ఉంటాడు! -
హెడ్కు ‘బోర్డర్ మెడల్’
మెల్బోర్న్: ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా ట్రవిస్ హెడ్ ఎంపికయ్యాడు. గత ఏడాది కాలంలో ఆసీస్కు కీలక విజయాలు అందించిన హెడ్ ‘అలెన్ బోర్డర్ మెడల్’ను గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1427 పరుగులు సాధించిన హెడ్... అవార్డు కోసం జరిగిన ఓటింగ్లో 208 ఓట్లతో అగ్ర స్థానంలో నిలవగా, హాజల్వుడ్కు రెండో స్థానం (158) దక్కింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్లో భారత్తో జరిగిన రెండో టెస్టులో 141 బంతుల్లో 140 పరుగులు చేసిన హెడ్ ప్రదర్శన హైలైట్గా నిలిచింది. వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడి అవార్డు కూడా హెడ్కే దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్గా హాజల్వుడ్, ఉత్తమ టి20 క్రికెటర్గా ఆడమ్ జంపా నిలిచారు. ‘బ్రాడ్మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా స్యామ్ కొన్స్టాస్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా జట్టు పురుషుల క్రికెటర్లు ఎవరూ ఈ అవార్డులను అందుకోలేకపోయారు. మహిళల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్గా అనాబెల్ సదర్లాండ్ నిలిచింది. ఓటింగ్లో యాష్లీ గార్డ్నర్ (143 పాయింట్లు)ను వెనక్కి నెట్టిన సదర్లాండ్ (168) ప్రతిష్టాత్మక ‘బెలిండా క్లార్క్ అవార్డు’కు ఎంపికైంది. గత ఏడాదిలో దక్షిణాఫ్రికాతో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన అనాబెల్... ఎంసీజీలో టెస్టు సెంచరీ బాదిన (ఇంగ్లండ్పై) తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. మహిళల వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ అవార్డు యాష్లీ గార్డ్నర్ గెలుచుకోగా, ఉత్తమ టి20 ప్లేయర్ పురస్కారం బెత్ మూనీకి దక్కింది. ఆ్రస్టేలియా క్రికెట్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మైకేల్ క్లార్క్, మైకేల్ బెవాన్, క్రిస్టీనా మాథ్యూస్ చోటు దక్కించుకున్నారు. -
వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న ట్రవిస్ హెడ్
2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ విజేతల వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించింది. ట్రవిస్ హెడ్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా, అన్నాబెల్ సదర్ల్యాండ్, ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ వివిధ ఫార్మాట్లకు సంబంధించిన అవార్డులు గెలుచుకున్నారు. విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలిసారి అలెన్ బోర్డర్ మెడల్ను గెలుచుకున్నాడు. ఈ మెడల్ కోసం జోష్ హాజిల్వుడ్, పాట్ కమిన్స్ హెడ్తో పోటీపడ్డారు. ఔహెడ్కు మొత్తం 208 ఓట్లు వచ్చాయి. హాజిల్వుడ్ కంటే 50 ఓట్లు, కమిన్స్ కంటే 61 ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు హెడ్కు అలెన్ బోర్డర్ మెడల్ దక్కింది. హెడ్ 2024లో మూడు ఫార్మాట్లలో 1427 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. హెడ్.. అలెన్ బోర్డర్ మెడల్తో పాటు మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం అలెక్స్ క్యారీ హెడ్తో పోటీపడ్డాడు.హాజిల్వుడ్కు టెస్ట్ ప్లేయర్, జంపాకు టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులుగతేడాది టెస్ట్ల్లో ఇరగదీసిన జోష్ హాజిల్వుడ్కు షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. హాజిల్వుడ్ 2024లో 13.17 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా హాజిల్వుడ్కు టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో విశేషంగా రాణించిన ఆడమ్ జంపాకు మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.మహిళల విభాగానికి వస్తే.. అన్నాబెల్ సదర్ల్యాండ్ తొలిసారి బెలిండా క్లార్క్ అవార్డు గెలుచుకుంది. సదర్ల్యాండ్ గతవారం యాషెస్ సిరీస్ ఏకైక టెస్ట్లో ఇంగ్లండ్పై సెంచరీ సాధించింది. గత సీజన్ చివర్లో సదర్ల్యాండ్ సౌతాఫ్రికాపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ (210) చేసింది. సదర్ల్యాండ్ గతేడాది మూడు ఫార్మాట్లలో 46.94 సగటున 798 పరుగులు చేసి 34 వికెట్లు పడగొట్టింది.గార్డ్నర్కు వన్డే, మూనీకి టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులుఆష్లే గార్డ్నర్ 2024 ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. గార్డ్నర్ గతేడాది వన్డేల్లో 385 పరుగులు చేసి 23 వికెట్లు పడగొట్టింది. బెత్ మూనీ ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. మూనీ గతేడాది టీ20ల్లో 47.53 సగటున, 129.83 స్ట్రయిక్రేట్తో 618 పరుగులు చేసింది.మ్యాక్స్వెల్, పెర్రీలకు బిగ్బాష్ లీగ్ అవార్డులుఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, కూపర్ కన్నోలీ జాయింట్గా మెన్స్ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. ఎల్లిస్ పెర్రీ, జెస్ జొన్నాసెన్ జాయింట్గా మహిళల బిగ్బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. -
వావ్ వాట్ ఏ క్యాచ్.. సింగల్ హ్యాండ్తో అద్బుతం! వీడియో వైరల్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో (7), దిముత్ కరుణరత్నె (7), ఏంజెలో మాథ్యూస్ (7) అవుట్ కాగా... దినేశ్ చండీమల్ (9 బ్యాటింగ్), కమిందు మెండిస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 610 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఆ్రస్టేలియా 154 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (352 బంతుల్లో 232; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా... అరంగ్రేట ఆటగాడు జోస్ ఇంగ్లిస్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (251 బంతుల్లో 141; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో మెరిశారు.హెడ్ సూపర్ క్యాచ్..కాగా రెండో రోజు ఆటలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్తో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్ను హెడ్ పెవిలియన్కు పంపాడు. లంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. మూడో బంతిని మాథ్యూస్కు ఆఫ్బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ లూపీ డెలివరీని మాథ్యూస్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు.కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్-లెగ్ ఫీల్డర్ కుడివైపునకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హెడ్ తన కుడివైపునకు లాంగ్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాథ్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేదేమి లేక మాథ్యూస్(7) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్లో హెడ్ బ్యాట్తో కూడా సత్తాచాటాడు. ఓపెనర్గా వచ్చిన హెడ్ 40 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్లతో హాఫ్ సెంచరీ! వీడియో Travis Head flies at bat pad! ✈️Nathan Lyon gets Australia's THIRD #SLvAUS pic.twitter.com/Nx4KxB0bwy— 7Cricket (@7Cricket) January 30, 2025 -
శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్ హెడ్ బాదుడు
శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్(Travis Head) ధనాధన్ దంచికొట్టాడు. తనను ఓపెనర్గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో జూన్లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్ జోడీగా ప్రమోట్ అయిన టీ20 వీరుడు ట్రవిస్ హెడ్ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్ చేశాడు.తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీఇన్నింగ్స్ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్.. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్ హెడ్.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్లో చండీమాల్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ ఇన్నింగ్స్లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్ కూడా ఉంది.టీ20 తరహా వీరబాదుడుఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ చేసినందుకు హెడ్.. మేనేజ్మెంట్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే.. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.స్టీవ్ స్మిత్ సారథ్యంలోకాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్ లంక టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్తో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుతుదిజట్లుశ్రీలంకదిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదేA Travis Head half century inside the first hour of Day 1 👀#SLvAUS pic.twitter.com/e5QNF4FaK3— 7Cricket (@7Cricket) January 29, 2025 -
ట్రావిస్ హెడ్కు ప్రమోషన్..
గాలే వేదికగా శ్రీలంకతో బుధవారం(జనవరి29) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అన్ని విధాల సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ కోసం దుబాయ్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో కంగారులు తీవ్రంగా శ్రమించారు.లంక స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా స్పిన్ ట్రాక్లను ఏర్పా టు చేసుకుని మరి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఈ టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టు కెప్టెన్గా వ్యహరించనున్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023-25లో ఆసీస్కు ఇదే ఆఖరి సిరీస్. కాగా ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్ సేన అడుగుపెట్టింది.ఆసీస్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్..ఇక శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్గా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నాడు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను హెడ్ ప్రారంభించనున్నాడు. జట్టులో సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ ఉన్నప్పటికి ఆసీస్ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం హెడ్కే ప్రాధాన్యత ఇచ్చింది.హెడ్ సాధరణంగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తుంటాడు. టెస్టుల్లో మాత్రం ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తుంటాడు. అయితే రెడ్బాల్ క్రికెట్లో కూడా అతడు ఓపెనింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మరోసారి అతడిని ఓపెనర్గా పంపి పరీక్షించాలని ఆస్ట్రేలియా టీమ్ మెనెజ్మెంట్ మాత్రం భావిస్తుంది.ఈ విషయాన్ని ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధ్రువీకరించాడు. కాగా వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్లగా నాథన్ మెక్స్వీనీ, సామ్ కాన్స్టాస్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. నాథన్ మెక్స్వీనీ విఫలమైనప్పటికి కాన్స్టాస్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయినప్పటకి లంకతో సిరీస్కు అతడికి ఓపెనర్గా చోటు దక్కలేదు.ట్రావిస్ హెడ్ మా ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. టాపార్డర్డ్లో కూడా అతడు తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తాడని భావిసతున్నాను. అతడు ఏ పొజిషేన్లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. గతంలో భారత్లో అతడు ఓపెనర్గా వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో సెలక్టర్లు మరోసారి ఛాన్స్ ఇచ్చారు అని ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో స్మిత్ పేర్కొన్నాడు. ఓపెనర్గా మూడు టెస్టులు ఆడిన ట్రావిస్.. 223 పరుగులు చేశాడు.కాగా హెడ్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో 448 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.శ్రీలంకతో టెస్టులకు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టోడ్ మర్ఫీ చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్తో పాటు ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్కప్ ఈవెంట్లో రన్నరప్గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్లు ఎక్కడంటే? -
టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్దీప్ సింగ్తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆల్రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్లో 539 పరుగులు చేశాడు.బుమ్రాకు నో ఛాన్స్.. కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్కప్లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియో
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ టెస్టులో టీమిండియాకు ట్రావిస్ హెడ్ 'హెడేక్' తప్పింది. ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో హెడ్ డకౌటయ్యాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.దీంతో అతడు ఏడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67వ ఓవర్ వేసిన బుమ్రా మూడో బంతిని హెడ్కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన హెడ్ వెనక్కి విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.కానీ వైడ్ ఆఫ్ స్టంప్ వెలుపుల పడ్డ బంతి అద్బుతంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. బుమ్రా దెబ్బకు హైడ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై ట్రావిస్ హెడ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్లో ఇప్పటికే హెడ్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలను నమోదు చేసి భారత్కు తల నొప్పిగా మారాడు.ఈ క్రమంలో నాలుగో టెస్టులో హెడ్ డకౌట్ కావడం భారత్ కలిసొచ్చే ఆంశంగా చెప్పాలి. ఇక 83 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. What a sight for an Indian fan!!! Watch on loop! #Jaspritbumrah𓃵#INDvsAUS#BGT2024pic.twitter.com/DMLC4eCyox— Cricketwood (@thecricketwood) December 26, 2024చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్ -
హెడ్కు ఫిట్నెస్ పరీక్ష!
మెల్బోర్న్: భారత్తో నాలుగో టెస్టుకు ముందుఆ్రస్టేలియాకు ఆందోళన పెంచే విషయమిది! సిరీస్లో చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆడటంపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్కు ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్కు ముందు రోజు హెడ్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే టీమ్ను ప్రకటిస్తారు. ఈ సిరీస్లో హెడ్ వరుసగా 11, 89, 140, 152, 17 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ సమయంలోనే హెడ్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్కు కూడా దిగలేదు. సోమవారం ప్రాక్టీస్కు పూర్తిగా దూరంగా ఉన్న అతను...మంగళవారం మాత్రం కాసేపే సాధన చేశాడు. హెడ్ స్థానం ఇంకా ఖాయం లేదని అంగీకరించిన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్... బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది లేకపోతే కచ్చితంగా బరిలోకి దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆసీస్ తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. మెక్స్వీనీ స్థానంలో స్యామ్ కొంటాస్ అరంగేట్రం చేయనుండగా... హాజల్వుడ్కు బదులుగా బోలండ్ జట్టులోకి వస్తాడు. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్కు కూడా రాలేదు.అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో కూడా కన్పించలేదంట.అతడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం ఫిట్నెస్ టెస్ట్లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.ఒకవేళ బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
ట్రావిస్ హెడ్కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్గా!?
భారత్తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్కు కెప్టెన్గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
భారత్తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్.. వరల్డ్ రికార్డు
భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది.తొలిరోజు వర్షం వల్ల అంతరాయంపెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్బాల్ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరంభంలో భారత పేసర్ల జోరుఅయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్ మెక్స్వీనీ(9) అవుట్ చేసిన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఉస్మాన్ ఖవాజా(21) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా బౌలర్లకు తలనొప్పిఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్ రెడ్డి మార్నస్ లబుషేన్(12)ను పెవిలియన్కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ట్రవిస్ హెడ్ రాకతో సీన్ రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రక్రీజులో పాతుకుపోయిన హెడ్.. ధనాధన్ బ్యాటింగ్తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్లోనూ గోల్డెన్ డకౌట్(కింగ్ పెయిర్) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు.గత ఏడు ఇన్నింగ్స్లో ఇలాగబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్లోనూ ట్రవిస్ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్లో హెడ్ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్లో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్ హెడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ఉన్నది వీరే..1. వాజిర్ మహ్మద్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19582. అల్విన్ కాళిచరణ్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19743. మార్వన్ ఆటపట్టు- కొలంబో ఎస్ఎస్సీ- 20014. రామ్నరేశ్ శర్వాణ్- కింగ్స్టన్- 20045. మహ్మద్ ఆఫ్రాఫుల్- చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్- 20046. ట్రవిస్ హెడ్- బ్రిస్బేన్ గబ్బా- 2024.బుమ్రా బౌలింగ్లోఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్, గబ్బా) వరుసగా బాదడం విశేషం.బ్రేక్ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్, 152 పరుగులు సాధించిన హెడ్ను బుమ్రా అవుట్ చేశాడు. ఈ స్పీడ్స్టర్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్, పంత్కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు.చదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్HE'S DONE IT AGAIN!Travis Head brings up another hundred ⭐️#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/10yBuL883X— cricket.com.au (@cricketcomau) December 15, 2024 -
IND VS AUS: హెడ్కు అచ్చిరాని గబ్బా.. హ్యాట్రిక్ డకౌట్లు
ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్కు బ్రిస్బేన్లోని గబ్బా పిచ్ అస్సలు అచ్చిరాదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వేదికపై హెడ్ ఆడిన గత మూడు టెస్ట్ ఇన్నింగ్స్ల్లో గోల్డెన్ డకౌట్లయ్యాడు. గబ్బాలో హెడ్ వైఫల్యాల పరంపర 2022లో మొదలైంది. ఆ ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హెడ్ కగిసో రబాడ బౌలింగ్లో వికెట్కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో హెడ్ కీమర్ రోచ్ బౌలింగ్లో వికెట్కీపర్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గబ్బాలో హెడ్ మూడో గోల్డెన్ డకౌట్ కాస్త వైవిధ్యంగా జరిగింది. విండీస్ యువ పేసర్ షమార్ జోసఫ్ వేసిన అద్భుతమైన యార్కర్కు హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.భారత్పై ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోయే హెడ్, గబ్బా పిచ్పై మరోసారి డకౌటవుతాడా లేక యధావిధిగా తన ఫామ్ను కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాల్సి ఉంది. హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో ఇటీవల ముగిసిన అడిలైడ్ టెస్ట్లో మెరుపు వేగంతో 141 పరుగులు చేశాడు. మరోవైపు గబ్బాలో భారత్ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ట్రాక్పై టీమిండియా గత పర్యటనలో ఆసీస్పై సంచలన విజయం సాధించింది. నాటి మ్యాచ్లో రిషబ్ పంత్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (89 నాటౌట్) ఆడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య గాబ్బా వేదికగా జరుగబోయే మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
'గిల్క్రిస్ట్లా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడే వద్దు'
టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో హెడ్ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు."ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్క్రిస్ట్ అప్రోచ్కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు -
సిరాజ్.. నీకు అసలు బుద్ది ఉందా..?
అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్కు డీ మెరిట్ పాయింట్తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.సిరాజ్-హెడ్ గొడవపై సోషల్మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.హెడ్ పట్ల సిరాజ్ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.హెడ్ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం. నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు" -
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్ను విధించింది. సిరాజ్కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
సిరాజ్, హెడ్లకు షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్లకు ఐసీసీ షాకిచ్చింది. భారత్-ఆసీస్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్లో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఐసీసీ వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. గత 24 నెలల్లో చేసిన మొదటి తప్పిదం కావడంతో సిరాజ్, హెడ్ నిషేధం బారి నుంచి తప్పించుకున్నారు. వీరిద్దరు తాము చేసిన తప్పిదాలను ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ విధించిన పెనాల్టీని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.కాగా, అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్న హెడ్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హెడ్.. సిరాజ్ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు ప్రతిగా సిరాజ్ కూడా నోటికి పని చెప్పాడు. సిరాజ్ ఒక అడుగు ముందుకేసి హెడ్ను పెవిలియన్కు వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఈ ఉదంతాన్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ.. సిరాజ్, హెడ్ మ్యాచ్ ఫీజ్ల్లో 20 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ సాంక్షన్ చేసింది.ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్ట్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్లో సిరాజ్, బుమ్రా పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా రెండు ఇన్నింగ్స్ల్లో పేక మేడలా కూలింది. నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు మినహా బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. అంతకుముందు తొలి టెస్ట్లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
అడిలైడ్ వేదికగా భారత్తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ది కీలక పాత్ర. మరోసారి భారత్పై హెడ్ సత్తాచాటాడు. ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. తన మెరుపు శతకంతో మ్యాచ్ను కంగారూల వైపు తిప్పాడు. భారత బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 111 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్.. 4 సిక్స్లు, 17 బౌండరీలతో 140 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను హెడ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. 👉టీమిండియాపై పింక్, రెడ్, వైట్ బంతులతో జరిగిన మ్యాచ్ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరికి సాధ్యం కాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్-2023లో భారత్పై తొలి రెడ్ బాల్ సెంచరీని హెడ్ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో హెడ్ 163 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో(వైట్బాల్) భారత్పై హెడ్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగులు చేసి తమ జట్టును ఆరోసారి వన్డే వరల్డ్కప్ను అందించాడు. ఇప్పుడు పింక్బాల్తో జరిగిన టెస్టులో కూడా తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం భారత్పై హెడ్ సెంచరీ చేయలేదు.👉అదే విధంగా డే అండ్ నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హెడ్.. తన రికార్డును తనే బద్దులు కొట్టాడు. 2022లో ఇంగ్లండ్తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్లో 112 బంతుల్లో శతకం సాధించాడు. -
ట్రావిస్ హెడ్, సిరాజ్లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్ను పెవీలియన్కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హెడ్ను అద్బుతమైన యార్కర్తో ఔట్ చేసిన అనంతరం సిరాజ్.. కాస్త దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.అందుకు హెడ్ సైతం ఏదో అంటూ కౌంటరిచ్చాడు. దీంతో సిరాజ్ మరింత సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తీరును చాలా మంది తప్పుబట్టారు. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ స్పందించాడు.హెడ్ మాట్లాడుతూ.. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ను మెచ్చుకున్నానని, అంతకుమించి ఏమి అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ సిరాజ్ మాత్రం తన మాటలను తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని, అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. అయితే తాజాగా హెడ్ వ్యాఖ్యలకు సిరాజ్ కౌంటరిచ్చాడు. హెడ్ అబద్దం చెబుతున్నాడని, నిజంగానే హెడ్ దుర్భాషలాడాడని సిరాజ్"ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత నేను నా స్టైల్లో సంబరాలు చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను అతడు దుర్భాషలాడాడు. ఇది లైవ్లో కూడా కన్పించింది. కావాలంటే ఇప్పుడు టీవీ రిప్లేలో కూడా చూడవచ్చు.నా సెలబ్రేషన్స్ను నేను చేసుకున్నా అంతే. అతడిని నేను ఏమి అనలేదు. విలేకరుల సమావేశంలో అతడు అబద్దం చెప్పాడు. అతడు నన్ను బాగా బౌలింగ్ చేశావని అనలేదు. మేము ప్రతీ ఒక్క ప్లేయర్ను గౌరవిస్తాము.ఎందుకంటే క్రికెట్ను జెంటిల్మన్ గేమ్గా భావిస్తాము కాబట్టి. ట్రావిస్ హెడ్ తీరు నాకు నచ్చలేదు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. -
సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.అద్భుతమైన యార్కర్తో హెడ్ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ను చేస్తున్న సిరాజ్ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్ను మార్చేశాడు.ఈ నేపథ్యంలో సిరాజ్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు."సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్ -
భారత్కు ‘హెడ్’పోటు...
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్...వన్డే వరల్డ్ కప్ ఫైనల్...గతంలో రెండు కీలక సందర్భాల్లో భారత్ ఓటమిని శాసించిన ట్రవిస్ హెడ్ మరోసారి మనపై చెలరేగిపోయాడు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన అతను మెరుపు సెంచరీతో రెండో టెస్టులో ఆ్రస్టేలియాకు విజయావకాశం కల్పించాడు. 157 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన రోహిత్ సేన ఇంకా ఆ లోటును పూడ్చుకోకుండానే సగం వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి ఆసీస్దే పూర్తి ఆధిపత్యం కాగా... పంత్, నితీశ్ పోరాటంపైనే ఆదివారం భారత్ ఆశలు మిగిలి ఉన్నాయి. అడిలైడ్: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులో భారత్ వైఫల్యం రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగింది. ముందుగా తొలి ఇన్నింగ్స్లో ఆ్రస్టేలియా భారీ ఆధిక్యంతో అదరగొట్టగా... టీమిండియా ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (141 బంతుల్లో 140; 17 ఫోర్లు, 4 సిక్స్లు) భారీ సెంచరీతో విజృంభించగా... మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం శనివారం ఆట ముగిసే సమయానికి రోహిత్సేన రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (24; 4 ఫోర్లు), శుబ్మన్ గిల్ (28; 3 ఫోర్లు) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. రిషబ్ పంత్ (25 బంతుల్లో 28 బ్యాటింగ్; 5 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్... కంగారూల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. లబుషేన్ అర్ధ సెంచరీ... ఓవర్నైట్ స్కోరు 86/1తో ఆసీస్ రెండో రోజు ఆటను కొనసాగించింది. మరోసారి బుమ్రా చెలరేగిపోతూ 13 బంతుల వ్యవధిలో మెక్స్వీనీ (109 బంతుల్లో 39; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (2)లను పెవిలియన్ పంపించాడు. అయితే లబుషేన్, హెడ్ భాగస్వామ్యంలో ఆసీస్ కోలుకుంది. భారత బౌలర్లను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా భారీగా పరుగులిచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఫామ్లేమితో సతమతమవుతున్న మార్నస్ లబుషేన్ ఎట్టకేలకు 114 బంతుల్లో అర్ధ శతకంతో టచ్లోకి వచ్చాడు. రాణా ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు లబుషేన్ను అవుట్ చేసి నితీశ్ ఈ జోడీని విడదీయగా... మరో ఎండ్లో హెడ్ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు కొట్టిన అతను 63 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మిచెల్ మార్‡్ష (9), క్యారీ (15) కొద్ది సేపు హెడ్కు అండగా నిలిచారు. అశ్విన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచి్చన మార్‡్ష అంపైర్ నిర్ణయం కోసం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. రీప్లేలో బంతి బ్యాట్కు తాకలేదని తేలింది! వికెట్లు పడినా మరో వైపు జోరు తగ్గించని హెడ్కు హాఫ్ సెంచరీ నుంచి శతకం అందుకునేందుకు 48 బంతులు సరిపోయాయి. రాణా వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను 111 బంతుల్లో కెరీర్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రాణా మరో ఓవర్లో అతను మళ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత హెడ్ సహా 27 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు 54.3 ఓవర్లు ఆడిన ఆ జట్టు 251 పరుగులు జోడించింది. కోహ్లి, రోహిత్ విఫలం... ఫ్లడ్లైట్ల వెలుతురులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అప్పటికే ప్రత్యరి్థకి భారీ ఆధిక్యం సమర్పించుకున్న భారత్... నాలుగో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (7) వికెట్ కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, గిల్ నిలకడగా ఆడటంతో మళ్లీ ఆశలు చిగురించగా... బోలండ్ టీమిండియాను దెబ్బకొట్టాడు. మొదట జైస్వాల్ను అవుట్ చేసిన అతడు... కాసేపటికి విరాట్ కోహ్లి (11)ని కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత గిల్ను అద్భుత బంతితో స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయగా...కమిన్స్ వేసిన పదునైన ఇన్స్వింగర్ కెపె్టన్ రోహిత్ శర్మ (6) స్టంప్స్ను ఎగరగొట్టింది. క్రీజ్లో ఉన్నంత సేపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన పంత్, నితీశ్ మరో 19 బంతుల పాటు వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్స్వీనీ (సి) పంత్ (బి) బుమ్రా 39; లబుõÙన్ (సి) జైస్వాల్ (బి) నితీశ్ రెడ్డి 64; స్మిత్ (సి) పంత్ (బి) బుమ్రా 2; హెడ్ (బి) సిరాజ్ 140; మార్‡్ష (సి) పంత్ (బి) అశ్విన్ 9; క్యారీ (సి) పంత్ (బి) సిరాజ్ 15; కమిన్స్ (బి) బుమ్రా 12; స్టార్క్ (సి) హర్షిత్ (బి) సిరాజ్ 18; లయన్ (నాటౌట్) 4; బోలండ్ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 21; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–24, 2–91, 3–103, 4–168, 5–208, 6–282, 7–310, 8–332, 9–332, 10–337, బౌలింగ్: బుమ్రా 23–5–61–4; సిరాజ్ 24.3–5–98–4; హర్షిత్ 16–2–86–0; నితీశ్ రెడ్డి 6–2–25–1; అశ్విన్ 18–4–53–1. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) క్యారీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) క్యారీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 11; పంత్ (బ్యాటింగ్) 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 15; ఎక్స్ట్రాలు 9; మొత్తం (24 ఓవర్లలో 5 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, బౌలింగ్: స్టార్క్ 9–0–49–1; కమిన్స్ 8–0–33–2; బోలండ్ 7–0–39–2. హెడ్ X సిరాజ్ అడిలైడ్ ట్రవిస్ హెడ్ సొంత మైదానం. చుట్టూ 51,642 మంది ప్రేక్షకులు...99.29 స్ట్రైక్రేట్తో చేసిన మెరుపు సెంచరీతో స్టేడియం ఊగిపోతోంది...ఎట్టకేలకు ఆసీస్ ఆధిక్యం 130 పరుగులకు చేరాక ఒక ఫుల్టాస్ యార్కర్తో హెడ్ను సిరాజ్ బౌల్డ్ చేసి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. అంతటితో ఆగిపోకుండా పెవిలియన్ వైపు వెళ్లమంటూ రెండు సార్లు సైగ కూడా చేశాడు. హెడ్ కూడా ఏదో చెబుతూ నిష్క్రమించాడు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. తమ బ్యాటర్తో తలపడిన సిరాజ్ను ఒక్కసారిగా అంత భారీ సమూహం గేలి చేసింది. తర్వాతి బంతికి స్టార్క్ ఫోర్ కొట్టడంతో ఇది మరింత పెరిగింది. ఆ ఓవర్ మాత్రమే కాదు...ఆ తర్వాత అతను వేసిన ప్రతీ అడుగుకు ఇలాగే స్పందించారు. సిరాజ్ డీప్ థర్డ్మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకుల హేళన ఇంకా పెరిగిపోవడంతో రోహిత్ అతడిని లోపలి వైపు పాయింట్ వద్దకు మార్చాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్లో హెడ్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ తర్వాతి బంతికే వికెట్ దక్కింది. హెడ్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ క్యాచ్ వదిలేశాడు కూడా. దాంతో సహజంగానే హైదరాబాదీ తన భావోద్వేగాన్ని చూపించాడు. అయితే ఏకంగా 140 పరుగులు చేసిన తర్వాత ఇలాంటి సైగలు చేయడాన్ని మాజీ క్రికెటర్ గావస్కర్ కూడా తప్పుపట్టాడు.2023 నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి ట్రవిస్ హెడ్ భారత్పై 19 ఇన్నింగ్స్లలో 61.9 సగటుతో 1052 పరుగులు చేయడం విశేషం. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇతర జట్లపై మాత్రం 54ఇన్నింగ్స్లలో కేవలం 36.8 సగటుతో 1875 పరుగులు మాత్రమే చేయగలిగిన అతను 3 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు సాధించాడు. -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్తో హెడ్కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్ను పెవిలియన్కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్తో హెడ్ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
ఆసీస్ జట్టులో విభేదాలు?.. పింక్ బాల్ టెస్టు మాకూ సవాలేనన్న బ్యాటర్!
టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.పెర్త్లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు. విభేదాలనే మాటకు తావు లేదు‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. బుమ్రా సూపర్.. ‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్కు తనదైన శైలి ఉంటుంది. వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందినాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు. తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: ‘గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’ -
ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: ఆసీస్ స్టార్ బ్యాటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకడని కొనియాడాడు. అతడి బౌలింగ్లో ఆడటం తనకు దక్కిన గౌరవమని.. తన మనవళ్లకు కూడా ఈ విషయం గురించి గర్వంగా చెప్పగలనంటూ బుమ్రాను ఆకాశానికెత్తాడు.భారత జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించింది. బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ను ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించి.. కంగారూ గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.ఇటు కెప్టెన్గా.. అటు బౌలర్గానూఫలితంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇటు కెప్టెన్గా.. అటు బౌలర్గానూ బుమ్రాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మ్యాచ్లో రైటార్మ్ పేసర్ బుమ్రా మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలుచేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బుమ్రా వంటి గొప్ప బౌలర్ను ఎదుర్కొన్నాననిఈ నేపథ్యంలో బుమ్రా నైపుణ్యాలను కొనియాడిన ఆసీస్ టెస్టు మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్పనైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా ఎదుగుతాడు. మన కెరీర్ ముగిసిన తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. బుమ్రా వంటి గొప్ప బౌలర్ను ఎదుర్కొన్నానని మనవలు, మనవరాళ్లకు చెప్పడం ఎంతో బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు.89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్గాకాగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 11 పరుగులు చేసి.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్లో హెడ్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్గా నిలిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్గా హెడ్ ఆరెంజ్ ఆర్మీకి ఫేవరెట్ ప్లేయర్గా మారిపోయిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. భారత్- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. డిసెంబరు 6- 10 వరకు పింక్ బాల్తో ఈ మ్యాచ్ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. రెండో టెస్టు ఎన్నిరోజుల పాటు సాగనుందనే అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.గిల్ అర్ధ శతకంకాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్ సారథ్యంలో వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. గాయం నుంచి కోలుకున్న భారత యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కూడా తిరిగి జట్టుతో చేరాడు. గులాబీ బంతితో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో గిల్ అర్ధ శతకం(50- రిటైర్డ్ హర్ట్)తో చెలరేగాడు. రోహిత్ మాత్రం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: SMAT 2024 PUN Vs HYD: తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం -
రోహిత్ నిర్ణయం సరైనదే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భారత్లోనే ఉండిపోయాడు. అయితే మరి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాలని హిట్మ్యాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.అయితే రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా తప్పుబట్టారు. ముందుగానే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్కు సపోర్ట్గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెడ్ తెలిపాడు."రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదే. అతడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్పై నిషేధం.. -
తండ్రైన సన్రైజర్స్ విధ్వంసకర వీరుడు..
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా సోమవారం పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ శుభవార్తను జెస్సికా తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. "వెల్కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్" అంటూ ఆమె క్యాప్షన్గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.బీజీటీతో రీఎంట్రీ?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గడిపేందుకు పాకిస్తాన్తో వైట్బాల్ సిరీస్లకు హెడ్ దూరమయ్యాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 22న పెర్త్లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఎస్ఆర్హెచ్ రిటైన్..ఇక ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన హెడ్.. 191.55 స్ట్రైక్ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్ను ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. View this post on Instagram A post shared by JESSICA DAVIES (@jess_head) -
ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆస్ట్రేలియా స్కోర్ 165/2 (20.4 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ ఇంగ్లండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉంది.డకెట్ సెంచరీఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో అలరించారు. విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు.రాణించిన షార్ట్ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచి వేగంగా ఆడింది. తొలి 10 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటింది. మాథ్యూ షార్ట్ మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 58; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా.. బంతితో మ్యాజిక్ చేసిన ట్రవిస్ హెడ్ ఓ మోస్తరు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 36), జోష్ ఇంగ్లిస్ (20 బంతుల్లో 28) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో బంతితో రాణించి, సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో అలరించిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈ సిరీస్లోని తొలి రెండు వన్డేలు, ఐదో వన్డే ఆసీస్ గెలువగా.. ఇంగ్లండ్ మూడు, నాలుగు వన్డేల్లో విజయాలు సాధించింది.చదవండి: భారత్తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన -
Eng Vs Aus ODI: లివింగ్స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్లో గ్లెన్ మాక్స్వెల్కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
అదేం బ్యాటింగ్ సామీ!.. ఊచకోతే.. రోహిత్ రికార్డు బద్దలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రయిక్రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్గా కొనసాగుతున్న హెడ్.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.ఆరోజు టీమిండియాపైటీమిండియాతో వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్ హెడ్ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్తో ప్రేక్షకులను అలరించాడు. అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలిఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలయ్యారు. నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్లు బాదాడు.రికార్డులు సాధించిన హెడ్మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్ హెడ్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. అంతకు ముందు షేన్ వాట్సన్ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్గానూ హెడ్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(24), గ్లెన్ మాక్స్వెల్(21) హెడ్ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్ను కూడా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ అందుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలుట్రెంట్బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్గా హెడ్ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. న్యూజిలాండ్పై హెడ్ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్గా హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ పేరిట ఉండేది.ఇదే ఎడిషన్లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్. అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తిఇక వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్ అలా వ్యాఖ్యానించాడు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాThe perfect 𝐇𝐄𝐀𝐃 start for the Aussies in the ODI series 💯 🇦🇺#SonySportsNetwork #ENGvAUS #TravisHead | @travishead34 pic.twitter.com/PBItCBhPKE— Sony Sports Network (@SonySportsNetwk) September 20, 2024 -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో వన్డేలో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్హామ్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్లు అందుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్ లబుషేన్(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో పొట్స్, బెతల్, లివింగ్స్టోన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్ జాక్స్ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్ హ్యారీ బ్రూక్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్ హెడ్కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్లో జరుగుతుంది. -
వరల్డ్ నంబర్ వన్గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్స్టోన్ ప్రపంచ నంబర్ వన్గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్స్టోన్ నంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో లివింగ్స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్తో సిరీస్లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాటర్గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ సిరీస్లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
ట్రావిస్ హెడ్ను మించినోడే లేడు..!
పొట్టి క్రికెట్లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పవర్ ప్లేల్లో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది హెడ్ పవర్ ప్లేల్లో (టీ20 ఫార్మాట్లో) అత్యధిక స్ట్రయిర్రేట్తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. హెడ్ ఈ ఏడాది ఇప్పటివరకు (పవర్ ప్లేల్లో) 192.32 స్ట్రయిర్రేట్తో 1027 పరుగులు చేశాడు. ఈ విభాగానికి సంబంధించి హెడ్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. హెడ్ తర్వాత పవర్ ప్లేల్లో ఫిల్ సాల్ట్ అత్యధిక పరుగులు చేశాడు. సాల్ట్ 173.73 స్ట్రయిక్రేట్తో 827 పరుగులు చేశాడు. సాల్ట్ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్ (156.09 స్ట్రయిక్రేట్తో 807 పరుగులు), అలెక్స్ హేల్స్ (136.08 స్ట్రయిక్రేట్తో 792 పరుగులు), జేమ్స్ విన్స్ (124.64 స్ట్రయిక్రేట్తో 703 పరుగులు) ఉన్నారు.హెడ్ తాజా ప్రదర్శన విషయానికొస్తే.. ఇంగ్లండ్తో నిన్న జరిగిన టీ20లో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో హెడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ (59), మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్వుడ్, జంపా చెరో 2, బార్ట్లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో లివింగ్స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది. చదవండి: ఒకే ఓవర్లో 30 పరుగులు.. హెడ్ అరుదైన రికార్డు -
ఒకే ఓవర్లో 30 పరుగులు.. హెడ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. స్కాట్లాండ్తో టీ20 సిరీస్లో విధ్వంసం సృష్టించిన హెడ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్లో కూడా అదే దూకుడును కనబరుస్తున్నాడు.సౌత్ంప్టాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 23 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.కుర్రాన్ను ఊతికారేసిన ట్రావిస్..ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ సామ్ కుర్రాన్ను హెడ్ ఊతికారేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన కుర్రాన్ బౌలింగ్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో హెడ్ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులని బౌండరీలు బాదిన హెడ్.. ఆ తర్వాత మూడు బంతులను హ్యాట్రిక్ సిక్సర్లగా మలిచాడు. చివరి బంతికి మళ్లీ ఫోర్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.హెడ్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో సామ్ కుర్రాన్కు చుక్కలు చూపించిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్ల సరసన నిలిచాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డానియల్ క్రిష్టియన్, ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు.చదవండి: క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం? 6️⃣6️⃣6️⃣: Number of the batting beast, i.e. Travis Head 🔥The explosive Aussie opener hit 30 runs off a Sam Curran over, including 3 successive sixes! #RivalsForever #ENGvAUSonFanCode pic.twitter.com/R6Bac6Sd6R— FanCode (@FanCode) September 11, 2024 -
హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
యూకే పర్యటనలో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్ను కూడా విజయంతో ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్స్టోన్(37) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, జంపా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రాట్లెట్, గ్రీన్, స్టోయినిష్ చెరో వికెట్ పడగొట్టారు.హెడ్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్స్లతో 59 పరుగులు చేశాడు.అతడితో పాటు మాథ్యూ షార్ట్(41), ఇంగ్లిష్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న కార్డిప్ వేదికగా జరగనుంది.చదవండి: Duleep Trophy 2024: రింకూ, శ్రేయస్, సుందర్లపై దృష్టి -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఊదిపడేశారు. కేవలం 9.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెడ్.. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డు బద్దలు..ఇక ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఏకంగా 113 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు ఆసీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.గతేడాది వెస్టిండీస్తో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో సఫారీలు పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో ప్రోటీస్ ఆల్టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. -
ట్రవిస్ హెడ్ ఊచకోత.. మిచెల్ మార్ష్ విధ్వంసం
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్ శివాలెత్తిపోయారు. పవర్ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో (పవర్ ప్లేల్లో) ఇదే అత్యధిక స్కోర్. పవర్ ప్లే ముగిసే సమయానికి ట్రవిస్ హెడ్ 22 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. పవర్ ప్లే మొత్తంలో కేవలం రెండు సింగల్స్ మాత్రమే రాగా.. 17 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. ట్రవిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. సీన్ అబాట్ 3 వికెట్లతో రాణించగా.. జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా తలో 2, రిలే మెరిడిత్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో మున్సే 28, క్రాస్ 27, బెర్రింగ్టన్ 23 పరుగులు చేశారు. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు.అరంగేట్రంలోనే డకౌట్ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్.. తొలి మ్యాచ్లోనే డకౌటయ్యాడు. మెక్గుర్క్ మూడు బంతులు ఆడి బ్రెండన్ మెక్ముల్లెన్ బౌలింగ్లో చార్లీ కాసెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదన155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 80; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ ఇంగ్లిస్ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం 9.4 ఓవర్లలోనే (3 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
భీకర ఫామ్లో ట్రవిస్ హెడ్
మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడం ఓపెనర్ ట్రవిస్ హెడ్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన హెడ్.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో మరో మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా 8 మ్యాచ్లు ఆడిన హెడ్ 54.5 సగటున 173కు పైగా స్ట్రయిక్రేట్తో 327 పరుగులు చేసి వాషింగ్టన్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో హెడ్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. 1, 32 నాటౌట్, 0, 54 నాటౌట్, 54, 53, 56, 77 నాటౌట్.యూనికార్న్స్తో జరిగిన క్వాలిఫయర్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో హెడ్తో పాటు (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్లతో చెలరేగడంతో వాషింగ్టన్ ఫ్రీడం సునాయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ చెలరేగడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (1), ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది. -
రచిన్ మాయాజాలం.. హెడ్ మెరుపులు.. మ్యాక్స్వెల్ ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ 1, ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ విధ్వంసం.. ట్రవిస్ హెడ్ మెరుపులు
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్లో స్మిత్కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024మరో ఎండ్లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్తో జరుగుతున్న మ్యాచ్లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో హెడ్కు ఇది మూడో హాఫ్ సెంచరీ.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడలేదు. -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్తో మ్యాచ్లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?తమ దేశంలో క్రికెట్ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం. -
హెడ్ మెరుపులు.. 88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్లో) నిలిచింది.హెడ్, గౌస్, రచిన్ మెరుపులు..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (8), మ్యాక్స్వెల్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, కీరన్ పోలార్డ్ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టారు.88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. వాషింగ్టన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్దీప్ సింగ్ 3.. మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్వెల్ తలో 2.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో రొమారియో షెపర్డ్ (25), ట్రెంట్ బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఓపెనర్లుగా జేక్ ఫ్రేజర్, ట్రవిస్ హెడ్.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..!
స్టార్లతో నిండిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆసీస్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-8లో ఆసీస్.. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతుల్లో ఓడి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆసీస్ జట్టులోని కీలక సభ్యులందరూ మేజర్ లీగ్ క్రికెట్తో బిజీగా ఉన్నారు. ఆసీస్ అంతర్జాతీయ కమిట్మెంట్స్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు స్కాట్లాండ్తో టీ20 సిరీస్, ఆ వెంటనే (సెప్టెంబర్ 11- 29) ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ రెండు సిరీస్లలో టీ20తో పాటు వన్డే జట్టుకు కూడా మిచెల్ మార్షే సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్కు విశ్రాంతినిచ్చారు. స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ల కోసం ఎంపిక చేసిన జట్లలో చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్కు చోటు కల్పించారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్లలో ఫ్రేజర్.. మరో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. ఈ ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఏ స్థాయి విధ్వంసం ఉంటుందో చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఫ్రేజర్, హెడ్ ఇద్దరు ఒకే మ్యాచ్లో క్లిక్ అయితే ప్రత్యర్ది బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. వీరిద్దరు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించగలరో ఐపీఎల్ 2024లో చూశాం. ఈ ఎడిషన్లో జేక్ (ఢిల్లీ క్యాపిటల్స్) 234 స్ట్రయిక్రేట్తో 330 పరుగులు చేయగా.. హెడ్ 191.55 స్ట్రయిక్రేట్తో 567 పరుగులు చేశాడు. జేక్, హెడ్ల నుంచి ఇలాంటి ప్రదర్శన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కాట్లాండ్, ఇంగ్లండ్తో టీ20లకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
ట్రవిస్ హెడ్ బ్యాట్ను రెండు ముక్కలు చేసిన రసెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నైట్రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బౌలింగ్లో వాషింగ్టన్ ఆటగాడు ట్రవిడ్ హెడ్ పుల్ షాట్ ఆడబోగా బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటన వాషింగ్టన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.Russell broke Travis head's bat with a Fierce bowlMajor league cricket #Russell#travishead#mlc#majorleaguecricket #Cricket #smith#head#funnyincident pic.twitter.com/0cFLoYDB1Y— जंबारू (@jambr123356) July 14, 2024ఈ మ్యాచ్లో నైట్రైడర్స్పై వాషింగ్టన్ ఫ్రీడం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్.. వాషింగ్టన్ బౌలర్లు నేత్రావల్కర్ (3.4-0-35-4), మ్యాక్స్వెల్ (4-0-15-3), లోకీ ఫెర్గూసన్ (4-0-31-2), రచిన్ రవీంద్ర (2-0-7-1) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో సైఫ్ బదార్ అత్యధికంగా 35 పరుగులు చేయగా.. స్టార్ ఆటగాళ్లు జేసన్ రాయ్ (12), సునీల్ నరైన్ (0), ఉన్ముక్త్ చంద్ (1), షకీబ్ (0), మిల్లర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో రసెల్ (20), వాన్ స్కాల్విక్ (12 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్ (16), అలీ ఖాన్ (11) బ్యాట్ ఝులిపించడంతో నైట్రైడర్స్ 100 పరుగుల మార్కు దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (2 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 16 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 11 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మిత్తో పాటు ఆండ్రియస్ గౌస్ (15) అజేయంగా నిలిచాడు. నైట్రైడర్స్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, వాన్ స్కాల్విక్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) టాప్లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
ICC: టాప్ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్ వన్ ఎవరంటే?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానం కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న ఈ ముంబై క్రికెటర్ రెండో స్థానానికి పడిపోయాడు.గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య కేవలం రెండు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.ఆరంభంలో తడ‘బ్యా’టు కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ పరుగులు రాబట్టలేక సతమతమయ్యాడు. ఆ తర్వాత అమెరికా(50 నాటౌట్), అఫ్గనిస్తాన్(28 బంతుల్లో 53) జట్లపై వరుసగా హాఫ్ సెంచరీలతో మెరిశాడు.ఇక వరల్డ్కప్ తాజా ఎడిషన్లో 33 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 139.25 స్ట్రైక్రేటుతో 149 పరుగులు చేశాడు.అద్భుత ప్రదర్శనమరోవైపు.. 30 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రవిస్ హెడ్ టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్-8 మ్యాచ్లో టీమిండియాపై అర్థ శతకం(43 బంతుల్లో 76)తో దుమ్ములేపాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి ఓవరాల్గా సగటు 42.50, స్ట్రైక్రేటు 158.38తో 255 పరుగులు సాధించాడు.ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ టోర్నీలో సెమీస్ చేరగా.. ఆస్ట్రేలియా సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్- టాప్-5 బ్యాటర్లు వీరే1. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 844 రేటింగ్ పాయింట్లు2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 842 రేటింగ్ పాయింట్లు3. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 816 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 755 రేటింగ్ పాయింట్లు5. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 746 రేటింగ్ పాయింట్లు. -
అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా మరో ముందడుగు వేసింది. నమీబియాతో మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని సూపర్-8 దశకు అర్హత సాధించింది. ప్రత్యర్థిని 72 పరుగులకే పరిమితం చేసి.. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై జయభేరి మోగించి భారీ రన్రేటుతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నమీబియాపై భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో కీలక సభ్యుడైన ఆడం జంపా ఈ మ్యాచ్లో ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసించాడు.అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం‘‘ఈరోజు మా బౌలింగ్ విభాగం అత్యద్భుతంగా రాణించింది. సమిష్టి కృషితో దక్కిన విజయం ఇది. సూపర్-8కు అర్హత సాధించడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో వరుస గెలుపులు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఇక జంపా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.గత నాలుగైదేళ్లుగా మా జట్టులో అతడు అత్యంత ముఖ్యమైన సభ్యుడిగా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడం తన ప్రత్యేకత. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆడం జంపాను కొనియాడాడు.విండీస్లో బీచ్లు సూపర్ఇక వెస్టిండీస్ ఆతిథ్యం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. చాలా బీచ్లు ఇక్కడున్నాయి. ఒక్కోసారి మాకు పెర్త్లో ఉన్న అనుభూతి కలుగుతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాతో కలిసి విండీస్ ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్-డి: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా👉వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా👉టాస్: ఆస్ట్రేలియా.. తొలుత బౌలింగ్👉నమీబియా స్కోరు: 72 (17)👉టాప్ స్కోరర్: గెర్హార్డ్ ఎరాస్మస్(43 బంతుల్లో 36 పరుగులు)👉ఆస్ట్రేలియా స్కోరు: 74/1 (5.4)👉టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 రన్స్, నాటౌట్)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సూపర్-8కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడం జంపా(4/12).చదవండి: T20 WC 2024: గెలిచి నిలిచిన పాక్ View this post on Instagram A post shared by ICC (@icc) -
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
ఐపీఎల్-2024 లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కీలకమైన ప్లే ఆఫ్స్లో చేతులెత్తేశారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2లో నిరాశపరిచిన ఈ విధ్వంసకర జోడీ.. ఇప్పుడు చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తస్సుమన్పించారు.ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ రెండు పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ అయితే ఏకంగా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. అద్భుతమైన బంతితో అభిషేక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు హెడ్ను వైభవ్ ఆరోరా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.హెడ్ విషయానికి వస్తే.. ఆఖరి 4 మ్యాచ్ల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సార్లు హెడ్ డకౌటయ్యాడు.అదే విధంగా అభిషేక్ కూడా ఆఖరి మూడు మ్యాచ్ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు వీరిద్దరిని ట్రోలు చేస్తున్నారు. -
SRH vs RR: అతడి మీదే భారం.. సన్రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్కాగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 8 ఫోర్లు, 6 సిక్స్లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఊచకోత ఫలితంగా సన్రైజర్స్ ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 205 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 401 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సపోర్ట్ కారణంగానే ఈ తరహా ప్రదర్శన చేయగల్గుతున్నానని అభిషేక్ తెలిపాడు. "మా కోచింగ్ స్టాప్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటగాళ్లందరకి చాలా సపోర్ట్గా ఉంటారు. ఎటువంటి కెప్టెన్ను, సపోర్ట్ స్టాప్ను ఇప్పటివరకు చూడలేదు. స్వేచ్చగా ఆడి మమ్మల్ని మేము వ్యక్తిపరిచేందుకు ఫుల్ సపోర్ట్ వారి నుంచి మాకు ఉంటుంది. ఇటువంటి వాతావరణం మా జట్టులో ఉండడం చాలా సంతోషం. ఈ తరహా బ్యాటింగ్ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చేశాను. భారీ షాట్లు ఆడి బౌలర్ను ఒత్తడిలోకి నెట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ఇక ట్రావిస్ హెడ్కు నేను వీరాభిమానిని. అతడితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ట్రావిస్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్లో అతడి ఆడిన షాట్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ పేర్కొన్నాడు. -
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించారు. బుధవారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరి తుపాన్ ఇన్నింగ్స్ల ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలో చేధించింది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆజేయంగా నిలిచి సన్రైజర్స్కు రికార్డు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో వీరిద్దరి బ్యాటింగ్కు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం సైతం ఫిదా అయిపోయాడు. ఎక్స్ వేదికగా ఈ ఓపెనింగ్ జోడీపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఉప్పల్లో ఈ రోజు విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చూశాం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చూసేవాళ్లమే’’ అని సచిన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ విధ్వంసకర జోడీను ప్రశంసిస్తూ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్లో హెడ్, అభిషేక్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎంత చెప్పుకున్న తక్కువే. అదే జోరులో 300 పరుగులైనా ఛేజ్ చేసేవాళ్లు అని ఎక్స్లో మిథాలీ రాసుకొచ్చింది. -
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన సన్రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానం ఉప్పల్లో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చిత్తుగా ఓడించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్లలో ఏడో గెలుపు నమోదు చేసింది.విధ్వంసకర బ్యాటింగ్తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది.ఉప్పల్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్ సేన.సునామీ ఇన్నింగ్స్అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్ ఓపెనర్లు. ట్రావిస్ హెడ్ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్తో మెరిశాడు.హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టు👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్రైజర్స్ కావడం విశేషం. ఇక హెడ్, అభి విధ్వంసం కారణంగా సన్రైజర్స్ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా మరో వరల్డ్ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 150+ ఛేజింగ్1. సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.2. బ్రిస్బేన్ హీట్- మెల్బోర్న్ స్టార్స్ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.3. గయానా అమెజాన్ వారియర్స్- జమైకా తలావాస్- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్రైజర్స్ హైదరాబాద్👉లక్నో సూపర్ జెయింట్స్ మీద- 167/0 (9.4)- 2024లో👉ఢిల్లీ క్యాపిటల్స్ మీద- 157/4- 2024లో👉ముంబై ఇండియన్స్ మీద- 148/2- 2024లో.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
IPL 2024 SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.తమ బ్యాటింగ్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్రైజర్స్ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను ఊచకోత కోశారు అభిషేక్, హెడ్.వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్, అభిషేక్ కలిసి పిచ్ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.నిజానికి నేనొక బౌలర్ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేను. ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.అతడొక అద్భుతంకఠినమైన పిచ్లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.పవర్ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్లో మా వాళ్లు సూపర్గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.10 వికెట్ల తేడాతో గెలుపుకాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH Vs LSG Photos: సన్రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs LSG: సన్రైజర్స్ విధ్వంసం
250 పరుగుల లక్ష్యమైనా సన్రైజర్స్ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. తొలుత బ్యాటింగ్ చేస్తూ సీజన్లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్ తరహాలో ట్రవిస్ హెడ్, అభిõÙక్ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్ ఛేదించిపడేసింది. రైజర్స్ ఛేజింగ్ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.సాక్షి, హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. రాహుల్ విఫలం... భువనేశ్వర్ చక్కటి బౌలింగ్ వల్ల లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్ (2), స్టొయినిస్ (3)లను పెవిలియన్ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్ అద్భుత క్యాచ్లు కారణంగా నిలిచాయి. పవర్ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రాహుల్, కృనాల్ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా ఏ దశలోనూ రాహుల్ స్ట్రయిక్రేట్ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్ రనౌట్ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు. మెరుపు వేగంతో... 8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్రైజర్స్ ఒక్కో ఓవర్లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్ చెలరేగిపోయారు. యశ్ ఓవర్లో అభిషేక్ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్ ఓవర్లో హెడ్ 3 సిక్స్లు, ఫోర్ బాదాడు. నవీనుల్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టిన అభిషేక్ హాఫ్ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతిని అభిõÙక్ సిక్స్గా మలచడంతో ఉప్పల్ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) నటరాజన్ (బి) కమిన్స్ 29; డికాక్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 2; స్టొయినిస్ (సి) సన్వీర్ (బి) భువనేశ్వర్ 3; కృనాల్ పాండ్యా (రనౌట్) 24; పూరన్ (నాటౌట్) 48; బదోని (నాటౌట్) 55; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–12–2, కమిన్స్ 4–0–47–1, షహబాజ్ 2–0–9–0, విజయకాంత్ 4–0–27–0, ఉనాద్కట్ 2–0–19–0, నటరాజన్ 4–0–50–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 75; హెడ్ (నాటౌట్) 89; ఎక్స్ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 167. బౌలింగ్: గౌతమ్ 2–0–29–0, యశ్ ఠాకూర్ 2.4–0–47–0, బిష్ణోయ్ 2–0–34–0, నవీనుల్ హక్ 2–0–37–0, బదోని 1–0–19–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరు వేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
SRH Vs MI: రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
-
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్లలో.. ఒక ఇన్నింగ్స్లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్రైజర్స్దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్తో మ్యాచ్లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్కే టైటిల్ విన్నర్గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్ను అహ్మదాబాద్లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: ‘బాధితులు’ మరింత అసూయ పడేలా..
(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!! చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 8, హెన్రిచ్ క్లాసెన్ 7, ఐడెన్ మార్క్రమ్ 2, అబ్దుల్ సమద్ 3 సిక్స్లు బాదారు. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 ఇలా ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండు, ఫాఫ్ డుప్లెసిస్ 4, దినేశ్ కార్తిక్ 7, మహిపాల్ లామ్రోర్ రెండు సిక్స్లు బాదారు. తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్ మజా అనుకుంటూ మురిసిపోయారు. బ్యాటర్ను అయినా బాగుండు ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్రైజర్స్- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్రైజర్స్ కెప్టెన్, మూడు వికెట్లు తీసిన పేసర్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్ను అయినా బాగుండు. సూపర్ మ్యాచ్. అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ సృష్టించిన అరుదైన రికార్డులు ►ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు- 22 ►టీ20 క్రికెట్లో నేపాల్(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287). ►ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3. సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్రైజర్స్ విజయం చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్ -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్రైజర్స్కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్కప్ హీరో ట్రావిస్ హెడ్ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్ను కెప్టెన్ చేయడం సన్రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్రైజర్స్ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో పిచ్ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్డౌన్లో క్లాసెన్ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్గా డీల్ చేస్తూ సన్రైజర్స్ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024 -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్రైజర్స్తో మ్యాచ్లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
చరిత్రపుటల్లోకెక్కిన సన్రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్.. టీ20 రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీ-సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ చాలా వరకు టీ20 రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ చేసిన స్కోర్ (287/3) 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కాగా.. పొట్టి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్గా (గతేడాది ఏషియన్ గేమ్స్లో నేపాల్ మంగోలియాపై చేసిన 314 పరుగుల స్కోర్ టీ20ల్లో అత్యధికం) రికార్డైంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ (సన్రైజర్స్ 287 + ఆర్సీబీ 262=549) టీ20 హిస్టరీలో (ఓ మ్యాచ్లో) నమోదైన అత్యధిక స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో 22 సిక్సర్లు కొట్టిన సన్రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (ఓ ఇన్నింగ్స్లో) కొట్టిన జట్టుగా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో ట్రవిస్ హెడ్ (39 బంతులు) చేసిన సెంచరీ సన్రైజర్స్ తరఫున వేగవంతమైన శతకంగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్లో నమోదైన బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81), సిక్సర్లు (38) (ఇరు జట్లు కలిపి కొట్టినవి) పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక బౌండరీలు, సిక్సర్లుగా రికార్డయ్యాయి. ఈ రికార్డులే కాక ఈ మ్యాచ్లో మరెన్నో చిన్నా చితక రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గూసన్ 2, టాప్లే ఓ వికెట్ పడగొట్టాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేదనుకుని చివరి నిమషం వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టాడు. -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో హెడ్ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. యూసఫ్ పఠాన్(37 బంతులు), డేవిడ్ మిల్లర్(38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. -
ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మతో స్కోర్ను బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. హెడ్కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ సన్రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన తర్వాత లూకీ ఫెర్గూసన్ బౌలింగ్లో హెడ్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. TRAVIS HEAD - FASTEST HUNDRED BY SRH BATTER IN IPL HISTORY 🤯pic.twitter.com/GvWCPFpRkd — Johns. (@CricCrazyJohns) April 15, 2024 -
మేజర్ లీగ్ క్రికెట్లో సన్రైజర్స్ స్టార్ ప్లేయర్
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ బరిలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు నిలిచాడు. ఐపీఎల్లో సన్రైజర్స్కు హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రవిస్ హెడ్ వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఇదివరకే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆసీస్ లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మోసస్ హెన్రిక్స్ ఈ జట్టుకు సారధ్యం వహిస్తుండగా.. స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ప్లేయర్స్ ఆటగాళ్లుగా బరిలోకి దిగనున్నారు. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇటీవలే ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాంటింగ్ ఎంఎల్సీ తదుపరి సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ ఆసీస్ ఆటగాళ్లంతా కలిసి జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ సెకెండ్ ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు ఎంఎల్సీలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మేజర్ లీగ్ టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ లీగ్లో ఆసీస్ ఆటగాళ్లే కాక చాలామంది విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కూడా కొత్తగా వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా మార్కో జన్సెన్, వెస్టిండీస్ అకీల్ హొసేన్ను వాషింగ్టన్ ఫ్రీడం తిరిగి రీటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది. -
Kavya Maran Photos: సన్రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs MI Photos: సొంతగడ్డపై సన్రైజర్స్ విజయగర్జన (ఫొటోలు)
-
SRH Vs MI: సన్రైజర్స్ ‘రన్’రంగం
సునామీ బ్యాటింగ్... విధ్వంస ప్రదర్శన... వీర విజృంభణ... అద్భుతం... అసాధారణం... అసమానం... ఎలాంటి విశేషణాలు ఉపయోగించుకుంటారో మీ ఇష్టం... ఎన్నాళ్లుగానో ఇలాంటి ఇన్నింగ్స్ ఎదురు చూస్తున్న సన్రైజర్స్ ఆట సగటు అభిమానికి ఫుల్ జోష్ను పంచింది... సంపూర్ణ ఆనందాన్ని అందించింది... బౌండరీల వర్షంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది... 19 ఫోర్లు, 18 సిక్సర్లు... ముంబై బౌలింగ్పై హైదరాబాద్ ఊచకోత మామూలుగా సాగలేదు... ముగ్గురు బ్యాటర్లు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరు నమోదైంది. ముందుగా హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే... కొద్ది క్షణాల్లోనే 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అభిషేక్ శర్మ తానూ తక్కువ కాదని చూపించాడు. నన్ను ఎలా మరచిపోతారన్నట్లుగా ఆ తర్వాత క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు... భారీ ఛేదనలో ముంబై కొంత వరకు ప్రయత్నించినా లక్ష్యం మరీ పెద్దదైపోయింది... చివరకు సొంతగడ్డపై సన్రైజర్స్ విజయగర్జన చేసింది. ఓవరాల్గా టి20ల్లోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్గా సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్లో కమిన్స్ బృందం ఘన విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్స్లు)... ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్స్లు) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించింది. ‘లోక్ బాయ్’ తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్స్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. వీర విధ్వంసం... 7, 11, 22, 5, 13, 23, 21, 15, 11, 20 (తొలి 10 ఓవర్లలో 148)... 13, 12, 7, 11, 11, 12, 18, 11, 13, 21 (తర్వాతి 10 ఓవర్లలో 129)... సన్రైజర్స్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (11) విఫలం కాగా... మిగిలిన నలుగురు బ్యాటర్లు ముంబై బౌలర్లపై విరుచుకు పడ్డారు. అండర్–19 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచి తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న 18 ఏళ్ల క్వెనా మఫాకా వీరిలో ముందుగా బలయ్యాడు. అతని తొలి ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 బాదిన హెడ్... హార్దిక్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. కొయెట్జీ ఓవర్లోనూ వరుసగా 4, 4, 6 బాదిన హెడ్ 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్ 3 భారీ సిక్సర్లతో స్వాగతం పలికాడు. హెడ్ వెనుదిరిగిన తర్వాత అభిషేక్ మరింత చెలరేగిపోయాడు. మఫాకా ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టిన అతను 16 బంతులకే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. 11వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ అవుట్ కాగా... తర్వాతి 9 ఓవర్ల బాధ్యతను క్లాసెన్ తీసుకున్నాడు. మిత్రుడు మార్క్రమ్ (28 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకారంతో అతను సిక్సర్లతోనే పరుగులు రాబడుతూ దూసుకుపోయాడు. మఫాకా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 14.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. తన తొలి 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒకింత మెరుగైన ప్రదర్శన ఇచ్చిన బుమ్రా కూడా తన చివరి ఓవర్లో క్లాసెన్ జోరుకు 13 పరుగులు ఇచ్చుకున్నాడు. ములానీ వేసిన ఆఖరి ఓవర్లోనూ వరుసగా 4, 6, 6 బాదిన క్లాసెన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును తన జట్టును అందించాడు. సన్రైజర్స్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మలిక్ను బరిలోకి దించింది. తిలక్ వర్మ పోరాటం... ఓవర్కు 13.9 పరుగులు... భారీ లక్ష్య ఛేదనలో ఈ రన్రేట్తో పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై బ్యాటింగ్కు దిగింది. ఓపెనింగ్, ఆ తర్వాత మూడో వికెట్ భాగస్వామ్యాలు దూకుడుగానే సాగినా... ఇది సరిపోలేదు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్కు 20 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఉనాద్కట్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన కిషన్... భువీ వేసిన తర్వాతి ఓవర్లో 3 సిక్స్లు, ఫోర్ బాదాడు. అయితే వీరిద్దరిని 10 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత తిలక్, నమన్ ధీర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరింత దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 84 పరుగులు జత చేశారు. నమన్ వెనుదిరిగాక, షహబాజ్ ఓవర్లో 3 భారీ సిక్సర్లు కొట్టిన తిలక్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్, హార్దిక్ పాండ్యా (24) పోరాటం ఫలితమివ్వలేదు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) డేవిడ్ (బి) పాండ్యా 11; హెడ్ (సి) నమన్ (బి) కొయెట్జీ 62; అభిషేక్ శర్మ (సి) నమన్ (బి) చావ్లా 63; మార్క్రమ్ (నాటౌట్) 42; క్లాసెన్ (నాటౌట్) 80; ఎక్స్ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–161. బౌలింగ్: మఫాకా 4–0–66–0, పాండ్యా 4–0–46–1, బుమ్రా 4–0–36–0, కొయెట్జీ 4–0–57–1, చావ్లా 2–0–34–1, షమ్స్ ములానీ 2–0–33–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 26; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) షహబాజ్ 34; నమన్ ధీర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 30; తిలక్ వర్మ (సి) మయాంక్ (బి) కమిన్స్ 64; పాండ్యా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 24; టిమ్ డేవిడ్ (నాటౌట్) 42; షెఫర్డ్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–56, 2–66, 3–150, 4–182, 5–224. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–53–0, ఉనాద్కట్ 4–0–47–2, షహబాజ్ 3–0–39–1, కమిన్స్ 4–0–35–2, ఉమ్రాన్ 1–0–15–0, మర్కండే 4–0–52–0. 523 ఓవరాల్ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ నిలిచింది. గత ఏడాది మార్చి 26న సెంచూరియన్ పార్క్లో దక్షిణాఫ్రికా (18.5 ఓవర్లలో 259/4), వెస్టిండీస్ (20 ఓవర్లలో 258/5) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 517 పరుగులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్ల విషయానికొస్తే 2010లో చెన్నై సూపర్ కింగ్స్ (246/5), రాజస్తాన్ రాయల్స్ (223/5) మ్యాచ్లో మొత్తం 469 పరుగులు వచ్చాయి. 38 హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్లో నమోదైన సిక్స్లు. ఒక టి20 మ్యాచ్లో ఇవే అత్యధికం. 2018లో అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా లెజెండ్స్, కాబుల్ జ్వానన్ మ్యాచ్లో మొత్తం 37 సిక్స్లు వచ్చాయి. 148 ముంబైతో మ్యాచ్లో హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో చేసిన పరుగులు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఇవే అత్యధికం. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X ఢిల్లీ వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
బీభత్సం సృష్టించిన అభిషేక్ శర్మ.. నిమిషాల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 27) జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముంబై ఇండియన్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ వీర లెవెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. తొలుత ఓపెనర్ ట్రవిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అభిషేక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి హెడ్ రికార్డును బద్దలు కొట్టాడు. హెడ్, అభిషేక్ శివాలెత్తడంతో పవర్ ప్లేల్లో అత్యధిక టీమ్ స్కోర్ను (81/1) నమోదు చేసిన సన్రైజర్స్.. ఐపీఎల్లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ (148/2) రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో హెడ్ 24 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయగా.. అభిషేక్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. 13 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 161/3గా ఉంది. అంతకుముందు మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్ ఔటయ్యాడు. హార్దిక్, పియుశ్ చావ్లా, కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు.