under 19 world cup
-
‘మా జట్టు ఆసీస్లా మారాలి’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా తరహాలో ఎదురులేని జట్టులా భారత బృందం మారాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటామని భారత మహిళల అండర్–19 టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్ వ్యాఖ్యానించింది. మలేసియాలో విశ్వవిజేతలుగా నిలిచిన అనంతరం జట్టు సభ్యులు గొంగడి త్రిష, కేసరి ధృతి, ట్రెయినర్ షాలినిలతో కలిసి నూషీన్ మంగళవారం నగరానికి చేరుకుంది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళలు అండర్–19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఆమెనే హెడ్ కోచ్గా ఉంది. ఆఫ్ స్పిన్నర్గా భారత్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 115 వికెట్లు తీసిన నూషీన్ ఖాతాలో ఇప్పుడు కోచ్ హోదాలో వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ చేరాయి. ‘మా అమ్మాయిల నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. ఇదంతా సమష్టిగా సాధించిన విజయం. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ టోర్నీ కోసం ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడ్డాం. దాని ఫలితమే ఇప్పుడు కనిపించింది. మా విజయంలో టీమ్ సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు మాత్రమే కాకుండా ట్రెయినర్, ఫిజియో కూడా ఎంతో శ్రమించారు’ అని నూషీన్ పేర్కొంది. తమకు అందించిన బాధ్యతలకు అనుగుణంగా అమ్మాయిలు స్పందించిన తీరును హెడ్ కోచ్ ప్రశంసించింది. ‘పరిస్థితులను బట్టి తమను తాము మార్చుకునే విషయంలో మా అమ్మాయిలు సరైన రీతిలో స్పందించారు. డిమాండ్ ప్రకారం తమ ఆటను మార్చుకున్నారు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటం వల్ల ప్లేయర్లందరి మధ్య మంచి బంధం ఏర్పడింది. పైగా తమకు అందించిన బాధ్యతలపై ప్రతీ ప్లేయర్కు స్పష్టత ఉండటం కూడా ఎంతో మేలు చేసింది. అందుకే వరల్డ్ కప్లో కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి అంత గొప్పగా ఆడగలిగాం’ అని కోచ్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం సాధించిన విజయం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని... అయితే దాంతో పోలిస్తే ఈ టైటిల్ మరింత ప్రత్యేకమని నూషీన్ పేర్కొంది. ‘2023లో సాధించిన విజయంతో పోలిస్తే ఈసారి మేం మరింత నిలకడగా, దూకుడుగా, సంపూర్ణ ఆధిపత్యంతో ఆడాం. మానసికంగా కూడా అమ్మాయిలు ఈసారి దృఢంగా ఉన్నారు. అందుకే ఈ గెలుపుపై మాకు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. సెమీస్లో ఇంగ్లండ్ రూపంలో మాకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి. కానీ అక్కడా మనోళ్లు జోరు కొనసాగించడం జట్టు బలాన్ని చూపించింది. మహిళల క్రికెట్లో వన్డేలు, టి20లు కలిపి ఆ్రస్టేలియా 13 వరల్డ్ కప్లు గెలిచింది. మా జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, అంతే బలంగా మారాలని కోరుకుంటున్నాం. మా తర్వాతి లక్ష్యం కూడా అదే’ అని ఈ మాజీ స్పిన్నర్ సగర్వంగా చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన తెలంగాణ అమ్మాయి త్రిషను కోచ్ ప్రత్యేకంగా అభినందించింది. ‘త్రిష అనుభవాన్ని బట్టి ఆమెను ఓపెనర్గా పంపాలని వరల్డ్ కప్నకు ముందే నిర్ణయించాం. నిజాయితీగా చెప్పాలంటే ఆమె దూకుడైన బ్యాటింగ్ శైలి మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. త్రిష తన షాట్లను మెరుగుపర్చుకోవడంలో ఎంతో కష్టపడింది’ అని నూషీన్ అభిప్రాయపడింది. వరుసగా రెండు అండర్–19వరల్డ్ కప్ టైటిల్స్ భారత్లో మహిళల క్రికెట్కు మరింత ఊతం ఇస్తాయని... ఈ స్థాయిలో అమ్మాయిలకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించి భవిష్యత్తులో వారిని మరింత బలమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బోర్డుదేననే నూషీన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా వరల్డ్ కప్తో కోచ్గా నూషీన్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. -
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్తో, ఫార్మాట్తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్కప్ (T20 World Cup) ఫైనల్స్లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్.. తుది జట్లు ఇవే
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్కప్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భారత్ మరోసారి ఆధారపడనుంది. ఈ వరల్డ్కప్లో అత్యధిక పరుగుల బ్యాటర్గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిభారత మహిళల U19 జట్టు: కమలిని(వికెట్ కీపర్), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత షబ్నం షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మచదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్? -
మిథాలీ అడుగు జాడల్లోనే...
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్కప్లో భాగంగా స్కాట్లాండ్తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది. 2023 మహిళల అండర్–19 ప్రపంచకప్తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ. ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
T20 World Cup 2025: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్లో భారత్ రెండు మ్యాచ్లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో సౌతాఫ్రికా టాపర్గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచి సూపర్ సిక్స్కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
9 నెలల వ్యవధిలో భారత క్రికెట్ అభిమానులకు మూడోసారి గుండెకోత
తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మేజర్ ఈవెంట్ల ఫైనల్స్లో టీమిండియా వరుస పరాభవాలను ఎదుర్కొంది. భారత్కు ఓటములు ఎదురైన మూడు సందర్భాల్లో ప్రత్యర్ధి ఆస్ట్రేలియానే కావడం విశేషం. తొలుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్లో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసింది. ఆతర్వాత గతేడాది చివర్లో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో, తాజాగా అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్స్లో భారత క్రికెట్ జట్టు ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ సీనియన్ టీమిండియాలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
ప్రపంచ క్రికెట్పై కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యం
ప్రపంచ క్రికెట్పై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ జట్టు ఫార్మాట్లకతీతంగా వరుస టైటిల్స్ సాధిస్తూ ప్రపంచ క్రికెట్ను శాశిస్తుంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్లో ఆస్ట్రేలియా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా హవా పురుషుల క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్లోనూ ఈ జట్టు డామినేషనే నడుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ సత్తా చాటారు. ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తు చేసి ఈ విభాగంలో నాలుగోసారి జగజ్జేతగా అవతరించింది. అండర్ 19 టైటిల్తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో (పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్) వరల్డ్ ఛాంపియన్గా (వన్డే ఫార్మాట్లో) అవతరించింది. వన్డే వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా అండర్ 19 వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల టీ20 ఛాంపియన్-ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్-ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ రోహిత్ సేనలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. చదవండి: World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో -
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సామ్ కాంస్టాస్ 0, ర్యాన్ హిక్స్ 20, రాఫ్ మెక్మిలన్ 2, చార్లీ ఆండర్సన్ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ త్రయం ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్లో భారత్ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్ టైటిల్ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఆశిద్దాం. -
టీమిండియా అభిమానుల్లో కలవరం
అండర్-19 వరల్డ్కప్ 2024లో యువ భారత్ జట్టు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో టీమిండియా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్కప్ ఫైనల్ ఆస్ట్రేలియా ఫోబియా. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అచ్చం ప్రస్తుత అండర్ 19 వరల్డ్కప్లో యువ భారత్లాగే 2023 వరల్డ్కప్లో భారత జట్టు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమమే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల కలవరానికి కారణంగా మారింది. సీనియర్ జట్టు లాగే జూనియర్లు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, తుది సమరంలో చేతులెత్తేస్తారేమోనని భారత అభిమానులు బెంగ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ నాటి వరల్డ్కప్ ఫైనల్ బరిలోకి దిగిన టీమిండియా.. తుది సమరంలో తడబడి ఆసీస్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడటం ఇది కొత్తేమీ కాదు. 2003 ఎడిషన్లోనూ టీమిండియా ఇలానే ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఆ ఎడిషన్లో ఇప్పటిలా భారత్ అజేయ జట్టు మాత్రం కాదు. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సెంటిమెంట్లను పక్కన పెడితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్న గ్రహించాలి. గత వరల్డ్కప్ ఫైనల్స్లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్ల పరిస్థితి.. ప్రస్తుత యువ భారత జట్టు పరిస్థితి వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుత యువ భారత్ జట్టు అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ను కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ప్రస్తుత యువ భారత జట్టు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించి, సత్ఫలితాలు రాబట్లగల సమర్ధమైన జట్టు. ఫైనల్లో యంగ్ ఇండియా ఆసీస్ను మట్టికరిపించి, సీనియర్లకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశిద్దాం. ఈ వరల్డ్కప్ గెలిస్తే యువ భారత్ ఐదో సారి జగజ్జేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. -
యువ భారత్ సంచలన విజయం.. వరల్డ్కప్ ఫైనల్లోకి ప్రవేశం
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్లో యువ భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్ సహారన్ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ను సచిన్ దాస్ (95), కెప్టెన్ ఉదయ్ సహారన్ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్వేన్ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్ లూస్ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. కెప్టెన్ జుయాన్ జేమ్స్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, సౌమీ పాండే తలో వికెట్ పడగొట్టారు. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్ మపాకా ఆదర్శ్ సింగ్ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్లో టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్లో ఉన్న ముషీర్ ఖాన్ను (4) ట్రిస్టన్ లూస్ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత భారత్ 10, 12 ఓవర్లలో అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్ లాగేసుకుంది. చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్ లింబానీ (13 నాటౌట్) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్ను సెమీస్కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్.. సెమీస్ బెర్త్ ఖారారు
బ్లూమ్ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్లో యువ భారత్ అజేయంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–1 సూపర్ సిక్స్ పోరులో భారత్ 132 పరుగుల భారీ తేడాతో నేపాల్పై జయభేరి మోగించడంతో సెమీస్ స్థానం ఖాయమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సచిన్ దాస్ (101 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 215 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. కెప్టెన్ దేవ్ ఖానల్ (53 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IND vs ENG: ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కుర్ర బౌలర్
అండర్-19 వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన మ్యాచ్లో ఈ కుర్ర బౌలర్ మరో ఐదు వికెట్ల ప్రదర్శనతో (8.2-1-21-6) విజృంభించాడు. మపాకాకు ప్రస్తుత వరల్డ్కప్లో ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ సింగిల్ ఎడిషన్లో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు. Kwena Maphaka put up another impressive performance, registering figures of 6/21 to claim the @aramco POTM 🌟 Catch his Highlights 📽#U19WorldCup pic.twitter.com/h6GTvg9TLY — ICC (@ICC) February 2, 2024 ప్రస్తుత ఎడిషన్లో మపాకా ఈ మ్యాచ్కు ముందు జింబాబ్వే (10-1-34-5), వెస్టిండీస్లపై (9.1-1-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మపాకా బుల్లెట్ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. మపాకా సంధించే బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మపాకా ప్రదర్శనల కారణంగా ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్ రేసులో ముందుంది. ఈ కుర్ర బౌలర్ ఇటీవలే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు కూడా సవాలు విసిరాడు. బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో మ్యాచ్లో మపాకా ఆరేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రిలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహీరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మపాకా ధాటికి 113 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. లంక ఇన్నింగ్స్లో షరుజన్ షణ్ముకనాథన్ (29) టాప్ స్కోరర్గా నిలిచాడు. మపాకాతో పాటు రిలే నార్టన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
సెంచరీల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
అండర్-19 వరల్డ్కప్లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయ జట్టుగా కొనసాగుతున్న భారత్.. నేపాల్తో ఇవాళ (ఫిబ్రవరి 2) జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్లోనూ చెలరేగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేసి ఔట్ కాగా.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్న చిచ్చరపిడుగు ముషీర్ ఖాన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ షా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ చాంద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే యువ భారత్ దర్జాగా సెమీస్కు చేరుకుంటుంది. ఇవాళే జరుగుతున్న మరో రెండు సూపర్ సిక్స్ మ్యాచ్ల్లో సౌతాఫ్రికా-శ్రీలంక, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రీలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహిరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. విండీస్తో జరుగుతున్న మరో సూపర్ సిక్స్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సామ్ కొన్స్టాస్ (108) సెంచరీతో కదంతొక్కాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ 3, థోర్న్ 2 వికెట్లు పడగొట్టారు. -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్కప్లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్కప్లో తాను ఆడిన ప్రతి షాట్ను ఎంతో కాన్ఫిడెంట్గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ముషీర్తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్మన్గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్కప్ ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్లో (ఫిబ్రవరి 2) నేపాల్ను ఢీకొంటుంది. -
టీమిండియా ప్రపంచ రికార్డు
భారత యువ జట్టు అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో ఏ జట్టు సాధ్యం కాని ఓ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా యువ భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్లో యంగ్ ఇండియా తొలుత గ్రూప్ మ్యాచ్లో ఐర్లాండ్పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అనంతరం గ్రూప్ మ్యాచెస్లో భాగంగానే యూఎస్ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీని తర్వాత సూపర్ సిక్స్ దశ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్లో (ఫిబ్రవరి 2) నేపాల్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత్ అధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. కాగా, ఈ టోర్నీలో యువ భారత్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ (సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు) లీడింగ్ రన్ స్కోరర్గా (4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 325 పరుగులు) కొనసాగుతుండగా.. బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే లీడింగ్ వికెట్ టేకర్గా (4 మ్యాచ్ల్లో 12 వికెట్లు) కొనసాగుతున్నాడు. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్కప్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్కప్లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయిన ముషీర్ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్లో భారత్.. నేపాల్తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
‘బుమ్రా గొప్పొడే కానీ...’
సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సఫారీ స్పీడ్స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 17 ఏళ్ల మఫాకాకు వరించింది. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో మఫాకా వికెట్ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. వికెట్ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలో ప్రపంచ కప్కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను. అందుకే బుమ్రా సెలబ్రేషన్స్ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
న్యూజిలాండ్ తరఫున సెంచరీ బాదిన విజయవాడ కుర్రాడు
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్లో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్ భారత్ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్ సెంచరీ చేసింది న్యూజిలాండ్ తరఫున. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహిత్లా న్యూజిలాండ్కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో స్నేహిత్తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒలివర్ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్నేహిత్ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ సాధన అంతా న్యూజిలాండ్లో జరిగింది. కుడి చేతి బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన స్నేహిత్ న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్లో సెన్సేషన్గా మారింది. స్నేహిత్ ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్లను అమితంగా ఇష్టపడతాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అండర్ 19 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నేపాల్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. స్నేహిత్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్నేహిత్తో పాటు కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (75) రాణించాడు. భారత్లో పుట్టిన మరో కివీస్ క్రికెటర్ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. -
సౌతాఫ్రికా సిరీస్, 2024 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది (2024) జరిగే అండర్ 19 వరల్డ్కప్ కోసంభారత యువ జట్టును ఇవాళ (డిసెంబర్ 12) ప్రకటించారు. వరల్డ్కప్తో పాటు దానికి ముందు సౌతాఫ్రికాలోనే జరిగే ట్రై సిరీస్కు కూడా సెలెక్టర్లు ఇవాళే ఉమ్మడి జట్టును ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్గా ఉదయ్ సహరన్, వైస్ కెప్టెన్గా సౌమీ కుమార్ పాండేను ఎంపిక చేశారు. రెగ్యులర్ జట్టుతో పాటు ట్రావెలింగ్ స్టాండ్ బైలు, బ్యాకప్ ప్లేయర్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. మొత్తంగా 22 మంది సభ్యుల జంబో బృందాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 మధ్య జరిగే వరల్డ్కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడనుంది. మెగా టోర్నీకి ముందు యంగ్ ఇండియా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రై సిరీస్ ఆడుతుంది. ఈ టోర్నీ డిసెంబర్ 29న మొదలై వచ్చే ఏడాది జనవరి 10 వరకు సాగుతుంది. ట్రయాంగులర్ సిరీస్, అండర్ 19 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టు.. ఉదయ్ సహరన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అరవెల్లి అవినాశ్ రావ్ (వికెట్కీపర్), ఇన్నేశ్ మహాజన్ (వికెట్కీపర్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ ధాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, మురుగన్ అభిషేక్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారి ట్రై సిరీస్కు ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్స్.. ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయ్, మొహమ్మద్ అమాన్ బ్యాకప్ ప్లేయర్స్.. దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విజ్ఞేశ్, కిరణ్ చోర్మలే -
అండర్ 19 వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్ 2024 షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి. 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. -
శ్రీలంక క్రికెట్కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్కప్ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది శ్రీలంకలో జరిగే అండర్ –19 ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. 18 ఏళ్ల తర్వాత ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్లో జనవరి 13న జింబాబ్వేతో ఆతిథ్య శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గోనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్-సిక్స్లో ప్రదర్శన ఆధారంగా మళ్లీ రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడతాయి. ఈ రెండు గ్రూపుల్లో మొత్తం 12 జట్లు ఉంటాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీస్ నుంచి రెండు జట్లు ఫైనల్కు చేరుతాయి. ఫిబ్రవరి 4న కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 14న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 'ఢీ' కొంటుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉండగా, గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘సి’లో ఆస్ట్రేలియా, జింబాబ్వే, నమీబియా, ఆతిథ్య శ్రీలంక, గ్రూప్ ‘డి’లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఉన్నాయి. చదవండి: World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్మనీ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..! -
అండర్–19 మహిళల టీ20 వరల్డ్కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
మహిళల క్రికెట్ జట్టు వరల్డ్కప్ సాధించడంపై సీఎం జగన్ హర్షం
తాడేపల్లి: భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు టీ 20 వరల్డ్కప్ సాధించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి వరల్డ్కప్ను సొంతం చేసుకున్న భారత జట్టును సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ విజయాల పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. కాగా, తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 29) జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. 69 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్కు చేరగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్, అలెక్సా స్టోన్హౌస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రకు న్యాయం చేశారు. టీ20 ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్కప్ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్!
తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. సెన్వెస్ పార్క్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 7వికెట్ల తేడాతో చిత్తు చేసి జగ్జేతగా భారత్ అవతరించింది. 69 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ (15), గొంగడి త్రిష (24),సౌమ్య తివారి (23) పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 68 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. అర్చన సూపర్ క్యాచ్.. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెటర్ అర్చన దేవి సంచలన క్యాచ్తో మెరిసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన పార్షవి చోప్రా బౌలింగ్లో రియానా మెక్డొనాల్డ్ మిడ్-ఆఫ్ దిశగా షాట్ ఆడింది. ఈ క్రమంలో మిడ్-ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న అర్చన కుడివైపుకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అంందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Archana Devi takes a splendid one-handed blinder with a full length dive to dismiss Ryana. The fielding has been top class by Team India. Watch #INDvENGFinalOnFanCode https://t.co/T4vX72TcLA . .#U19T20WorldCup #TeamIndia #INDvENG pic.twitter.com/nUPQxopaAx — FanCode (@FanCode) January 29, 2023 -
మన అమ్మాయిలదే ‘ప్రపంచం’
మన అమ్మాయిలు అదరగొట్టారు... అద్భుతమైన ఆటతో ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన మహిళా బృందం చివరకు అగ్రభాగాన నిలిచింది... సీనియర్ స్థాయిలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ గెలవని నిరాశను దూరం చేస్తూ ‘యువ’బృందం చిరస్మరణీయ ఫలితాన్ని సాధించింది. తొలిసారి నిర్వహించిన అండర్–19 ప్రపంచకప్లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు. ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇంగ్లండ్ ఆట కట్టించిన మన బృందం జగజ్జేతగా అవతరించింది... మహిళల క్రికెట్లో కొత్త తరానికి ప్రతినిధులుగా దూసుకొచ్చిన అమ్మాయిలు మొదటి ప్రయత్నంలోనే శిఖరాన నిలిచి మన మహిళల క్రికెట్కు మంచి భవిష్యత్తు ఉందనే భరోసాను మరింత పెంచారు. పోష్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల తొలి అండర్–19 ప్రపంచకప్ విజేతగా భారత్ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్ –19పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్–19 వరల్డ్కప్ విజేత భారత్ కాగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా... ఇన్నింగ్స్లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (5) విఫలమైనా... గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్ సాధు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: స్క్రివెన్స్ (సి) త్రిష (బి) అర్చన దేవి 4; హీప్ (సి అండ్ బి) టిటాస్ సాధు 0; హాలండ్ (బి) అర్చన దేవి 10; సెరెన్ స్మేల్ (బి) టిటాస్ సాధు 3; ర్యానా మెక్డొనాల్డ్ (సి) అర్చన దేవి (బి) పార్శవి 19; పేవ్లీ (ఎల్బీ) (బి) పార్శవి 2; స్టోన్హౌస్ (సి) సోనమ్ (బి) మన్నత్ 11; గ్రోవ్స్ (రనౌట్) 4; బేకర్ (సి) రిచా ఘోష్ (బి) షఫాలి 0; సోఫియా స్మేల్ (సి అండ్ బి) సోనమ్ 11; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–16, 4–22, 5–39, 6–43, 7–53, 8–53, 9–68, 10–68. బౌలింగ్: టిటాస్ సాధు 4–0–6–2, అర్చనా దేవి 3–0–17–2, పార్శవి చోప్రా 4–0–13–2, మన్నత్ కశ్యప్ 3–0–13–1, షఫాలీ 2–0–16–1, సోనమ్ 1.1–0–3–1. భారత్ అండర్–19 ఇన్నింగ్స్: షఫాలీ (సి) స్టోన్హౌస్ (బి) బేకర్ 15; శ్వేత (సి) బేకర్ (బి) స్క్రివెన్స్ 5; సౌమ్య (నాటౌట్) 24; త్రిష (బి) స్టోన్హౌస్ 24; రిషిత (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69. వికెట్ల పతనం: 1–16, 2–20, 3–66. బౌలింగ్: బేకర్ 4–1–13–1, సోఫియా స్మేల్ 2–0–16–0, స్క్రివెన్స్ 3–0–13–1, గ్రోవ్స్ 2–0–9–0, స్టోన్హౌస్ 2–0–8–1, అండర్సన్ 1–0–10–0. -
తిప్పేసిన స్పిన్నర్లు.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
Under 19 Womens T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో విజేతగా నిలిచిన భారత్.. సూపర్ సిక్స్లో తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, మరుసటి మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుని శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. A thumping win for India as they move up in the Super 6 table 😍 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝: https://t.co/b2qCbfrjIX pic.twitter.com/PD9U2zJ59t — ICC (@ICC) January 22, 2023 ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు పర్శవి చోప్రా (4-1-5-4), మన్నత్ కశ్యప్ (4-1-16-2), అర్చనా దేవీ (4-0-15-1) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి లంకేయులను తిప్పేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్శవి, మన్నత్, అర్చనాతో పాటు టిటాస్ సాధు (3-0-10-1) ఓ వికెట్ పడగొట్టగా.. సోనమ్ యాదవ్ (3-0-7-0), షెఫాలీ వర్మ (2-0-6-0) వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్ చేశారు. A solid bowling performance from India led by Parshavi Chopra's economical spell 🙌 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 https://t.co/b2qCbfrjIX pic.twitter.com/oRj6gKtDXz — ICC (@ICC) January 22, 2023 అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (13), రిచా ఘోష్ (4) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. -
టీమిండియాకు తొలి ఓటమి
ICC U19 Womens T20 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2023లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జనవరి 21) ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలై, సెమీస్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలగా, ఆసీస్ 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. భారత ఇన్నింగ్స్లో శ్వేత సెహ్రావత్ (21) టాప్ స్కోరర్గా నిలువగా.. హ్రిషిత బసు (14), టిటాస్ సాధు (14)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో సియన్నా జింజర్ 3 వికెట్లు పడగొట్టగా.. మిల్లీ ఇల్లింగ్వర్త్, మ్యాగీ క్లార్క్ తలో 2 వికెట్లు, కెప్టెన్ రైస్ మెక్కెన్నా, ఎల్లా హేవర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో క్లెయిర్ మూర్ (25), ఆమీ స్మిత్ (26) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో టిటాస్ సంధూ, అర్చనా దేవీ, సోనమ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, రువాండ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరుకుంటాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో రేపు (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది. కాగా, మహిళ అండర్-19 విభాగంలో టీ20 వరల్డ్కప్ జరగడం ఇదే తొలిసారి. -
‘సూపర్ సిక్స్’ దశకు భారత్ అర్హత
బెనోని (దక్షిణాఫ్రికా): తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో భారత్ 85 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్గా నిలిచి సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టీమిండియాకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి, గొంగడి త్రిష (51 బంతుల్లో 59; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా ఘోష్ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు) కూడా రాణించింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. భారత బౌలర్లు మన్నత్ కశ్యప్ (4/12), అర్చన దేవి (3/14), సోనమ్ యాదవ్ (2/1) స్కాట్లాండ్ను దెబ్బ తీశారు. చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు -
హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు
హైదరాబాద్ టీనేజ్ క్రికెటర్ సొప్పదండి యషశ్రీకి అండర్–19 టి20 ప్రపంచకప్లో ఆడే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. అయితే భారత జట్టుకు ఎంపికైన హర్లీ గాలా గాయంతో టోర్నీకి దూరమైంది. దీంతో మెగా టోర్నీ సన్నాహక సిరీస్ ఆడేందుకు వెళ్లి అక్కడే ఉన్న యషశ్రీతో ఆమె స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు. యషశ్రీ ఎంపికను ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ టోర్నీలో నేడు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్తో తలపడుతుంది. చదవండి: India open 2023: సింధు ఇంటికి... సైనా ముందుకు -
టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. యూఏఈపై భారీ విజయం
ICC U19 Women T20 WC 2023: తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఖంగుతినిపించిన భారత అమ్మాయిలు.. ఇవాళ (జనవరి 16) యూఏఈతో జరిగిన మ్యాచ్లో 122 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఫలితంగా 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచారు. యూఏఈతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్ల) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (5 బంతుల్లో 11; 2 ఫోర్లు) భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా.. సోనియా మెంధియా 2 పరుగులతో నాటౌట్గా నిలిచింది. యూఏఈ బౌలర్లలో ఇందుజ నందకుమార్, మహిక గౌర్, సమైరా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు షబ్నమ్ (1/21), టిటాస్ సాధు (1/14), మన్నత్ కశ్యప్ (1/14), పర్శవి చోప్రా (1/13) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులకు మాత్రమే పరిమితమైంది. యూఏఈ ఇన్నింగ్స్లో లావణ్య కెనీ (24), తీర్థ సతీష్ (16), మహిక గౌర్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ భారత ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో (జనవరి 18) స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
బెనోని: తొలి అండర్–19 టి20 ప్రపంచకప్ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల టీమ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి వాన్ రెన్స్బర్గ్ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్ లోరెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్స్ బాదింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్ ల్యాండ్స్మన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), కెప్టెన్ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది. గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్కు గెలుపు సులువైంది. ఓపెనర్ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. -
సౌతాఫ్రికా టీ20 లీగ్పై కన్నేసిన భారత అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్
భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ (2012) ఉన్ముక్త్ చంద్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకాబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్లో (ఎస్ఏ20) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఉన్ముక్త్.. సెప్టెంబర్ 19న జరిగే ఎస్ఏ20 లీగ్ వేలం కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్.. ఎస్ఏ20 లీగ్ వేలంలో కూడా అమ్ముడుపోతే, అక్కడ ఆడబోయే తొలి భారత క్రికెటర్గానూ రికార్డు నెల్పుతాడు. కాగా, 2012 వరల్డ్ కప్ విజయం తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఉన్ముక్త్.. ఆతర్వాత క్రమంగా అవకాశాలు కనుమరుగు కావడంతో భారత్ను వదిలి అమెరికాకు వలస పోయాడు. అక్కడ యూఎస్ మైనర్ క్రికెట్ లీగ్లో పాల్గొన్న ఉన్ముక్త్.. బిగ్ బాష్ లీగ్ 2022లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అవకాశం రావడంతో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. ఉన్ముక్త్ 2024 టీ20 వరల్డ్కప్లో యూఎస్ఏ తరఫున ఆడాలని ఆశిస్తున్నాడు. ఉన్ముక్త్ 2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయమైన 111 పరుగులు చేసి, యువ భారత్ను జగజ్జేతగా నిలబెట్టాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన ఉన్ముక్త్.. ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక అక్కడి నుంచి కూడా ఔటయ్యాడు. చదవండి: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..! -
టీమిండియా క్రికెటర్లకు అవమానం.. వ్యాక్సిన్ వేసుకోలేదని..!
ICC U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత యువ జట్టుకు కరీబియన్ గడ్డపై అవమానం జరిగినట్లు తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు ఒక రోజంతా అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. అంతటితో ఆగకుండా ఆ ఏడుగురు ఆటగాళ్ల(రవికుమార్, రఘువంశీ తదితరులు)ను తిరిగి భారత్కు వెళ్లిపోవాలని ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరించారని, భారత ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని బెదిరించారని బాంబు పేల్చాడు. భారత్లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులకు వినలేదని, ఆ ఏడుగురిని తర్వాతి ఫ్లయిట్లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. 24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఆటగాళ్లు మ్యాచ్ వేదిక అయిన గయానాకు చేరుకున్నారని పేర్కొన్నాడు. కాగా, అండర్ 19 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్లో అడుగు పెట్టిన భారత యువ జట్టు, రెండు మ్యాచ్ల తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జట్టులోని ఐదుగురు కీలక ప్లేయర్ల (కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ తదితరులు)తో పాటు అడ్మినిస్టేషన్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ యువ భారత క్రికెటర్లు ఏ మాత్రం తగ్గకుండా ఐదోసారి ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టించారు. చదవండి: ఈ ఫోటోలో విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..! -
Sheik Rashid: జగన్ సార్ నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు
సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): పేద కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో అవరోధాలన్నీ అధిగమించి అండర్–19 భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎదిగారు గుంటూరుకు చెందిన షేక్ రషీద్. ప్రపంచ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించిన ఆయన ఇటీవలే గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని తన ఇంటికి వచ్చారు. బుధవారం తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రషీద్ గురువారం తన అంతరంగాన్ని ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. సాక్షి : ప్రపంచ కప్ సాధించడంలో మీ పాత్ర మరువలేనిది. దీనిపై మీ స్పందన ఏమిటీ? రషీద్: ఏ క్రికెటర్కు అయినా ఇది ఓ అదృష్టమే. నాలాంటి వారికి మరీ ప్రత్యేకం. ముఖ్యంగా వెస్టిండీస్ లాంటి టఫ్ వికెట్పై ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కొని ఆడడం అంత సులభం కాదు. సాక్షి: ప్రపంచ కప్ పోటీల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు? రషీద్: వరల్డ్ కప్ ముందు నేను చాలెంజర్స్ ట్రోఫీ, ట్రయాంగిల్ సిరీస్ లాంటి అనేక టోర్నమెంట్లు ఆడి పెద్దపెద్ద బౌలర్లను ఎదుర్కొన్నా. దీనివల్ల వరల్డ్ కప్లో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ముఖ్యంగా నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ గురించి ఆలోచించను. ప్రతి బాల్నీ బాగా ఆడాలని అనుకుంటాను. సాక్షి : కరోనా వల్ల ప్రపంచ కప్లో కొన్ని మ్యాచ్లు ఆడలేదు కదా ఎలా ఫీలయ్యారు? రషీద్: ఇది చాలా దురదృష్టం. కరోనా బారిన పడినప్పుడు నాకు టెస్ట్ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్తోపాటు, ఆంధ్రా క్రికెటర్లు జ్ఞానేశ్వర్, వేణుగోపాల్, కోచ్ కృష్ణారావుతోపాటు, ఎంతో మంది రోజూ ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. ఆ స్ఫూర్తితో కోలుకున్న వెంటనే సెమీస్లో 94, ఫైనల్స్లో 50 పరుగులు చేయగలిగాను. అండగా నిలిచిన క్రికెటర్లందరికీ ధన్యవాదాలు సాక్షి: పెద్ద మొత్తం నగదు రూపంలో అందుతోంది. ఏం చేద్దామనుకుంటున్నారు? రషీద్: వరల్డ్ కప్ గెలిచిన వెంటనే బీసీసీఐ రూ.40 లక్షలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.10 లక్షలతోపాటు, మరికొంత ఇచ్చింది. ఈమొత్తాలను నా కుటుంబ సభ్యుల అవసరాలతోపాటు, భవిష్యత్తు క్రికెట్ అవసరాలకు వినియోగిస్తాను. ఈ మొత్తం నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక చేయూతను ఇచ్చిందనే చెప్పాలి. సాక్షి: ముఖ్యమంత్రిని కలవడం ఎలా అనిపించింది? రషీద్: చెప్పేందుకు మాటలు సరిపోవు. మా తండ్రి బాలీషాకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. జగన్ సార్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. నువ్వు బాగా ఆడితే జగన్ సార్ వద్దకు తీసుకెళతానని చాలా సార్లు చెప్పారు. జగన్ సార్ను చూడాగానే నాకు నోట మాటరాలేదు. ఆయన నా భుజంపై చేయి వేసి ఆట గురించి అడగడం, నేను చెప్పడం అన్నీ కలలాగా అయిపోయాయి. జగన్ సార్ నాకు రూ.10 లక్షల చెక్తోపాటు గుంటూరులోనే నివాస స్థలం, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. సాక్షి : భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? రషీద్: మన ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్లు ఆడడానికి గురువారం ఉదయం కేరళ వెళుతున్నా. అక్కడ రంజీ మ్యాచ్లలో ఉత్తమ స్కోర్లు నమోదు చేయడంతోపాటు, మన జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఆ తరువాత పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ ముఖ్యంగా మీడియాకు కృతజ్ఞతలు. సాక్షి: మీ విజయం వెనుక రహస్యం ఏమిటి? రషీద్: ఇది చెప్పడం చాలా కష్టం. నేను పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నన్ను అక్కున చేర్చుకుని కోచ్ కృష్ణారావు ఓనమాలు నేర్పిన దగ్గర్నుంచి నా కుటుంబ సభ్యులతోపాటు, ఎందరో సహాయసహకారాలు అందించారు. 130 కోట్లు జనాభా ఉన్న మనదేశంలో భారత సీనియర్ జట్టులో స్థానం పొందే రోజుకోసం ఎదురు చూస్తున్నాను. ఈ దేశానికి ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. -
టీమిండియాలో కీ ప్లేయర్ కావాలనేది లక్ష్యం: షేక్ రషీద్
-
'సచిన్ నాకు స్ఫూర్తి.. టీమిండియాలో కీ ప్లేయర్ కావాలనేది లక్ష్యం'
క్రికెట్లో తనకు స్ఫూర్తి సచిన్ టెండూల్కర్ అని, అతనిలా ఆడాలన్నదే తన కోరిక అని భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్లో కీలకం కావాలనేది తన ఆశయమని తెలిపాడు.బుధవారం సీఎంను కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియా పాయింట్ వద్ద రషీద్ విలేకరులతో మాట్లాడాడు. అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని, సీనియర్ వరల్డ్ కప్లో ఆడాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు. సీనియర్ ఆటగాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తానన్నాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి షేక్ బాలీషా కష్టపడుతూ తనకు అన్ని విధాలా మంచి సపోర్ట్ ఇచ్చారన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్పై అంతగా ఆలోచన లేదని, రంజీ ట్రోఫీలో బాగా ఆడాలని అనుకొంటున్నానని తెలిపాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. ఇంకా బాగా ఆడాలని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అంతకముందు షేక్ రషీద్కు ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు. -
Shaikh Rasheed: సీఎం వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా
Under 19 Vice Captain Shaikh Rasheed Likely To Meet AP CMYS Jagan Mohan Reddy- విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు భారత క్రికెట్ అండర్–19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తెలిపారు. అహ్మదాబాద్లో బీసీసీఐ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న రషీద్ అక్కడి నుంచి విజయనగరం వెళుతూ గురువారం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. అండర్–19 వరల్డ్ కప్లో చక్కగా రాణించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మరో వారంలోనే రంజీ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్ర జట్టు అంతా ఇప్పటికే తిరువనంతపురం బయలుదేరి వెళ్లింది. అయితే తాను ప్రస్తుత రంజీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో ఆడటం లేదని, ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి, వారి ఆశీస్సులు తీసుకుని నేరుగా రెండో మ్యాచ్ ఆడటానికి తిరువనంతపురం వెళ్తానని రషీద్ తెలిపారు. అప్పటి వరకు విజయగనరంలోని ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు వెళ్తున్నట్లు వివరించారు. అనంతరం రషీద్ ట్యాక్సీలో విజయనగరం బయలుదేరి వెళ్లారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
18 నెలల్లో టీమిండియాలోకి వస్తా.. యశ్ ధుల్
అండర్-19 ప్రపంచకప్లో యంగ్ ఇండియాను జగజ్జేతగా నిలబెట్టి, రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన యశ్ ధుల్.. టీమిండియాలో చోటు సంపాదించేందుకు తనకు తాను టార్గెట్ను సెట్ చేసుకున్నానని తెలిపాడు. మరో 18 నెలల్లో టీమిండియాకు తప్పక ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ టార్గెట్ను రీచ్ కాని పక్షంలో మరింతగా శ్రమిస్తానని, భారత జట్టులో స్థానం సంపాదించడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, ఇందుకు తన కుటుంబ సభ్యులు కూడా ప్రిపేరై ఉన్నారని వెల్లడించాడు. ఢిల్లీ రంజీ జట్టు నుంచి పిలుపు అందుకున్న అనంతరం ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధుల్ ఈ విషయాలను ప్రస్తావించాడు. టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా ఆరాధిస్తానని, అతని అనువనువును రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పిన ధుల్.. కోహ్లి తరహాలోనే తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటానని తెలిపాడు. ప్రపంచకప్ విజయానంతరం తనపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఒత్తిడికి లోనవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదని, దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, లక్ష్యం దిశగా సాగడంపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచాక కోహ్లితో ఓసారి మాట్లాడానని, అతను తన అండర్-19 ప్రపంచకప్ అనుభవాలను తనతో పంచుకున్నాడని చెప్పాడు. వరల్డ్ కప్ విజయానంతరం సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నామని, సొంతగడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతున్నానని, కొద్ది రోజులు విరామం తీసుకుని రంజీ ప్రాక్టీస్లో పాల్గొంటానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్ల తర్వాత భారత అండర్-19 జట్టును విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్గా యశ్ ధుల్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. వీరిలో కోహ్లి కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగా, ఉన్ముక్త్ చంద్ మాత్రం ఆశించిన ప్రదర్శన కనబర్చలేక కనుమరుగైపోయాడు. చదవండి: IPL 2022 : బ్యాడ్ న్యూస్.. వార్నర్ సహా పలువురు స్టార్ క్రికెటర్లు దూరం..? -
IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు
Under 19 World Cup Winners Spotted At Narendra Modi Stadium: భారత్-విండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు ప్రత్యేక అతిధులు వచ్చారు. అండర్-19 ప్రపంచకప్ విజేతలైన యువ భారత జట్టు సభ్యులు బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ల ఆటను వీక్షించేందుకు బీసీసీఐ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జగజ్జేతలతో పాటు జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షాలు స్టేడియంలో కాసేపు మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. We all are in Ahemdabad 😊 |U-19 players 🇮🇳 #BoysInBlue #ICCUnder19WorldCup #IndianCricketTeam #INDvWI pic.twitter.com/COR14eCBaM — Harnoor Singh 🇮🇳 (@HarnoorSingh40) February 9, 2022 టీమిండియా బ్యాటింగ్ సమయంలో బౌండరీలు వచ్చినప్పుడు వీరు జాతీయ పతాకాన్ని ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రపంచకప్ విజేతలైన యంగ్ ఇండియా సభ్యులకు బీసీసీఐ సన్మానం చేసింది. కాగా, ఆంటిగ్వా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించి ఐదో సారి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, విండీస్తో రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్ తడబడుతుంది. 38 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగలు చేసింది. విండీస్ గెలుపుకు 72 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: 9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..! -
స్వదేశంలో యశ్ ధుల్ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు
U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 టైటిల్ కైవసం చేసుకున్న యువ భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణాంతరం యశ్ ధుల్ సేన ఇవాళ ఉదయం బెంగళూరుకు రీచ్ అయ్యింది. యువ ఛాంపియన్లు సొంతగడ్డపై ల్యాండ్ కాగానే అభిమానుల అరుపులు, కేరింతలతో విమానాశ్రయం హోరెత్తాంది. అభిమానుల ఆదరణ చూసి టీమిండియా క్రికెటర్లు ఉబ్బితబ్బి బ్బి పోయారు. భారత యువ జట్టు బుధవారం బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన వేడుక కోసం బెంగళూరు నుంచి నేరుగా అహ్మదాబాద్కు వెళ్లనుంది. కాగా, గడిచిన ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ టైటిల్ పోరులో యంగ్ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి ఐదో సారి ప్రపంచకప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 2 బంతులు మిగిలుండగానే చేధించింది. నిషాంత్ సింధు(50 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చగా.. షేక్ రషీద్(50), రాజ్ బవా(35) రాణించారు. అంతకుముందు యంగ్ ఇండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: మెగావేలానికి మరో నాలుగు రోజులే.. జేసన్ రాయ్ విధ్వంసం -
Virat Kohli: "ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా ఏంటి..?"
U19 Bowler Ravi Kumar Vs Virat Kohli: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన యువ భారత జట్టులో కీలక ఆటగాడైన రవికుమార్.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మెగా ఫైనల్కు ముందు జరిగిన ఓ సంభాషణ సందర్భంగా కోహ్లి తనకి కౌంటరిచ్చాడని రవికుమార్ పేర్కొన్నాడు. ఫైనల్కు ముందు జట్టులో స్ఫూర్తినింపేందుకు వీడియో కాల్ మాట్లాడిన కోహ్లిని తాను ఓ చిరాకు తెప్పించే ప్రశ్న అడిగానని, అందుకు కోహ్లి తనదైన స్టైల్లో ఫన్నీగా సమాధానమిచ్చాడని రవికుమార్ చెప్పుకొచ్చాడు. తాను కోహ్లిని బ్యాటింగ్ బలహీనత గురించి అడగ్గా, అందుకు అతను బదులిస్తూ.. "ఎందుకు.. ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా..?" అంటూ ఫన్నీగా కౌంటరిచ్చాడని రవికుమార్ తెలిపాడు. కాగా, ఇంగ్లండ్తో జరిగిన అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో రవికుమార్ 4 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే, రవికుమార్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తాను బౌలర్ అయినప్పటికీ.. తన ఆరాధ్య క్రికెటర్ ధోని అని, ఫేవరెట్ బౌలర్ విషయానికొస్తే.. ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ని అమితంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో తప్పక అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల రవికుమార్.. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కోచ్ సలహా మేరకు యూపీ నుంచి బెంగాల్కు వలస వెళ్లాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా రవికుమార్లాగే గతంలో యూపీ నుంచి బెంగాల్కు వలస వెళ్లి స్టార్ బౌలర్గా ఎదిగాడు. చదవండి: Virat Kohli: కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు.. ఆ ఓటమి ఇప్పటికీ బాధిస్తుంది..! -
కోహ్లి బ్యాటింగ్, ధోని కెప్టెన్సీ స్కిల్స్ కలగలిపితే యశ్ ధుల్..
అండర్ 19 ప్రపంచకప్ 2022లో యువ భారత జట్టును అద్భుతంగా ముందుండి నడిపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా రాణించి, టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన యశ్ ధుల్పై అతని వ్యక్తిగత కోచ్ రాజేశ్ నగార్ ప్రశంసల వర్షం కురిపించాడు. యశ్ ధుల్ సాధించిన ఈ ఘనత తనకెంతో గర్వకారణమని, కరీబియన్ దీవుల నుంచి అతని రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. జట్టును గెలిపించడం కోసం యశ్ ఆకలిగొన్న పులిలా ఉంటాడని, అతను కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్ సాధిస్తాడని తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 జట్టు చాలా బలమైన జట్టు అని, ఈ జట్టుతో యశ్ అద్భుతాలు చేస్తాడని ముందే ఊహించానని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సందర్భంగా రాజేశ్ నగార్.. యశ్ ధుల్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. యశ్.. తన స్కూల్ డేస్ నుంచి విరాట్ కోహ్లికి వీరాభిమాని అని, కోహ్లి బ్యాటింగ్ను రెగ్యులర్ ఫాలో అవుతూ అమితంగా ఆరాధించేవాడని, విరాట్ లాంటి క్రికెటర్గా తయారవ్వడమే అతని లక్ష్యంగా ఉండేదని తెలిపాడు. కోహ్లిలా బ్యాటింగ్ చేయడం కోసం యశ్ ఎంతో కష్టపడ్డాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్ చూస్తే అచ్చం కోహ్లి బ్యాటింగ్ చూసినట్టే ఉంటుందని గర్వపడుతూ చెప్పుకొచ్చాడు. యశ్లో సమర్ధవంతమైన నాయకుడు కూడా ఉన్నాడని, అతని కెప్టెన్సీ స్టైల్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని పోలి ఉంటుందని తెలిపాడు. ఇదిలా ఉంటే, అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించిన యువ భారత జట్టు ఐదో ప్రపంచకప్ టైటిల్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్(50), రాజ్ బవా(35) రాణించారు. అంతకుముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చదవండి: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా? -
రషీద్ కెరీర్ కోసం ఇంకెన్ని త్యాగాలకైనా మేము సిద్ధం.. మాకు అండగా నిలిచింది వాళ్లే!
U 19 World Cup- Shaik Rasheed Parents Comments: సత్తా ఉంటే సమస్యలు అడ్డంకిగా మారవని ... పట్టుదల ఉంటే పైపైకి దూసుకుపోవచ్చని షేక్ రషీద్ నిరూపించాడు. అండర్–19 ప్రపంచకప్లో సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఫైనల్లోనూ కీలక అర్ధ సెంచరీతో జట్టును విజయం దిశగా నడిపించాడు. ఏసీఏ అండదండలతో... రషీద్ తండ్రి బాలీషా ప్రైవేట్ ఉద్యోగి. స్వస్థలం ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామం. చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ టోర్నీల్లో ఆడుతూ వచ్చాడు. అయితే 2014లో కుటుంబం మళ్లీ గుంటూరుకు తిరిగొచ్చింది. ఇక్కడికి వచ్చాక రషీద్ ప్రతిభను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గుర్తించింది. అతనికి క్రికెట్ పరంగా పూర్తి సౌకర్యాలు కల్పించడంతో పాటు చదువు బాధ్యత కూడా తీసుకొని మంగళగిరి అకాడమీలో తీసు కుంది. మరోవైపు తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... తండ్రిగా బాలీషా తన కొడుకుకు అండగా నిలవడంలో ఎక్కడా వెనుకాడలేదు. ఈ క్రమంలో ఆర్థికపరంగా ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఆటగాడిగా రషీద్ పురోగతి తల్లి దండ్రులకు సంతోషపెట్టింది. అకాడమీలో ఏసీఏ కోచ్ కృష్ణారావు శిక్షణ, ఏసీఏ సభ్యుడు ఎన్.సీతాపతిరావు చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఈ చిన్నోడికి కలిసొచ్చింది. ప్రతిభకు తోడు పట్టుదలతో తన ఆటకు అతను మరింత మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కో మెట్టే ఎక్కుతూ... అకాడమీలో శిక్షణ తీసుకుంటూ 11 ఏళ వయస్సు లోనే అండర్–14 జిల్లా జట్టుకు ఎంపికై చక్కని ఆటతీరును ప్రదర్శించడంతో రషీద్కు ఆంధ్ర జట్టులో స్థానం లభించింది. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. నిలకడైన ప్రదర్శనతో వరుసగా అన్ని వయోవిభాగాల్లోనూ రషీద్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఆటను మరింత మెరుగుపర్చు కుంటున్న దశలో ఏసీఏ ‘క్రికెట్ బియాండ్ బౌండరీస్’ కార్యక్రమం అతనికి ఎంతో మేలు చేసింది. దీని ద్వారా రెండు నెలల పాటు ఇంగ్లండ్లో ప్రత్యేక శిక్షణ తీసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత అతను ఆటలో మరింత పదును పెరిగింది. ఈ ఏడాది వినూమన్కడ్ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్గా ఆడి 376 పరుగులు చేయడం, ఆ తర్వాత చాలెంజర్ ట్రోఫీలోనూ సత్తా చాటడంతో ఆసియా కప్ టీమ్లోకి రషీద్ ఎంపికయ్యాడు. అదే జోరులో అతనికి భారత వైస్ కెప్టెన్గా ప్రపంచ కప్ ఆడే అవకాశం కూడా దక్కింది. ఇప్పుడు దానిని కూడా రెండు చేతులా పూర్తిగా అందిపుచ్చుకున్న రషీద్ భవిష్యత్తు తారగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మా అబ్బాయి శ్రమ ఈ దేశానికి ఉపయోగపడాలి. భవిష్యత్లో అతను దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ అవ్వాలి. దాని కోసం మేము ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో రషీద్ కెరీర్పై ఆందోళన కలిగిన సమయంలో మాకు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అకాడమీ అండగా నిలిచింది. –రషీద్ తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
షేక్ రషీద్కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్లో భారత జట్టుకు స్టాండ్బై ప్లేయర్గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Shaikh Rasheed: 40 లక్షల నగదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా డబ్బుతో..
గుంటూరు స్పోర్ట్స్, సాక్షి: రికార్డుస్థాయిలో ఐదోసారి భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ పాత్ర కూడా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన 17 ఏళ్ల రషీద్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. భారత జట్టు జగజ్జేతగా నిలిచాక వెస్టిండీస్లో ఉన్న షేక్ రషీద్తో ఫోన్లో ‘సాక్షి’ ముచ్చటించింది. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ తన కెరీర్లో ఈ విజయం ఎంతో ప్రత్యేకమని, ఈ ఘనత చిరకాలం గుర్తుంటుందని వివరించాడు. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు ఎలా అనిపిస్తోంది? ముందుగా నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ విజయం నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా సెమీస్లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడం మరువలేనిది. బీసీసీఐ ప్రకటించిన నగదు పురస్కారంతో ఏం చేయబోతున్నారు? నేను మ్యాచ్లకు వెళ్ళే ప్రతిసారి నాకు ఆర్ధిక ఇబ్బందులుండేవి. డబ్బులు లేక నా కుటుంబం పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. అయితే చాలా మంది నాకు సహకారమందించారు. ఒక్కసారిగా ఇంత మొత్తం అందుతుందంటే నమ్మబుద్ది కావడంలేదు. వాస్తవానికి అంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు. మాకు ఇప్పటి వరకు చిన్న ఇల్లు కూడా లేదు. కొంత డబ్బు వెచ్చించి మా కుటుంబ సభ్యులకు చిన్న ఇల్లు కొంటాను. మిగతా డబ్బును నా కెరీర్ కోసం ఖర్చు చేస్తాను. స్టార్ ఇమేజ్ వచ్చిందనుకుంటున్నారా? ఎప్పటికీ అనుకోను. నా జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమయ్యిందో నాకు బాగా తెలుసు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని నా కోచ్లు, కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నాను. భవిష్యత్లో భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా కృషి చేస్తాను. ఔత్సాహిక క్రీడాకారులకు మీరిచ్చే సలహా? సలహాలిచ్చే స్థాయికి చేరుకోలేదు. అయితే కఠోర సాధనతోపాటు మనలోని లోపాలను నిత్యం అధిగమిస్తూ ఉండాలి. ప్రారంభంలో పేస్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడే వాడిని. దానిపై ఎక్కువ దృష్టి సారించి సాధన చేసాను. అందుకే ప్రపంచకప్లో రాణించాను. చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్మ్యాన్ -
అండర్ 19 వరల్డ్కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్తో ఉన్న లింక్ ఏంటి..?
అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో 5 వికెట్ల ప్రదర్శన(5/31)తో చెలరేగి, అనంతరం బ్యాట్(54 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్)తో కూడా రాణించి.. టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డాషింగ్ యంగ్ ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతను ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని భారత క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టగా, ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. రాజ్ బవా తండ్రి సుఖ్విందర్ బవా.. టీమిండియా మాజీ ఆల్రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్కు కోచ్గా వ్యవహరించాడన్న విషయం తెలిసింది. సుఖ్విందర్ పర్యవేక్షణలో యువరాజ్ అండర్ 19 ప్రపంచకప్ 2000లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. రాజ్బవా తాత సర్దార్ తర్లోచన్ సింగ్ బవా కూడా భారత క్రీడారంగంతో సంబంధం ఉంది. తర్లోచన్ సింగ్ బవా, 1948 లండన్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. యాదృచ్చికంగా ఆ ఒలింపిక్స్లో తర్లోచన్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన భారత హాకీ జట్టు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించి స్వర్ణం నెగ్గగా.. తాజాగా మనవడు రాజ్ బవా కూడా ఫైనల్లో ఇంగ్లండ్పైనే చెలరేగి టీమిండియాకు అండర్-19 వరల్డ్కప్ అందించాడు. కాగా, రాజ్ బవా.. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లోనే కాకుండా టోర్నీ ఆధ్యాంతం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 6 వన్డేల్లో 9 వికెట్లతో పాటు 252 పరుగులు చేసి ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇందులో బవా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు సౌతాఫ్రికాపై (4/47) నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. అలాగే ఉగాండా(108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు)తో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతో పాటు బ్యాటింగ్లోనూ రాణించి 42 పరుగులు చేశాడు. చదవండి: తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్ -
అతనొచ్చాడు.. టీమిండియా ఆటగాళ్ల తలరాతలు మార్చాడు..!
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ గెలిచిన యువ భారత జట్టుపై నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా కుర్రాళ్లు గెలిచిన ఈ టైటిల్ చాలా ప్రత్యేకమని కొనియాడాడు. టోర్నీ మధ్యలో కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడినా, యువ భారత జట్టు ఏమాత్రం వెరవకుండా, మొక్కవోని ధైర్యంతో అద్భుత విజయాలతో టోర్నీని ముగించిందని ఆకాశానికెత్తాడు. ఆసియా కప్ టైటిల్ గెలిచిన నెలరోజుల్లోపే ప్రపంచకప్ టైటిల్ కూడా చేజిక్కించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సంబురపడిపోయాడు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, ఇతర సహాయక సిబ్బందిని అభినందించాడు. కాగా, రాహుల్ ద్రవిడ్ అనంతరం ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్(వెరి వెరి స్పెషల్) లక్ష్మణ్.. పగ్గాలు చేపట్టిన తొలి నాటి నుంచే యువ ఆటగాళ్లపై తనదైన ముద్రను వేశాడు. అతని పర్యవేక్షనలో యంగ్ ఇండియా ఆటగాళ్లు రాటుదేలారు. యువ భారత జట్టు ఎక్కడికి వెళ్లినా లక్ష్మణ్ కూడా జట్టుతో పాటే ఉండి, ఆటగాళ్లను దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు. ప్రస్తుత ప్రపంచకప్ వేదిక అయిన కరీబియన్ దీవులకు సైతం లక్ష్మణ్ వెళ్లి యువ జట్టులో ధైర్యం నింపాడు. ఫలితంగా అతని పర్యవేక్షణలో యువ భారత జట్టు నెల వ్యవధిలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, దాదాపు 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన లక్ష్మణ్.. ఒక్క వరల్డ్కప్ మ్యాచ్ కూడా ఆడకుండానే యువ జట్టు మార్గనిర్దేశకుడిగా అద్బుతాలు చేస్తున్నాడు. చదవండి: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం -
ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన టీమిండియా ఫొటోలు
-
IPL2022 Auction: ఆ ఐదుగురిపై కన్నేసిన ఐపీఎల్ జట్లు..
5 U19 Players Who Could Be In Demand At IPL 2022 Auction: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత అండర్-19 జట్టు ఆటగాళ్లపై కనక వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ఐదుగురు యంగ్ ఇండియా కుర్రాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంచనా వేస్తున్నారు. యంగ్ ఇండియా నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు( యశ్ ధుల్, హర్నూర్ సింగ్, కుశాల్ తాంబే, అనీశ్వర్ గౌతమ్, రాజ్ అంగద్ భవ, రాజ్వర్థన్ హంగార్గేకర్, విక్కీ ఓస్వల్, వాసు వత్స్, పుష్పేంద్ర సింగ్ రాథోడ్) వేలం బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, వీరిలో జట్టు కెప్టెన్ యశ్ ధుల్, ఓపెనర్ హర్నూర్ సింగ్, ఆల్రౌండర్లు రాజ్ అంగద్ భవ, రాజ్వర్థన్ హంగార్గేకర్, స్పిన్ బౌలర్ విక్కీ ఓస్వల్ రికార్డు ధర పలకడం ఖాయమని గెస్ చేస్తున్నారు. వేలంలో షార్ట్ లిస్ట్ అయిన యంగ్ ఇండియా ఆటగాళ్లలో రాజవర్థన్ హంగార్గేకర్(30 లక్షలు) మినహా మిగిలిన 8 మంది రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు. కాగా, కరీబియన్ దీవులు వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ 2022లో యువ భారత ఆటగాళ్లు అదిరిపోయే రేంజ్లో రాణిస్తూ.. జట్టును ఎనిమిదోసారి ప్రపంచకప్ టైటిల్ రేసులో నిలబెట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఇంగ్లండ్తో జరుగుతున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. చదవండి: IND Vs WI: ఓపెనర్గా పంత్.. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్..! -
ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ చాంపియన్స్గా భారత్
-
హోరా హోరీ పోరు.. టైటిల్ మనదే?
-
U19 WC: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం: యశ్ ధుల్
Under 19 World Cup Final India Vs England -Yash Dhull Comments: ‘‘జట్టులో స్టార్స్ అంటూ ఎవరూ లేరు. మేమంతా సమష్టిగా ఆడతాం. ఎవరో ఒక్కరు బాగా ఆడినంత మాత్రాన ఇదంతా సాధ్యం కాదు. ప్రతి ఆటగాడు రాణిస్తేనే గెలుపు అవకాశాలు పెరుగుతాయి. విజయాల్లో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. అలా ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇప్పుడు మా దృష్టి అంతా ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది’’ అని అండర్ 19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్ అన్నాడు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ తుదిమెట్టు వరకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. కాగా అండర్ 19 ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో యశ్ ధుల్ అద్భుత సెంచరీతో మెరవగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 94 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో కంగారూలను మట్టికరిపించి యువ భారత్ టోర్నీ ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇంగ్లండ్తో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశ్ ధుల్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ జట్టు చాలా బాగుంది. టోర్నీ ఆసాంతం వారు బాగా ఆడారు. ఈ మ్యాచ్లో హోరాహోరీ తప్పదు. సహజమైన ఆట తీరుతో ముందుకు సాగుతాం. వందుకు వంద శాతం కష్టపడతాం. ఇక ఫలితం ఎలా ఉంటుందో మ్యాచ్ తర్వాత మీరే చూస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్కప్ విజేత విరాట్ కోహ్లితో సంభాషణ గురించి చెబుతూ.. ‘‘మాకు విష్ చేయడానికి కోహ్లి కాల్ చేశాడు. బాగా ఆడుతున్నామని చెప్పాడు. గేమ్ ప్లాన్ గురించి మాట్లాడాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఆత్మవిశ్వాసం నింపాడు. సీనియర్లు ప్లేయర్ల మద్దతు లభించడం సంతోషకరం’’అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా కెప్టెన్గా, ఆటగాడిగా తన శక్తి మేరకు జట్టు, దేశం గెలుపు కొరకు కృషి చేస్తానని యశ్ ధుల్ వ్యాఖ్యానించాడు. భారత్కు ఐదో టైటిల్ అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నాడు. చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్దే విజయం Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! “There is no one star in the team, we play as a unit." India captain Yash Dhull speaks before their all-important #U19CWC 2022 Final against England 📽️ pic.twitter.com/Z46rQ2IHlp — ICC (@ICC) February 5, 2022 🗣️🗣️ "When a senior player speaks with the team, the team morale goes up." India U19 captain Yash Dull speaks about @imVkohli's interaction with the #BoysInBlue ahead of the #U19CWC 2022 Final. 👍#INDvENG pic.twitter.com/8c9zG90y2I — BCCI (@BCCI) February 5, 2022 -
U19 WC: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన నివేథన్.. ఆసీస్దే విజయం
Under 19 World Cup- Nivethan Radhakrishnan Super Innings: భారత సంతతి కుర్రాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ నివేథన్ రాధాకృష్ణన్ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టాడు. ఆల్రౌండ్ ప్రతిభతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్తో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ ఇషాక్(34 పరుగులు), కెప్టెన్ సులేమాన్ సైఫీ 37 పరుగులు, అహ్మద్ అహ్మద్జై 81 పరుగులతో రాణించడంతో 10 వికెట్ల నష్టానికి అఫ్గన్ 201 పరుగులు చేసింది. నివేథన్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ కాంప్బెల్ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన నివేథన్ రాధాకృష్ణన్ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయం ఎట్టకేలకు ఆసీస్నే వరించింది. రెండు వికెట్లు పడగొట్టడం సహా హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన నివేథన్ రాధాకృష్ణన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా సెమీ ఫైనల్ మ్యాచ్లలో భాగంగా అఫ్గన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడగా... ఆసీస్ను భారత్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, భారత్ తుదిపోరుకు అర్హత సాధించగా.. అఫ్గన్- ఆసీస్ మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. నివేథన్ అద్భుత ఇన్నింగ్స్తో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. స్కోర్లు: అఫ్గనిస్తాన్ అండర్-19 201 (49.2 ఓవర్లు) ఆస్ట్రేలియా అండర్-19 202/8 (49.1 ఓవర్లు) చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
U19 WC: 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. మన బౌలర్లు తక్కువేం కాదు!
U19 WC Final India Vs England:- నార్త్సౌండ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్లో ఐదో టైటిల్పై యువ భారత్ గురిపెట్టింది. టైటిల్ ఫేవరెట్గా కరీబియన్ వచ్చాక... తీరా అసలు మ్యాచ్లు మొదలయ్యాక కరోనా కలకలం రేపింది. అయినా సరే కుర్రాళ్ల పట్టుదల ముందు వైరస్ కూడా జట్టుపై ప్రభావం చూపలేక తోకముడిచింది. ఇప్పుడు అజేయంగా ఫైనల్కు వచ్చింది. ఎనిమిదో ఫైనల్లో ఐదో చాంపియన్షిప్పై కుర్రాళ్లంతా మనసు పెట్టారు. అందుకేనేమో భారత అండర్–19 జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎవరెదురైనా అదరగొట్టేస్తోంది. శనివారం వివి యన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీకి యువ భారత్ సిద్ధమైంది. ఆత్మవిశ్వాసంతో కుర్రాళ్లు వరుస విజయాలతో భారత కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. బౌలింగ్ దళం దుర్భేద్యంగా తయారైంది. అందువల్లేనేమో సెమీస్లో ఆస్ట్రేలియా ఆరంభంలోనే కంగారు పెట్టినా నిలకడైన బ్యాటింగ్తో కుదుటపడింది. తర్వాత చెలరేగింది. సెమీఫైనల్లో విఫలమైన ఓపెనర్లు అంగ్క్రిష్, హర్నూర్ సింగ్లు తుదిపోరులో జాగ్రత్తపడాలి. లోయర్ మిడిలార్డర్లో నిశాంత్, దినేశ్ వరకు జట్టులో మెరుపులు మెరిపించే సమర్థులు ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. నిశాంత్ బౌలింగ్లోనూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు రెగ్యులర్ బౌలర్లు రవికుమార్, కౌశల్, విక్కీలు శనివారం జరిగే ఆఖరి పోరులో సమష్టిగా జూలు విదిల్చితే అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఫైవ్స్టార్ జట్టుగా ఎదుగుతుంది. అజేయంగా ఇంగ్లండ్ భారత్లాగే ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరింది. గతంలో ఒక్కసారి (1998) మాత్రమే టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మళ్లీ ఇన్నేళ్లయినా తుదిమెట్టుపై నిలువలేదు. ఇన్నాళ్లకు వచ్చిన టైటిల్ అవకాశాన్ని జారవిడవద్దనే కసితో ఆ జట్టు ఉంది. తుది 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా ఇంగ్లండ్ను దుర్భేద్యమైన ప్రత్యర్థిగా మార్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్లతో తమకెదురైన ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ ఇక్కడికొచ్చింది. హాట్ ఫేవరెట్ భారత్పై గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్తో ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయమైంది. బ్యాటింగ్లో ఓపెనర్ జార్జ్ థామస్, కెప్టెన్ ప్రెస్ట్ సహా మిడిలార్డర్లో జార్జ్బెల్, అలెక్స్ హార్టన్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో బైడెన్, రేహన్ అహ్మద్, అస్పిన్వాల్ ప్రత్యర్థి బ్యాటర్స్కు సవాళ్లు విసురుతున్నారు. గత ఈవెంట్లో బంగ్లాదేశ్ చేతిలో ప్రపంచకప్ను కోల్పోయిన భారత్ ఈ సారి ఫలితాన్ని మార్చాలనుకుంటే సమవుజ్జీ అయిన ప్రత్యర్థిని పక్కావ్యూహంతో ‘ఢీ’ కొట్టాల్సి ఉంటుంది. జట్లు (అంచనా) భారత్ అండర్–19: యశ్ ధుల్ (కెప్టెన్) అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్వర్ధన్, నిశాంత్, దినేశ్, కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్. ఇంగ్లండ్ అండర్–19: టామ్ ప్రెస్ట్ (కెప్టెన్), థామస్, బెథెల్, జేమ్స్ ర్యూ, లక్స్టన్, జార్జ్ బెల్, రేహాన్ అహ్మద్, అలెక్స్ హార్టన్, సలెస్, అస్పిన్వాల్, జొషువా బైడెన్. చదవండి: అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్గా.. WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
U19 WC Final: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
U19 World Cup Final- India Vs Eng: అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్లోని అంటిగ్వా వేదికగా భారత్, ఇంగ్లండ్ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇప్పటికే భారత్ నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగనున్న ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి ఆరంభమవుతుంది, లైవ్ టెలికాస్ట్ తదితర అంశాలు మీకోసం.. ►అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్: ఫిబ్రవరి 5(శనివారం) ►వేదిక: అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆరంభం ►ప్రసారమయ్యే చానెల్: స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్స్, డిస్నీ+ హాట్స్టార్లోనూ లైవ్ స్ట్రీమింగ్ జట్లు: భారత్: యశ్ ధుల్(కెప్టెన్), హార్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్(వైస్ కెప్టెన్), నిషాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, దినేశ్ బనా(వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్(వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరేఖ్, కౌశాల్ తంబే, ఆర్ఎస్ హంగేర్కర్, వాసు వట్స్, విక్కీ ఒస్త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్. స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్. ఇంగ్లండ్: రెహాన్ అహ్మద్, టామ్ అస్పిన్వాల్, సోని బేకర్, నాథన్ బర్న్వెల్, జార్జ్ బెల్, జాకోబ్ బెథెల్, జోష్, బోయిడెన్, జేమ్స్ కోల్స్, అలెక్స్ హార్టన్, విల్ లక్స్టన్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్), జేమ్స్ రూ, జేమ్స్ సేల్స్, ఫతేహ్ సింగ్, జార్జ్ థామస్. రిజర్వు ప్లేయర్లు: జోష్ బేకర్, బెన్ క్లిఫ్. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. View this post on Instagram A post shared by ICC Cricket World Cup (@cricketworldcup) -
Shaik Rasheed: మనోడు సూపర్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
U 19 WC- India Shaik Rasheed: పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించాడు తెలుగు కుర్రాడు షేక్ రషీద్. క్రికెట్పై మమకారాన్ని పెంచుకున్న అతడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... తన కలను నెరవేర్చుకున్నాడు. అండర్-19 భారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగి సత్తా చాటాడు. ఆసియా వన్డే కప్ను యువ భారత్ సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు వరల్డ్కప్లోనూ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి... షేక్ రషీద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. తల్లిదండ్రులు షేక్ బాలీషా, జ్యోతి. రషీద్కు అన్నయ్య రియాజ్ ఉన్నాడు. రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రషీద్కు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఎండైనా.. వానైనా .. ఏదీ లెక్కచేసేవాడు కాదు. ప్రాక్టీసుకు వెళ్లాలంటే వెళ్లాల్సిందే! అతడికి తండ్రి షేక్ బాలీషా ప్రోత్సాహం లభించింది. ప్రైవేటు ఉద్యోగి అయిన బాలీషా మధ్య తరగతి కష్టాలు దాటుకుంటూనే... కుమారుడి అభీష్టాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగారు. రషీద్లోని ప్రతిభను గుర్తించిన బాలీషా స్నేహితుడు... తనను ప్రోత్సాహిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన మాటలు విని సంతోషించారు. కానీ.. అందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనసు చిన్నబుచ్చుకున్నారు. ఇంటి అద్దె కట్టడమే కష్టమైన సమయంలో క్రికెట్ ట్రెయినింగ్కు పంపడం అంటే మాటలా మరి! అయినా.. ఆయన ధైర్యం చేశారు. కొడుకు కోసం గుంటూరుకు మకాం మార్చారు. తన లోకమే క్రికెట్.. అక్కడికి వెళ్లాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలాంటి సమయంలో.. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీ గురించి తెలుసుకున్న బాలీషా... కొడుకును అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి రషీద్ జీవితం మలుపు తిరిగింది. ఈ విషయాల గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన బాలీషా.. ‘‘మూవీ లేదంటే పార్కుకు తీసుకువెళ్లమని తను ఎప్పుడూ నన్ను అడుగలేదు. ఏదైనా బొమ్మ లేదంటే గాడ్జెట్ కావాలని కోరలేదు. ఎప్పుడూ క్రికెటే తన లోకం. నా స్థాయికి తగ్గట్లు నేను ఏం చేయగలనో అది చేశాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ఇటీవలే అండర్ 19 భారత జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు షేక్ రషీద్. ఆసియా వన్డే కప్లో బ్యాటర్గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. 188 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 90 పరగులు సాధించి ఇండియాను ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ ఇదే తరహాలో రాణించాడు. 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారిందన్న లోటే కానీ... కెప్టెన్ యశ్ ధుల్తో కలిసి జట్టును ఫైనల్కు తీసుకువెళ్లడంలో రషీద్ పాత్ర మరువలేనిది. ఇక క్వార్టర్ ఫైనల్కు ముందు కరోనా బారిన పడ్డాడు రషీద్. ఒకానొక సందర్భంలో టోర్నీలో ముందుకు సాగుతానా లేదోనన్న సందేహాలతో సతమతమైన అతడు.. త్వరగానే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఫైనల్లో భారత్ను విజేతగా నిలపడం కోసం తన వంతు కృషి చేస్తానంటున్నాడు. అద్భుతంగా అనిపిస్తోంది... ‘‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నా కుటుంబానికి ఎటువంటి క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా, మా అమ్మానాన్న, అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నారు. సెమీ ఫైనల్లో మా కెప్టెన్ కొన్ని సూచనలు చేశాడు. సలహాలు ఇచ్చాడు. మా బౌలర్లు టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత జట్టుకు ఆడటం అత్యద్భుతంగా అనిపిస్తోంది. అవును.. మేం ఫైనల్కు చేరుకున్నాం. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్లకు ధన్యవాదాలు. నేను వరల్డ్కప్లో ఆడటం పట్ల నా శ్రేయోభిలాషులు ఎంతో సంతోషంగా ఉన్నారు. నన్ను టీవీలో చూసి వారు ఆనందిస్తూ ఉంటారు’’ అని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత నియాల్ ఒ బ్రియెన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్.. ఒకే ఒక్క పరుగు.. ధావన్ రికార్డు బద్దలు.. ప్రొటిస్ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! View this post on Instagram A post shared by ICC Cricket World Cup (@cricketworldcup) View this post on Instagram A post shared by ICC (@icc) 9⃣4⃣ Runs 1⃣0⃣8⃣ Balls 8⃣ Fours 1⃣ Six SK Rasheed narrowly misses out on a ton but what a fine knock that was from the India U19 vice-captain!👏 👏 #BoysInBlue #INDvAUS #U19CWC Follow the match ➡️ https://t.co/tpXk8p6Uw6 pic.twitter.com/6p1GvQKBaH — BCCI (@BCCI) February 2, 2022 Shaik Rasheed, India vice-captain and one of the stars of the #INDvAUS semi-final, talks to Niall O’Brien on what it means to represent his country at the #U19CWC 2022 ✨ pic.twitter.com/CbSKRM8JKw — ICC (@ICC) February 4, 2022 -
ఇంగ్లండ్తో ఫైనల్.. కుర్రాళ్లకు విరాట్ కోహ్లి కీలక సూచనలు!
అండర్-19 ప్రపంచకప్ తుది సమరానికి చేరుకుంది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడునంది. ఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భారత యువ ఆటగాళ్లకి కీలక సూచనలు చేశాడు. భారత యువ ఆటగాళ్లతో కోహ్లి ఆన్లైన్ ఇంటరాక్షన్ అయ్యాడు. విరాట్ తన కెప్టెన్సీలో 2008లో భారత జట్టును అండర్-19 ఛాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లితో సంభాషణకి సంబంధించిన వీడియోను అండర్- ఆటగాళ్లు కౌశల్ తాంబే, రవ్జర్ధన్ హంగర్గేకర్ ఇనస్ట్రాగమ్లో పోస్ట్ చేశారు. "ఫైనల్స్కు ముందు కింగ్ కోహ్లి మాకు కొన్ని విలువైన చిట్కాలు, సూచనలు అందించాడు" అని కౌశల్ తాంబే క్యాప్షన్గా పెట్టాడు. "విరాట్ భయ్యా... మీతో సంభాషించడం చాలా బాగుంది . మీ నుంచి జీవితం, క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. నాకు అవి రాబోయే కాలంలో మరింత మెరుగవడానికి సహాయపడతాయి" అని హంగర్గేకర్ రాసుకొచ్చాడు. అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా నాలుగో సారి ఫైనల్కు చేరింది. భారత అండర్–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్ మొహమ్మద్ కైఫ్), 2008లో (కెప్టెన్ విరాట్ కోహ్లి), 2012లో (కెప్టెన్ ఉన్ముక్త్ చంద్), 2018 (కెప్టెన్ పృథ్వీ షా) జట్టు చాంపియన్గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. చదవండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్.. ఒకే ఒక్క పరుగు.. ధావన్ రికార్డు బద్దలు.. ప్రొటిస్ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత -
సంచలన ఇన్నింగ్స్.. ధావన్ రికార్డు బద్దలు.. బేబీ ఏబీడీ సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్కప్ టోర్నీలో బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 3న జరిగిన ప్లే ఆఫ్(ఏడో స్థానం) మ్యాచ్లో 130 బంతుల్లో 138 పరుగులు స్కోరు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో మెగా టోర్నీలో ఇప్పటి వరకు మొత్తంగా 506 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2004లో భారత అండర్ 19 జట్టులో భాగమైన ధావన్ ఆ ఈవెంట్లో మొత్తంగా 505 పరుగులు చేయగా.. బ్రెవిస్ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ఇక అండర్ 19 వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెవిస్ ఒక్క పరుగు తేడాతో అగ్రస్థానానికి చేరుకోగా.. ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలను బ్రెట్ విలియమ్స్(ఆస్ట్రేలియా- 471 పరుగులు), కామెరూన్ వైట్(ఆస్ట్రేలియా- 423 పరుగులు), డెనోవాన్ పాగన్(వెస్టిండీస్- 421 పరుగులు) ఆక్రమించారు. కాగా ఈ టోర్నీలో బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 84.33 సగటుతో 506 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక బ్రెవిస్ ఆటతీరుకు ఫిదా అవుతున్న అభిమానులు అతడిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్తో పోలుస్తున్నారు. బేబీ ఏబీడీ, ఏబీడీ 2.0 అంటూ ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. కాగా ఈ ప్రొటిస్ యువ సంచలనం ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ప్రొటిస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్కోర్లు: బంగ్లాదేశ్ అండర్- 19: 293/8 (50) దక్షిణాఫ్రికా అండర్- 19: 298/8 (48.5) చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! South Africa’s Dewald Brevis now holds the record for the most runs in a single edition of the #U19CWC 🙌 pic.twitter.com/O5UCelEIdn — ICC (@ICC) February 3, 2022 -
U19 World Cup: విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్
అండర్ 19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీతో కదంతొక్కిన యువ భారత కెప్టెన్ యశ్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్).. అరుదైన ఘనతను సాధించాడు. ఈ విభాగపు వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్(2012)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. యాదృచ్చికంగా ఈ ముగ్గురు ఢిల్లీకి చెందిన వారే కావడం విశేషం. కాగా, సెమీఫైనల్లో కెప్టెన్ యశ్ ధుల్తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో టీమిండియా.. ఆసీస్ను 96 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2016, 2018, 2020 సీజన్లలో కూడా యువ భారత్ తుది పోరుకు అర్హత సాధించి టైటిల్ ఫైట్లో నిలిచింది. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ సారధ్యంలో తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన యువ భారత్.. 2008లో కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా కెప్టెన్సీల్లో టైటిల్ సాధించింది. ఇదిలా ఉంటే, ఆసీస్తో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టులో యష్ ధుల్, షేక్ రషీద్ మూడో వికెట్కు 204 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారత యువ బౌలర్లలో విక్కీ వత్సల్ మూడు వికెట్లతో ఆసీస్ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన్ఫర్మ్ చేసిన గంగూలీ -
Yash Dhull: మరో ఉన్ముక్త్ చంద్ కాకుంటే చాలు.. అశ్విన్ కౌంటర్!
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకునే అశూ.. యూట్యూబ్ చానెల్లో క్రికెట్కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఇటీవల పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అశ్విన్ తనదైన శైలిలో బ్యాట్ చేతబట్టి స్టెప్పులేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. అండర్-19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్కు అండగా నిలిచాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. యశ్ ధుల్ సారథ్యంలోని జట్టు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్గా తనదైన వ్యూహాలతోనే కాదు... బ్యాటర్గానూ 110 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు యశ్. ఈ క్రమంలో అతడిపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా... ‘‘కెప్టెన్ యశ్ ధుల్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్... ‘‘ఏదేమైనా యశ్... మరో ఉన్ముక్త్ చంద్లా అయిపోకూడదు’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు అశూ కౌంటర్ వేశాడు. ‘‘కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా’’ అని సదరు నెటిజన్కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. కాగా 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా బిగ్బాష్ లీగ్లో ఆడే అవకాశం దక్కించుకుని.. ‘బిగ్బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఉన్ముక్త్ మాదిరే.. యశ్ ధుల్ కాకూడదంటూ నెటిజన్ పేర్కొనగా.. అశూ అందుకు తనదైన శైలిలో బదులిచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్కి మరీ ఇంత తక్కువా! hope it doesnt goes the unmukt chand way — Rohit Pungalia (@RohitPungalia) February 2, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
అండర్ 19 వరల్డ్కప్ ఆసీస్ షాక్ ఫైనల్కు టీమిండియా (ఫోటోలు)
-
U-19 ప్రపంచకప్ సెమీఫైనల్ లైవ్ అప్డేట్స్: భారత్ వర్సస్ ఆసీస్
-
Under 19 WC: అఫ్గన్పై ఉత్కంఠ విజయం.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్లో
Under 19 World Cup 2021-2022: అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్లోని అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ను ఓడించింది. తద్వారా వరల్డ్కప్ ఫైనల్కు చేరుకుని.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టామ్ ప్రెస్ట్ సారథ్యంలోని జట్టు ఈ అద్భుతం చేసి అభిమానుల మనసులను పులకింపజేసింది. కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ థామస్ అర్ధ సెంచరీ(50 పరుగులు)తో ఆకట్టుకోగా... జార్జ్ బెల్ 56 పరుగులు, వికెట్కీపర్ అలెక్స్ హార్టన్ 53 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 పరుగుల తేడాతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. కాగా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ ఆటగాడు జార్జ్ బెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. అస్సలు ఊహించలేదు..: ఇంగ్లండ్ కెప్టెన్ ఈ గెలుపును అస్సలు ఊహించలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడం కలిసి వచ్చింది. 230 పరుగులు స్కోరు చేయడం గొప్ప విషయం. ఇంగ్లండ్ ఫైనల్ చేరడం.. అందుకు నేను సారథిగా ఉండటం.. నమ్మలేకపోతున్నా.. ఎంతో సంతోషంగా ఉంది- ఇంగ్లండ్ అండర్-19 కెప్టెన్ టామ్ ప్రెస్ట్. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే! -
IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే..
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్రస్తుతం ప్రపంచకప్ ఆడుతున్న భారత అండర్-19 జట్టు కుర్రాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యువ భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్తో పాటు మరో ఏడుగురు భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఓపెనర్ హర్నూర్ సింగ్, ఆల్రౌండర్లు కుశాల్ తాంబే, అనీశ్వర్ గౌతమ్, రాజ్ అంగద్ భవ, రాజ్వర్థన్ హంగార్గేకర్, బౌలర్లు విక్కీ ఓస్వల్, వాసు వత్స్ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో రాజవర్థన్ హంగార్గేకర్ బేస్ ప్రైజ్ రూ. 30 లక్షలు కాగా, మిగిలిన అందరూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు. కాగా, కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా సెమీస్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్కు షాకిచ్చి ఫైనల్ ఫోర్కు చేరుకుంది. రేపు జరగబోయే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. తొలి సెమీస్లో ఇవాళ ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. చదవండి: IPL Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధావన్, వార్నర్ భాయ్.. ఇంకా -
అద్భుత రనౌట్... శ్రీలంకపై అఫ్గన్ సంచలన విజయం
ICC U19 World Cup 2022: 25 బంతులు... చేయాల్సినవి 5 పరుగులు.. చేతిలో ఒక వికెట్. ఓ క్రికెట్ జట్టు మ్యాచ్ గెలవడానికి ఈ సమీకరణ చాలు. కానీ... శ్రీలంకను దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్ అద్భుత రనౌట్ చేయడంతో విజయం ఆ జట్టు చేజారింది. అంతేకాదు మెగా టోర్నీలో సెమీస్ చేరాలన్న ఆశలు గల్లంతయ్యాయి. కాగా వెస్టిండీస్ వేదికగా ఐసీసీ అండర్ 19 వరల్డ్కప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య గురువారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బిలాల్ సయేదీ 6, ఖరోటే 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్లో వచ్చిన అల్లా నూర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అబ్దుల్ హైదీ 37, నూర్ అహ్మద్ 30 పరుగులతో రాణించారు. దీంతో అఫ్గన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి రనౌట్తో ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ చమిందు విక్రమ సింఘే ఒక్కడే డబుల్ డిజిట్(16) స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్ సదిశ రాజపక్స డకౌట్ కాగామిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. వరుసగా 2,2,1,3,2 స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో దునిత్ 34, రవీన్ డి సిల్వా 21 మెరుపులు మెరిపించారు. వినుజ రణ్పల్ 11 పరుగులతో క్రీజులో ఉండగా... అఫ్గన్ బౌలర్ నవీద్ సంధించిన బంతిని ఆడే క్రమంలో రనౌట్కు ఆస్కారం ఏర్పడింది. దీంతో శ్రీలంక కథ ముగిసింది. ఇన్నింగ్స్లో ఇది నాలుగో రనౌట్ కావడం గమనార్హం. ఇక నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ చేరిన అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్తో తలపడనుంది. స్కోర్లు: అఫ్గనిస్తాన్ అండర్ 19 జట్టు: 134 (47.1 ఓవర్లు) శ్రీలంక అండర్ 19 జట్టు- 130 (46 ఓవర్లు) చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! IND vs WI: టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు.. పొలార్డ్పై సంచలన ఆరోపణలు! Congratulations Afghanistan 🔥🔥🇦🇫🇦🇫🔥🔥 Afg u19 vs sl u19 pic.twitter.com/qBYzNkjiXm — THE NDS soldier (@Muhamma40574471) January 27, 2022 Celebrate the win boys!! The Future stars have all the rights in the world to celebrate thier quarter final win over SL U19s. #FutureStars | #AFGvSL | #U19CWC2022 pic.twitter.com/SNmr2jtTIx — Afghanistan Cricket Board (@ACBofficials) January 27, 2022 -
టీమిండియాలో కరోనా కలకలం.. కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్..!
ట్రినిడాడ్: అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇవాళ ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్కు దూరమయ్యారని సమాచారం. కెప్టెన్ యశ్ ధుల్ గైర్హాజరీలో ఐర్లాండ్తో మ్యాచ్కు నిశాంత్ సంధు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యువ భారత్.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(79), హర్నూర్ సింగ్(88) శుభారంభాన్ని అందించగా, రాజ్ భజ్వా(23 నాటౌట్), నిషాంత్ సంధు(20 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. చదవండి: IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. -
ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే!
Under 19 World Cup 2022- జార్జ్టౌన్ (గయానా): వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్లో భారత కుర్రాళ్ల పోరు శనివారం ఆరంభం కానుంది. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ తమ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నాలుగు సార్లు చాంపియన్ అయిన భారత్ టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇక ఇటీవలే జరిగిన జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ జోరు ముందు సఫారీ నిలవడం కష్టమే! భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒత్వాల్, గర్వ్ సంగ్వాన్. దక్షిణాఫ్రికా జట్టు: ఈథన్ జాన్ కనింగ్హాం, వాలంటైన్ కిటిమె, డేవడ్ బ్రెవిస్, జీసే మ్యారీ, జార్జ్ వాన్ హీర్డన్, ఆండిలే సిమెలేన్, మిక్కీ కోప్లాండ్, మాథ్యూ బోస్ట్, లియామ్ ఆల్డర్, అఫివే న్యాండ, క్వెనా మఫాకా, ఆసఖే షాకా, జేడ్ స్మిత్ , కేడన్ సోలోమన్, జోషువా స్టీఫెన్సన్. చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి -
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
U 19 World Cup 2022: మనోళ్లు ఇద్దరు.. శభాష్ రషీద్, రిషిత్ రెడ్డి!
U 19 World Cup 2022: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో జరిగే అండర్– 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్ర జట్టు బ్యాటర్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్కే రషీద్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో రషీద్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. రషీద్ ఆరు మ్యాచ్లు ఆడి 376 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెటర్ రిషిత్ రెడ్డి స్టాండ్బైగా ఉన్నాడు. రిషిత్ రెడ్డి భారత అండర్–19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), ఎస్కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బానా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్, మానవ్ పరఖ్, కౌశల్ తాంబే, ఆర్ఎస్ హంగార్గెకర్, వాసు వత్స్, విక్కీ ఒస్త్వల్, రవికుమార్, గర్వ్ సాంగ్వాన్. స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గొసాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్. చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు! Here's India's squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr — BCCI (@BCCI) December 19, 2021 -
ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు!
వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్ భారత జట్టు కెప్టెన్గా ఢిల్లీ ఆటగాడు యశ్ దుల్, వైస్ కెప్టెన్గా ఆంధ్రా ప్లేయర్ షేక్ రషీద్ ఎంపికయ్యాడు. అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికైన యశ్ దుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ఎవరీ యశ్ దుల్.. న్యూఢిల్లీలోని జనక్పురికి చెందిన యశ్ దుల్కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. యశ్ దుల్ 11 ఏళ్ల వయస్సులో బాల్ భవన్ స్కూల్ అకాడమీలోకి ప్రవేశించి అక్కడి నుంచే తన కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. ఈ యువ ఆటగాడు ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడిసీఈ(ఢిల్లీ ఎండ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. ఇక యష్ తండ్రి కాస్మెటిక్ బ్రాండ్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు, కానీ తన పిల్లల కెరీర్కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "చిన్న వయస్సు నుంచే యశ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడు ఆడటానికి చిన్నతనంలోనే మంచి క్రికెట్ కిట్ నేను కొనిచ్చాను. నేను అతడికి అత్యుత్తమ ఇంగ్లీష్ విల్లో బ్యాట్లను ఇచ్చాను. యశ్ కేరిర్ కోసం మేము మా ఖర్చులను తగ్గించుకున్నాము. మా నాన్న ఆర్మీ మేన్, తనకు వచ్చిన పింఛను ఇంటి నిర్వహణకు ఉపయోగపడేది. అతడు తన కేరిర్లో అద్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని యష్ దుల్ తండ్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్కు! -
ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు
Australia insane spinner Nivethan Radhakrishnan Facts.. వచ్చే ఏడాది జనవరిలో అండర్-19 వరల్డ్కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజగా ఆస్ట్రేలియా కూడా 15 మందితో కూడిన అండర్-19 ప్రాబుబుల్స్ను ప్రకటించింది. ఈ జట్టులో ఒక కుర్రాడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతనే నివేథన్ రాధాకృష్ణన్. చదవండి: Ashes 2021-22: ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్లో తెలంగాణ కుర్రాడు.. సాధారణంగా స్పిన్ బౌలర్ అయిన రాధాకృష్ణన్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్ ? లేక రైట్ ఆర్మ్? స్పిన్నర్ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్ అయినా ఒకే శైలి బౌలంగ్కు పరిమితమవుతాడు. కానీ నివేథన్ రాధాకృష్ణన్ మాత్రం అటు లెఫ్ట్.. ఇటు రైట్ ఆర్మ్తో బౌలింగ్ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇదే అతన్ని అందరిలో ప్రత్యేకంగా మార్చి ఇవాళ అండర్-19 వరల్డ్ కప్లో ఆసీస్ ప్రాబబుల్స్లో చోటు దక్కేలా చేసింది. This is insane 🤯 @CricketTas recruit Nivethan Radhakrishnan bowls finger spin - with both arms. The ambidextrous tweaker took 20 wickets and scored 898 runs in NSW Premier Cricket last season: https://t.co/1zM8VN2OM1 pic.twitter.com/G3jLMWh3Lp — MyCricket (@MyCricketAus) June 24, 2021 చదవండి: Big Bash 2021: డబుల్ మీనింగ్ డైలాగ్స్.. గిల్క్రిస్ట్తో మహిళా కామెంటేటర్ మజాక్ ఆస్ట్రేలియన్ అండర్-19 క్రికెటర్ నివేథన్ రాధాకృష్ణన్ ముఖ్య విషయాలు ►2013లో నివేథన్ రాధాకృష్ణన్ భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. ►ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్కు నెట్ బౌలర్గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో బౌలింగ్లో రాటు దేలాడు. ►అండర్-16 లెవెల్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్తో తొలిసారి గుర్తింపు పొందాడు ►ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రికెట్ లీగ్లో ఆడిన నివేథన్ రాధాకృష్ణన్ ఆ సిరీస్లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఎన్ఎస్డబ్ల్యూ, తస్మానియా క్రికెట్ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. ►తస్మానియా క్రికెట్ తరపున ఈ సీజన్లో ఓపెనర్గా బరిలోకి దిగిన నివేథన్ రాధాకృష్ణన్ 622 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు: హర్కీరత్ బజ్వా, ఐడాన్ కాహిల్, కూపర్ కొన్నోలీ, జాషువా గార్నర్, ఐజాక్ హిగ్గిన్స్, క్యాంప్బెల్ కెల్లావే, కోరీ మిల్లర్, జాక్ నిస్బెట్, నివేతన్ రాధాకృష్ణన్, విలియం సాల్జ్మన్, లచ్లాన్ షా, జాక్సన్ సిన్ఫీల్డ్, టోబియాస్ స్నెల్, టామ్ విట్నీ, టెయాగ్ విట్నీ యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ అంటే... సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగిన వారిని యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుత క్రికెట్లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ చరిత్రలో యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. హనీఫ్ మొహ్మద్(పాకిస్తాన్) పాకిస్తాన్ బ్యాటింగ్లో సూపర్ స్టార్గా వెలుగొందిన హనీఫ్ మొహ్మద్ నిజానికి రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ పార్ట్టైమ్ బౌలింగ్ చేసిన హనీఫ్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. పాకిస్తాన్ తరపున 55 టెస్టు మ్యాచ్ల్లో 3915 పరుగులు చేశాడు. గ్రహం గూచ్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం గ్రహం గూచ్ కూడా యాంబిడెక్స్ట్రస్ ఆటగాడే. బ్యాటింగ్లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్.. రైట్ ఆర్మ్.. లెఫ్ట్ఆర్మ్ మీడియం పేస్తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరపున గ్రహం గూచ్ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు. హసన్ తిలకరత్నే(శ్రీలంక) స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన హసన్ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్ తిలకరత్నే బౌలింగ్లో రైట్ ఆర్మ్ స్పిన్ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్లో కెన్యాతో మ్యాచ్లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్ ఆర్మ్.. లెఫ్టార్మ్ బౌలింగ్ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కర్నేవార్(భారత్) విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షయ్ కర్నేవార్ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్-ఏ, టి20 మ్యాచ్లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్ కర్నేవార్ లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయడంలో సమర్థుడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్ తన వైవిధ్యమైన బౌలింగ్తో 16 వికెట్లు తీసి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. కమిందు మెండిస్(శ్రీలంక) 17 ఏళ్ల కమిందు మెండిస్ శ్రీలంక తరపున రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్.. స్లో లెఫ్ట్ఆర్మ్ ఆర్థడోక్స్ బౌలింగ్ చేయడంలో దిట్ట. రానున్న అండర్-19 వరల్డ్కప్లో లంక తరపున ప్రాతినిధ్యం వహించనున్న కమిందు మెండిస్ ఆ జట్టుకు కీలకంగా మారనున్నాడు. -
'ఆ సమయంలో ద్రవిడ్ను చూసి భయపడేవాళ్లం'
ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎందరో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ వారిని మెరికల్లా తయారు చేశాడు. పృథ్వీ షా కూడా ద్రవిడ్ పర్యవేక్షణలోనే రాటు దేలాడు. 2018లో పృథ్వీ షా సారధ్యంలోని టీమిండియా కప్ గెలవడంలో ద్రవిడ్ కీలకపాత్ర పోషించాడు. అయితే అండర్-19 సమయంలో మాకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ను చూసి మేమంతా భయపడిపోయేవాళ్లమని పృథ్వీ షా పేర్కొన్నాడు. క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్య్వూలో షా మాట్లాడాడు. ' 2018 అండర్-19 ప్రపంచకప్కు ముందే ద్రవిడ్ సర్తో కలిసి ఎన్నో టూర్లు తిరిగాం.. అప్పుడు మాకు ప్రధాన కోచ్గా వ్యవహరించిన ఆయనతో మాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. మా బ్యాటింగ్ విషయంలో ఆయన ఎప్పుడు తలదూర్చలేదు... కానీ తప్పులు చేస్తే మాత్రం వెంటనే సరిదిద్దేవాడు. ఉదాహరణకు.. నా నాచురల్ ఆటను ఆడమనేవాడు.. పవర్ప్లే ముగిసేలోపు ప్రత్యర్థి జట్టుపై ఎంత ఒత్తిడి పెడితే అంత విజయం సాధించగలం అని చెప్పేవాడు. ఆట కంటే ఎక్కువగా మా మానసిక పరిస్థితి.. గేమ్ను ఎలా ఆడాలనేదానిపై ఎక్కువగా ఫోకస్ చేసేవాడు. అంతేగాక ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడాలని.. భయంతో ఎప్పడు ఆడకూడదని చెప్పేవాడు. మా ఆటలో ఎప్పుడు తలదూర్చేవాడు కాదు.. కానీ తప్పులు చేస్తే మాత్రం వెంటనే సరిదిద్దేవాడు. ఆటలో అంత సీరియస్గా ఉండే ద్రవిడ్ ఆఫ్ఫీల్డ్లో మాత్రం సంతోషంగా ఉండేవారు. రెస్టారెంట్లలో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు ఆయన చేసే సరదా మాములుగా ఉండేది కాదు. ఒక లెజెండ్తో కలిసి కూర్చొని తిన్నామనే సంతోషం మాకు ఉండేది. అయితే ఆ సమయంలో ద్రవిడ్ను చూసి మేమంతా భయపడేవాళ్లం.. కానీ ఆ భయం అతని మీద మాకుండే గౌరవమే. కానీ అతని సారధ్యంలో ఆడాము కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఎందరో ఆటగాళ్లకు తన విలువైన సలహాలు అందిస్తున్నాడు. తాజాగా జూలైలో శ్రీలంక పర్యటనను పురస్కరించుకొని ద్రవిడ్ను ప్రధాన కోచ్గా ఎంపిక చేసింది. త్వరలోనే లంకకు వెళ్లబోయే టీమిండియా రెండో జట్టును కూడా బీసీసీఐ ప్రకటించనుంది. ఇక పృథ్వీ షా ఆసీస్తో జరిగిన మొదటి టెస్టులో డకౌట్గా వెనుదిరిగి విమర్శల పాలవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత జరిగిన దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలతో చెలరేగిన పృథ్వీ ఆ టోర్నీలో 827 పరుగులు చేసి టాపర్గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ 14వ సీజన్లోనూ పృథ్వీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్లాడిన షా 308 పరుగులతో రాణించాడు. ఐపీఎల్లో ఆకట్టుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా రెండో జట్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా -
రైట్ ఆర్మ్ క్విక్ బౌలరా.. కోహ్లి ఏంటిది!
దుబాయ్ : విరాట్ కోహ్లి.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. కానీ ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్కు చేరిన ఆర్సీబీ శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మొదటి క్వాలిఫయర్లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఎలాగైనా ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని ఆర్సీబీ భావిస్తుంది. (చదవండి : 'ప్లే ఆఫ్ ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తుంది') ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. ఐసీసీ తమ ట్విటర్లో ఒక వినూత్న వీడియోతో ముందుకొచ్చింది. ఇప్పటితరం మీ ఫేవరెట్ సూపర్స్టార్ ఆటగాళ్లు అండర్ 19 ప్రపంచకప్లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూడండి. అలాగే మీరు ఇష్టపడే ఆటగాడు ఎవరో కూడా చెప్పండి అంటూ పేర్కొంది. కాగా అప్పటి అండర్-19 టీమిండియా జట్టుకు అప్పటి యంగ్ విరాట్ కోహ్లినే కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా..' హాయ్ .. దిస్ ఈజ్ విరాట్ కోహ్లి.. కెప్టెన్.. రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్.. రైట్ ఆర్మ్ క్విక్ బౌలర్.. మై ఫేవరెట్ బ్యాట్స్మెన్ హర్షలే గిబ్స్' అంటూ ముగించాడు. (చదవండి : ‘ఇండియా కంటే ఐపీఎల్ ఆడటమే ముఖ్యమా?!’) Remember how your favourite superstars looked like as teenagers? 👦 Presenting the 2008 U19 @cricketworldcup introductions 📽️ Which one’s your favourite? 😄 pic.twitter.com/Sk4wnu4BNs — ICC (@ICC) November 4, 2020 అయితే విరాట్ కోహ్లి బౌలింగ్ డిస్క్రిప్షన్పై నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. కోహ్లి తన బౌలింగ్ శైలిని రైట్ ఆర్మ్ బౌలర్ అని చెప్పాల్సింది పోయి.. రైట్ ఆర్మ్ క్విక్ బౌలర్ అని చెప్పడం ఏంటంటూ ట్రోల్ చేశారు. ఇలాంటి బౌలింగ్ శైలి కూడా ఉంటుందా.. ఏదైనా మా కోహ్లికే సాధ్యం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వీడియోలో ఇప్పటి ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్తో పాటు రవీంద్ర జడేజా(టీమిండియా), మనీష్ పాండే( టీమిండియా), కీరన్ పావెల్( వెస్టిండీస్), జేమ్స్ పాటిన్సన్(ఆస్ట్రేలియా), ఇమాద్ వసీమ్(పాకిస్తాన్), డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), వేన్ పార్నెల్(దక్షిణాఫ్రికా) తదితరులు తమను తాము పరిచయం చేసుకున్నారు. కాగా 2008 అండర్ 19 ప్రపంచకప్ను కోహ్లి సారధ్యంలోని టీమిండియా గెలుచుకుంది. ఈ ప్రదర్శనతోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లికి అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. (చదవండి : 'ధోని ఇంపాక్ట్ ఎంత అనేది అప్పుడు తెలిసింది') Right arm quick bowler 🙈🤣🤣@imVkohli 😍 pic.twitter.com/324SMTMKOA — Suman Singh (@Suman_Singh15) November 4, 2020 This man 😍😍😍 pic.twitter.com/bKlxxvKWRi — ABDULLAH NEAZ (@abdullah_neaz) November 4, 2020 -
ఇంత సన్నగైపోయావేందిరా..
యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చాడు. ఊరికే రాలేదు 400 రన్స్ చేసి, ‘మ్యాన్ ఆఫ్ ది 2020 అండర్–19 వరల్డ్ కప్’ టైటిల్ని కొట్టుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్ అతడిది. ఇంటికి రాగానే తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంద బాష్పాలు కావు అవి. బిడ్డ చిక్కి శల్యమైపోయాడు. పట్టుకుని ఏడ్చింది. ‘ఇంత సన్నగైపోయావేందిరా’ (కిత్నా సుఖ్ గయా హై తూ!) అని ఒళ్లు తడిమి చూసుకుంది. టీనేజ్ కుర్రాళ్లకు ఇలాంటి ఎమోషన్స్ నచ్చవు. తల్లిని కూడా దగ్గరకు రానివ్వరు. ‘‘నువ్వూర్కోమ్మా’’ అన్నాడు. ‘‘అంత మాట అనేశావేంట్రా అబ్బాయ్! తల్లి ఎలా ఊరుకుంటుంది’’ అన్నారు చుట్టుపక్కల వాళ్లు. అప్పటికే వాళ్లంతా యశస్వీని చుట్టేశారు. నువ్వు మామూలోడివి కాదురా అన్నారు. ఊరికే క్రికెట్ క్రికెట్ అంటుంటే.. చదువు అబ్బడం లేదనుకున్నాం కానీ.. క్రికెట్లో మంచి ర్యాంకే తెచ్చుకున్నావురా అన్నారు. తల్లికి ఆ మాటలేవీ చెవికి ఎక్కడం లేదు. ‘‘ముందు కాస్త తిను నాయనా’’ అని కొడుక్కి రొట్టెలు, శాకాహార పలహారం తెచ్చిపెట్టింది. తిన్నాడు. అప్పుడు కానీ ఆ తల్లి మనసు కుదుట పడలేదు. ‘నువ్వూర్కోమ్మా’ అని తల్లిని అన్న కొడుకు ఆ తర్వాత కాస్త ఫీల్ అయినట్లున్నాడు. ‘‘మా అమ్మకు ఎలా చెబితే అర్థమౌతుంది. ఆడాలంటే ఫిట్గా ఉండాలని’’ అన్నాడు.. అమ్మ కొంగుతో చేతులు తుడుచుకుంటూ. -
జైస్వాల్ ట్రోఫీ రెండు ముక్కలైంది..!
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్లో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ ఫైనల్ పోరులో భారత్ చతికిలబడ్డా జైస్వాల్ ఆద్యంతం రాణించడంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. అయితే సిల్వర్ కోటింగ్తో ఉన్న ఆ అవార్డు రెండు ముక్కలైందట. అది ఎలా ముక్కలైందనే విషయం జైస్వాల్కు గుర్తు లేదట. అంత విలువైన అవార్డును అలా పోగొట్టుకోవడంపై అతని కోచ్ జ్వాల సింగ్ మాట్లాడుతూ.. ‘ ఆ సిరీస్ ట్రోఫీ ముక్కలైనా జైస్వాల్ పెద్దగా ఏమీ బాధపడడని తెలిపాడు. ఇదేమీ తొలిసారి కాదని, చాలా సార్లు జరిగిందన్నాడు. అతను కేవలం పరుగులు కోసమే ఆలోచిస్తాడు కానీ అవార్డుల కోసం ఎక్కువగా ఆలోచించడు’ అని పేర్కొన్నాడు. అండర్-19 వరల్డ్కప్లో జైస్వాల్ 88, 105 నాటౌట్, 62, 57 నాటౌట్, 29 నాటౌట్, 59 చేసిన స్కోర్లతో అత్యధిక పరుగులు నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్కు ఎంపికయ్యాడు. (ఇక్కడ చదవండి: పానీపూరి అమ్మడం నుంచి కరోడ్పతి వరకూ..) ఇక జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకూ ఏజ్ గ్రూప్ టోర్నమెంట్లు ఆడుతూ వచ్చా. ఇక నుంచి జాతీయ క్రికెట్పై దృష్టి పెట్టాలి. అంటే నా హార్డ్వర్క్ డబుల్ ఉండాలి. అందుకోసం తీవ్రంగా శ్రమించాలి. నన్ను నేను అర్థం చేసుకోవడం ముఖ్యం. నన్ను అవతలి వాళ్లు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయంపై ఆలోచిస్తే సమయం వృథా తప్పితే ఏమీ ఉండదు. నువ్వు నీ కోసం ఆలోచించాలి. నా పోరాటం వరల్డ్తో కాదు.. నాతోనే పోరాడుతూ ఉంటా. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తీసుకుంటా. ఇప్పుడు వాటిని వదిలివేయడంపై మొదట దృష్టి పెట్టాలి. మెడిటేషన్పై కూడా ఫోకస్ చేయాలి. మన సక్సెస్లో ఫిట్నెస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఫిట్నెస్ను కాపాడుకోవడంపై సీరియస్గా దృష్టి పెట్టా’ అని జైస్వాల్ తెలిపాడు. -
సస్పెన్షన్పై రవి బిష్ణోయ్ తండ్రి భావోద్వేగం
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఐసీసీ సస్సెన్షన్ విధించడంపై అతని తండ్రి మంగిలాల్ బిష్ణోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంగిలాల్ బిష్ణోయ్ స్పందిస్తూ..తన కుమారుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిపై వస్తున్న ఆరోపణలను విని ఆశ్చర్యపోయానన్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేస్తున్న సందర్భంలో సహచరుడిని కాపాడే క్రమంలో తన కుమారుడు ఆవేశానికి లోనైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై కలత చెందిన బిష్ణోయ్ తల్లి భోజనం కూడా చేయడం లేదని వాపోయారు. (‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్లలో యువ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవ్వడం సహజమని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని మంగిలాల్ బిష్ణోయ్ తెలిపారు. ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆటగాడు రవి బిష్ణోయ్ ఆర్టికల్ కోడ్ 2.21ను ఉల్లంఘించాడంటూ ఐసీసీ సస్పెన్షన్ విధించింది. భారత్కు చెందిన ఆకాశ్ సింగ్కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు ఐసీసీ విధించింది. అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా పరాజయం పొందినప్పటికి కొందరు టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవి బిష్ణోయ్ టోర్నమెంట్లోనే అత్యధిక వికెట్లను(17) పడగొట్టిన సంగతి తెలిసిందే. -
‘ఆ దృశ్యాలు ఫైనల్ మ్యాచ్లోనే చూశాను’
న్యూఢిల్లీ : అండర్-19 ఫైనల్ మ్యాచ్లో బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణపై టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించారు. యువ భారత్ ఆటగాళ్ల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ఏ జట్టయినా చెత్త ప్రదర్శన చేయొచ్చు. ఇంత చెత్తగా తిట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఎప్పుడూ చూడని దృశ్యాలు ఫైనల్ మ్యాచ్లో ‘చూపించారు’అని ఎద్దేవా చేశాడు. (చదవండి : ‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ‘ఏ జట్టయినా చాలా చెత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. కానీ ఇంత చెత్తగా మాత్రంగా ప్రవర్తించకూడదు. ఇది చాలా అవమానకరమైన, అసహ్యకరమైన ప్రవర్తన’ బంగ్లా ఏం చేసిందో, ఎలా ఆడిందో అది వారి సమస్య. మనోళ్లు ఎలా ఆడారో అది మన సమస్య. కానీ, బండ బూతులు తిట్టుకోవడమేంటి..!’అని బిషన్ సింగ్ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి కప్పు కొట్టింది. అయితే, విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం అక్కడితో ముగిసింది. ఐదుగురిపై చర్యలు.. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్కు చెందిన ఆకాశ్ సింగ్కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
మా వాళ్ల ప్రవర్తన బాలేదు: బంగ్లా కెప్టెన్
పాచెఫ్స్ట్రూమ్: అండర్-19 వరల్డ్కప్లో అజేయంగా సాగిన యువభారత్ ఆట అంతిమంగా పరాజయంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో నెగ్గి కప్ను తొలిసారి గెలిచి కొత్త చాంపియన్గా అవతరించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ అవిషేక్ దాస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచి మెగాకప్ చరిత్రలో తన పేరును కూడా లిఖించుకుంది. (ఇక్కడ చదవండి: బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణ..!) మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ మాట్లాడుతూ.. ‘ ‘మా కల నిజమైంది. గత రెండేళ్లుగా మేం చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. నేను క్రీజులోకి వెళ్లిన సమయంలో మాకో మంచి భాగస్వామ్యం అవసరముంది. నా సహచరులకు అదే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే భారత్ అంత సులభంగా మమ్మల్ని గెలవనివ్వదనే విషయం మాకు తెలుసు. కఠినమైన ఛేదనే అయినా సాధించాం. కోచింగ్ బృందానికి ఎలా కృతజ్ఞత తెలపాలో అర్థం కావట్లేదు. మా బౌలర్లలో కొంత మంది ఉద్వేగంలో ఉన్నారు. విజయానంతరం మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తన అలా ఉండాల్సింది కాదు. మెగాకప్ గెలిచినా అంత అతి అవసరం లేదు. ఏదైతే జరిగిందో అది నిజంగా దురదృష్టకర ఘటన. భారత ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించాలి. టోర్నీ ఆసాంతం వారు అద్భుతంగా ఆడారు. మా విజయాన్ని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఇది మాకు ఆరంభం మాత్రమే. తర్వాత కూడా ఈ గెలుపు మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని తెలిపాడు. -
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్
-
బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణ..!
-
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్; తోసుకున్న ఆటగాళ్లు..!
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఆసాంతం విజయపరంపర సాగించిన ‘యువ’భారత్ జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను ముద్దాడింది. అయితే, తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. (చదవండి : అయ్యో... ఆఖరికి ఓడింది) విజయానందంలో ఉన్న బంగ్లా ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. అసలే ఓటమి బాధలో ఉన్న మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ ట్విటర్లో పోస్టు చేశాడు. బంగ్లా గెలిచిందిలా..! 178 పరుగుల లక్ష్యంతో బంగ్లా ఛేదనకు దిగగా.. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. దీంతో 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి బంగ్లా విజయాన్నందుకుంది. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
టైటిల్ పోరులో యువ భారత్ ఓటమి
-
అయ్యో... ఆఖరికి ఓడింది
కుర్రాళ్ల కప్లో యువ భారత్ డిఫెండింగ్ చాంపియన్. అన్నట్లుగానే ఈ హోదాకు న్యాయం చేసింది. అందరినీ ఓడించింది. ఆఖరిదాకా అజేయంగా నిలిచింది. చివరకు టైటిల్ పోరులో అనూహ్యంగా ఓడింది. ఐదోసారి విజేతగా నిలవాల్సిన జట్టు... తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు రన్నరప్తో సరిపెట్టుకుంది. బంగ్లాదేశ్ కొత్త చాంపియన్గా అవతరించింది. సీనియర్, జూనియర్, పొట్టి, వన్డే ఇలా ఏ ఫార్మాట్ అయినా బంగ్లాదేశ్ ఐసీసీ ప్రపంచకప్ నెగ్గడం ఇదే తొలిసారి. పాచెఫ్స్ట్రూమ్: బంగ్లాను బేబీ అంటే కుదరదేమో...! ప్రత్యేకించి ఈ ప్రపంచకప్లో! అందరినీ ఓడించి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ అమీతుమీలో నాలుగుసార్లు ప్రపంచకప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ భారత్ను కంగుతినిపించింది. అజేయంగా సాగిన యువభారత్ ఆట అంతిమంగా పరాజయంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ అవిషేక్ దాస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక బంగ్లాదేశ్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఆడింది యశస్వి ఒక్కడే... టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్కు మొగ్గు చూపింది. దీంతో భారత్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టిన యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా ఓపెనింగ్ జోడీ విఫలమైంది. స్కోరు పదైనా కాకముందే సక్సేనా (2)ను అవిషేక్ ఔట్ చేశాడు. అయితే హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (65 బంతుల్లో 38; 3 ఫోర్లు)తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ జోడీ సఫలమైతే అయింది కానీ పరుగుల రాకే మందగమనంగా సాగింది. దీంతో జట్టు స్కోరు 50 చేసేందుకే 16.1 ఓవర్లు అవసరమైంది. ఏదేమైనా బంగ్లా బౌలింగ్ను చిర్రెత్తిస్తూ నిదానంగా సాగిన ఈ భాగస్వామ్యం బలపడింది. యశస్వి 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు కూడా 29వ ఓవర్లో వందకు చేరింది. కాసేపటికే తిలక్వర్మ ఆటను తన్జీమ్ హసన్ షకీబ్ ముగించడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (7) విఫలమయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఆలౌట్... ధ్రువ్ జురెల్ (38 బంతుల్లో 22; 1 ఫోర్)ను కలుపుకొని చక్కని పోరాటం చేశాడు జైస్వాల్. జాగ్రత్తగా ఆడటంతో స్కోరు జోరందుకోలేకపోయింది. 39వ ఓవర్లో భారత్ 150 పరుగులు దాటింది. ఆ తర్వాత యశస్వి ఔటయ్యాడు. దీంతోపాటే భారత్ ఇన్నింగ్స్ కూలడం కూడా మొదలైంది. సిద్ధేశ్ వీర్ (0), జురెల్, అథర్వ అంకోలేకర్ (3), రవి బిష్ణోయ్ (2), సుశాంత్ మిశ్రా (3), కార్తీక్ త్యాగి (0) స్వల్ప వ్యవధిలోనే వికెట్లను సమర్పించుకోవడంతో నిర్ణీత ఓవర్లు ఆడకుండానే భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. చిత్రంగా 21 పరుగుల తేడాలో 7 వికెట్లను కోల్పోయింది. షరీఫుల్ ఇస్లామ్ (2/31), తన్జీమ్ హసన్ షకీబ్ (2/28) భారత్ ఇన్నింగ్స్ను దెబ్బతీశారు. ఆశలు రేపిన బిష్ణోయ్... బంగ్లా ఈ మెగా ఈవెంట్లో ఆడిన జోరును చూస్తే ఇది చాలా సునాయాస లక్ష్యం. అందుకు తగ్గట్లే ఓపెనర్లు పర్వేజ్ (79 బంతుల్లో 47; 7 ఫోర్లు), హసన్ షకీబ్ (17) తొలి వికెట్కు 50 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్ రవి బిష్ణోయ్ స్వల్ప వ్యవధిలో చకచకా 4 వికెట్లు తీసి కుర్రాళ్లలో ఆశలు పెంచాడు. పర్వేజ్ రిటైర్డ్హర్ట్ అవ్వగా... తన్జీద్, మహ్ముదుల్ (8), తౌహిద్ (0), షహదత్ (1)లను 3 పరుగుల వ్యవధిలోనే అవుట్ చేశాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. షమీమ్ (7), తర్వాత కాసేపటికి అవిషేక్ దాస్ (5) కూడా అవుట్ కావడంతో 102 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ పర్వేజ్ మళ్లీ బ్యాటింగ్కు దిగి మెరుపులు మెరిపించాడు. ఇతన్ని యశస్వి అవుట్ చేయగా... రకీబుల్ (9 నాటౌట్) అండతో కెప్టెన్ అక్బర్ అలీ లక్ష్యాన్ని పూర్తి చేశాడు. సుశాంత్ మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు ఏకంగా 33 ఎక్స్ట్రాలు ఇవ్వడం గమనార్హం. ఫైనల్ రోజు మాకు కలిసిరాలేదు. మా బౌలర్లు చక్కగా పోరాడారు. తక్కువ లక్ష్యమే అయినప్పటికీ చివరి వరకు చక్కగా బంగ్లాను నియంత్రించారు. బ్యాటింగ్లో మాకు మంచి ఆరంభం లభించింది. కానీ ఉపయోగించుకోలేకపోయాం. 210–220 పరుగులు చేయాల్సింది. బ్యాటింగ్ సరిగా చేయలేకపోవడం వల్లే మేం టైటిల్ చేజార్చుకున్నాం. –ప్రియమ్ గార్గ్, భారత కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ యశస్వి జైస్వాల్ యశస్వి ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్లు ఆడి 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో అతను మూడు వికెట్లు కూడా తీశాడు. భారత్కే చెందిన రవి బిష్ణోయ్ (6 మ్యాచ్ల్లో 17 వికెట్లు) ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) తన్జీద్ (బి) షరీఫుల్ 88; దివ్యాంశ్ సక్సేనా (సి) మహ్ముదుల్ (బి) అవిషేక్ దాస్ 2; తిలక్వర్మ (సి) షరీఫుల్ (బి) షకీబ్ 38; ప్రియమ్ గార్గ్ (సి) తన్జీద్ (బి) రకీబుల్ 7; ధ్రువ్ జురెల్ (రనౌట్) 22; సిద్ధేశ్ వీర్ ఎల్బీడబ్ల్యూ (బి) షరీఫుల్ 0; అథర్వ అంకోలేకర్ (బి) అవిషేక్ దాస్ 3; రవి బిష్ణోయ్ (రనౌట్) 2; సుశాంత్ (సి) షరీఫుల్ (బి) షకీబ్ 3; కార్తీక్ త్యాగి (సి) అక్బర్ అలీ (బి) అవిషేక్ దాస్ 0; ఆకాశ్ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–9, 2–103, 3–114, 4–156, 5–156, 6–168, 7–170, 8–170, 9–172, 10–177. బౌలింగ్: షరీఫుల్ 10–1–31–2, తన్జీమ్ షకీబ్ 8.2–2–28–2, అవిషేక్ దాస్ 9–0–40–3, షమీమ్ 6–0–36–0, రకీబుల్ 10–1–29–1, తౌహిద్ 4–0–12–0 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) ఆకాశ్ (బి) యశస్వి 47; తన్జీద్ (సి) కార్తీక్ త్యాగి (బి) రవి బిష్ణోయ్ 17; మహ్ముదుల్ హసన్ జాయ్ (బి) రవి బిష్ణోయ్ 8; తౌహిద్ ఎల్బీడబ్ల్యూ (బి) రవి బిష్ణోయ్ 0; షహదత్ (స్టంప్డ్) జురెల్ (బి) రవి బిష్ణోయ్ 1; అక్బర్ అలీ (నాటౌట్) 43; షమీమ్ (సి) యశస్వి (బి) సుశాంత్ మిశ్రా 7; అవిషేక్ దాస్ (సి) కార్తీక్ త్యాగి (బి) సుశాంత్ మిశ్రా 5; రకీబుల్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 33; మొత్తం (42.1 ఓవర్లలో 7 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–50, 2–62, 3–62, 4–65, 5–85, 6–102, 7–143 బౌలింగ్: కార్తీక్ త్యాగి 10–2–33–0, సుశాంత్ మిశ్రా 7–0–25–2, ఆకాశ్ సింగ్ 8–1–33–0, రవి బిష్ణోయ్ 10–3–30–4, అథర్వ 4.1–0–22–0, యశస్వి జైస్వాల్ 3–0–15–1. -
అండర్-19 ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్-19 ప్రపంచకప్లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోపీని ముద్దాడింది. చివర్లో వర్షం ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆటను 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ 43పరుగులతో చివరివరకు అజేయంగా నిలిచి అండర్-19 క్రికెట్లో బంగ్లాదేశ్ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇతనికి తోడుగా బంగ్లా ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 47 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4వికెట్లు, సుషాంత్ మిశ్రా 2వికెట్లు తీశారు. కాగా 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను కెప్టెన్ అక్బర్ అలీ, ఓపెనర్ పర్వేజ్లు కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్మెన్లలో యశస్వి జైశ్వాల్ 88 పరుగులతో మరోసారి రాణించగా, తిలక్ వర్మ 38, దృవ్ జూరెల్ 22 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్ 3వికెట్లు, శౌరిఫుల్ ఇస్లామ్, తంజిమ్ హసన్ తలా 2వికెట్లు తీశారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్ తుది సమరానికి తెరలేచింది. డిఫెండింగ్ చాంపియన్ ‘యువ’భారత్ తొలిసారి అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి పోరులో టాస్ పడింది. బంగ్లా యువ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టైటిల్ను నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన ఇరు జట్లూ.. బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను భారత్ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. (చదవండి : 'ఫైనల్లో బంగ్లాదేశ్ను కుమ్మేయండి') తుది జట్లు : ఇండియా అండర్-19 : యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియం గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సిద్ధేష్ వీర్, అధర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, శశ్వత్ రావత్, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ బంగ్లాదేశ్ అండర్-19 : పర్వేజ్ హుస్సేన్, టాంజిద్ హసన్, మహ్మద్ఉల్ హసన్, తోహిద్ హ్రిదోయ్, షాహదత్ హుస్సేన్, అవిషేక్ దాస్, అక్బర్ అలీ (కెప్టెన్/వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, రాకిబుల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం, టాంజిమ్ హసన్ షకీబ్ -
‘యువ’ భారత్ మళ్లీ సాధిస్తుందా!
నాలుగు సార్లు ఇప్పటికే విజేతగా నిలిచిన జట్టు ఒకవైపు... ఇంతకుముందు ఏ స్థాయిలో కూడా ప్రపంచకప్లో కనీసం ఫైనల్కు చేరుకోని జట్టు మరోవైపు... టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన రెండు టీమ్లు... ప్రస్తుతం బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలు... ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అండర్–19 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఈ ఆసియా జట్ల పోరులో చాంపియన్ ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది. పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): 16 యువ జట్లు పాల్గొన్న అండర్–19 ప్రపంచ కప్ తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్తో తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ తలపడనుంది. తమ టైటిల్ నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. పోటాపోటీ... లీగ్ దశలో ఇరు జట్లూ అజేయంగా నిలిచాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను భారత్ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తే బంగ్లా జట్టు నుంచి తన్జీద్ హసన్ బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రాలతో మన పేస్ దళం పదునుగా కనిపిస్తుంటే అటువైపు నుంచి తన్జీమ్ హసన్, షరీఫుల్ ఇస్లామ్ తమ పేస్ పదును చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వికెట్ల పండగ చేసుకున్న భారత లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్కి పోటీగా రకీబుల్ హసన్ తన స్పిన్తో ప్రత్యర్థి ని పడగొట్టాలని భావిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయం. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండా సెమీస్లో ఆడిన టీమ్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ►2018 ప్రపంచ కప్లో ఇరు జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు భారత్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ►గత ప్రపంచ కప్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ జట్లు అండర్–19 విభాగంలో 7 సార్లు తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచ్లు వర్షంతో రద్దు కాగా... మిగిలిన ఐదు మ్యాచ్లలో 4 గెలిచిన భారత్ 4–1తో ఆధిక్యంలో ఉంది. 2018 ఆసియా కప్ సెమీఫైనల్లో, 2019 ఆసియా కప్ ఫైనల్లో భారత్నే విజయం వరించింది. గత ఏడాది ఇంగ్లండ్లో జరిగిన పోరులో బంగ్లాదేశ్ 2 వికెట్లతో భారత్ను ఓడించింది. -
'ఫైనల్లో బంగ్లాదేశ్ను కుమ్మేయండి'
ఆక్లాండ్ : అండర్ 19 ప్రపంచకప్లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రూమ్ లో సేన్వెస్ పార్క్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజార, అజింక్యా రహానే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ముందుగా ఫైనల్ చేరినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఓటమనేది ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించారు. ఫైనల్లోనూ ఇదే తరహాలో ఆడి బంగ్లాదేశ్ను కుమ్మేయండి. ఈసారి కూడా కప్పు మనదే అవ్వాలి' అంటూ పేర్కొన్నారు. (ఇదే రోజు పాకిస్తాన్పై అద్భుతం..) కాగా సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను టీమిండియా కుర్రాళ్లు 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఏడవ సారి ఫైనల్కు చేరుకుంది. ప్రసుత్తం టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆడేందుకు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకున్నారు. చటేశ్వర్ పుజారా 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్లో 349 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. అప్పటి ప్రపంచకప్ ఫైనల్ పాకిస్తాన్- ఇండియా మధ్య జరగ్గా, పాక్ 38 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. (బంగ్లాదేశ్ వచ్చేసింది ) -
బంగ్లాదేశ్ను కుమ్మేయండి
-
సీనియర్స్తో బేరాలాడితే ఇలానే ఉంటుంది
కరాచీ: అండర్-19 వరల్డ్కప్లో భారత్ అద్భుత ప్రదర్శనను కొనియాడిన పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తమ జట్టును మాత్రం దుమ్మెత్తిపోశాడు. అసలు ఆట ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత యువ జట్టును చూసి నేర్చుకోవాలంటూ చురకలంటించాడు. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రదర్శనపై అక్తర్ మండిపడ్డాడు. ప్రత్యేకంగా భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ను కొనియాడాడు. ఒక పానీపూరీ అమ్ముకుంటూ జట్టులో చోటు కోసం కష్టపడటమే కాకుండా కీలక సమయంలో తనలోని సత్తాను చాటి జట్టు నమ్మకాన్ని జైస్వాల్ నిలబెడితే, మీరంతా కలిసి ‘మేము ఇంతే’ అన్నట్లు ఏదో మొక్కుబడిగా ఆడేసి వచ్చారంటూ విమర్శించాడు. (ఇక్కడ చదవండి: పది వికెట్లతో పని పట్టారు) ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని కూడా అక్తర్ వదిలి పెట్టలేదు. అండర్-19 వరల్డ్కప్కు వెళ్లే జట్టుకు ఆ స్థాయి వరకూ మాత్రమే ఆడిన క్రికెటర్లతో కోచింగ్ ఇప్పిస్తారా అంటూ ధ్వజమెత్తాడు. పాకిస్తాన్లో ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉన్నా వారిని పట్టించుకోకుండా కింది స్థాయి కోచింగ్ ఇస్తే ఇలానే ఉంటుందంటూ ఎద్దేవా చేశాడు. ‘పాకిస్తాన్లో యూనస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు కదా. వారిద్దరూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సాయం అందించడానికి ముందుకొచ్చినా బోర్డు మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని చూసి నేర్చుకోండి. జూనియర్ స్థాయిలో వారి కోచింగ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. భారత్ క్రికెట్లో ద వాల్గా పిలవబడిన రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాడు అండర్-19, భారత్-‘ఎ’ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. చాలామంది క్రికెటర్లు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి ఇప్పుడు సత్తాను చాటుతున్నారు. జూనియర్ స్థాయి నుంచి క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంతో పాటు వారికి సరైన కోచింగ్ ఇవ్వాలి. అప్పుడే జట్టు బలంగా మారుతుంది. మరి మనం ఎప్పుడూ ఒక ప్రతిభ ఉన్న సీనియర్ క్రికెటర్ను అండర్-19 స్థాయిలో కోచ్గా నియమించుకుందాం. పీసీబీ ఏదో జాబ్ ఉందంటే యూనిస్ ఖాన్ దరఖాస్తు చేసుకుని మీ వద్దకు వచ్చాడు. అప్పుడు మీరేం చేశారు. అతనితో బేరాలాడారు. అతను రూ. 15 లక్షలు అడిగితే, మీరు రూ. 13 లక్షలకే చేయమంటూ గీత గీసుకుని కూర్చుకున్నారు. ఇదేనా సీనియర్ క్రికెటర్లకు ఇచ్చే విలువ. ఇలాగే దిగ్గజ క్రికెటర్లను ట్రీట్ చేస్తారా. మీరు అండర్ 19 స్థాయి క్రికెట్ ఆడిన వారితో మాత్రమే కోచింగ్ ఇప్పిస్తామంటే మన రాతలు ఎప్పటికీ ఇంతే’ అంటూ అక్తర్ విమర్శలు గుప్పించాడు. -
చిత్తుగా ఓడిన పాక్ ; ఫైనల్లో టీమిండియా
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ విధించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్105*పరుగులు(113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, దివ్యాన్ష్ సక్సేనా 59*పరుగులు(99 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ చేయడంతో టీమిండియా మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను చేజిక్కించుకొన్నారు. భారత ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక పాక్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కాగా గురువారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య జరగనున్న రెండో సెమీస్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో టీమిండియా తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 9(ఆదివారం) ఇదే స్టేడియంలో జరగనుంది. అంతకుముందు భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా, రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైశ్వాల్లు ఒక్కో వికెట్ తీశారు. -
టీమిండియా టార్గెట్ 173 పరుగులు..
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో పాక్ జట్టు టీమిండియాకు 173 పరుగులను విజయలక్ష్యంగా నిర్ధేశించింది. భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. ఆది నుంచే టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును ఒక ఆట ఆడుకున్నారు. దీంతో పాక్ జట్టులో ముగ్గురు బ్యాట్సమెన్ తప్ప మిగతావారెవరూ రెండెంకల స్కోరు నమోదు చేయలేకపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారనేది అర్థమవుతుంది. పాక్ బ్యాట్సమెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్సమెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా , రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైస్వాల్లు ఒక్కో వికెట్ తీశారు.(పాక్ పనిపడుతున్న టీమిండియా బౌలర్లు) -
భారత్తో సెమీఫైనల్; టాస్ గెలిచిన పాక్
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్-19 వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నాయి. దాయాదుల మధ్య పోరు కావడం, గెలిచిన జట్టు ఫైనల్కు వెళ్లనుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్పైనే ఉంది. ఇరు జట్లు కూడా లీగ్ దశలో అద్భుతమైన ఆట తీరు కనబరచడంతో ఈ మ్యాచ్పై మరింత ఆసక్తి నెలకొంది. అండర్-19 ప్రపంచకప్లో భారత్ ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్స్ ఫైనల్ల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు పాకిస్తాన్ ప్రపంచకప్లో మూడు మ్యాచ్లో విజయం సాధించగా.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. టోర్నీలో భారత్ అత్యధిక స్కోరు 297 కాగా పాక్ 294 పరుగులు చేసింది. బౌలింగ్లో భారత్ మొత్తం 40 వికెట్లు పడగొట్టగా, పాక్ 39 వికెట్లు తీసింది. అండర్-19 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ల మధ్య మొత్తం 9 మ్యాచ్లు జరగగా.. భారత్ 4 గెలిచి, 5 ఓడింది. అయితే గత మూడు సమరాల్లో భారత్దే పైచేయి. 1988, 2002, 2004, 2006, 2010 లలో పాకిస్తాన్ గెలిస్తే.. 1998, 2012,2014, 2018లలో భారత్ విజయం సాధించింది. -
నేడు భారత్-పాకిస్తాన్ సెమీఫైనల్
వాళ్లంతా టీనేజ్ దాటని కుర్రాళ్లే. కానీ ప్రత్యర్థితో సీరియస్గా వ్యవహరించడంలో సీనియర్లకంటే మిన్నగానే కనిపిస్తున్నారు. సరదా పలకరింపులు లేవు, హ్యాండ్షేక్లు అసలే కనిపించడం లేదు, అలా పక్క నుంచి ‘ఆ’ జట్టు ఆటగాడు వెళుతున్నాడంటే తమ సంభాషణ కూడా ఆపేస్తున్నారు. భోజనం క్యూలో అవతలి జట్టు ఆటగాడి వెనుక మరొకరు నిల్చోవాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా కాస్త మొహంపై చిరునవ్వు చూపించడం కష్టంగా మారిపోయింది. ఇరు జట్ల క్రికెటర్లంతా వీర గంభీరంగా కనిపిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే సరిహద్దుకు ఆవల, ఇవతల అన్నట్లుగా యువ ఆటగాళ్లు వ్యవహరించడం ఇరు జట్ల ప్రాక్టీస్లో స్పష్టంగా కనిపించింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం అంటే దశాబ్దాలుగా ఎంతటి ఆసక్తి, మ్యాచ్కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. వేదిక, స్థాయి ఏదైనా అది ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు మరోసారి దాయాదుల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. యువ ప్రపంచకప్ సెమీస్లో తలపడుతున్న వీరిలో ముందంజ వేసేది ఎవరనేది ఆసక్తికరం. పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరి కొన్ని గంటల్లో మెగా క్రికెట్ సమరం జరగనుంది. ఈసారి ఈ పోరులో కుర్రాళ్లు తలపడుతున్నారు. అండర్–19 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీ పోరుకు ‘సై’ అంటున్నాయి. భారత్ గతంలో నాలుగు సార్లు ప్రపంచ కప్ను సొంతం చేసుకుంటే... పాక్ రెండు సార్లు విజేతగా నిలిచింది. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి కాబట్టి విజేతను అంచనా వేయడం అంత సులువు కాదు. టోర్నీలో భారత్ అత్యధిక స్కోరు 297 కాగా పాక్ 294 పరుగులు చేసింది. బౌలింగ్లో భారత్ మొత్తం 40 వికెట్లు పడగొట్టగా, పాక్ 39 వికెట్లు తీసింది. ప్రియమ్ గార్గ్ యశస్వి మినహా... డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగితున్న భారత జట్టు ఇప్పటి వరకు కనిపించని బ్యాటింగ్ లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. లీగ్ దశలో మన టీమ్ 3 మ్యాచ్లూ గెలిచి అజేయంగా నిలిచింది. ఇందులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే 3 అర్ధసెంచరీలు సహా 207 పరుగులతో మెరిశాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న దివ్యాంశ్ సక్సేనా (89 పరుగులు) మధ్య ఉన్న తేడా చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. తక్కువ స్కోర్లు ఛేదించాల్సి రావడం వాస్తవమే అయినా ఒక వన్డే మ్యాచ్లో భారత్ స్థాయికి తగ్గ బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అది కనిపించింది. ఇతర ప్రధాన బ్యాట్స్మెన్ సిద్ధేశ్ వీర్, జురేన్, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే అతనికి ఈ మ్యాచ్ చిరకాలం గుర్తుండిపోతుంది. మన బౌలింగ్ మాత్రం చక్కగా రాణిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ 11 వికెట్లు పడగొట్టగా, పేసర్ కార్తీక్ త్యాగి 9 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆకాశ్ సింగ్, అథర్వ అంకోలేకర్ కూడా ఇప్పటికే తమ సత్తా చాటారు. పాక్ కూడా... రొహైల్ నజీర్ పాకిస్తాన్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్కంటే బౌలింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. టీమ్ తరఫున మొహమ్మద్ హారిస్ ఒక్కడే మొత్తం స్కోరు వంద పరుగులు దాటగా (110) ఒక మ్యాచ్ రద్దు కారణంగా ఎక్కువ మంది బ్యాట్స్మెన్కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఖాసిమ్ అక్రమ్, హైదర్ అలీ, కెప్టెన్ రొహైల్ నజీర్, ఇర్ఫాన్ ఖాన్, ఫహద్ మునీర్ ఇతర ప్రధాన బ్యాట్స్మెన్. గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో మాత్రం అబ్బాస్ అఫ్రిది (9 వికెట్లు), ఆమిర్ ఖాన్, తాహిర్ హుస్సేన్ (చెరో 7 వికెట్లు) ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శిస్తూ చెలరేగారు. ఈ ముగ్గురు పేస్ బౌలర్లు ఇప్పుడు భారత టాపార్డర్ను దెబ్బ తీయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టులో ప్రధానంగా కనిపిస్తున్న లోటు. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి పాకిస్తాన్
బెనోని: అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రత్యర్థి ఖరారైంది. ఈ నెల 4న జరిగే తొలి సెమీస్లో టీమిండియాతో పాకిస్తాన్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ 49.1 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ జఖీల్ (40) టాప్ స్కోరర్గా నిలవగా ఆమిర్ ఖాన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా (76 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హురైరాను అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ ‘మన్కడింగ్’ ద్వారా రనౌట్ చేయడం ఈ మ్యాచ్లో వివాదం రేపింది. -
99 వద్ద ఔట్.. కివీస్ క్రీడా స్ఫూర్తి!
బెనోని(దక్షిణాఫ్రికా): అండర్-19 వరల్డ్కప్లో న్యూజిలాండ్ సెమీస్లోకి ప్రవేశించింది. బుధవారం వెస్టిండీస్తో జరిగిన సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్-2లో న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 47.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. దాంతో 239 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్ రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. అయితే విండీస్ బ్యాటింగ్ చేసే క్రమంలో సెకండ్ డౌన్లో వచ్చిన కిర్క్ మెకంజీ కుడి కాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో సతమతమయ్యాడు. (ఇక్కడ చదవండి: కోతి కాటు.. వరల్డ్కప్ నుంచి ఔట్!) ఈ క్రమంలోనే 99 పరుగుల వద్ద ఉండగా రిటర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. 43 ఓవర్ చివరి బంతికి పెవిలియన్ వీడాడు. కాగా, విండీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చిన మెకంజీ 99 పరుగుల వద్దే ఆఖరి వికెట్గా ఔటయ్యాడు. మళ్లీ స్టైకింగ్కు వచ్చి ఆడిన తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. దాంతో విండీస్ ఇన్నింగ్స్ 13 బంతులు ఉండగా ముగిసింది. అయితే కాలిపిక్క గాయంతో సతమతమైన మెకంజీ పెవిలియన్కు చేరుకునే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. విపరీతమైన నొప్పితో సతమతమవుతూ నడవడానికి ఇబ్బంది పడటంతో కివీస్ ఆటగాళ్లు ఇద్దరు అతన్ని భుజాలపై వేసుకుని బౌండరీ లైన్ వరకూ తీసుకెళ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. దీనిపై టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ తన ట్వీటర్ అకౌంట్లో ‘ఇది కదా స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అంటూ పోస్ట్ చేశాడు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: సెమీస్లో యువ భారత్) So good to see this #SpiritOfCricket at its best. https://t.co/qzUZjEuRt5 — Rohit Sharma (@ImRo45) January 30, 2020 -
కోతి కాటు.. వరల్డ్కప్ నుంచి ఔట్!
పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్ నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్ జాక్ ఫ్రాసర్ మెక్ గర్క్ వైదొలిగాడు. ఈ వరల్డ్కప్లో ఆసీస్ క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి పాలుకాగా, ఐదో స్థానం కోసం ప్లే ఆఫ్ సెమీ ఫైనల్-2 ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు మెక్ గర్క్ దూరమైన విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ధృవీకరించింది. భారత్తో మ్యాచ్కు ముందే అతన్ని కోతి కరిచినా దాన్ని సీరియస్గా తీసుకోపోవడంతో బరిలోకి దిగాడు. భారత్తో మ్యాచ్లో డైమండ్ డక్గా మెక్ గర్క్ నిష్క్రమించాడు. కనీసం బంతి కూడా ఆడకుండానే రనౌట్గా పెవిలియన్ చేరాడు. (ఇక్కడ చదవండి: సెమీస్లో యువ భారత్) వారం రోజుల క్రితం ఇంగ్లండ్పై విజయం సాధించిన తర్వాత బయటకు వెళ్లిన మెక్ గర్క్ను కోతి కరిచింది. దీనికి జట్టు మెడికల్ వైద్య బృందం చికిత్స చేయడంతో భారత్తో మ్యాచ్లో ఆడాడు. కాగా, ఏడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉండటంతో మెక్ గర్క్ తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఫలితంగా ఆసీస్తో జట్టుకు దూరమయ్యాడు. చికిత్స తర్వాత మెక్ గర్క్ అందుబాటులో ఉండాడని సీఏ తెలిపింది. ఆసీస్తో జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో భారత్ 74 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేయగా, తర్వాత ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. -
‘జూనియర్ మలింగా’ వరల్డ్ రికార్డు
బ్లోమ్ఫొంటెన్: సుమారు నాలుగు నెలల క్రితం శ్రీలంక కాలేజ్ క్రికెట్ స్థాయిలో ఎక్కువగా వినిపించిన పేరు మతీషా పతిరాణా. అచ్చం లసిత్ మలింగా తరహా యాక్షన్ను పోలి ఉండే పతిరాణా.. ఇప్పుడు అండర్-19 క్రికెట్ ఆడేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్లో ఒక కాలేజ్ మ్యాచ్లో పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా చేసుకుని బ్యాట్స్మెన్కు వణుకుపుట్టించాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు పతిరాణా అండర్-19 వరల్డ్కప్ ఆడటానికి కారణమైంది. అయితే ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పతిరాణా వికెట్ సాధించకపోయినప్పటికీ ఒక వరల్డ్ రికార్డును మాత్రం లిఖించాడు. పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్గా పిలవబడే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును పతిరాణా బ్రేక్ చేశాడు. నిన్నటి మ్యాచ్లో పతిరాణా 175 కి.మీ వేగంతో బంతిని సంధించి కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ స్థాయిలోనైనా ఇదే ఫాస్టెస్ట్ బాల్. భారత్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సంధించిన బంతి రికార్డు పుస్తకాల్లో లిఖించబడింది. అయితే ఆ బంతి వైడ్ బాల్ కావడంతో ఎక్స్ట్రా రూపంలో భారత్కు పరుగు వచ్చింది. 2003 వరల్డ్కప్లో షోయబ్ అక్తర్ 161.3కి.మీ వేగంతో వేసిన బంతి ఫాస్టెస్ట్ బాల్గా ఇప్పటివరకూ ఉండగా దాన్ని పతిరాణా బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: యువ భారత్ శుభారంభం) -
చెలరేగిన వసీం జూనియర్
పోచెఫ్స్ట్రూమ్(దక్షిణాఫ్రికా): అండర్-19 వన్డే వరల్డ్కప్లో భారత్ శుభారంభం చేస్తే, పాకిస్తాన్ కూడా తమ తొలి మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజృంభించి ఆడింది. సంచలనాలకు మారుపేరైన స్కాట్లాండ్ను తొలుత 23.5 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చిన పాకిస్తాన్.. ఆపై 11.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో మెగా టోర్నీలో పాకిస్తాన్ సైతం శుభారంభం చేసింది. (ఇక్కడ చదవండి: యువ భారత్ శుభారంభం) పాకిస్తాన్ బౌలర్లలో పేసర్ మహ్మద్ వసీం జూనియర్ ఐదు వికెట్లతో స్కాట్లాండ్ పతనాన్ని శాసించాడు. 7.5 ఓవర్లలో రెండు మెయిడన్ల సాయంతో 12 పరుగులే ఇచ్చిన వసీం.. స్కాట్లాండ్ జట్టులోని సగం వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మరొకవైపు తాహీర్ హుస్సేన్ మూడు వికెట్లు సాధించగా, అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. దాంతో స్కాట్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అటు తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ ఓపెనర్ల వికెట్లను నాలుగు పరుగులకే కోల్పోయింది. మహ్మద్ షెహజాద్ డకౌట్ కాగా, హైదర్ ఆలీ(4) విఫలమయ్యాడు. ఆపై ఇర్ఫాన్ ఖాన్(38 నాటౌట్)కు జతగా రోహైల్ నాజిర్(27)లు పాకిస్తాన్ను ఇన్నింగ్స్ను నిలబెట్టగా, ఖాసీం అక్రమ్(5 నాటౌట్) ఫోర్ కొట్టి పాకిస్తాన్ను గెలిపించాడు. -
షాట్స్ ఆడటం క్రైమ్ కాదు: రోహిత్
ముంబై: వచ్చే ఏడాది జనవరి నెలలో దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్కప్ జరుగనున్న తరుణంలో భారత యువ క్రికెటర్లకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. వరల్డ్కప్తో తిరిగి రావాలని ఆకాంక్షించాడు. అదే సమయంలో ఆ టోర్నీలో యువ ఆటగాళ్లకు తమ సహజ సిద్ధమైన ఆటతో ఆడే స్వేచ్ఛ ఇవ్వాలని మేనేజ్మెంట్కు విన్నవించాడు. వారిపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసుకోవడం మేనేజ్మెంట్ తమ విధిగా గుర్తించాలన్నాడు. మనోళ్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తే వరల్డ్కప్ను సగర్వంగా తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా ప్రియాంక్ గార్గ్ నేతృత్వంలోని యువ జట్టుకు ముందుగా అభినందనలు తెలిపాడు. ‘కవర్ డ్రైవర్లతో పాటు భారీ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. గాల్లోకి షాట్లను ఆడటం క్రైమ్ కాదు అనే విషయం గ్రహించాలి. ఒకవేళ భారీ షాట్లు ఆడే క్రమంలో ఆటగాళ్లు ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేయండి.. అంతేకానీ వారి సహజసిద్ధమైన షాట్లను ఆడొద్దని నివారించకండి. మనం గాల్లో షాట్లను కొడుతూనే క్రికెట్ ఆటలో పెరిగాం. భారీ షాట్లు ఆడేటప్పుడు అవి సరైనవి కాకపోతే వాటిని నెట్స్లో సరి చేసుకున్నాం.. ఫలితాలు రాబట్టాం. ఒక ఆటగాడు భారీ షాట్లతో ఫలితాలు రాబడుతున్నప్పుడు అప్పుడు అందులో తప్పేముంటుంది. ప్రస్తుత జనరేషన్లో షాట్లు ఆడాలనుకుంటున్న వారే ఎక్కువ. కాకపోతే గేమ్ స్థితి గతుల్ని బట్టి బ్యాటింగ్ను మార్చుకోవడం చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఒక క్రికెటర్ పదే పదే ఒకే తరహా తప్పిదం చేస్తుంటే వారిని తదుపరి గేమ్కు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. నా దృష్టిలో షాట్లు ఆడటం క్రైమ్ కాదు’ అని రోహిత్ పేర్కొన్నాడు. జనవరి 17వ తేదీ నుంచి అండర్-19 వరల్డ్కప్ ఆరంభం కానుంది. కాగా, గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టు తన తొలి మ్యాచ్ను శ్రీలంకతో జనవరి 19వ తేదీన ఆడనుంది. -
ఐసీసీ సెల్ఫీ డే స్పెషల్
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. ‘మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి’ అంటూ ఐసీసీ ఆ షేర్లో పేర్కొంది. గత ఏడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ఐసీసీ షేర్ చేసిన ఫోటోల్లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందం ఉంది. 2017 మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు సెల్ఫీ ఫోటో, 2018లో చాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్ జట్టు ఫోటో, ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. To celebrate World #SelfieDay, let's see some of your favourite cricket-related selfies! 😁🤳 pic.twitter.com/d4RbB5Rols — ICC (@ICC) 21 June 2018 -
ఇండియాకు ఫ్యూచర్ సచిన్ దొరికేశాడోచ్!
-
'ద్రవిడ్ సర్కు భయపడ్డాం'
ముంబై: ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు సభ్యులంతా కోచ్ రాహుల్ ద్రవిడ్కు భయపడ్డామని పేస్ బౌలర్ నాగర్కోటి తెలిపాడు. సరదాగా కొన్నిసార్లు బయటకు వెళ్లడానికి ద్రవిడ్ సర్ అనుమతించినా.. నిర్ణీత సమయంలోపు హోటల్కు కచ్చితంగా రావాలనే ఆదేశాలు ఉండేయన్నాడు. దాంతో బయటకు వెళ్లినా భయపడుతూనే వెళ్లేవాళ్లమన్నాడు. కాకపోతే ఆయన విధించిన నిషేధాజ్ఞలను తామెప్పుడూ ఉల్లంఘించలేదని చెప్పాడు. కొన్నిసార్లు సాహసకృత్యాలు చేద్దామనుకున్నా అనుమతించేవారు కాదన్నాడు. ద్రవిడ్ సర్ అంటే మాకు కాస్త భయం. అందుకే ఎప్పుడూ ఎలాంటి దుందుడుగు నిర్ణయాలు తీసుకోలేదు. కొన్నిసార్లు సాహసకృత్యాలు చేయాలనుకున్నా సర్ మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. సర్ మనకోసమే ఆంక్షలు విధించి ఉంటారని అనుకుని జాగ్రత్తగా నడుచుకునే వాళ్లం. నేను తీసుకున్న తొలి అటోగ్రాఫ్ ద్రవిడ్దే' అని నాగర్కోటి తెలిపాడు. -
'ఐపీఎల్ వేలంతో కలత చెందా'
-
పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లలేదు
-
'ఐపీఎల్ వేలంతో కలత చెందా'
ముంబై: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు సోమవారం స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్ జట్టు కప్ను సొంతం చేసుకుంది. అయితే భారత యువ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను కొన్ని విషయాలు కలత చెందేలా చేశాయట. ఒకవైపు భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం జరగడం తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన ద్రవిడ్..'ఐపీఎల్ వేలానికి ముందు, వెనుక ఒక వారం రోజుల పాటు పరిస్థితులు ఇబ్బందికరంగా సాగాయి. కాగా కుర్రాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకు వారిని కచ్చితంగా అభినందించాలి. ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే ప్రాక్టీస్ను కొనసాగించారు. ఆ మూడు రోజులు నాకు చాలా భయంగా అనిపించింది. ఐపీఎల్ వేలంతో కుర్రాళ్లు ఆందోళనకు లోనై మెగా టోర్నీలో ఏకాగ్రాత చూపలేకపోతారేమో అని భయపడ్డా. వాటిని అధిగమించి వరల్డ్ కప్ సాధించిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి' అని ద్రవిడ్ తెలిపాడు. -
పాక్ డ్రెస్సింగ్ రూమ్ వార్తలపై ద్రవిడ్ క్లారిటీ
ముంబై: అండర్-19లో వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్..పాక్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పాక్ ఆటగాళ్లలో స్ఫూర్తినింపేందుకు ఆ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ పిలుపు మేరకు ద్రవిడ్ వారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ముచ్చటించినట్లు రూమర్లు వ్యాపించాయి. అయితే వీటిని తాజాగా రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. వరల్డ్ కప్ గెలిచి సోమవారం స్వదేశానికి వచ్చిన తర్వాత రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. అందులో భాగంగా ఒక విలేకరి నుంచి ఎదురైన ప్రశ్నకు ద్రవిడ్ కూల్గా బదులిచ్చాడు. 'నేను పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లలేదు. కేవలం పాక్ జట్టులోని ఒక లెఫార్మ్ పేసర్ని మాత్రమే అభినందించా. అది కూడా డ్రెస్సింగ్ రూమ్కి బయటే. అంతేకానీ వారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి వారితో ఎటువంటి చర్చలు జరపలేదు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ కోచ్ మన కుర్రాళ్లు బాగా ఆడారని అభినందించారు. అంతవరకూ మాత్రమే జరిగింది' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. గత 14-16 నెలల కృషికి లభించిన ఫలితమే ఈ వరల్డ్ కప్ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, తుది పోరులో తమ స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయామన్నాడు. -
ద్రవిడ్పై మోదీ ప్రశంసలు
బెంగళూరు: అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత జట్టు ఒక్క ఓటమిని కూడా చవిచూడకుండా భారీ విజయాలతో వరల్డ్ కప్ను సొంతం చేసుకుందంటే ఆ వెనుక ద్రవిడ్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ మేరకు ఆదివారం బెంగళూరు పర్యటనలో భాగంగా ప్యాలెస్ గ్రౌండ్ మెగా ర్యాలీలో ద్రవిడ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. 'నీతి నిజాయితీకి ద్రవిడ్ మరోమారు. అదే భారత్కు చిరస్మరణీయమైన వరల్డ్ కప్ను అందించింది. భారత విజయం వెనుక ద్రవిడ్ పాత్ర అమోఘం. మనందరికీ అతనొక ఆదర్శం. నీతిగా పని చేయాలనేది ద్రవిడ్ను చూసి నేర్చుకుందాం' అని మోదీ ప్రశంసించారు. ఇటీవల న్యూజిలాండ్ వేదికగా ముగిసిన అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ను కూడా కోల్పోకుండా ద్రవిడ్ పర్యవేక్షణలోని యువ భారత జట్టు కప్ను సొంతం చేసుకుంది. -
అదే మా కొంప ముంచింది : పాక్ మేనేజర్
ఇస్లామాబాద్ : అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చిత్తుగా 69 పరుగులకే అలౌట్ చేసి 203 పరుగుల తేడాతో భారత్ ఎదురులేని విజయాన్ని సాధించింది. అయితే ఈ ఓటమిపై పాక్లో జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. టీమిండియాను పొగుడుతూ జట్టు మేనేజర్ నాదిమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ‘‘273 పరుగుల లక్ష్య చేధన పెద్ద విషయం ఏం కాదు. పైగా పాక్ జట్టు చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఇంత తక్కువ స్కోర్కు అవుట్ కావటం నమ్మశక్యం కావటం లేదు. ఆట జరిగిన తీరును గమనిస్తే పాక్ ప్లేయర్లపై ‘మ్యాజిక్ స్పెల్’ బాగా పని చేసిందనిపిస్తోంది. ఆ ఓవర్లలో భారత బౌలర్లు వేసిన బంతులు టర్న్ కావటంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఒత్తికి గురై వికెట్లను జేరాచ్చుకున్నారు’’అని వ్యాఖ్యానించాడు. దీంతోపాటు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్పై నాదిమ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అయితే నాదిమ్ ప్రకటనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన ఆయన ఈసారి ఆటగాళ్ల వైఫల్యాన్ని ఎండగట్టారు. పాక్ చరిత్రలో ఇంత చెత్త అండర్ 19 టీమ్ను చూడలేదని.. వారంతా చాలా అంశాల్లో వెనకబడి ఉన్నారని వ్యాఖ్యానించి ఈసారి ఆటగాళ్ల నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. -
ఐసీసీ టీమ్లో సగం మంది మనోళ్లే..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన అండర్-19 వరల్డ్ కప్ జట్టులో దాదాపు సగం మంది భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఆటగాళ్ల గౌరవ సూచకంగా ఎంపిక చేసిన జట్టులో భారత యువ ఆటగాళ్లు పృథ్వీషా, మన్జోత్ కల్రా, శుభమాన్ గిల్, అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్కోటిలకు స్థానం దక్కింది. ఇందులో పృథ్వీషా, మన్జోత్ కల్రా, శుభమన్ గిల్లు బ్యాట్స్మెన్లు కాగా, కమలేష్ నాగర్ కోటి, అనుకుల్ రాయ్లు బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్.. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసింది. శనివారం ఆసీస్ జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో బ్యాటింగ్ విభాగంలో పృథ్వీషా(261 పరుగులు), కల్రా(252 పరుగులు), శుభ్మన్ గిల్(372 పరుగులు) విశేషంగా ఆకట్టుకున్నారు. కాగా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనుకుల్ రాయ్ 14 వికెట్లను సాధించగా, నాగర్కోటి 9 వికెట్లను తీశాడు. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ జట్టు(బ్యాటింగ్ ఆర్డర్) పృథ్వీషా(భారత్), మన్జోత్ కల్రా(భారత్), శుభమన్ గిల్(భారత్), ఫిల్ అలెన్(న్యూజిలాండ్), రాయ్నార్డ్ వాన్ టోండర్(దక్షిణాఫ్రికా,కెప్టెన్), వాండైల్ మక్వెటు(దక్షిణాఫ్రికా, వికెట్ కీపర్),అనుకుల్ రాయ్(భారత్), కమలేష నాగర్కోటి(భారత్),గెరాల్డ్ కోట్జి(దక్షిణాఫ్రికా), ఖాయిస్ అహ్మద్(అఫ్గానిస్తాన్), షహీన్ ఆఫ్రిది( పాకిస్తాన్), 12వ ఆటగాడు అలిక్ అథనాజే(వెస్టిండీస్) -
రెండో భారత క్రికెటర్గా..
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్ను భారత్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఓపెనర్ మన్జోత్ కల్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భాగంగా తుది పోరులో శతకం సాధించిన రెండో భారత క్రికెటర్గా మన్జోత్ నిలిచాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో మన్జోత్(101 నాటౌట్) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2012లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ శతకం సాధించాడు. ఆ తర్వాత మెగా పోరు ఫైనల్లో శతకం సాధించిన టీమిండియా ఆటగాడు మన్జోత్ కల్రానే. ఓవరాల్గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్జోత్.1988 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు బ్రెట్ విలియమ్స్ శతకం సాధించి తొలి ఆటగాడిగా నిలవగా, 1998 తుది పోరులో ఇంగ్లండ్ ఆటగాడు స్టీఫెన్ పీటర్స్ సెంచరీ సాధించాడు. 2002లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు జారడ్ బర్క్ శతకం సాధించాడు. -
ఈ విజయం పట్ల గర్వంగా ఉంది
-
భారత్ కొత్త రికార్డు
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం ఆసీస్తో జరిగిన తుది పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం భారత జట్టు సమష్టిగా రాణించడంతో పరాజయమనే మాటే రాకుండా కప్ను సగర్వంగా అందుకుంది. ఫలితంగా అత్యధిక సార్లు అండర్-19 వరల్డ్ కప్ను గెలిచి కొత్త చరిత్రను లిఖించింది. ఇప్పటివరకూ ఆసీస్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నాలుగు టైటిల్స్ గెలిచిన ఏకైక జట్టుగా ప్రథమ స్థానంలో నిలిచింది. అంతకుముందు 2000లో మొహ్మద్ కైఫ్ నేతృత్వంలోని భారత్ జట్టు.. తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ను గెలవగా, 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని యువ టీమిండియా రెండోసారి కప్ సాధించింది. ఆపై 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ మరోమారు వరల్డ్కప్ను అందుకుంది. తాజాగా నాల్గోసారి విశ్వవిజేతగా అవతరించింది. 2016లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ పోరులో చతికిలబడిన యువ భారత్.. ఈసారి జైత్రయాత్రను కడవరకూ కొనసాగించి తమకు తిరుగులేదని నిరూపించింది.శనివారం ఆసీస్తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్ను సొంతం చేసుకుంది. -
ఈ విజయం పట్ల గర్వంగా ఉంది- ద్రవిడ్
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్కప్ను భారత యువ జట్టు గెలవడంపై ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆనంద వ్యక్తం చేశారు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘కుర్రాళ్ల ఆట పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర మరవలేనిది. గత 14 నెలలుగా మేం కష్టపడ్డాం. ఈ గెలుపుకు మేం అర్హులమే. ఈ విజయం ఆటగాళ్లకు చిరకాలం గుర్తుండిపోయేదే. ఇక కుర్రాళ్లుకు ఈ విజయం ఓ తీపి గుర్తే కాకుండా వారి భవిష్యత్తును నిర్ధేశిస్తుంది. వారి కెరీర్లో ఇలాంటి విజయాలు మరిన్ని అందుకుంటారు. కోచ్గా చాల శ్రద్ధ వహించాను. దీనికి ఇతర సహాయక సిబ్బంది చాలా మద్దతిచ్చారు. గత 14 నెలలుగా 8 మంది సిబ్బందిమి తీవ్రంగా శ్రమించాం. ఈ ప్రయత్నం అద్భుతాన్ని ఇచ్చింది. జట్టు సహాయక సిబ్బందిలో నేను ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. కుర్రాళ్లకు ఏం కావాలో అదే అందించాం. వారు మైదానంలో అద్భుతంగా రాణించారు.’ అని ద్రవిడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక శనివారం ఆసీస్తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసి వరల్డ్ కప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్నిఓపెనర్ మన్జోత్ కల్రా అజయ సెంచరీతో 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్ను సొంతం చేసుకుంది. ఫలితంగా నాలుగోసారి వరల్డ్ కప్ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. -
యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా
న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. యువ భారత జట్టుకు కోచ్గా సేవలందిస్తున్న రాహుల్ ద్రవిడ్కు రూ. 50లక్షలను బహుమతిగా ప్రకటించిన బీసీసీఐ.. వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్లకు తలో రూ. 30 లక్షల చొప్పన ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మరొకవైపు ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సేవలందించిన సపోర్టింగ్ స్టాఫ్కు సైతం రూ. 20లక్షల నజరానాను ప్రకటించింది. ఈ మేరకు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ తన ట్వీటర్ అకౌంట్లో నజరానా విషయాని వెల్లడించింది. అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా శనివారం ఆసీస్తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఫలితంగా నాల్గోసారి వరల్డ్ కప్ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్ను సొంతం చేసుకుంది. -
కసిదీరా కొట్టారు.. వరల్డ్ కప్ పట్టారు
మౌంట్ మాంగనీ: కసిగా ఆడిన యువ టీమిండియా ముందు పటిష్టమైన ఆస్ట్రేలియా పసికూన అయ్యింది. భారత్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడిందో.. ఆసీస్ అంత తడబాటుకు గురైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఎందులోనూ పోటీయే లేదసలు. వెరసి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు వరల్డ్ కప్ను సాధించింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో చేసిన పొరపాట్లకు తావివ్వని భారత జట్టు.. ఈసారి ఫైనల్ ఒత్తిడిని అధిగమించి ప్రపంచకప్ను ముద్దాడింది. ఫలితంగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్కు అద్భుతమైన గిఫ్ట్ను అందించింది. అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా శనివారం ఆసీస్తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్కప్ను కైవసం చేసుకుంది. ఫలితంగా నాల్గోసారి వరల్ కప్ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్ను సొంతం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ వినువీధుల్లో జాతీయ జెండాను ఎగురవేసి భారత కీర్తిని మరింత పెంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఓపెనర్లు పృథ్వీషా, మన్జోత్ కర్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 11.4 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం సాధించి పటిష్ట స్థితికి చేర్చారు. పృథ్వీ షా(21) తొలి వికెట్గా పెవిలియన్ చేరినప్పటికీ మిగతా పనిని మన్జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు)లు పూర్తి చేశారు. శుభ్మాన్ గిల్(31) ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఆటగాళ్లలో జోనాథన్ మెర్లో(76;102 బంతుల్లో 6 ఫోర్లు) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. పరమ్ ఉప్పల్(34),జాక్ ఎడ్వర్డ్స్(28), నాథన్ మెక్ స్వీనీ(23)లు మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు. భారత జట్టుకు ప్రముఖుల అభినందనలు నాల్గోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందలు తెలియజేశారు. అద్బుతమైన గెలుపుతో ట్రోఫీని సొంతం చేసుకున్న భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మెగా టోర్నీలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడిన భారత కుర్రాళ్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి అభినందనలు తెలియజేశారు. Congratulations to Indian Under 19 cricket team and coach @Im_Dravid on the amazing win. #U19WorldCup. Jai Hind — YS Jagan Mohan Reddy (@ysjagan) 3 February 2018 -
వరల్డ్ కప్ ఫైనల్.. అప్పుడే మొదలైన సంబరాలు
సాక్షి, స్పోర్ట్స్ : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచే భారత అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఢిల్లీలోని అండర్ 19 ఆటగాడు ఫైనల్లో సెంచరీతో చెలరేగిన మన్జోత్ కర్లా ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. అస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యం చాలా చిన్నదని, ఆటగాళ్లందరూ మంచి ఫాంలో ఉన్నారని, భారత్ గెలుపు ఖాయమని మ్యాచ్ జరుగుతుండగానే మన్జోత్ కర్లా తల్లి రంజిత్ కర్లా జోస్యం చెప్పారు. రంజిత్ కర్లా చెప్పినట్టుగానే భారత కుర్రాళ్లు ఆసిస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నారు. ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో అలవోకగా గెలుపొందింది. ఈ గెలుపుతో అండర్-19 ప్రపంచకప్ను అత్యధిక సార్లు(నాలుగుసార్లు) గెలుపొందిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది. -
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు వర్షం అడ్డంకి
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకింగా మారాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మోస్తరుగా వర్షమే కావడంతో మ్యాచ్ తిరిగి ఆరంభం కావడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆసీస్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువ భారత్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. ఓపెనర్లు పృథ్వీ షా(10 బ్యాటింగ్), మన్జోత్ కర్లా(9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు. -
భారత్ లక్ష్యం 217 పరుగులు
-
మంజోత్ హాఫ్ సెంచరీ
సాక్షి, స్పోర్ట్స్ : అండర్ వరల్డ్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ కోల్పోయి 110 పరుగులు చేసింది. మంజోత్ కల్రా 50 పరుగులు, గిల్ 21 పరుగులు సాధించారు. మరో ఓపెనర్ షా 29 పరుగుల వద్ద సథర్ల్యాండ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అంతకు ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన ఆసీస్ 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు త్వరగా అవుటయినా తర్వాత వచ్చిన మెర్లో మాత్రం రాణించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ సాధించిన మెర్లో.. 76(102 బంతులు) పరుగుల వద్ద రోయ్ బౌలింగ్లో శివసింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి ఆసీస్ పతనం వేగం పుంజుకుంది.ఒకదశలో నిలకడగా సాగుతున్న ఆసీస్ బ్యాట్స్ మన్లను భారత బౌలర్లు ఒక్కసారిగా దెబ్బకొట్టారు. చివర్లో 5 వికెట్లను ఆస్ట్రేలియా జట్టు త్వరగా కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్మెన్ లలో ఉప్పల్ 34 పరుగులు, ఎడ్వర్డ్స్ 28, షరమ్ స్వీనే23 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు. మరో ఆటగాడు (హోల్ట్) రనౌట్ గా వెనుదిరిగాడు. -
కొత్త చరిత్ర సృష్టిస్తారా?
మౌంట్ మాంగనీ: యువ కెరటాల క్రికెట్ పండుగకు రేపటితో తెరపడనుంది. 22 రోజుల పాటుసాగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోరు మరికొద్ది గంటల్లో ముగియనుంది. యువ జట్ల మెగా సమరంలో భారత్-ఆస్ట్రేలియాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం ఉదయం గం. 6.30 ని.లకు మౌంట్ మాంగనీ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. తన తొలి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ ఘన విజయం సాధించిన పక్షంలో అదే ఫలితాన్ని అంతిమ సమరంలో కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని ముద్దాడి గత టోర్నీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టిన యువ భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షలోని భారత్ జట్టు తన జైత్రయాత్రను ఫైనల్లో కూడా కొనసాగించి కప్ను సొంతం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. 2000లో మొహ్మద్ కైఫ్ నేతృత్వంలోని భారత్ జట్టు.. తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ను గెలవగా, 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని యువ టీమిండియా రెండోసారి కప్ సాధించింది. ఆపై 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ మరోమారు వరల్డ్కప్ను అందుకుంది. అయితే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక కప్లు గెలిచిన ఘనత భారత్-ఆసీస్లది. ఈ రెండు జట్లు తలో మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఫలితంగా రేపటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచిన కొత్త చరిత్ర లిఖిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉండటంతో మెగా పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ పృథ్వీషాతో పాటు ఓపెనర్ శుబ్మాన్ గిల్లు మంచి ఫామ్లో ఉన్నారు. మరొకవైపు మన్జోత్ కర్లా, అభిషేక్ శర్మలు కూడా బ్యాటింగ్లో సత్తా చాటుతున్నారు. ఇక భారత బౌలింగ్ విభాగంలో శివం మావి,కమలేష్ నాగర్కోటిలు తమ పేస్ బౌలింగ్తో దుమ్మురేపుతున్నారు. ఇక స్పిన్ విభాగంలో అనుకుల్ రాయ్ జట్టు అవసరానికి తగ్గట్టు బౌలింగ్ చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. మరి భారత యువ జట్టు వరల్డ్ కప్ గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. -
సెమీస్లో చిత్తుగా ఓడిన పాక్
-
చెలరేగిన శుభ్మాన్ : పాక్ టార్గెట్ 273
-
వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్
క్రిస్ట్చర్చ్: అండర్-19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశించింది. అఫ్గానిస్తాన్తో జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా యువ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. అఫ్గానిస్తాన్ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 37.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు చేరాలనుకున్న అఫ్గాన్ ఆశలకు గండి పడింది. ఆసీస్ ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్(72;65 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అటు తరువాత కెప్టెన్ జాసన్ సంగా(26) ఫర్వాలేదనిపించగా, పరమ్ ఉప్పల్(32 నాటౌట్), నాథన్ మెక్ స్వీనీ(22 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ను 181 పరుగులకే ఆసీస్ కట్టడి చేసింది.అఫ్గాన్ ఆటగాళ్లలో ఇక్రమ్ అలీ ఖిల్(80) మినహా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో జొనాథాన్ మెర్లో నాలుగు వికెట్లతో రాణించగా,ఇవాన్స్కు రెండు వికెట్లు లభించాయి. ఇక హ్యాడ్లీ, ఎడ్వర్డ్స్, సదర్లాండ్, పోప్లకు తలో వికెట్ దక్కింది. మంగళవారం భారత్-పాకిస్తాన్ల రెండో సెమీస్ విజేతతో ఆసీస్ ఫైనల్లో తలపడనుంది. -
ఐపీఎల్ వేలం కాదు.. ఆటపై దృష్టి పెట్టండి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్ కప్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వేలం సంగతి పక్కన పెట్టి.. ముందు ఆటపై దృష్టిసారించాలని యువ ఆటగాళ్లకు ఆయన హితబోధ చేస్తున్నారు. ఐపీఎల్ వేలం కొనసాగుతున్న నేపథ్యంలో ద్రావిడ్ వ్యాఖ్యలను ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ప్రముఖంగా ప్రచురించింది. ‘‘సందేహామే లేదు. ఐపీఎల్లో తమను కొనుగోలు చేస్తారో? లేదో? అన్న ఆత్రుత యువ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, వాళ్లు ముందు ఆలోచించాల్సింది తమ ముందు ఉన్న లక్ష్యం గురించి. ఐపీఎల్ అనేది ప్రతీ ఏడాది ఉంటుంది. ఒకటి రెండు అవకాశాలు చేజారిన పెద్దగా బాధపడనక్కర్లేదు. అదేం మీ సుదీర్ఘ కెరీర్ మీద ప్రభావం చూపదు. కానీ, వరల్డ్కప్ ఆడే అదృష్టం మీకు పదే పదే మీకు దక్కకపోవచ్చు. కాబట్టి ఆలోచనలను ఆట మీద పెట్టండి’’ అని ది వాల్ యువ ఆటగాళ్లకు సూచించారు. సెమీఫైనల్లో పాకిస్తాన్తో భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాతో క్వార్టర్ ఫైనల్స్ కంటే ముందే ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్-19 ఆటగాళ్లలో కెప్టెన్ పృథ్వీషాతోపాటు శుభమన్ గిల్, హిమాన్షు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, కమలేష్ నా, హర్విక్ దేశాయ్ల పేర్లు ఐపీఎల్ వేలంలో పరిశీలనలో ఉన్నాయి. -
అండర్-19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ కొత్త చరిత్ర
-
అండర్ -19 వరల్డ్ కప్లో కొత్త చరిత్ర
క్వీన్స్టౌన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)-అండర్ 19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ లాయడ్ పోప్ సరికొత్త సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఇంగ్లండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో లాయడ్ పోప్ 35 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు సాధించాడు. ఫలితంగా అండర్ 19 వరల్డ్ కప్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. కాగా, ఈ వరల్ఢ్ కప్లో పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్కు చెందిన జాసన్ రాల్స్టాన్(7/15) నెలకొల్పిన రికార్డును లాయడ్ పోప్ స్వల్ప వ్యవధిలో బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం. మరొకవైపు లిస్ట్-ఎ క్రికెట్లో ఎనిమిది వికెట్లు సాధించిన రెండో ఆసీస్ క్రికెటర్గా లాయడ్ ఘనత సాధించాడు. 2003-04 సీజన్లో తస్మానియాతో జరిగిన మ్యాచ్లో షాన్ టాయిట్ ఎనిమిది వికెట్లు సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్. ఆసీస్ నిర్దేశించిన 127 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్కు లాయడ్ పోప్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ లియామ్ బాంక్స్(3)ను అవుట్ చేసిన పోప్.. ఆపై మరుసటి బంతికి ఫస్ట్ డౌన్లో వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ హర్రీ బ్రూక్ను డకౌట్గా పెవిలియన్కు పంపాడు. అటు తరువాత తన స్పిన్ మాయాజాలాన్ని కొనసాగించిన లాయడ్ పోప్ ఇంగ్లండ్ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. మొత్తంగా ఎనిమిది వికెట్లను సాధించి సత్తాచాటాడు. దాంతో 23.4 ఓవర్లలో 96 పరుగులకే పరిమితమైన ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ టామ్ బాన్టాన్(58) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించగా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. -
భారత కుర్రాళ్ల జోరు
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వరుస రెండు విజయాలతో క్వార్టర్స్ బెర్త్ను ఖాయం చేసుకున్న భారత్..తాజాగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ దుమ్మురేపింది. తొలుత జింబాబ్వేను 154 పరుగులకే కుప్పకూల్చిన భారత్ జట్టు..ఆపై 21.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటింది. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత యువ జట్టు గ్రూప్-బిలో టాప్ ప్లేస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసి 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మధవారే(30), షుంబా(36), నికోలస్ రోచ్(31)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాట్స్మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. భారత స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లు సాధించగా, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్లు తలో రెండు వికెట్లు తీశారు. అటు తరువాత సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లలో హార్విక్ దేశాయ్(56 నాటౌట్;73 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడగా, శుభ్మాన్ గిల్(90 నాటౌట్;59 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. దాంతో భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని క్వార్టర్స్లో బంగ్లాదేశ్తో పోరుకు సిద్దమైంది. -
మరో సచిన్ దొరికేశాడు!
-
భారత్ మరో ఘన విజయం
-
మెరిసిన అనుకుల్.. భారత్ ఘన విజయం
భారత యువ ఆటగాళ్లు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్లో జరుగుతున్నఅండర్ -19 ప్రపంచకప్లో మరో విజయాన్ని అందుకున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్తో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు, మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్తో రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకున్నారు. ఫలితంగా పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు అండర్ 19 ప్రపంచకప్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి భారత్.. పాపువా న్యూ గినియాను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత బౌలింగ్ ముందు ప్రత్యర్థి జట్టు తేలిపోయింది. ఏదశలోను పోటి ఇవ్వలేక పోయింది. యువ ఆటగాడు, ఆల్రౌండర్ అనుకుల్ రాయ్ మెరవడంతో అతి తక్కువ పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 21.5 ఓవర్లలో 64పరుగులకే ఆలౌటైంది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ తన బౌలింగ్తో న్యూగినియాకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ స్వల్పలక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ పృథ్వీ షా అర్ద సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. మరో బ్యాట్మెన్ మంజోత్ కర్లా 9 బంతుల్లో 9 పరుగులు చేసి పృథ్వీ షా కు సహకారం అందించాడు. ఇద్దరు కలిసి విజయానికి కావాల్సిన పరుగులను కేవలం 8 ఓవర్లలోనే బాదేశారు. -
అండర్-19 లో అనుకుల్ రాయ్ సంచలనం
న్యూజిలాండ్లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్లో భారతయువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్తో ఆష్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్తో తిప్పేశారు. ఆల్ రౌండర్గా ఎదుగుతున్న యువకెరటం అనుకుల్ రాయ్ తన బౌలింగ్తో పాపువా న్యూ గినియా నడ్డి విరిచారు. అండర్ 19 ప్రపంచకప్లో పాపువా న్యూ గినియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో యువ ఆటగాడు అనుకుల్ రాయ్ మెరిశాడు. బ్యాటింగ్లో రాణించే అనుకుల్ రాయ్ ఈసారి బంతితో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. రాయ్ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64పరుగులకే చాప చుట్టేసింది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్సింగ్ చెరో వికెట్ తీశారు. -
అండర్-19 వరల్డ్ కప్లో భారత బోణీ
-
ఇరగదీసిన భారత కుర్రాళ్లు..
క్రైస్ట్చర్చ్: అండర్-19 వరల్డ్ కప్లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 100 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో విభాగాల్లో సత్తాచాటిన భారత కుర్రాళ్లు.. పటిష్టమైన ఆసీస్కు షాకిచ్చారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 328 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు పృథ్వీ షా(94;100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మన్జోత్ కార్లా(86;99 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ జోడి తొలి వికెట్కు 180 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆపై శుభ్మాన్ గిల్(63; 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, అభిషేక్ శర్మ(23;8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అటు తరువాత 329 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు శివం మావి, కమలేష్ నాగర్కోటిల దెబ్బకు చాపచుట్టేసింది. వీరిద్దరూ తలో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. ఇక అభిషేక్ శర్మ, అన్కుల్ రాయ్ చెరో వికెట్ తీశారు. -
దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజయం
క్రిస్ట్చర్చ్:అండర్-19 వరల్డ్ కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత జట్టు 189 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ఆకట్టుకోవడంతో సఫారీలపై సునాయాసమైన విజయాన్ని భారత యువ జట్టు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు ఎనిమిది వికెట్లకు 332 పరుగులు చేసింది. ఆర్యన్ జుయాల్(86), హిమాన్షు రాణా(68)లు రాణించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఆపై లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైన దక్షిణాఫ్రికా 143 పరుగులకే చాపచుట్టేసింది. భారత పేసర్ ఇషాన్ పోరెల్ చెలరేగిపోయి సఫారీల పతనాన్ని శాసించాడు. పోరెల్ ఎనిమిది ఓవర్లలో 23 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా నడ్డివిరిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జీన్ డు ప్లెసిస్(50) హాఫ్ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఫలితంగా దక్షిణాఫ్రికా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
వరల్డ్ కప్లో బంగ్లాకు మూడో స్థానం
ఫతుల్లా:అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో బంగ్లా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుల బ్యాటింగ్ చేసి 48.5 ఓవర్లలో 214 పరుగులకు పరిమితమైంది. శ్రీలంక ఆటగాళ్లలో ఆశాలంకా(76)రాణించగా, వానిడు డిసిల్వా(30), సలిందూ పెరైరా(34) ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో్ శ్రీలంక సాధారణ స్కోరునే నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ చివరి ఓవర్ లో విజయం సాధించింది.హసన్ మిరాజ్(53),హుస్సేన్ షాంటో(40)లు ఆకట్టుకోగా,జాకర్ అలీ(31నాటౌట్), జోయ్ రాజ్ షేక్(26)లు మోస్తరుగా రాణించడంతో బంగ్లా ఏడు వికెట్ల నష్టానికి ఇంకా మూడు బంతులుండగా గెలుపును సొంతం చేసుకుంది. -
సెమీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ పశ్చాత్తాపం
ఢాకా:అండర్-19 వరల్డ్కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పట్ల ఆతిథ్య బంగ్లాదేశ్ కెప్టెన్ మెహ్దీ హాసన్ మీరజ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.తమ జట్టు మరిన్ని పరుగులు చేయడానికి అవకాశం ఉన్నా అనవసరం వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైనట్లు పేర్కొన్నాడు. ఆ ఓటమికి తాను కూడా పరోక్షంగా కారణమని స్పష్టం చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోవడమే తమ ఓటమికి ప్రధానకారణమన్నాడు. ఆఖరి ఐదు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే వచ్చి ఐదు వికెట్లను నష్టపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నాడు. తాను చివరి వరకూ క్రీజ్ లో ఉండాల్సిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే 250 పరుగులకు పైగా స్కోరు బోర్డుపై ఉండేదని, అప్పుడు విజయంపై ఆశలు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉండేదన్నాడు. తాను అవుటైన మరుసటి బంతికే మహ్మద్ సైఫుద్దీన్ కూడా పెవిలియన్ చేరడం, ఆపై వరుస వికెట్లను చేజార్చుకోవడం ఓటమికి కారణాలని మీరజ్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు. ఈ మ్యాచ్ లో మీరజ్(60), సైఫుద్దీన్(36)ల జోడీ 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో బంగ్లాదేశ్ 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరింది. -
క్వార్టర్స్ లో దుమ్మురేపిన యువ భారత్
ఫతుల్లా: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం నమీబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ భారత్ దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆపై బౌలింగ్ లో నమీబియాను కుప్పకూల్చింది. నమీబియాపై 197 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 349 భారీ పరుగులు సాధించింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(6) ఆదిలోనే పెవిలియన్ కు చేరినా, రిషబ్ పంత్ (111;96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం అన్మూల్ ప్రీత్ సింగ్(41), సర్ఫరాజ్ ఖాన్(76), ఆర్మాన్ జాఫర్(64), లామ్రోర్(41 నాటౌట్) దాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. నమీబియా బౌలర్లలో కోట్జీ మూడు వికెట్లతో రాణించాడు. ఆపై 350 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 39.0 ఓవర్లలో 152 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. పటిష్టమైన భారత బౌలింగ్ ముందు నిలబడలేక చేత్తులెత్తేసిన నమీబియా ఏ దశలోనూ ప్రతిఘటించలేదు.నమీబియా ఆటగాళ్లలో డావిన్(33), లాఫ్టీ ఈటన్(22), గ్రీన్(27), లిండే(25 ) మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది. భారత బౌలర్లలో మయాంక్ దాగర్, అన్మూల్ ప్రీత్ సింగ్లు తలో మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్కు రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, బాథమ్ లకు చెరో వికెట్ లభించాయి. -
రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు
మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. పంత్ (24 బంతుల్లో 78; 9 ఫోర్లు; 5 సిక్సర్లు) మెరుపులకు తోడు కెప్టెన్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) ఫామ్లోకి రావడంతో సోమవారం నేపాల్తో జరిగిన వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది కుర్రాళ్లకు వరుసగా మూడో విజయం కాగా ఊహించని జోరుతో ముందుకు సాగుతున్న నేపాల్కు తొలి పరాజయం. ఈ విజయంతో గ్రూప్ ‘డి’లో భారత్ అగ్రస్థానం పొందింది. ఈరెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్ చేరాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అవేశ్ ఖాన్ మూడు... దాగర్, సుందర్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యమే అయినా భారత్ వేగంగా ఆడి 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచిన రిషబ్ ప్రతీ బంతిని బాదుతూ తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. ఆకాశమే హద్దుగా చేలరేగిన తను రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో రికార్డు అర్ధ సెంచరీని అందుకున్నాడు. అటు ఇషాన్ కూడా తొలిసారి జోరును కనబరిచి 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తొమ్మిదో ఓవర్లో వరుసగా 6,4,6,6 బాదిన రిషబ్ మరుసటి ఓవర్లోనే బౌల్డ్ అవడంతో తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అప్పటికే 55 బంతుల్లో తొలి వికెట్కు 124 పరుగులు వచ్చాయి. చివర్లో సర్ఫరాజ్ (23 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్), అర్మాన్ (13 బంతుల్లో 18 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. మిగతా మ్యా చ్ల్లో అఫ్ఘాన్ నాలుగు వికెట్ల తేడాతో కెనడాపై... న్యూజి లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఐర్లాండ్పై నెగ్గాయి. -
వరల్డ్ కప్లో నేపాల్ కొత్త చరిత్ర
ఫతుల్లా: అండర్-19 వరల్డ్ కప్ లో నేపాల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రూప్-డిలో భాగంగా ఆదివారం ఐర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్ లో నేపాల్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో అండర్-19 క్రికెట్ చరిత్రలో తొలిసారి క్వార్టర్స్ చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించిన నేపాల్.. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ ను మట్టికరిపించింది. ఐర్లాండ్ విసిరిన 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.3 ఓవర్లలో గెలిచింది. నేపాల్ ఓపెనర్లు సునార్(0), ధామాలా(28)లు ఆదిలో పెవిలియన్ చేరినా, కర్కి(61నాటౌట్), అరిఫ్ షేక్(31 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును క్వార్టర్స్ కు చేర్చారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఆటగాళ్లలో జాక్ టెక్టార్(27), డెన్నిసన్(21), దోహ్నీ(14), టుక్కర్(15), హర్రీ టెక్టార్(30నాటౌట్)లు మినహా ఎవరూ రెండంకెల మార్కును చేరకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నేపాల్ బౌలర్లలో లామిచాన్ని ఐదు వికెట్లు తీసి ఐర్లాండ్ వెన్నువిరిచాడు. గ్రూప్ డి నుంచి నేపాల్ తో పాటు, భారత్ క్వార్టర్స్ కు చేరగా, గ్రూప్-బి నుంచి పాకిస్తాన్, శ్రీలంకలు క్వార్టర్స్ కు చేరాయి. -
న్యూజిలాండ్కు నేపాల్ షాక్
ఫతుల్లా: అండర్ -19 వరల్డ్ కప్ లో అండర్ డాగ్గా బరిలోకి దిగిన నేపాల్ సంచలన విజయం సాధించింది. గ్రూప్ డిలో భాగంగా గురువారం న్యూజిలాండ్ తో జరిగిన వన్డే లీగ్ మ్యాచ్ లో నేపాల్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేపాల్ విసిరిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.1ఓవర్లలో 206 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గ్లెన్ ఫిలిప్స్(52), డేల్ ఫిలిప్స్(41), ఫిన్నీ(37)లు ఓ మోస్తరు రాణించగా, మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. నేపాల్ బౌలర్లలో ఏయిరీ మూడు వికెట్లు తీయగా, తమాంగ్ రెండు, ధామాలా, లామిచానీలకు తలో ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. సునార్(39), రిజాల్(48), ఆరిఫ్ షేక్(39), రజ్ బీర్ సింగ్(24), భూర్టేల్(35 నాటౌట్)లు ఫర్వాలేదనిపించడంతో నేపాల్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. గ్రూప్-బిలో జరిగిన ఇతర మ్యాచ్ ల్లో ఆఫ్ఘానిస్తాన్ పై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందగా, కెనడాపై శ్రీలంక 196 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
లంకపై యువభారత్ గెలుపు
దుబాయ్:: అండర్-19 ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరలేకపోయిన భారత యువజట్టు ప్లే ఆఫ్ మ్యాచ్లో ఊరట పొందే విజయం సాధించింది. ఐదోస్థానం కోసం సోమవారం శ్రీలంకతో జరిగిన ప్లే ఆఫ్ సెమీస్లో దీపక్ హుడా (56 బంతుల్లో 76 నాటౌట్; 3/31) ఆల్రౌండ్ ప్రతిభ కనబరచడంతో భారత్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీస్కోరు సాధించగా, లక్ష్యఛేదనలో శ్రీలంక యువజట్టు 48.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్-అఫ్ఘానిస్థాన్ మధ్య మంగళవారం జరగనున్న ప్లే ఆఫ్ సెమీస్ విజేతతో భారత్ తదుపరి మ్యాచ్లో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఐదో స్థానం దక్కుతుంది.