varun sandesh
-
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
Varun Sandesh-Vithika Sheru: పడ్డారండీ ప్రేమలో మరి.. పదేళ్ల జర్నీ (ఫోటోలు)
-
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి
‘‘నాకు ఒకే రకమైన పాత్రలు వస్తుండటంతో సినిమాలు వదిలేయాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ‘రాచరికం’(Racharikam) టీమ్ని నా వద్దకి పంపించాడని అనిపించింది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని అప్సరా రాణి(Apsara Rani) తెలిపారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో విజయ్ శంకర్ మాట్లాడుతూ–‘‘రాయలసీమ అంటే ఏంటో ‘రాచరికం’ చూపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేశాను’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘విజయ్గారు చాలా అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశారు’’ అని సురేశ్ లంకలపల్లి చెప్పారు. ‘‘ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతిసారి నా మిత్రులే నన్ను సపోర్ట్ చేశారు’’ అన్నారు ఈశ్వర్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, ‘ఆదిత్య మ్యూజిక్’ నిరంజన్, కెమేరామేన్ ఆర్య సాయి తదితరులు మాట్లాడారు. -
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
నల్లగొండ గద్దర్ నోట ‘కానిస్టేబుల్’ పాట
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని అన్నారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. -
ఉత్కంఠభరితంగా వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' టీజర్
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కానిస్టేబుల్'. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
సస్పెన్స్... థ్రిల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్. -
‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కథలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథాను మార్చుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ‘నింద’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే మరో డిఫరెంట్ మూవీతో అలరించడానికి రాబోతున్నాడు. అదే ‘కానిస్టేబుల్’.ఆర్యన్ సుభాన్ ఎస్కే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ కే. కార్తిక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు. -
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్..టాప్లో ట్రెండింగ్!
వరుణ్ సందేశ్ లీడ్ రోల్లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ విరాజి. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 22 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో అంతగా మెప్పించలేని హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే 56 లక్షల వాచ్ మినిట్స్తో ఆహాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -' విరాజి సినిమా ఓటీటీలో 56 లక్షల వాచ్ మినిట్స్తో ట్రెండ్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు. ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. ఈ మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో చూస్తూ ఎంజాయ్ చూస్తున్నారు" అని అన్నారు. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ 'విరాజి' సినిమా
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'విరాజి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 2న విడుదలైంది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఓటీటీలో విరాజి విడుదల కానుందని ఆహా ప్రకటించింది. ఆగష్టు 22న స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ వెంటనే ‘విరాజి’తో మెప్పించాడు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
మేకోవర్ సవాల్గా అనిపించింది: వరుణ్ సందేశ్
‘‘నేను ఫలానా తరహా పాత్రలే చేయాలని పరిమితులేవీ పెట్టుకోలేదు. కథ, అందులోని నా క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘మైఖేల్’ సినిమాలో విలన్గా చేశాను. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో వరుణ్ సందేశ్ పంచుకున్న విశేషాలు.∙‘విరాజి’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్న కొంతమంది దగ్గరకు ఆండీ (వరుణ్ సందేశ్ పాత్ర పేరు) వచ్చాక అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు? అనేది సినిమాలో చూడాలి. ఓ సందేశం కూడా ఉంది. ఇలాంటి కథను సినిమాల పట్ల ΄్యాషన్ ఉన్న మహేంద్రగారిలాంటి వారే నిర్మించగలరు. మా సినిమాను మైత్రీవారు డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. ∙‘విరాజి’లోని నా పాత్ర లుక్, మేకోవర్ను కొత్తగా డిజైన్ చేశారు హర్ష.రెండు డిఫరెంట్ కలర్స్లో హెయిర్ స్టైల్, ముక్కు పుడక, ఓ స్నేక్ టాటూ... ఇలా ఆండీ కొత్తగా కనిపిస్తాడు. ఈ మేకోవర్ నాకు కాస్త చాలెంజింగ్గా అనిపించింది. హెయిర్ కలరింగ్ కోసం ఏడు గంటలు, ట్యాటూస్ కోసం దాదాపు గంట పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ ట్యాటూ వేసుకోవాల్సి వచ్చేది. ‘విరాజి’ సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ∙నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ‘హ్యాపీ డేస్’ సినిమా చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఓ నటుడిగా నా ప్రయాణంలో విమర్శలు సహజమని నాకు తెలుసు. కానీ నా భార్య వితిక కాస్త ఫైర్ బ్రాండ్. అందుకే నా లుక్ గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్పై ఆమె అలా స్పందించారు. వితికలాంటి భార్య దొరకడం నా లక్గా భావిస్తున్నాను. ప్రస్తుతం ‘కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్నాను. ‘రాచరికం’ సినిమాలో పెద్ద మీసాలతో చిత్తూరు యాస మాట్లాడే వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తాను. -
వరుణ్ సందేశ్తో ర్యాపిడ్ ఫైర్
-
ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూసే రోజులు కాదు అందుకే డిఫరెంట్ గా తీశాం
-
నా హెయిర్ స్టైల్ కలర్ చూసి నా భార్య రియాక్షన్ ఏంటంటే..
-
నా సినిమాలు జనాలు చూడటం లేదు అందుకే ఇంత గ్యాప్..
-
'విరాజి' థ్రిల్లింగ్తో పాటు మెసేజ్ ఇస్తాడు: దర్శకుడు ఆద్యంత్ హర్ష
మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విరాజి'. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న విరాజి సినిమా గురించి దర్శకుడు ఆద్యంత్ హర్ష పలు విషయాలు పంచుకున్నాడు.ఫారిన్లో చదువుకున్న డైరెక్టర్ ఆద్యంత్ హర్ష సినిమాల పట్ల ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ నేర్చకున్నాడు. సుమారు పది కథలు రాసుకున్న ఆయన విరాజి చిత్రాన్ని ఫైనల్గా తెరకెక్కిస్తున్నారు. గతేడాది 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కు చెప్పడంతో ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ మహేంద్రనాథ్కు నచ్చడం ఆపై వరుణ్ సందేశ్ను హీరోగా ఫైనల్ చేశామని ఆయన అన్నారు. 'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించిందని ఆద్యంత్ తెలిపారు.'విరాజి' అనే టైటిల్కు అర్థం.. చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడని ఆయన అన్నారు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు అంటారని తెలిపారు. 'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారని ఆద్యంత్ తెలిపారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందని ఆయన అన్నారు. -
అందుకే వరుణ్ సందేశ్ని హీరోగా తీసుకున్నాం : ‘విరాజి’ నిర్మాత
ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే బరిలో పలు సినిమాలు ఉన్నా..ఆగస్ట్ 2న ‘విరాజి’ని విడుదల చేస్తున్నాం’అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.⇢ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ముందు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.⇢ మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.⇢ మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. -
ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ట్రైలర్తోనే భయపెట్టేశాడు!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విరాజి'. ఇటీవలే నింద సినిమాతో అలరించారు. ఈ మూవీని హారర్ జోనర్లో ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఎం3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.విరాజి మూవీ కోసం వరుణ్ సందేశ్ తన లుక్ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఆత్మలే ప్రధాన కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్గా కనిపించనున్నారు. 1970లో నిర్మించిన ఓ మెంటల్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్తోనే ఆడియన్స్ను భయపెడుతోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్లుక్, టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
నా 17 ఏళ్ల కెరీర్లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్ సందేశ్
డైరెక్టర్ హర్ష విరాజి కథ చెప్పినప్పుడు.. ఫస్టాఫ్ పది నిమిషాల విన్న కథ ఇలా ఉంటుందని రెండు మూడు చోట్ల గెస్ చేశా. కానీ సెకండాఫ్కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను’ అన్నారు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ‘నింద’తో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్..త్వరలోనే ‘విరాజి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారుతాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఈ నెల 10 ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. అది చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఆగస్ట్ 2న విడుదల కాబోతున్న ఈచిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.వరుణ్ను తెరపై కొత్తగా చూస్తారని అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల . ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆద్యంత్ హర్ష, నటులు రఘు కారుమంచి, ప్రమోదిని, ఫని, మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫరెంట్ కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్.. బాక్సాఫీస్ వద్ద జోరు!
వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్కు మంచి కమ్బ్యాక్ అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. -
'నింద' సినిమా రివ్యూ
అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్కి కమ్ బ్యాక్గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)కథేంటి?కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.ఎవరెలా చేశారు?లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
థ్రిల్లింగ్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతున్న ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ‘బలగం’ జగదీష్ నిర్మాత. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘కానిస్టేబుల్ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. వరుణ్ సందేశ్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. ‘‘కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. పోస్ట్ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు ‘బలగం’ జగదీష్. -
ఇక డైరెక్షన్పైనే ఫోకస్
‘‘మలయాళ సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్దకు ఎందుకు రావడం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మా ‘నింద’ చూశాక ‘బాగా తీశారు.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి’ అనుకుంటారు. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చిత్ర దర్శక–నిర్మాత రాజేశ్ జగన్నాథం అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేశ్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘మాది నర్సాపురం. నెల్లూరు, చెన్నై, యూఎస్లో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండి΄ోయాను. ఫిల్మ్ మేకింగ్లో కోర్సులు చేసి, అక్కడే షార్ట్ ఫిలింస్ చేశాను. వాస్తవ ఘటనలు, కల్పిత సన్నివేశాలతో ‘నింద’ స్క్రిప్ట్ రాశాను. ఈ కథ వరుణ్ సందేశ్కి మంచి కమ్ బ్యాక్లా ఉంటుందని భావించి ముందుకెళ్లాం. కథపై ఉన్న నమ్మకంతోనే నేనే నిర్మించాను. ఈ మూవీలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ‘నింద’ తర్వాత ఎక్కువగా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను’’ అన్నారు. -
‘నింద’ చూశాక ఆ ఫీలింగ్ కలుగుతుంది: రాజేష్ జగన్నాథం
మలయాళ సినిమాలు చూసి..మన దగ్గర(టాలీవుడ) ఇలాంటి సినిమాలు ఎందుకు రావాని అంతా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. ‘నింద’ కూడా అలాంటి చిత్రమే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడు ‘ఇదేదో బాగానే ఉందే..బాగా తీశారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’అన్నారు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం . ఆయన తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తాజాగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ మేకింగ్పై ఉన్న ఇంట్రెస్ట్తో యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. నింద కథ వరుణ్కు చెప్పడంతో నచ్చి.. వెంటనే ఓకే చేశాడు. నిర్మాత కోసం ప్రయత్నించాం. కానీ దొరకలేదు. కథపై ఉన్న నమ్మకంతో చివరకు నేనే నిర్మించాను. టెక్నికల్గా సినిమా చాలా బాగుంటుంది. పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్ను ఇచ్చారు.సినిమాలోని ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ అప్డేట్స్ ఇస్తాను.ఇకపై ఎక్కువగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేస్తాను’ అన్నారు. -
తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్ సందేశ్
‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్ సందేశ్ మీడియాతో పంచుకున్న విశేషాలు.⇒ నా కెరీర్లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్’ సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్గారి డెడికేషన్ చూసి రిస్క్ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్లో పాల్గొన్నాను. ⇒సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. ⇒మా దర్శక–నిర్మాత రాజేశ్గారి ఫ్రెండ్ అమెరికాలో ‘నింద’ని రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్ నవీన్గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. -
‘నింద’ స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్ సందేశ్
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద కూడా అలాంటి కథే. కానీ స్క్రీన్ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు’అని అన్నారు హీరో వరుణ్ సందేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్గా అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లాను. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.→ నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా కనిపిస్తాను.→ ‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్తో నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.→ మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.→ నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను. -
నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2019లో బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్బాస్ హౌస్లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.‘బిగ్బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్గా, ఫైనాల్షియల్గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది. ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్బాస్ షోనే. నా లైఫ్లో ఆ 105 రోజుల ఎక్స్పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్ సిద్ధార్థ్
‘‘నింద’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్ సందేశ్ కెరీర్లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్గారు ఎంతో ప్యాషన్తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్పుట్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్ జగన్నాథం. -
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. నా కెరీర్లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్కు ఓ మైల్ స్టోన్లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ ఈ సినిమాను నాకు చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్ప్రైజ్ అవుతారు’ అని అన్నారు. -
నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్కు హిట్టు వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. భర్త విజయం కోసం వితికా సైతం ఎదురుచూస్తోంది. మా ఆయన కోసం వచ్చానింద ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూన్ 16) జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ సతీమణి, హీరోయిన్ వితికా షెరు ఎమోషనలైంది. 'సందేశ్ సినిమా ఫంక్షన్స్కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అవకాశాలు రావట్లేదుమీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట! వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్. వరుణ్ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తనకు మంచి అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే కష్టపడతారు. వరుణ్ కూడా అంతే! ఏదో ఒకరోజు హిట్టు కొడతాడు అని చెప్పుకొచ్చింది. చదవండి: బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్.. ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్! -
వరుణ్ సందేశ్ 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
థ్రిల్లర్ ఎలిమెంట్స్తో 'నింద' ట్రైలర్.. మీరు చూశారా?
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 21న థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?)అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు అనే పాయింట్.. అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇందులో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీతో నైనా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే) -
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
యువ హీరో వరుణ్ సందేశ్ 'నింద' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమా ఆకట్టుకోగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ ప్రారంభించారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!)ఈ క్రమంలోనే గానామాస్ స్పెషల్ స్కూల్కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
కాండ్రకోటలో ఏం జరిగింది?
‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ (తనికెళ్ల భరణి) అనే డైలాగ్తో మొదలవుతుంది ‘నింద’ సినిమా టీజర్. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాను రాజేశ్ జగన్నాథం స్వీయదర్శకత్వంలో నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.లవ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ మ్యూజిక్ డైరెక్టర్. -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో న్యాచురల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు. -
వాస్తవ ఘటనల నింద
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అన్నది ఉపశీర్షిక. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రోడక్షన్స్ బ్యానర్ రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.ఈ చిత్రం నుంచి వరుణ్ సందేశ్ పాత్ర ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘నింద’. ఇప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మా ‘నింద’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న మా సినిమా టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: రమీజ్ నవీత్. -
వరుణ్ సందేశ్ ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఆడియెన్స్ రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ‘నింద’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు.ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో ఈ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను గమనిస్తుంటే వరుణ్ సందేశ్ అమయాకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తోంది. మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? న్యాయ దేవతను ఎందుకు చూపిస్తున్నారు? వరుణ్ సందేశ్ కారెక్టర్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ పోస్టర్ ఉంది. ఇలా పోస్టర్తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 15న ఈ చిత్రం నుంచి టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారు. -
ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ 'నింద' పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మంచి కథ ఉంటే చాలు థియేటర్, ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ సినిమా తీశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 'నింద' చిత్రం రాబోతుంది. రాజేష్ జగన్నాథం దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రాబోతోన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఊరి వాతావరణం, చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూపించారు. వారంతా సినిమాను మెచ్చుకున్నారట. మంచి కాన్సెప్ట్తో చిత్రాన్ని తీశారని దర్శక నిర్మాతలని ప్రశంసించారట. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) -
చాలా రోజుల తర్వాత ‘శబరి’లో డ్యాన్స్ చేశా: వరలక్ష్మీ శరత్కుమార్
‘తెలుగులో నేను చేసిన తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’. ఇది థ్రిల్లర్ మూవీ. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో డ్యాన్స్ చేశాను’’ అని వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదలవుతోంది. ఐదు భాషల ట్రైలర్స్ విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. నటుడు వరుణ్ సందేశ్ తెలుగు ట్రైలర్ని, నిర్మాత మహేంద్రనాథ్ తమిళ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ‘‘నిర్మాత గురించి ఆలోచించే నటి వరలక్ష్మి. ‘శబరి’ నా తొలి సినిమా. ఆదరించాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల్నెప్పుడు కంటారు? వితికా ఆన్సర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. వరుణ్ ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వితికా షెరు.. యూట్యూబ్ వీడియోల ద్వారా నిత్యం అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవలే తన ఇంటిని కొత్తగా తీర్చిదిద్దింది. తనకు నచ్చినట్లుగా రీడిజైన్ చేయించుకుంది. ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అడుగుతూనే ఉన్నారుగా.. ఎప్పుడూ ఇదే ప్రశ్న ఎదురవడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చింది. 'పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని జనాలు నన్ను అడుగుతూనే ఉన్నారు కదా.. ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను' అని ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో వరుణ్.. వితిక ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా భర్త ఇంకా పిల్లాడే అని పోస్ట్ చేయడంతో ఆన్సర్ అదిరిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్లో లవ్ కాగా వీరిద్దరూ 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమా షూటింగ్లో నిజంగా లవ్లో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లోనూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో వితికపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొంతకాలం పాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది. కానీ భర్త అండ వల్ల దాన్నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) చదవండి: షార్ట్కట్స్ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశా.. ఇక చాలు! -
టాలీవుడ్ బిగ్బాస్ జంట ఇంటిని చూశారా.. ఎంత బాగుందో!
వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి'. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 19, 2016న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. తాజాగా వరుణ్ సందేశ్ భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకే హోమ్ టూర్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పాత ఇంటినే తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. తాము కొవిడ్ టైమ్లో అమెరికాలో ఉన్నామని వెల్లడించింది. మా అత్తయ్య ప్రత్యేకంగా ఇంటిని తీర్చిదిద్దారని వితికా పేర్కొంది. కాగా.. ఇటీవలే వరుణ్ సందేశ్- వితికా శేరు అయ్యప్ప పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
నాకు అలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం: వరుణ్ సందేశ్
-
'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్
'బిగ్బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు? ఏం జరిగింది? తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వరుణ్ ఏం చెప్పాడు? 'బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది. 'బిగ్బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది' అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
పలు గెటప్స్లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించే కథలు కొందరు స్టార్స్కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్లో కనిపించడం కమల్హాసన్కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్హాసన్ నాలుగుకి మించి గెటప్స్లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్చరణ్ ఏడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..
సాధారణంగా హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడూ కొందరు అలానే ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్ మెంటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ లుక్స్తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే తక్కువ మూవీస్ లోనే నటించింది. ఆ తర్వాత ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? ఆమె ఎవరో కాదు బిగ్బాస్ తో చాలామందికి పరిచయమైన వితికా షేరు. అదేనండి 'కొత్తబంగారు లోకం' హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది కదా. ఆమెనే ఈమె. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఆఫర్పై హీరోయిన్ మాధవీ లత క్లారిటీ) 2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన వితికా షేరు.. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2015లో 'పడ్డామండీ ప్రేమలో మరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలా సినిమా చేస్తూ ప్రేమలో పడ్డ వరుణ్ సందేశ్-వితికా షేరు.. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వచ్చిన 'పెళ్లి సందD' మూవీలో చివరగా వితిక కనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో భర్తతో కలిసి జంటగా పాల్గొన్న వితిక.. ఆరో సీజన్ లో కీర్తి భట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగర్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా ఫిట్ గా మారి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్పై వైష్ణవి సీరియస్) -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్కి గాయం ఐదు కేజీల డంబెల్ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
షూటింగ్ లో ప్రమాదం..
-
షూటింగ్లో ప్రమాదం.. టాలీవుడ్ హీరోకు తీవ్ర గాయాలు..!
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ అనే చిత్రంలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైంది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్ కాలికి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు! ) ఊహించని సంఘటనతో సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు. కాగా.. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) -
ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి 'భీమవరం' బ్యూటీ వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనపై వస్తున్న దారుణమైన ట్రోల్స్కు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది నటి వితికా. హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే మోడల్గా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్ సందేశ్ను పెళ్లాడింది. ఆపై సినిమాలకు గ్యాప్ రావడంతో వీళ్లిద్దరు కలిసి బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో వితిక మరింత పాపులర్ అయ్యింది. ఇదీ చదవండి: (ఇదీ చదవండి: స్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ను కూడా: దియా మీర్జా) సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటూనే.. యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్ను మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలను, షార్ట్ వీడియోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి రితిక చేసిన ఓ రీల్ను షేర్ చేసింది. అయితే, ఆ వీడియోకు దారుణమైన కామెంట్లను ఆమె ఎదుర్కొవాల్సి వచ్చింది. బాగా లావు అయిపోయావ్.. నువ్వు హీరోయిన్ అంటే నమ్మ బుద్ధి కావడం లేదనే కామెంట్లు వచ్చాయి. ఇలా నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్కు గురైంది. దీంతో పట్టుదలతో వితిక వర్కౌట్స్ చేసి సుమారు 15 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఎమోషనల్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా ‘ది కానిస్టేబుల్’ చిత్రం బుధవారం హైదరాబాద్లో ఆరంభమైంది. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘బలగం’ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహూర్తపు సన్నివేశానికి బి. నిఖితా జగదీష్ కెమెరా స్విచ్చాన్ చేయగా బీజే రిథిక క్లాప్ కొట్టారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎమోషనల్ కానిస్టేబుల్గా నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నాకు బాగా నచ్చాయి’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్, ‘బలగం’ జగదీష్. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు పధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సుభాష్ ఆనంద్, కెమెరా: హజరత్ షేక్ (వలి). -
వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'చిత్రం చూడర'. ఈ చిత్రానికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీఎం సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితీ గౌతమ్ స్పెషల్ సాంగ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘 Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀 Directed by @NHarsha828 🎬 Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/rs1Mi9icP5 — BM Cinemas (@BMCinemas_) March 9, 2023 -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం
హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాప్లు వెంటాడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. తాజాగా సరికొత్త కథలో హీరోగా తిరిగి వస్తున్నాడు బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్ . యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. శేషు మారం రెడ్డి ,బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం వస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి విజయం అందిస్తుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’అన్నారు. ‘ హర్షవర్ధన్ ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి. ‘సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , , మీనా కుమారి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నాడు దర్శకుడు హర్షవర్ధన్. -
బిగ్బాస్ బ్యూటీ నందిని బర్త్డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్డే సెలబ్రెషన్స్లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్కు మరింత దగ్గరైంది. బిగ్బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
ఒక్క హిట్తో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు: నిఖిల్
Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు. ‘డైమండ్ రాజా’ చిత్రంతో వరుణ్ సందేశ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలి. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అని యంగ్ హీరో నిఖిల్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్ విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పవన్ రెడ్డి కోటిరెడ్డి. -
ఊర మాస్గా వరుణ్ సందేశ్.. వినూత్న కథతో ‘యద్భావం తద్భవతి’
‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఆ రెండు చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు కానీ.. నటుడిగా తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు(జులై 21) సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.ఇందులో వరుణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్లో మాస్ ఆడియెన్స్ను మెప్పించేలా ఉన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నారు.‘నా సినిమా పోస్టర్ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి గారికి థ్యాంక్స్’అని వరుణ్ సందేశ్ అన్నారు. మిహిరమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్
Varun Sandesh Plays Key Role In Michael Movie: హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో ఇటీవలె ఇందువధన చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. తాజాగా రూటు మార్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మైఖేల్ సినిమాలో వరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ,మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆర్జే కాజల్కి అదిరిపోయే పంచ్ వేసిన వరుణ్ సందేశ్
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్కి శ్రీరామచంద్ర, వరుణ్తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్గా నిర్వహించింది. కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్బాస్తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్ని ముగించాడు. అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు. -
‘ఇందువదన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇందువదన నటీనటులు : వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు నిర్మాతలు : మాధవి అదుర్తి దర్శకత్వం : ఎం శ్రీనివాస రాజు (ఎమ్ఎస్ఆర్) సంగీతం : శివ కాకాని సినిమాటోగ్రఫీ : బీ మురళీకృష్ణ విడుదల తేది : జనవరి 1,2022 ‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని చూపించలేదు. ఇక సినిమాల చాన్స్ రాని సమయంలో ‘బిగ్బాస్’రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఆ షోతో వరుణ్ సందేశ్కి క్రేజ్ వచ్చినప్పటికీ.. పెద్దగా సినిమాలేవి చేయలేదు. చాలా రోజుల తర్వాత వరుణ్ ‘ఇందు వదన’అనే సినిమాలో మళ్లీ టాలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ నటించిన తొలి పీరియాడికల్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కు మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన ‘ఇందు వదన’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? అగ్రహారం గ్రామానికి చెందిన వాసు(వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ పోలీసాఫీసర్. అతను అడవిలో ఉండే గిరిజన యువతి ఇందు( ఫర్నాజ్ శెట్టి)తో తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. అయితే కులం కారణంగా వారి పెళ్లిని వాసు కుటుంబ సభ్యులు నిరాకరిస్తారు. అనుహ్యా కారణాల వల్ల ఇందు హత్యకు గురవుతుంది. అసలు ఇందుని హత్య చేసిందెవరు? ప్రేమించి, పెళ్లాడిన ఇందు చనిపోయిందని తెలుసుకున్న తర్వాత వాసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తనను హత్య చేసిన వారిపై ఇందు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. టాలీవుడ్లో వరుణ్ సందేశ్కి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో ఆయన నుంచి అన్ని ప్రేమ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఇందు వదన మూవీలో మాత్రం కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్ వాసు పాత్రలో తెరపై సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్టింగ్ పరంగా కూడా ఇరగదీశాడు. ఫైట్ సీన్స్లో కూడా పర్వాలేదనిపించాడు. గిరిజన యువతి ఇందు పాత్రలో ఫర్నాజ్ శెట్టి ఒదిగిపోయింది. తొలి సినిమాయే అయినా.. అద్భుతంగా నటించింది. ఒకవైపు వరుణ్ సందేశ్తో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టించింది. వరుణ్, ఫర్నాజ్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే వరుణ్ సందేశ్ స్నేహితులుగా మహేశ్ విట్ట, ధనరాజ్, పార్వతీశం తమదైన కామెడీతో నవ్వించారు. నాగినీడు, అలీ, సురేశ్ వాణిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... ? టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో ప్రేమకథా చిత్రమ్, తను వచ్చెనంట, యూటర్న్ చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇందువదన’. లవ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ఆర్. దర్శకుడుకు ఎంచుకున్న పాయింట్ పాతతే అయినప్పటికీ.. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. చక్కటి ప్రేమ కథకి హారర్ని జోడించి సినిమాని తెరకెక్కించాడు. అయితే కథలో బలం లేకపోవడంతో సినిమా స్థాయి తగ్గింది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ‘ఇందు వదన’ఓ మంచి హారర్-థ్రిల్లర్ మూవీ అయ్యేది. ఫస్టాఫ్లో వాసు ఇందుల లవ్స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇంటెర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్లో దెయ్యంతో వచ్చే కామెడీ సీన్స్, అలీ ఎంట్రీ సీన్ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్ కథని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే... శివ కాకాని సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా అందించాడు. మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఐదేళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై కనిపించబోతున్నా!
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇందు వదన’. నైనిష్య, సాత్విక్ సమర్పణలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఇందువదన’ ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో నేను చేసిన తొలి చిత్రం ‘ఇందువదన’. ఐదేళ్ల తర్వాత నేను బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్న సినిమా కాబట్టి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా థియేటర్స్లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది’’ అన్నారు ఎమ్ఎస్ఆర్, మాధవి, గిరిధర్. -
హల్చల్ : ఆనందంలో రష్మిక.. వాట్ ఎ మూడ్ అంటున్న తమన్నా
♦ 20మిలియన్లకు చేరిన రష్మిక ఫాలోవర్లు ♦ సెట్కి రెడీ అవుతున్న బిగ్బాస్ ఫేం సోహేల్ ♦ రీచార్జ్ అవసరం అంటున్న యాంకర్ లాస్య ♦ వాట్ ఎ మూడ్ అంటున్న తమన్నా భాటియా ♦ టవల్లో దూరిపోయిన పూజా, చౌదరి ♦ 5M వ్యూస్తో దూసుకుపోతున్న ఇందువధన టీజర్ ♦ బ్లాక్ అంటేనే ఫ్యాషన్ అంటున్న కాజోల్ ♦ పానీపూరీతో హ్యాపీనెస్ అంటున్న అనుపమ ♦ మనీష్ స్టయిలింగ్లో మలైకా స్టన్నింగ్ లుక్స్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
తాతయ్య నా సినిమా చూడాలనుకున్నారు, కానీ: వరుణ్
Induvadana Teaser: ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇందువదన’. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహించారు. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమా టీజర్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇందువదన’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమా చూడాలనుకునేవారు మా తాతయ్య. కానీ, గత ఏడాది చనిపోయారు. అలా మా తాతయ్య కోరిక నెరవేరకపోవడం బాధగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవలే విడుదలైన మా సినిమాలోని తొలి పాట యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడంతో పాటు చాట్బస్టర్గా నిలిచింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: గిరిధర్, కెమెరా: బి మురళి కృష్ణ, సంగీతం: శివ కాకాని, లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ. -
బోల్డ్ పాత్రలో ఇందు, పోస్టర్ రిలీజ్
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇందువదన". ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాధవి ఆదుర్తి నిర్మించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరిపిన క్లైమాక్స్ షూటింగ్తో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. తాజాగా ఈ చిత్రంలో వాసు పాత్ర పోషించిన వరుణ్ సందేశ్, ఇందు పాత్ర చేసిన ఫర్నాజ్ పాత్రల లుక్స్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ అటవీశాఖ అధికారి పాత్ర చేశారు. సతీష్ ఆకేటి కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: శివకాకని, సహనిర్మాత: గిరిధర్. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది -
నా బంగారు తల్లి.. క్రిష్ బాగా చూసుకో: వితిక
‘‘నా బంగారు తల్లి.. నీ పెళ్లి గురించి, నా పెళ్లి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు.. కానీ నేను నిన్ను తల్లిలా పెంచుకున్నా. మీ పెళ్లి చేయాలనే ఇరవై ఏళ్ల నా కల ఇప్పుడు నెరవేరింది. నా చేతుల మీదుగా ఇది జరగడం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. నీకోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నీ కొత్త ఇంట్లో నీకు అన్ని సంతోషాలు దక్కాలి. నన్ను గర్వపడేలా చేశావు. ఐ లవ్ యూ.. హ్యాపీ మారీడ్ లైఫ్. మీ జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. క్రిష్ బాగా చూసుకో’’ అంటూ నటి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ వితికా షేరు భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ‘‘కలకాలం నవ్వుతూ ఉండు. నాకు అదే చాలు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘1997 నుంచి నీకు కాపు కాస్తూనే ఉన్నాను. అవును.. బొమ్మరిల్లు ప్రకాశ్ రాజ్ ఫీమేల్ వర్షన్ నేను’’ అని కృతిక పెంపకంలో తన పాత్ర గురించి చమత్కరించారు. తన చెల్లెలు కృతికా షేరు పెళ్లి సందర్భంగా తనపై ఉన్న ఈ ప్రేమను వితిక ఈ విధంగా చాటుకున్నారు. అలాగే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన.. వితికా వారి జంట కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అంతా తానై చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపించినందుకు గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) కాగా కృతికా- కృష్ణల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షేరు కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకలో బిగ్బాస్-3 కంటెస్టెంట్స్ పాల్గొని సందడి చేశారు. నటి పునర్నవి సంప్రదాయ వస్త్రధారణలో ఈ గ్యాంగ్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
హీరో వరుణ్ సందేశ్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో, బిగ్బాస్ 3 ఫేం వరణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాత, జ్ఞానపీఠ్ ఆవార్డు గ్రహిత జీడిగుంట రామచంద్ర మూర్తి(80) మంగళవారం కన్నుముశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు) 1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్ సహకార బ్యాంక్లో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసిన అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో 1960లో ఆయన తొలిసారిగా రచించిన ‘హంసగమన’ అనే కథ ప్రచరితమయ్యింది. ఆ తర్వాత ఆయన 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు. -
ఓరుగల్లులో సినిమా చేస్తా..
కాజీపేట అర్బన్: లవర్ బాయ్ ఇమేజ్తో గుర్తింపు పొందిన నేను త్వరలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా అందరిని ఆకట్టుకునే సినిమాతో ముందుకు వస్తానని సినీహీరో వరుణ్సందేశ్ తెలిపారు. హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఓరుగల్లు అంటే ఎంతో ఇష్టం చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమా చేయాలనుంది. గతంలో టూర్లో భాగంగా వరంగల్కు వచ్చాను. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ ఫోర్ట్లతో పాటు నిట్ వరంగల్ చాలా ఇష్టమైన ప్రాంతాలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నందున వర్షం, ఎంసీఏ వంటి చిత్రాలతో సినీ రంగానికి అనువుగా నిలుస్తున్న వరంగల్లో సినిమా చేస్తా. బిగ్బాస్–3 ఓపికను నేర్పించింది... ఎంతో కోపంగా, ఓపిక లేకుండా, ప్రతి అంశానికి రియాక్ట్ అయ్యే నన్ను బిగ్బాస్–3లో 105రోజుల ప్రయాణం ఓపిక నేర్పించింది. నేను వితిక భార్యభర్తలమైనా బిగ్బాస్–3లో కంటెస్ట్లుగా పోటాపోటీగా టాస్క్లు చేశాం. టాప్–5లో నేను సైతం ఉండడం బిగ్ బాస్ నాకు నేర్పిన, అందించిన ఓర్పు, ఓపికతోనే. నేను నా భర్యతో పాటు 15 మంది కంటెస్ట్లతో అనుభూతులు, అభిరుచులను, కోపాలు–తాపాలు, అనుభావాలను పంచుకుంటూ ఆత్మీయులుగా మారిపోయాం. బిగ్బాస్–3 జర్నీ నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. నిత్యం షూటింగ్లో బిజీగా ఉండే నేను నా భార్య వితిక ఒకే చోట వంద రోజులు మనోభావాలను పంచుకునే అవకాశాన్ని అందించిన బిగ్బాస్కు రుణపడి ఉంటా. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే నన్ను టాప్–5లో బిగ్బాస్లో నిలబెట్టారు. నా అభిమానుల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. త్వరలో మల్టీస్టారర్... బిగ్బాస్–3 జర్నీ తర్వాత అనేక అవకాశాలు వస్తున్నాయి. పదికి పైగా స్టోరీలను విన్నాను. త్వరలో మల్టీస్టారర్ మూవీ, ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో ముందుకు వస్తా. ‘సే నో టూ ప్లాస్టిక్’లో వరంగల్ ముందుండాలి యూఎస్లో ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేదంతో పర్యావరణ పరిరక్షణలో ముందుండగా ప్రస్తుతం వరంగల్ సే నో టూ ప్లాస్టిక్ అంటూ ప్లాస్టిక్ రహితంగా వరంగల్ ఫస్ట్గా నిలవాలి. ప్లాస్టిక్ వినియోగంతో అనేక రోగాలు వస్తున్నాయి, వాతావరణం కలుషితమౌతుంది. పర్యావరణానికి ముప్పుగా మారిని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామంటూ వరంగల్వాసులకు వరుణ్సందేశ్ తన సందేశ్(శా)న్ని అందించారు. -
20 లక్షల ఆఫర్.. హౌజ్లో టెన్షన్ రేపిన శ్రీకాంత్
బిగ్బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలె ఆసక్తికరంగా సాగుతోంది. హీరోయిన్ల ఆటపాటలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రస్తుతం ఫినాలె ఎపిసోడ్ సాగుతోంది. ప్రముఖ హీరోయిన్లు క్యాథరిన్, అంజలి తన నృత్యాలతో బిగ్ బాస్ స్టేజ్ను వేడెక్కించారు. అనంతరం గెస్ట్గా దర్శనమిచ్చిన హీరో శ్రీకాంత్.. హౌజ్లోకి వస్తూనే టెన్షన్ రేపారు. హౌజ్లోని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ. 10 లక్షల సూట్కేస్ తీసుకొని.. ఒక కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్కు కంటెస్టెంట్లు ఎవరూ ముందుకురాలేదు. కంటెస్టంట్ల కుటుంబసభ్యులను ఈ ఆఫర్ గురించి నాగార్జున అడుగగా.. వాళ్లు కూడా ఈ ఆఫర్కు ఒప్పుకోవద్దంటూ కంటెస్టెంట్లకు సూచించారు. దీంతో శ్రీకాంత్ ప్లాన్-బీ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మరో పది లక్షల సూట్కేసును హౌజ్లోకి తీసుకొచ్చారు. మొత్తం రూ. 20లక్షలున్న రెండు సూట్కేసులు తీసుకొని.. హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని శ్రీకాంత్ కంటెస్టెంట్లకు సూచించారు. నలుగురు అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారని, మిగతా ముగ్గురు ఓడిపోవాల్సిందేనని చెప్పిచూశారు. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నవాళ్లు, విజేత కాలేనేమోనని భావించే ఎవరైనా ఈ ఆఫర్ను ఒడిసిపట్టాలని, రూ. 20 లక్షలంటే మామూలు విషయం కాదని, అదృష్టం కలిసివస్తే కాలదన్న కూడదని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ హితబోధ చేసినా.. ఎవ్వరూ కూడా ఈ ఆఫర్ను ఒప్పుకోలేదు. దీంతో ప్లాన్ సీ రూపంలో క్యాథరిన్ థెరిస్సా హౌజ్లోకి ఎంటరై.. ఎవరూ ఎలిమినేట్ అవుతున్నారో తెలిపే సీల్డ్ కవర్ను తీసుకొచ్చింది. చివరినిమిషంలోనూ సీల్డ్ కవర్లో తెరిచేటప్పుడు కూడా నాగార్జున్ సూట్కేసులను తీసుకొని వెళ్లిపోవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. బాబా భాస్కర్ కొంచెం తక్కువ కాన్ఫిడెన్స్తో కనిపించినా ఈ ఆఫర్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎవరూ అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ సీల్డ్ కవర్ను తెరిచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరును ప్రకటించాడు. వరుణ్ను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతన్ని తీసుకొని.. శ్రీకాంత్, క్యాథరిన్ తీసుకొని నాగార్జున వద్దకు వచ్చారు. -
బిగ్బాస్ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి
మూడు రోజుల్లో బిగ్బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్బాస్ అతని గ్రాఫ్ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్ను ‘మిస్టర్ కూల్, ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ పర్ఫెక్ట్’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్బాస్ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాహుల్ను చూసి గర్వించిన బిగ్బాస్.. అనంతరం రాహుల్ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్బాస్ హౌస్లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్బాస్ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్ అయిన రాహుల్ వెంటనే తేరుకుని బిగ్బాస్కు కృజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్.. ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్.. ఈ పేరు వింటే డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్బాస్ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్బాస్ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్బాస్.. బాబాకు ‘సూపర్స్టార్ ఆఫ్ ద హౌస్’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్మేట్స్ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి! -
బిగ్బాస్: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్..
బిగ్బాస్ 3 తెలుగు ఎన్నో పోట్లాటలు, ప్రేమలు, అపనిందలు, ఆప్యాయతలు, గొడవలు, గారాలతో అల్లుకుపోయింది. అప్పుడే గొడవపడతారు.. మళ్లీ అంతలోనే ఒక్కటైపోతారు. ఏ ఎమోషన్ అయినా అన్నీ ఇంట్లోవాళ్ల ముందే చూపిస్తారు. ఎవరినైనా నామినేట్ చేయడానికి సాకులు వెతుక్కునేది వాళ్లే.. ఎలిమినేట్ అవుతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఆ మధ్య బిగ్బాస్.. 50 రోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు ఓ వీడియో ద్వారా చూపించాడు. దాన్ని చూసిన హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. మరి ఇప్పుడు బిగ్బాస్ షోకు వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి కొత్తగా ఇంటి సభ్యులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది. ఆ గదిలోకి ఒక్కో హౌస్మేట్ను పిలిచి బిగ్బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నాడు. కాగా ఇల్లువాకిలి అన్నీ వదిలి వచ్చి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన ఇంటి సభ్యులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా మిగలనున్నట్లు స్పష్టమవుతుంది. కుటుంబంలాగా కలిసిపోయిన ఇంటి సభ్యులు మరి కొద్ది రోజుల్లో ఎవరిదారిన వాళ్లు వెళ్లనున్నారు. ఎన్నో ఎమోషన్స్, మరెన్నో జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకుని భారంగా బయటికి వెళ్లిపోనున్నారు. దీంతో నేటి ఎపిసోడ్ ఇంటి సభ్యుల భారమైన మనసుతో, బాధాతప్త హృదయాలతో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. మరి వారి జర్నీలను మనమూ చూడాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! Time to cherish the beautiful memories of #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa #FinaleWeek pic.twitter.com/mBBBAZTfNh — STAR MAA (@StarMaa) October 30, 2019 -
‘మా ఆయనే బిగ్బాస్ విజేత’
బిగ్బాస్ సీజన్– 3 విజేతగా తన భర్త వరుణ్ సందేశ్ నిలుస్తారని, తనకు ఆ నమ్మకం బాగా ఉందని ఆయన భార్య, గత వారం బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన వితికా శేరు అన్నారు. బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్బాస్ హౌస్లో తనకు ఓపిక బాగా అబ్బిందని కుదురుగా ఉండటం నేర్చుకున్నానని చెప్పారు.టాస్క్లలో నాకంటే వరుణ్ బాగా ఆడేవారు. అయితే వరుణ్ సోలోగా ఆడడానికే ఇష్టపడుతున్నట్లుగా ప్రేక్షకులు చెప్పారు. అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను. ఏదైనా చేయగలననే పట్టుదల కూడా వచ్చిందన్నారు. లగ్జరీ లేకుండా ఒకరి సహాయం తీసుకోకుండా గూగుల్తో సంబంధం లేకుండా బతకవచ్చు అనే నమ్మకం ఈ 90 రోజుల బిగ్బాస్ హౌజ్లో నాతో పాటు వరుణ్ కూడా తెలుసుకున్నారన్నారు. ఇందులో మైండ్తో ఆడేదే ఎక్కువగా ఉంటుందని, అందుకే తన విజ్ఞానం కూడా బాగా పెరిగిందన్నారు. బిగ్బాస్ హౌస్లో సభ్యులందరూ తనకు ఇష్టమైనవారేనని.. నచ్చని విషయమంటూ ఉందంటే అది రాళ్లు, రత్నాలు టాస్క్లో జరిగిన ఘటనేనని ఆమె తెలిపారు. వంటలు బాగా చేస్తా... బిగ్బాస్ హౌస్లో బాగా వంటలు చేయడంలో నాకు నేనే సాటిగా నిరూపించుకున్నాను. ఆరు వారాల పాటు కిచెన్ కెప్టెన్గా కొనసాగాను. నా వంటలను ఇతర సభ్యులతోపాటు వరుణ్ కూడా బాగా మెచ్చుకునేవారు. రూ.50 లక్షలు వస్తే... ఫైనల్లో వరుణ్ విజేతగా నిలిచి రూ.50 లక్షలు బహుమతిగా తీసుకొని వస్తే వాటిని భద్రంగా దాచుకుంటాను. మేం పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. డబ్బులు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో చవిచూశాం. అలాంటి పరిస్థితి రాకుండా.. ఈ వచ్చిన డబ్బును ఫిక్స్డ్ చేసుకుందామనుకుంటున్నాం. ఫైనల్లో ఆ ముగ్గురు ఉండొచ్చు.. వచ్చే నెల 3న జరగనున్న బిగ్బాస్–3 ఫైనల్ టాప్–3లో మా వారు వరుణ్ సందేశ్తో పాటు శ్రీముఖి, రాహుల్ ఉంటారేమో. తెలుగింటి ఆడపడుచుగా, ఒక భార్యగా మావారు వరుణ్సందేశ్ విజేతగా తిరిగి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. 13 వారాల పాటు భార్యాభర్తలిద్దరం బిగ్బాస్ హౌస్లో కొనసాగడానికి ప్రేక్షకులతో పాటు సహచర సభ్యులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. మంచి మిత్రులం.. బిగ్బాస్ హౌస్లోవరుణ్తో పాటు నేను, పునర్నవి, రాహుల్ మంచి స్నేహితులం. కష్టాల్లో, ఇష్టాల్లో నలుగురం పాలుపంచుకున్నాం. వరుణ్ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఎంతగానో ప్రేమించేవారు. ఎక్కువగా ఇంటి గురించే.. మేమిద్దరం ఒంటరిగా హౌస్లో కూర్చున్నప్పుడు ఇంటి గురించే ఆలోచించుకునేవాళ్లం. మా ఇంట్లో అమ్మకు, వరుణ్ ఇంట్లో బామ్మ, తాతయ్యకు ఆర్థిక అవసరాలు తీర్చేది మేమిద్దరమే. ఆర్థిక పరిస్థితులను చూసుకునే ఇద్దరం హౌస్లోనే ఉండటం వల్ల అక్కడ వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని తల్లడిల్లిపోయేవాళ్లం. ఇద్దరికి టెన్షన్గానే ఉండేది. మాది ప్రేమ వివాహం.. నేను మొదటి సినిమా కన్నడలో చేశా. 17 ఏళ్ల వయసులోప్రేమ–ఇష్క్–కాదల్ సినిమాలో హీరోయిన్గా నటించాను. 2014లో వరుణ్ హీరోగా వచ్చిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో హీరోయిన్గా నటించి ఆయనతో ప్రేమలో పడ్డాను. 2016 ఆగస్టు 19న మా ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. 250 డ్రెస్లు మార్చా.. బిగ్బాస్– 3లో నన్ను అందంగా చూపించడానికి, టాస్క్లలో నా ఆటకు తగిన డ్రెస్లు రూపకల్పన చేయడానికి ముగ్గురు డిజైనర్లు పని చేశారు. రోజుకు మూడు డ్రెస్లు మార్చేదాన్ని. మొత్తం 250 డ్రెస్లు మార్చాను. ముఖ్యంగా నాకు చీరలంటే బాగా ఇష్టం. మా బంధం.. దృఢమైంది హౌస్లో వరుణ్కు నాకు మధ్యన భార్యాభర్తల అనుబంధం మరింతగా పెరిగింది. ఆయన ఓపెన్ మైండెడ్గా ఉండేవారు. నిజాయతీ కనిపించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని దాటగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇద్దరం బాగా అర్థం చేసుకున్నాం. -
బిగ్బాస్: వరుణ్ను విజేతగా ప్రకటించిన సుమ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ సుమ అనుకున్నంత సందడీ చేశారు. బాగ్బాస్-3 లో గెస్ట్( ఆడియన్)గా ఎంటరైన సుమ నవ్వుల పువ్వుల దీపావళి తీసుకొచ్చారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్బాస్-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు. బిగ్బాస్ సీజన్లోనే ఇంత బాగా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బిగ్బాస్-3 సీజన్ను క్లుప్తంగా రివ్యూ చేసిన బిగ్బాస్ ఆ తరువాత హౌస్లోకి సుమను ప్రవేశపెట్టాడు. ఇహ అక్కడినుంచి మొదలైంది రచ్చ..రచ్చ రంబోలా.. రంగ్దే.. రంగ్దే...పాటతో ముసుగు వేసుకుని డాన్స్తో సుమ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే..కంటెస్టెంట్స్ అందరూ తమన్నా..తమన్నా అంటూ హల్ చల్ చేశారు. చివరికి ముసుగుతీసి తనెవరో రివీల్ చేశారు. ఆరంభం నుంచే సుమ తనదైన పవర్ పంచ్లతో మొదలెట్టేశారు. రాగానే మంచి నీళ్లు తాగుతారా అని అడిగిన శ్రీముఖితో.. వచ్చినవాళ్లందరి చేత నీళ్లు తాగించేస్తున్నావుగా అంటూ పంచ్ వేశారు. ఆ తరువాత ఇల్లంతా కలియతిరిగి... ఒక్కొక్కరి బెడ్ను, మేకప్ సామాన్లు పరిశీలించారు. ముఖ్యంగా రాహుల్ బెడ్ పక్కన ఏముందంటూ అల్లరి చేశారు. ఆ తరువాత లివింగ్ రూం, వంటగది, వాష్రూంలను పరిశీలించారు. బిగ్బాస్ -3 హౌస్లో ఏమేమి మిస్ అవుతున్నదీ అందరూ షేర్ చేసుకున్నారు. తరువాత హౌజ్లోకి వచ్చిన సుమ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసిపెట్టి, ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరిన బిగ్బాస్.. దానికి సంబంధించిన సరుకు సరంజామా పంపించారు. మధ్నాహ్నం 2 గంటలకు శ్రీముఖి, బాబా భాస్కర్ కుకింగ్ పనిలో వుండగా.. రాహుల్తో సరదాగా పాట పాడించారు సుమ. ‘అదరా...నా గుండెలదరా..బొమ్మోలె ఉందిరా పోరీ..పాట పాడారు. అలాగే ‘ఏమైనదీ..ఏమో నాలో..కొత్తగా ఉంది నాలో’ అంటూ వరుణ్ కూడా చాలా హృద్యంగా.. ఫీల్తో ఆలపించాడు. తర్వాత సుమ తన సహజమైన గేమింగ్ షోను స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ప్రకారం పార్టిసిపెంట్స్ అందరూ హెడ్ఫోన్స్ పెట్టుకొంటారు. వాళ్ల చెవిలో.. బిగ్బాస్ మ్యూజిక్ ప్లే చేస్తుండగానే.. సుమ చెప్పే వాక్యాన్ని, సామెతను.. డైలాగ్ను లిప్ మూమెంట్ ద్వారా గుర్తించి.. ఆమె చెప్పిందో ఏంటో చెప్పాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం శ్రీముఖికే దక్కింది. మొత్తం మూడు ప్రశ్నల్ని శ్రీముఖి అలవోకగా సమాధానం చెప్పేసింది. తనదైన శైలిలో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పడంతో.. చెవుల్లోం,చి రక్తాలు కారుతున్నాయంటూ సుమ జోక్ చేశారు. 1. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి.. సింహాల మీద కాదు.. 2 చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు 3. బిగ్ బాస్గారూ మీ ఒకసారి మా యింటికి రావాలి.. ఈ డైలాగులను శ్రీముఖి అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. ఇక, మీ ఆవిడంటే మీకు చాలా భయమా. ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడో తెలుసా.. ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా..డైలాగులు సుమ చెప్పగా.. వీటిని చెప్పడానికి బాబా పడినపాట్లు మామూలువి కావు. తరువాత వంతు వరుణ్ది. బుజ్జిగాడు.. బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు.. అన్న డైలాగుకు.. పుచ్చకాయ..పచ్చగా అంటూ వరుణ్ నానా తిప్పలు పడి..ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. రెండుసార్లు ఇదే డైలాగును చెప్పగా.. చచ్చీ చెడి సాధించాడు. చివరికి జీవితంమంటే పోరాటం.. పోరాటంలోనే ఉంది జయం... డైలాగును కరెక్ట్గా చెప్పి సక్సెస్ అయ్యాడు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా.. గుర్తు పెట్టుకో..నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ..నీకు బీపీ వస్తే..నీ పీఏ వణుకుతాడు..వంటి డైలాగులు అలీ రెజాకు ఇవ్వగా.. వాటిని చెప్పడం అలా కి సాధ్యంకాలేదు. ఈ సందర్భంగా కూడా నవ్వుల మతాబులు విరజిమ్మాయి. ‘పునర్నవి వెళ్లిపోయిన తరవాత బాధగా వుందా’ ఈ డైలాగును రాహుల్ అలవోకగానే చెప్పాడు. విష్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబొట్లు చెప్పడానికి మాత్రం కష్టపడ్డాడు. నా చావు నే చస్తా.. నీకెందుకు అన్న డైలాగును చెప్పలేక తికమక పడ్డాడు. అయితే నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా డైలాగును సరిగ్గా చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విచిత్రం ఏమంటే.. ఈ గేమ్లో బాగా, తొందరగా ఆన్సర్ చేసిన వారికి కాకుండా.. ప్రేక్షకులను ఎక్కువ ఎంటర్టైన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది వరుణ్. ఈ గేమ్షోలో సుమ హావభావాలు, పంచ్లతో బాగా ఆకట్టుకున్నారు. భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించారు. కానీ అంతలోనే బిగ్బాస్ కుక్కలు మొరిగిన వార్నింగ్ రావడంతో అది కుదరలేదు. మొత్తంమీద అందరూ ఊహించినట్టుగానే...ఎదురు చూసినట్టుగానే.. సుమ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నారు. -
వరుణ్, శివజ్యోతిల ఫైట్ మళ్లీ మొదలైంది..
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో నామినేషన్లోకి వచ్చిన ఇంటిసభ్యులతో బిగ్బాస్ ఫీట్లు చేయిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో వారితో సర్కస్ ఫీట్లు చేయించగా.. నేడు హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టనున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగేట్టు తెలుస్తోంది. టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు.. నచ్చని హౌస్మేట్పై రంగు పోసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. బిగ్బాస్ ఇచ్చిన ఈ టాస్క్తో ఇంట్లో పాత గొడవలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. వారం ప్రారంభంలో జరిగిన నామినేషన్ టాస్క్లోని జరిగిన లొల్లిని శివజ్యోతి ప్రస్తావించడంతో వరుణ్ ఒంటికాలిపై లేచాడు. తన సహనాన్ని కోల్పోయి శివజ్యోతిపై విరుచుకుపడ్డాడు. ‘మానిప్యులేటివ్గా మాట్లాడకు..’ అంటూ శివజ్యోతిపై మండిపడ్డాడు. గొడవను సర్ది చెప్పాలని చూసిన రాహుల్పైనా తిరుగుదాడి చేశాడు. దీంతో వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. కాగా వరుణ్.. బాబాపై, శివజ్యోతి.. వరుణ్పై, బాబా.. అలీపై, శ్రీముఖి.. శివజ్యోతిపై రంగు పోసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమో ఆసక్తి రేకెత్తించినప్పటికీ ఎపిసోడ్ మాత్రం సాదాసీదాగానే ఉంటుందని ప్రోమో లవర్స్ విమర్శిస్తున్నారు. Color esko leda Cover chesko!!! #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4EC1CfrIAj — STAR MAA (@StarMaa) October 24, 2019 Who do you think is the clean person in the house??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/rDG0QsRNDS — STAR MAA (@StarMaa) October 24, 2019 -
బిగ్బాస్: ఫైనల్కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?
భీమవరం అమ్మాయి వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్లో టాస్క్లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ షో ఫైనల్కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు. దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఫైనల్ బెర్తు కోసం వరుణ్, రాహుల్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్లో భాగంగా వరుణ్.. రాహుల్తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్గా టికెట్ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? టాస్క్ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే! "Ticket To Finale" evaru geluchukuntaru??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/srVrxbrxGn — STAR MAA (@StarMaa) October 21, 2019 -
బిగ్బాస్: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్
బిగ్బాస్ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్బాస్ విడగొట్టాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్లు ఆడించాడు. మీకు సూటబుల్ అనిపించే పాటలను డెడికేట్ చేసుకోమని నాగ్ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్ సాంగ్తో, శ్రీముఖి.. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్.. జులాయి టైటిల్ సాంగ్, వరుణ్.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్గా శివజ్యోతి డాన్స్ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. తర్వాత హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్, అలీ రెజాలకు బాక్సింగ్ గ్లౌజ్లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్ చేస్తుండగా మిగతా హౌస్మేట్స్ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్ ఆసక్తికర టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్బాస్ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్బాంబ్ను రాహుల్పై వేసింది.