varun sandesh
-
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు. -
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
Varun Sandesh-Vithika Sheru: పడ్డారండీ ప్రేమలో మరి.. పదేళ్ల జర్నీ (ఫోటోలు)
-
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి
‘‘నాకు ఒకే రకమైన పాత్రలు వస్తుండటంతో సినిమాలు వదిలేయాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ‘రాచరికం’(Racharikam) టీమ్ని నా వద్దకి పంపించాడని అనిపించింది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని అప్సరా రాణి(Apsara Rani) తెలిపారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో విజయ్ శంకర్ మాట్లాడుతూ–‘‘రాయలసీమ అంటే ఏంటో ‘రాచరికం’ చూపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేశాను’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘విజయ్గారు చాలా అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశారు’’ అని సురేశ్ లంకలపల్లి చెప్పారు. ‘‘ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతిసారి నా మిత్రులే నన్ను సపోర్ట్ చేశారు’’ అన్నారు ఈశ్వర్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, ‘ఆదిత్య మ్యూజిక్’ నిరంజన్, కెమేరామేన్ ఆర్య సాయి తదితరులు మాట్లాడారు. -
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
నల్లగొండ గద్దర్ నోట ‘కానిస్టేబుల్’ పాట
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని అన్నారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. -
ఉత్కంఠభరితంగా వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' టీజర్
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కానిస్టేబుల్'. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
సస్పెన్స్... థ్రిల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్. -
‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కథలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథాను మార్చుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ‘నింద’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే మరో డిఫరెంట్ మూవీతో అలరించడానికి రాబోతున్నాడు. అదే ‘కానిస్టేబుల్’.ఆర్యన్ సుభాన్ ఎస్కే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ కే. కార్తిక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు. -
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్..టాప్లో ట్రెండింగ్!
వరుణ్ సందేశ్ లీడ్ రోల్లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ విరాజి. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 22 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో అంతగా మెప్పించలేని హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే 56 లక్షల వాచ్ మినిట్స్తో ఆహాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -' విరాజి సినిమా ఓటీటీలో 56 లక్షల వాచ్ మినిట్స్తో ట్రెండ్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు. ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. ఈ మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో చూస్తూ ఎంజాయ్ చూస్తున్నారు" అని అన్నారు. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ 'విరాజి' సినిమా
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'విరాజి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 2న విడుదలైంది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఓటీటీలో విరాజి విడుదల కానుందని ఆహా ప్రకటించింది. ఆగష్టు 22న స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ వెంటనే ‘విరాజి’తో మెప్పించాడు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
మేకోవర్ సవాల్గా అనిపించింది: వరుణ్ సందేశ్
‘‘నేను ఫలానా తరహా పాత్రలే చేయాలని పరిమితులేవీ పెట్టుకోలేదు. కథ, అందులోని నా క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘మైఖేల్’ సినిమాలో విలన్గా చేశాను. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో వరుణ్ సందేశ్ పంచుకున్న విశేషాలు.∙‘విరాజి’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్న కొంతమంది దగ్గరకు ఆండీ (వరుణ్ సందేశ్ పాత్ర పేరు) వచ్చాక అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు? అనేది సినిమాలో చూడాలి. ఓ సందేశం కూడా ఉంది. ఇలాంటి కథను సినిమాల పట్ల ΄్యాషన్ ఉన్న మహేంద్రగారిలాంటి వారే నిర్మించగలరు. మా సినిమాను మైత్రీవారు డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. ∙‘విరాజి’లోని నా పాత్ర లుక్, మేకోవర్ను కొత్తగా డిజైన్ చేశారు హర్ష.రెండు డిఫరెంట్ కలర్స్లో హెయిర్ స్టైల్, ముక్కు పుడక, ఓ స్నేక్ టాటూ... ఇలా ఆండీ కొత్తగా కనిపిస్తాడు. ఈ మేకోవర్ నాకు కాస్త చాలెంజింగ్గా అనిపించింది. హెయిర్ కలరింగ్ కోసం ఏడు గంటలు, ట్యాటూస్ కోసం దాదాపు గంట పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ ట్యాటూ వేసుకోవాల్సి వచ్చేది. ‘విరాజి’ సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ∙నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ‘హ్యాపీ డేస్’ సినిమా చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఓ నటుడిగా నా ప్రయాణంలో విమర్శలు సహజమని నాకు తెలుసు. కానీ నా భార్య వితిక కాస్త ఫైర్ బ్రాండ్. అందుకే నా లుక్ గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్పై ఆమె అలా స్పందించారు. వితికలాంటి భార్య దొరకడం నా లక్గా భావిస్తున్నాను. ప్రస్తుతం ‘కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్నాను. ‘రాచరికం’ సినిమాలో పెద్ద మీసాలతో చిత్తూరు యాస మాట్లాడే వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తాను. -
వరుణ్ సందేశ్తో ర్యాపిడ్ ఫైర్
-
ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూసే రోజులు కాదు అందుకే డిఫరెంట్ గా తీశాం
-
నా హెయిర్ స్టైల్ కలర్ చూసి నా భార్య రియాక్షన్ ఏంటంటే..
-
నా సినిమాలు జనాలు చూడటం లేదు అందుకే ఇంత గ్యాప్..
-
'విరాజి' థ్రిల్లింగ్తో పాటు మెసేజ్ ఇస్తాడు: దర్శకుడు ఆద్యంత్ హర్ష
మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విరాజి'. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న విరాజి సినిమా గురించి దర్శకుడు ఆద్యంత్ హర్ష పలు విషయాలు పంచుకున్నాడు.ఫారిన్లో చదువుకున్న డైరెక్టర్ ఆద్యంత్ హర్ష సినిమాల పట్ల ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ నేర్చకున్నాడు. సుమారు పది కథలు రాసుకున్న ఆయన విరాజి చిత్రాన్ని ఫైనల్గా తెరకెక్కిస్తున్నారు. గతేడాది 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కు చెప్పడంతో ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ మహేంద్రనాథ్కు నచ్చడం ఆపై వరుణ్ సందేశ్ను హీరోగా ఫైనల్ చేశామని ఆయన అన్నారు. 'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించిందని ఆద్యంత్ తెలిపారు.'విరాజి' అనే టైటిల్కు అర్థం.. చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడని ఆయన అన్నారు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు అంటారని తెలిపారు. 'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారని ఆద్యంత్ తెలిపారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందని ఆయన అన్నారు. -
అందుకే వరుణ్ సందేశ్ని హీరోగా తీసుకున్నాం : ‘విరాజి’ నిర్మాత
ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే బరిలో పలు సినిమాలు ఉన్నా..ఆగస్ట్ 2న ‘విరాజి’ని విడుదల చేస్తున్నాం’అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.⇢ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ముందు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.⇢ మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.⇢ మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. -
ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ట్రైలర్తోనే భయపెట్టేశాడు!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విరాజి'. ఇటీవలే నింద సినిమాతో అలరించారు. ఈ మూవీని హారర్ జోనర్లో ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఎం3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.విరాజి మూవీ కోసం వరుణ్ సందేశ్ తన లుక్ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఆత్మలే ప్రధాన కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్గా కనిపించనున్నారు. 1970లో నిర్మించిన ఓ మెంటల్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్తోనే ఆడియన్స్ను భయపెడుతోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్లుక్, టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
నా 17 ఏళ్ల కెరీర్లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్ సందేశ్
డైరెక్టర్ హర్ష విరాజి కథ చెప్పినప్పుడు.. ఫస్టాఫ్ పది నిమిషాల విన్న కథ ఇలా ఉంటుందని రెండు మూడు చోట్ల గెస్ చేశా. కానీ సెకండాఫ్కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను’ అన్నారు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ‘నింద’తో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్..త్వరలోనే ‘విరాజి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారుతాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఈ నెల 10 ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. అది చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఆగస్ట్ 2న విడుదల కాబోతున్న ఈచిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.వరుణ్ను తెరపై కొత్తగా చూస్తారని అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల . ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆద్యంత్ హర్ష, నటులు రఘు కారుమంచి, ప్రమోదిని, ఫని, మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫరెంట్ కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్.. బాక్సాఫీస్ వద్ద జోరు!
వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్కు మంచి కమ్బ్యాక్ అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. -
'నింద' సినిమా రివ్యూ
అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్కి కమ్ బ్యాక్గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)కథేంటి?కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.ఎవరెలా చేశారు?లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
థ్రిల్లింగ్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతున్న ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ‘బలగం’ జగదీష్ నిర్మాత. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘కానిస్టేబుల్ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. వరుణ్ సందేశ్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. ‘‘కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. పోస్ట్ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు ‘బలగం’ జగదీష్. -
ఇక డైరెక్షన్పైనే ఫోకస్
‘‘మలయాళ సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్దకు ఎందుకు రావడం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మా ‘నింద’ చూశాక ‘బాగా తీశారు.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి’ అనుకుంటారు. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చిత్ర దర్శక–నిర్మాత రాజేశ్ జగన్నాథం అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేశ్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘మాది నర్సాపురం. నెల్లూరు, చెన్నై, యూఎస్లో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండి΄ోయాను. ఫిల్మ్ మేకింగ్లో కోర్సులు చేసి, అక్కడే షార్ట్ ఫిలింస్ చేశాను. వాస్తవ ఘటనలు, కల్పిత సన్నివేశాలతో ‘నింద’ స్క్రిప్ట్ రాశాను. ఈ కథ వరుణ్ సందేశ్కి మంచి కమ్ బ్యాక్లా ఉంటుందని భావించి ముందుకెళ్లాం. కథపై ఉన్న నమ్మకంతోనే నేనే నిర్మించాను. ఈ మూవీలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ‘నింద’ తర్వాత ఎక్కువగా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను’’ అన్నారు. -
‘నింద’ చూశాక ఆ ఫీలింగ్ కలుగుతుంది: రాజేష్ జగన్నాథం
మలయాళ సినిమాలు చూసి..మన దగ్గర(టాలీవుడ) ఇలాంటి సినిమాలు ఎందుకు రావాని అంతా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. ‘నింద’ కూడా అలాంటి చిత్రమే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడు ‘ఇదేదో బాగానే ఉందే..బాగా తీశారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’అన్నారు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం . ఆయన తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తాజాగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ మేకింగ్పై ఉన్న ఇంట్రెస్ట్తో యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. నింద కథ వరుణ్కు చెప్పడంతో నచ్చి.. వెంటనే ఓకే చేశాడు. నిర్మాత కోసం ప్రయత్నించాం. కానీ దొరకలేదు. కథపై ఉన్న నమ్మకంతో చివరకు నేనే నిర్మించాను. టెక్నికల్గా సినిమా చాలా బాగుంటుంది. పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్ను ఇచ్చారు.సినిమాలోని ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ అప్డేట్స్ ఇస్తాను.ఇకపై ఎక్కువగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేస్తాను’ అన్నారు. -
తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్ సందేశ్
‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్ సందేశ్ మీడియాతో పంచుకున్న విశేషాలు.⇒ నా కెరీర్లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్’ సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్గారి డెడికేషన్ చూసి రిస్క్ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్లో పాల్గొన్నాను. ⇒సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. ⇒మా దర్శక–నిర్మాత రాజేశ్గారి ఫ్రెండ్ అమెరికాలో ‘నింద’ని రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్ నవీన్గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. -
‘నింద’ స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్ సందేశ్
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద కూడా అలాంటి కథే. కానీ స్క్రీన్ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు’అని అన్నారు హీరో వరుణ్ సందేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్గా అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లాను. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.→ నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా కనిపిస్తాను.→ ‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్తో నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.→ మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.→ నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను. -
నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2019లో బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్బాస్ హౌస్లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.‘బిగ్బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్గా, ఫైనాల్షియల్గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది. ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్బాస్ షోనే. నా లైఫ్లో ఆ 105 రోజుల ఎక్స్పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్ సిద్ధార్థ్
‘‘నింద’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్ సందేశ్ కెరీర్లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్గారు ఎంతో ప్యాషన్తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్పుట్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్ జగన్నాథం. -
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. నా కెరీర్లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్కు ఓ మైల్ స్టోన్లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ ఈ సినిమాను నాకు చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్ప్రైజ్ అవుతారు’ అని అన్నారు. -
నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్కు హిట్టు వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. భర్త విజయం కోసం వితికా సైతం ఎదురుచూస్తోంది. మా ఆయన కోసం వచ్చానింద ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూన్ 16) జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ సతీమణి, హీరోయిన్ వితికా షెరు ఎమోషనలైంది. 'సందేశ్ సినిమా ఫంక్షన్స్కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అవకాశాలు రావట్లేదుమీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట! వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్. వరుణ్ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తనకు మంచి అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే కష్టపడతారు. వరుణ్ కూడా అంతే! ఏదో ఒకరోజు హిట్టు కొడతాడు అని చెప్పుకొచ్చింది. చదవండి: బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్.. ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్! -
వరుణ్ సందేశ్ 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
థ్రిల్లర్ ఎలిమెంట్స్తో 'నింద' ట్రైలర్.. మీరు చూశారా?
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 21న థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?)అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు అనే పాయింట్.. అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇందులో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీతో నైనా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే) -
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
యువ హీరో వరుణ్ సందేశ్ 'నింద' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమా ఆకట్టుకోగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ ప్రారంభించారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!)ఈ క్రమంలోనే గానామాస్ స్పెషల్ స్కూల్కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
కాండ్రకోటలో ఏం జరిగింది?
‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ (తనికెళ్ల భరణి) అనే డైలాగ్తో మొదలవుతుంది ‘నింద’ సినిమా టీజర్. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాను రాజేశ్ జగన్నాథం స్వీయదర్శకత్వంలో నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.లవ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ మ్యూజిక్ డైరెక్టర్. -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో న్యాచురల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు. -
వాస్తవ ఘటనల నింద
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అన్నది ఉపశీర్షిక. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రోడక్షన్స్ బ్యానర్ రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.ఈ చిత్రం నుంచి వరుణ్ సందేశ్ పాత్ర ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘నింద’. ఇప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మా ‘నింద’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న మా సినిమా టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: రమీజ్ నవీత్. -
వరుణ్ సందేశ్ ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఆడియెన్స్ రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ‘నింద’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు.ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో ఈ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను గమనిస్తుంటే వరుణ్ సందేశ్ అమయాకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తోంది. మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? న్యాయ దేవతను ఎందుకు చూపిస్తున్నారు? వరుణ్ సందేశ్ కారెక్టర్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ పోస్టర్ ఉంది. ఇలా పోస్టర్తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 15న ఈ చిత్రం నుంచి టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారు. -
ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ 'నింద' పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మంచి కథ ఉంటే చాలు థియేటర్, ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ సినిమా తీశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 'నింద' చిత్రం రాబోతుంది. రాజేష్ జగన్నాథం దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రాబోతోన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఊరి వాతావరణం, చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూపించారు. వారంతా సినిమాను మెచ్చుకున్నారట. మంచి కాన్సెప్ట్తో చిత్రాన్ని తీశారని దర్శక నిర్మాతలని ప్రశంసించారట. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) -
చాలా రోజుల తర్వాత ‘శబరి’లో డ్యాన్స్ చేశా: వరలక్ష్మీ శరత్కుమార్
‘తెలుగులో నేను చేసిన తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’. ఇది థ్రిల్లర్ మూవీ. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో డ్యాన్స్ చేశాను’’ అని వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదలవుతోంది. ఐదు భాషల ట్రైలర్స్ విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. నటుడు వరుణ్ సందేశ్ తెలుగు ట్రైలర్ని, నిర్మాత మహేంద్రనాథ్ తమిళ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ‘‘నిర్మాత గురించి ఆలోచించే నటి వరలక్ష్మి. ‘శబరి’ నా తొలి సినిమా. ఆదరించాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల్నెప్పుడు కంటారు? వితికా ఆన్సర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. వరుణ్ ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వితికా షెరు.. యూట్యూబ్ వీడియోల ద్వారా నిత్యం అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవలే తన ఇంటిని కొత్తగా తీర్చిదిద్దింది. తనకు నచ్చినట్లుగా రీడిజైన్ చేయించుకుంది. ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అడుగుతూనే ఉన్నారుగా.. ఎప్పుడూ ఇదే ప్రశ్న ఎదురవడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చింది. 'పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని జనాలు నన్ను అడుగుతూనే ఉన్నారు కదా.. ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను' అని ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో వరుణ్.. వితిక ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా భర్త ఇంకా పిల్లాడే అని పోస్ట్ చేయడంతో ఆన్సర్ అదిరిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్లో లవ్ కాగా వీరిద్దరూ 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమా షూటింగ్లో నిజంగా లవ్లో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లోనూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో వితికపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొంతకాలం పాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది. కానీ భర్త అండ వల్ల దాన్నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) చదవండి: షార్ట్కట్స్ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశా.. ఇక చాలు! -
టాలీవుడ్ బిగ్బాస్ జంట ఇంటిని చూశారా.. ఎంత బాగుందో!
వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి'. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 19, 2016న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. తాజాగా వరుణ్ సందేశ్ భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకే హోమ్ టూర్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పాత ఇంటినే తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. తాము కొవిడ్ టైమ్లో అమెరికాలో ఉన్నామని వెల్లడించింది. మా అత్తయ్య ప్రత్యేకంగా ఇంటిని తీర్చిదిద్దారని వితికా పేర్కొంది. కాగా.. ఇటీవలే వరుణ్ సందేశ్- వితికా శేరు అయ్యప్ప పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
నాకు అలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం: వరుణ్ సందేశ్
-
'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్
'బిగ్బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు? ఏం జరిగింది? తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వరుణ్ ఏం చెప్పాడు? 'బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది. 'బిగ్బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది' అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
పలు గెటప్స్లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించే కథలు కొందరు స్టార్స్కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్లో కనిపించడం కమల్హాసన్కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్హాసన్ నాలుగుకి మించి గెటప్స్లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్చరణ్ ఏడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..
సాధారణంగా హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడూ కొందరు అలానే ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్ మెంటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ లుక్స్తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే తక్కువ మూవీస్ లోనే నటించింది. ఆ తర్వాత ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? ఆమె ఎవరో కాదు బిగ్బాస్ తో చాలామందికి పరిచయమైన వితికా షేరు. అదేనండి 'కొత్తబంగారు లోకం' హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది కదా. ఆమెనే ఈమె. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఆఫర్పై హీరోయిన్ మాధవీ లత క్లారిటీ) 2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన వితికా షేరు.. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2015లో 'పడ్డామండీ ప్రేమలో మరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలా సినిమా చేస్తూ ప్రేమలో పడ్డ వరుణ్ సందేశ్-వితికా షేరు.. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వచ్చిన 'పెళ్లి సందD' మూవీలో చివరగా వితిక కనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో భర్తతో కలిసి జంటగా పాల్గొన్న వితిక.. ఆరో సీజన్ లో కీర్తి భట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగర్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా ఫిట్ గా మారి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్పై వైష్ణవి సీరియస్) -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్కి గాయం ఐదు కేజీల డంబెల్ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
షూటింగ్ లో ప్రమాదం..
-
షూటింగ్లో ప్రమాదం.. టాలీవుడ్ హీరోకు తీవ్ర గాయాలు..!
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ అనే చిత్రంలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైంది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్ కాలికి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు! ) ఊహించని సంఘటనతో సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు. కాగా.. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) -
ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి 'భీమవరం' బ్యూటీ వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనపై వస్తున్న దారుణమైన ట్రోల్స్కు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది నటి వితికా. హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే మోడల్గా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్ సందేశ్ను పెళ్లాడింది. ఆపై సినిమాలకు గ్యాప్ రావడంతో వీళ్లిద్దరు కలిసి బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో వితిక మరింత పాపులర్ అయ్యింది. ఇదీ చదవండి: (ఇదీ చదవండి: స్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ను కూడా: దియా మీర్జా) సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటూనే.. యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్ను మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలను, షార్ట్ వీడియోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి రితిక చేసిన ఓ రీల్ను షేర్ చేసింది. అయితే, ఆ వీడియోకు దారుణమైన కామెంట్లను ఆమె ఎదుర్కొవాల్సి వచ్చింది. బాగా లావు అయిపోయావ్.. నువ్వు హీరోయిన్ అంటే నమ్మ బుద్ధి కావడం లేదనే కామెంట్లు వచ్చాయి. ఇలా నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్కు గురైంది. దీంతో పట్టుదలతో వితిక వర్కౌట్స్ చేసి సుమారు 15 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఎమోషనల్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా ‘ది కానిస్టేబుల్’ చిత్రం బుధవారం హైదరాబాద్లో ఆరంభమైంది. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘బలగం’ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహూర్తపు సన్నివేశానికి బి. నిఖితా జగదీష్ కెమెరా స్విచ్చాన్ చేయగా బీజే రిథిక క్లాప్ కొట్టారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎమోషనల్ కానిస్టేబుల్గా నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నాకు బాగా నచ్చాయి’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్, ‘బలగం’ జగదీష్. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు పధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సుభాష్ ఆనంద్, కెమెరా: హజరత్ షేక్ (వలి). -
వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'చిత్రం చూడర'. ఈ చిత్రానికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీఎం సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితీ గౌతమ్ స్పెషల్ సాంగ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘 Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀 Directed by @NHarsha828 🎬 Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/rs1Mi9icP5 — BM Cinemas (@BMCinemas_) March 9, 2023 -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం
హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాప్లు వెంటాడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. తాజాగా సరికొత్త కథలో హీరోగా తిరిగి వస్తున్నాడు బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్ . యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. శేషు మారం రెడ్డి ,బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం వస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి విజయం అందిస్తుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’అన్నారు. ‘ హర్షవర్ధన్ ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి. ‘సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , , మీనా కుమారి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నాడు దర్శకుడు హర్షవర్ధన్. -
బిగ్బాస్ బ్యూటీ నందిని బర్త్డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్డే సెలబ్రెషన్స్లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్కు మరింత దగ్గరైంది. బిగ్బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
ఒక్క హిట్తో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు: నిఖిల్
Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు. ‘డైమండ్ రాజా’ చిత్రంతో వరుణ్ సందేశ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలి. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అని యంగ్ హీరో నిఖిల్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్ విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పవన్ రెడ్డి కోటిరెడ్డి. -
ఊర మాస్గా వరుణ్ సందేశ్.. వినూత్న కథతో ‘యద్భావం తద్భవతి’
‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఆ రెండు చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు కానీ.. నటుడిగా తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు(జులై 21) సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.ఇందులో వరుణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్లో మాస్ ఆడియెన్స్ను మెప్పించేలా ఉన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నారు.‘నా సినిమా పోస్టర్ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి గారికి థ్యాంక్స్’అని వరుణ్ సందేశ్ అన్నారు. మిహిరమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్
Varun Sandesh Plays Key Role In Michael Movie: హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో ఇటీవలె ఇందువధన చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. తాజాగా రూటు మార్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మైఖేల్ సినిమాలో వరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ,మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆర్జే కాజల్కి అదిరిపోయే పంచ్ వేసిన వరుణ్ సందేశ్
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్కి శ్రీరామచంద్ర, వరుణ్తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్గా నిర్వహించింది. కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్బాస్తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్ని ముగించాడు. అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు. -
‘ఇందువదన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇందువదన నటీనటులు : వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు నిర్మాతలు : మాధవి అదుర్తి దర్శకత్వం : ఎం శ్రీనివాస రాజు (ఎమ్ఎస్ఆర్) సంగీతం : శివ కాకాని సినిమాటోగ్రఫీ : బీ మురళీకృష్ణ విడుదల తేది : జనవరి 1,2022 ‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని చూపించలేదు. ఇక సినిమాల చాన్స్ రాని సమయంలో ‘బిగ్బాస్’రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఆ షోతో వరుణ్ సందేశ్కి క్రేజ్ వచ్చినప్పటికీ.. పెద్దగా సినిమాలేవి చేయలేదు. చాలా రోజుల తర్వాత వరుణ్ ‘ఇందు వదన’అనే సినిమాలో మళ్లీ టాలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ నటించిన తొలి పీరియాడికల్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కు మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన ‘ఇందు వదన’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? అగ్రహారం గ్రామానికి చెందిన వాసు(వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ పోలీసాఫీసర్. అతను అడవిలో ఉండే గిరిజన యువతి ఇందు( ఫర్నాజ్ శెట్టి)తో తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. అయితే కులం కారణంగా వారి పెళ్లిని వాసు కుటుంబ సభ్యులు నిరాకరిస్తారు. అనుహ్యా కారణాల వల్ల ఇందు హత్యకు గురవుతుంది. అసలు ఇందుని హత్య చేసిందెవరు? ప్రేమించి, పెళ్లాడిన ఇందు చనిపోయిందని తెలుసుకున్న తర్వాత వాసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తనను హత్య చేసిన వారిపై ఇందు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. టాలీవుడ్లో వరుణ్ సందేశ్కి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో ఆయన నుంచి అన్ని ప్రేమ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఇందు వదన మూవీలో మాత్రం కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్ వాసు పాత్రలో తెరపై సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్టింగ్ పరంగా కూడా ఇరగదీశాడు. ఫైట్ సీన్స్లో కూడా పర్వాలేదనిపించాడు. గిరిజన యువతి ఇందు పాత్రలో ఫర్నాజ్ శెట్టి ఒదిగిపోయింది. తొలి సినిమాయే అయినా.. అద్భుతంగా నటించింది. ఒకవైపు వరుణ్ సందేశ్తో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టించింది. వరుణ్, ఫర్నాజ్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే వరుణ్ సందేశ్ స్నేహితులుగా మహేశ్ విట్ట, ధనరాజ్, పార్వతీశం తమదైన కామెడీతో నవ్వించారు. నాగినీడు, అలీ, సురేశ్ వాణిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... ? టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో ప్రేమకథా చిత్రమ్, తను వచ్చెనంట, యూటర్న్ చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇందువదన’. లవ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ఆర్. దర్శకుడుకు ఎంచుకున్న పాయింట్ పాతతే అయినప్పటికీ.. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. చక్కటి ప్రేమ కథకి హారర్ని జోడించి సినిమాని తెరకెక్కించాడు. అయితే కథలో బలం లేకపోవడంతో సినిమా స్థాయి తగ్గింది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ‘ఇందు వదన’ఓ మంచి హారర్-థ్రిల్లర్ మూవీ అయ్యేది. ఫస్టాఫ్లో వాసు ఇందుల లవ్స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇంటెర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్లో దెయ్యంతో వచ్చే కామెడీ సీన్స్, అలీ ఎంట్రీ సీన్ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్ కథని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే... శివ కాకాని సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా అందించాడు. మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఐదేళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై కనిపించబోతున్నా!
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇందు వదన’. నైనిష్య, సాత్విక్ సమర్పణలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఇందువదన’ ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో నేను చేసిన తొలి చిత్రం ‘ఇందువదన’. ఐదేళ్ల తర్వాత నేను బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్న సినిమా కాబట్టి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా థియేటర్స్లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది’’ అన్నారు ఎమ్ఎస్ఆర్, మాధవి, గిరిధర్. -
హల్చల్ : ఆనందంలో రష్మిక.. వాట్ ఎ మూడ్ అంటున్న తమన్నా
♦ 20మిలియన్లకు చేరిన రష్మిక ఫాలోవర్లు ♦ సెట్కి రెడీ అవుతున్న బిగ్బాస్ ఫేం సోహేల్ ♦ రీచార్జ్ అవసరం అంటున్న యాంకర్ లాస్య ♦ వాట్ ఎ మూడ్ అంటున్న తమన్నా భాటియా ♦ టవల్లో దూరిపోయిన పూజా, చౌదరి ♦ 5M వ్యూస్తో దూసుకుపోతున్న ఇందువధన టీజర్ ♦ బ్లాక్ అంటేనే ఫ్యాషన్ అంటున్న కాజోల్ ♦ పానీపూరీతో హ్యాపీనెస్ అంటున్న అనుపమ ♦ మనీష్ స్టయిలింగ్లో మలైకా స్టన్నింగ్ లుక్స్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
తాతయ్య నా సినిమా చూడాలనుకున్నారు, కానీ: వరుణ్
Induvadana Teaser: ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇందువదన’. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహించారు. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమా టీజర్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇందువదన’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమా చూడాలనుకునేవారు మా తాతయ్య. కానీ, గత ఏడాది చనిపోయారు. అలా మా తాతయ్య కోరిక నెరవేరకపోవడం బాధగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవలే విడుదలైన మా సినిమాలోని తొలి పాట యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడంతో పాటు చాట్బస్టర్గా నిలిచింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: గిరిధర్, కెమెరా: బి మురళి కృష్ణ, సంగీతం: శివ కాకాని, లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ. -
బోల్డ్ పాత్రలో ఇందు, పోస్టర్ రిలీజ్
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇందువదన". ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాధవి ఆదుర్తి నిర్మించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరిపిన క్లైమాక్స్ షూటింగ్తో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. తాజాగా ఈ చిత్రంలో వాసు పాత్ర పోషించిన వరుణ్ సందేశ్, ఇందు పాత్ర చేసిన ఫర్నాజ్ పాత్రల లుక్స్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ అటవీశాఖ అధికారి పాత్ర చేశారు. సతీష్ ఆకేటి కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: శివకాకని, సహనిర్మాత: గిరిధర్. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది -
నా బంగారు తల్లి.. క్రిష్ బాగా చూసుకో: వితిక
‘‘నా బంగారు తల్లి.. నీ పెళ్లి గురించి, నా పెళ్లి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు.. కానీ నేను నిన్ను తల్లిలా పెంచుకున్నా. మీ పెళ్లి చేయాలనే ఇరవై ఏళ్ల నా కల ఇప్పుడు నెరవేరింది. నా చేతుల మీదుగా ఇది జరగడం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. నీకోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నీ కొత్త ఇంట్లో నీకు అన్ని సంతోషాలు దక్కాలి. నన్ను గర్వపడేలా చేశావు. ఐ లవ్ యూ.. హ్యాపీ మారీడ్ లైఫ్. మీ జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. క్రిష్ బాగా చూసుకో’’ అంటూ నటి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ వితికా షేరు భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ‘‘కలకాలం నవ్వుతూ ఉండు. నాకు అదే చాలు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘1997 నుంచి నీకు కాపు కాస్తూనే ఉన్నాను. అవును.. బొమ్మరిల్లు ప్రకాశ్ రాజ్ ఫీమేల్ వర్షన్ నేను’’ అని కృతిక పెంపకంలో తన పాత్ర గురించి చమత్కరించారు. తన చెల్లెలు కృతికా షేరు పెళ్లి సందర్భంగా తనపై ఉన్న ఈ ప్రేమను వితిక ఈ విధంగా చాటుకున్నారు. అలాగే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన.. వితికా వారి జంట కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అంతా తానై చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపించినందుకు గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) కాగా కృతికా- కృష్ణల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షేరు కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకలో బిగ్బాస్-3 కంటెస్టెంట్స్ పాల్గొని సందడి చేశారు. నటి పునర్నవి సంప్రదాయ వస్త్రధారణలో ఈ గ్యాంగ్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
హీరో వరుణ్ సందేశ్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో, బిగ్బాస్ 3 ఫేం వరణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాత, జ్ఞానపీఠ్ ఆవార్డు గ్రహిత జీడిగుంట రామచంద్ర మూర్తి(80) మంగళవారం కన్నుముశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు) 1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్ సహకార బ్యాంక్లో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసిన అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో 1960లో ఆయన తొలిసారిగా రచించిన ‘హంసగమన’ అనే కథ ప్రచరితమయ్యింది. ఆ తర్వాత ఆయన 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు. -
ఓరుగల్లులో సినిమా చేస్తా..
కాజీపేట అర్బన్: లవర్ బాయ్ ఇమేజ్తో గుర్తింపు పొందిన నేను త్వరలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా అందరిని ఆకట్టుకునే సినిమాతో ముందుకు వస్తానని సినీహీరో వరుణ్సందేశ్ తెలిపారు. హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఓరుగల్లు అంటే ఎంతో ఇష్టం చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమా చేయాలనుంది. గతంలో టూర్లో భాగంగా వరంగల్కు వచ్చాను. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ ఫోర్ట్లతో పాటు నిట్ వరంగల్ చాలా ఇష్టమైన ప్రాంతాలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నందున వర్షం, ఎంసీఏ వంటి చిత్రాలతో సినీ రంగానికి అనువుగా నిలుస్తున్న వరంగల్లో సినిమా చేస్తా. బిగ్బాస్–3 ఓపికను నేర్పించింది... ఎంతో కోపంగా, ఓపిక లేకుండా, ప్రతి అంశానికి రియాక్ట్ అయ్యే నన్ను బిగ్బాస్–3లో 105రోజుల ప్రయాణం ఓపిక నేర్పించింది. నేను వితిక భార్యభర్తలమైనా బిగ్బాస్–3లో కంటెస్ట్లుగా పోటాపోటీగా టాస్క్లు చేశాం. టాప్–5లో నేను సైతం ఉండడం బిగ్ బాస్ నాకు నేర్పిన, అందించిన ఓర్పు, ఓపికతోనే. నేను నా భర్యతో పాటు 15 మంది కంటెస్ట్లతో అనుభూతులు, అభిరుచులను, కోపాలు–తాపాలు, అనుభావాలను పంచుకుంటూ ఆత్మీయులుగా మారిపోయాం. బిగ్బాస్–3 జర్నీ నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. నిత్యం షూటింగ్లో బిజీగా ఉండే నేను నా భార్య వితిక ఒకే చోట వంద రోజులు మనోభావాలను పంచుకునే అవకాశాన్ని అందించిన బిగ్బాస్కు రుణపడి ఉంటా. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే నన్ను టాప్–5లో బిగ్బాస్లో నిలబెట్టారు. నా అభిమానుల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. త్వరలో మల్టీస్టారర్... బిగ్బాస్–3 జర్నీ తర్వాత అనేక అవకాశాలు వస్తున్నాయి. పదికి పైగా స్టోరీలను విన్నాను. త్వరలో మల్టీస్టారర్ మూవీ, ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో ముందుకు వస్తా. ‘సే నో టూ ప్లాస్టిక్’లో వరంగల్ ముందుండాలి యూఎస్లో ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేదంతో పర్యావరణ పరిరక్షణలో ముందుండగా ప్రస్తుతం వరంగల్ సే నో టూ ప్లాస్టిక్ అంటూ ప్లాస్టిక్ రహితంగా వరంగల్ ఫస్ట్గా నిలవాలి. ప్లాస్టిక్ వినియోగంతో అనేక రోగాలు వస్తున్నాయి, వాతావరణం కలుషితమౌతుంది. పర్యావరణానికి ముప్పుగా మారిని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామంటూ వరంగల్వాసులకు వరుణ్సందేశ్ తన సందేశ్(శా)న్ని అందించారు. -
20 లక్షల ఆఫర్.. హౌజ్లో టెన్షన్ రేపిన శ్రీకాంత్
బిగ్బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలె ఆసక్తికరంగా సాగుతోంది. హీరోయిన్ల ఆటపాటలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రస్తుతం ఫినాలె ఎపిసోడ్ సాగుతోంది. ప్రముఖ హీరోయిన్లు క్యాథరిన్, అంజలి తన నృత్యాలతో బిగ్ బాస్ స్టేజ్ను వేడెక్కించారు. అనంతరం గెస్ట్గా దర్శనమిచ్చిన హీరో శ్రీకాంత్.. హౌజ్లోకి వస్తూనే టెన్షన్ రేపారు. హౌజ్లోని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ. 10 లక్షల సూట్కేస్ తీసుకొని.. ఒక కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్కు కంటెస్టెంట్లు ఎవరూ ముందుకురాలేదు. కంటెస్టంట్ల కుటుంబసభ్యులను ఈ ఆఫర్ గురించి నాగార్జున అడుగగా.. వాళ్లు కూడా ఈ ఆఫర్కు ఒప్పుకోవద్దంటూ కంటెస్టెంట్లకు సూచించారు. దీంతో శ్రీకాంత్ ప్లాన్-బీ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మరో పది లక్షల సూట్కేసును హౌజ్లోకి తీసుకొచ్చారు. మొత్తం రూ. 20లక్షలున్న రెండు సూట్కేసులు తీసుకొని.. హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని శ్రీకాంత్ కంటెస్టెంట్లకు సూచించారు. నలుగురు అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారని, మిగతా ముగ్గురు ఓడిపోవాల్సిందేనని చెప్పిచూశారు. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నవాళ్లు, విజేత కాలేనేమోనని భావించే ఎవరైనా ఈ ఆఫర్ను ఒడిసిపట్టాలని, రూ. 20 లక్షలంటే మామూలు విషయం కాదని, అదృష్టం కలిసివస్తే కాలదన్న కూడదని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ హితబోధ చేసినా.. ఎవ్వరూ కూడా ఈ ఆఫర్ను ఒప్పుకోలేదు. దీంతో ప్లాన్ సీ రూపంలో క్యాథరిన్ థెరిస్సా హౌజ్లోకి ఎంటరై.. ఎవరూ ఎలిమినేట్ అవుతున్నారో తెలిపే సీల్డ్ కవర్ను తీసుకొచ్చింది. చివరినిమిషంలోనూ సీల్డ్ కవర్లో తెరిచేటప్పుడు కూడా నాగార్జున్ సూట్కేసులను తీసుకొని వెళ్లిపోవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. బాబా భాస్కర్ కొంచెం తక్కువ కాన్ఫిడెన్స్తో కనిపించినా ఈ ఆఫర్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎవరూ అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ సీల్డ్ కవర్ను తెరిచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరును ప్రకటించాడు. వరుణ్ను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతన్ని తీసుకొని.. శ్రీకాంత్, క్యాథరిన్ తీసుకొని నాగార్జున వద్దకు వచ్చారు. -
బిగ్బాస్ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి
మూడు రోజుల్లో బిగ్బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్బాస్ అతని గ్రాఫ్ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్ను ‘మిస్టర్ కూల్, ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ పర్ఫెక్ట్’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్బాస్ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాహుల్ను చూసి గర్వించిన బిగ్బాస్.. అనంతరం రాహుల్ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్బాస్ హౌస్లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్బాస్ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్ అయిన రాహుల్ వెంటనే తేరుకుని బిగ్బాస్కు కృజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్.. ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్.. ఈ పేరు వింటే డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్బాస్ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్బాస్ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్బాస్.. బాబాకు ‘సూపర్స్టార్ ఆఫ్ ద హౌస్’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్మేట్స్ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి! -
బిగ్బాస్: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్..
బిగ్బాస్ 3 తెలుగు ఎన్నో పోట్లాటలు, ప్రేమలు, అపనిందలు, ఆప్యాయతలు, గొడవలు, గారాలతో అల్లుకుపోయింది. అప్పుడే గొడవపడతారు.. మళ్లీ అంతలోనే ఒక్కటైపోతారు. ఏ ఎమోషన్ అయినా అన్నీ ఇంట్లోవాళ్ల ముందే చూపిస్తారు. ఎవరినైనా నామినేట్ చేయడానికి సాకులు వెతుక్కునేది వాళ్లే.. ఎలిమినేట్ అవుతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఆ మధ్య బిగ్బాస్.. 50 రోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు ఓ వీడియో ద్వారా చూపించాడు. దాన్ని చూసిన హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. మరి ఇప్పుడు బిగ్బాస్ షోకు వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి కొత్తగా ఇంటి సభ్యులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది. ఆ గదిలోకి ఒక్కో హౌస్మేట్ను పిలిచి బిగ్బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నాడు. కాగా ఇల్లువాకిలి అన్నీ వదిలి వచ్చి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన ఇంటి సభ్యులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా మిగలనున్నట్లు స్పష్టమవుతుంది. కుటుంబంలాగా కలిసిపోయిన ఇంటి సభ్యులు మరి కొద్ది రోజుల్లో ఎవరిదారిన వాళ్లు వెళ్లనున్నారు. ఎన్నో ఎమోషన్స్, మరెన్నో జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకుని భారంగా బయటికి వెళ్లిపోనున్నారు. దీంతో నేటి ఎపిసోడ్ ఇంటి సభ్యుల భారమైన మనసుతో, బాధాతప్త హృదయాలతో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. మరి వారి జర్నీలను మనమూ చూడాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! Time to cherish the beautiful memories of #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa #FinaleWeek pic.twitter.com/mBBBAZTfNh — STAR MAA (@StarMaa) October 30, 2019 -
‘మా ఆయనే బిగ్బాస్ విజేత’
బిగ్బాస్ సీజన్– 3 విజేతగా తన భర్త వరుణ్ సందేశ్ నిలుస్తారని, తనకు ఆ నమ్మకం బాగా ఉందని ఆయన భార్య, గత వారం బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన వితికా శేరు అన్నారు. బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్బాస్ హౌస్లో తనకు ఓపిక బాగా అబ్బిందని కుదురుగా ఉండటం నేర్చుకున్నానని చెప్పారు.టాస్క్లలో నాకంటే వరుణ్ బాగా ఆడేవారు. అయితే వరుణ్ సోలోగా ఆడడానికే ఇష్టపడుతున్నట్లుగా ప్రేక్షకులు చెప్పారు. అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను. ఏదైనా చేయగలననే పట్టుదల కూడా వచ్చిందన్నారు. లగ్జరీ లేకుండా ఒకరి సహాయం తీసుకోకుండా గూగుల్తో సంబంధం లేకుండా బతకవచ్చు అనే నమ్మకం ఈ 90 రోజుల బిగ్బాస్ హౌజ్లో నాతో పాటు వరుణ్ కూడా తెలుసుకున్నారన్నారు. ఇందులో మైండ్తో ఆడేదే ఎక్కువగా ఉంటుందని, అందుకే తన విజ్ఞానం కూడా బాగా పెరిగిందన్నారు. బిగ్బాస్ హౌస్లో సభ్యులందరూ తనకు ఇష్టమైనవారేనని.. నచ్చని విషయమంటూ ఉందంటే అది రాళ్లు, రత్నాలు టాస్క్లో జరిగిన ఘటనేనని ఆమె తెలిపారు. వంటలు బాగా చేస్తా... బిగ్బాస్ హౌస్లో బాగా వంటలు చేయడంలో నాకు నేనే సాటిగా నిరూపించుకున్నాను. ఆరు వారాల పాటు కిచెన్ కెప్టెన్గా కొనసాగాను. నా వంటలను ఇతర సభ్యులతోపాటు వరుణ్ కూడా బాగా మెచ్చుకునేవారు. రూ.50 లక్షలు వస్తే... ఫైనల్లో వరుణ్ విజేతగా నిలిచి రూ.50 లక్షలు బహుమతిగా తీసుకొని వస్తే వాటిని భద్రంగా దాచుకుంటాను. మేం పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. డబ్బులు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో చవిచూశాం. అలాంటి పరిస్థితి రాకుండా.. ఈ వచ్చిన డబ్బును ఫిక్స్డ్ చేసుకుందామనుకుంటున్నాం. ఫైనల్లో ఆ ముగ్గురు ఉండొచ్చు.. వచ్చే నెల 3న జరగనున్న బిగ్బాస్–3 ఫైనల్ టాప్–3లో మా వారు వరుణ్ సందేశ్తో పాటు శ్రీముఖి, రాహుల్ ఉంటారేమో. తెలుగింటి ఆడపడుచుగా, ఒక భార్యగా మావారు వరుణ్సందేశ్ విజేతగా తిరిగి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. 13 వారాల పాటు భార్యాభర్తలిద్దరం బిగ్బాస్ హౌస్లో కొనసాగడానికి ప్రేక్షకులతో పాటు సహచర సభ్యులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. మంచి మిత్రులం.. బిగ్బాస్ హౌస్లోవరుణ్తో పాటు నేను, పునర్నవి, రాహుల్ మంచి స్నేహితులం. కష్టాల్లో, ఇష్టాల్లో నలుగురం పాలుపంచుకున్నాం. వరుణ్ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఎంతగానో ప్రేమించేవారు. ఎక్కువగా ఇంటి గురించే.. మేమిద్దరం ఒంటరిగా హౌస్లో కూర్చున్నప్పుడు ఇంటి గురించే ఆలోచించుకునేవాళ్లం. మా ఇంట్లో అమ్మకు, వరుణ్ ఇంట్లో బామ్మ, తాతయ్యకు ఆర్థిక అవసరాలు తీర్చేది మేమిద్దరమే. ఆర్థిక పరిస్థితులను చూసుకునే ఇద్దరం హౌస్లోనే ఉండటం వల్ల అక్కడ వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని తల్లడిల్లిపోయేవాళ్లం. ఇద్దరికి టెన్షన్గానే ఉండేది. మాది ప్రేమ వివాహం.. నేను మొదటి సినిమా కన్నడలో చేశా. 17 ఏళ్ల వయసులోప్రేమ–ఇష్క్–కాదల్ సినిమాలో హీరోయిన్గా నటించాను. 2014లో వరుణ్ హీరోగా వచ్చిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో హీరోయిన్గా నటించి ఆయనతో ప్రేమలో పడ్డాను. 2016 ఆగస్టు 19న మా ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. 250 డ్రెస్లు మార్చా.. బిగ్బాస్– 3లో నన్ను అందంగా చూపించడానికి, టాస్క్లలో నా ఆటకు తగిన డ్రెస్లు రూపకల్పన చేయడానికి ముగ్గురు డిజైనర్లు పని చేశారు. రోజుకు మూడు డ్రెస్లు మార్చేదాన్ని. మొత్తం 250 డ్రెస్లు మార్చాను. ముఖ్యంగా నాకు చీరలంటే బాగా ఇష్టం. మా బంధం.. దృఢమైంది హౌస్లో వరుణ్కు నాకు మధ్యన భార్యాభర్తల అనుబంధం మరింతగా పెరిగింది. ఆయన ఓపెన్ మైండెడ్గా ఉండేవారు. నిజాయతీ కనిపించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని దాటగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇద్దరం బాగా అర్థం చేసుకున్నాం. -
బిగ్బాస్: వరుణ్ను విజేతగా ప్రకటించిన సుమ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ సుమ అనుకున్నంత సందడీ చేశారు. బాగ్బాస్-3 లో గెస్ట్( ఆడియన్)గా ఎంటరైన సుమ నవ్వుల పువ్వుల దీపావళి తీసుకొచ్చారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్బాస్-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు. బిగ్బాస్ సీజన్లోనే ఇంత బాగా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బిగ్బాస్-3 సీజన్ను క్లుప్తంగా రివ్యూ చేసిన బిగ్బాస్ ఆ తరువాత హౌస్లోకి సుమను ప్రవేశపెట్టాడు. ఇహ అక్కడినుంచి మొదలైంది రచ్చ..రచ్చ రంబోలా.. రంగ్దే.. రంగ్దే...పాటతో ముసుగు వేసుకుని డాన్స్తో సుమ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే..కంటెస్టెంట్స్ అందరూ తమన్నా..తమన్నా అంటూ హల్ చల్ చేశారు. చివరికి ముసుగుతీసి తనెవరో రివీల్ చేశారు. ఆరంభం నుంచే సుమ తనదైన పవర్ పంచ్లతో మొదలెట్టేశారు. రాగానే మంచి నీళ్లు తాగుతారా అని అడిగిన శ్రీముఖితో.. వచ్చినవాళ్లందరి చేత నీళ్లు తాగించేస్తున్నావుగా అంటూ పంచ్ వేశారు. ఆ తరువాత ఇల్లంతా కలియతిరిగి... ఒక్కొక్కరి బెడ్ను, మేకప్ సామాన్లు పరిశీలించారు. ముఖ్యంగా రాహుల్ బెడ్ పక్కన ఏముందంటూ అల్లరి చేశారు. ఆ తరువాత లివింగ్ రూం, వంటగది, వాష్రూంలను పరిశీలించారు. బిగ్బాస్ -3 హౌస్లో ఏమేమి మిస్ అవుతున్నదీ అందరూ షేర్ చేసుకున్నారు. తరువాత హౌజ్లోకి వచ్చిన సుమ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసిపెట్టి, ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరిన బిగ్బాస్.. దానికి సంబంధించిన సరుకు సరంజామా పంపించారు. మధ్నాహ్నం 2 గంటలకు శ్రీముఖి, బాబా భాస్కర్ కుకింగ్ పనిలో వుండగా.. రాహుల్తో సరదాగా పాట పాడించారు సుమ. ‘అదరా...నా గుండెలదరా..బొమ్మోలె ఉందిరా పోరీ..పాట పాడారు. అలాగే ‘ఏమైనదీ..ఏమో నాలో..కొత్తగా ఉంది నాలో’ అంటూ వరుణ్ కూడా చాలా హృద్యంగా.. ఫీల్తో ఆలపించాడు. తర్వాత సుమ తన సహజమైన గేమింగ్ షోను స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ప్రకారం పార్టిసిపెంట్స్ అందరూ హెడ్ఫోన్స్ పెట్టుకొంటారు. వాళ్ల చెవిలో.. బిగ్బాస్ మ్యూజిక్ ప్లే చేస్తుండగానే.. సుమ చెప్పే వాక్యాన్ని, సామెతను.. డైలాగ్ను లిప్ మూమెంట్ ద్వారా గుర్తించి.. ఆమె చెప్పిందో ఏంటో చెప్పాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం శ్రీముఖికే దక్కింది. మొత్తం మూడు ప్రశ్నల్ని శ్రీముఖి అలవోకగా సమాధానం చెప్పేసింది. తనదైన శైలిలో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పడంతో.. చెవుల్లోం,చి రక్తాలు కారుతున్నాయంటూ సుమ జోక్ చేశారు. 1. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి.. సింహాల మీద కాదు.. 2 చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు 3. బిగ్ బాస్గారూ మీ ఒకసారి మా యింటికి రావాలి.. ఈ డైలాగులను శ్రీముఖి అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. ఇక, మీ ఆవిడంటే మీకు చాలా భయమా. ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడో తెలుసా.. ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా..డైలాగులు సుమ చెప్పగా.. వీటిని చెప్పడానికి బాబా పడినపాట్లు మామూలువి కావు. తరువాత వంతు వరుణ్ది. బుజ్జిగాడు.. బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు.. అన్న డైలాగుకు.. పుచ్చకాయ..పచ్చగా అంటూ వరుణ్ నానా తిప్పలు పడి..ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. రెండుసార్లు ఇదే డైలాగును చెప్పగా.. చచ్చీ చెడి సాధించాడు. చివరికి జీవితంమంటే పోరాటం.. పోరాటంలోనే ఉంది జయం... డైలాగును కరెక్ట్గా చెప్పి సక్సెస్ అయ్యాడు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా.. గుర్తు పెట్టుకో..నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ..నీకు బీపీ వస్తే..నీ పీఏ వణుకుతాడు..వంటి డైలాగులు అలీ రెజాకు ఇవ్వగా.. వాటిని చెప్పడం అలా కి సాధ్యంకాలేదు. ఈ సందర్భంగా కూడా నవ్వుల మతాబులు విరజిమ్మాయి. ‘పునర్నవి వెళ్లిపోయిన తరవాత బాధగా వుందా’ ఈ డైలాగును రాహుల్ అలవోకగానే చెప్పాడు. విష్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబొట్లు చెప్పడానికి మాత్రం కష్టపడ్డాడు. నా చావు నే చస్తా.. నీకెందుకు అన్న డైలాగును చెప్పలేక తికమక పడ్డాడు. అయితే నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా డైలాగును సరిగ్గా చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విచిత్రం ఏమంటే.. ఈ గేమ్లో బాగా, తొందరగా ఆన్సర్ చేసిన వారికి కాకుండా.. ప్రేక్షకులను ఎక్కువ ఎంటర్టైన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది వరుణ్. ఈ గేమ్షోలో సుమ హావభావాలు, పంచ్లతో బాగా ఆకట్టుకున్నారు. భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించారు. కానీ అంతలోనే బిగ్బాస్ కుక్కలు మొరిగిన వార్నింగ్ రావడంతో అది కుదరలేదు. మొత్తంమీద అందరూ ఊహించినట్టుగానే...ఎదురు చూసినట్టుగానే.. సుమ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నారు. -
వరుణ్, శివజ్యోతిల ఫైట్ మళ్లీ మొదలైంది..
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో నామినేషన్లోకి వచ్చిన ఇంటిసభ్యులతో బిగ్బాస్ ఫీట్లు చేయిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో వారితో సర్కస్ ఫీట్లు చేయించగా.. నేడు హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టనున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగేట్టు తెలుస్తోంది. టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు.. నచ్చని హౌస్మేట్పై రంగు పోసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. బిగ్బాస్ ఇచ్చిన ఈ టాస్క్తో ఇంట్లో పాత గొడవలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. వారం ప్రారంభంలో జరిగిన నామినేషన్ టాస్క్లోని జరిగిన లొల్లిని శివజ్యోతి ప్రస్తావించడంతో వరుణ్ ఒంటికాలిపై లేచాడు. తన సహనాన్ని కోల్పోయి శివజ్యోతిపై విరుచుకుపడ్డాడు. ‘మానిప్యులేటివ్గా మాట్లాడకు..’ అంటూ శివజ్యోతిపై మండిపడ్డాడు. గొడవను సర్ది చెప్పాలని చూసిన రాహుల్పైనా తిరుగుదాడి చేశాడు. దీంతో వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. కాగా వరుణ్.. బాబాపై, శివజ్యోతి.. వరుణ్పై, బాబా.. అలీపై, శ్రీముఖి.. శివజ్యోతిపై రంగు పోసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమో ఆసక్తి రేకెత్తించినప్పటికీ ఎపిసోడ్ మాత్రం సాదాసీదాగానే ఉంటుందని ప్రోమో లవర్స్ విమర్శిస్తున్నారు. Color esko leda Cover chesko!!! #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4EC1CfrIAj — STAR MAA (@StarMaa) October 24, 2019 Who do you think is the clean person in the house??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/rDG0QsRNDS — STAR MAA (@StarMaa) October 24, 2019 -
బిగ్బాస్: ఫైనల్కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?
భీమవరం అమ్మాయి వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్లో టాస్క్లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ షో ఫైనల్కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు. దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఫైనల్ బెర్తు కోసం వరుణ్, రాహుల్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్లో భాగంగా వరుణ్.. రాహుల్తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్గా టికెట్ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? టాస్క్ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే! "Ticket To Finale" evaru geluchukuntaru??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/srVrxbrxGn — STAR MAA (@StarMaa) October 21, 2019 -
బిగ్బాస్: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్
బిగ్బాస్ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్బాస్ విడగొట్టాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్లు ఆడించాడు. మీకు సూటబుల్ అనిపించే పాటలను డెడికేట్ చేసుకోమని నాగ్ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్ సాంగ్తో, శ్రీముఖి.. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్.. జులాయి టైటిల్ సాంగ్, వరుణ్.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్గా శివజ్యోతి డాన్స్ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. తర్వాత హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్, అలీ రెజాలకు బాక్సింగ్ గ్లౌజ్లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్ చేస్తుండగా మిగతా హౌస్మేట్స్ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్ ఆసక్తికర టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్బాస్ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్బాంబ్ను రాహుల్పై వేసింది. -
బిగ్బాస్: వితికా ఎలిమినేట్.. ఇది ఫిక్స్!
బిగ్బాస్ తెలుగు సీజన్ -3 తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్ పోరు వైపు దుసుకెళ్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియకు భిన్నంగా ఈ వారం జరిగింది. పదమూడో వారానికి గాను జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. హౌస్లో ఉన్న ఏడుగురు నామినేట్ అవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు బిగ్బాస్ హౌస్లో ఏం జరగబోతోందో ముందే చెబుతున్న లీకువీరులు తాజాగా ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతున్నారో ముందే చేప్పేశారు. పదమూడో వారానికి గాను వితికా షేరు ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వితికా బిగ్బాస్ హౌస్ను వీడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భార్యభర్తలుగా హౌజ్లోకి అడుగుపెట్టిన వితికా-వరుణ్లు విడిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా లేని వరుణ్ గేమ్ ఇంకా బాగా ఆడతాడా లేక చతికిలపడతడా అనేదానిపై తెగ చర్చ జరుగుతోంది. ఆమె ఎలిమినేట్ కావడానికి గల అనేక కారణాలను కూడా నెటిజన్లు పేర్కొంటున్నారు. మెడాలియన్ టాస్క్ గెలవడానికి బాబా భాస్కర్తో ప్రవర్తించిన తీరు.. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శివజ్యోతితో వరుణ్-వితికల వాగ్వాదం ఆమె ఎలిమినేషన్కు కారణాలుగా పేర్కొంటున్నారు. పునర్నవి భూపాలం ఎలిమినేషన్ తర్వాత రాహుల్ కూడా వరుణ్-వితికాలతో అంత సఖ్యంగా ఉండటం లేదు. దీంతో వితికాకు ఓటింగ్ శాతం తగ్గింది. అంతేకాకుండా ఉన్న ఏడుగురు ఇంటిసభ్యుల్లో వీక్ కంటెస్టెంట్ వితికా కావడంతోనే ఆమెకు ఓట్లు తక్కువ వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుణ్, రాహుల్, పునర్నవిల సహాయంతోనే ఇన్ని రోజులు నామినేషన్ కాకుండా సేఫ్ అయిందని లేకుంటే వితికా ఎప్పుడో హౌస్ను వీడేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక వితికా ఎలిమినేషన్ విషయం అధికారికంగా తెలియాలంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ వరుకు వేచిచూడాల్సిందే. -
బిగ్బాస్: వితిక దెబ్బకు వరుణ్ అబ్బా!
బిగ్బాస్ తెలుగు 3 సీజన్ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. బిగ్బాస్ ఇంట్లో టైటిల్ వేటకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ను ఇంట్లోకి పంపించి బిగ్బాస్ ఇంటి సభ్యులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఎనభై ఏడు రోజులపాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఇంటి సభ్యులు వారిని చూడగానే ఎమోషనల్ అయ్యారు. వచ్చిన అతిథులు సైతం ఎవరి తరహాలో వారు టైటిల్ పోరుకు హౌజ్మేట్స్ను సన్నద్ధం చేసి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్లో బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హౌజ్మేట్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కో గెటప్లో దర్శనమిస్తున్నారు. శ్రీముఖి ధరించిన గెటప్ తనకు పర్ఫెక్ట్గా సూట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా తన హావభావాలు చూస్తుంటే ఇది మహానటి సావిత్రి పాత్ర అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక శివజ్యోతి చంద్రముఖి క్యారెక్టర్లో విరుచుకుపడి నటించినట్లు తెలుస్తోంది. వరుణ్, వితికలు బాహుబలి చిత్రంలోని ప్రభాస్, అనుష్క గెటప్ వేశారు. కత్తి తిప్పుతూ రాణిలా హావభావాలు పలికిస్తోంది వితిక. బాహుబలి ఫేమస్ సీన్ ఒకటి కాపీ చేయాలని చూడగా బొక్కబోర్లా పడ్డారు. వరుణ్ వీపు మీద నుంచి వితిక నడుచుకుంటూ వెళ్లాలని చూసింది. కానీ వరుణ్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో అందరూ పడీపడీ నవ్వారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్తో ఆడుకుంటున్నారు. వరుణ్.. మళ్లీ ఫ్రూట్ అయ్యాడంటున్నారు. మీరు కూడా కింది మీమ్స్ చూసి సరదాగా నవ్వుకోండి. Cinemallo manaki nachina characters lo housemates 🎞️📽️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4ZUWgF9BYv — STAR MAA (@StarMaa) October 18, 2019 -
‘బిగ్బాస్ గారు.. మా ఇంటికి రండి’
బిగ్బాస్ పదమూడోవారం ఎమోషనల్ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్మేట్స్ మిగిలారు. వీరు టీవీ, ఫోన్లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85 రోజులు కావస్తోంది. ఉన్నదల్లా హౌస్లో ఉన్నవారితోనే ఆటలు, పాటలు, అల్లరి పనులు, గొడవలు, వగైరా! ఏ ఎమోషన్ అయినా బిగ్బాస్ హౌస్లో ఉన్నవారితోనే పంచుకోవాలి, వారితోనే తెంచుకోవాలి. ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఇంటి సభ్యులకు బిగ్బాస్ స్వాంతన కలిగించారు. వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. దీంతో కొద్ది నిమిషాలైనా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్మేట్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇప్పటికే వితిక, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చి పలకరించి వెళ్లిపోయారు. మా వాళ్లెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న రాహుల్, శ్రీముఖి, వరుణ్ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. తాజా ప్రోమో ప్రకారం కన్ఫెషన్ రూమ్లో నుంచి రాహుల్ తల్లి అతన్ని పిలుస్తోంది. గతంలో అమ్మ గుర్తుకు వచ్చిందని ఏడ్చిన రాహుల్.. ఇప్పుడు అమ్మ కళ్లెదుటే ఉండటంతో సంతోషిస్తాడో, కన్నీటిపర్యంతం అవుతాడో చూడాలి. అలాగే వరుణ్ బామ్మ కూడా ఇంట్లోకి అడుగుపెట్టి సందడి చేసినట్టు కనిపిస్తోంది. అందరూ బామ్మ చుట్టూ చేరగా.. ఆమె బోలెడు కబుర్లను ఇంటి సభ్యులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్బాస్.. మా ఇంటికి రావాలి’ అని ఇన్వైట్ చేయడంతో ఇంటి సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఈ సరదా కబుర్లు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! #Rahul & #Varun family visit to #BiggBossHotel#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/YwIButaZCU — STAR MAA (@StarMaa) October 17, 2019 -
బిగ్బాస్: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!
బిగ్బాస్ ఇంట్లో నామినేషన్ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి అని నోరు పారేసుకున్నాడు. టివిలొ మా ఆయన చూస్తే ఫీల్ కాడా? తనకొక్కడికే పెళ్లాం ఉందా?’ అంటూ శివజ్యోతి ఏడ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ వరుణ్, రాహుల్ స్నేహానికి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. పునర్నవి వెళ్లినప్పటి నుంచి రాహుల్ కాస్త దూరంగా ఉంటున్నాడని, తనలో మార్పు గమనిస్తున్నానని వరుణ్ అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారి పనితనంతో హోటల్కు సెవన్ స్టార్ సంపాదించి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హోటల్ మేనేజర్ వరుణ్.. వంట మాస్టర్లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక, హౌస్ కీపింగ్ స్టాఫ్గా అలీ, శివజ్యోతి, రాహుల్ పనిచేశారు. వీరందిరి చేత బిగ్బాస్ కొన్ని డ్రిల్స్ చేయించాడు. మార్చ్.. ఆగకుండా శుభ్రం చేయడం.. ఫ్రీజ్ అవటం.. ఉన్నచోటే నిద్రపోవడం.. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్బాస్.. తర్వాత ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ముందుగా వితిక చెల్లెలిని ఇంట్లోకి పంపించగా.. ఆమె బావగారూ అంటూ పరుగెత్తుకెళ్లి వరుణ్ను హత్తుకుంది. చెల్లెలు రితికను చూడగానే వితిక బోరున ఏడ్చింది. వితికను ఊరడిస్తూ.. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోసింది. టాస్క్లో మరింత పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అంటూ వరుణ్కు సలహా ఇచ్చింది. చివరగా వెళ్లిపోతూ హోటల్కు ఒక స్టార్ను ఇచ్చింది. తర్వాత అలీ రెజా భార్య మాసుమా ఇంట్లోకి అడుగు పెట్టింది. వచ్చీరాగానే అలీని హత్తుకుని విలపించింది. ఇక మావాళ్లు ఎప్పుడొస్తారో అంటూ మిగతా హౌస్మేట్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్బాస్ : శివజ్యోతి ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!
బిగ్బాస్ తెలుగు 3 సీజన్ చివరి అంకానికి చేరింది. సీజన్ ముగింపునకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ బిగ్బాస్ గేమ్ కఠినతరం చేసేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఇంటి సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే గేమ్ను సీరియస్గా తీసుకుంటూ ట్రాక్లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. బిగ్బాస్ పదమూడో వారం నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో కుంపటి పెట్టాడు. ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ టాస్క్పెట్టి.. మీలో మీరే ఎవరు తోపు అనేది తేల్చుకోండి అంటూ బిగ్బాస్ ఆదేశించాడు. మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు సేవ్ అవుతారని, మిగతా నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్లు నామినేషన్కు వెళ్తారని చెప్పారు. ఇక ఈ టాస్క్లో రాహుల్, శ్రీముఖి ఒకరి మీద ఒకరు వీర లెవల్లో వాదులాటకు దిగారు. కానీ చివరికి బాబా తన మొదటి స్థానాన్ని శ్రీముఖికి ఇవ్వడంతో ఈ గొడవ సమసిపోయింది. ఇక శివజ్యోతి.. తన లక్కీ నంబర్ మూడంటూ ఆ స్థానం తనకు కావాల్సిందేనని పట్టుబట్టింది. వరుణ్.. తన మూడో స్థానాన్ని శివజ్యోతికి ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. అయితే వితిక వచ్చి అడగ్గానే తను పక్కకు తప్పుకుని మూడో స్థానాన్ని ఆమెకు అప్పగించాడు. ఇది మింగుడుపడని శివజ్యోతి వారిద్దరితో వాదనకు దిగింది. కంటెస్టెంట్లుగా ఎవరికి వారు సొంతంగా గేమ్ ఆడండి అని శివజ్యోతి.. వరుణ్, వితికలకు చురకలు అంటించింది. మూడో స్థానం నుంచి కదిలేది లేదని వితిక పక్కనే నుంచుని పేచీకి దిగింది. సహనం కోల్పోయిన వరుణ్.. శివజ్యోతిపై ఫైర్ అయ్యాడు. కంత్రి ఆటలు ఆడకు అంటూ ఆమెను వెక్కిరించాడు. దీంతో వెటకారాలు, వెక్కిరింతలు చేయొద్దని శివజ్యోతి వరుణ్కు స్పష్టం చేసింది. చాలా సేపటివరకు ఇదే గొడవ కొనసాగింది. చివరకు బజర్ మోగడంతో టాస్క్ సమయం అయిపోయింది. ఎవరెవరూ ఏయే.. స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకోడంలో గందరగోళం, సందిగ్దత ఏర్పడినందున.. ఈ వారం అందరూ నామినేషన్కు వెళ్తున్నారని బిగ్బాస్ ప్రకటించాడు. ఇక వరుణ్, వితిక, శివజ్యోతి మాటల యుద్ధంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వితికను నామినేట్ చేయడానికే శివజ్యోతి ఈ కుట్ర పన్నిందని నెటిజన్లు అంటున్నారు. వరుణ్ ప్రవర్తనను కూడా ఓ వర్గం ఎండగడుతోంది. మొత్తంమీద ఈ ముగ్గురూ చేసిన తప్పుకు ఇంటి సభ్యులంతా నామినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ గొడవ వల్ల నష్టపోయేది మాత్రం వితికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారం బిగ్బాస్ హౌస్ను వీడేది వితికే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతవరకు నామినేషన్లోకి ఎక్కువగా రాని వితిక, శివజ్యోతిలను ఈసారి ఇంటికి పంపిస్తామనే ఆలోచనలో జనం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో చూడాలి..! -
ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్ విట్టా ఎలిమినేట్ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ ఇంట్లో బీభత్సాన్ని సృష్టించింది. టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు.. వారు తీసుకున్న చిట్టీలో ఉన్న నెంబర్ల స్థానంలో నిలబడాలని బిగ్బాస్ ఆదేశించాడు. అయితే వారు చర్చలు జరుపుకుని తమతమ స్థానాలను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బజర్ మోగిన తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. మొదటగా.. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, శ్రీముఖిలు వరుసగా 1 నుంచి ఏడు స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం ఎందుకు టాప్ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో చెపుతూ ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మొదట శ్రీముఖి.. రాహుల్పై ఫైర్ అయింది. ‘నువ్వు బాగా ఆడిన టాస్క్ ఒక్కటి చెప్పు’ అంటూ రాహుల్ను ప్రశ్నించింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్ ఆడినవ్’ అంటూ రాహుల్.. శ్రీముఖికి ఎదురు తిరిగాడు. దీంతో చర్చ కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీముఖి.. రాహుల్తో పెట్టుకుంటే అయ్యే పని కాదని వదిలేసి బాబాను కాకాపట్టడానికి వెళ్లింది. అయితే అప్పటికే శ్రీముఖికి తన స్థానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్న బాబా తన మొదటి స్థానాన్ని ఆమెకు కట్టబెట్టి వెళ్లి ఆఖరి స్థానంలో నిలుచున్నాడు. రాహుల్.. తనకన్నా అలీ బెస్ట్గా పర్ఫార్మ్ చేస్తాడని ఒప్పుకుంటూ అతనికి రెండో స్థానాన్ని ధారధత్తం చేశాడు. ఇక వరుణ్.. అతని మూడో స్థానాన్ని వితికకు ఇవ్వడంపై శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేసింది. కంటెస్టెంట్లుగా గేమ్ ఆడండి.. భార్యాభర్తలుగా కాదంటూ.. శివజ్యోతి ఆవేశంతో విరుచుకుపడింది. ఏదైతే అది అవుతుందంటూ వితిక సాధించుకున్న 3వ స్థానంలోకి వెళ్లి నిలబడింది. ఇక వరుణ్ కూడా కంట్రోల్ తప్పి శివజ్యోతిపై మాటల దాడి చేశాడు. ‘కంత్రీ ఆటలు ఆడకు.. నువ్వు కూడా నీ భర్త గంగూలీని తెచ్చుకోవాల్సింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇంటి సభ్యుల చర్చ ఎంతకూ తెగేలా లేదని భావించిన బిగ్బాస్ అందరినీ నామినేట్ చేశారు. కాగా ఈ సీజన్లో ఇంటి సభ్యులు అందరూ నామినేషన్లో ఉండటం ఇదే మొదటిసారి. మరి నామినేషన్ హీట్ ఇంట్లో అలాగే కొనసాగుతుందా.. నేటి ఎపిసోడ్లో చల్లారిపోతుందా అనేది చూడాలి! -
‘మొగుడే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు’
బిగ్బాస్ ఇంటిసభ్యులకు హంట్ అండ్ హిట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్కు అలీ రెజా, రాహుల్ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్బాస్ గేమ్ వదలదు అంటూ మాట్లాడిన అలీ, డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటే శ్రీముఖిని లగేజ్ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్కు ఆల్ ద బెస్ట్ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది. రాహుల్కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్బాస్ రాహుల్కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్తో వాగ్వాదానికి దిగిన రాహుల్. మహేశ్ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది. ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడంటూ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్గా మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు. ఇక స్టార్ ఆఫ్ దహౌస్గా నిలిచిన వరుణ్, శివజ్యోతికి స్పెషల్ డిన్నర్ రావటంతో ఇంటిసభ్యులు గుటకలు వేసినా ఏం లాభం లేదని తెలుసుకుని మిన్నకుండిపోయారు. ఇక మహేశ్ వీడియో చూసిన తర్వాత బాగా హర్ట్ అయినట్టు కనిపించాడు. ఇక నుంచి తాను ఎవరితో మాట్లాడను అంటూ శ్రీముఖి, మాస్టర్పై అలిగాడు. నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అయినా నాపై జోకులు వేస్తున్నారు. శ్రీముఖి అవసరం కొద్దీ మెదులుతుంది. నామినేషన్కు వెళ్లకుండా ఉండటానికి అందరితో క్లోజ్గా ఉంటుంది అని అతని అభిప్రాయాన్ని శివజ్యోతితో పంచుకున్నాడు. అలీరెజా గుట్టు బయటపడిందని, మహేశ్ చిత్రగుప్తులవాడు అని వరుణ్, వితిక అభిప్రాయపడ్డారు. బిగ్బాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిసభ్యులు రచ్చరచ్చ చేశారు. వింత వింత వేషధారణలతో డాన్స్ చేశారు. బిగ్బాస్ బర్త్డే ఇంటిసభ్యుల చావుకొచ్చింది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బర్త్డే సందర్భంగా బిగ్బాస్ కేకుల మీద కేకులు పంపించాడు. మొదటి కేక్ను ఆవురావురుమంటూ తిన్నారు కానీ నాలుగో కేక్కు వచ్చేసరికి అపసోపాలు పడుకుంటూ తినేశారు. ఇక బిగ్బాస్ ఇంట్లో 80 రోజులు గడిచిపోయాయి. రానురాను టాస్క్లు మరింత కఠినతరం కానున్నాయి. ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కడదాకా పోరాడుతారో చూడాలి! -
స్టార్ ఆఫ్ ద బిగ్బాస్ హౌస్ ఆ ఇద్దరే!
బిగ్బాస్ ఇంట్లోకి మన్మథుడు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! ఇక నాగ్ ఇంటిసభ్యులందరితో సరదాగా ఆటలు ఆడించాడు. ఇందులో భాగంగా అలీరెజా గంతలు కట్టుకుని మహేశ్ను సుందరాంగుడిగా ముస్తాబు చేశాడు. వరుణ్ కళ్లు మూసుకోగా, కళ్లకు గంతలు కట్టుకున్న శ్రీముఖి అతనికి వెనకనుంచి కేక్, అరటిపండు, బ్రెడ్ తినిపించి నీళ్లు తాగిపించింది. ఇక బాబా భాస్కర్ పిండిగిన్నెలో కేవలం నోటి సహాయంతో 5 కాయిన్స్ తీశాడు. శివజ్యోతి అయిదు రకాల పచ్చి కూరగాయలను తింది. రాహుల్ ఓ పాటను కిలికి భాషలో మార్చి పాడాడు. మహేశ్కు బెల్లీ డాన్స్ వేయాలని చిట్టీ రాగా మేం చూడలేం బాబోయ్ అంటూ శ్రీముఖికి పాస్ చేశారు. ఇక శ్రీముఖి బెల్లీ డాన్స్తో అదరగొట్టింది. మహేశ్ శివజ్యోతికి కేక్ రుద్దాడు. వితిక బెలూన్లోని హీలియంను పీల్చి నోటిలో పెట్టుకుని సుర్రు సుమ్మైపోద్ది అని డైలాగ్ చెప్పింది. రాహుల్ కూడా హీలియం పీల్చుకుని ఏమైపోయావే పాట పాడాడు. దీంతో ఇంటిసభ్యులు పడీపడీ నవ్వారు. శివజ్యోతి, బాబా భాస్కర్, శ్రీముఖి, మహేశ్, వరుణ్లు కూడా హీలియం పీల్చుకుని పాట పాడారు. బిగ్బాస్ ఇంటిసభ్యులకు స్టార్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం ఇంటిసభ్యులందరూ ఒక్కొక్కరిగా వారికి ఆల్రౌండర్ అనిపించిన వ్యక్తికి స్టార్ ఇస్తూ అందుకు కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అలీ రెజా, మహేశ్- శివజ్యోతి, శివజ్యోతి- అలీ రెజా, బాబా భాస్కర్- శ్రీముఖి, శ్రీముఖి- బాబా భాస్కర్, రాహుల్, వితిక- వరుణ్, వరుణ్- వితికలకు స్టార్లు ఇచ్చారు. రెండు స్టార్లు దక్కించుకున్న శివజ్యోతి, వరుణ్లు ఇద్దరూ స్టార్ ఆఫ్ ద హౌస్గా నిలిచారు. వీరికి ఈ వారం అంతా స్పెషల్ డిన్నర్ ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. ఇక ఇంటిసభ్యులు వారి జీవితంలో సాధించిన విజయాలను నాగ్తో పంచుకున్నారు. ‘కుదిరితే సినిమాలు చూసేవాన్ని. కరెంటు పోతే కథలు రాసేవాన్ని’ అని చెప్పిన మహేశ్కు నాగ్ ఆఫర్ ఇచ్చాడు. బయటికి వచ్చాక మంచి స్టోరీ పంపించు అని చెప్పాడు. జీవితంలో సాధించిన విజయాలు టీవీలో కనిపించాలన్న తల్లి కోరిక తన ద్వారా నెరవేరిందని.. తనకు రాములమ్మగానే మంచి గుర్తింపు వచ్చింది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చింది శ్రీముఖి. డాన్స్ కంపోజ్ చేసిన మొదటి పాటకే ఫిల్మ్ఫేర్ అవార్డు రావటం.. అది తన తండ్రి తీసుకోవడం గర్వంగా అనిపించిందని భాబా భాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంటిని కాదనుకుని వచ్చి నా భర్తతో కలిసి సొంత కాళ్లపై బతకడం తన విజయమని శివజ్యోతి తెలిపింది. ‘నా భార్యే నా సక్సెస్’ అని అలీ రెజా అన్నాడు. జనాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటమే సక్సెస్ అని రాహుల్, మహేశ్లు అన్నారు. ఇక మీకందరికీ బిగ్బాస్ షో పెద్ద విజయంమని నాగార్జున చెప్పాడు. ఇక్కడి వరకు రావడం విజయంగా ఫీల్ అవుతున్నా వితిక, వరుణ్లు పేర్కొన్నారు. ఇక ఇంటిసభ్యులందరికీ నాగ్ నూతన వస్త్రాలను గిఫ్ట్ ఇచ్చాడు. చివరగా అందరితో కలిసి ఓ స్టెప్పేసి వారి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. గుర్తుకొస్తున్నాయి.. ఇక రాహుల్ పునర్నవిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాడు. పున్ను ఇంట్లో ఉండటం కన్నా వెళ్లడం మంచిదైందని వితిక అభిప్రాయపడింది. మహేశ్.. శివజ్యోతికి స్టార్ పెట్టడంతో బాబా ఫ్రస్టేట్ అవుతున్నాడని శివజ్యోతి అభిప్రాయపడింది. బిగ్బాస్ ఇంట్లో దసరా సంబరాలు పూర్తయ్యాయి. మరి బిగ్బాస్ ఇంటిసభ్యులకు ఎలాంటి కఠినతర టాస్క్లు ఇవ్వనున్నారో చూడాలి! -
బిగ్బాస్: వరుణ్ను ఆడుకుంటున్న నాగ్!
బిగ్బాస్ ఇల్లు రెట్టింపు సంతోషాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. దీనికి స్పెషల్ అట్రాక్షన్.. కింగ్ నాగార్జున అని చెప్పడంలో సందేహం లేదు. పంచెకట్టుతో సోగ్గాడి గెటప్లో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఇంటిసభ్యులను షాక్కు గురిచేశాడు. నాగార్జున రాకతో హౌస్మేట్స్ అరుపులు, కేకలతో బిగ్బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. ఇక ఇంటిసభ్యులందరూ వారి గొడవలను, అలకలను పక్కనపడేసి సోగ్గాడితో కలిసి దసరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక నాగార్జున రాకతో బిగ్బాస్ ఇంటికే కొత్త అందం వచ్చినట్టయింది. ఇంటిసభ్యులందరినీ తన మాటల గారడీతో ఆకట్టుకుంటూనే తనదైన పంచ్లు విసురుతున్నాడు. కాగా స్వీట్లు, పండ్లు ఉన్న ట్రే పట్టుకున్న వరుణ్ను అది అరటిపండు కాదు.. ఫ్రూట్ అంటూ ఆటపట్టించాడు. ఇక ఇంటిసభ్యులు బిగ్బాస్ ఇచ్చే టాస్క్లే కాకుండా నాగ్ ఇచ్చిన ఫన్నీ గేమ్స్ను కూడా రఫ్ఫాడిస్తున్నట్టు కనిపిస్తోంది. చివరగా నాగ్కూడా వారితో కలిసి ఓ స్టెప్పేసినట్టు తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో ఇంటిసభ్యులకు స్వీట్లు తినిపించిన నాగ్ నేటి ఎపిసోడ్లో కానుకలు ఇవ్వడమే కాక వారితో ఆటలాడిస్తూ మరింత హుషారెత్తిస్తున్నాడు. అటు వారికి ఆనందం.. ఇటు చూసేవారికి వినోదం.. వెరసి నేటి ఎపిసోడ్ డబుల్ ఎంటర్టైన్మెంట్ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #DussehraSpecial lo evala Soggadu @iamnagarjuna tho dancinglu, gaminglu, giftinglu..inka chala unnayi..Don't Miss!!!#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/GLPg3uyJb6 — STAR MAA (@StarMaa) October 9, 2019 -
బిగ్బాస్ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!
బిగ్బాస్ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ఈసారి వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది. ఇందులో బాగానే రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్ నుంచి తప్పించుకోగా టాస్క్లో వెనుకబడిన రాహుల్, మహేశ్, పునర్నవి, వరుణ్ ఒక్కొక్కరుగా డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇక ఇంటిసభ్యులు గత రెండురోజులుగా సాదాసీదాగా గడిపారు. కడుపునిండా తిండి కూడా లేకుండా, కప్పుకోడానికి సరైన వస్త్రాలు లేక నానా కష్టాలు పడ్డారు. ఇక బిగ్బాస్ ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్ ఇవ్వగా దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. జనాలు నీటికోసం బిందెలతో ఎలా పోట్లాడుకుంటారో.. అంతకు మించి ఇక్కడ నీటికోసం కొట్లాడుకున్నారు. సరదాగా సాగుతున్నట్టు అనిపించినప్పటికీ నేటి టాస్క్లోనూ చిన్నపాటి గొడవ జరిగేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్, వితికల మధ్య తోపులాట జరగగా వితిక ఫైర్ అయిన విషయం తెలిసందే! అయితే ఇక్కడ బాబా రియాక్ట్ అవడానికి ముందు వరుణ్ సీరియస్ అయ్యాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకోగా మళ్లీ వరుణ్ వితికను బుజ్జగించాడు. కాగా నేటి ఎపిసోడ్లో వరుణ్, బాబా భాస్కర్కు గొడవ జరిగేలా ఉంది. ఇంట్లో ఉండాలని లేదు అంటూనే బాబా భాస్కర్ నామినేషన్ నుంచి తప్పించుకోడానికి బాగానే కష్టపడ్డాడు. ఇక బాబా మాస్క్ తీసేశాడని అటు నాగార్జునతోపాటు ఇటు ఇంటిసభ్యులు ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి వస్తున్నారు. Medal evari sontham avtundi?#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zZXcelxVX8 — STAR MAA (@StarMaa) October 2, 2019 -
బిగ్బాస్: టాస్క్ అన్నాక మీద పడతారు..!
బిగ్బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు టాస్క్లో మహేశ్.. రాహుల్పై మండిపడ్డ విషయం తెలిసిందే! అయితే అదంతా ఆటలో భాగమే అని మిగతావారు నచ్చజెప్పడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకులే అని భావించిన మహేశ్ తిరిగి ఆట ప్రారంభించాడు. ఇక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవేశంలో పునర్నవికి ఇచ్చిన 200 విలువ చేసే రాయి ఇవ్వనని మొండికేసింది. అయితే వెంటనే తేరుకున్న మహేశ్ మళ్లీ ఆటలో కాస్త పుంజుకున్నాడు. ఇక బిగ్బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. టాస్క్లో సేకరించే రాళ్లతో వంట సామాగ్రిని కొనుక్కొని భోజనం సిద్ధం చేసుకోవాలి. ఇక వంటసామాగ్రి ఖరీదు చూసి ఇంటిసభ్యులు గుడ్లు తేలేశారు. రూపాయి అగ్గిపెట్టె కూడా రూ.500 ఉంది. దీంతో ఇంటిసభ్యులు తిండి కోసం నానా తంటాలు పడ్డారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో మహేశ్, రాహుల్కు గొడవ జరగగా నేడు వరుణ్, వితికలకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపిస్తోంది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది. దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్.. అలానే జరుగుతుంది, టాస్క్లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్.. వితికపై ఫైర్ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు. వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్.. ఎందుకు తనపై అంతలా సీరియస్ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. కాగా ఇప్పటికే రాహుల్ నామినేట్ అవగా, నేటి ఎపిసోడ్లో ఎవరు నామినేషన్ జోన్లోకి రానున్నారో చూడాలి! Physical task lo hurt avatam common ye kada#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/hJX1j2jucy — STAR MAA (@StarMaa) October 1, 2019 -
బిగ్బాస్.. డోస్ పెంచిన నాగ్
బిగ్బాస్ హౌస్లో పదోవారం గడిచేందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన గొడవలపై ఇంటి సభ్యులను నాగార్జున కాస్త గట్టిగానే మందలించాడు. రాహుల్-వరుణ్ మధ్య జరిగిన గొడవను నాగ్ సద్దుమణిగేలా చేశాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనని వరుణ్ క్షమాపణలు చెప్పాడు. తనది కూడా తప్పేనని రాహుల్కూడా సారీ చెప్పాడు. గొడవ జరుగుతూ ఉంటే.. చూస్తూ కూర్చున్నావ్ టాస్క్ ఆడలేదని ఎంపైర్లా పక్కన ఉన్నావంటూ పునర్నవికి చురకలంటించాడు. రాహుల్-పున్నులు మాట్లాడకపోయే సరికి వరుణ్ నీతో ఉన్నాడంటూ శ్రీముఖితో వితికా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. పునర్నవి గురించి బాబా, శ్రీముఖి దగ్గర చెప్పడం తప్పు కదా అని వితికాను మందలించాడు. పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆమెపై సెటైర్ వేశాడు. బయటకు వెళ్లాక తిట్ల కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చని అన్నారు. బాబా భాస్కర్ మాస్క్ తీసేశాడని, శ్రీముఖి, వరుణ్తో జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోలను చూపించాడు. నామినేషన్ విషయంలో పునర్నవితో మాట్లాడిన విధానంపైనా ఫైర్ అయ్యాడు. ప్రతీది కామెడీ చేస్తున్నాడని బాబాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిత్రబేధాన్ని వాడుకుంటోందని శ్రీముఖికి చురకలంటించాడు. రాహుల్-వరుణ్ మధ్య వచ్చిన గొడవను వాడుకుంటున్నావని శ్రీముఖినుద్దేశించి నాగ్ పేర్కొన్నాడు. (ఎలిమినేట్ అయింది అతడే!) బ్రోకెన్ హార్ట్ అంటూ ఆట ఆడించాడు... హౌస్మేట్స్ అందరికీ హార్ట్ షేప్ థర్మకోల్ షీట్లను ఇచ్చాడు. ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందని హౌస్మేట్స్ భావిస్తున్నారో.. వారి వద్దకు వెళ్లి.. ఆ హార్ట్ను విరగొట్టి కారణం చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా మహేష్ మొదటగా ఆటను ప్రారంభించాడు. బాబా భాస్కర్ వల్ల తన హార్ట్ బ్రేక్ అయిందని బాబా ఎదుటకు వెళ్లి థర్మకోల్ హార్ట్ షేప్ను మహేష్ విరగొట్టాడు. రాహుల్కు శివజ్యోతి వల్ల, శివజ్యోతికి రాహుల్ వల్ల, రవి, వితికాలకు పున్ను వల్ల, బాబాకు మహేష్ వల్ల, శ్రీముఖికి బాబా వల్ల, అలీకి బాబా వల్ల, పున్నుకు వరుణ్ వల్ల హార్ట్ బ్రేక్ అయినట్లు తెలిపారు. ఇక నామినేషన్లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, రవిలోంచి వరుణ్ సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించేశాడు. అయినా.. రవి ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ఇక రేపు రవి ఎలిమినేషన్తో శివజ్యోతి ఏం చేస్తున్నది చూడాలి. -
రాహుల్-వరుణ్ గొడవను నాగ్ సెట్ చేస్తాడా?
బిగ్బాస్ హౌస్లో పది వారాలుపూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది ఎలిమినేషన్లు, మూడు వైల్డ్కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అయితే ఈ పదో వారంలో రెండు పెద్ద సంఘటనలు జరగడం విశేషం. ఎంతో సన్నిహితంగాఉండే వరుణ్-రాహుల్ మధ్య గొడవ జరగడం.. ఎలిమినేట్ అయిన అలీ రెజా తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం. అయితే వరుణ్-రాహుల్ మధ్య జరిగిన గొడవ ఇంకా చల్లారలేదు. వీరిద్దరి మధ్య దూరం పెరిగేట్టు కనిపిస్తోంది. అయితే ఆ నలుగురు కలిసి ఉంటేనే.. బలమన్న సంగతి లోపల ఉన్న వారికి తెలియదు. మరి నాగార్జున వచ్చి వీరి మధ్య దూరాన్ని తగ్గిస్తాడా? లేదా? అన్నది చూడాలి. అయితే రాహుల్ మాత్రం వితికాతో ఇక మాట్లడను అని పున్నుతో చెప్పుకొచ్చని సందర్భాన్ని చూశాం. మరి ఈ నలుగురు మళ్లీ ఒక్కటవుతారా?లేదా అన్నది చూడాలి. -
బిగ్బాస్: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!
బిగ్బాస్ ఇచ్చిన ఏ టాస్క్ అయినా గొడవ జరగకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. ప్రస్తుతం ఇచ్చిన ఫన్నీటాస్క్ కూడా అదే కోవలోకి వస్తుంది. అత్తగా నటిస్తున్న శివజ్యోతికి ముగ్గురు కొడుకులు కోడళ్లు వరుణ్-వితిక, రవి-శ్రీముఖి, రాహుల్-పునర్నవిలను జంటలుగా విడగొట్టారు. వీరిలో ఏ జంట ఎక్కువ ఇటుకలతో గోడ నిర్మిస్తే వారు కెప్టెన్సీ టాస్క్కు అర్హులన్న విషయం తెలిసిందే. వీరితో పాటు వీలునామా చేజిక్కించుకున్న వారు కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతారు. అయితే ఇటుకలను సంపాదించడానికి వితిక, శ్రీముఖి.. శివజ్యోతిని బాగానే కాకా పట్టారు. వితిక అత్తను అందంగా ముస్తాబు చేయడం, శ్రీముఖి శివజ్యోతికి గోరుముద్దలు తినిపించడం.. ఇలా అడగకముందే కోడళ్లు అన్ని సపర్యలు చేస్తూ అత్తను బుట్టలో వేసుకోడానికి ప్రయత్నించారు. ఇక ఇప్పటివరకు జరిగిన పర్ఫార్మెన్స్ ఆధారంగా వితిక జంటకు 22 ఇటుకలు లభించగా మిగిలిన రెండు జంటలకు 20 మాత్రమే లభించాయి. టాస్క్లో భాగంగా రాహుల్.. వరుణ్ దగ్గర ఇటుకలు కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఎన్ని ఇటుకలు సంపాదించుకున్నాం అనేదానికన్నా ఎన్ని లాక్కున్నాం అనేదానిపైనే రాహుల్ ప్రధానంగా దృష్టి సారించాడు. దీంతో ఇటుకలు పట్టుకొస్తున్న వరుణ్ను కట్టడి చేసి అతని దగ్గర నుంచి ఇటుకలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాహుల్, వరుణ్, వీరిద్దరినీ ఆపేందుకు ప్రయత్నించిన వితికకు గాయాలయ్యాయి. దీంతో వారిమధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కూల్గా ఉండే వరుణ్ సహనాన్ని కోల్పోయాడు. ఏంటి? కొడతావా అంటూ రాహుల్పై సీరియస్ అయ్యాడు. గతంలో జరిగిన వాటిని తవ్వి తీస్తూ.. ‘అలీ చేసిన తప్పే నువ్వూ చేస్తున్నావని, హిమజ విషయంలోనూ ఏం జరిగిందో అందరూ చూశారు’ అని రాహుల్ను తప్పుబట్టాడు. తాను ఏ తప్పూ చేయలేదంటూ రాహుల్ కూడా గొడవకు దిగాడు. అందరూ ప్రశాంతంగా ఆడండని శివజ్యోతి చెప్పిన మాటలను పెడచెవిన పెడుతూ ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వారు. ఒకవైపు హోరాహోరీగా వీరికి గొడవ జరుగుతుంటే మరోవైపు రవి-శ్రీముఖిలు మాత్రం ఇటుకలు జారవేస్తూ వారి పని పూర్తి చేశారు. ఇక అగ్నికి ఆజ్యం పోయడానికా అన్నట్టు శ్రీముఖి.. వరుణ్ దగ్గరకు వెళ్లి రాహుల్ గురించి నెగెటివ్గా చెప్పింది. అప్పటివరకు సరదాగా సాగిన టాస్క్.. వీరి గొడవలతో హీటెక్కింది. కాగా ‘రాహుల్- వరుణ్ల ఫ్రెండ్షిప్ ఇంతేనా..?’ అని పునర్నవి షాక్కు గురయింది. అయితే ఇదంతా ఉత్తుత్తే అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి నిజంగానే వారిద్దరూ గొడవపడ్డారా? లేక ఇది బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కా? అన్న ప్రశ్న ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తోంది. దీనికి సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే! -
బిగ్బాస్: ఏంటి? కొడతావా అంటూ వరుణ్ ఫైర్!
ఎలిమినేషన్ ప్రక్రియతో శ్రీముఖి, బాబా భాస్కర్ల మధ్య కాస్త దూరం పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇంటి సభ్యులందరూ శ్రీముఖితో అంటీఅంటనట్లుగా మెదులుతున్నారు. ఇక ప్రతి ఉదయాన్ని డాన్స్తో హుషారుగా ప్రారంభించే శ్రీముఖి తాజా ఎపిసోడ్లో డాన్స్కు దూరంగా ఉంది. ఇప్పటికే ఒంటరిగా ఫీలైన శ్రీముఖి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందనుకున్నప్పటికీ టాస్క్లో హుషారుగా పార్టిసిపేట్ చేసింది. పునర్నవి నామినేషన్ ప్రక్రియ గురించి వరుణ్తో మాట్లాడుతూ రవిపై వీరలెవల్లో సీరియస్ అయింది. వాడో పెద్ద వెధవ అంటూ నోటికొచ్చిన తిట్లు తిట్టింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు గుర్రుగా ఉండటంతో బిగ్బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చివారు కెప్టెన్సీ టాస్క్కు అర్హులని ప్రకటించారు. ఇక టాస్క్ మొదటి రోజు అతి వినయం, అతి ప్రేమలతో సరదాగా సాగగా ముగ్గురు కోడళ్ల ముద్దుల అత్తగా శివజ్యోతి అలరించింది. అయితే ఎందుకైనా మంచిదని, అందరినీ ఓ కంట కనిపెట్టమంటూ అసిస్టెంట్ మహేశ్కు ఆర్డర్లు జారీ చేసింది . కాగా నేటి ఎపిసోడ్లో ఇంట్లో మళ్లీ గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని ప్రోమో లవర్స్ అంటున్నారు. మరి వీరి గొడవ టాస్క్ కోసమేనా లేక తర్వాత కూడా కొనసాగుతుందా అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది! -
రాహుల్ను ముద్దు పెట్టుకున్న పునర్నవి
బిగ్బాస్ హౌస్లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేశాడు. అందులో ఉన్న ఫోన్ మోగిన వెంటనే శ్రీముఖి లోపలికి వెళ్లింది. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీముఖిని డైరెక్ట్గా నామినేట్ అయిందని బిగ్బాస్ తెలిపాడు. అయితే నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు శ్రీముఖికి ఓ అవకాశాన్ని ఇచ్చాడు. బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకుంటే.. నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపాడు. దీంతో శ్రీముఖి అడిగిన వెంటనే క్లీన్ షేవ్ చేసుకునేందుకు బాబా ఒప్పుకున్నాడు. అనంతరం పునర్నవి నామినేట్ అయినట్లు తెలిపాడు. అయితే నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. రాహుల్ ఇరవై గ్లాసుల కాకరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుందని షరుతును విధించాడు. దీంతో పునర్నవి.. రాహుల్ను అడగసాగింది. చేయగలవా? లేదంటే వద్దు అంటూ ఉండగా.. ప్రయత్నిస్తానని.. చేయలేకపోతే మధ్యలో వదిలేద్దామంటూ చెప్పుకొచ్చాడు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరకి పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవి సేవ్ అయినట్లు తెలిపాడు. అనంతరం రాహుల్ను హగ్ చేసుకుని.. ముద్దు పెట్టుకుంది. వరుణ్ కోసం.. శ్రీముఖి బిగ్బాస్ ట్యాటు వేసుకుంది. అయితే మహేష్ కోసం చేయాల్సిన టాస్క్ను హిమజ సరిగ్గా చేయలేకపోవడంతో అతను నామినేట్ అయినట్లు బిగ్బాస్ తెలిపాడు. హిమజ.. తన బట్టలు, మేకప్ స్కిట్ను స్టోర్రూమ్లో పెట్టాలని సూచించాడు. కొన్ని వస్తువులను మర్చిపోయిన కారణంగా మహేష్ నామినేట్ అయినట్లు తెలిపాడు. బాబా భాస్కర్ కోసం రవి తన షూస్ను పెయింట్లో ముంచాడు. శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకు ఎరుపు రంగను వేసుకున్నాడు. ఇక హిమజ కోసం.. పేడ తొట్టెలో పడుకోడానికి వరుణ్ సిద్దపడ్డాడు. అయితే వరుణ్కు సహాయం చేసే ప్రయత్నంలో వితికా కాలుజారి పడింది. దీంతో హిమజ.. టాస్క్ను చేయొద్దంటూ వరుణ్ను బతిమిలాడింది. తాను సెల్ఫ్ నామినేట్ అవుతానని బిగ్బాస్కు తెలిపింది. అయినా వరుణ్ అతి కష్టం మీద ఆ టాస్క్ను పూర్తి చేశాడు. దీంతో హిమజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. మరి మిగతా వారిలో ఎవరు ఎవరికోసం ఎలాంటి త్యాగాలు చేస్తారో చూడాలి. -
బిగ్బాస్ను వేడుకుంటున్న హిమజ
-
బిగ్బాస్ను వేడుకుంటున్న హిమజ
బిగ్బాస్ హౌస్లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్లోకి వస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ వారంలో నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఎదుటి కంటెస్టెంట్ బిగ్బాస్ చెప్పిన టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిమజ కోసం వరుణ్ సందేశ్ చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. హిమజ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే.. వరుణ్ సందేశ్ ఓ టాస్క్ చేయాలని బిగ్బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బురదలో కూర్చొవాలనే టాస్క్ను వరుణ్ అతి కష్టం మీద చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వితికా భోరున ఏడ్చినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ అంతగా బాధపడటం చూసిన హిమజ.. తాను నేరుగా నామినేట్ అవుతానని బిగ్బాస్కు చెప్పుకొచ్చింది. ఇక మరి హిమజ నేరుగా నామినేట్ అయ్యిందా? మధ్యలోనే వరుణ్ టాస్క్ను వదిలేయాల్సి వచ్చిందా? అన్నది తెలియాలి. -
డిన్నర్ పార్టీ ఇచ్చిన బిగ్బాస్
బిగ్బాస్ హౌస్లో శుక్రవారం నాటి ఎపిసోడ్ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్ ఐటమ్స్ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్ లభించాయి. చివరకు అందరికీ బిగ్బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. సీక్రెట్-లైస్ అని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్బాస్.. దాంట్లో ఇంటి సభ్యులందరూ గెలిస్తే.. డిన్నర్పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్లో జరిగిన వాటిని మిగతా హౌస్మేట్స్కు తెలియపర్చాలి. అయితే అవి నిజాలా? కాదా? అని ఇంటి సభ్యులు కనిపెట్టాలి. ఇలా వారు చెప్పినవన్ని నిజాలే అని గెస్ చేస్తే.. డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలిపాడు. టాస్క్లో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్ను కన్ఫెషన్ రూమ్కు పిలిచాడు. అనంతరం 1 నుంచి 100 వరకు, 100 నుంచి 1 వరకు లెక్కించమన్నాడు. ఏ నుంచి జెడ్ వరకు జెడ్ నుంచి ఏ వరకు చెప్పమన్నాడు. అయితే వీటిని చెప్పడంలో బాబా తడబడ్డాడు. హౌస్మేట్స్ దగ్గర ఏబీసీడీలు నేర్చుకోమ్మని సలహాఇచ్చాడు. ఇక బాబా భాస్కర్ తనకు కన్ఫెషన్ రూమ్లో బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ల గురించి చెప్పగా.. అవి నిజమేనని తమ నిర్ణయాన్ని తెలిపాడు. రవి-హిమజలకు కేక్లు, చాక్లెట్లు ఇచ్చిన బిగ్బాస్.. వరుణ్-వితికాలను ఏకాంతంగా మాట్లాడుకునే వీలును కల్పించాడు. పునర్నవి నర్సరీ రైమ్స్, శివజ్యోతి తెలుగు పద్యాలను పాడారు. రాహుల్ విషయంలో మాత్రమే ఇంటి సభ్యులు పప్పులో కాలేశారు. అయితే శ్రీముఖి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లే నిజాన్ని కనుక్కోలేకపోయారు. దీంతో వరుణ్-శ్రీముఖి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు ఇరువురు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇక శ్రీముఖికి నాగ్ ఫోటోను ఇచ్చి మాట్లాడుకోమన్నాడు.. శిల్పాకు తన భర్త ఫోన్ చేశాడని అబద్దం చెప్పమని అన్నాడు. కానీ ఇంటి సభ్యులు పసిగట్టేశారు. ఇక అందరి టాస్కుల్లోకెల్లా.. మహేష్కు ఇచ్చిన టాస్క్ కాస్త ఫన్నీగా అనిపించింది. అయితే అది అబద్దమని ఇట్టే పసిగట్టేశారు. అయినా మహేష్ నమ్మించేందుకు ప్రయత్నించినా.. ఎవ్వరు కూడా నమ్మలేదు. దీంతో ఇంటి సభ్యులకు బిగ్బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది చూడాలి. -
శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ
-
బిగ్బాస్.. శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ
బిగ్బాస్ హౌస్లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసింది. ఈ టాస్క్లోని నియమాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటి సభ్యులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇదీ ఓ టాస్కా? చెత్త టాస్క్.. మీరే ఆడుకోండని బిగ్బాస్ను పునర్నవి హెచ్చరించడం.. టాస్క్లో సరిగా ఆడలేదని శ్రీముఖి, మహేష్, పునర్నవిలకు మరో పనిష్మెంట్ టాస్క్ను ఇవ్వడం.. దానినిసైతం పునర్నవి ధిక్కరించడం.. చివరకు వరుణ్ బుజ్జగింపులతో దిగిరావడం ఈ వారంలో హైలెట్గా నిలిచాయి. అయితే మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే వీరిద్దరు బిగ్బాస్ హౌస్లో ఇంతవరకు గొడవపడిన సందర్భాలు లేవు. నేటి ఎపిసోడ్లో అది కూడా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది నీ ఒక్కదాని ఒపీనియన్ కాదు.. గ్రూప్ అంతటిది అంటూ వరుణ్చెప్పగా.. నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది.. నా అభిప్రాయం నేను చెప్పాను.. అంటూ శ్రీముఖి బదులిచ్చింది. అయితే ఇది నా అభిప్రాయం అంటూ వరుణ్ చెప్పగా.. అయితే చెప్పు అని కోపంగా శ్రీముఖి అనడం కనిపిస్తోంది. మరి ఆ అభిప్రాయం ఏంటి? వారిద్దరి మధ్య ఆ గొడవెందుకు మొదలైందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. -
బిగ్బాస్.. రెండోసారి కెప్టెన్గా ఎన్నికైన వరుణ్
తన అల్లరి చేష్టలతో బాబా భాస్కర్ బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు. చలో ఇండియా టాస్క్లో బెస్ట్ పర్ఫామెన్స్గా రాహుల్, వరుణ్లను ఎంచుకోవడంపై సెటైర్లు వేశాడు. పునర్నవి, రవి, రాహుల్ బెస్ట్ పర్ఫామెన్స్లుగా చెప్పుకొచ్చిన పునర్నవి, రవిలపై ఫన్నీ కామెంట్లు చేశాడు. వారిద్దరు ఏం చేశారని, 70 ముద్దులు పెట్టుకున్నాడంటూ బాబా కామెంట్లు చేస్తుండగా.. రవి వచ్చి 60 ముద్దులే పెట్టానని సరదాగా చెప్పాడు. తాను హౌస్లో కెప్టెన్ అయితే ఆడవారు పొద్దున్నే లేవాలని, పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదని, అలీరెజా కూడా బాత్రూమ్కు వెళ్లే ముందు దుప్పటి తీసుకెళ్లాలనే ఆదేశాలు జారీ చేస్తానని బాబా చెప్పుకొచ్చాడు. ఇక నేటి ఎపిసోడ్లో రాహుల్-శ్రీముఖిలు కలిసిపోయినట్లుగా అనిపించినా.. మళ్లీ కొద్ది సేపటికే తేడాలు వచ్చినట్టు కనిపిస్తోంది. మొదటిసారి కెప్టెన్ టాస్క్ వెళ్లబోతోన్నావు.. కెప్టెన్గా ఎన్నికైతే బయట నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు.. రక్తాభిషేకాలు చేస్తారు అని సరదాగానే అన్నా.. రాహుల్ మాత్రం కాస్త ఫీలైనట్లు కనిపిస్తోంది. చివరకు కెప్టెన్ పోటీలో ఓడిపోవడంతో శ్రీముఖి మళ్లీ ఎగతాళిగా మాట్లాడిదంటూ వరుణ్తో రాహుల్ చెప్పుకొచ్చాడు. ఉత్కంఠగా సాగిన కెప్టెన్సీ టాస్క్ బురదలో ఉన్న మూడు రంగుల బంతులను.. మూడు బుట్టల్లో వేయాలి. ఎవరికి కేటాయించిన బంతులను వారికోసం ఏర్పాటు చేసిన బుట్టల్లో వేయాలి. ఆ ముగ్గురిని ఒకే తాడుతో బంధించగా.. ఇద్దర్నీ వారి బుట్టల్లో బంతులను వేయకుండా నిరోధిస్తూ మిగిలిన వ్యక్తి బంతులను వేయాల్సి ఉంటుంది. ఇలా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బుట్టల్లో ఎక్కువ బంతులుంటాయో వారే కెప్టెన్గా ఎన్నికవుతారని తెలిపాడు. దీంతో రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్లు ఒకర్నొకరు తోసుకుంటూ బంతులు వేసేందుకు ప్రయత్నించారు. చివరకు వరుణ్ సందేశ్ 27, బాబా భాస్కర్ 13, రాహుల్ 15 బంతులు వేశాడు. దీంతో వరుణ్ సందేశ్ రెండో సారి కెప్టెన్గా ఎన్నికయ్యాడు. సరదాగా సాగిన రంగుపడుద్ది టాస్క్ ఈ సారి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఫన్నీగా సెట్ చేశాడు బిగ్బాస్. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన వీల్(చక్రం)కు కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ను కట్టి.. అతని చుట్టు ఇంటికి కావాల్సిన సరుకుల లిస్ట్ పెట్టాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ తమకిచ్చిన రంగుల బంతులతో గురి చూసి కొట్టాలి. గురిచూసిన కొట్టిన సరుకులను లగ్జరీ బడ్జెట్లో లభిస్తాయని, అలాగే చలో ఇండియా టాస్క్లో భాగంగా గెలిచిన ఇంటి సభ్యులైన రవి, మహేష్, బాబా భాస్కర్, అలీరెజాకు రెండేసి సరుకులను ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. గురి చూసి కొట్టేందుకు ఇంటి సభ్యులంతా చాలా కష్టపడ్డారు. అక్కడ వరుణ్ సందేశ్ పరిస్థితి కూడా కుడిదిలో పడ్డ ఎలుకలా అయింది. ఏ బంతి వచ్చి తనకు ఎక్కడ తగులుతుందా? అని భయపడుతూ ఉన్నాడు. ఆరో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. అయితే ఈ వీకెండ్పై ప్రస్తుతం ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు రకాలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్లో నాగ్ రాకపోవచ్చని.. ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నాగ్ తన పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో వీకెండ్ షోకు హాజరు కాలేకపోతున్నాడని.. ఇలా పలురకాల వార్తలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజమో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. -
బిగ్బాస్ తన ఆదేశాల్ని మరిచిపోయారా?
బిగ్బాస్ తాను ఇచ్చిన ఆదేశాలనే మర్చిపోయారా? అనే అనుమానం కొందరు ప్రేక్షకులకు అనుమానం వస్తోంది. హౌస్లో మొదటి కెప్టెన్గా ఎన్నికైన వరుణ్ సందేశ్.. కెప్టెన్గా విఫలమయ్యాడని, అతడే స్వయంగా నియమాలను ఉల్లంఘించాడని కెప్టెన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరోసారి ఇలాంటి ఉల్లంఘనలు చేయకుండా కొన్ని శిక్షలను కూడా విధించాడు. అయితే ఆ సందర్భంలో బిగ్బాస్ అన్న మాటలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వరుణ్ ఇకపై కెప్టెన్ కాడు అన్న బిగ్బాస్ ఆదేశాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో మరెప్పుడు కెప్టెన్ కాలేడు అని ఆదేశించాడని, బిగ్బాస్ తన ఆదేశాల్ని మరిచిపోయారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ మళ్లీ కెప్టెన్ పదవీ రేసులో ఉన్నాడని అయితే అదేలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వారానికి మాత్రమే సంబంధించి వరుణ్.. ఇకపై కెప్టెన్ కాడు అని అన్నాడని, భవిష్యత్లో కూడా కెప్టెన్ పదవికి అనర్హుడని ప్రకటించలేదని, అయినా అంత పెద్ద తప్పు వరుణ్ చేయలేదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. బిగ్బాస్ ఆ సమయంలో ఏమని ఆదేశించారో.. మీరూ ఓసారి చూడండి. -
బిగ్బాస్ తన ఆదేశాల్ని మరిచిపోయారా?
-
బిగ్బాస్.. ఆ ముగ్గురిలో కెప్టెన్ కాబోయేదెవరు?
చలో ఇండియా టాస్క్ను పూర్తి చేసిన హౌస్మేట్స్.. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్లో భాగంగా శ్రీనగర్, చంఢీగర్, కోల్కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించిన ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్ డైరెక్షన్లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్గా నటించారు. మొత్తానికి ఏదో రకంగా సినిమాను కంప్లీట్ చేసిన టీమ్.. ప్రెస్మీట్ లాంటిది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. వెండితెరపై ఎప్పుడు కనబడతారు అన్న ప్రశ్నకు కంటతడి పెడుతూ త్వరలోనే హీరోగా నటిస్తానని తెలిపారు. ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులను కూడా వారు పూర్తి చేశారు. కొచ్చిలో పీచు తీయండి.. టెంకాయ వేయండి టాస్క్లో బాబా భాస్కర్ గెలవగా.. రాణీ మెడలో రత్నాల హారం టాస్క్లో మహేష్ గెలుపొందాడు. ఈ టాస్క్లో ఇంటి సభ్యులు దిగిన ఫోటోలు, వీడియోలను ప్లే చేసి చూపించాడు. అనంతరం ఈ టాస్క్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురు సభ్యుల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పమని అదేశించాగా.. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ల పేర్లను తెలిపారు. దీంతో ఈ ముగ్గురుకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ను పెట్టనున్నట్లు ప్రకటించారు. మట్టిలో ఉక్కు మనిషి అనే ఈ టాస్క్లో ఎవరు గెలుపొంది.. కెప్టెన్గా ఎన్నికవుతారో చూడాలి. రెండో సారి కెప్టెన్గా ఎన్నికై వరుణ్ రికార్డు సృష్టిస్తాడా? లేదా బాబా భాస్కర్, రాహుల్లో ఎవరో ఒకరు కెప్టెన్ పదవిని పొందుతారా? అన్నది చూడాలి. -
బిగ్బాస్.. ఆ ముగ్గురికి షాక్
సీక్రెట్ టాస్క్లు అని బిగ్బాస్ అనుకోవడమే తప్పా.. లోపలి హౌస్మేట్స్, బయటి వీక్షకులకు మాత్రం వాటిని ఇట్టే పసిగట్టేస్తున్నారు. కష్టపడి ప్రోమోల రూపంలో ఆసక్తి రేపేందుకు ప్రయత్నిస్తున్నా.. నెటిజన్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేట్టుందనేలా ప్రోమోను కట్చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అప్పటికే అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని మెజార్టీ ఆడియెన్స్ అభిప్రాయడపడగా.. చివరకు అదే నిజమైంది. ఆరోవారానికి గానూ నామినేషన్లోకి వచ్చిన పునర్నవి, హిమజ, మహేష్, రవి, రాహుల్, వరుణ్లకు ఓ డీల్ను ఇచ్చాడు బిగ్బాస్. వారిలోంచి ఓ ముగ్గురికి సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. వారంతా కాంప్రమైజ్ అయ్యి రవి, రాహుల్, వరుణ్లు నామినేషన్లోంచి బయటపడేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ ముగ్గురికి కొన్ని సీక్రెట్ టాస్క్లను బిగ్బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో బెడ్ను నీటితో తడపాలని, షేవింగ్ ఫోమ్ను మొహానికి రాయాలనే టాస్క్లను రవి ఎంచుకున్నాడు. దీంతో వితికా మొహానికి షేవింగ్ ఫోమ్ను, శివజ్యోతి బెడ్ను నీటితో తడిపాడు. ఇక రాహుల్ వంతు వచ్చేసరికి.. హౌస్లోని ఓ సభ్యుడికి కోపం తెప్పించాలి, వరుణ్-వితికాల హార్ట్ షేప్ దిండును చింపేయాలనే వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో హార్ట్ షేప్ దిండును ఈజీగానే చించేసినా.. ఓ సభ్యుడికి కోపం తెప్పించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరు రాహుల్ చేష్టలకు చిరాకు పడ్డారు. చివరకు శివజ్యోతిని ‘మూస్కొని పో’ అని ఓ మాట అనేసరికి.. రాహుల్పై ఫైర్ అయింది. వరుణ్ టైమ్ వచ్చేసరికి.. ఒకరి మీద కాఫీ పోయాలి, ఎవరి బట్టలైనా ముక్కలుముక్కలుగా చించేయాలనే టాస్కులను ఎంచుకున్నాడు. దీంతో సేఫ్ గేమ్ అన్నట్లు వితికా మొహంపై కాఫీ పోసేసి, ఆమె బట్టలనే చించేశాడు. దీంతో టాస్క్లు పూర్తి చేసినట్టు బిగ్బాస్ ప్రకటించాడు. అంతేకాకుండా ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ లభించిందని.. ఈ వారం పునర్నవి, హిమజ, మహేష్లు నామినేషన్లో ఉన్నట్లు బిగ్బాస్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురికి షాక్ కొట్టినట్టైంది. ఆ ముగ్గురు సేవ్ అయినట్లు ప్రకటించిన వెంటనే శ్రీముఖి మొహం తెల్లబోయినట్లు కనిపించింది. ఈ వారంలో రాహుల్ బయటకు వెళ్లిపోతాడేమోనని అనుకున్న శ్రీముఖికి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తనకిచ్చిన టాస్క్లో గొడవపడ్డ వారందర్నీ క్షమించమని కాళ్లు మొక్కి మరీ అడిగాడు రాహుల్. దీంతో హిమజ, శివజ్యోతి మామూలు స్థితికి వచ్చేశారు. అయితే శ్రీముఖి మాత్రం మళ్లీ అదే రీతిలో స్పందించి.. రాహుల్ తరీఖా నచ్చలేదంటూ దూరం పెట్టే ప్రయత్నం చేసింది. తనకు ఇచ్చిన టాస్కే అలాంటింది.. ఒకరికి కోపం తెప్పించాలని అలా మాట్లాడనని చెప్పే ప్రయత్నం చేసి క్షమించమని అడిగినా.. అదే ధోరణిలో ప్రవర్తిస్తూ వచ్చింది. మొత్తానికి వరుణ్, రవి, రాహుల్.. నామినేషన్ నుంచి తప్పించుకోగా పునర్నవి, హిమజ, మహేష్లోంచి ఒకరు హౌస్ను వీడనున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది తెలియాలంటే వీకెండ్ వచ్చే వరకు ఆగాల్సిందే. -
భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్ టాస్క్లో భాగమా?
బిగ్బాస్ ఇంట్లో ఇప్పటివరకు చాలా కూల్గా కనిపించిన వ్యక్తి ఎవరంటే టక్కున వినిపించే పేరు వరుణ్. అలాంటి వరుణ్ వితికాపై విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. వితికాకు ఇంటిలో ఉండే అర్హతే లేదంటూ మొహం మీదే చెప్పాడు. వితికాను అందరి ముందే నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఏడిపించడానికి ప్రయత్నించినట్టుగానే ఉంది. వరుణ్ నిజంగానే అలా ప్రవర్తించాడా లేక ఇది బిగ్బాస్ ఆడిస్తున్న నాటకమా? అనేది భేతాళుని చిక్కు ప్రశ్నలా మారింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య మహేశ్.. వరుణ్తో కాస్త క్లోజ్ అయ్యాడు. దీన్నిబట్టి చూస్తే వరుణ్ -వితికా మధ్య పుల్లలు పెట్టింది మహేశే అని కొందరు తిట్టిపోస్తున్నారు. ఇది కెప్టెన్సీ టాస్క్ అని కొందరు తేలికగా తీసిపడేస్తున్నారు. మరోవైపేమో ఇది పక్కా సీక్రెట్ టాస్క్అని.. ఇందులో వరుణ్ గెలిచి రెండో కెప్టెన్గా ఎన్నికయి రికార్డు సృష్టించాలని వరుణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్ని గొడవలు జరిగినా వరుణ్ వితిక విడిపోవడమనేది జరగదని వారి ఫాలోవర్స్ గట్టిగా విశ్వసిస్తున్నారు. భూమి ఆకాశం ఒక్కటైనా వారిని విడదీయలేరు అంటూ ఆ జంటకు జై కొడుతున్నారు. కాగా ప్రోమోలో కనిపించే ట్విస్టులు ఎపిసోడ్లో ఉండవు.. ఎపిసోడ్లో ఉండే ట్విస్ట్లు ప్రోమోలు ఉండవు.. సో తప్పకుండా ఎపిసోడ్లో అంత సీన్ ఉండదు అని కొట్టిపారేస్తున్నారు ప్రోమో లవర్స్. మరో వైపేమో.. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు అవుతాయి. ఈ మాత్రం దీనికే ఇంత కంగారు పడిపోవాలా అంటూ పెళ్లయిన వారు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్బాస్ 3 సీజన్ కాస్త చప్పగా సాగుతోందని, చిన్నచిన్న గొడవలతో అలా నెట్టుకొస్తున్నారని, లవ్ట్రాక్లు కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా బిగ్బాస్ సీజన్ 1,2ల కన్నా ఇది బాగా వెనకపడిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో వీటన్నింటి నుంచి గట్టెక్కడానికి, టీఆర్పీ రేటింగ్ను అమాంతం పెంచడానికి బిగ్బాస్ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక వరుణ్ టాస్క్లో భాగంగా చేసినా.. నిజంగా అలా ప్రవర్తించినా తర్వాత వితిక దగ్గర అతని పరిస్థితిని తల్చుకుంటే జాలేస్తోందని నెటిజన్లు వరుణ్పై సానుభూతి ప్రకటిస్తున్నారు. వారు గొడవ పెట్టుకోలేదు. బిగ్బాస్ కావాలనే గొడవ పెట్టాడు అని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఏదిఏమైనా ఈ సారి వీర లెవల్లో విరుచుకుపడ్డ వరుణ్ను వితిక క్షమిస్తుందా? అసలు భార్యాభర్తల మధ్య నిప్పు రాజేసింది ఎవరు? ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్లనుంది..? అనేది వేచి చూడాల్సిందే. -
బిగ్బాస్.. ఏయ్ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్
బిగ్బాస్లో ప్రతీవారం నామినేషన్స్,టాస్క్, ఎలిమినేషన్స్ జరగుతూనే ఉంటాయి. హౌస్లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ అనంతరం ఆరోవారానికి గానూ.. పునర్నవి,రవికృష్ణ, మహేష్, హిమజ, రాహుల్,వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యారు. ఇక నేడు బిగ్బాస్ ఓ టాస్క్ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ టాస్క్లో భాగంగా ఏయ్ సరిగా మాట్లాడు అంటూ రాహుల్పై అలీరెజా ఫైర్ అయ్యాడు. ఈ టాస్క్తో బిగ్బాస్ హౌస్ అంతా గందరగోళంగా మారినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగబోతోన్నట్లు తెలుస్తోంది. టాస్క్లో భాగంగా ఈ గొడవ జరగనుందా? మరేతర కారణంగానైనా జరగనుందా? అనే విషయం తెలియాలి. గతానికి భిన్నంగా వితికా ఏడ్వడం లేదు.. వరుణ్ కూడా తన భార్యను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావ్, రూడ్గా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ వితికానుద్దేశించి వరుణ్ చెప్పడం.. ‘నా దగ్గరికి రావొద్దంటోన్న’ అంటూ వితికా తిరిగి అనడం.. ఇలా మాటామాట పెరిగి వరుణ్ అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది. కోపంలో కాఫీని విసిరేయడం లాంటివి ప్రోమోలో ఆసక్తిని రేపుతున్నాయి. మరి వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి. -
బిగ్బాస్.. నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే?
బిగ్బాస్ హౌస్లో ఆరోవారానికి గానూ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్ అయిన కారణంగా శివజ్యోతికి మినహాయింపును ఇచ్చిన బిగ్బాస్.. మిగిలిన వారందర్నీ వారి సన్నిహితులతో కలిసి జంటగా ఏర్పడాలని ఆదేశించడం.. అందులోంచి ఒకరు సేవ్ అవడం.. మరొకరు నామినేషన్స్లోకి వెళ్లడం.. బిగ్బాస్ వీక్లి న్యూస్ను ప్రచురించడం హైలెట్గా నిలిచాయి. తనకు బయట చాలా మంది స్నేహితులు ఉన్నారని.. తనంటే కోసుకునే వాళ్లు ఉన్నారని.. నువ్వెంత? అంటూ పునర్నవిని ఉద్దేశించి రాహుల్ అన్నాడు. దీంతో పునర్నవి అలిగింది. పునర్నవి-రాహుల్ మధ్య జరిగిన గొడవను సద్దుమణిగేలా చేయడం కోసం వరుణ్ ప్రయత్నించాడు. బిగ్బాస్ వీక్లి పేపర్ను పంపించాడు. దాంట్లో ఇంటి గురించి సంబంధించిన వార్తలను ప్రచురించాడు. అలీ డ్యాన్సులు, రవి మీసం, హౌస్లో ఉండే గ్రూప్స్కు సంబంధించిన వార్తలను ప్రచురించాడు. ఇక దానిపై హౌస్లో చర్చించుకున్నారు. నామినేషన్ ప్రక్రియ కోసం బాబా భాస్కర్-మహేష్, హిమజ-శ్రీముఖి, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, అలీ-రవిలు జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటల్లోంచి మిగిలిన ఇంటి సభ్యులందరూ ఓటింగ్ ద్వారా ఒకర్ని సేవ్, మరొకర్ని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఒకవేళ ఓటింగ్ విషయంలో టై అయితే కెప్టెన్ శివజ్యోతి నిర్ణయం ఫైనల్ అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలో మహేష్, పునర్నవి, రవి, హిమజలు నామినేట్ అయ్యారు. వితికా-రాహుల్ విషయంలో టై కాగా.. చివరకు శివజ్యోతి నిర్ణయంతో వితికా సేవ్ అయిపోయింది. ఈ నామినేషన్స్లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. వితికా తన భర్తను నామినేట్ చేసి, పునర్నవిని సేవ్ చేసింది. అప్పటికే పునర్నవికి ఐదు ఓట్లు వచ్చాయి కాబట్టి మళ్లీ పునర్నవిని నామినేట్ చేస్తే ఫీల్ అవుతుందేమోనని వరుణ్ను నామినేట్ చేసినట్లు కనబడుతోంది. తాను ఒక్క ఓటు పునర్నవికి వేసినంత మాత్రాన తన భర్తకు వచ్చే నష్టం లేదనుకుని పునర్నవిని సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా విషయంలో.. పునర్నవి వేసే ఓటుతో తేలే అవకాశం ఉన్నా.. రాహుల్కు ఓటు వేసి టైగా మార్చేసింది. దాంతో రాహుల్, వితికాలకు 4 ఓట్లు పడ్డాయి. కెప్టెన్ అయిన శివజ్యోతి తన నిర్ణయంతో వితికాను సేవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. చివరగా బిగ్బాస్ ఆదేశం మేరకు ఇంతవరకు సేవ్ అయిన ఇంటి సభ్యుల్లోంచి వరుణ్ సందేశ్ను శివజ్యోతి నేరుగా నామినేట్ చేసింది. నామినేషన్ విషయం వచ్చేసరికి స్నేహితులు అని చూడకూడదని వరుణ్, వితికా మాట్లాకున్నారు. మహేష్ తన స్ట్రాటజీని బయటపెట్టాడు. మొదటగా అలీని నామినేట్ చేద్దామని అనుకున్నానని, అయితే తాను నామినేషన్లో ఉండేసరికి తనకంటే తక్కువ పర్ఫామెన్స్ ఇచ్చేవాడిని సెలెక్ట్ చేయాలనుకున్నాని తెలిపాడు. అందుకే తాను అలీని సేవ్ చేసి రవిని నామినేట్ చేశానని.. రవి ఉంటేనే తాను సేవ్ అయ్యే అవకాశం ఉంటుందని వరుణ్, వితికాలతో చెప్పుకొచ్చాడు. మరి మహేష్ స్ట్రాటజీ నిజమవుతుందా? ఆరో వారంలో ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి. -
బిగ్బాస్.. ఆ నలుగురు విడిపోనున్నారా?
సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, చిన్నపాటి గొడవలు.. ఇలా నవరసాలు పండిస్తున్న బిగ్బాస్ హౌస్ సోమవారం వచ్చేసరికి మాత్రం సీరియస్గా మారిపోతుంది. దానికి ప్రధాన కారణం నామినేషన్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్ అనగానే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అందుకోసం వారు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఎవరిని నామినేట్ చేయాలని సాకు వెతుక్కోవడమే కాదు అసలు తనని ఎవరు, ఎంతమంది నామినేట్ చేస్తారో అనే భయం పట్టి పీడిస్తుంది. తీరా నామినేషన్కు వచ్చాక సీన్ కాస్తా మరింత పెద్దదైపోతుంది. గొడవ జరగకుండా ఇప్పటివరకు ఏ నామినేషన్ ఎపిసోడ్ పూర్తవకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక ఊహించని రీతిలో వెన్నుపోటులు కూడా నడుస్తాయి. గతవారంలో పునర్నవి, వరుణ్.. రాహుల్ను తమ స్నేహితుడు అని చెప్తూనే నామినేషన్కు పంపించడమే ఇందుకు ఉదాహరణ. ఇకపోతే మాస్క్లు తీసేయండి.. అని నాగార్జున చెప్పిన మాటలను ఇంటి సభ్యులు ఇప్పుడిప్పుడే పాటిస్తున్నట్టు అనిపిస్తోంది. గత ఎపిసోడ్లో జరిగిన మిత్రుడు-శత్రువు-వెన్నుపోటుదారుడు ఆటలో ఇంటి సభ్యులందరూ వారి మనసులో ఉన్నదంతా బయటకు కక్కేశారు. కొంతమంది వారు నొచ్చుకోకుండా చెప్పీ చెప్పనట్టు చెప్పి తప్పించుకున్నారు.. అది వేరే విషయం. అయితే హౌస్లో ఓ నలుగురు మాత్రం స్నేహ బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వరుణ్-వితికా-రాహుల్-పునర్నవి ఓ గ్రూప్గా ఉంటోన్న విషయం అందరికీ తెలిసిందే. గతవారం నామినేషన్ విషయంలో తనను నామినేట్ చేసినా..లైట్ తీసుకున్నాడు రాహుల్. హౌస్మేట్స్లో కొందరు మిగతా ఇంటి సభ్యుల వెనకాల మాట్లాడుకున్న వీడియోలు ప్లే చేయించి హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టేందుకు బిగ్బాస్ ప్రయత్నించాడు. దీనిలో భాగంగా వితికా తన గురించి మాట్లాడిన వీడియాను పునర్నవికి చూపించాడు. అప్పటికే వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు కనిపించినా.. ఈ సీన్ తరువాత పునర్నవి చాలా బాధపడింది. బుజ్జగింపులు, క్షమాపణలు, ఎన్నో అలకలు, చివరకు పునర్నవిని వితికా ఎత్తుకు తీసుకెళ్లడంతో గొడవ గురించి మరిచిపోయినట్లు కనిపించింది. అయితే ఆదివారం నాటి టాస్క్లో మళ్లీ మొదటికి వచ్చింది. వితికా తనకు వెన్నుపోటు పొడిచిందని, వరుణ్ తన శత్రువని పేర్కొంది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా అదే విషయం తెలుస్తోంది. పునర్నవి ఇంకా వితికాను క్షమించలేదని, అందుకే ఆమెను నామినేట్ చేస్తోందని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. దీంతో ఆ నలుగురు కాస్త విడిపోతారేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి. నేడు జరగనున్న నామినేషన్ ప్రక్రియలో రాహుల్-వితికాల్లోంచి వితికాను వరుణ్ సేవ్ చేయాలని చూస్తుండగా.. పునర్నవి వితికాను నామినేట్ చేసింది. అయితే ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో కెప్టెన్ శివజ్యోతి నిర్ణయమే ఫైనల్ కావడంతో.. ఆ ఇద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు సేవ్ అయ్యారు? అనేది తెలియాల్సి ఉంది. -
బిగ్బాస్.. రాహుల్ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?
ఎప్పుడూ వాడివేడిగా జరిగే బిగ్బాస్ ఎలిమినేషన్స్ నిన్నటి ఆదివారం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. శివజ్యోతి తప్ప మిగతా అందరూ నవ్వుతూనే అషూను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇక వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉండాల్సిన అర్హత ఇంటి సభ్యుల్లో ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది తేల్చేసి చెప్పింది. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. మరి అషూ చెప్పిన సూచనలు పాటిస్తూ.. వారి తప్పులను సరిదిద్దుకుంటారో, లేదా అన్నది పక్కన పెడితే తను చెప్పిన పేర్లే నామినేషన్లో ఉండనున్నాయా అన్నది చూడాలి. మరోవైపేమో ఏ తప్పూ చేయకపోయినా నామినేషన్స్లోకి వెళ్లిన రోహిణి ఉత్తిపుణ్యానికే ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోయిన తర్వాత వారమే అషూ కూడా ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంది. నేటి ఎపిసోడ్లో ఆరో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ జరగబోతోంది. ఇక ఇంట్లో గడిచిన వారంలో కొత్త గొడవలు జరిగాయి. దీంతో ఇంటి సభ్యులు వారిని పాయింట్ అవుట్ చేస్తారా? అనేది చూడాలి. మరోపక్క స్నేహగీతం పాడుకునే కంటెస్టెంట్లు కూడా వారి స్నేహితులపైనే నామినేషన్ అనే బాణాన్ని ఎక్కు పెట్టినట్టుగా తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక వారిద్దరూ తనకు రెండు కళ్లు అని చెప్పిన బాబా ఎవరిని నామినేట్ చేశాడు? హిమజ చెప్పినట్టుగా సేఫ్ గేమ్ ఆడుతున్న ఆ వ్యక్తి ఎవరు? డెఫినెట్లీ ఒక స్టెప్ ముందున్నాడు కాబట్టి అంటూ శ్రీముఖి ఎవరిని నామినేట్ చేసింది? ఇక తనని గతంలో నామినేట్ చేసిన వారిపై రాహుల్ ప్రతీకారం తీర్చుకోనున్నాడా! బిగ్బాస్ ఇంటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. మరి ఈ జాబితాలో కొత్తగా ఎవరు చేరనున్నారు? అందుకు ఎవరు నామినేట్ కానున్నారనే విషయాలు నేటి ఎపిసోడ్లో తేలనున్నాయి. -
బిగ్బాస్.. వరుణ్కు వితికా శత్రువా?
బిగ్బాస్ హౌస్లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్మేట్స్ తెలపటం.. ఈ వీకెండ్లో హైలెట్గా మారనుంది. ఈ టాస్క్లో ఎవరి మైండ్లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా, శత్రువుగా భావిస్తున్నారో.. వెన్నుపోటుదారునిగా అనుకుంటున్నారో తెలిసిపోనుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మహేష్, శ్రీముఖి, పునర్నవి, వరుణ్లకు సంబంధించి.. ఎవరెవర్ని ఏమని భావిస్తున్నారో.. చూపించినట్టు తెలుస్తోంది. (బిగ్బాస్.. ఎలిమినేట్ అయింది ఆమేనా?) బాబా భాస్కర్ను మిత్రుడుగా, అలీరెజాను శత్రువుగా.. శ్రీముఖిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ను మిత్రుడుగా, బాబా భాస్కర్ను శత్రువుగా.. వితికా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా శ్రీముఖి పేర్కొంది. రాహుల్ను మిత్రుడుగా, వరుణ్ సందేశ్ను శత్రువుగా.. వితికాను వెన్నుపోటుదారులుగా పునర్నవి తెలిపింది. వితికాను తన శత్రువుగా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా వరుణ్ సందేశ్ పేర్కొనట్టు కనిపిస్తోంది. ఆసక్తికరంగా ఈ టాస్క్ హౌస్మేట్స్ మధ్య ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుందో చూడాలి. ఐదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేది అషూ రెడ్డి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైల్డ్కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి వీటన్నింటికి సమాధానం కావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. -
కెప్టెన్సీలో విఫలం.. వరుణ్ సందేశ్కు శిక్ష
అలీరెజా, పునర్నవికి బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ పూర్తైంది. వారిద్దరి గురించి పెరుగును, పరుపులను, చెప్పులను, ఎగ్స్ను హౌస్మేట్స్ వదులుకున్నారు. సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు కోర్ట్ యార్డ్ను హౌస్మేట్స్ అందరూ ఉపయోగించుకునే వీలును కల్పించాడు. సీక్రెట్ టాస్క్లో భాగంగా.. మిగిలిన హౌస్మేట్స్లో తమకు నచ్చని వారి గురించి చెప్పమని ఆ ఇద్దరికి బిగ్బాస్ తెలిపాడు. శ్రీముఖి, హిమజ, రాహుల్, బాబా భాస్కర్ల గురించి పునర్నవి.. మహేష్ విట్టా, తమన్నా, వితికాల గురించి అలీరెజా చెప్పుకొచ్చాడు. ఈ తతంగాన్ని లివింగ్ ఏరియాలో కూర్చుని మిగతా హౌస్మేట్స్ చూస్తూ ఉన్నారు. రెండో వారంలో హౌస్మేట్స్ బిగ్బాస్ ఇంటి నియమాలను ఉల్లంఘించినవారి లెక్క సరిచేశాడు. ఇంటి మొదటి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ కెప్టెన్సీ పూర్తిగా విఫలమైందని బిగ్బాస్ పేర్కొన్నాడు. సిగరెట్ స్మోకింగ్ జోన్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదని నిబంధన ఉన్నా.. చివరకు కెప్టెన్ అయి ఉండి కూడా ఆ నిబంధనను పాటించలేదు.. ఇది చిన్న ఉదాహరణ అని వరుణ్ సందేశ్ కెప్టెన్సీపై ఫైర్ అయ్యాడు. పగలు నిద్రపోవడం, మైక్ను ధరించడంలో నిర్లక్క్ష్యం చూపడం లాంటివి ఇంటిసభ్యులు తరుచుగా చేస్తున్నారంటూ అందరికీ శిక్షను విధించాడు. కెప్టెన్గా వరుణ్ ఫెయిల్ కావడంతో.. ఇకపై వరుణ్ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని తెలిపాడు. అంతేకాకుండా.. ఇంటి సభ్యులకు సేవకుడుగా మారుతాడని, వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు డోర్ తీయాలని, అందరికీ భోజనం వడ్డించాలని, గిన్నెలను కూడా కడగాలని ఆదేశించాడు. స్మోకింగ్ జోన్ నిబంధనను ఉల్లంఘించిన బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ రెజా, మహేష్, రవికృష్ణలను గార్డెన్ ఏరియాలో ఉన్న డ్రమ్ములోని నీరు కారిపోకుండా చేతి వేళ్లను అడ్డుపెట్టి ఆపాలని ఆర్డర్ వేశాడు. మైక్ను సరిగా ధరించకపోవడం, నిద్రపోవడం లాంటివి చేసిన తమన్నా, అషూరెడ్డి, హిమజ, వితికా, రోహిణిలకు మరో శిక్షను విధించాడు. తాను అనౌన్స్మెంట్ చేసిన ప్రతీసారి వారంతా స్విమ్మింగ్ పూల్లో దూకాలని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో హౌస్మేట్స్ దిమ్మతిరిగి దారిలోకి వచ్చి.. బిగ్బాస్ను క్షమించమని ప్రార్థించారు. మళ్లీ కొందరు మైక్ను సరిగా ధరించకపోవడం, తెలుగులో కాకుండా వేరే భాషలో మాట్లాడటంతో రెండు మూడు సార్లు అనౌన్స్చేశాడు. బిగ్బాస్ అనౌన్స్మెంట్స్తో తమన్నా, అషూరెడ్డి, హిమజ, వితికా, రోహిణిలు స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ఉన్నారు. బిగ్బాస్లో మూడో వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది. ఈ వారంలో నామినేషన్స్ బహిరంగంగా పెట్టడం ఓ చిచ్చు పెడితే.. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ రక్తాన్ని కల్లజూసింది. నిధిని దోచుకోవడానికి డంబెల్తో అద్దాలను పగలగొట్టడం.. రవి కృష్ణ కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. చేతికి తీవ్ర గాయం కావడం.. శ్రీముఖికి శిక్షను విధించడం హైలెట్గా నిలిచాయి. వీకెండ్ వచ్చింది.. హౌస్మేట్స్తో పాటు బిగ్బాస్ ప్రేక్షకులను అలరించేందుకు నాగ్ రానున్నాడు. మరి ఈ వారంలో నామినేషన్లో ఉన్న బాబా భాస్కర్, తమన్నా, వితికా, రాహుల్, పునర్నవిల్లో ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. హౌస్ నుంచి తమన్నా ఎలిమినేట్ కానుందని ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న వేళ అసలు ఏం జరుగుతుందో చూడాలి. -
దొంగలున్నారు జాగ్రత్త!
బిగ్బాస్ హౌస్లో దొంగలు పడ్డారు.. అదేంటీ అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా?. దొంగలు అంటే నిజమైన దొంగలు కాదులేండీ!. టాస్క్లో భాగంగా హౌస్మేట్స్లో కొందరు దొంగలుగా, మరికొందరు పోలీసులుగా మారారు. ఇక ఈ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్లో.. హౌస్మేట్స్ తమ వద్ద ఉన్న డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలని టాస్క్ ఇచ్చినట్లు కనబడుతోంది. మొన్నటి వరకు గొడవలు, అలకలు, అరుపులు చూడగా.. నేడు ఓ టాస్క్తో హౌస్మేట్స్ మనముందుకు రానున్నారు. ఈ టాస్క్లో బాబా భాస్కర్ పోలీస్ ఆఫీసర్గా నటించనుండగా.. శ్రీముఖి మాత్రం కిలాడీలా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా.. బిగ్బాస్ హౌస్మేట్స్కు ఓ టాస్క్ను ఇచ్చాడు. ఇంట్లో కొందరు దొంగలు పడ్డారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే కెప్టెన్సీ అవుతారని బిగ్బాస్ టాస్క్ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఇంటి సభ్యులంతా తమ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ టాస్క్లో భాగంగానే వరుణ్ సందేశ్ను మాటల్లో పెట్టి అతని వద్ద ఉన్న డబ్బును శ్రీముఖి కాజేసింది. నేటి ఎపిసోడ్కు సంబంధించి రిలీజ్ చేసిన ఈ ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇలాంటి దొంగతనాలు, మాయమాటలు హౌస్లో ఇంకెన్ని జరుగుతాయో చూడాలి. (పునర్నవి.. లేడీ టైగర్ : తమన్నా) Dongalunnaru Jagratta 😀 #CaptaincyTask#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/HFzWBjC8R0 — STAR MAA (@StarMaa) August 6, 2019 #VarunSandesh ni mosam chesina #SreeMukhi 😜 😀 #CaptaincyTask#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/1jzer4V4Je — STAR MAA (@StarMaa) August 6, 2019 మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్బాస్ హౌస్లో వంటగ్యాస్, నీళ్లు కట్
బిగ్బాస్ ఇంట్లో నీళ్లకు, గ్యాస్, హౌస్ యాక్సరిస్కు కోతపెట్టేశాడు. అవసరానికి మించి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంటి సభ్యులకు చూపించాడు. మళ్లీ నీళ్లు రావాలన్నా.. గ్యాస్ కావాలన్నా సైకిల్ తొక్కుతూనే ఉండాలి. రాత్రి కూడా తొక్కుతూనే ఉండాలని.. లేకుంటే రాత్రంగా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయని తెలిపాడు. శివజ్యోతి టాస్క్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఇంటి సభ్యులతో చెప్పడం, రవికృష్ణ ఏదో అన్నాడని తమన్నా అలగడం, జాఫర్, మహేష్, బాబా భాస్కర్, తమన్నాలు కలిసి శ్రీముఖి గురించి మాట్లాడుకోవడం హైలెట్గా నిలిచాయి. సైక్లింగ్ టాస్క్ ఇంట్లో చిచ్చు పెట్టింది. గ్యాస్, నీళ్లు, హౌస్ యాక్సరీస్ కోసం సపరేట్గా మూడు సైకిళ్లు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బిగ్బాస్.. ఏ సైకిల్ తొక్కితే దానికి సంబంధించినవి నిరంతరాయంగా వస్తాయని తెలిపాడు. మూడు సైకిళ్లను విరామం లేకుండా తొక్కితూ ఉంటే మిగతా వాళ్లు వారి కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నారు. అక్కడ గ్యాస్కు సంబంధించిన సైకిల్ను పునర్నవి తొక్కినంత సేపు వంట గదిలో దోశలు వేస్తూ వితిక బిజీగా ఉంది. అందరూ కలిసి లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. టాస్క్లో పార్టిసిపేట్ చేయోచ్చుగా అని వితికాను ఉద్దేశించి పునర్నవి అనడంతో పెద్ద రచ్చ జరిగింది. నేను కూడా టాస్క్లో ఉన్నానని 35,40 దోశలు వేశానని తెలిపింది. ఇలా మాటామాటా అనుకుంటూ.. తాను సైకిల్ తొక్కుతూ ఉంటేనే దోశలు వేశావని.. పునర్నవి అంది. నువ్వు తొక్కకపోతే వేరేవాళ్లు తొక్కేవారని వితికా అనగా.. దోశలు కూడా నువ్వు వేయకపోతే వేరేవాళ్లు వేసేవారని వరుణ్ కౌంటర్ ఇవ్వడంతో వితికా ఆగ్రహించింది. తనకు గానీ, పునర్నవికి గానీ సపోర్ట్ ఇవ్వకు అని వరుణ్నుద్దేశింది వితిక పేర్కొంది. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడతానని వరుణ్ తెలిపాడు. ఇదంతా జరుగుతుండగా.. పునర్నవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లి తనతో మాట్లాడూ అని వితికాను వరుణ్ కోరగా.. తానేమీ తప్పు చేయలేదని.. అలాంటప్పుడు తానెందుకు వెళ్లి మాట్లాడాలి అంటూ వరుణ్పై ఫైర్ అయింది. అలా ఆ గొడవ పెరుగుకుంటూ వితికా ఏడ్చే వరకు వెళ్లింది. అనంతరం ఇంటి సభ్యులు, వరుణ్ల ఓదార్పుతో కొంతసమయాన్ని గొడవ సద్దుమణిగింది. వరుణ్ తప్పు తనదేనంటూ క్షమాపణ చెప్పడంతో.. వితికా కూడా సారీ చెప్పింది. రాత్రి పడుకోవడానికే ఇప్పుడు తొక్కుతున్నానని శ్రీముఖి అనడం కరెక్ట్ కాదని ఇంటి సభ్యులకు అర్థమయ్యేట్లు శివజ్యోతి చెప్పడం.. ఐదు టీమ్స్గా అందరం విడిపోదామని సలహా ఇవ్వడం.. అలా అయితే అందరికీ అవకాశం వస్తదని చెప్పుకొచ్చింది. కానీ హౌస్మేట్స్ ఈ ప్రతిపాదనను స్వీకరించలేదు. తనకు దోశ విషయంలో చిన్న టెస్ట్ పెట్టామని.. ఈ టెస్ట్లో తమన్నా ఫెయిల్ అయిందని రవికృష్ణ సరదాగా అన్నాడు. ఆ మాటలకు తమన్నా ఫీల్ అవ్వడంతో.. ఆమెను రోహిణి, శివజ్యోతిలు ఓదార్చారు. బాబా భాస్కర్, జాఫర్, తమన్నా, మహేష్లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చర్చలో భాగంగా.. శ్రీముఖిని ఎవ్వరూ ఏం చేయలేరని తమన్నా చెబుతూ ఉంటే.. తను స్ట్రాటజీతో వచ్చిందని అనుకున్నాను కానీ అలాంటిదేం లేదు అంటూ జాఫర్ కూడా మాట కలిపాడు. మొదటి వారం తాను, శ్రీముఖి యాక్టివ్గా ఉన్నామని అయితే మా మాట వినడం లేదని ఈవారం వదిలేశామని మహేష్ కూడా వారితో కలిసి వంతపాడాడు. అందరూ నిద్రిస్తున్న వేళ.. హౌస్ యాక్సరీస్కు సంబంధించిన సైకిల్ను శివజ్యోతి తొక్కడం కాస్త ఆలస్యమయ్యే సరికి ఇంట్లో గంట మోగుతూ లైట్లు వెలిగాయి. దీంతో కొంతమంది లేచి సైకిల్ తొక్కే ఏరియాకు వచ్చారు. ఇక రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఏదో టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ టాస్క్లో శివజ్యోతి-వరుణ్ సందేశ్ల మధ్య గొడవ జరిగేట్టుంది. మరి ఆ సంగతి ఏంటో పూర్తిగా తెలియాలంటే బుధవారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. -
బిగ్బాస్.. భార్యాభర్తల మధ్య గొడవలు
బిగ్బాస్ హౌస్లో రెండో వారంలో హౌస్మేట్స్కు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డట్టున్నాయి. బాత్రూమ్లో నీళ్లు కరువయ్యాయి, వంట గదిలో గ్యాస్ అయిపోతోంది.. వీటన్నంటిని మళ్లీ పంపించాలంటే సైక్లింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. నిరంతరం సైకిల్ తొక్కుతూనే ఉండాలనే షరతు కూడా పెట్టాడు. ఇక హౌస్లో రగడ మొదలు కాకుండా ఉంటుందా? ఇంతవరకు ప్రేమగా ఉన్న జంటపక్షుల మధ్య గొడవ మొదలైనట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమోతో అర్థమవుతోంది. ఓ జంటను బిగ్బాస్ హౌస్లోకి పంపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదేనని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతుండగా.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కూడా దీనికి ఊతమిస్తోంది. తాను 35, 40 దోశలు వేశానని వితిక చెబుతుండగా.. ‘గ్యాస్ తొక్కకపోతే నువ్వు వేసేదానివి కాద’ని పునర్నవి పేర్కొంది. ‘నువ్వు కాకపోతే వేరే ఎవరైనా గ్యాస్ తొక్కేవారు’ అని వితికా అనగానే.. ‘నువ్వు కాకపోతే దోశలు వేరేవాళ్లు వేసేవార’ని వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. తనకు ఏది నిజమనిస్తే అటు వైపే ఉంటానని వరుణ్ తేల్చి చెప్పాడు. దీంతో వితిక కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తడం ప్రోమోలో కనిపిస్తోంది. మరి ఇంతకీ నిజంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే నేడు ప్రసారమయ్యే షో చూడాల్సిందే. -
బిగ్బాస్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో అంతా ఒక రకమైన వాతావరణం నెలకొంది. బాబా భాస్కర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనను అని అనడం.. అనంతరం బిగ్బాస్ ఆదేశాల మేరకు తప్పనిసరై ఇద్దరి సభ్యులను నామినేట్ చేయడం.. ఇంట్లో సభ్యులెవరైనా నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడితే నామినేట్ అవుతారని తెలపడం.. వరుణ్ సందేశ్-వితికాలు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియ అనుకుని వితికాను ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయించడం.. తనకంటూ ఓ గ్రూప్ను క్రియేట్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నట్లు తమన్నా కనపడటం.. సోమవారం ఎపిసోడ్లో హైలెట్గా నిలిచాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన తమన్నా ఇంట్లో కొందర్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చీ రావడంతోనే తమన్నా.. న్యాయనిర్ణేతగా మారినట్టు అనిపిస్తోంది. మహేష్-వరుణ్ సందేశ్ వ్యవహారం గురించి హౌస్లో ముచ్చటించింది. మహేష్ అలా సారీ చెప్పడం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే.. మహేష్కు సపోర్ట్ ఇచ్చేదాన్ని, మహేష్ను అలా చీప్ మెంటాల్టీ అనడం తనకు నచ్చలేదని బాబా భాస్కర్, జాఫర్, మహేష్, అలీ రెజా, శ్రీముఖిలతో చెప్పుకొచ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియలో కూడా తమన్నా వరుణ్-వితికాల పేర్లు చెప్పడం చూస్తే ముందుగానే ఓ ప్లాన్తో వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నారని, వారిద్దరిలో ఒకర్ని ఎలిమినేట్ చేసేందుకే ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నానని తెలిపింది. అయితే తనకు, మహేష్కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తోందని రాహుల్తో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్లో రెండో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక హిమజ- పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్.. వరుణ్ సందేశ్- జాఫర్, శ్రీముఖి.. అషూ-శ్రీముఖి, రాహుల్.. రాహుల్-హిమజ,శ్రీముఖి.. సావిత్రి- శ్రీముఖి,జాఫర్.. అలీ-హిమజ,వరుణ్ సందేశ్.. రవికృష్ణ-హిమజ, జాఫర్.. జాఫర్-వితికా, మహేష్.. రోహిణి-పునర్నవి, మహేష్.. మహేష్- వితికా, వరుణ్.. శ్రీముఖి-హిమజ, మహేష్.. పునర్నవి-హిమజ, శ్రీముఖి.. తమన్నా-వరుణ్ సందేశ్, వితికాలను నామినేట్ చేశారు. ఇక వీరిలో శ్రీముఖి,హిమజ ఐదు ఓట్లతో.. జాఫర్, మహేష్ విట్టా, వితికా, వరుణ్సందేశ్ మూడు ఓట్లతో.. పునర్నవి, రాహుల్ రెండు ఓట్లతో నామినేట్ అయ్యారు. రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్బాస్ తెలిపాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ ఎవర్నీ నామినేట్ చేయలేనని.. కావాలంటే తనను నామినేట్ చేసుకోండని బిగ్బాస్కు తెలిపాడు. అయితే నియమాల ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడు ఓ ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందేనని బిగ్బాస్ సూచించాడు. అయినా సరే బాబా భాస్కర్ వినకపోవడంతో ఆలోచించుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. మళ్లీ చివర్లో కన్ఫెషన్ రూమ్కు రావాలని కోరాడు. ఇక అందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లను బిగ్బాస్కు తెలిపారు. అయితే రెండో సారి కూడా బాబా భాస్కర్ ఎవర్నీ కూడా నామినేట్ చేయలేదు. ఈసారి బిగ్బాస్ రెండు అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు పేర్లు చెప్పి నామినేషన్ ప్రక్రియను ముగించడం.. లేదా.. ఇంటిసభ్యులందరితో చర్చించడం ఇంకొకటి. బాబా భాస్కర్ నామినేషన్స్లో ఎవరి పేరు చెప్పనందుకు.. ఇంటి సభ్యులందరూ నామినేషన్స్లో ఉండటం ఒక దారి లేదంటే అందరూ కలిసి బాబా భాస్కర్ను నామినేట్ చేయడం ఇంకోదారి అని బిగ్బాస్ సెలవిచ్చాడు. అయితే బాబా భాస్కర్ను తామెవ్వరమూ నామినేట్ చేయలేమని ముక్తకంఠంతో తెలిపారు. కావాలంటే.. అందరం నామినేషన్స్లో ఉంటామని ఏకతాటిపైకి వచ్చారు. అలా వద్దని.. కావాలంటే తానే ఓ ఇద్దరిని నామినేట్ చేస్తానని బాబా భాస్కర్ ముందుకు వచ్చాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్కు వెళ్లిన బాబా భాస్కర్.. వితికా, రాహుల్ను నామినేట్ చేశాడు. ఇక అంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని ప్రకటించి.. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్లు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారని తెలిపాడు. ఈ వారం ఇంటి సభ్యులు ఎవరు ఎలా ఆడతారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఈ ఎనిమిది మంది సభ్యుల్లోంచి ఎవరు నిష్క్రమిస్తారో తెలియాలంటే బిగ్బాస్ చూస్తూ ఉండాల్సిందే. -
వరుణ్ సందేశ్ను క్షమాపణ కోరిన మహేష్
వరుణ్ సందేశ్-మహేష్ మధ్య జరిగిన గొడవను సర్దిచెప్పేందుకు ఇంటి సభ్యులందరూ ప్రయత్నించారు. మహేష్ సైతం క్షమాపణ చెబుతానని తెలిపాడు. అయితే అందరూ కలిసి చర్చించేందుకు లివింగ్ రూమ్కు వచ్చాక మళ్లీ తారాస్థాయికి చేరింది. తాను ఏం చెప్పదలుచుకున్నానో అది బాబా భాస్కర్కు చెప్పానని, ఆయన అందరికీ అర్థమయ్యేలా చెపుతాడని మహేష్ అన్నాడు. దీంతో వరుణ్ సందేశ్ బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ వితికా వెళ్లి వరుణ్ను తీసుకొచ్చాక.. తాను కూడా శ్రీముఖికి అంతా వివరించానని తను చెప్పవల్సింది శ్రీముఖి చెబుతుందని వరుణ్ సందేశ్ కౌంటర్ విసిరాడు. ఇలా పెరుగుకుంటూ వెళ్తూ ఉన్న గొడవను ఇంటి సభ్యులందరూ కలిసి తగ్గించే ప్రయత్నం చేశారు. చివరకు తన తప్పులేకపోయినా.. సారీ చెబుతున్నానని అన్న తరువాత.. అలాంటి క్షమాపణ తనకు వద్దని వితికా తెలిపింది. ఆ తరువాత వితికాను వెళ్లిపోండి అని మహేష్ అనడంతో మళ్లీ గొడవ మొదలైంది. ‘ఆ విషయం మీరెలా చెబుతారు? నా ఇష్టం ఎక్కడైనా ఉంటా చెప్పడానికి మీరెవరు’ అంటూ మహేష్పై ఫైర్ అయింది. మళ్లీ గొడవ మొదటికొచ్చింది. ఇక వరుణ్ అందుకుని.. హౌస్లో సరిగా ఉండడని, టైమ్కు లేవడని, మధ్యాహ్నం పడుకుంటాడని మహేష్పై అసందర్భపు ఆరోపణలు చేశాడు. ఈ గొడవలో మళ్లీ శ్రీముఖిపై మహేష్ అరిచాడు. హిమజ కల్పించుకుని.. అంతా బాగానే చేశావు మళ్లీ చివర్లో ‘వెళ్లిపోండి’ అని అనడంతో మళ్లీ గొడవ మొదలైందని మహేష్కు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ముందునుంచీ బాబా భాస్కర్ ఈ గొడవను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. భార్య విషయంలో ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని మహేష్ తనతో చెప్పాడని.. ఒక్కసారి వెళ్లు సారీ చెబుతాడంటా అని వరుణ్ సందేశ్ను బుజ్జగించే ప్రయత్నం చేశాడు బాబా భాస్కర్. ఆ ప్లేస్లో తానుంటే ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యేవాడిని అంటూ వరుణ్ సందేశ్ను హగ్చేసుకుని సారీ చెప్పాడు మహేష్. ఇక ఇదే విషయాన్ని ఉదయం శివజ్యోతికి చెబుతూ.. వాళ్లిద్దరికి సారీ చెప్పిన తరువాతే నిద్ర పట్టిందని మహేష్ అన్నాడు. డైనింగ్ టేబుల్ వద్ద గొడవ శ్రీముఖి అతి మంచితనం ప్రదర్శిస్తూ.. బాబా భాస్కర్ ఉదయం నుంచి తినలేదని, ఈరోజు ఎగ్ తినడని, ఇంట్లో పండ్లు కూడా లేవని, ఇంకా బ్రష్ కూడా వేయలేదని, స్నానానికి వెళ్లాడని ఇలా ఓ పురాణం చెప్పుకుంటూ ఉండగా.. రాహుల్, వరుణ్ సందేశ్ ఫైర్ అయ్యారు. మధ్యలో హేమ కల్పించుకుంటూ.. ఈ చిన్న విషయానికి ఎందుకు అరుస్తున్నారని, కిచెన్లో ఉండే వారికి కొన్ని హక్కులు ఉంటాయని, అన్నీ అందరికీ వివరించాల్సిన పని లేదని, బాబా భాస్కర్కు కొంచెం ఫుడ్ ఉంచండని సూటిగా చెప్పు, అదంతా చెప్పాల్సిన పని లేదని శ్రీముఖికి హితవు పలికింది. అంత ఎక్కువగా విడమరిచి చెప్పకుండా.. బాబా భాస్కర్కు ఫుడ్ ఉంచడని చెబితే సరిపోతుందని సావిత్రి, హిమజలు శ్రీముఖికి సూచించారు. రెండు టీమ్లుగా విడిపోయిన ఇంటిసభ్యులు ఓ టాస్క్లో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా బిగ్బాస్ విడగొట్టాడు. ఆర్ట్స్ స్కూల్గా విభజించి ఒకదానికి శ్రీముఖిని, మరొక దానికి బాబా భాస్కర్ను లీడర్గా నియమించాడు. వీరంతా మంచి కాన్సెప్ట్స్తో ఆడుతూ, పాడుతూ బిగ్బాస్ను ఎంటర్టైన్ చేయవల్సిందిగా ఆదేశించాడు. ఈ రిహార్సల్స్లో బాబా భాస్కర్, జాఫర్లు చేసిన కామెడీ హైలెట్గా నిలిచింది. దీనిపై రిలీజ్ చేసిన ప్రోమో కూడా బాగా వైరల్ అయింది. ఇంట్లో సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తూ.. వారిద్దరూ కలిసి చేసిన స్కిట్ బాగుంది. దాంట్లో భాగంగానే బాబా భాస్కర్.. జాఫర్ను రా అని పిలవడం.. ఆయన సీరియస్ కావడం అంతా నాటకమే. శ్రీముఖి టీమ్ చేసిన స్కిట్ ఫన్నీగా, సో సోగా ఉండగా.. బాబా భాస్కర్ టీమ్ చేసిన స్కిట్ కాస్త ఎమోషనల్ టచ్గా అనిపిస్తుంది. ఓ కోట, గైడ్, రెండు జంటలు, దొంగతనం అంటూ ఏదో చేయడానికి శ్రీముఖి టీమ్ ప్రయత్నించగా.. రైతు, భూమి అంటూ ఓ మంచి కాన్సెప్ట్ ఎంచుకుని బాబా భాస్కర్ టీమ్ ఆలోచించేలా చేశారు. ఇక చివరకు శ్రీముఖి, రాహుల్ మాట్లాడుకుంటూ.. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ వద్ద జరిగిన గొడవ గురించి ప్రస్థావించుకున్నారు. మొత్తానికి ఈ రోజూ గొడవలతో పాటు కాస్త ఎంటర్టైన్మెంట్ లభించింది. ఇక రేపు కింగ్ నాగార్జున వచ్చి ఎవరికి ఎలా క్లాస్ పీకుతారో చూడాలి. ఎలిమినేషన్ను తప్పించుకుని ఎవరు సేఫ్జోన్లో ఉన్నారో రేపు ప్రకటించే అవకాశం ఉంది. -
నా భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు
వంట గదిలో వచ్చిన గొడవ ఇంకా చల్లారనే లేదు.. గురువారం నాటి ఎపిసోడ్లో ఇంకో మూడు గొడవలు వచ్చి పడ్డాయి. హేమ-రాహుల్ గొడవతో పాటు మరో మూడు గొడవలు కొత్తగా వచ్చి పడ్డాయి. తన చపాతి ని ఎవరో తినేశారని పునర్నవి, లగ్జరీ బడ్జెట్ టాస్క్ను సరిగా ఉపయోగించుకోలేదని మరో గొడవ, తన భార్యతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని మహేష్తో వరుణ్ సందేశ్ గొడవపడటం.. వీటితో ఎపిసోడ్ గడిచిపోయింది. మధ్యలో జాఫర్, హేమ, బాబా భాస్కర్, శ్రీముఖిలు చేసిన స్కిట్ కాస్త ఫన్ క్రియేట్ చేసింది. నా చపాతిని ఎవరో తినేశారు.. ట్విటర్లో గురువారం ట్రెండ్ అయిన విషయం ఇదే. దీనిపై లెక్కలేనన్ని మీమ్స్ క్రియేట్ చేసి ఫన్ జనరెట్ చేశారు నెటిజన్స్. పదిహేను మందికి పదిహేను చపాతిలు చేయగా.. అందులో తనకు సంబంధించిన చపాతి సగం మాత్రమే ఉందని పునర్నవి గొడవ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం సిల్లీగా ఉన్నా.. ఎవరు తన చపాతిని తిన్నారని ఇంటిసభ్యులను అడిగింది. అలీ తిని ఉండొచ్చని చెప్పగా అతనిపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టింది. తన చపాతిని అలీ రెజా సగం తినేశాడని, అలా ఎలా తింటాడని తిడుతుండగా.. అలీ వచ్చి తాను రాహుల్కు సంబంధించిన చపాతిని సగం తిన్నానని, తాను తిన్నాక మిగిలినదే ఆ సగం అని వివరించాడు. బాబా బాస్కర్ రెండు చపాతీలు తిన్నాడని, అదే తన చపాతి అని తెలిపాడు. దీంతో అలీకి పునర్నవి సారీ చెప్పగా.. కూర బాగుండటంతో రెండు చపాతీలు తిన్నానని పునర్నవితో ఫన్ క్రియేట్ చేశాడు బాబా భాస్కర్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇంటి సభ్యులందరూ కలిసి ఓ ఇద్దరి పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. జాఫర్, హేమలను హౌస్మేట్స్ ఎంచుకోగా .. వారిద్దరి స్విమ్మింగ్పూల్ వద్ద ఉన్న రెండు రూమ్స్లోకి ఇద్దరిని చెరొక రూమ్లోకి వెళ్లమని ఆదేశించాడు. ఆ రూమ్స్లో రెండు బటన్స్(రెడ్, గ్రీన్) ఉండగా.. బిగ్బాస్ అడిన వాటికి ఇద్దరు ఒకే బటన్(గ్రీన్) నొక్కితే లగ్జరీ బడ్జెట్లో పాలు, రెడ్ బటన్ నొక్కితే గుడ్లు లభ్యం కావని, ఇద్దరూ వేర్వేరుగా బటన్స్ నొక్కాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే ఆ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసినా.. గొడవలు మాత్రం తప్పలేదు. మొదటి సారి లగ్జరీ బడ్జెట్ ఇస్తే.. దాన్ని ఉపయోగించుకోవడంలో ఇంటి సభ్యులు పూర్తిగా విఫలమయ్యారు. తలా ఒకరికి 200 పాయింట్లు ఇవ్వగా.. కనీసం 1500పాయింట్లను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మహేష్, హేమలకు టీవీ ఆపరేట్చేయడం రాకపోవడం, ఏయే సరుకులు కావాలో త్వరగా తేల్చుకోలేకపోవడంతో లగ్జరీ బడ్జెట్ వృథాగాపోయింది. అయితే దీనికి కారణం శ్రీముఖేనని.. పిలిచినా రాలేదని హేమ అనడంతో శ్రీముఖి ఫైర్ అయింది. తాను సరైన సమయానికే వచ్చానని, కానీ టీవీని సరిగా ఆపరేట్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. నా భార్యకు రెస్పక్ట్ ఇచ్చి మాట్లాడు : వరుణ్ సందేశ్ బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లే రూమ్ డోర్ వద్ద మహేష్ నిల్చున్నాడు. ఆ సమయంలో బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్తున్న తనతో అమర్యాదగా మాట్లాడని వితిక మొదలుపెట్టిన గొడవ పీక్స్కు వెళ్లింది. అంతకు ముందు కూడా ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడాడని వితికా తెలిపింది. అంతలో వరుణ్ సందేశ్ వచ్చి.. తన భార్యకు రెస్పక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ చేయి చూపిస్తూ మహేష్కు వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి వేలు చూపిస్తున్నావంటూ మహేష్ సైతం వరుణ్ మీదకు వచ్చాడు. కొడతావా? అంటూ వరుణ్ సందేశ్ సైతం.. మహేష్ వైపు వెళ్లాడు. అక్కడే ఉన్న రాహుల్, మహేష్కు సర్ది చెప్తుండగా.. అతనిపైకీ మహేష్ అంతెత్తున లేచాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.. సిగ్గులేనోడా అంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు. సో.. ఇలాగా ఎపిసోడ్ మొత్తం గొడవలతోనే నిండిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్లో కూడా ఇదే విషయం కొనసాగేలా కనపడుతోంది. -
హ్యాపీడేస్ నుంచి బిగ్బాస్ హౌస్లోకి
బిగ్బాస్లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు హౌస్లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్లో ఎలా ఉంటారు? టాస్క్లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి. వరుణ్ సందేశ్ జననం: 21 జూలై 1989 స్వస్థలం: రాయగడ, ఒరిస్సా విద్య: ఎంబీఏ తల్లిదండ్రులు: రమని జీడిగుంట్ల- విజయ్ సారధి భార్య: వితికా షెరు వృత్తి: నటుడు, నిర్మాత గుర్తింపునిచ్చింది: హ్యాపీడేస్ ప్రయాణం: 2007లో హ్యాపీడేస్తో చిత్రపరిశ్రమలోకి తెరంగ్రేటం చేశాడు. తర్వాత కొత్త బంగారు లోకంతో ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చాడు. కాకపోతే సినిమాల ఎంపికలో చేసిన తప్పిదాల వల్ల దాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రం కోసం గొంతు శృతి కలిపాడు. పెళ్లి: మరో చరిత్రలో సహనటి శ్రద్దా దాస్తో కొంతకాలం రిలేషన్షిప్ కొనసాగించాడు. తరువాత నటి వితికా షెరుతో ప్రేమలో పడటంతో 2016 ఆగస్టు 19న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నటించిన చిత్రాలు: కుర్రాడు, మరో చరిత్ర, ఏమైంది ఈ వేళ, చమ్మక్ చల్లో, డీ ఫర్ దోపిడీ, మామ మంచు అల్లుడు కంచు పలు చిత్రాల్లో నటించాడు. తెలియనివి: కళాంజలి స్టోర్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. ఇష్టమైన నటీనటులు: షారుఖ్ఖాన్, దీపిక పదుకునే, తమన్నా -
వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘‘దాడి’’ షూటింగ్ ప్రారంభం
-
13 రోజుల్లో పూర్తి
1983లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మర్లపులి’. డి.నరసింహా సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో, అర్చన ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్ర గీతాలను మరో హీరోయిన్ భాను చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, సంగీత దర్శకుడు బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మా చిత్రదర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా చిత్రం రూపొందింది. నా సంగీతంలో విడుదలవుతున్న ఈ చిత్రం పాటలు మంచి ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. తక్కువ సమయంలో అయినా మంచి క్వాలిటీతో తీశాం’’ అన్నారు.‘‘వరుణ్సందేశ్ పక్కన లీడు రోల్లో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు భాను. పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: యం.మురళీకృష్ణ. నిర్మాతలు: భీరం సుధాకర్ రెడ్డి, బి.భవానీ శంకర్, ఖమ్మం శ్రీను. -
కొత్తగా ఉంటుంది
‘‘మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో చాలా సినిమాలకు రామకృష్ణ సహాయ దర్శకుడిగా పని చేసాడు. తనలో మంచి ప్రతిభ ఉంది. ‘మర్లపులి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంలో కొత్తదనం కనిపిస్తోంది. అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుంది’’ అని నిర్మాత వాకాడ అప్పారావు అన్నారు. అర్చనవేద, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో వరుణ్సందేశ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మర్లపులి’. డి.రామకృష్ణ దర్శకత్వంలో భవానీశంకర్, బి.సుధాకర్ రెడ్డి, ఐ.యస్. దినకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. రామకృష్ణ, టీమ్కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు సురేందర్రెడ్డి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అర్చనవేద పాత్ర కొత్తగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నారామె. నటిగా మంచి గుర్తింపు వస్తుంది. వరుణ్ సందేశ్ పాత్ర మా సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. పోసాని పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు రామకృష్ణ. తాగుబోతు రమేష్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం బి.ఎస్. రెడ్డి, కెమెరా: ఎం. మురళీ కృష్ణ. -
'రాయల హారం' మూవీ స్టిల్స్
-
మరోసారి వార్తల్లో వరుణ్ సందేశ్ భార్య
-
ఇది సూసైడ్ కాదు
‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో నటిస్తున్నప్పుడు వరుణ్ సందేశ్–వితికా శేరు ప్రేమలో పడ్డారు. గతేడాది పెళ్లి చేసుకున్నారు.వచ్చే నెల 19తో వీళ్ల పెళ్లై ఏడాది అవుతుంది. ఈలోపు ‘వైవాహిక జీవితం బాగా లేకపోవడంతో వితిక సూసైడ్ అటెంప్ట్ట్’ అనే వార్త. అసలేం జరిగింది? బుధవారం సాయంత్రం దుబాయ్కి ప్రయాణమవుతున్న వితిక, అమెరికాలో ఉన్న వరుణ్తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. హాయ్ వితికా.. ఎలా ఉన్నారు? సూపర్ అండీ. ఇక్కడ అంతా క్షేమం (నవ్వేస్తూ). సూసైడ్ అటెంప్ట్ చేశారని సెన్సేషన్ క్రియేట్ చేశారు... నిద్రపట్టకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు నిద్రపడుతుంది. అంతసేపు నిద్రపోతానని తెలియక మా అమ్మగారు కంగారు పడిపోయారు. ఆ కంగారు ఇంత సెన్సేషన్ అవుతుందనుకోలేదు. అంతకుముందు టాబ్లెట్స్ వాడేవారా... పైగా ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లున్నారు.. స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. నేను, వరుణ్ అమెరికాలో ఉంటున్నాం. మా చెల్లెలు (పిన్ని కూతురు) ఓణీల ఫంక్షన్ ఉంటే, హైదరాబాద్ వచ్చాను. మా ఇంటి (వరుణ్–వితిక ఉంటున్న ఇల్లు)కీ, మా అమ్మగారింటికీ పెద్ద దూరం లేదు. జస్ట్ పది నిమిషాల్లో వెళ్లొచ్చు. అందుకే ఒంటరిగా ఉన్నాను. మన టైమింగ్స్, అమెరికా టైమింగ్స్ డిఫరెంట్ అని తెలిసిందే. ఇక్కడి టైమ్కి తగ్గట్టు అడ్జస్ట్ కావడానికి ఐదారు రోజులైనా పడుతుంది. నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం అదే. గురువారం దుబాయ్లో షూట్ ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఫేస్ బాగుండదు. దాంతో పాటు మెంటల్లీ కొంచెం స్ట్రెస్ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తే, ఆమె టాబ్లెట్ సజెస్ట్ చేసింది. మెడికల్ షాప్ నుంచి తెప్పించుకుని, వేసుకున్నాను. అది కూడా 0.5 మిల్లీగ్రామ్ టాబ్లెట్. అది పెద్ద డోస్ కూడా కాదు. కాకపోతే నేను నాలుగు వేసుకున్నాను. అందుకే ఎక్కువసేపు నిద్రపోయాను. హాస్పిటల్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటున్నానని అటు వరుణ్కీ, ఇటు మా అమ్మగారికీ ఫోన్ చేసి, చెప్పాను. ఆదివారం రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మాత్రలు వేసుకున్నాను. మా అమ్మగారు సోమవారం ఉదయం ఏడు గంటలకు ఫోన్ చేసింది. నేను మాంచి నిద్రలో ఉండటంతో తీయలేదు. దాంతో టెన్షన్ పడి, మా ఇంటికి వచ్చింది. ఎంత లేపినా నేను లేవకపోవడంతో బేగంపేటలో ఉన్న నా కజిన్కి ఫోన్ చేసింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నానో డాక్టర్స్కి కూడా తెలియదు కాబట్టి, ‘స్ట్టమక్ వాష్’ చేస్తామన్నారు. అమ్మ సరేనంది. జరిగింది ఇదే. ఆ రోజంతా హాస్పిటల్లో ఉండి, మంగళవారం డిశ్చార్జ్ అయ్యి, ఇంటికొచ్చాను. మీరు హాస్పిటల్లో ఉన్న ఫొటో ఎలా బయటికొచ్చింది? హాస్పిటల్కి వచ్చిన నా ఫ్రెండ్స్తో ‘వితిక హైపర్ గర్ల్ కదా.. ఎలా రిలాక్డ్స్గా పడుకుని ఉందో చూడండి’ అంటూ నా ఫొటో తీసి, మా ‘వాట్సాప్ గ్రూప్’లో పెట్టమన్నాను. మా యూఎస్ ఫ్రెండ్స్ అందరం కలిసి క్రియేట్ చేసుకున్న గ్రూప్ అది. మా గ్రూప్లో నా ఫొటో వచ్చే ముందే బయటికి వచ్చేసింది. వేరేవాళ్లేమైనా తీసి, పెట్టారేమో. ఆ ఫొటో చూసి, ‘ఇంకేముంది? మ్యారీడ్ లైఫ్ బాగాలేదట. అందుకే సూసైడ్ అటెంప్ట్ చేసింది’ అని వార్తలు మొదలయ్యాయి. మా లైఫ్ బాగుందని చెప్పడానికి చానల్స్ చుట్టూ తిరిగి, ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. వన్ ఇయర్ కూడా దాటని మీ మ్యారీడ్ లైఫ్ ముచ్చట్లు? యాక్చువల్గా మాది మూడేళ్ల అనుబంధం. పెళ్లికి ముందు రెండేళ్లు ప్రేమించుకున్నాం. ఒకర్నొకరు అర్థం చేసుకున్నాకే, పెళ్లి చేసుకున్నాం. మా మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు. నరేశ్ అన్న (‘అల్లరి’ నరేశ్), ఇంకా ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మా మ్యారీడ్ లైఫ్ ఎంత బాగుందో వాళ్లందరికీ తెలుసు. ఇంతకు ముందు ‘మెంటల్ స్ట్రెస్’ అన్నారు. అంత స్ట్రెస్ ఎందుకు? అమెరికా నుంచి వచ్చాక చెల్లెలి ఫంక్షన్ కోసం షాపింగ్ చేశాం. అలాగే, యూఎస్ నుంచి ఓ ఫ్రెండ్ వస్తే, తనకు ‘వెల్కమ్ బ్యాక్ పార్టీ’ ఎరేంజ్ చేశాం. ఫంక్షన్, పార్టీ ఎరేంజ్మెంట్స్తో స్ట్రెస్ అయ్యాను. ఓన్లీ మెంటల్ స్ట్రెస్ కాదు.. ఫిజికల్ స్ట్రెస్ కూడా. దాంతో పాటు నిద్ర పట్టకపోవడంతో అలసిపోయాను. ఎలాగూ సినిమాలు చేయడం లేదు... లైమ్లైట్ కోసమే ఈ హంగామా అంతా అని కొందరి ఊహ... అవునండీ. ఇలా అనుకుంటున్నారని నాతో కొంతమంది అన్నారు. లైమ్లైట్ కోసం ఎవరైనా లైఫ్ని రిస్కుల్లో పెడతారా? లైమ్లైట్నే కోరుకుంటే నేను పెళ్లెందుకు చేసుకుంటాను? నాకిప్పుడు 23 ఏళ్లు. అర్జెంటుగా పెళ్లి చేసేసుకుని సెటిలవ్వాల్సిన వయసు కూడా కాదు. వరుణ్ నాకు బెస్ట్ ‘సోల్మేట్’ అనిపించింది. అందుకని కెరీర్ ఏమవుతుందో అని ఆలోచించలేదు. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత సినిమాలు చేసినట్లనిపించలేదు.. కెరీర్ని సాక్రిఫైస్ చేశారా? లేదండీ. పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలివ్వడానికి పెద్దగా ఇష్టపడరు. నేను ఇంట్లో కూర్చుని వరుణ్కి వండి పెడుతూ ఉండిపోవాలనుకోవడంలేదు. అందుకే యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను. అంటే.. వంట చేయరా? బ్రహ్మాండంగా చేస్తా. వరుణ్ ఏది ఇష్టపడితే అది నేర్చుకుని మరీ వండి పెడతాను. తన కోసం కుక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పర్సనల్లీ హ్యాపీ.. కానీ, కెరీర్ వైజ్గా వరుణ్ వెనకపడిపోయారేమో...? ఇప్పటివరకూ తను 20 సినిమాలకు పైగా చేసినా, చెప్పుకోదగ్గవి నాలుగైదు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇకనుంచి ఏ సినిమా పడితే అది చేయకుండా, ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ వస్తేనే చేయాలని వరుణ్ ఫిక్సయ్యాడు. మాకు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. సినిమా ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఉంది. బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి మమ్మీ–డాడీ ప్లాన్ ఎప్పుడు? (నవ్వుతూ). వచ్చే నెల 20న మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్శరీ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది? అని ప్లాన్ చేసుకుంటున్నాం. పేరెంట్స్ అవ్వాలనే ప్లాన్ కూడా ఉంది. అది కూడా రెండేళ్ల లోపే మమ్మీ–డాడీ అవ్వాలనుకుంటున్నాం. వితిక లేకుండా నేను లేను – వరుణ్ సందేశ్ వితిక సూసైడ్ అటెంప్ట్ట్ చేశారంటే నమ్మారా? ఎప్పుడైనా మీరు చిరాకుగా మాట్లా డిన మాటలు, అలిగిన సందర్భాల వల్ల అలా చేసుకుందేమోనని భయపడ్డారా? ఏ కపుల్ మధ్య అయినా అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్. కానీ మా మధ్య అవి కూడా తక్కువే. అందుకని భయపడాల్సిన అవసరం నాకు లేదు. పైగా, నిద్రపట్టడంలేదు.. ‘స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటున్నా నానా’ (వరుణ్ని వితిక నానా అని పిలుస్తారు) అని నాకు చెప్పింది. నేను కూడా ఓకే అన్నా. వితిక నిద్ర పట్టక గింజుకుంటుంది. అది నాకు తెలుసు కాబట్టే, నిద్రమాత్రలు వేసుకుంటానంటే ఓకే అన్నాను. పైగా అదేం తనకు హ్యాబిట్ కాదు. వితికకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మీకు తెలుసు... కానీ, ఇలాంటి న్యూస్ విన్న తర్వాత తను లేని జీవితం ఎలా ఉంటుందనే ఊహ కలిగిందా? అమ్మో.. వితిక లేని జీవితమా? ఊహించలేనండీ. తను లేకుండా నేను లేను. నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ తను. వితిక సూసైడ్ చేసుకునేంత పిరికమ్మాయి కాదు. వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. మా బంధం చాలా బలంగా ఉంది. ముందు ముందు మరింత బలపడుతుందనే నమ్మకం ఉంది. మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉందని వితిక అన్నారు.. నేనూ అదే అంటున్నా. మా అమ్మవాళ్లింటికి వెళ్లొస్తానంటే సరే అన్నాను. అందుకే ఇండియా వచ్చింది. ఓ సిల్క్ హౌస్ యాడ్లో యాక్ట్ చేయడానికి దుబాయ్ వెళ్తోంది. షిర్డీ వెళ్లాలనుకుంటోంది. ఆ తర్వాత ఫ్రెండ్స్తో లదక్ వెళ్లి, అట్నుంచి అటు అమెరికా వచ్చేస్తుంది. నా సిస్టర్కి కొడుకు పుట్టాడు. ఆ బుజ్జిగాణ్ణి చూడటానికి హ్యూస్టన్ వెళ్లాను. మా లైఫ్ మీద మాకు ఫుల్ క్లారిటీ ఉందండీ. వియ్ ఆర్ హ్యాపీ. – డి.జి. భవాని చదవండి (ఇది సూసైడే) -
జేబు దొంగ ప్రేమ
అతనో జేబు దొంగ. ఫ్రెండ్స్తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. సరదాగా సాగుతున్న అతని జీవితంలో అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడు తుంది. ఆ సమస్య ఏంటి? దాన్నుంచి అతనెలా బయట పడ్డాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ 420’. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో యిన్ను చూడగానే ప్రేమలో పడతాడు హీరో. దొంగ అయిన అతని ప్రేమ ను ఆ అమ్మాయి ఒప్పు కుందా? లేదా? ఆ ప్రేమ ఎలాంటి మలుపు తిరిగిం దన్నది సస్పెన్స్. అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శోభారాణి. -
జేబు దొంగ ప్రేమ
‘అతనో 420. పెద్ద దొంగతనాలు చేయడు. చిన్న జేబు దొంగ. ఫ్రెండ్స్తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. ఆ టైమ్లో అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు?’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ 420’. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరి కుమార్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ‘‘ఇందులో చిల్లర దొంగగా కనిపిస్తా. ప్రేమలో పడ్డాక నా లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అనేది సినిమా. ప్రస్తుతం రామ్మూర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, రాఘవేంద్రరావు గారి శిష్యుడు సత్య నారాయణగారి డెరైక్షన్లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. -
'మిస్టర్ 420' గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్. గత కొంతకాలంగా ఈ యువ హీరో హిట్కు దూరంగా ఉన్నారు. తాజాగా 'మిస్టర్ 420' అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. చిత్ర ఆడియోను ఇదే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో 'మిస్టర్ 420' ధియేటర్లలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ చిత్రం అతని కెరీర్ను ఊపందుకునేలా చేస్తుందని భావిస్తున్నాడు. కాగా తను ప్రేమించిన వితికను వరుణ్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'పడ్డానండి ప్రేమలో మరి' చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించిన వితిక.. నిజ జీవితంలో కూడా అతని హీరోయిన్ అయిపోయింది. -
కొత్తజంటకు శుభాకాంక్షలు
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్.. ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించిన వితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్. హైదరాబాద్ శివారులోని అలంకృత రిసార్టు వేదికగా శుక్రవారం తెల్లవారుజామున వీరి వివాహం వైభవంగా జరిగింది. వధువు మెడలో మంగళ సూత్రం కట్టగానే ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకుని ప్రేమను వ్యక్తపరిచాడు ఈ యువ హీరో. దాంతో పురోహితుడితో సహా చుట్టూ ఉన్న బంధుగణమంతా ముసిముసి నవ్వుల్లో మునిగిపోయారు. కాగా వివాహానికి హాజరుకాలేకపోయిన మోహన్ బాబు ఆదివారం వరుణ్ సందేశ్ స్వగృహానికి చేరుకుని నూతన వధూవరులకు ఆశీస్సులను అందజేశారు. కలెక్షన్ కింగ్ రాకతో పెళ్లికొడుకు సంతోషంలో మునిగిపోయాడు. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. వరుణ్.. మోహన్ బాబుతో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో కలిసి నటించారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల నుంచి వరుణ్ సందేశ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Mohan Babu Sir came home n gave his Blessings to Us:-) Very sweet of u Sir!!! Thanx 4 ur unflinching affection:-):-) pic.twitter.com/f0LJz91mNj — Varun Sandesh (@iamvarunsandesh) 21 August 2016 -
కల్యాణ వైభోగమే...
‘గురువారం మార్చి ఒకటి.. సాయంత్రం ఫైవ్ ఫార్టి తొలిసారిగా చూశానె నిన్ను..’ అని ‘దూకుడు’లో మహేశ్బాబు-సమంత కాంబినేషన్లో వచ్చిన పాట గుర్తుండే ఉంటుంది. మరి.. అనుకృతీ శర్మను నటుడు జేడీ చక్రవర్తి తొలిసారి ఎప్పుడు చూశారో తెలియదు కానీ, గురువారం ఆగస్టు పద్దెనిమిదిన పెళ్లి చేసుకున్నారు. అలాగే, వరుణ్ సందేశ్, వితాకా శేరుల వివాహం కూడా అదే రోజు జరిగింది. సీనియర్ నటుడు జేడీ.. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటే, యువనటుడు వరుణ్ మాత్రం వైభవంగానే చేసుకున్నారు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా, ‘ఏం ఆలోచించడంలేదు’ అని చెప్పుకుంటూ వచ్చారు జేడీ. అనుకృతీతో ప్రేమలో పడి, కుటుంబ సభ్యులను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. రామ్గోపాల్వర్మ ప్రకటించిన ‘శ్రీదేవి’ చిత్రంలో అనుకృతి కథానాయికగా నటించాల్సి ఉంది. శ్రీదేవి జీవితం ఆధారంగా ఆ సినిమా తీస్తానని వర్మ ప్రకటించడం, ఆ చిత్రం కొన్ని వివాదాలు ఎదుర్కోవడం, చివరికి ప్రారంభం కాకుండానే ఆగిపోవడం తెలిసిందే. ఏదైతేనేం అనుకృతీకి బోల్డంత పాపులార్టీ వచ్చింది. ఇక.. వరుణ్, వితికాల గురించి చెప్పాలంటే ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో జంటగా నటించిన సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించారు. గత ఏడాది డిసెంబర్ 7న వీరి ఎంగేజ్మెంట్ అయింది. గురువారం ఒకింటివారయ్యారు. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది
హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం వంటి సినిమాలతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో వరుణ్ సందేశ్ వివాహ తేదీ ఖరారయ్యింది. ఆగస్టు 18వ తేదీన తన ప్రియురాలు వితికా షేరును పెళ్లాడనున్నారు. 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించారు వితిక. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకునేసరికి నిజంగానే ఈ జంట ప్రేమలో పడిపోయింది. పెద్దల అంగీకారంతో గత డిసెంబరులో నిశ్చితార్ధం చేసుకున్న వీరు.. మరికొద్ది రోజుల్లో దంపతులు కానున్నారు. ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 3.14 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) వీరి వివాహం జరుగనుంది. హైదరాబాద్ శివారులోని తూముకుంట విలేజ్ సమీపంలో ఉన్న అలంకృత రిసార్టు ఈ వేడుకకు వేదిక కానుంది. -
డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం
చాలా రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్న వార్తలకు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. త్వరలోనే తన ప్రియురాలు వితికా షేరుతో నిశితార్థానికి రెడీ అవుతున్నట్టు అఫీషియల్గా ప్రకటించేశాడు. సోమవారం తన ట్విట్టర్ పేజ్పై వితికా షేరుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన వరుణ్.. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించాడు. హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తరువాత కొత్త బంగారులోకం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్కు దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఉదయం, ట్విస్ట్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనతో 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించిన వితికా షేరును పెళ్లాడనున్నాడు. Getting ENGAGED on DECEMBER 7th to the LOVE of my LIFE @IamVithikaSheru :-) #HappyDays God Bless!!! pic.twitter.com/ucf9AMHuqM — Varun Sandesh (@iamvarunsandesh) November 30, 2015 -
ఇది అల్లరి మొగుడు-2లా ఉంటుంది -మంచు విష్ణు
మోహన్బాబు, అల్లరి నరేశ్ కథానాయకులుగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’. మీనా, రమ్యకృష్ణ, పూర్ణ కథానాయికలు. కోటి, అచ్చు, రఘు కుంచె స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రం పాటలను పార్లమెంట్ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించి, మాజీ మంత్రి దానం నాగేందర్కు అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే... నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేశాడు! - మోహన్బాబు ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ తీయాలని ఏడాదిన్నర పాటు నన్ను వెంటాడారు కో డెరైక్టర్ రవి. అలా ఈ సినిమా తెర మీదకు కొచ్చింది. రమ్యకృష్ణను హీరోయిన్గా తీసుకోవద్దని చాలామంది చెప్పారు. అప్పట్లో ఆ అమ్మాయి కారణంగా కలిసొచ్చి, ‘అల్లుడుగారు’ హిట్ అయ్యుండవచ్చు. మీనా డేట్స్ ‘అల్లరి మొగుడు’ టైంలో దొరకలేదు. దర్శకుడు క్రాంతికుమార్ గారు సంపాదించారు. వీరిద్దరూ నాకు బంగారం లాంటి వాళ్లు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈవీవీ సత్యనారాయణ గారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసుడు నరేశ్ ఈ సినిమాలో నన్ను డామినేట్ చేయాలని చూశాడు. నేను కూడా అతనికి పోటీగా చేశా. ఆయనతో సినిమా అంటే భయమేసింది - శ్రీనివాస రెడ్డి మోహన్బాబు గారితో సినిమా అంటే భయమేసింది. కానీ సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇక ‘అల్లరి మొగుడు’ కాంబినేషన్ను ఈ సినిమాలో రిపీట్ చేశాం. వాళ్ళను ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది - విష్ణు నరేశ్ చేయాల్సిన పాత్ర నాదే. నేను చేస్తే నాన్నగారు చేయలేరు. అందుకే నరేశ్ని అడిగా. ఇది ‘అల్లరి మొగుడు’ పార్ట్-2లా ఉంటుంది. రమ్యకృష్ణ, మీనా గార్లను ఈ సినిమా కోసం ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది. నాన్నగారు హాయిగా సినిమాలో నటించడానికి కారణం అలీగారే. మా కామెడీ రచ్చరంబోలా - అల్లరి నరేశ్ మోహన్బాబు గారిది, నాది - మా ఇద్దరి కామెడీ టైమింగ్ రచ్చ రంబోలా. ఇండస్ట్రీకి వచ్చాక ఐదు సినిమాలు చేస్తానా అనుకున్నా. 50 చేశా. ఇలాంటి మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం! - అంబరీష్ లైఫ్లో డబ్బులు సంపాదించడం కష్టం కాకపోవచ్చేమో కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అలాంటి మిత్రుడే మోహన్బాబు. ‘అల్లుడు గారు’ లేకపోతే... - రమ్యకృష్ణ నా ఫస్ట్ హిట్ ‘అల్లుడుగారు’. అది లేకపోతే ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా వద్దనుకున్నా! - మీనా అసలు ఈ సినిమా వద్దనుకున్నా. నాకు పాప ఉందని చెప్పా. మోహన్బాబుగారు, విష్ణుగారు ఇచ్చిన భరోసాతో ఈ సినిమాలో చేశాను. ఈ వేడుకలో సుబ్బరామిరెడ్డి, బ్రహ్మానందం, కోటి, సుమలత, బి. గోపాల్ తదిత రులు పాల్గొన్నారు. -
వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి!
‘పడ్డానండి ప్రేమలో మరి’... వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం ఇది. ఈ ఇద్దరూ ఏ ముహూర్తాన ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారో కానీ, రీల్ కోసం ప్రేమించుకోవడం మొదలుపెట్టి రియల్గా కూడా ప్రేమలో పడిపోయారు. కొన్ని రోజులుగా వరుణ్ సందేశ్, వితికా లవ్లో పడ్డారనే వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని ‘సాక్షి’కి తెలిపారు వితికా శేరు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సమయంలోనే వరుణ్, తానూ ప్రేమలో పడ్డామని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి సీక్రెట్గా సాగిన వీళ్ల లవ్స్టోరీ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. అదే నిశ్చితార్థానికి దారి తీసింది. మీడియాలో వచ్చిన వార్తలు తెలుసుకున్న వరుణ్, వితికాల కుటుంబ సభ్యులు ఇద్దరితోనూ మాట్లాడారు. ఈ లవ్ బర్డ్స్కి పెద్దల సమ్మతం కూడా లభించేసింది. వచ్చే నెలలో నిశ్చితార్థం జరపాలనుకుంటున్నారు. నవంబరులో ఉంగరాలు మార్చుకోనున్న ఈ ప్రేమికులు వచ్చే ఏడాది నవంబరులో పెళ్లి పీటల మీద కూర్చుంటారు. త్వరలో నిశ్చితార్థ తేదీని ప్రకటిస్తారు. ఆ వేడుక రోజే వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. -
హీరోయిన్ ప్రేమలో టాలీవుడ్ లవర్ బాయ్
హైదరాబాద్: టాలీవుడ్ లవర్ బాయ్ వరుణ్ సందేశ్ పెళ్లిపీటలు ఎక్కేందుకు సమాయత్తమవుతున్నాడు. హీరోయిన్ వితిక షెరును అతడు పెళ్లాడనున్నాడు. ఈ ఏడాది విడుదలైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ' తామిద్దరం ప్రేమించుకుంటున్నామని వరుణ్, వితిక తమ తమ కుటుంబాలకు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలు కలుసుకుని మాట్లాడుకున్నాయి. వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించాయ'ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే వరుణ్, వితిక నిశ్చితార్థం జరిగే అవకాశముందని వెల్లడించాయి. దీనిపై ప్రకటన చేసేందుకు సరైన సమయం కోసం వీరిద్దరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాయి. 'హ్యపీడేస్'తో చిత్రరంగ ప్రవేశం చేసిన వరుణ్ సందేశ్.. కొత్తబంగారు లోకం, ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరోచరిత్ర, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్పు కాఫీ, చమ్మక్ చల్లో, సరదాగా అమ్మాయితో తదితర సినిమాల్లో నటించాడు. -
జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: వరుణ్ సందేశ్ (నటుడు);మధుశాలిని (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది కాబట్టి ఈ సంవత్సరం సంపూర్ణత, సంతృప్తి, కార్యసిద్ధికి సంకేతంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 21 (2=1=3). ఇది దేవ గురువైన బృహస్పతికి సంబంధించినది కాబట్టి స్నేహశీలిగా, మంచి సలహాదారుగా సంఘంలో పేరు వస్తుంది.ఈ సంవత్సరం బృహస్పతి, కుజుల కలయిక వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను మంచి ప్లానింగ్తో, ధైర్యసాహసాలతో చేసి బాగా అభివృద్ధి సాధిస్తారు. కార్యదక్షులుగా, సమర్థులుగా గుర్తింపు వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, విద్యారంగం, క్రీడారంగాలలోని వారికి బాగుంటుంది. సంగీతం, లలిత కళలలో ప్రవేశం ఉన్న వారు బాగా రాణిస్తారు. లక్కీ నంబర్స్: 1,3,9; లక్కీ కలర్స్: ఎల్లో, రెడ్, పింక్, సిల్వర్; లక్కీడేస్: ఆది, మంగళ, గురువారాలు. లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, అక్టోబర్; సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, గురువులను, మతపెద్దలను గౌరవించడం మంచిది. అయితే కుజుడి దుష్ర్పభావం వల్ల పదునైన ఆయుధాల వల్లగానీ, వాహనాల వల్లగానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే దూకుడుగా మాట్లాడటం వల్ల నష్టం జరగవచ్చు. అందువల్ల ఆయా విషయాలలో అప్రమత్తత అవసరం. - డాక్టర్ మహ్మద్ దావూద్ -
నాకు ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు...
వరుణ్ సందేశ్.. చిన్నారులకు, యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తొలి చిత్రంతోనే యూత్ను ఆకట్టుకున్న కుర్ర హీరో. చిన్నప్పుడు వేసవి సెలవులను ఎలా ఎంజాయ్ చేశారో ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘సవ్ముర్ అంటే వూకు ‘హ్యాపీడేసే’. అమెరికాలో చదువుకొనే రోజుల్లో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల కోసం అమ్మా, నేను, మా చెల్లెలు తప్పనిసరిగా హైదరాబాద్ వచ్చేవాళ్లం. ఉద్యోగరీత్యా నాన్న ప్రతి సంవత్సరం రావడానికి వీలయ్యేది కాదు. అలా ప్రతి యేటా ఒక నెల రోజులు హైదరాబాద్లో నానమ్మ, తాతయ్య దగ్గర, మరో నెల వైజాగ్ సీతమ్మధారలో అమ్మమ్మ వాళ్లింట్లో గడిపేవాళ్లం. హైదరాబాద్ వచ్చామంటే నానమ్మ, తాతయ్యతో కలిసి టూర్లు తిరిగే వాళ్లం. షిరిడీ, తిరుపతి మా పర్యటనలో తప్పనిసరిగా ఉండేవి. వైజాగ్లో నా ప్రపంచమంతా ఆర్కే బీచ్. చాలాసేపు అక్కడే గడిపేవాణ్ని. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సవ్ముర్ సందడిలో అసలు సమయమే తెలిసేది కాదు. అప్పుడే సెలవులు అయిపోయాయా.. అనిపించేది. హైదరాబాద్లో మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి, బాబాయ్ శ్రీధర్కు ఎక్కడికి వెళ్లినా జనం ఫాలోయింగ్ ఉండేది. చాలా మంది ఆసక్తిగా చూసేవారు.. దగ్గరకు వచ్చి పలకరించేవాళ్లు. అదంతా నాకు ఎంతో ఇంట్రస్ట్గా అనిపించేది. బాబాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. వారినలా చూసినప్పుడు నాక్కూడా జనం ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు అనిపించేది. అమెరికాలో ఉన్న రోజుల్లో బాస్కెట్బాల్ బాగా ఆడేవాణ్ని. లెవెంత్ క్లాస్ పూర్తయ్యాక ‘హ్యాపీడేస్’ సినిమా కోసం హైదరాబాద్ వచ్చేశా. తరువాత ‘కొత్త బంగారు లోకం’ తెలిసిందే కదా’..! -
ఈ బాలుడు రాముడేనా..?
రణధీర్, గౌతమి జంటగా త్రిపుర సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. సంపత్రాజ్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ప్రముఖ సింగర్ బాబా సెహగల్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. అతిథుల్లో ఒకరైన వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రణ ధీర్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనికి మంచి పేరు తీసుకువస్తుంది’’ అన్నారు . ఈ వేడుకలో కృష్ణుడు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ , ఆదర్శ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కరు కాదు ఇద్దరు!
వరుణ్ సందేశ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవ కుశ’. సంగారెడ్డిపేట ప్రకాశ్, వి.సత్యమోహన్రెడ్డి, ఎ.పండుబాబు ఈ చిత్రానికి నిర్మాతలు. జయ్ శ్రీ శివన్ దర్శకుడు. రామ్ నారాయణ్ స్వరాలు అందించారు. హైదరాబాద్లో జరిగిన పాటల వేడుకలో ఆడియో సీడీని హీరో నాని ఆవిష్కరించారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో అన్ని అంశాలు బాగా కుదిరాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంద’’ని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగశౌర్య, రిచా పనయ్, ప్రభాస్ శ్రీను, కాసర్ల శ్యామ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
లవకుశ ఆడియో విడుదల
-
విలన్గా బ్రహ్మానందం
బ్రహ్మానందం ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని నవ్వించేస్తారు. మరి.. ఆయన విలన్గా చేస్తే? ఎలా ఉంటుందో ‘లవకుశ’ చిత్రంలో చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా జయశ్రీ శివన్ దర్శకత్వంలో సంగారెడ్డి పేట ప్రకాశ్, వి. సత్యమోహన్రెడ్డి, పండుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ‘‘నేను తొలిసారి రెండు పాత్రలు చేసిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బ్రహ్మానందంగారిని సంప్రదించినప్పుడు ఇప్పటికి వెయ్యి సినిమాలకు పైగా చేశా.. ఏదైనా వెరైటీ కారెక్టర్ ఉంటే చెప్పమన్నారు. ఈ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు’’ అని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో శేఖర్ విఖ్యాత్, కాసర్ల శ్యామ్, రామ్నారాయణ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. -
అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా...
‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ చేసే ప్రయాణంలో చోటు చేసుకునే అనూహ్యమైన మలుపులతో ‘పడ్డా నండి ప్రేమలో మరి’ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా విజయంపై నమ్మకంతో అమెరికాలో నేను పంపిణీ చేస్తున్నాను’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. యాక్షన్ అంశాలు మేళవించిన ఈ ప్రేమకథ అని వర్గాలనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. తదుపరి చిత్రం ‘లవకుశ’ చెబుతూ ‘‘ఇందులో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నా. తెలంగాణ, ఆంధ్రా కుర్రాళ్లుగా నేను కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. -
ఆకట్టుకుంటుంది!
వరుణ్సందేశ్, వితికాశేరు జంటగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’. పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించారు. మహేశ్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్సందేశ్ మాట్లాడుతూ -‘‘నా ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ చిత్రాల తరహాలోనే ఇది కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
‘పడ్డానండి ప్రేమలో మరి’ స్టిల్స్
-
విజయవాడ సూపర్బ్
CHITCHAT ‘సాక్షి’తో యువహీరో వరుణ్ సందేశ్ ‘హ్యాపీడేస్’ సినిమాతో తన హ్యాపీడేస్ను మొదలుపెట్టి.. ‘కొత్తబంగారులోకం’తో తన సినీ జీవితాన్ని బంగారుమయం చేసుకుని.. ‘కుర్రాడు’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్ తాజాగా ‘పడ్డానండి ప్రేమలో మరి..’ అంటూ ప్రేమికుల రోజున మన ముందుకు రాబోతున్నాడు. కేబీఎన్ కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన నగరానికి వచ్చారు. విజయవాడ సూపర్బ్.. అంటూ నగర వాతావరణాన్ని, నగరవాసులను మెచ్చుకున్న యువహీరో వరుణ్ సందేశ్తో ‘సాక్షి’ చిట్చాట్. - వన్టౌన్ సాక్షి : న్యూజెర్సీ నుంచి తెలుగ చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు? వరుణ్ : మేము తెలుగువాళ్లమే అరుునా న్యూజెర్సీలో స్థిరపడ్డాం. మా తాతగారు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ సాహితీవేత్త. మా బాబాయ్ జీడిగుంట శ్రీధర్ నటుడు. ఈ క్రమంలోనే నాకు నటనపై ఆసక్తి కలిగింది. ‘హ్యాపీడేస్’ చిత్రం కోసం శేఖర్కమ్ముల కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తుండగా, నేనూ ప్రయత్నించి విజయం సాధించా. సాక్షి : మీకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు..? వరుణ్ : హ్యాపీడేస్, కొత్తబంగారులోకం నాకు మంచి బ్రేక్నిచ్చారుు. మరికొన్ని సినిమాలు నటుడిగా నిలదొక్కుకోవడానికి సహాయపడ్డాయి. ఏదిఏమైనా జీవితం హ్యాపీగానే నడుస్తోంది. సాక్షి : ఇటీవల ఒకటి రెండు చిత్రాలు మీకు నిరాశ మిగిల్చినట్లున్నారుు..? వరుణ్ : అవును. కారణాలు ఏమైనా ఒకటి రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంత నిరాశ కలిగిన మాట వాస్తవమే. సాక్షి : కారణాలు ఏమని భావిస్తున్నారు. వరుణ్ : కారణాలు చాలానే ఉన్నారుు. ఏ సినిమా అరుునా ప్రేక్షకులకు నచ్చాలనే కదా తీసేది. అరుుతే, అందులోని కొన్ని అంశాలే నిరాదరణకు గురవుతున్నారుు. ఇకపై అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతా. సాక్షి : మీ కొత్త సినిమాలేమిటి? వరుణ్ : రామచంద్రప్రసాద్ మహేష్ దర్శకత్వంలో నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీని కూడా విజయవాడలోనే నిర్ణయించుకున్నాం. మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాం. సాక్షి : ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్ర కథాంశం ఏమిటి? వరుణ్ : లవ్స్టోరీనే అరుునా యూక్షన్తో సాగుతుంది. కుటుంబమంతా కలిసి చక్కగా చూడొచ్చు. ప్రతి మనిషీ ‘మానవత్వం’ కలిగి ఉండాలనే సందేశాన్ని ఇందులో చెప్పాం. సాక్షి : మీ కొత్త ప్రాజెక్టులు.. వరుణ్ : ‘లవకుశ్’, ‘లైలా ఓ లైలా’ షూటింగ్ జరుగుతోంది. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సాక్షి : కథ ఓకే అరుుతే మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా? వరుణ్ : మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. నేను స్టార్ అని అనుకోవట్లేదు. నటుడిగానే భావిస్తున్నాను. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్బాబు, మనోజ్ సోదరులతో కలిసి చేశాను. అలాగే, ‘డి ఫర్ దోపిడీ’లో సందీప్కిషన్తో కలిసి నటించా. కథ కుదిరితే మల్టీస్టారర్లో తప్పక నటిస్తా. విజయవాడ ఎలా ఉంది? విజయవాడ సూపర్బ్. గతంలో నాలుగైదు సార్లు ఇక్కడకు వచ్చాను. బుధవారం రాత్రి కేబీఎన్ కళాశాల మేనేజ్మెంట్ మీట్లో పాల్గొన్నాను. విద్యార్థులంతా నన్ను చక్కగా ఆదరించారు. మొదటిసారిగా కనక దుర్గమ్మను దర్శించుకున్నాను. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. -
నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్
‘‘వరుణ్ సందేశ్ చేసే సినిమాలన్నీ బాగుంటాయి. మనింటి కుర్రాడిలా అందరికీ కనెక్ట్ అవుతాడు. అందుకే, తనంటే ఇష్టం. ‘అరుంధతి’లో నటించిన అరవింద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్గా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఖుద్దూస్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ‘అల్లరి’ నరేశ్ సీడీని ఆవిష్కరించి, భీమనేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఈ వేడుకలో దశరథ్, మెహర్ రమేశ్, శివబాలాజీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ పాత్ర వినూత్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రం’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో కొన్ని నిరాశపరిచాయి. కానీ, ఈ సినిమా మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకం ఉంది. నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది’’ అని చెప్పారు. యువతరానికి కావల్సిన అంశాలతో రూపొందిన చిత్రం ఇదని నిర్మాత తెలిపారు. -
ఇది యూత్ఫుల్ టైటిల్ : పూరి జగన్నాథ్
‘‘యువత మెచ్చే స్థాయిలో ఈ చిత్రం ఉంటుందనుకుంటున్నాను. కచ్చితంగా ఇది మంచి విజయం సాధిస్తుంది. పేరు యూత్ఫుల్గా ఉంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. వరుణ్సందేశ్, వితికా శేరు జంటగా పాంచజన్య మీడియా పతాకంపై నల్లమటి రామచంద్రారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. మహేశ్ ఉప్పుటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని పూరి జగన్నాధ్ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
'ఈ వర్షం సాక్షిగా' టీంతో చిట్చాట్