works
-
పని లేదు.. తిండి లేదు.. ఊరెళ్ళిపోతోంది
-
చర్లపల్లి తరహాలో మరిన్ని స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.పెద్ద స్టేషన్లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.14 స్టేషన్లకు ఆధునిక హంగులుఅమృత్భారత్లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్కు చెందినవే కావటం విశేషం. అమృత్భారత్లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే.. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్పేట, హైటెక్సిటీ, ఉప్పుగూడ, మలక్పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ. -
బట్టీ వద్దే బడి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్ బృందం
-
లోకేశ్ కపట ప్రేమ!
తాడేపల్లిరూరల్: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే... 2014కు ముందు... ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్ చేసి, పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. అధికారులను బెదిరించి... ఇసుక రీచ్ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు. -
ఉండి అభ్యర్థిని మారిస్తే ఉండేలుదెబ్బే
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెటిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు. ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరాజు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరసనకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బ్రోకర్కు టికెట్టా! రాజకీయ బ్రోకర్గా, వివాదాస్పదుడిగా ముద్రపడిన రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ పార్టీలో తన ఆటలు సాగకపోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారిపోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది. -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు. -
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
ఆపరేషన్స్ కి సిద్ధమైన రామాయపట్నం ఓడరేవు
-
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్మెన్గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్మెసేజ్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ సార్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్ఎస్కు చెందిన ఉపసర్పంచ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్గా గెలిచి ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్ వాట్సప్లో తన వాయిస్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు. తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్ గ్రూపుల్లో వాయిస్మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్ నంబర్ ట్రేస్చేసి హైదరాబా ద్లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
రూ.1,712.21 కోట్ల ప్రాధాన్యత పనులు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించిన ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించి ప్రాధాన్య పనులుగా చేపడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను సందర్శిస్తున్న సందర్భంగా ఒక్కో సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనుల కోసం రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తయిన పనులకు బిల్లులూ చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 9,381 సచివాలయాల పరిధిలో గుర్తించిన రూ.1,876.20 కోట్ల విలువైన 50,117 పనులను పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇందులో ఇప్పటికే 8,562 సచివాలయాల పరిధిలో రూ.1,712.21 కోట్ల విలువైన 43,685 ప్రాధాన్యత పనులు మంజూరు చేయగా.. 7,702 సచివాలయాల పరిధిలో 39,089 పనులను ప్రారంభించారు. పనులను పోర్టల్లో అప్లోడ్ చేయడం, వాటిని వెంటనే మంజూరు చేయడం, అనంతరం వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ విషయంలో వెనుకబడిన జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షించి త్వరగా పనులు మంజూరు చేయించి, ప్రారంభింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
12 ముక్కల్లో మన ఇంజినీర్ల అమెరికా జీవితం ఇదే..
మనదేశానికి చెందిన చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా వెళ్లి, అక్కడ ఉద్యోగం చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా చేరుకున్న తరువాత వారు ప్రధానంగా అనుసరించే 12 దశలు ఇవే.. మొదటి దశ విద్యార్థిగా ఉన్నప్పుడే మూడు లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అవి.. (ఎ) విద్యార్థి రుణాన్ని చెల్లించడం. (బీ) యూఎస్ఏలో ఎక్కడైనా ఉద్యోగం పొందటం. (సీ) హెచ్1-బీ ఆమోదానికి యత్నం. (ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం) దీనితోపాటు 5 సంవత్సరాలలోపు భారతదేశానికి తిరిగి రావడానికి విస్తృతమైన ప్రణాళికలకు రూపకల్పన. రెండవ దశ హెచ్1-బీ ఆమోదం. గ్రీన్ కరెన్సీతో ఎంజాయ్ చేయడం. టయోటా క్యామ్రీ లేదా హోండా సివిక్ లేదా నిస్సాన్ ఆల్టిమాను కొనుగోలు చేయడం. భారతదేశంలో ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేయడం. మూడవ దశ విజిటర్ వీసాలపై భారతదేశం నుండి తల్లిదండ్రులను తీసుకురావడం. ఈ కిందివాటిని విజిట్ చేయడం. చార్ ధామ్ యాత్ర. నయాగరా జలపాతం సందర్శన. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటం. వాల్ స్ట్రీట్లో బుల్ ఛార్జింగ్. వైట్ హౌస్ సందర్శన. నాల్గవ దశ భారతదేశానికి వెళ్లడం. పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయిని ఖరారు చేయడం. మూడు వారాల్లోపు వివాహం చేసుకోవడం. వాస్తవానికి ఇది టైట్ షెడ్యూల్ మధ్య చేసుకున్న వివాహం. జీవిత భాగస్వామితో పాటు యూఎస్ఏకి తిరిగి రావడం. ఐదవ దశ ఇతర భారతీయ స్నేహితులతో వారాంతాల్లో, భోజన సమయంలో ఈ 3 అంశాలపై తరచూ చర్చిస్తారు. అవి.. (ఏ) మీరు మీ గ్రీన్ కార్డ్ని ఎప్పుడు పొందబోతున్నారు? ప్రస్తుతం మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? (బి) మోదీ భారతదేశాన్ని ఎలా మారుస్తున్నారు? (సీ) క్రికెట్పై చర్చించడంతో పాటు భారతదేశంలో మరొక ఆస్తిని కొనుగోలు చేయడం. ఆరవ దశ అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయడం. ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం. తదుపరి 15 సంవత్సరాలు వారిని చదవులో నిమగ్నమయ్యేలా చేయడం. వారి పుట్టినరోజు పార్టీలకు హాజరు కావడం. వివిధ హోమ్ ప్రాజెక్ట్ల కోసం హోమ్ డిపోను సందర్శించడం ఏడవ దశ గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షణ ముగియడం ఎనిమిదవ దశ ఈ సమయానికి 40 ఏళ్లకు చేరుకుంటారు. అప్పుడు తగినంత నిధులను పొదుపు చేసి ఉంటారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి ప్రణాళిక అప్పుడు వర్కౌట్ కాదు. దీంతో ఆ డబ్బు ఖర్చు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం. టెస్లా లేదా బిఎమ్డబ్ల్యూ లేదా మెర్సిడెస్ని కొనుగోలు చేయడం. ఇండియాలో ప్రాపర్టీలు లాభదాయకంగా ఉండవని భావించడం. ఎందుకంటే అమెరికా డాలర్లతో పోలిస్తే భారతదేశ రూపాయి మరింత క్షీణించింది. దీంతో భారతదేశంలోని ఆస్తులను విక్రయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయడం. భారతదేశంలో భారీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించడం. ఇక్కడి నిధులను తిరిగి యునైటెడ్ స్టేట్స్కు పంపడం. తొమ్మిదవ దశ ఇప్పుడు మిడ్ లైఫ్ సంక్షోభం ఎదురవుతుంది. కొత్త కారు, పెద్ద ఇల్లు, గ్రీన్ కార్డ్, అధిక ఆదాయంతో కూడిన ఉద్యోగం ఇకపై జీవితంలో కానరావు. అప్పుడు ఉనికిని నిలబెట్టుకునేందుకు ఏదో ఒకటి చేయడం. ఒక మారథాన్ రేస్లో పాల్గొనడం. అడపాదడపా ఉపవాసం చేయడం లాంటివి. లేదా కొత్త స్టార్టప్ని తెరవడం. పదవ దశ 50- 60 ఏళ్ల వయసుకు చేరుకున్నాక.. పిల్లలు స్టాన్ఫోర్డ్ లేదా ఎంఐటీ లేదా ప్రిన్స్టన్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, మీరు యూఎస్ఏకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లి ఉంటే, జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో చర్చిస్తుంటారు. 11వ దశ పిల్లలు దూరంగా వెళ్లడం, చేతిలో తగినంత సమయం ఉండటంతో, ప్రతి సంవత్సరం యూరప్ పర్యటనలు చేయడం, ఈజిప్ట్లోని పిరమిడ్లను సందర్శించడం, టర్కిష్ డిలైట్స్ని ఆస్వాదించడం, ఇటలీని సందర్శించడం మొదలైనవి చేస్తారు. భారతదేశం గురించి తిరిగి ఆలోచించడం. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందనేది యూఎస్ఏలోని స్నేహితులతో పంచుకోవడం. 12వ దశ ఫంక్షనల్ మొబిలిటీ తగ్గినప్పుడు జీవితానికి సంబంధించిన పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. భారతదేశానికి తిరిగి వెళ్లడం లేదా యూఎస్ఏలో వృద్ధాశ్రమంలో ఉండటం. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే..
క్యూఆర్ కోడ్ ఫుల్ పార్మ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది మెషీన్ రీడబుల్ లేబుల్ వంటిది. దీనిని కంప్యూటర్.. టెక్స్ట్ కన్నా సులభంగా అర్థం చేసుకుంటుంది. డిజిటల్ యుగం వైపు పయనిస్తున్న భారతదేశం అభివృద్ధి పథంలోనూ దూసుకుపోతోంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా, వారిలో భారతీయుల సహకారం అధికంగా ఉండటం విశేషం. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం దాగుంది. వారు పలు యాప్లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతో ఎవరికైనా నగదును సులభంగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో అధికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్లను ఉపయోగిస్తుంది. క్యూఆర్ కోడ్ ఎలా పని చేస్తుంది? బార్కోడ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్లో అనేక చుక్కలు కనిపిస్తాయి. బార్కోడ్లో గీతలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
శరవేగంగా తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు
-
పోలవరానికి పట్టిన చంద్రగ్రహణాలు తొలుగుతున్నాయి
-
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
బందరు కల సాకారం
-
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో మరో ముందడుగు
-
శరవేగంగా శ్రీనివాస సేతు నిర్మాణం పనులు
-
పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తి
-
విజయవాడ: అంబేద్కర్ స్మృతివనం పనులను పరిశీలించిన మంత్రుల బృందం
-
పోలవరంలో మరో కీలక ఘట్టం
-
ఘట్ కేసర్ వద్ద పూర్తయిన రైల్వే ట్రాక్ పనులు
-
Polavaram: డ్రాఫ్ట్ ట్యూబ్ అమరిక పనులు ప్రారంభం
పోలవరం రూరల్(ఏలూరు జిల్లా): పోలవరం జల విద్యుత్ కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్కో, మేఘా ఇంజినీ రింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగింపు పనులు చేపట్టారు. ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్ కేంద్రంలోని ట ర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్ను ఉపయోగిస్తారు. చదవండి: మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు -
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
వెలుగుల మాటున నలిగిన బతుకులు
సాక్షి, నిజామాబాద్/జగిత్యాల: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్వాసి కల్లెడ రమేశ్(50) ఖతర్లోని బూమ్ ఇంటర్నేషనల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ 2016లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఫుట్బాల్ కప్(ఫిఫా) టోర్నీకి సంబంధించిన విధుల్లో పనిగంటలను విపరీతంగా పెంచడంతో తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణం. రమేశ్ కుటుంబానికి ఖతర్ ప్రభుత్వం, కంపెనీ పరిహారం చెల్లించలేదు. ఇతని మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్(32) 2021 నవంబర్ 11లో ఖతర్లో ఫుట్బాల్ స్టేడియంలో పైప్లైన్ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి సమాధి అయ్యాడు. అతని భార్య, కూతురు, కొడుకులు పెద్ద దిక్కును కోల్పోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకూ ఆధారం లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీనివాస్(30) 2020 జనవరి 4న ఖతర్ ఫుట్బాల్ స్టేడియంలో టవర్ క్రేన్ ఆపరేటర్గా పని చేస్తుండగా మరణించాడు. అతని మరణంతో భార్య అనిత, ఇతర కుటుంబసభ్యులు కుంగిపోతున్నారు. ఫిఫా పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో పని కోసం వెళ్లి ప్రమాదాలు, పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అనుమానాస్పద స్థితిలో మరణించిన మన దేశ వలస కార్మికుల సంఖ్య 2,800 వరకు ఉంటుందని అంచనా. నరుకుల్ల శ్రీనివాస్ అంతిమయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న గల్ఫ్ జేఏసీ నాయకులు ఆసియా దేశాలకు సంబంధించిన వలస కార్మికులు ఖతర్లో గడచిన పదేళ్లలో 6,500 మంది మరణించారని వలస కార్మికుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్బాల్ కప్(ఫిఫా) పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. స్టేడియంలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సౌకర్యాల కోసం ఎన్నో నిర్మాణాలను చేపట్టింది. పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినా వలస కార్మికుల కుటుంబాలకు మాత్రం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని సహజ మరణాలుగానే ధ్రువీకరించడం గమనార్హం. ఫిఫా పనుల కోసం ఖతర్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు పదేళ్ల కిందనే కాంట్రాక్టులు ఇచ్చింది. ఖతర్ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి ఖతర్లో ఫిఫా పనుల కోసం ఉపాధి పొందుతూ ఏ కారణంతో మరణించినా అలాంటి వలస కార్మికుల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖతర్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
వరదలు తగ్గడంతో పోలవరం పనుల్ని వేగవంతం చేశాం : మంత్రి అంబటి
-
శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు
-
పెన్నా బ్యారేజీ పనులు పరిశీలించిన మంత్రులు
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయన్నారు. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ, పెన్నా ,సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని తెలిపారు. దివంగత నేత మహానేత వైఎస్సార్ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని కాకాణి మండిపడ్డారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా రైతుల కలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారని మంత్రి కాకాణి అన్నారు. -
పెన్నా బ్యారేజ్ను పరిశీలించిన మంత్రి అనిల్కుమార్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. పెన్నా, సంగం బ్యారేజ్ పనులు తుది దశకు వచ్చాయని.. ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. బ్యారేజ్కు గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రెండు బ్యారేజ్ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. -
Chilakaluripet: నెక్లెస్ ఆకారంలో రోడ్డు నిర్మాణం
యడ్లపాడు(చిలకలూరిపేట): పుష్కరకాలంగా నిలిచిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక చొరవ చూపారు. పెద్దమనసుతో కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు నష్టపరిహారం కోసం నిధులు మంజూరు చేశారు. ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి. ఆది నుంచీ వివాదాలు 16వ నంబర్ జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులను 2009లో హైవే అథారిటీ సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నెక్లెస్ ఆకారంలో బైపాస్ వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దీనివల్ల తాము నష్టపోతామని రైతులు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం 2010లో కోర్టుకు చేరింది. ఫలితంగా విజయవాడ టోల్ప్లాజా నుంచి చిలకలూరిపేట మండలం తాతాపూడి వరకు 84.5 కిలోమీటర్ల మేర జరగాల్సిన రహదారిలో చిలకలూరిపేట పరిధిలోని 16 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం 2016లో బైపాస్ నిర్మాణానికి కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు 2018లోనే అవార్డు పాస్చేసినా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం వాటా నిధులు మంజూరు కాలేదు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండి కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఎమ్మెల్యే రజినీ కృషితో కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే విడదల రజిని హైవే అథారిటీ సంస్థతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.57 కోట్లను తక్షణం మంజూరు చేశారు. 2019లోనే రైతులకు నష్టపరిహారం అందించారు. స్వరూపం ఇలా.. ► చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, మండలాలను కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ బైపాస్ను నిర్మిస్తోంది. ► యడ్లపాడు మండలం తిమ్మాపురం చేపల చెరువు హైవే నుంచి చీలి చిలకలూరిపేట మండలంలోని రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం కానుంది. ► ఈ మార్గంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు, ఐదుచోట్ల వంతెనలు, ఆరుచోట్ల అండర్పాస్లు నిర్మించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ చివరన ప్రారంభమైన ఈ పనులు 2023 మార్చికి పూర్తికానున్నాయి. సీఎం పెద్దమనసు చూపారు గత ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా బైపాస్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో నేను హైవే అథారిటీ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ.57కోట్లు కేటాయించారు. వెంటనే రైతులకు పరిహారం అందింది. బైపాస్ పనులు మొదలయ్యాయి. – విడదల రజిని, ఎమ్మెల్యే పిల్లర్ల పనులు చేస్తున్నాం బీఎస్ఈపీఎల్ కంపెనీ బైపాస్ నిర్మాణ పనులు చేపట్టింది. సర్వే పనులు పూర్తయ్యాయి. హద్దురాళ్ల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్సు పనులూ గతంలోనే ముగిశాయి. ప్రస్తుతం రామచంద్రాపురం వద్ద ఫ్లైఓవర్, బొప్పూడి వద్ద అండర్పాస్, ఓగేరు, కుప్పగంజి వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. వరుస వర్షాల వల్ల కొంత ఆటంకం కలుగుతోంది. అయినా గడువులోపు పనులు పూర్తిచేస్తాం. – అబ్దుల్ ఖాదర్, పీడీ బైపాస్ నిర్మాణ సంస్థ -
Anantapur: ఇదేం పని మేడం..!
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం మన్నీల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషియల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివమ్మపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురంలోని ఆదర్శనగర్లో నిర్మిస్తున్న టీచర్ ఇంటి వద్ద ఆదివారం పలువురు విద్యార్థులు ఇటుకలు, సిమెంట్, ఇసుక మోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో తన ఇంటి వద్ద పని చేసేందుకు పిల్లల్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నత పాఠశాల హెచ్ఎం సాయి ప్రసాద్ను వివరణ కోరగా ఘటనపై విచారణ చేయిస్తున్నామన్నారు. ఆదివారం ఓ శుభకార్యం జరిగితే విద్యార్థులు వచ్చి భోజనం చేసి వెళ్లారని.. పనులు చేయించుకోలేదని టీచర్ చెప్పారన్నారు. -
దీనస్థితిలో క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్... రోజుకూలీగా పనులకు
గుజరాత్: దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ను సాధించిన విన్నింగ్ టీమ్లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్) కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి) -
పులిచింతల: శరవేగంగా స్టాప్ లాక్ గేటు పనులు
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ పేర్కొన్నారు. -
ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి. అదే తేదీల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్ప్రెస్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు. -
ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్పై ప్రశంసలు
జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్గా మారింది. నిండు గర్భిని అయిన మేయర్ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్లో వివరించారు.. తొలుత రాజస్తాన్ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను కూడా సమర్పించారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి' Work is Worship! देर रात तक निगम ऑफिस में मीटिंग ली, प्रसव पीड़ा शुरू होने पर रात्रि 12:30 बजे कुकुन हॉस्पिटल में भर्ती हुई और सुबह 5.14 पर परमपिता परमेश्वर की कृपा से पुत्र को जन्म दिया। मैं और बच्चा दोनों स्वस्थ हैं। pic.twitter.com/nMULHwNGWn — Dr Somya Gurjar (@drsomyagurjar) February 11, 2021 -
రిజిస్ట్రేషన్లకు.. రెడీ!
సాక్షి, హైదరాబాద్: దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా విజయదశమి నాటికి అందుబాటులోకి వచ్చే ధరణి పోర్టల్ ఆధారంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కావడానికి బాలారిష్టాలు అధిగమించినా... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం మరికొన్నాళ్లు వాయిదా పడే చాన్స్ ఉంది. ఈ ఆస్తుల నమోదులో కొంత జాప్యం జరుగుతున్నందున కొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలంటున్నాయి. నమోదు తర్వాత 2 నోటిఫికేషన్లు భూముల విలువల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించేందుకు ఒక నోటిఫికేషన్... సబ్ రిజిస్ట్రార్ల నుంచి వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తప్పించేందుకు మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉం టుందని అంటున్నారు. ఈ నోటిఫికేషన్ల తో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానంలో ముందు కు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఆ రెండు ప్రక్రియలు రద్దు? రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో మరో కీలక నిర్ణయం తీసుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) విధానాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు, దౌర్జన్యాలకు, సెటిల్మెంట్లకు ఊతమిచ్చినట్లు అవుతోందనే ఆలోచనతో ఈ విధానాన్ని సర్దుబాటు చేయాలని... ఇకపై భూములు లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు యజమాని హాజరును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెవెన్యూ చట్టంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సేల్డీడ్ ద్వారా చేస్తామని పేర్కొన్నారు కానీ, ఏజీపీఏ (అగ్రిమెంట్ ఫర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ద్వారా చేస్తామని పేర్కొనలేదని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం జీపీఏ, ఎస్పీఏల రద్దు సాధ్యమవుతుందా లేదా అన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్న మెరూన్ పాస్పుస్తకాలను కూడా రిజిస్ట్రేషన్ల శాఖే ఇవ్వనుంది. భూమి లేదా ఆస్తిని క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ చేయడం, ఆన్లైన్లోనే ‘ధరణి’ద్వారా మ్యుటేషన్ చేయడం, తద్వారా వెంటనే సేల్డీడ్తోపాటు మెరూన్ పాస్పుస్తకం ఇవ్వడం ఒక్క రోజులోనే జరుగుతుందంటున్నారు. వెయ్యి కోట్ల ఆదాయానికి గండి... కరోనా లాక్డౌన్ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కోలుకుంటున్న దశలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అనూహ్యంగా నిలిపేయడంతో గత నెల రోజులుగా రూ. 1,000 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అంటే ఈ నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 17 వేల కోట్లకుపైగా భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీలు నిలిచిపోయినట్లేనని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. త్వరలో తహసీల్దార్లకు శిక్షణ వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రింటర్లు చేరుకున్నాయి. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు ఈ నెల మూడో వారం నుంచి శిక్షణ కూడా ప్రారంభించనుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దసరా తర్వాత ఓ కొలిక్కి వచ్చినట్టే. ఇక, భూముల మార్కెట్ విలువల సవరణలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రాష్ట్ర, జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల స్థాయిలో మార్కెట్ సవరణ విలువలను ప్రతిపాదించనున్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలనే ధరణి పోర్టల్లో నమోదు చేస్తున్న నేపథ్యంలో దసరా నాటికే మార్కెట్ విలువల సవరణ జరుగుతుందా? దసరా నుంచి కొత్త మార్కెట్ విలువల ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయా? లేదా ముందుగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించి ఆ తర్వాత ధరలు సవరిస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు. -
కేఆర్ స్టేడియం పనులపై ఆరా
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ జె.నివాస్తో కలిసి మంగళవారం ఆయన స్టేడియం పనుల ను స్వయంగా పరిశీలించారు. పనుల తీరు తెన్నులను చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్కుమార్, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మైదానం బ్లూప్రింట్, స్టేడియం డిజైన్ను పరిశీలించారు. స్టేడియంలో నిర్మితమవుతున్న రెండు ఫోర్లలో పలు ఇండోర్ క్రీడాంశాల్లో ఆటలు ఆడేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు చీఫ్ కోచ్ వివరించారు. ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణానికి ఎంతో ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఇక్కడే ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుతమై న ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. తాను కూడా ఓ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిని కావడంతో క్రీడల లోటుపాట్లు, క్రీడాకారుల సమస్యలు, క్రీడాసంఘాల ఇబ్బందులు తనకు తెలుసునని పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అ సోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. నిధుల రాకలో జాప్యం.. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల జాప్యంపై కృష్ణదాస్ ప్రతిస్పందించారు. రూ.15 కోట్ల నిధులతో స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే స్టేడియం రీ డిజైనింగ్, ఉడా నుంచి రావాల్సిన నిధుల జాప్యం వల్ల ప నులు ఆలస్యంగా జరుగుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఉడా కాస్త సుడాగా మారడంతో నిధులు జాప్యానికి కారణం అయిందన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. త్వరలో అన్ని సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ హంగులతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా కేఆర్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు కృష్ణదాస్ చెప్పారు. త్వరలో క్రీడా సంఘాలతో చర్చించేందుకు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలను కలుపుకునిపోయేందుకు సరికొత్త కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒలింపిక్ భవన్ కోసం రూ.లక్ష అందజేత ఒలింపిక్ భవన్ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తానని గతంలో కృష్ణదాస్ హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఒలింపిక్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు మాస్టారుకి లక్ష రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సెట్శ్రీ సీఈఓ జి.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ శ్రీనివాస్కుమార్, పీఈ టీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, హ్యాండ్బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, వైఎస్సార్ సీపీ నా యకులు ఎన్ని ధనుంజయరావు, క్రీడాసంఘాల ప్రతినిధు లు, శాప్ డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారి న్యాయపరమైన డిమాండ్లను వివరిస్తూ కోచ్లు డిప్యూటీ సీఎంకు కృష్ణదాస్కు వినతిపత్రాలు అందజేశారు. -
కువైట్లో విలవిల.. మూడు నెలలుగా పనుల్లేక
సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్ ప్రభావంతో కువైట్లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం బతుకు తెరువు కోసం కువైట్ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం స్వదేశానికి రప్పించండి నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను. – రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం కువైట్లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్ టిక్కెట్ కోసం ఏజెంట్కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. – వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు -
కష్టాలు తొల‘గంగ’
తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెండు పంటలు వేసుకోలేని దుస్థితి. ఎన్నో ఏళ్లుగా కాల్వ లైనింగ్ చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి..పనులు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. కర్నూలు సిటీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నీరు పారకుండానే నిధులు పారించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచి.. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు లబ్ధి చేకూర్చింది. అయితే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం..సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా ధనాన్ని దురి్వనియోగపర్చకుండా రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేయిస్తోంది. తెలుగుగంగ కాలువకు లైనింగ్ పనులు ఈ కోవకు చెందినవే. సుమారు రూ.320 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పిలిచి.. జ్యూడీíÙయల్ కమిటీ నిర్ధారించిన తరువాత పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవలే పనులు మొదలు పెట్టారు. లైనింగ్తో ఆయకట్టుకు సమృద్ధిగా నీరు.. తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు 18.20 కి.మీ వరకు లైనింగ్ లేదు. దీంతో సాగు నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాల్వ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు ఉండగా.. లైనింగ్ లేకపోవడంతో నీరు దిగువకు వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల చివరి ఆయకట్టుతో పాటు వైఎస్సార్ జిల్లాకు సాగు నీరు అందేది కాదు. ప్రతి ఏటా సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చేది. ఈ పనులను టీడీపీ ప్రభుత్వం 3.5 ఎక్సెస్ రేటుకు టెండర్లను టీడీపీకి చెందిన నేతకు కట్టబెట్టింది. అయితే పనులు మొదలు పెట్టకపోవడంతో రద్దు చేసి.. రివర్స్ టెండర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో గతంలో ఎక్సెస్ కంటే తక్కువకు టెండర్లు వేసి పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. ఈ రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి రూ.12 కోట్లకుపైగా ఆదా అయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వ లైనింగ్తో పాటు పూడిక తీత పనులు రూ.320 కోట్లతో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులకు ఇసుక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జల వనరుల శాఖ సమీక్షలో ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయితే రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలయ్యాయి.. తెలుగుగంగ లైనింగ్ పనులు ఇటీవలే మొదలు అయ్యాయి. అటవీ ప్రాంతంలో ఇబ్బందులు ఉండేవి. ఆ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాం. రివర్స్ టెండర్ల ద్వారా 4 శాతం నిధులు ఆదా అయ్యాయి. – ఆర్.మురళీనాథ్రెడ్డి, జల వనరుల శాఖ సీఈ -
ఒకే కాంట్రాక్టర్కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్కు చెల్లించారు. ►మహబూబ్నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి
సాక్షి, నెల్లూరు: అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులను పూర్తి చేసి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రులు మేకపాటి గౌతమ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం బ్యారేజీ పనులను మంత్రులను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ఉపాధి’ జాతర..!
జిల్లాలో ఖరీఫ్ వరి పనులు పూర్తికావస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఉపాధి హామీ పనుల జాతర ఆరంభం కానుంది. వేతనదారులకు చేతినిండా పనిదొరకనుంది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వాటి ఆమోదానికి గ్రామ సభలు చురుగ్గా నిర్వహిస్తోంది. ఆమోదం తెలిపిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. విజయనగరం: ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతోన్న లక్ష్యాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ‘ఉపాధి’ జాతర ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. లక్షలాది మంది వేతనజీవులకు అధిక పనిదినాలు దొరకనున్నాయి. దీనికోసం ఇప్పటికే పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పనుల ఆమోదానికి గ్రామసభలు కొనసాగుతున్నాయి. అవి ఆమోదం పొందడమే తరువాయి. పనుల కల్పన ఇలా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా రూ.1800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సుమారు 3.50 లక్షల మంది వేతనదారులకు 3 కోట్ల పనిదినాలు కలి్పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను జియోట్యాగింగ్ సాయంతో గుర్తించారు. ఇలా గుర్తించిన పనుల ప్రజామోదానికి మరోసారి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామసభలు ముగియనున్నాయి. పనుల నిర్ణయం ఇలా... గతంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు గుర్తించి అవసరమైన మేరకు పనులు చేసేవా రు. ఈ సారి మాత్రం గ్రామసభల్లో గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం పొందుతారు. దీనికి సంబంధించి గ్రామసభ తీర్మానం అవసరం. గతంలో పంచాయతీ సర్పంచి తీర్మానించేవారు. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులు కంప్యూటర్లో క్రోడీకరించాలి. అలా క్రోడీకరించిన అనంతరం తీర్మానాన్ని ఉపాధిహామీ పథకం వెబ్సైట్ నుంచి డౌన్Œలోడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తీర్మానాలను మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలి. మండల పరిషత్ అధికారులు ఒక తీర్మానం చేసి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపాలి. అక్కడ పనులను పరిశీలించి జిల్లాస్థాయిలో తీర్మానం చేసి కలెక్టర్కు పంపుతారు. కలెక్టర్ పరిపాలన ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతారు. 30 కేటగిరీల్లో 196 రకాల పనులు గుర్తింపు.. ఉపాధిహామీ పథకంలో 30 కేటగిరీల్లో 196 రకాల పనులను రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ పనుల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన 1.17 లక్షల పనులు గుర్తించారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీణ పార్కులు, నర్సరీలు పెంచడం తదితర పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, పిల్లకాలువలను మెరుగుపరచడం, భూ అభివృద్ధి పనులు, రహదారుల అభివృద్ధి తదితర పనుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. పనులను గ్రామ సభల్లో తీర్మానించే ప్రక్రియ చేపడుతున్నారు. అధిక పనుల గుర్తింపు 2020–21 ఆర్థిక సంత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.1800 కోట్ల విలువ చేసే పనులను గుర్తించాం. ఆయా గ్రామ సభ ల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాత పనుల మంజూరు ఆదేశాలు జారీ చేస్తాం. మొత్తం 1.17 లక్షల పనులు గుర్తించగా... 3 కోట్ల పనిదినాలు వేతనదారులకు కలి్పంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుత ఏడాది 2.65 కోట్ల పని దినాలు లక్ష్యం చేసుకోగా.. ఇప్పటి వరకు 1.86 కోట్ల పని దినాలు కలి్పంచాం. – ఎ.నాగేశ్వరరావు, పీడీ, డ్వామా, విజయనగరం -
త్వరలోనే బందరు పోర్టు పనులు ప్రారంభం
సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం): బందరు పోర్టు పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని, నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోర్టు నిర్మాణం నిలిచిపోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నాలుగైదు బెర్త్లు నిర్మించేందుకు ఎక్కువ నిధులు కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. కంటైనర్ కార్పొరేషన్ సంస్థ పోర్టు నిర్మాణంలో కలిపి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ఆర్థిక అభ్యంతరాలను తొలగించనున్నామని తెలిపారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. డ్యామ్లు నిండుతున్నాయి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే దేవుని చలువతో డ్యామ్లు అన్ని నీటితో కళకళలాడుతున్నాయని ఎంపీ బాలశౌరి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిని తర్వాత పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో పంటకు కూడా నీటి సమస్య రాకుండా రైతులు సంతోషంగా ఉండేలా చేస్తామని చెప్పారు. పంటలకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఆరు లైన్ల రహదారులకు నూతన ప్రతిపాదనలు.. కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం ఆరు లైన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదనలు అందించినట్లు ఎంపీ తెలిపారు. గుండుగొలను నుంచి కలపర్రు వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 505.40 కోట్లు, కలపర్రు నుంచి చినఅవుటుపల్లి వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 512.43 కోట్లు, చినఅవుటుపల్లి – గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లకు రూ. 752.15 కోట్లు, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు మధ్యలో కృష్ణా నది ఐకానిక్ బ్రిడ్జితో సహా 17.8 కిలోమీటర్లకు రూ. 1,215.19 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు బూరగడ్డ రమేష్నాయుడు, ఉప్పాల రాంప్రసాద్, రాజులపాటి అచ్యుతరావు, తిరుమాని శ్రీనివాసరావు, బండారు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
హెచ్ఎల్ఛీ పనులు
హెచ్చెల్సీ కాలువ ఆధునికీకరణ పనులు ప్రహాసనంగా మారాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఈ పనులను ప్రారంభించినా నేటికీ పనులు కొనసా....గుతున్నాయి. సంవత్సరాలు గడచిపోతున్నా నేటికీ 43వ ప్యాకేజీలో 45 శాతం పనులు, 44వ ప్యాకేజీలో 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనుల వల్ల నీళ్లు సరిగా పారక ఆయకట్టు రైతులు ప్రతి యేడూ నష్టపోతున్నారు. సెప్టెంబర్ నెలలోపే పనులు చేసేస్తామని అధికారులు చెబుతున్నా గడువు ముంచుకొస్తుండటంతో అది సాధ్యంకాదనే వాదనలు బలంగా ఉన్నాయి. – గార్లదిన్నె 45 వేల ఎకరాల ఆయకట్టు గార్లదిన్నె మండల పరిధిలో మిడ్పెన్నార్ డ్యాంలోని దక్షిణ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ఇందులో దక్షిణ కాలువ ద్వారా గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ,తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. అలాగే ఉత్తర కాలువ ద్వారా గుత్తి, పెద్దడుగూరు మండలాల్లో 12,225 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. హెచ్చెల్సీ కాలువ ఆధునీకరణ పనులు ... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 సంవత్సరంలోనే దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 84 కిలో మీటర్ల కాలువ పనులు ఆధునీకరణ చేయడానికి 43వ ప్యాకేజీకి రూ.236.65 కోట్లు, 44వ ప్యాకేజీ కి రూ.184.2 కోట్లకు టెండర్లు వేయడంతో నాగార్జున కన్స్ట్రక్సన్స్ కంపెనీ (ఎన్సీసీ) పనులు దక్కించుకుంది. ఎన్సీసీ అంచనా మొత్తం కంటే 4.95 శాతం అధిక మొత్తానికి ఈ టెండర్ చేజిక్కించుకుంది. ప్రధాన ఆటంకాలు ఇవే... 43వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయడానికి పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టారు. అలాగే బెడ్ పనులు చేయకూడదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు ఆలస్యంగా చేయడం, పనులు జరుగున్న ప్రదేశంలో నత్తనడక పనులు జరుగుతున్నాయి. 44వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయాలంటే మొదట కాలువ వెడల్పు పనులు చేయాలి. కానీ అనంతపురం నగరంలో కాలువకు దగ్గరలోనే కొంత మంది ఇళ్లు నిర్మించుకొని ఉండటం, మరికొందరు కాలువ స్థలాన్ని ఆక్రమించారు. ప్యాకేజీ వివరాలు... మిడ్ పెన్నార్ డ్యాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు 84 కిలోమీటర్లు జరగాలి. అందులో 0–40 కిలో మీటర్లు 43వ ప్యాకేజీ, 40–84 కిలో మీటర్లు 44 ప్యాకేజీగా విభజించారు. 43వ ప్యాకేజీ పనులు మిడ్పెన్నార్ డ్యాం నుంచి అనంతపురములో హెచ్చెల్సీ కాలనీ రైల్వే గేట్ వరకు వర్తిస్తుంది. అలాగే రైల్వే గేట్ నుంచి నార్పల వరకు 44వ ప్యాకేజీలోకి వస్తాయి. 43 ప్యాకేజీలో .. 0 – 40 కిలో మీటర్ల వరకు ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. కాలువ వెడల్పు పనులు, ఎర్త్ పనులు, కాలువ ఇరువైపులా లైనింగ్ పనుల్లో ఇప్పటి వరకు 45 శాతం పనులు మాత్రమే చేశారు. ఇంకా 5 కిలో మీటర్లు ఇరువైపులా లైనింగ్ పనులు చేయలేదు.అలాగే బ్రిడ్జిలు, పనులు చేయాల్సి ఉంది. గతవారం రోజుల నుంచి 5 బ్రిడ్జీలు పగలగొట్టి , కొత్త బ్రిడ్జీల పనులు చేస్తున్నారు. 44వ ప్యాకేజీలో.. 40 – 84 కిలోమీటర్లు వరకు ఒక కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీలో 44 కిలో మీటర్లు పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం బుక్కరాయసము ద్రం మండలం దయ్యాలకుంటపల్లి దగ్గర కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే కాలువకు ఇరువైపులా కాలువ లైనింగ్ పనులు చేశారు. అయితే గత రెండురోజుల నుంచి నార్పల మండలంలో లైనింగ్ పనులు మొదలయ్యాయి. 6 నెలలుగా నో వర్క్.. హెచ్చెల్సీ కాలువకు నీరు విడుదల చేయడానికి సమయం ముంచుకొస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది ఆయకట్టుకు సకాలంలో ఆయకట్టుకు నీరు అందించాలని చర్యలు చేపట్టింది. సాధారణంగా జూలై చివరి, ఆగస్టులో తుంగభద్ర డ్యాం జలాలు మిడ్ పెన్నార్ డ్యాంకు చేరతాయి. కాలువకు నీరు బంద్ చేసి 6 నెలలు అవుతున్నా కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. తీరిగ్గా ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆధునికీకరణ పనులు చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు రెండు ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగినట్లు తెలుస్తోంది. లైనింగ్ పనులు పూర్తయితే... హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గతంలో ఆయకట్టు కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు శిథిలావస్థలో ఉండేవి. దీంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందేది కాదు. ఈ తరుణంలో కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు నీళ్లంది పంటలు బాగా పండుతాయి. బెడ్ లైనింగ్ పనులు జరిగేనా? హెచ్చెల్సీ ఆధునీకరణ పనుల్లో కాలువ వెడల్పు చేయడం, ఇరువైపులా, కింద లైనింగ్ వేయడం, పాత బ్రిడ్జిలు తొలగించి కొత్త బ్రిడ్జిలు నిర్మించడం వంటి పనులు చేయాలి. కానీ లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. దీనిపై అప్పట్లోనే కాలువ ఇరువైపులా లైనింగ్ మాత్రమే వేసి కింద బెడ్ లైనింగ్ పనులు ఆపేశారు. నిజానికి ఎన్సీసీ ఒప్పందంలో మాత్రం బెడ్ లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ పనులు మొదలు కావడంతో కింద బెడ్ పనులు చేస్తారా? చేయరా? అనేది తేలడం లేదు. బ్రిడ్జిలు పూర్తి చేసేదేన్నడో? నీళ్లొదిలే సమయం దగ్గర పడుతున్నా కాలువ పనులు ఇంకా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టి నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ నత్తనడక సాగుతున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలి. – గోవర్ధన్, తిమ్మంపేట, రైతు రైతులకు ఇబ్బంది కలిగించం హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను భాగంగా 43, 44 ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగాయి. 43వ ప్యాకేజీలో కేవలం 4 కి.మీ మాత్రమే లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాత బ్రిడ్జీలన్నీ పగలగొట్టి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.అయితే బెడ్ లైనింగ్ పనులకు సంబంధించి పనులు చేయాలా? వద్ద అనే విషయం ఉన్నతాధికారుల పరిధిలో ఉంది. – ప్రసాద్, హెచ్చెల్సీ డీఈఈ పనులు సకాలంలో పూర్తి చేయాలి హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలి. పనులు పూర్తికాకపోవడంతో ఈ యేడాది కూడా ఆయకట్టుకు నీరు అందించడానికి ఇబ్బందిగా మారింది. మూడేళ్లుగా ఆయకట్టు నీటి కోసం ఇబ్బంది పడ్డాం. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి. – నాగలింగారెడ్డి, పెనకచెర్ల, రైతు -
డబుల్ వేగం పెంచాలి
పాపన్నపేట(మెదక్): మండలంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, రాంతీర్థం, బాచారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్బెడ్రూం నిర్మాణం ప్రారంభించి నెలలు కావస్తున్న ఇంకా బేస్మెంట్ స్థాయికి కూడా చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాచారంలో నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలను అడుగగా అక్కడ నీటి సమస్య ఉండటం వల్ల నిర్మాణ పనులు కొనసాగడం లేదని ఎంపీపీ పవిత్రదుర్గయ్య తెలిపారు. పండగలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ కార్మికులు పనిలోకి రాకుండా, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను అధిగమించి పట్టుదలతో డబుల్బెడ్రూంల నిర్మాణం పూర్తి చేయాలని అదేశించారు. అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తూ.. వెంట వెంటనే తనకు రిపోర్ట్ పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గాజులగూడెంలో గొల్లకుర్మలు కలెక్టర్ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాలాగౌడ్, శ్రీనివాస్, దుర్గయ్య, బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, పీఆర్ఈఈ వెరాంతీర్థంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
‘కాళేశ్వరం’ రికార్డు: 24 గంటల్లో ఏకంగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీడు భూములను తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంలా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు (ర్యాఫ్ట్, పియర్స్) జరిగాయి. 400 మంది ఇంజనీర్లు సహా 4,824 మంది కార్మికులు శని వారం ఉదయం 8 గం. నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు శ్రమించి ఈ రికార్డు సృష్టించారు. దీనికోసం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణరాజు పర్యవేక్షణలో 4,824 మంది కార్మికులు, ఇంజనీర్లు 24 గంటలపాటు 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఈ పనులు చేసేందుకు 120 ట్రాన్సిక్ మిల్లర్లు, 21 బ్లూమ్ ప్లేసర్స్తోపాటు గంటకు 870 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంగల 8 బ్యాచింగ్ ప్లాంట్లను వినియోగించారు. 6,238 మెట్రిక్ టన్నుల సిమెంట్ (1,24,751 లక్షల సిమెంట్ బస్తాలు), 1,070 మెట్రిక్ టన్నుల స్టీలు, 15,384 క్యూబిక్ మీటర్ల మెటల్ వినియోగించారు. ఇక ముందూ పరుగులే.. మేడిగడ్డ బ్యారేజీ పనులు తొలి నుంచీ నెమ్మదిగానే సాగుతున్నాయి. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి సహకారం అవసరమవడం, గోదావరికి ఏటా జూన్ నుంచి జనవరి వరకు నీటి ప్రవాహాలు కొనసాగుతుండటం, చిన్నపాటి వర్షాలకు నేల చిత్తడి కావడంతో రవాణా వాహనాలకు ఇబ్బందులు తలెత్తడంతో ఈ పనులు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. గతేడాది డిసెంబర్లోనే మేడిగడ్డ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కాంక్రీట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దీంతో అప్పటి వరకు బ్యారేజీ పరిధిలో 1,500 క్యూబిక్ మీటర్ల నుంచి 2 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరగ్గా ఆ తర్వాత పకడ్బందీ ప్రణాళిక, అధికారుల మధ్య సమన్వయం, కార్మికులు, ఇంజనీర్లు, యంత్ర పరికరాల సంఖ్య పెంచడంతో పనుల్లో వేగం పెరుగుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 15న మేడిగడ్డలో ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. అనంతరం మళ్లీ జూన్ నుంచి గోదావరి వరద కారణంగా పనులు నమ్మెదించాయి. గరిష్టంగా ప్రతిరోజూ 3 వేల నుంచి 4 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులను అధికారులు చేస్తూ వచ్చారు. సీఎం ఆదేశాలతో పనుల పరుగులు... కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను సత్వరమే చేయాలని ఆదేశించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అక్కడ యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచి 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేశారు. ఇకపై ప్రతిరోజూ కనిష్టంగా 8 వేల క్యూబిక్ మీటర్లు, గరిష్టంగా 10 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తంగా మేడిగడ్డ పరిధిలో 17,89,382 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 12,58,032 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులతోపాటే మేడిగడ్డ పంప్హౌస్, అన్నారం, సుందిళ్ల పరిధిలోని పనుల్లో వేగం పెంచారు. మేడిగడ్డ పంప్హౌస్లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవగా అన్నారం పంప్హౌస్లో 8 మోటార్లకుగాను 2, సుందిళ్ల పంప్హౌస్లో 9 మోటార్లకుగాను 2 మోటార్లు అమర్చారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి జూన్¯Œలో ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీటిని తరలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం అందుకు తగ్గట్లే పనులు జరుగనున్నాయి. 22వ తేదీ ఉదయం 8 నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు జరిగిన రికార్డు కాంక్రీట్ పని ఇలా..(క్యూబిక్ మీటర్లలో) సమయం(గంటల్లో) చేసిన పని ఇలా.. 8–11 2,132 11–2 2,097 2–5 2,085 5–8 2,041 8–11 2,046 11–2 2,107 2–5 2,074 5–8 2,140 మొత్తం 16,722 కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో జరిగిన పని ఇలా.. (క్యూబిక్ మీటర్లలో) మేడిగడ్డ బ్యారేజీ పని మొత్తం క్వాంటిటీ చేసిన పని మట్టి పని 54,43,515 52,48,354 కాంక్రీటు పని 17,89,382 12,58,032 అన్నారం బ్యారేజీ మట్టి పని 29,08,296 29,08,296 కాంక్రీటు పని 11,95,000 11,83,642 సుందిళ్ల బ్యారేజీ మట్టి పని 8,65,320 8,52,174 కాంక్రీటు పని 10,54,799 10,39,678 -
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్.కె పాండే మాట్లాడారు. వీసీటీఎల్లో నూతన క్రేన్లు ప్రారంభం పాతపోస్టాఫీసు: విశాఖ కంటెయినర్ టెర్నినల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేన్లను కేంద్ర ఉపరితల, నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీటీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ రూ.151 కోట్ల వ్యయంతో రెండు పోస్ట్ పనామెక్స్ క్వే క్రేన్లు, రబ్బర్ టైర్స్ గేంట్రీ క్రేన్లు నాలుగు కొనుగోలు చేశామని తెలిపారు. క్వే క్రేన్లు 41 టన్నుల బరువున్న కంటెయినర్లను ఒక గంటలో 27 నుంచి 30 వరకు లోడ్ చేయగలవని తెలిపారు. లోడ్ చేసే సమయంలో కంటెయినర్కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక రక్షణ వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు క్వే క్రేన్లకు మరో రెండు నూతన క్రేన్లు తోడవ్వడంతో లోడింగ్ను ఆపకుండా రౌండ్ ది క్లాక్ చేయవచ్చని తెలిపారు. శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవే.. ఆరు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 444.5 కోట్లు నరసన్నపేట నుంచి రణస్థలం వరకు 54.2 కిలోమీటర్ల పరిధిలో, రణస్థలం నుంచి ఆనంద ³#రం వరకు 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఆనందపురం నుంచి పెందుర్తి వరకు 50.75 కిలో మీటర్లు, ఎన్హెచ్ 16 నుంచి విశాఖ పోర్టుకు కనెక్టివిటీకి 12.7 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి కాన్వెంట్ జంక్షన్ వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తూ పోర్ట్ రద్దీని నియంత్రించే రోడ్డుకు 60 కోట్లతో నిర్మాణాలు విశాఖ పోర్ట్ నుంచి ఎన్హెచ్ 16కు 4.15 కిలోమీటర్ల పరిధిలో 100 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహ దారిని జాతికి అంకితం చేశారు. -
వేల కోట్లతో అభివృద్ధి పనులు
జైనథ్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని మంత్రి జోగురామన్న కోరగా, స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుకు జీఓ జారీ చేశారన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, మురికి కాల్వలు, లింక్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో 51వేల ఎకరాలకు సాగునీరు అందించే కోరటా–చనాఖా బ్యారేజీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఎన్నికల్లోగా సాగునీరు అందిం చడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా వందల కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత మంత్రి జోగు రామన్నకే దక్కుతుందన్నారు. ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టి రానున్న అన్నిఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టీ భూమారెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు మద్దెల ఊశన్న, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, నాయకులు అల్లకొండ అశోక్, తమ్మడి భగవాండ్లు, కోల భోజన్న, భట్టు ఊశన్న, వెంకట్రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోనం.. బొనాంజా
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండగ...కాదు కాదు ‘కార్పొరేటర్ల పండగ’ మళ్లీ వచ్చింది. ఏటా మాదిరిగానే బోనాలకు ముందుగా నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇంకేముంది కార్పొరేటర్లకు పండగే మరి. ఎందుకంటే బోనాల పనులకు సంబంధించి పెత్తనమంతా వారిదే. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రభుత్వం రూ.5 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసింది. బోనాల ఉత్సవాన్ని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఈ నిధులు ఇచ్చారు. అయితే ఏటా పండుగ పేరిట ఇలా విడుదలవుతున్న నిధుల్లో చాలా వరకు కార్పొరేటర్ల ఖాతాల్లోకే మళ్లుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయాలకు దారితీసే మార్గాలను, రహదారులను తీర్చిదిద్దడం.. ఆలయాలకు సున్నాలు, రంగులు వేయడం, అవసరమైన ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేయాలి. కానీ.. వీటిల్లో చాలా వరకు చేయకుండానే చేసినట్లు చూపుతూ నిధులు దారి మళ్లిస్తుండటం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఆలయాల పరిసరాల్లో మాత్రమే ఈ పండగ పనులు చేయాల్సి ఉండగా, ఎక్కడ పడితే అక్కడ ఈ పనులను చేసినట్లు చూపుతున్నారు. అంతే కాదు.. పండుగలు మొదలయ్యేనాటికే పనులు పూర్తికావాల్సి ఉండగా, పండగలు ముగిశాక సంవత్సరమైనా పనులు పూర్తి కావడం లేదు. మరుసటి సంవత్సరం మళ్లీ పండుగ పేరిట నిధులు మంజూరవుతాయి కాబట్టి..పాత పనుల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ బిల్లుల చెల్లింపులు మాత్రం జరిగిపోతాయి. అవి కార్పొరేటర్ల జేబుల్లోకి చేరతాయి. కార్పొరేటర్లు, స్థానిక అధికారులు పరస్పర సహకారంతో ఎవరి శక్తిమేరకు వారు ప్రయోజనం పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. గత సంవత్సరం బోనాల కోసం రూ.10 కోట్లు మంజూరు కాగా, ఆ నిధుల్లో ఇప్పటి వరకు ఇంకా రూ.2 కోట్లు ఖర్చు కాలేదు. అవలా ఉండగానే తాజాగా మళ్లీ రూ.15 కోట్లు మంజూరయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూతూమంత్రంగా.. పండుగ పేరిట చేసే పనులు తూతూమంత్రంగానే చేస్తారు. మూణ్నాళ్ల ముచ్చట కోసం చేసే పనులే కావడంతో నాణ్యత గురించి పట్టించుకునేవారుండరు. రోడ్ల పేరిట ఖర్చు చూపినప్పటికీ.. ఎప్పటి కప్పుడు రోడ్ల మరమ్మతుల పేరిట నిర్వహణ ఖర్చుల నుంచి వెచ్చిస్తూనే ఉంటారు. బోనాల పేరిట ప్రత్యేకంగా నిధులు చూపడం తప్ప చాలా పనులు సాధారణ నిర్వహణ కిందే జరిగిపోతుంటాయి. వాటిని కూడా వీటిల్లో కలిపేస్తారు. పండుగల ఏర్పాట్ల పనులు జోన్లు, సర్కిళ్ల వారీగా జరుగుతాయి కాబట్టి పూర్తయిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరవు. ఓవైపు ప్రతిపాదనలు.. మరోవైపు పనులు వచ్చే ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని డివిజన్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, కొన్ని డివిజన్లలో ఇంకా ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. పండుగ పనుల ప్రతిపాదనల అధికారం కార్పొరేటర్లకే అప్పగించారు. స్థానిక కాలనీ సంఘాలు, ఎన్జీఓలు తదితరులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మేయర్ సూచించారు. కానీ.. వారితో సమావేశాలు మొక్కుబడి తంతే. కొన్ని డివిజన్లలో అవీ జరగవు. కార్పొరేటర్ ఏది చెబితే అదే పని. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేసే వారు కొందరు కాగా, అది కూడా పట్టించుకోని వారు మరికొందరు. మొత్తానికి బోనాల పండుగ నిధుల్లో కార్పొరేటర్లదే పెత్తనం కావడంతో ప్రజలకంటే వారికే పెద్ద పండగ. రూ. 2 కోట్ల పనులు రద్దు చేశాం వివిధ పండుగల పేరిట మంజూరైన నిధులు ఏడాదంతా ఖర్చు చేసే పద్ధతికి స్వస్తి పలికాం. ఏ పండుగకు మంజూరైన నిధులు ఆ పండుగకే వెచ్చించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం బోనాల పండుగ ఏర్పాట్లకు మంజూరైన నిధుల్లో దాదాపు రూ. 2 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. దాంతో ఆ పనుల్నే రద్దు చేశాం. గతంలో మాదిరిగా వాటిని ఎప్పుడైనా ఖర్చు చేసే అవకాశం లేకుండా తగుచర్యలు తీసుకున్నాం. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. – జియాఉద్దీన్, చీఫ్ ఇంజినీర్ (జీహెచ్ఎంసీ) ఈసారి బోనాల పండుగకు సంబంధించి ఇప్పటికి కొన్ని ప్రతిపాదనలే రాగా, చాలా ప్రాంతాల్లో ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనుల్ని కూడా బోనాల పండుగ పద్దులో చేర్చే అవకాశాలున్నాయి 2018–నిధుల మంజూరు.. పనుల పురోగతి..(రూ.లక్షల్లో) జోన్ల వారీగా.. జోన్ మంజూరు టెండరుదశలో పనుల పురోగతి ఎల్బీనగర్ 119.00 84.95 00.00 చార్మినార్ 841.77 207.06 56.42 ఖైరతాబాద్ 293.45 107.30 16.00 శేరిలింగంపల్లి 55.83 4.30 00.00 కూకట్పల్లి 39.00 11.17 00.00 సికింద్రాబాద్ 187.41 121.43 9.98 మొత్తం 1536.46 536.21 82.40 గత సంవత్సరం (2017) నిధుల మంజూరు.. పూర్తయిన పనులకు వెచ్చించిన నిధులు రూ. లక్షల్లో ఇలా.. జోన్ మంజూరు పూర్తయిన పనులు ఎల్బీనగర్ 164.89 38.78 చార్మినార్ 535.65 418.50 ఖైరతాబాద్ 139.22 90.28 శేరిలింగంపల్లి 38.76 34.81 కూకట్పల్లి 29.62 29.62 సికింద్రాబాద్ 257.27 231.98 మొత్తం 1165.41 843.97 గత సంవత్సరానికి సంబంధించిన పనుల్లో దాదాపు రూ. 17 లక్షల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో రూ.1.05 కోట్ల పనులు ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్ గ్రామంలో నాల్గో విడత మిషన్ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్సీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్బాబు, ఏఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. -
గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
కాసిపేట: గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మండలంలోని కొండపూర్యాపలో గురువారం ఎండీఎఫ్(మినరల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండీఎఫ్ నిధులతో గ్రామాల్లో రోడ్డు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాలువలు, ఇతర సమస్యలు అన్నింటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ హయంలో గ్రామాలు అన్నిరకాలుగా అభివద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణరెడ్డి, ఎంపీటీసీలు దాసరి శ్రీకాంత్, మంజుల, సర్పంచ్ ప్రేంకుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, విక్రంరావు తదితరులున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేయిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ అన్నారు. మంగళవారం వంగూరు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ కాకతీయ పనులు వంగూరు మండలంలో వేగవంతంగా జరగకపోవడం, ఫేస్–1, ఫేస్–2లో ఐదు చెరువులు పూర్తికాకపోవడం, మూడు, నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులను పూర్తి చేయకపోవడం కొన్నింటిని ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం.. గొలుసుకట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం కక్కుర్తిపడి పనులు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల అన్నారు. అవసరమూతే సంబంధిత అధికారులు చెరువుల వద్దే ఉండి పనులు చేయించాలని ఇరిగేషన్ ఏఈ తిరుపతయ్యను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలి అలాగే సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన హార్టికల్చర్, ఆర్టీసీ, ఎక్సైజ్, సోషల్ వెల్ఫేర్, ఆర్అండ్బీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీఓను ఆదేశించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కావడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సమస్యలు పరిష్కరించాలి సభలో చౌదర్పల్లి సర్పంచ్ అంజన్రెడ్డి, పోతారెడ్డిపల్లి సర్పంచ్ శంకర్, గాజర సర్పంచ్ చంద్రయ్య తదితరులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు అధ్యయనం చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్లకు సన్మానం ఉమ్మడి వంగూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల సర్పంచ్లకు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పదవీ కాలాన్ని పూర్తిచేసుకోవడం, ప్రస్తుత సర్పంచ్లకు చివరి సర్వసభ్యసమావేశం ఇదే కావడంతో వారికి శాలువాలు, దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం వారు కష్టపడిన తీరు, గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, అధికారులు సహకరించిన విధానం తదితర అంశాలను నెమరు వేసుకున్నారు. తమ పదవీకాలం పూర్తయినప్పటికీ గ్రామాల్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భీముడు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, తహసీల్దార్ సుశీల్కుమార్, ఎంపీడీఓ హిమబిందు, కోఆప్షన్ సభ్యుడు హమీద్, ఎంఈఓ శంకర్నాయక్, వ్యవసాయాధికారిణి తనూజారాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘మహాగణపతి’కి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్ను తయారుచేస్తున్నామన్నారు. మరో వారం పది రోజుల్లో ఈ డిజైన్ ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ సంవత్సరం సర్వేశాం ఏకాదశి సందర్భంగా నిర్వహించే కర్రపూజా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఖైరతాబాద్ మంటపంలో వినాయక విగ్రహానికి పూజలు చేసి అనంతరం కర్రను పాతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గజ్జల నాగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్కుమార్ నాయకులు మహేష్యాదవ్, మహేందర్బాబు, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున మహాగణపతికి భారీ కండువా.... మహాగణపతికి ప్రతీ సంవత్సరం లాగానే పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం తరపున 75 అడుగుల భారీ గాయత్రి జంధ్యం, 75 అడుగుల భారీ చేనేత కండువా వినాయక చవితి రోజు సమర్పించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కొండయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి శుక్రవారం తెలిపారు. -
వేతనాలు, బిల్లులు... నో..!
నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. రూ.లక్షల పెట్టుబడితో చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక ఆంక్షలు విధించిన ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించ లేదు. మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం బిల్లులు అందకపోవడంతో అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లోఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి సాఫ్ట్వేర్ మార్చడమేనని అధికారులు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచిఆర్థిక ఆంక్షలు కొనసాగించడమేనని కార్మికులు, కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే వేతనాల చెల్లింపు బిల్లులను మున్సిపాలిటీలలో అకౌంట్ అధికారులు సిద్ధం చేసినా, జాప్యం జరిగిందంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వం మిగులు నిధులు చూపించేందుకే ఈ తరహా ఎత్తుగడ వేసిందని పలువురు అభిప్రాయపడుతుండగా... ఎప్పుడు బిల్లులకు క్లియరెన్స్ వస్తుందా..? అని ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో రూ.11కోట్ల 10 లక్షల వేతన బకాయిలు చెల్లించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా బడుగు జీవులకు కష్టాలు తప్పవని కార్మికులు వాపోతున్నారు. ఎన్నాళ్లు ఎదురు చూడాలి..?: అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనవరి నెలలోనే పలు అభివృద్ధి పనులు పూర్తిచేశాం. మార్చి నెలలో బిల్లులు చెల్లిస్తారని భావించాం. వడ్డీకి అప్పులు చేసి పనులు జరిపించారు. నేడు ఆ అప్పులను వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు వీడి, తక్షణమే బిల్లులు చెల్లించాలి. – యశోద కృష్ణ, మున్సిపల్ కాంట్రాక్టర్, సాలూరు సాఫ్ట్వేర్ మార్చడంతో సమస్య... పాత విధానంలో కాకుండా కొత్త సాఫ్ట్వేర్ను ప్రభుత్వం అమలు చేయడంతో సమస్య తలెత్తింది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మోనటరింగ్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)పై అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రత్యేక శిక్షణ ఇస్తే త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. – ఎం.ఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
ఆ ప్యాకేజీలు వానాకాలం నాటికి పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లోని 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని.. వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ మూడు ప్యాకేజీల పనులపై సమీక్షించారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వ రం ప్రాజెక్టు చేపట్టామని.. పనులను శరవేగం గా కొనసాగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏడో ప్యాకేజీ పనుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బ్యారేజీల పనులు ఊపందుకున్నాయన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ శ్రీధర్, వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్లో ఏం జరుగుతోంది..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పది కాదు.. ఇరవై కాదు 720 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ ఎలా ఉండాలి.? ఎలా పడితే అలా భూగర్భ కేబుళ్ల పనులు చేస్తుంటే నియంత్రించకుండా ఏం చేస్తున్నారు.? పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా.? అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పినా నిర్లక్ష్యం వహిస్తే ఎలా.? అసలు ఈపీడీసీఎల్లో ఏం జరుగుతోందంటూ సీఎండీ దొరపై చీఫ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్కుమార్ అమరావతిలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు, ట్రాన్స్కో, జెన్కో సంస్థల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద చేపడుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనుల ప్రస్తావన సమయంలో పై వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్టు విశాఖలో తొలిసారిగా ప్రారంభించాం. ప్రపంచ బ్యాంకు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని ఎలా చెయ్యాలి, కానీ.. మీరెలా చేస్తున్నారంటూ’ సీఎండీ దొరపై సీఎస్ దినేష్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.720 కోట్ల విలువైన భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులపై ఈపీడీసీఎల్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో చాలా చోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీగా ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా ప్రతి పనినీ పర్యవేక్షించాలని అధికారులను చీఫ్ సెక్రటరీ దినేష్కుమార్ సూచించారు. -
శరవేగంగా లాజిస్టిక్ పార్కు
ఇబ్రహీంపట్నంరూరల్: సుదూర ప్రాంతాల నుంచి సరుకులతో నగరానికి వచ్చే లారీలు, ట్రక్కులతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. నగర శివారులో రెండు లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టింది. సరుకులను అక్కడ దింపి చిన్న వాహనాల ద్వారా నగరంలోని రవాణా చేస్తారు. గత సంవత్సరం అక్టోబర్ 6న ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మంగళ్పల్లి, బాటసింగారం గ్రామాల్లో లాజిస్టిక్ పార్కులఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డిలు పునాది రాయి వేశారు. హైదరాబాద్ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటంతో సరుకుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా ఈ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీ వాహనాలు లాజిస్టిక్ పార్కుల వద్దకు వచ్చి అక్కడ సరుకులు దింపుతాయి. అక్కడి నుంచి నగరంలోకి చిన్న వాహనాల ద్వారా సరుకులు రవాణా అవుతాయి. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణం చేసిన వాహనాల డ్రైవర్లు సేదతీరడానికి లాజిస్టిక్ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. రూ.20 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మాణం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్పల్లి సర్వే నెంబరు 127లో 22 ఎకరాల భూమిలో రూ.20 కోట్లతో లాజిస్టిక్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం పాలనా పరమైన భవనం, పెద్ద గోదాం నిర్మాణం చేపడుతున్నారు. బొంగ్లూర్ ఔటర్రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రోడ్డును వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లాజిస్టిక్ పార్కుగా మంగళ్పల్లిలో ఏర్పాటు కాబోతున్న లాజిస్టక్ పార్కు పేరుపొందనుంది. అన్కాన్ సంస్థ పనులు శరవేగంగా చేస్తోంది. ఇక్కడ 250 ట్రాక్కులు ఒకే సారి వచ్చి నిలపడానికి వీలుంటుంది. డ్రైవర్లు సేదతీరడానికి గెస్ట్హౌజ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది లోపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అన్కాన్ సంస్థ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. -
నెలాఖరులోగా పనులు పూర్తి
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.రాజ్కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు 90 శాతం, శాఖపరమైన నిధులు పది శాతంతో గ్రామాల్లో చేపడుతున్న సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, గృహనిర్మాణాలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులంతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆయా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించినందునా సంబంధిత శాఖ అధికారులు ఈ నెలాఖరుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
మా ఊరిలో పనుల్లేవు
ఒంగోలు వన్టౌన్ : అద్దంకి మండలం జార్లపాలెంకు చెందిన పొగాకు బ్యారన్లో పని చేస్తున్న మహిళా కూలీలు పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే పని ఉంటుందని మిగతా రోజుల్లో ఉపాధి అవకాశాల్లేక వలసలు వెళ్తున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డిగా నామకరణం పీసీపల్లి: కొరిశపాడు మండలం పిచికలగుడిపాడు గ్రామానికి చెందిన గాదె సునీత కుమారునికి రాజశేఖరరెడ్డిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నామకరణం చేశారు. సోమవారం ప్రజా సంకల్పయాత్ర అలవలపాడు హైవే వద్దకు చేరుకోవడంతో ఆమె జగన్ను కలిసింది. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం తో పేరు పెట్టించినట్లు తెలిపింది. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్ఖాన్గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
‘ఉపాధి’లో కదలిక..
జిల్లాలో జాబ్కార్డులు 1,51,280 కూలీలు 3,21,283 మంది 2017–18 ఆర్థికసంవత్సర పనుల లక్ష్యం రూ.100కోట్లు ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల విలువ రూ.60 కోట్లు మిగతా పనులు పూర్తి చేసేందుకు ఉన్న గడువు 40 రోజులు ఆదిలాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.వంద కోట్ల లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించగా.. కొంతకాలంగా జిల్లాలో ఇవి నిలిచిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 40రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోమవారం నుంచి ఉపాధి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి సంస్థలోని సిబ్బందికి ఉపాధి పథకంపై శిక్షణ కూడా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలకు ఏడాది పొడవున పనులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. జిల్లాలో 1,51,280 జాబ్కార్డులు ఉండగా, 3,21,283 మంది కూలీలు పని చేస్తున్నారు. మార్చి 31 తర్వాత 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ ప్రణాళిక కార్యాచరణ రూపొందించేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ లోగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న పనులను ప్రారంభించి కూలీలకు మరిన్ని పనిదినాలను కల్పించనున్నారు. అయితే ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు జోరు గా సాగుతాయి. ఈ సమయంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు. దీంతో కూలీలంతా ఉపాధి పనులవైపే మొగ్గుచూపుతారు. నీటి సంరక్షణకు పెద్దపీట.. ఉపాధి హామీ పథకంలో వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసి ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90శాతం సాగు వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడనున్నారు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్మాణం, ఫీడర్ చానళ్ల ఏర్పాటు, తదితర పనులకూ ప్రాధాన్యత ఇస్తామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రూ.66 కోట్లు ఖర్చు.. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద రూ. 66కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.50 కోట్లు కూలీలకు, రూ.16 కోట్లు మెటీరియల్కు వెచ్చించారు. మార్చి 31లోగా మరో రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో లక్ష పదివేల పనిదినాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 30.98 లక్షల పనిదినాలు కల్పించారు. కొంత కాలంగా గ్రామాల్లో ఉపాధి పనులు పెండింగ్లో పడ్డాయి. పనులన్నీ చాలా మట్టుకు వ్యవసాయ పొలాల్లోనే చేస్తున్నారు. దీంతో పొలంలో సాగు చేసిన పంట ఉండడంతో ఇన్ని రోజులు పనులు జరగలేదు. ఇప్పుడు వచ్చేది ఎండకాలం కావడం, పొలాల్లో వేసిన పంటలను తొలగిస్తుండడంతో మళ్లీ ఉపాధి పనులు ఊపందుకోనున్నాయి. ఇందులో వర్షాకాలంలో నీటిని సంరక్షించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. నేటి నుంచి జిల్లాలో పనులు.. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను ప్రారంభించాలనే ఇప్పటికే ఉన్నతాధికారుల నుం చి ఆదేశాలు అందాయి. రూ.వంద కోట్ల ప్రణాళికతో ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేస్తున్నాం. ఇందులో నీటి సంరక్షణకు సంబంధించిన పనులు అధికంగా చేపట్టనున్నాం. వాటర్షెడ్ విధానం ప్రకారమే పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీఓ ఆదిలాబాద్ -
పైప్లైన్ మరమ్మతుల్లో ఒకరు మృతి
సాక్షి, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పైప్లైన్ మరమ్మతు పనుల్లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గూడెం గ్రామానికి చెందిన సాయి(18) పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. పక్కనే ఉన్న మట్టిపెళ్ల అతనిపై పడడంతొ అతను మృతిచెందాడు. ఇతను పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట చౌరస్తా వద్ద మృతదేహంతో అతని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేస్తున్నారు. -
యాదాద్రి గర్భాలయ పనులు వేగిరం
సాక్షి, యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గర్భాలయం పనులు వేగం పుంజుకున్నాయి. సీఎం కేసీఆర్ నవంబర్ 24న యాదాద్రికి వచ్చి పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పనులను వేగవంతం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మార్చి 31లోగా గర్భాలయంపై స్లాబు వేయడానికి ముందుగా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అయితే పనుల విభజన చేసుకుని ముందుగా ప్రధానాలయం, గర్భాలయం పనులను పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గర్భాలయం పైకప్పు వేయడానికి అవసరమైన కాంక్రీటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయానికి ఈనెలాఖరులోగా పైకప్పు వేసే విధంగా పనులు జరుగుతున్నాయి. గర్భాలయం పైకప్పు తర్వాత ప్రధానాలయం పైకప్పు వేయనున్నారు. ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. పడమర వైపు ఏడంతస్తుల ప్రధాన రాజగోపు రం, తూర్పు, ఉత్తరం వైపు ఐదంతస్తుల రాజగోపురాల పనులు చేపట్టారు. సివిల్ పనులతోపాటు శిల్పి పనులను ప్రధానాలయంలో చేస్తున్నారు. ఆళ్వార్ పిల్లర్లు, కాకతీయ శిల్పాల పనులు జరుగుతున్నాయి. నాలుగు మాడ వీధుల్లో దక్షిణభాగంలో రిటైనింగ్ వాల్ పనుల్లో జాప్యం యథావిథిగా కొనసాగుతుంది. ఇందుకోసం ఆయా విభాగాలకు చెందిన అధికారులు, స్తపతులు నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. విష్ణు పుష్కరిణి, లడ్డూ ప్రసాదం, మండప కాంప్లెక్స్లు, శివాలయం, ఇతర పనులను వేగవంతం చేస్తున్నారు. -
భ ‘రూసా’ అందేదెన్నడో ?
రూసా పథకం కింద రూ.10 కోట్లు మంజూరు ఏడాదిగా ఎస్పీడీ దగ్గరే మూలుగుతున్న నిధులు పలు అభివృద్ధి పనులకు బ్రేక్ ఎస్కేయూ: రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి నీతి అయోగ్ రూ. 20 కోట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తొలి విడత రూ. 10 కోట్లు అందిస్తున్నట్లు గతేడాది నవంబర్లో ప్రకటించారు. అనుకన్నదే తడువుగానే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూసా స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్కు పంపారు. ఇక్కడ నుండి ఆయా వర్సిటీలకు అందాల్సిన నిధులు అందివ్వాలి. నిధుల ఖర్చుకు సంబంధించి జవాబుదారీతనం.. పర్యవేక్షణ, నియంత్రణ, విధివిధానాలు, నియమ నిబంధనలు స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్. పీ.డీ) రూపొందించాలి. ఎస్.పీ.డీ పూర్తీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తారు. నిధుల జారీలో జాప్యం ఉన్నత విద్యలో నమోదు శాతం పెంపుదల, వర్సిటీలు, కళాశాలల్లో భవనాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు అందించడానికి రూసా పథకాన్ని అమలు చేస్తోంది. నిర్ధిష్ట గడువులోగా నిధులు అందించడంతో పాటు.. నిర్ధారించిన పనులను సత్వరంగా చేపట్టి సకాలంలో పూర్తిచేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ, పీజీలకు వెళ్లే వారి శాతం కేవలం 23 శాతం మాత్రమే ఉన్నట్లు రూసా గుర్తించింది. ఈ నమోదు శాతం ( డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థుల సంఖ్య పెంచడం) పెంపుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఅయోగ్ గణనీయమైన మొత్తంలో రూ. 20 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 10 కోట్లు జారీ చేసినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీడీ తమ వద్దే ఆ మొత్తాన్ని పెట్టుకోవడంతో రూసా పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బ్లాక్ గ్రాంట్లు అరకొరగా ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిధులు సకాలంలో అందివ్వడంలో అలసత్వం వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పనలో వర్సిటీ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. పనుల జాబితాను పంపాము నిధులను ఏయే వాటికి ఖర్చు పెడుతున్నారనే అంశంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం రూసా విభాగానికి ఇప్పటికే పంపాం. రెండు నూతన హాస్టళ్ల నిర్మాణం, ఒక ఇండోర్ స్టేడియం, డిజిటల్ తరగతులు, లైబ్రరీ డిజిటలైజేషన్, క్యాంటీన్ ఆధునీకరణ తదితర మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాము. ఎస్.పీ.డీ అడిగిన అన్ని డ్యాక్యుమెంట్లు పంపాం. – ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ -
రైతు నోట మన్ను కొట్టారు
ఇందిరా సాగర్పై నోరెత్తని ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజన నుంచి నిలిచిపోయిన పనులు తుప్పుపడుతున్న విలువైన యంత్రాలు ప్రాజెక్టు ఊసెత్తని ఏపీ ప్రభుత్వం జిల్లాలో 46 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధకం ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు నిరుపయోగం లక్ష్యం: 2.50 లక్షల ఎకరాలు మన జిల్లాలో: 46 వేల ఎకరాలు నిధుల మంజూరు వైఎస్ హయాంలో : రూ. 1824 కోట్లు ఖర్చు పెట్టింది: రూ. 900 కోట్లు 2014 నుంచి నిధులు: 0 చేసిన ఖర్చు: 0 చింతలపూడి: ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర జలవివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలోను చేరడంతో పథకాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా సాగర్ను రీ డిజైనింగ్ చేసి తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఆదేశించడంతో అక్కడి ఇరిగేషన్ అధికారులు ఆపనిలో మునిగి పోయారు. దీంతో మన రాష్ట్రానికి చెందిన పశ్చిమ, కృష్ణా జిల్లాల రైతుల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. 2005లో చింతలపూడి విచ్చేసిన అప్పటి ముఖ్యమంతి డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి ఆనాటి ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ సాగునీటి సమస్యను తీసుకువెళ్లగా ఆయన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి తద్వారా చింతలపూడి నియోజకవర్గానికి సాగు నీరు అందించడానికి అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రు 1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో ఎత్తిపోతలకు శంఖు స్థాపన చేశారు. అనంతరం వేలేరుపాడు మండలం రుద్రమకోటలో గోదావరి, శబరి నదులు కలిసే ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాజెక్టు పనులకు విభజనకు ముందు వరకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర్ర విభజన తరువాత అసలు సమస్య ప్రారంభమయ్యింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రాంతం ఆంధ్రాలో విలీనం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. ప్రాజెక్టు రూపకల్పన: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలలో 24.500 ఎకరాలకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 46 వేల ఎకరాలకు సాగునీరు అందు అందుతుంది. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో మెగా కిర్లోస్కర్, ఏఎంఆర్ ఇంటర్నేషనల్ సంస్ధలకు అప్పగించారు. 2012 లోనే పూర్తి కావాల్సిన ఎత్తిపోతల పనులు 50 శాతం కూడా పూర్తి కాకుండానే నిలిచిపోయాయి. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఎత్తిపోతలకు సంబంధించి మూడు చోట్ల పంప్ హౌస్లు నిర్మించడానికి భారీ కందకాలు తవ్వారు. వేలేరుపాడు మండలం అల్లూరినగర్, అశ్వారావుపేట మండలం ఆసుపాక, బండారుగూడెం ప్రాంతాల్లో పంప్హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇంత వరకు పంప్హౌస్ పనులు 20 శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ పంప్ హౌస్ల కోసం జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు గత 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో 6.8 వేల హెచ్పీ సామర్ధ్యం కలిగిన 18 మోటార్లు అవ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం వద్ద నిరుపయోగంగా వదిలి వేశారు. నోరు మెదపని ఆంధ్రా ప్రజా ప్రతినిధులు విభజన సమయంలో ఆంధ్రాలోని నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి అప్పటి ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక పోవడంతో ప్రాజెకుల్ట పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య సాగు నీటి వివాదాలు తలెత్తి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రా కాలువ ద్వాదా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా గోదావరి జలాలను రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్ధితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఇరిగేషన్ అధికారులు చర్చించుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుయితే తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీరు : రాష్ట్ర విభజన వల్ల ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం ముందుకు సాగే అవకాశం లేదు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలోనే తమ్మిలేరుకు గోదావరి జలాలను అందించే ప్రతిపాదన ఉంది. రైతులు అధైర్య పడాల్సిన పని లేదు. ఎం. అప్పారావు తమ్మిలేరు ఇరిగేషన్ డిఈ -
పోలవరం ఆర్అండ్ఆర్ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : పోలవరం ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో దినేష్కుమార్, స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, సంబంధిత ఆర్డీవోలతో సమీక్షించారు. నిర్వాశితులకు పునరావాసంలో భాగంగా 21 కాలనీలు చేపట్టాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఏడు కాలనీలు నిర్మించడం జరిగిందని, మరో 9 కాలనీలకు లే అవుట్లు సిద్ధం చేశారని కలెక్టర్ తెలిపారు. ఎటపాక డివిజన్లోని గ్రామాలలో అదనపు భూసేకరణ పనులను కూడా కలెక్టర్ సమీక్షిస్తూ, ఈ భూసేకరణ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, ఆర్అండ్ఆర్పై ప్రతీ సోమవారం సమీక్షించడం జరుగుతుందన్నారు. భూమికి బదులు భూమి పథకం కింద అవార్డ్పాస్ చేసిన 443 ఎకరాల భూమిని ఐటీడీఏకు అక్టోబర్ 31లోగా అందజేయాలని, ఈ భూమి ఐటీడీఏ రైతులకు, టైటిల్ డీడ్, పట్టాదారు పాస్పుస్తకంతో కలిపి నవంబర్ 30వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఈ భూములకు అవసరమైన రోడ్లను ఉపాధి హామీ సమన్వయం ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు దివ్యాంగులకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగిందని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్న దివ్యాంగులు పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్ కోర్టుహాలులో వికలాంగుల సంక్షేమశాఖ నిర్వహించిన బ్యాక్లాగ్ పోస్టులభర్తీలో ఎంపికైన వారితో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ మనోధైర్యంతో పనిచేస్తే అంగవైకల్యంను అధిగమించవచ్చని హితవుపలికారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ, ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. -
సాగునీరు లేకుండా చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న రైతులు వెయ్యి ఎకరాల్లో వరినాట్లు వేయని వైనం తరలివెళ్లిన పోలీసులు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు లేక వరినాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానం కారణం పైప్లైన్ పనులేనని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులకు ఆవలి పక్కనే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే నీరు పైప్లైన్ పనులకు ఇవతల వైపున ఉన్న 1,000 ఎకరాలకు అందాలి. పైప్లైన్ పనుల వల్ల నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఇంత వరకూ వరినాట్లు వేయలేకపోయారు.అదీ వారి ఆగ్రహానికి కారణం. దీంతో తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు, కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ. వెంకటేశ్వరావు, 20 మంది పోలీస్ సిబ్బంది తరలివెళ్లారు. అధికారులు ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆగస్టు 2కు వాయిదా వేసిందని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తే వాటి ఆధారాలు చూపాలని ప్రభుత్వ అడ్వకేట్ను కోరారని, అంతవరకూ పనులు చేయడానికి వీల్లేదని రైతులు కలగర బాలకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, ప్రసాద్, చల్లమళ్ళ విజయ్కుమార్ చౌదరి తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్ను పరిశీలించిన అధికారులు ఇందులో పనులు ఆపమని చెప్పలేలే అని వివరించారు. రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పనులు చేయమని ఆర్డర్ చూపాలని మెగా ఇంజనీరింగ్ ఆధికారులను నిలదీశారు. దానికి అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకునే అధికారం మీకు లేదని, కోర్టు అర్డరులో పనులు ఆపమని లేనందున పనులు యథావిదిగా చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంతేగాకుండా అధికారులు పోలీసుల రక్షణలో పనులు కొనసాగించారు. వరినాట్లు వేయడానికి తొర్రిగెడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు వెళ్లడానికి పైప్లైన్ వద్ద కాలువను కలుపుతామని చెప్పి తక్షణమే పనులు చేపట్టారు. దీనితో రైతులు మద్యాహ్న 1.30 గంటలకు అక్కడ నుండి తరలి వెళ్లారు. ఎత్తిపోతల పథకం పనులు యధావిదిగా కొనసాగించారు. -
ఓట్ల కోసమే రోడ్డు విస్తరణ..
-
ఎయిర్పోర్టు పనులను అడ్డుకున్న రైతులు
తమకు న్యాయం చేయాలని డిమాండ్ వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి సారథ్యం తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మధురపూడి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. తమ భూములకు పరిహారం, సాగునీరు, ఉపాధి, రోడ్లు అందించాలని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ) నిధులు కేటాయించాలని కోరుతూ రైతులు ఈ చర్యకు ఉపక్రమించారు. వైఎస్సార్సీపీ సీజీసీ జభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వారికి సారథ్యం వహించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టు అధికారులు, కాంట్రాక్టర్లతో రైతులు ఒక దశలో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా మధురపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరుకొండ తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించకుండా ఎయిర్పోర్టు విస్తరణ, రక్షణ గోడ పనులు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. రైతులు పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని తహసీల్దార్ హుస్సేన్కు అందించారు. దీంతో తహసీల్దార్ హుస్సేన్ రైతులను కోరుకొండలోని తన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లను సబ్కలెక్టర్ విజయకృష్ణన్, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కోరుకొండ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గరగ మధు, రైతు విభాగం కన్వీనర్ తోరాట శ్రీను, మధురపూడి రైతు నాయకులు గణేశుల పోసియ్య, ఆకుల రామకృష్ణ, నందెపు ప్రసాద్, పిల్లా పోలీసు, గణేశుల మాణిక్యాలు పాల్గొన్నారు. ఐక్యంగా ఉద్యమిద్దాం ఎయిర్ పోర్టు పనులను అడ్డుకున్న రైతులను ఉద్దేశించి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల సమస్యల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో కాలయాపన చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. -
చెత్త కారణాలు చెప్పొద్దు
పనుల్లో పురోగతి లోపిస్తే సస్పెండ్ చేస్తా – నెలాఖరు నాటికి అవెన్యూ ప్లాంటేషన్పై రిపోర్టులు పంపండి – ఫారంపాండ్స్లో వేగం పెరగాలి – మెసేజ్లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు – డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): మీరు చిన్న పిల్లలు కాదు.. పదే పదే చెప్పించుకోవద్దు.. బెదిరించి పనులు చేయించే స్థితికి తీసుకురావొద్దు.. చేపట్టిన పనుల పురోగతిపై చెత్త కారణాలు చెప్పకుండా, మర్యాదను పెంచుకోవాలంటు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ భవనంలో ఏపీడీ, ప్లాంటేషన్ మేనేజర్లు, డీఆర్పీఎస్లతో పీడీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు ఏ దశలో ఉన్నాయనే నివేదికలు పంపడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? రాష్ట్రంలో మన జిల్లా 21.20 శాతం సాధించి చివరి స్థానంలో ఎందుకు ఉంది?’’ అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతానికి చేరుకోవాలన్నారు. అలాగే హార్టికల్చర్ ప్లాంటేషన్పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రెండు సంవత్సరాల వయస్సు, 1.1/2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫారంపాండ్స్లో వేగం పెరగాలి తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టిన ఫారంపాండ్స్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటి వరకు 4వేలు మాత్రమే పూర్తయ్యాయని, పురోగతిలో ఉన్న 11వేల ఫారంపాండ్స్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్ల టార్గెట్ 6వేలు కాగా, ఇప్పటి వరకు 464 మాత్రమే పూర్తయ్యాయని, 4276 పురోగతిలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో వీటిని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 8,685 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1026 పూర్తి అయ్యాయని, మిగిలినవన్నీ పురోగతిలో ఉన్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెసేజ్లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు డ్వామా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యాక్రమాలకు సంబంధించి పురోగతిని పెంచేందుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెసేజ్ల రూపంలో పంపుతున్నా కొందరు పట్టించుకోవడం లేదని పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం నుంచే కాకుండా స్వయంగా తన సెల్ఫోన్ నుంచి మెసేజ్లు పంపుతున్నా స్పందించడం లేదన్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పీడీ హెచ్చరించారు. సమావేశంలో వాటర్షెడ్స్ ఏపీడీ రసూల్, ఎంఅండ్ఈ సులోచన, ఉపాధి హామీ పథకం సభ్యుడు సత్రం రామకృష్ణ పాల్గొన్నారు. -
సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
- పెద్దల నిర్మాణ బాగోతం - సాగు నీటికి బ్రేకులు - సాగును ప్రశ్నార్థకంలో పడేసిన నేతల స్వార్థం - రైతులకు నీటి కష్టాలు - గుక్కెడు నీటి కోసం జనం కటకట సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజలు ఎలాపోతే మాకేంటి ... మా జేబులు నిండితే చాలన్నట్టుంది అధికార పార్టీ నేతల తీరు. వారి స్వార్థం వేల ఎకరాల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పంట కాలువ వెంబడి పనుల కాంట్రాక్ట్లో పడి తమ స్వప్రయోజనాల కోసం అటు కోనసీమలోను, ఇటు సామర్లకోటల్లో పంట కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా నిలిపివేశారు. కేవలం రెండున్నర కోట్ల వ్యయంతో సామర్లకోట పంట కాలువపై నిర్మిస్తున్న వంతెన కోసం వేలాది మంది రైతుల కంట కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. అమలాపురంలో రూ.9.10 కోట్ల వ్యయంతో నల్లవంతెన–ఎర్రవంతెన మ«ధ్య పంట కాలువ పక్కన లాంగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అమలాపురం–చల్లపల్లి పంటకాలువ, మురమళ్ల–ఎదుర్లంక మధ్య, గాడిలంక–కర్రివానిరేవు మధ్య పంట కాలువల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పంట కాలువలకు అడ్డగోలుగా సాగు నీరు నిలిపివేశారు. దాదాపు ఈ పనులన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన బంధువులు, బినామీలే చేస్తున్నారు. ఈ కారణంగా వారి స్వార్థం కోసం పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయకుండా నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామర్లకోట కాలువపై వంతెన నిర్మాణంలో ఒక మంత్రి తనయుడు బినామీగా పనులు చేపడుతుండంతోనే వేలాది మందికి సాగు, తాగునీరు ఇబ్బంది కలుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. వారి నిర్వాకం ఫలితంగా జిల్లా కేంద్రం కాకినాడ నగరం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. ప్రతి ఏటా కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంట కాలువలకు ముందుగానే నీరు విడుదల చేశారని సంబరపడ్డ రైతులకు అమాత్యుని నిర్వాకంతో శాపమైంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం గోదావరి నుంచి సామర్లకోట గోదావరి కాలువకు విడుదలచేసిన నీటిని కడియం కొత్త లాకులను మూసేసి సరఫరా కాకుండా బంధించేశారు. నీటి విడుదల ఆనందం ఆవిరి... ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు ప్రభుత్వం అధికారికంగా సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరంలో నీరు విడుదల చేసిన 48 గంటల్లోపు జిల్లాలో ఏ పంట కాలువలోనైనా చివరి వరకు నీరు పారాల్సిందే. అధికారికంగా సాగునీరు విడుదల చేసి మంగళవారం నాటికి ఆరు రోజులయింది. ఇంతవరకు సామర్లకోట గోదావరి కెనాల్కు చుక్కనీరు సరఫరా కాలేదు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే నేతల స్వార్థం కోసం సాగునీటి సరఫరా నిలిపివేసిన బాగోతం బయటపడింది. కారణమిదీ... సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి గతేడాది జూన్ 3న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. రూ.1.99 కోట్లు అంచనా వ్యయం నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనా రూ.2.70 కోట్లకు పెరిగిపోయింది. ఏడాది తరువాత 18 రోజులు క్రితమే వంతెన పనులు మొదలుపెట్టడం గమనార్హం. వంతెన పనులు తెరవెనుక చక్కబెడుతున్న మంత్రి కుటుంబ సభ్యులు సామర్లకోట కెనాల్ నీటి సరఫరా నిలిపివేయించారని రైతులు మండిపడుతున్నారు. ఈ నీరే సాగుకు ఆధారం... ఈ కెనాల్ నుంచి సరఫరా అయ్యే నీరు సాగు, తాగుకు చాలా కీలకం. ఈ సాగు నీరుతో సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల ఆయకట్టుకు జీవం పోస్తుంది. ఈ కాలువకు నీరు వస్తే ఖరీఫ్ దమ్ములు చేసుకుందామని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. సామర్లకోట మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు, కాకినాడ రూరల్ రామేశ్వరం, గంగనాపల్లి, అచ్యుతాపురం గ్రామాలకు మరో 15వేల ఎకరాలకు సాగు నీరు సరఫరాకు బ్రేక్ పడింది. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు, తుని వరకు సుమారు 47 వేలు ఎకరాలకు సాగునీరు పిఠాపురం బ్రాంచి కెనాలే ఆధారం. లక్ష మందికి గొంతు తడిపే కాలువ ఇదే... సాగునీరే కాకుండా వేలాది మంది దాహార్తిని కూడా ఈ కాలువ తీరుస్తుంటుంది. చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల పరిధిలోని లక్షన్నర మంది గొంతు తడిపే కాలువ కూడా ఇదే. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 70 వేలు, పెద్దాపురం మున్సిపాలిటీలో 55 వేల జనాభాకు తాగునీరు మున్సిపాలిటీలు సరఫరా చేయాలి. ఇందు కోసం సామర్లకోటలో రెండు రిజర్వాయర్లున్నాయి. సామర్లకోట–కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయరు, ఉండూరు రైల్వే గేటు వద్ద నాగార్జున చెరువును ఏర్పాటు చేశారు. గోదావరి కాలువ నీటితోనే ఈ రెండు మున్సిపాలిటీలకు నీరు రిజర్వు చేశారు. సాంబమూర్తి రిజర్వాయరు పెద్దాపురం మున్సిపాలిటీ, నాగార్జున చెరువు సామర్లకోట మున్సిపాలిటీతో పాటు కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారానికి, కాకినాడ సీపోర్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. వేసవి తాపంతో రెండు చెరువులలో నీరు అడుగంటింది. దాంతో ఫిల్టరు ప్లాంటులకు నీరు అందని పరిస్థితి ఉంది. ఉన్న నీరు కూడా పసరు రంగుకు మారిపోయి నీరు చెడువాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ మంత్రి ఆదేశాలతోనే... గోదావరి కాలువలో వంతెన పనుల్లో భాగంగా రెండుగట్ల వైపు కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పై ఎత్తుకు వచ్చే వరకు ఈ కాలువ నీటిని విడుదల చేయవద్దని ఒక ఆమాత్యుని హుకుం. ఆయన చెప్పిందే తడవు ఇరిగేషన్ అధికారులు ‘జీ హుజూర్’ అంటూ నీటిని కడియం లాకుల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ఒక దిమ్మ నీటి మట్టం ఎత్తుకు రాగా, మరో దిమ్మ పునాదికే పరిమితమైంది. మరో వారం రోజుల వరకు ఈ పనులు పూర్తి అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇదే కాలువ నీరు సామర్లకోట నుంచి వీకే రాయపురం, మాధవపట్నం మీదుగా కాకినాడ వరకు వెళుతుంది. ఈ కాలువలో వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ కోసం నీరువిడుదల అపేస్తే వీకె రాయపురం, మాధవపట్నం వద్ద గోదావరి కాలువలకు అడ్డు కట్టలు వేసి మరీ కాలువ అవతలివైపు కొందరు నేతలు, రియల్టర్లు పంట పొలాలను లేఆవుట్ చేసుకోడానికి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడిపడితే అక్కడ ముడుపులు మెక్కేసి గోదావరి కాలువలో అడ్డుకట్టలు వేసిన నీటిపారుదల శాఖాధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికీ కటకటే... కాకినాడ నగరంలో కూడా గోదావరి నీరు సరఫరా లేకపోవడంతో ఉన్న నీరు దుర్వాసన వస్తోందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరట్లకట్ట వేసవి జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రజలకు రెండుపూటలా నీరు అందించలేని పరిస్థితిని నగరపాలక సంస్థ ఎదుర్కొంటోంది. వేసవి జలాశయంలో 45 రోజులుకు సరిపడేంతగా నీటిని నిల్వ చేసుకున్నా ముందస్తు ప్రణాళిక లేక గడచిన వారం రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుళాయిలు ద్వారా మురికినీరు సరఫరా అవుతుండటంతో నగరంలో సుమారు నాలుగు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. గాంధీనగర్, రామారావుపేట, పాతబస్టాండ్, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గోదావరి కాలువలు తెరచినప్పటికీ ఈ పరిస్థితి అధిగమించడానికి మరో నాలుగైదు రోజులుపైనే పడుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ‘గుక్కెడు నీరు రంగు మారి పొయింది’ గడచిన రెండు రోజులుగా తాగునీరు రంగు మారిపోయింది. నీరు చెడు వాసన వస్తుంది. గోదావరి కాలువకు నీరు వచ్చినా సామర్లకోటకు చేరకపోవడంతో తాగునీటి చెరువులు నింపుకునే అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్వాకంతో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. తుంపాల శ్రీనివాసు, సీఐటీయు మండల అధ్యక్షుడు, సామర్లకోట. బోరు నీరే శరణ్యం.... పెద్దాపురం మున్సిపాలిటీ ప్రజలకు బోరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి జలాలు విడుదల చేసినా బోరు నీరు తప్పడం లేదు. సాంబమూర్తి రిజర్వాయరులో నీరు చాలా రుచిగా ఉంటాయి. బోరునీరు చాలా చప్పగా ఉంటున్నాయి.పట్టణ ప్రజలందరికి గోదావరి జలాలు అందించాలి. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. షేక్ బేబీ, రామారావుపేట, పెద్దాపురం. ‘వర్షాలు లేవు...సాగునీరు లేదు’ గోదావరి కాలువలో నీరు వస్తే పంట భూముల్లో దమ్ములు చేసుకొవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వేసవి కాలంలోని ఎండలకు భూములు బీటలు వారాయి. సామర్లకోట–వీకే రాయపురం మధ్యలో గోదావరి కాలువకు అడ్డుగా తాత్కలికం మార్గం ఏర్పాటు చేసుకొని లేవుట్లు వేస్తున్నారు. దాంతో గోదావరి కాలువ నీరు పంట కాలువలకు రావడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెలమర్తి శ్రీనివాసు, రైతు సంఘ నాయకుడు, వికె రాయపురం. ‘ఐదు రోజుల్లో విడుదల చేస్తాం’ సామర్లకోట గోదావరి కాలువపై జరుగుతున్న వంతెన పనులతో గోదావరి జలాలు విడుదలకు అంతరాయం కలిగింది. కడియంలో నీటిని నిలుపుదల చేశాం. ఐదు రోజుల్లో వంతెన స్తంభాలు పూర్తవుతాయి. వెంటనే గోదావరి కాలువలో మట్టిని తొలగించి గోదావరి కాలువకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తాం. విజయకుమార్, ఇరిగేషన్ డీఈ, కాకినాడ -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
రూ 1.50 కోట్లు కడలి పాలు
- అమీనాబాద్ తీరంలో డ్రెడ్జింగ్ పనుల తీరు - నెల తిరక్కుండానే మూసుకుపోయిన ఉప్పుటేరు - బోట్లు ధ్వంసమవుతున్నాయని మత్స్యకారుల ఆందోళన పిఠాపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారయింది ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ పనులు. ఇసుక మేటలు వేసి బోట్లు వెళ్లడానికి వీలు లేదని దాన్ని లోతు చేయడానికి చేసిన పనులు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రంలో చేపల వేటకోసం వెళ్లే బోట్లు ఒడ్డుకు రావడానికి ఉప్పుటేరు అనువుగా లేకపోవడంతో లోతు చేసే పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించిన ఈ పనుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు సాగరతీరంలో మినీ హార్భర్ కోసం కేటాయించిన ప్రాంతంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన వందలాది మత్స్యకార బోట్లు నిలుపుతుంటారు. ఇక్కడ నిత్యం చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కాకినాడ హార్భర్లో ఇతర బోట్లను నిలపడానికి నిరాకరించిన నాటి నుంచి సుమారు పదేళ్లుగా రెండు మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు ఇక్కడే నిలుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పుటేరు సాగరతీరానికి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో బోట్లు ఒడ్డుకు చేరడానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మినీ హార్బర్ నిర్మాణానికి గత పదేళ్ల కిందటే 50 ఎకరాల భూమిని సేకరించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ప్రభుత్వాలు మారడంతో ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం వ్యయం రూ. 200 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో తమ బోట్లు ఒడ్డుకు తీసుకువచ్చే సమయంలో ఉప్పుటేరు మూసుకుపోవడం వల్ల బోట్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఇలా ప్రారంభం... దీంతో ఉప్పుటేరులో మట్టిని తొలగించి లోతు చేయడానికి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్బిలిటీ కింద నిధులు రూ. 1.50 కోట్లు వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు గత మార్చి 17వ తేదీన ప్రారంభించారు. ఓషన్ స్పార్కల్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను నిర్వహించగా ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. డ్రెడ్జింగ్ యంత్రంతో ఉప్పుటేరులో ఉన్న ఇసుక మట్టిని తీసి పక్కనే వేశారు. అయితే కేవలం ఇసుకను తీయడం తప్ప గట్లు పటిష్టం చేయకపోవడంతో ఇటీవల సముద్ర ఉథృతికి డ్రెడ్జింగ్ చేసిన ప్రాంతమంతా తిరిగి ఇసుకతో మూసుకు పోవడంతోపాటు గట్లు అండలు జారి ఉప్పుటేరులో కలిసిపోవడంతో బోట్లు బయటకు తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన పది రోజులు కూడా వినియోగించకుండానే నిరుపయోగంగా మారడంతో పనులు తూతూమంత్రంగా సాగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మట్టితో ఉప్పుటేరు మూసుకు పోవడంతో తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి బోట్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే మూసుకు పోయింది బోట్లు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తే ఇసుక తొలగించామన్నారు. కానీ వెంటనే మూసుకు పోయింది ఇప్పుడు బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు చేశారో తెలియడం లేదు. ఏకంగా రూ.1.50 కోట్లు వృథాగా పోయినట్లే వంకా నాగేశ్వరరావు , మత్స్యకారుడు, అమీనాబాద్. బోట్లు దెబ్బతింటున్నాయి.. డ్రెడ్జింగ్ చేశామని చెబుతున్న ప్రాంతంలో బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. వేట నిషేధం అమలులో ఉండగా బోట్లు మరమ్మతుల కోసం బయటకు తీద్దామంటే కదిలే పరిస్థితి లేదు. గతంలోనే బాగుండేది ఇప్పుడు ఉప్పుటేరు పూర్తిగా మూసుఉపోయి బోట్ల ఫ్యాన్లు విరిగిపోతున్నాయి. బోట్లు దెబ్బతింటున్నాయి. కంబాల జగన్నాధం,, మత్స్యకారుడు, అమీనాబాద్ -
నత్తనడకన పోలవరం పనులు
-
ఆగుతూ సా..గుతూ
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అడుగు ముందుకు.. రెండడుగులు వెనుకకు అన్నచందంగా తయారైంది. పనులను వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ ఆగుతూ.. సా..గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల పరంగా కలిసివచ్చే ప్రస్తుత సీజన్ లోనూ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగటం లేదు. బిల్లు చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలవరం : పోలవరం ప్రాజెక్ట్కు సంబం ధించి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు (ఎర్త్ వర్క్స్) పడకేశాయి. గతంతో పోలిస్తే రోజువారీ పనులు సగానికి పడిపోయాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా సబ్ కాంట్రాక్టర్లు పనులను నామమాత్రంగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రధాన కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థ సబ్–కాంట్రాక్టర్ అయిన త్రివేణి సంస్థకు పెద్దమొత్తంలో బిల్లుల్ని బకాయిపడింది. మిగిలిన సబ్–కాంట్రాక్టర్లకు సైతం బిల్లు చెల్లింపులు చేయడం లేదు. త్రివేణి ఆధ్వర్యంలో పనులు చేస్తున్న చిన్నపాటి కాంట్రాక్టర్లకు ఆ సంస్థ సైతం బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల వల్ల నెల రోజులుగా స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు పడకేశాయి. అలా అలా.. కానిస్తున్నారు స్పిల్ వే నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులకు ఇబ్బందులు కలగకుండా మాత్రమే మట్టి తొలగింపు పనులను చేపట్టగా.. అవికూడా లక్ష్యం మేరకు సాగటం లేదు. నెల క్రితం వరకు రోజుకు 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి 1.90 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తొలగింపు చేసిన త్రివేణి సంస్థ ప్రస్తుతం రోజుకు కేవలం 90 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పనులు చేస్తోంది. స్పిల్ చానల్ పనులు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. బ్లాస్టింగ్లు చేసే కొన్ని సంస్థలు సైతం బకాయిలు చెల్లించకపోవటంతో పనులు వదిలి వెళ్లిపోయాయి. లక్ష్యాల్ని చేరటం కష్టమే ఈ ఏడాది ప్రస్తుత సీజ న్ (జనవరి నుంచి జూ న్ వరకు)లో ప్రాజెక్ట్ పనులు నిర్దేశించిన లక్ష్యాలను చేరటం కష్టంగా కనబడుతోంది. స్పిల్ వే నిర్మాణానికి సంబంధించి 52 బ్లాక్లలో కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 4 బ్లాక్లకు సంబంధించిన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 బ్లాక్ల పనులు జరుగుతున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబం ధించి 139 కొలను (పాండ్స్) పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 పనులు పూర్తయ్యాయి. 669 మీటర్ల పొడవున పనులు చేయాల్సి ఉండగా, 206 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇవి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక 10.80 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా.. 3.60 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పడకేశాయి. వర్షాలు లేని సమయంలో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మహా అయితే, జూ న్ నెలాఖరు వరకు ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈలోగా లక్ష్యం మేరకు మట్టి తొలగించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల డీజిల్ లేదనే సాకుతో నాలుగు రోజులపాటు మట్టి తొలగింపు పనులను పూర్తిగా నిలిపివేసిన విషయం విదితమే. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజ న్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కదిలిస్తే కన్నీళ్లే!
కాటేస్తున్న కరువు రక్కసి - నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి - ఉపాధి పనుల్లేక కూలీల వలసబాట - పశుగ్రాసం కొరతతో సంతకాలకు పశువులు - కనికరించని ప్రభుత్వం - 2015-16 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా పరిహారం అతీగతీ లేకుండా పోయింది. - 2014 కరువుకు సంబంధించి ఐదు మండలాలకు రూ.73కోట్ల పరిహారం పెండింగ్లో ఉంది. - 2015 కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రూ.46 కోట్లు తక్కువ పడ్డాయి. ఫలితంగా 50వేల మంది రైతులు పరిహారానికి దూరమయ్యారు. - 2016-17లోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. పంటల్లేవు.. అప్పుల భారం నాకు 5.50 ఎకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో బోరు వేయించా. కేవలం అర ఇంచు మాత్రమే నీళ్లు పడ్డాయి. దీని కింద టమాట వేసిన. నీళ్లు సరిపోక ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు పెట్టిబడి పెట్టి వేరుశనగ సాగు చేసిన. 16 బస్తాలు వచ్చింది. పెట్టుబడిలో రూ.32వేలు మాత్రమే వచ్చింది. పశుగ్రాసం కొరత, నీటి సమస్యకు తట్టుకోలేక ఉన్న పశువులను అమ్మేసుకున్న. ప్రభుత్వం కరువు రైతును ఆదుకోకపోవడం దారుణం. - బంగారు రంగన్న, తుగ్గలి కర్నూలు(అగ్రికల్చర్): కరువు రక్కసి రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉపాధి లేకపోవడం.. తాగునీటి సమస్య.. పశుగ్రాసం కొరత.. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 7.50 లక్షల మందికి జాబ్కార్డులు పంపిణీ చేయగా.. 5లక్షల మంది ఉపాధి వేటలో ఉన్నారు. ఇందులో 1.50 లక్షల మందికి ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు కల్పిస్తుండగా.. మిగిలిన వారిలో అధిక శాతం వలసబాట పట్టారు. దాదాపు లక్ష మంది ఉపాధి పనుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరువులోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తాము సూచించిన గ్రూపులకే పనులు కల్పించాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో ఈ తరహా రాజకీయం సాగుతోంది. సాధారణ వర్షపాతం 609.7 మి.మీ.. కురిసింది 540.4 మి.మీ., 2016 జనవరి నెల నుండి 2017 మార్చి నెల వరకు జిల్లా సాధారణ వర్షాతం 605.7 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ప్రకారం వర్షాలు కురిస్తే కరువు జాడ ఉండదు. అయితే 540.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. గత ఏడాది జూన్, జులై, సెప్టెంబర్ నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లో వర్షపాతం తక్కువగానే ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల జిల్లాలో చెరువులు, కుంటలు, వాగుల్లో చుక్కనీరు లేదు. దీంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్యాపిలి, బేతంచెర్ల, కృష్ణగిరి, దేవరకొండ, సి.బెళగల్, గూడూరు మండలాల్లో 65 మీటర్లకు పైగా అడుగుకు భూగర్భ జలాలు చేరాయి. కంటతడి పెట్టిస్తున్న నీటి సమస్య జిల్లా ప్రజలు నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేయింబవళ్లు తిరిగినా నీళ్లు దొరకని పరిస్థితి. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో సగం గ్రామాల్లో 10 రోజులకు ఒక్కరోజు మాత్రమే పంచాయతీల ద్వారా నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అనేక గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. పశుపోషణ రైతులకు భారంగా మారింది. జిల్లాలో 9 పశువుల సంతలు ఉండగా, జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 66 వేల పశువులు, 2.50 లక్షల గొర్రెలను విక్రయించడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. నీటి తొట్లలో నీరు కరువు అన్ని గ్రామ పంచాయతీల్లో పశువుల సంఖ్యను బట్టి ఒకటి.. అంత కంటే ఎక్కువ నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నీటి తొట్లకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు ఇస్తారు. మూడు నెలలుగా హడావుడి చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నీటి తొట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదివరకే 700 గ్రామాల్లో నీటి తొట్లు ఉండగా, వీటిలో నీటిని నింపే వారు కరువయ్యారు. ప్రధానంగా కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. జూన్ నెల వరకు జిల్లాలో 35వేల టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొరతను అధిగమించేందుకు సైలేజి గడ్డి పంపిణీ, మొలకగడ్డి పెంపకం, అజోల్ల యూనిట్ల ఏర్పాటు, బావులు, బోర్లు ఉన్న రైతులకు గడ్డి పెంపకానికి 75శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పడిపోయిన దిగుబడులు గత ఏడాది ఖరీఫ్లో సాధారణ సాగు 6,20,763 హెక్టార్లు ఉండగా.. 6,56,214 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీలో సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు ఉండగా.. 3,13,219 హెక్టార్లు సాగు అయింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉత్పాదకత 22,35,214 టన్నులు సాధించాలనేది లక్ష్యం కాగా 19,52,724 టన్నులు సాధించారు. పెట్టుబడులు దక్కక నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. -
ఆరంభంలోనే అవినీతి పర్వం
- నిబంధనలు హుష్కాకీ ... ఇష్టారాజ్యంగా పనులు - రూ.80 లక్షలు కాలువలపాలు - నివ్వెరపోతున్న ఆయకట్టుదారులు అమలాపురం : డెల్టా ఆధునికికీరణ పనుల ఆరంభంలోనే అవినీతి పర్వానికి తెరలేచింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువ తవ్వకాలు చేపట్టి నాలుగు రాళ్లు జేబులో వేసుకునేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తుంటే అందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు కాక.. మరమ్మతులు జరగక అధ్వానంగా మారిన అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80 లక్షలతో కాలువలో పూడికతీత, రిటైనింగ్వాల్, మూడు స్లూయిజ్ల నిర్మాణాలు ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. కాలువలు మూసివేసిన సుమారు పదిహేను రోజుల తరువాత గత నెల 30 నుంచి పనులు ఆరంభించారు. పనులు ఆరంభించిన తొలిరోజు నుంచే ఇక్కడ అవినీతి అంకానికి తెరలేచింది. కాలువల్లో పూడిక తొలగించేముందు నిబంధనల ప్రకారం నీరు ఉండకూడదు. తీసిన మట్టిని కెనాల్ బ్యాంక్ (కాలువగట్టు )మీద వేసి గట్టును 1:1.5 స్లోపుతో పటిష్టం చేయాల్సి ఉంది. కానీ కాలువలో అడుగున అడుగున్నర లోతున నీరు ఉండగానే ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. వచ్చిన బురద, నీరుతో కలిసిన మట్టిని గట్ల మీద వేసి చేతులు దులుపుకుంటున్నారు. నీరు ఉండడం వల్ల నిబంధనల మేరకు లోతున కాలువ తవ్వుతున్నారా? లేదా? అనేది తేలియకుండా పోతోంది. పైగా బురద మట్టి వేయడం వల్ల కాలువ గట్టు పటిష్ఠంగా ఉండడం అటుంచి వచ్చే వర్షాకాలం మట్టి కాలువలోకి కొట్టుకుపోయి పూడుకుపోనుంది. ఇలా చేయకూడదని తెలిసి కూడా కాంట్రాక్టరు మూడు నాలుగు ప్రొక్లెయినర్లు పెట్టి యధేచ్ఛగా పనులు చేసుకుంటూపోతున్న తీరును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. రోడ్డు విస్తర్ణ ఉందని తెలిసి కూడా... అమలాపురం ఎర్రవంతెన– నల్లవంతెనల మధ్య ఓఎన్జీసీ చేపట్టిన బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలోనే ఆదరాబాదరగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. పూడిక తీసిన మట్టిన ఎన్టీఆర్ మార్గ్ వైపు వేసేందుకు వీలులేకుండా ఉండడంతో ఓఎన్జీసీ విస్తరించనున్న రోడ్డు వైపు గుట్టు మీద వేసి పట్టిష్టం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఈ గట్టును తెంచివేయనున్నారు. కాలువల్లో ప్రొక్లెయిన్లు తిరిగే అవకాశమున్నందున పూడిక తొలగింపు చేపట్టడం వల్ల ప్రయోజనంలేకుండా పోతోంది. పనులు చేశామని బిల్లులు నొక్కేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే పనులు చేస్తున్నామని ఇరిగేషన్ ఏఈ ఎస్.శివరామకృష్ణ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కాలువల్లో నీరు మళ్లించేందుకు బాటలు ఏర్పాటు చేసే పనులు చేస్తున్నామని, తరువాత పక్కాగా పనులు చేస్తామని ఆయన చెప్పారు. -
పనుల పితలాటకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయ్. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. 2018 నాటికి నీటిని విడుదల చేస్తాం’ ఈనెల 17న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఇది. ఆయన వచ్చి వెళ్లిన వారం రోజుల్లోనే అక్కడ పనులు నిలిచిపోవడం చర్చనీయాంశమైంది. ఆ రోజున అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ తీరుపై సబ్ కాంట్రాక్టర్లు ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే పనులు చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఎస్క్రో ఖాతా తెరిపించి నిధులను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది అమలు కాకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మట్టి తవ్వకం పనులు (ఎర్త్ వర్క్) చేస్తున్న త్రివేణి సంస్థకు ట్రాన్స్ట్రాయ్ నుంచి రూ.350 కోట్ల మేర బకాయి ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా ట్రాన్స్ట్రాయ్ యాజమాన్యం సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో వాళ్లు పనులు నిలిపివేశారు. 10 రోజుల క్రితం త్రివేణి సంస్థకు చెందిన ఎక్స్కవేటర్ దగ్ధమై రూ.30 కోట్ల వరకూ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనికి ఇన్సూరె¯Œ్స ఉందని, దానిని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, జర్మనీ నుంచి సాంకేతిక బృందం వచ్చి మరమ్మతులు చేయడానికి మూడు నెలలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయిన తీరు, ప్రధాన కాంట్రాక్టర్తో విభేదాలు తలెత్తడాన్ని చూస్తుంటే ఆ రోజున జరిగింది ప్రమాదమా లేక కావాలని అగ్నిప్రమాదం సృష్టించారా అన్న అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సుమారు రూ.60 కోట్ల విలువైన యంత్రంలో అగ్ని నిరోధక వ్యవస్థ ఉండదా.. కేవలం ఎండ వేడికే అది తగలబడిపోతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధాన సబ్ కాంట్రాక్ట్ సంస్థ త్రివేణి ఆదివారం నుంచి పనులు నిలిపివేయగా.. ఆ సంస్థ ఆధ్వర్యంలోని చిన్నపాటి కాంట్రాక్టర్లు కూడా సోమవారం నుంచి పనులు నిలిపివేశారు. దీంతో ప్రాజెక్ట్ ప్రాంతంలో మట్టి తవ్వకం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కరోజు ప్రాజెక్ట్లో పనులు నిలిచిపోతే రూ.21 కోట్లు నష్టం వస్తుందంటున్న ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఇంకా స్పందించ లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత వివాదాలను చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సకాలంలో పూర్తువుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ప్రక్షాళన ఫలించేనా!
భీమవరం : డెల్టా కేంద్రమైన భీమవరం పట్టణం, పరిసర గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేపడుతుందా.. ఆ డ్రెయిన్ను కాలుష్య కాసారంగా మార్చేసిన ప్రజాప్రతినిధులు, బడాబాబుల ఒత్తిడికి తలొగ్గకుండా పారదర్శకంగా పనులు చేస్తారా లేక తూతూమంత్రంగా కానిచ్చేసి చేతులు దులిపేసుకుంటారా.. ఇలాంటి అనుమానాలెన్నో డెల్టా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్క్ పనులను నిలిపివేయాలంటూ మూడేళ్లుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో యనమదుర్రు డ్రెయిన్ పక్షాళన అంశం తెరపైకి వచ్చింది. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తయితే యనమదుర్రు డ్రెయిన్ మాదిరిగానే గొంతేరు డ్రెయిన్ కూడా కాలుష్య కాసారంగా మారి ప్రజా జీవనానికి ముప్పు తెస్తుందనే ఆందోళన వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయా లేదా అనేది చర్చనీయాంశమైంది. పర్యావరణానికి.. ప్రజారోగ్యానికి సవాల్ డెల్టాలోని ప్రధాన డ్రెయిన్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుసవాల్ విసురుతున్నాయి. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారం కాగా.. గొంతేరు డ్రెయిన్ సైతం రొయ్యల చెరువుల నుంచి రసాయనాలు,, మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ వ్యర్థాలు చేరటం వల్ల కలుషితమైంది. ఈ పరిస్థితుల్లో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ యనమదుర్రు డ్రెయిన్ను తలదన్నేలా కలుషితమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టాకు తాగు, సాగునీటిని అందించిన యనమదుర్రు కాలువలోకి తణుకు ప్రాంతం నుంచి మొదలుకొని భీమవరం వరకు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, చెత్త కలుస్తుండటంతో కాలువ డ్రెయిన్గా రూపాం తరం చెందింది. ఒకప్పుడు యనమదుర్రులో గోదావరి నదిని తలదన్నే విధంగా మత్స్య సంపద ఉండేది. ఎక్కడికక్కడ వలకట్లు, గరికట్లు ఉండేవి. దిగువ గ్రామాలకు జలరవాణా వ్యవస్థ ఉండేది. ఇందులోకి విష రసాయనాలు, కాలుష్యం పెద్దఎత్తున చేరడంతో యనమదుర్రు కాలువ హైదరాబాద్లోని మూసీ నదిని తలపిస్తోంది. మత్స్య సంపద పూర్తిగా కనుమరుగైంది. కాలుష్య నియంత్రణ చట్టం ఉన్నా అమలులో చిత్తశుద్ధి కరువైంది. తణుకు, వేండ్ర ప్రాంతాల్లోని పరిశ్రమలు.. వాటికి దిగువన గొల్లలకోడేరు తదితర ప్రాంతాల్లో వెలసిన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి నిత్యం టన్నులకొద్దీ కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్లోకి చేరుతోంది. పరిశ్రమలు కామన్ ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను ఏర్పాటు చేసుకుని వ్యర్థ, మురుగు జలాలను శుద్ధిచేసిన అనంతరం బయటకు విడుదల చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నేరుగా యనమదుర్రు డ్రెయిన్లోకి వదిలేస్తున్నారు. భీమవరం పట్టణ, పరిసర ప్రాంతాల్లో యనమదుర్రు డ్రెయిన్ గట్టు వెంబడి ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాలి్సన దుస్థితి ఉంది. డ్రెయిన్ గట్ల వెంబడి నివసించే వారంతా అనారోగ్యం బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆక్రమణలకు అంతేలేదు ఎంతో విశాలమైన యనమదుర్రు గట్లు ఆక్రమణల కారణంగా డ్రెయిన్ కుచించుకుపోయింది. డ్రెయిన్ గట్ల వెంబడి కొందరు పక్కా భవనాలు నిర్మించుకోగా.. మరికొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఒక ఆక్వా ప్లాంట్ డ్రెయిన్ గట్టు వెంబడి ఎకరాలకొద్దీ ఆక్రమించి రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భీమవరం–గరగపర్రు ప్రధాన రహదారి పక్కనే ఈ ఆక్రమణ కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణదారులు ప్రజాప్రతినిధుల అండతో అధికారులకు ముడుపులు ముట్టచెప్పి తమకు అడ్డులేకుండా చూసుకుంటున్నారు. డ్రెయిన్ను ఆక్రమించుకుంటున్న, కాలుష్య కాసారంగా చేస్తున్న వారిలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ డ్రెయిన్ ప్రక్షాళన అంశంపై మంగళవారం భీమవరంలో నిర్వహించే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిం ది. వేండ్రలోని డెల్టా పేపర్ మిల్లు కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్లో కలుస్తోంది. ఇది నరసాపురం ఎంపీ గోకరాజు గంగారాజు అధీనంలో ఉంది. పలు ఆక్వా ప్లాంట్ల యజమానులు కూడా టీడీపీ నేతలకు వెన్నుదన్నుగా ఉన్నవారే. ఈ నేపథ్యంలో సమావేశం కానున్న ప్రజాప్రతినిధుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. -
..అయితే ఓకే!
– నీరు–చెట్టు పేరుతో దోపిడీకి ఎత్తుగడ – నాలుగు నెలలుగా 73 పనులకే అనుమతులు – రెండు రోజుల్లో ఏకంగా 1600 పనులకు ప్రతిపాదనలు – ఉన్నతాధికారి బదిలీ సమాచారంతో హడావుడి – నోట్ల కట్టలతో తిరుగుతున్న టీడీపీ నాయకులు – కొందరు ఇంజినీరింగ్ అధికారులతో ఒప్పందాలు! – వాటాలు కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం కర్నూలు సిటీ: జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి బదిలీ అవుతున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు ఆదాయ వనరుగా ఉన్న నీరు- చెట్టు పనులను దక్కించుకునేందుకు యత్నాలు మొదలు పెట్టారు. కొందరు ఇంజినీరింగ్ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఓ అధికారి అంతా తానే చేస్తున్నట్లు.. డబ్బులిస్తే పని అయిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. పనుల కోసం భారీ ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు..వాటాలు ఇస్తామంటూ ఏకంగా నోట్ల కట్టలను పట్టుకొని తిరగడం చర్చనీయాంశమైంది. నీరు- ప్రగతి, నీరు- చెట్టు.. దశాబ్దాలుగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాగుల్లో పేరుక పోయిన పూడిక తీసి భూగర్భజలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు. వీటిలో నీరు–చెట్టు కింద చేపడుతున్న పనులు అధికార పార్టీ నేతలకు, కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి నీరు–చెట్టు కింద పూడిక తీత పనులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సాంకేతిక గణాంకాల ఆధారంగా అంచనాలు ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. సమావేశాల్లో టీడీపీ నేతలు ఈ విషయంపై అడిగితే ప్రతిపాదనలు తీసుకొని అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జనవరి నెల నుంచి సుమారు 920 పనులు ప్రతిపాదనలు చేస్తే కేవలం 73 పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే ఇటీవల జిల్లా ఉన్నతాధికారి బదిలీ అవు తున్నారనే సమాచార నేపథ్యంలో రెండు రోజుల నుంచి జలమండలిలో నీరు–చెట్టు పనుల ప్రతిపాదనల హడావిడి నెలకొంది. దోపిడీకి ఎత్తుగడ...! జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ పరిధిలో కర్నూలు, నంద్యాల డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 157 చెరువులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 477 చెరువులు ఉన్నాయి. గత రెండేళ్లుగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాగుల్లో పేరుకపోయిన పూడిక తీసేందుకు నీరు–చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఉన్నతాధికారి బదిలీ అయ్యే అవకాశం ఉండడంతో సదరు అధికారికి ప్రతిపాదనల పైళ్లను కుప్పలు తెప్పలుగా పంపుతున్నారు. దీనికితోడు ఓ అధికారి అంతా తానే నడిపిస్తున్నట్లు మీరు ప్రతిపాదనలు ఇవ్వండి ఓకే చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఇందుకు అంచనాలపై అనుమతి వచ్చిన వెంటనే ఒక శాతం ఇవ్వాలని ఒప్పంద చేసుకుంటున్నారు. రెండు రోజుల్లోనే చిన్న నీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్ పరిధిలోని మండలాల్లో నుంచి సుమారు 1600 పనులకు అనుమతులు తీసుకునేందుకు ఉన్నతాధికారిని కోరినట్లు తెలిసింది. నంద్యాల డివిజన్ నుంచి కూడా సుమారు వెయ్యికి పైగా పూడికతీత పనుల జాబితా తయారు అవుతున్నట్లు ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచే 500 పనులకు అనుమతులు కోరే అవకాశం ఉంది. తాత్కలిక ఒప్పందాలు...! నీరు–చెట్టు కింద చేపట్టే పూడికతీత పనులకు సంబంధించి అంచనాలు తయారు చేసే దగ్గర నుంచి చేసిన పనికి బిల్లు చేసే వరకు వాటాల విషయంలో తాత్కలిక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంచనాలు వేసి, అనుమతులు తీసుకవచ్చేందుకు ఒక శాతం, అగ్రిమెంట్ చేసేందుకు 0.5 నుంచి 1శాతం, పనికి బిల్లు చేసేందుకు ఒక్కో చోట ఒక్కో శాతం వాటాగా నిర్ణయించారు. కొంత మంది ఇంజినీర్లు ఏకంగా ‘మీ మండలంలో పనులకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకునేందుకు కొంత నగదు ఖర్చు పెట్టుకోండి మీకెన్ని పనులు కావాలో చెప్పండి’’ అంటూ నేరుగా మండల స్థాయిలోని టీడీపీ నాయకులతో బేరం కుదుర్చుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నాయకలు నోట్ల కట్టలతో కర్నూలు చేరుకోవడం చర్చనీయాంశమైంది. అవన్నీ ఆరోపణలే – ఎస్.చంద్రశేఖర్రావు, పర్యవేక్షక ఇంజనీర్, జలవనరుల శాఖ నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపట్టేందుకు పక్కాగా అంచనాలకే అనుమతులు కోరుతున్నాం. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఇంజినీర్ల నుంచి భారీగా పనులకు అంచనాలు వస్తున్న మాట వాస్తవమే. అన్ని విధాలుగా కరెక్టుగా ఉంటేనే అనుమతులిస్తామని ఏఈలకు సూచిస్తున్నాం. పనులకు సంబంధించి ఎలాంటి వాటాలు లేవు. అవన్నీ ఆరోపణలే. -
కుప్పంకు కృష్ణమ్మ వచ్చేనా?
-
ఉసురు తీస్తున్న ఉపాధి
ఏలూరు (మెట్రో) : పెదపాడు మండలం ఎస్.కొత్తపలి్లకి చెందిన ఇతని పేరు బూర్లు శ్రీనివాసరావు. ఈనెల 14న అదే గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చెరువులో పూడిక తొలగింపు పనులు చేస్తుండగా.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. పనులు చేపట్టిన ప్రాంతంలో ప్రథమ చికిత్స కిట్, ఎండనుంచి రక్షణ కల్పించేందుకు గుడారం వంటి సౌకర్యాలు కల్పించి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవి. అలాంటి ఏర్పాట్లేవీ చేయకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పనిచేస్తేనే కాని పూట గడవని పేదలు ఏటా వేసవిలో ఉపాధి పనులకు వెళుతున్నారు. ఎండవేడిమి తాళలేక కొందరు మరణిస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా, తాజాగా ఒకరు మరణించారు. సౌకర్యాలేవీ పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి్సన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కాసేపు సేదదీరేందుకు నీడలేక.. ఎండలోనే ఉంటూ అనారోగ్యం పాలవుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు. జిల్లాలో 5.36 లక్షల మందికి జాబ్ కార్డులు మంజూరయ్యాయి. వీరిలో 2.50 లక్షల మంది ఈ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద పనులు చేసేందుకు వచ్చే కూలీలకు పనిచేసే ప్రదేశంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బకు గురి కాకుండా గుడారాలు ఏర్పాటు చేయాలి. తాగునీటిని సైతం అందుబాటులో ఉంచాలి. కూలీలు గాయపడినా.. సొమ్మసిల్లి పడిపోయినా ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన కిట్లను సైతం సమకూర్చాల్సి ఉంది. అయితే, అధికారులు వీటి ఏర్పాటును విస్మరించడంతో ఎండబారిన పడుతున్న కూలీలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలావుంటే.. కూలీలు పనిలో ఉండగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక నిధులు లేవు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధుల కేటాయింపులు లేవు. కూలీలు 75శాతం పనిచేస్తే వారి ఖాతాల్లో 100 శాతం పనులకు కూలీ చెల్లిస్తున్నాం. మరణించిన కూలీలకు రూ.50 వేలు పరిహారం ఇస్తాం. – ఎం.వెంకటరమణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ -
కొమ్మమూరు..కన్నీరు
కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. కాంట్రాక్టు సంస్థ వందల కోట్ల విలువైన కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయి. పనులు చేయాల్సిన గడువు ముగిసిపోయినా.. పలుమార్లు నోటీసులిచ్చినా కనీసం స్పందించని కాంట్రాక్టు సంస్థపై సర్కారు చూపుతున్న వల్లమాలిన ప్రేమలో పదో వంతు కూడా తమపై లేదని రైతులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా వర్షాకాలంలోనూ కాలువలో సక్రమంగా నీరు పారక.. సాగునీరందక రైతులు ఏటా నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ► కాలువ రాదు.. చేను తడవదు ► ఏటా అన్నదాతకు అవస్థే ► తొమ్మిదేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ ► పనుల విలువ రూ.196 కోట్లు ► ఇప్పటి వరకు చేసింది రూ.50 లక్షల పనులే ► ఈ ఏడాదీ మొదలుకాని పనులు చీరాల: కృష్ణాడెల్టా పరిధిలో ఎప్పుడో కాటన్ దొర సమయంలో కాలువల పనులు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. దీంతో ఏటా సాగునీరందక రైతులు విలవిల్లాడుతున్నారు. రైతుల మొర ఆలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2 వేల కోట్లతో కృష్ణాడెల్టా ఆధునికీకరణ చేయాలని సంకల్పించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి వనరైన కొమ్మమూరు కాలువను నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు రూ.196 కోట్లతో ఆధునికీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి కాలువలకు 2007లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 47 కిలోమీటర్ల పొడవున నల్లమడ నుంచి పెదగంజాం వరకు ఉన్న కొమ్మమూరు కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంకెన్నేళ్లు.? కృష్ణా డెల్టా ఆ«ధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తయి తొమ్మిదేళ్లు సమీపిస్తున్నా కనీసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ అండర్ కన్స్ట్రక్షన్సంస్థ పనులు పూర్తి చేయడం లేదు. ముందుగానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వం చెల్లించింది. గతంలో సంభవించిన లైలా, జల్, ఓగ్ని, నీలం, థానే వంటి తుఫాన్లకు కొమ్మమూరు కాలువ కరకట్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ కట్టలు సైతం బలహీనపడి కోతకు గురయ్యాయి. కృష్ణా డెల్టా నుంచి కొంత మేర నీరు వదలినప్పటికీ కొమ్మమూరు కాలువలకు ఇరువైపులా బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడి చుట్టు పక్కల ఉన్న పొలాలను నీరు ముంచెత్తుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంతోనే కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి పూర్తి స్థాయిలో కాకుండా నామమాత్రంగా కొమ్మమూరు కాలువకు నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన దిగువ ప్రాంతాలకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో, కాటన్ దొర హయాంలో జరిగిన మరమ్మతులు మినహా మరలా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి జరగలేదు. ఆధునికీకరించాల్సింది ఈ విధంగా... కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా సాగునీటి కాలువ కొమ్మమూరు కెనాల్ను 47 కిలో మీటర్ల మేరకు ఆధునికీకరించాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లాలో నల్లమడ కాలువ నుంచి కాలువ చివరి ప్రాంతమైన పెదగంజాం వరకు పనులు చేయాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు తవ్వడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హై పర్టిక్యులర్స్ పద్ధతి ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.50 లక్షలను ఖర్చు పెట్టి పెదగంజాం ప్రాంతంలో కొన్ని కల్వర్టులు మాత్రమే నిర్మించారు. గడువు పూర్తై చాలాకాలం అయినా కృష్ణా డెల్టా ఆధునికీకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చాం...పెనాల్టీలు విధించాం – ఇరిగేషన్ డీఈ, విజయ్కుమార్, చీరాల. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థకు పనులు చేయని కారణంగా పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అలానే నష్ట పరిహారం విధించినా ఆ సంస్థ స్పందించడం లేదు. ఏదో ఒక కారణంతో గడువును పొడిగించుకుంటున్నారు. కొమ్మమూరు ఆ«ధునికీకరణ జరిగితేనే జిల్లాలోని రైతులకు మేలు జరుగుతుంది. -
ఉపాధిలో నిర్లక్ష్యంపై కొరడా
-ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి వారం వేతనాలు నిలుపుదల - 22 మండలాలకు కలెక్టర్ ఉత్తర్వులు - ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు కోవెలకుంట్ల: జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ విజయమోహన్ కొరడా ఝుళిపించారు. ఫిబ్రవరి నెల లక్ష్యాన్ని చేరడంలో అలసత్వం వహించిన 22 మండలాల ఎంపీడీఓలు, ఉపాధి పథకం సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఆ పథకం ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఆయా మండలాల ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలకు వారం రోజులపాటు వేతనాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖరీఫ్, రబీసీజన్లలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం జిల్లాలో 36 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి పనుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేబర్ బడ్జెట్ మార్చి 196 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి నెలవరకు 140 లక్షల పనిదినాలు పూర్తి కాగా 56 లక్షల పనిదినాలు మిగిలిపోయాయి. వలసల నియంత్రణే ధ్యేయంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో కలెక్టర్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆయా మండలాలకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఒక్కో మండలంలో రోజుకు కనీసం 5 వేల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. 22 మండలాలకు వేతన నిలుపుదల ఉత్తర్వులు.. నంద్యాల రెవెన్యూ డివిజన్లో జనవరి నుంచి వ్యవసాయ పనులు ముఖ్యంగా మిరప కోత పనులు ముమ్మరంగా ఉండడంతో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా ఆయా మండలాల్లో కూలీల సంఖ్య తగ్గిపోయింది. దీంతో లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించలేకపోయారు. బేతంచెర్ల, కర్నూలు, నంద్యాల, గూడూరు, కౌతాళం, బనగానపల్లె, మిడుతూరు, చాగలమర్రి, అవుకు, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, పాణ్యం, మహానంది, వెలుగోడు, సంజామల, గడివేముల, కోవెలకుంట్ల, నంద్యాల, రుద్రవరం, గోస్పాడు, బండిఆత్మకూరు, శిరువెళ్ల మండలాల్లో పనిచేస్తున్న ఏపీఓలు, ఈసీలు, కొందరు టెక్నికల్ అసిస్టెంట్లకు వారం వేతనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మార్చినెలకు సంబంధించిన వారం రోజుల వేతనాన్ని ఏప్రిల్ నెల వేతనంలో కట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు నిర్ధేశించిన లక్ష్యంలో 25శాతం మించని ఆ పథకం పీఓలుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలకు షోకాజ్Œ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి సిబ్బందికి వేతనాలు నిలుపుదల, ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు అందటంతో అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు. -
శివయ్యా.. కనవయ్యా!
శ్రీశైలంలో ఎక్కడి పనులక్కడే! - ఏ రోడ్డు చూసినా గుంతలమయమే.. - భక్తులు ఈ ఉత్సవాల్లోనూ తిప్పలే - దుమ్ము లేస్తున్నా పట్టని అధికారులు - శివరాత్రి సమీపిస్తున్నా కొనసాగుతున్న పనులు - ఎప్పటిలానే విడిదికి తప్పని ఇక్కట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చే భక్తులకు ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవు. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులు కూడా ఇంకా పూర్తికాకపోవదం చూస్తే భక్తులకు ప్రతి ఏటా వచ్చే ఇబ్బందులు ఈ విడత కూడా తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన రహదారిలో ఇంకా రోడ్ల ఏర్పాటు పనులు పూర్తికాకపోవడంతో కళ్లల్లో దుమ్ముతోనే దేవుని దర్శనానికి వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ శివరాత్రి సందర్భంగానైనా సాధారణ భక్తులకు కాసింత విడిది సౌకర్యం కల్పించేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆది నుంచీ అంతే..! వాస్తవానికి శ్రీశైలంలో జరిగే పనుల వ్యవహారం మొదటి నుంచీ ఇదే విధంగా ఉంటోంది. ఉత్సవాలు సమీపించే సమయంలో పనులు చేపట్టడం.. తీరా ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత హడావుడిగా పనులను నాసిరకంగా చేపట్టడం అలవాటుగా మారింది. అటు కాంట్రాక్టర్లకు, ఇటు ఉద్యోగులకు ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారం అనే చందంగా తయారయ్యింది. ప్రతి ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలతో పాటు గత ఏడాది జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలోనూ ఇదే తంతు జరిగింది. ఇటు పుష్కరాల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు పనులు చేపట్టారు. ఇది భక్తులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ప్రస్తుతం కూడా శివరాత్రి సందర్భంగా ఇదే వ్యవహారం సాగుతోంది. కనీసం ఆలయం వద్దకు వెళ్లే ప్రధాన రహదారి పనులు కూడా పూర్తి చేయలేదంటే పనులు జరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది. శ్రీశైలంలో పనుల వ్యవహారం ఎప్పుడూ ఇంతేననే విషయం ఈ విడతలోనూ నిరూపితమైంది. భక్తులకు సౌకర్యాలేవీ? ప్రతి ఏటా భక్తులకు విడిది సౌకర్యం కష్టతరంగా మారుతోంది. ఆలయం ముందే భక్తులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. చలువ పందిళ్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. శ్రీశైలంలో శివరాత్రి సమయంలో విడిది సౌకర్యం కేవలం వీఐపీలకే పరిమితమవుతోందనే విమర్శలున్నాయి. సాధారణ భక్తులకు ఎక్కడ చూసినా రూంలు ఖాళీ లేవనే సమాధానమే ఎదురవుతోంది. ఈ సారైనా సాధారణ భక్తులకు కాసింత విడిది సౌకర్యం కల్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులకు భూమిపూజ
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో నిర్మించనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు శుక్రవారం డీజీపీ అనురాగ్శర్మ భూమిపూజ చేశారు. రూ. 350 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 19 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భవనంలో నాలుగు టవర్లు, 20 అంతస్థులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
శివ...శివా... చూడవయ్యా ఈ సిత్రాలు
మూడునాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు పది రోజులు గడవక ముందే గోతులు పడ్డ ఫ్లోరింగ్ పంచారామ క్షేత్రంలో నాసిరకంగా అభివృద్ధి పనులు నేడు ఉప ముఖ్యమంత్రి రాజప్ప సమీక్ష సమావేశం సామర్లకోట : పంచారామ క్షేత్రంలో అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పది రోజులు గడవక ముందే పెచ్చులూడిపోతుండడం పట్ల అటు భక్తులు, ఇటు ఆలయ పాలకవర్గం, అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప ఆలయ అధికారులు, ట్రస్ట్బోర్డు సభ్యులతో బుధవారం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోటితో అభివృద్ధి పనులు పురాతన క్షేత్రం కావడంతో పురావస్తు శాఖ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆలయం అభివృద్ధికి రూ.కోటి నిధులు విడుదల కావడంతో ఆ శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో గార్డెన్ పెంపకం పనులు పూర్తి చేశారు. కోనేరు వరకూ సీసీ రోడ్డు, కోనేరు చుట్టూ మెట్లు ఏర్పాటు చేశారు. కోనేరు దిగువ భాగంలో జిగురు మట్టి ఉండటం వల్ల లోనికి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి ఇసుక వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనేరు అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ఓ దాత కూడా ముందుకు వచ్చారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం పైనుంచి ఆకతాయిలు కోనేరులోనికి దూకుతున్నారు. ఇప్పటి వరకు జిగురు మట్టిలో కూరుకుపొయి ఇద్దరు యువకులు మృతి చెÆందారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కోనేట్లో పుణ్య స్నానాలు చేస్తారు. మహాశివరాత్రి నాటికి ఇసుకు వేసి భక్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కొరుతున్నారు. నాసిరకంగా ప్లోరింగ్ పనులు ఆలయ ఆవరణలో ప్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. ఆలయ దిగువ భాగంలోని ఉప ఆలయాల చుట్టూ ఫ్లోరింగ్ పనులను గానుగు సున్నంతో చేశారు. పనులు పూర్తి చేసిన 10 రోజులు గడవక ముందే ఫ్లోరింగ్ పెచ్చులూడిపోయి గోతులు ఏర్పడటంతో ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు ముక్కున వేలు వేసుకున్నారు. గోతులు పడ్డ ప్రదేశంలో తిరిగి మరమ్మతులు చేయడం వల్ల అందంపోయి అతుకులు వేసిన్నట్టు ఉంటుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆలయ ప్రవేశంలో మెట్లు, గణపతి ఆలయం, శ్రీకుమారస్వామి ఆలయం వద్ద ఫ్లోరింగ్పై గోతులు పడ్డాయి. మొదటి అంతస్తులో ప్రాకారం చుట్టూ చేసిన ఫ్లోరింగ్ కూడా పాడై పోయింది. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నాసిరకంగా జరిగాయని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద కూడా పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయనని చెబుతున్నారు. ఫ్లోరింగ్ పనులకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పురావస్తు శాఖ సీఐ దృష్టికి తీసుకు వెళ్లారు. కోనేరులో ఇసుక వేయాలి పంచారామ క్షేత్రం కోనేరులో భక్తులు స్నానాలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది స్నానాలు చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో జిగురు మట్టిని తొలగించి ఇసుక వేయాలి. కొత్త నీటితో కోనేరును నింపాలి. - నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు, సామర్లకోట అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగిన మాట వాస్తవమే. దీనిపై ట్రస్టు బోర్డుతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యను పరిష్కారిస్తాం. - కంటే జగదీష్మోహనరావు, ట్రస్టు బోర్డు చైర్మన్, సామర్లకోట -
ప్రాజెక్ట్ అదే.. శంకుస్థాపన పదేపదే
నేడు డయాఫ్రం వాల్ పనులకు శ్రీకారం ప్రచారం కోసమే చంద్రబాబు రాక నెల క్రితం ప్రారంభించిన స్పిల్వే పనులు నత్తనడక సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక ప్రాజెక్ట్కు ఎవరైనా ఒకసారి మాత్రమే శంకుస్థాపన చేస్తారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవం చేస్తారు. చంద్రబాబు సర్కారు ఈ విషయంలో అంతా రివర్స్. ఒకే ప్రాజెక్ట్లో ప్రతి పనికి ఒక్కోసారి శంకుస్థాపన చేయడం.. అదే అంశంపై పదేపదే గొప్పలు చెప్పుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి నెలకోసారి వచ్చే చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేయడానికి బుధవారం ముహూర్తం పెట్టుకున్నారు. గత నెలలో అర్భాటంగా ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే కాంక్రీట్ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదు. నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. గత నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పిల్వే కాంక్రీట్ పనులను ప్రారంభించిన విషయం విదితమే. ఈ నెల రోజుల్లో కేవలం 2వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే చేశారు. 52 బ్లాక్ల్లో 12 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉండగా, లక్ష్యం ప్రకారం రోజుకు 3 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. అయితే నెల రోజుల్లో కేవలం 2 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. నేడు రెండు పనులకు శంకుస్థాపన స్పిల్వే గేట్లను అమర్చడానికి అవరసమైన మెటీరియల్ సిద్ధం చేశారు. డయాఫ్రం వాల్ మెటీరియల్ సైతం సిద్ధం చేశామని చెబుతున్నారు. ఈ రెండు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలావుంటే.. స్పిల్వేకు సంబంధించి 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.44 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. ఇంకా 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉంది. స్పిల్ చానల్ అప్రోచ్ చానల్కు సంబంధించి 7.76 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు చేయాల్సి ఉండగా, 4.76 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయి. పవర్హౌస్ నిర్మాణానికి సంబంధించి 86.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉండగా, 60 లక్షలు మీటర్ల పనులయ్యాయి. నాబార్డు నిధులు గత పనులకే సరి డిసెంబర్ నెలలో నాబార్డు నుంచి వచ్చిన నిధులు గతంలో చేసిన పనులకే సరిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ పనులు చేస్తున్న సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో పడ్డాయి. సొమ్ముల కోసం సబ్ కాంట్రాక్ట్ సంస్థలు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తెస్తున్నాయి. గత వారంలో మట్టి పనులు చేసే త్రివేణి సంస్థ ఆ పనులు నిలిపివేయడానికి సన్నద్ధం కావడంతో కొంత మొత్తం ఇచ్చి సర్దుబాటు చేశారు. నాబార్డు నిధులన్నీ ఖర్చయిపోవడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒక్క పైసా కూడా లేదు. కేంద్ర బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయిస్తే తప్ప ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. -
వంశధార పనుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
వంశధార ఫేజ్-2 పనుల్లో ఉద్రిక్తత
-
మట్టి పనులు వేగవంతం చేయాలి
ఏపీ జెన్కో డైరెక్టర్ నాగేశ్వరరావు దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పవర్ హౌస్ నిర్మాణానికి అవసరమైన మట్టి పనులను వేగంగా పూర్తిచేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనికోసం దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామం వద్ద కొండపై జరుగుతున్న పనులను ఏపీ జెన్కో సలహాదారు జి.ఆదిశేషు, పలువురు అధికారులతో కలిసి నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి జెన్కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వారికి వివరించారు. ఈ సందర్భంగా జెన్కో డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ 68 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరిగిందన్నారు. మరో 40 లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉందని, దానిని మార్చి నాటికి పూర్తిచేస్తే ఏప్రిల్ నెలలో పవర్హౌస్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. ఇప్పటికే విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు, ఎస్ఈ పి. రంగనాగన్, ఈఈ వీఎస్ఎన్ రాజు, డీఈలు కోటేశ్వరరావు, రాజ్కుమార్, ట్రాన్స్ట్రాయ్ మేనేజర్ మల్లికార్జునరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
భువన్ నిఘా
ఏలూరు (మెట్రో) : ‘భువన్’ భారత ప్రభుత్వం ఇస్రోతో తయారు చేయించిన ప్రత్యేక మొబైల్ యాప్. మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అమలులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఉపాధి హామీ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కొనసాగనుంది. పూర్తి చేసిన పనుల వివరాలను భువన్ యాప్ ద్వారా అంతర్జాలంలో నమోదు చేస్తారు. దీనిని ‘జియో మన్రె’గా పిలుస్తారు. ఇప్పటివరకూ పూర్తి చేసిన పనులను జియో మన్రెలో నమోదు చేయకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల మం జూరు ఆగిపోయింది. అందుకే ఆగమేఘాలపై పనుల వివరాలు భువన్ యాప్ ద్వారా జియోమన్రెగా వెబ్లోకి అప్లోడ్ చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులన్నింటినీ తప్పనిసరిగా భువన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో కోటిపైనే పనిదినాలు జిల్లాలో 5 లక్షల 37 వేల మంది జాబ్కార్డుల ద్వారా ఉపాధి హామీ పనులు పొందుతున్నారు. వీరికి రు.194 కనీస వేతనంగా రోజుకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 96 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే వాటికి మించి 1.06 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ పనులన్నింటినీ గత నెల మొదటి నుంచి భువన్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిని ఉద్యమంలా చేపడుతున్నట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు. ఎవరైనా చూడొచ్చు ఇప్పటివరకూ జిల్లాలో పూర్తి చేసిన ఉపాధి పనులన్నీ భువన్ యాప్ ద్వారా వెబ్లోకి అప్లోడ్ చేయాలి. ఈ పనిని సాంకేతిక సహాయకులు (టీఏ), క్షేత్ర సహాయకులు (ఎఫ్ఏ)లకు అప్పగిం చారు. వీరందరకూ ఇప్పటికే ఈ భువన్ యాప్లోకి జిల్లాలోని పనులను అప్లోడ్ చేస్తున్నారు. అవినీతిని అడ్డుకునేలా.. ఇప్పటి వరకూ నిర్వహించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను ఇకనుంచి ఫొటో తీసి భువన్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందే. దీని వల్ల ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండదు. జిల్లాలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టినా, చెరువు పనులు నిర్వహించినా ప్రతి పనీ ఫొటోలు తీసి, దానికి సంబంధించిన వివరాలు యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. – ఎం.వెంకటరమణ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ -
పనుల్ని పరుగెత్తించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ, సేద్యపు నీటి పనుల ప్రగతిని పరిశీలించేందుకు వచ్చే వారం నుంచి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. ఎక్కడైనా పనులు నత్తనడకన సాగుతుంటే సహించేది లేదని హెచ్చరించారు. సేద్యపు నీటి పథకాల తీరు, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ, జల రవాణా ప్రాజెక్టు పనుల తీరుపై అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. డెల్టా ఆధునికీకరణకు సంబంధించి 10 ప్యాకేజీల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. యనమదుర్రు డ్రెయిన్ పరిధిలో 39 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు వారం రోజుల్లో పూర్తి కావాలన్నారు. జనవరి 5 నాటికి నాట్లు నాట్లు పూర్తవ్వాలి జిల్లాలో రైతులకు మూడో పంట వేసుకోవడానికి అనుమతించిన దృష్ట్యా రబీ పంట ముందుగానే పూర్తి చేయాలని, జనవరి 5 నాటికి రైతులంతా నాట్లు పూర్తి చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరిని ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాసయాదవ్ , ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల పాల్గొన్నారు. -
19న కాంక్రీట్ పనులు ప్రారంభం
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో ఫౌండేష¯ŒSకు సంబంధించి కాంక్రీట్ పనులను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. స్పిల్వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడును ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం పనులకు రూ.2,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంక్రీట్ నిర్మాణం పనులకు 18వేల మెట్రిక్ టన్నుల ఇనుము, 10 లక్షల టన్నుల సిమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోనే గేట్లు తయారు చేస్తారన్నారు. రోజూ 2లక్షల 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 14,828 వేల ఎకరాల భూమి సేకరించామని, పాత భూసేకరణ చట్టం ప్రకారం రూ.520 కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా కుక్కునూరు, వేలేరు పాడు ప్రాంతాల్లో 12వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందన్నారు. నెలలో భూసేకరణ పనులు పూర్తిచేస్తామన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎకరానికి రూ. 10.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పనుల పరిశీలన అనంతరం ట్రా¯Œ్సట్రాయ్ ఏజెన్సీ కార్యాలయంలో ఇరిగేష¯ŒS అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులతో పనులు జరుగుతున్న తీరుపై ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ప్రాజెక్టు సీఈ ఎస్.హరిబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పారేపల్లి రామారావు, ఎంపీపీ పైల అరుణకుమారి, జెడ్పీటీసీ కుంజం సుభాషిణి, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ కేటీవీ రవికుమార్, డిప్యూటీ ఎస్ఈ కె.వెంకటేశ్వరరాజు, ఈఈ పి.మునిరెడ్డి పాల్గొన్నారు. -
సత్వరమే పనులు పూర్తి చేయండి
- క్రీడా సముదాయాల నిర్మాణంపై ఒలింపిక్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్సు ఆథారిటి స్టేడియంలో రూ. 6 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఒలింపిక్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆదివారం స్థానిక స్టేడియం ప్రాంగణంలో నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. క్రీడా సముదాయాల నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్ లాంటి క్రీడాంశాల సాధనకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అలాగే బాక్సింగ్, రెజ్లింగ్, తైక్వాండో, చెస్, క్యారమ్స్, రైఫిల్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ క్రీడాంశాలకు వినియోగించుకోవచ్చన్నారు. స్పోర్ట్సు అథారిటి స్టేడియం అధికారులు తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడంతోపాటు కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే హంద్రీ–నీవా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని, త్వరితగతిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను పూర్తి చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి హంద్రీ – నీవాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు తాగు, సాగునీటి కోసం ఫీడర్ ఛానెల్ తవ్వేందుకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించారు. అలాగే ఆమిద్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసేందుకు వెంటనే టెండర్లు పిలిచి లిఫ్ట్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ పనులను వచ్చే ఖరీఫ్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. = వజ్రకరూరు నుంచి పొట్టిపాడు మీదుగా మకాం వేయడంతో పంటలను కాపాడామని తాము కూడా మాట్లాడామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వివరించారు. ఇన్ పుట్సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్ గన్ లను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం ’అనంత’ రైతుల్లో జరుగుతోందని, ఈ క్రమంలో పరిహారం ఇవ్వడమే ఉత్తమమని చెప్పినట్లు తెలిసింది. చివరకు జిల్లాలో ఎంత పంట ఎండింది, ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అంచనాలు సిద్ధం చేయించి నివేదికలు పంపితే ఆలోచిద్దామని సీఎం చెప్పారు. ఇన్సూరెన్స్ పైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 12 కిలోమీటర్ల మేర పైపులై¯ŒS నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని జిల్లానేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణకు కమిటీ వేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 12కిలోమీటర్లకు అదనంగా నిధులు కేటాయించి పైపులై¯ŒS నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అలాగే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో తలెత్తే ప్రమాదముందని, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లానేతలు చంద్రబాబును కోరారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తనకు నివేదికను పంపాలని ఆయన సూచించారు. వచ్చే నెల 2న గొల్లపల్లిలో గంగపూజ 2012లో జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా నీళ్లొచ్చినా, ఇప్పటి వరకూ గొల్లపల్లికి చేరలేదు. అయితే.. డిసెంబర్ 2న గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్లొదిలి గంగపూజ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆరోజు గొల్లపల్లికి నీళ్లివ్వడంతో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్కు ఎప్పటిలోగా నీరిస్తామనే తేదీని కూడా ప్రకటిస్తామని, అందుకు వీలుగా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో తెలుసుకోవడానికి అధికారులు, ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఓ నివేదికను పంపాలని మంత్రులను సీఎం ఆదేశించారు. జిల్లానేతల మధ్య విభేదాలపై సీఎం గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం, ఓ నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఒకట్రెండుసార్లు చెప్పి చూస్తామని, అయినా మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశానికి అనంత ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి గైర్హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సీఎంకు కన్పించి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. -
పక్క‘దారి’ పనులు..!
∙తలుపుమ్మలోవలో చిరుద్యోగుల ఇష్టారాజ్యం ∙ఈఓకు తెలియకుండా రూ.14 లక్షల పనులు ప్రారంభం సాక్షి ప్రతినిధి–కాకినాడ : తలుపులమ్మలోవ దేవస్థానంలో కొండపైకి వెళ్లే రహదారి అభివృద్ధి పనులు హడావుడిగా సాగుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. యథావిధిగా ఆలయ ఈఓ తన విధులు నిర్వహించడానికి కొండపైకి వెళ్తుండగా అక్కడ జరుగుతున్న పనులు చూసి ఆశ్చర్యపోయారు. తనకు తెలియకుండా ఈ పనులు ఎవరు చేస్తున్నారంటూ అక్కడి పనివారిని అడగ్గా మీరే చేయమన్నారని చెబితే చేస్తున్నామన్న సమాధానం విని ఆయన అవాక్కయ్యారు. ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీస్తే తనకు తెలియకుండా తనతో సంతకం చేయించుకుని మరీ ఆ పనులు చేపట్టినట్లు గుర్తించిన ఆయన సిబ్బంది నిర్వాకానికి తలపట్టుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే తలుపులమ్మలోవ దేవస్థానంలో రాజకీయ అండతో పాతికేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగులు ఉన్నతాధికారులకు తెలియకుండా రూ.లక్షల విలువైన పనులు నిర్వహిస్తూ నిధులు పక్కదారిపట్టిస్తున్నారు. లోవ దేవస్థానం కొండకు వెళ్లే ఘాట్రోడ్డు విస్తరణ, అభివృద్ధి పేరుతో రూ.14 లక్షల విలువైన పనులను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే 25 ట్రాక్టర్ల వరకు మట్టిని తోలేసి పనులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించి ఏ పని నిర్వహించాలన్నా ఈఓ ఆయా పనుల ప్రపోజల్స్ను ఇంజనీరింగ్ సిబ్బందికి పంపించాల్సి ఉంది. కానీ ఈఓకు సంబంధం లేకుండా ఈ పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగి కాంట్రాక్టరు వద్ద డబ్బు తీసుకుని నేరుగా పనులు అప్పగించేశాడు. రాజకీయ అండతో ఆలయంలో చక్రం తిప్పుతున్న సదరు ఉద్యోగి ఆలయ ఇతర సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని ఈఓ పరోక్షంలో ఈ పనులు చేపట్టాడు. ఈ పనులకు అనుమతులు తీసుకోవడానికి ఆ ఉద్యోగి ఈఓకు తెలియకుండా ఆయన చేతే ఇతర పనుల్లో భాగంగా సంతకాలు తీసుకుని ఈపనులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై సదరు ఉద్యోగిని ఈఓ నిలదీయడంతో రాజకీయ నాయకులతో ఈఓపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఆలయ ఈఓను వివరణ కోరగా రహదారి నిర్మాణం విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
వలసబాటలో మృత్యుఒడి
- వనపర్తి వద్ద ఆటో బోల్తా - పెద్దమర్రివీడుకు చెందిన వ్యక్తి, చిన్నారి మృతి గోనెగండ్ల: పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన రెండు కుటంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. సొంతూరులో పనులు లేక పిల్లాపాలతో వలస వెళ్తుండగా చోటు చేసుకన్న ప్రమాదంలో ఓ వ్యక్తి, చిన్నారి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్దమరివీడు గ్రామం నుంచి బుధవారం సాయంత్రం 18 మంది మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి ఆటోలో వలస వెళ్లారు. మార్గమధ్యంలో కొత్తకోట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మాదన్న (45), అదే గ్రామానికి చెందిన రమాదేవి, నరసింహుడు దంపతుల కుమార్తె మమత(3) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో అక్కడ పత్తి కోతలు ఉండటంతో కూలీ గిట్టుబాటు అవుతుందని వలస వెళ్తుండగా ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
పోలవరం ఎప్పటికి..
రెండేళ్లలో సాధ్యమేనా! పూర్తిగా నిలిచిన పనులు తరచూ ఇదే దుస్థితి ‘రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం’ అంటూ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ మాటలు వట్టిదేనని పనుల పురోగతిని చూస్తే స్పష్టమవుతోంది. పనులు నత్తనడకన సాగడం, తరచూ నిలిచిపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం : ‘అక్టోబర్ నెలకల్లా స్పిల్వే ప్రాంతంలో కాంక్రీట్ పనులను ప్రారంభించేందుకు వీలుగా ఎర్త్వర్క్ పనులు పూర్తిచేయాలి. సోమవారాన్ని పోలవరంగా మారుస్తున్నా.. ప్రతివారం సమీక్షిస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా చెప్పారు. అయితే ఆయన చెప్పినంత వేగంగా పనులు సాగడం లేదు. తరచూ నిలిచిపోతున్నాయి. శనివారం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. అయినా ఇప్పటివరకూ ముఖ్యమంత్రి స్పందించలేదు. సోమవారంమైనా స్పందిస్తారో లేదో చూడాలి. బకాయిలు, జీతాలు చెల్లించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఇప్పటివరకూ స్పిల్ చానల్ పనులను చేస్తూ.. స్పిల్వే ఎర్త్వర్క్ పనులను త్రివేణి సంస్థకు సబ్కాంట్రాక్టుగా అప్పగించింది. ఆ సంస్థకు ట్రాన్స్ట్రాయ్ సుమారు రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉండడంతో త్రివేణి సంస్థ పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే ట్రాన్స్ట్రాయ్ కంపెనీలో పనిచేస్తున్న సమారు 200మంది కార్మికులు జీతాలు చెల్లించటం లేదంటూ విధులు బహిష్కరించారు. కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో ట్రాన్స్ట్రాయ్ చేస్తున్న పనులూ నిలిచాయి. ఇప్పటివరకూ రోజుకు దాదాపు 50 వేల క్యూబిక్మీటర్ల ఎర్త్వర్క్ పనులను త్రివేణి సంస్థ చేసేది. ట్రాన్స్ట్రాయ్ సంస్థ కేవలం 15వేల నుండి 20 వేల క్యూబిక్మీటర్ల పనులు మాత్రమే చేసేది. ఇప్పుడు ఈ పనులను కూడా త్రివేణి సంస్థకు అప్పగించి, కేవలం మట్టి తవ్వకానికి సంబంధించిన అప్రోచ్ చానల్ పనులకే ట్రాన్స్ట్రాయ్ పరిమితమైంది. పనుల నిలిపివేతపై త్రివేణి సంస్థ ప్రతినిధిని అడగ్గా.. డీజిల్ కొరత వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. నిర్మానుష్యంగా నిర్మాణ ప్రాంతం పనుల నిలిపివేతతో రెండురోజులుగా పోలవరం నిర్మాణ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడూ హడావుడిగా, యంత్రాల శబ్దాలు, వందలాది మంది కార్మికులతో కళకళలాడే ఈ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇటీవల కాలంలో మొత్తం పనులు నిలిచిపోవటం ఇదే తొలిసారి. ఒక చోట పనులు నిలిచిపోయినా మరోచోట జరిగేవి. ప్రతిసోమవారం ప్రాజెక్టు నిర్మాణపై సమీక్షిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పనుల నిలిపివేతపై స్పందిస్తారో లేదో వేచిచూడాలి. -
నూతన కలెక్టరేట్ల పనులు పూర్తిచేయాలి
వీడియో కాన్పరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సంగారెడ్డి జోన్: కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు ఈ నెల 11న ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ప్రకటించిన 27 జిల్లాలకు తోడుగా ఇటీవల నిర్ణయించిన నాలుగు కొత్త జిల్లాలను కలుపుకోని మొత్తం 31 జిల్లాల తుది నోటిఫికేషన్ ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు జారీ చేస్తామన్నారు. 119 కొత్తమండలాలు, 20 కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా నోటిఫికే షన్ జారీ చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నియామకానికి సంబంధించిన వర్క్ టూ ఆర్డర్ ఆదేశాలను ఆయా శాఖల అధిపతులు ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకే విడుదల చేస్తారన్నారు. అ«ధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా డ్రాఫ్ట్ ఆర్డర్ టూ సర్వ్ పత్రాలను ఈ నెల 10న తెలియజేస్తామన్నారు. ఒక్కో శాఖకు సంబంధించి అధికారులు సిబ్బందితో కూడిన వర్క్ టూ ఆర్డర్ తెలియజేసే 31 జీవోలను జారీ చేస్తామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కలెక్టరేట్లలో పని చేసే అధికారులు, సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, డివిజన్ కార్యాలయ సిబ్బంది, మండల అధికారులు, మండల కార్యాలయాల సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలన్నారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం నిర్దేశించిన మంత్రులు, జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించాలన్నారు. కలెక్టర్లు తమకు కేటాయించిన కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రీతిలో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్య, జిల్లా కోశా«ధికారి వంటికార్యాలయాలను ప్రారంభించాలన్నారు. ప్రారంభ కార్యక్రమాలనీ కేవలం కొత్త జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రముఖులను , మీడియాను భాగస్వామ్యం చేసి పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లాలో సిద్దిపేట, మెదక్లో కలెక్టరేట్లు, కార్యాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కొత్తజిల్లాలో పాలనకు ఏర్పాట్లు చేసి ప్రజలకు సేవలందిస్తామన్నారు. కాన్ఫరెన్స్లో జేసీ వెంకట్రాంరెడ్డి, ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముస్తాబవుతున్న కార్యాలయాలు
అల్లాదుర్గం: వట్పల్లి గ్రామాన్ని ప్రభుత్వం నూతన మండలం చేయడంతో కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల కోసం భవనాలను ఎంపిక చేశారు. భవనాల్లో తాత్కాలికంగా ఫర్నిచర్, బోర్డులను రాశారు. శనివారం జోగిపేట సీఐ వెంకటయ్య పోలీస్ స్టేషన్కు కేటాయించిన భవనంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అల్లాదుర్గంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్ భవనంలో ఏర్పాట్లు చేపట్టారు. భవనం చుట్టూ పొదలు తొలగించారు. ముందు భాగంలో చదును చేశారు. కార్యాలయాల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
వెలగపూడి రియాల్టి షో
-
‘కొత్త’ దిశగా..
- సిద్ధమవుతున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు - ఖమ్మం నుంచి తరలివచ్చిన కంప్యూటర్లు - దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు - కలెక్టరేట్ పనుల్లో నిమగ్నమైన రెవెన్యూ సిబ్బంది కొత్తగూడెం: కొత్త జిల్లాల పాలనకు విజయదశమే ముహూర్తం కావడంతో నూతన కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం సింగరేణి శాప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల కోసం గదులను ముస్తాబు చేస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ డిస్పెన్సరీ నుంచి ఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పనులన్నీ చకచకా సాగుతున్నాయి. విజయ దశమి రోజున కొత్తజిల్లాల కార్యకలాపాలు ప్రారంభించాలని, జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సింగరేణి అప్పగించిన భవనాలను కలెక్టర్ పాలన కార్యాలయం, ఎస్పీ పాలన కార్యాలయాలుగా తీర్చిదిద్దే పనుల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించింది. జిల్లా కలెక్టరేట్ కోసం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి శాఫ్ కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో సింగరేణి కంప్యూటర్లు, ఆన్లైన్ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే జరిగేవి. కలెక్టరేట్లోని వివిధ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు భవనంలోని గదులను తీర్చిదిద్దుతున్నారు. కలెక్టర్ గదితోపాటు సిబ్బంది ఉండేందుకు వీలుగా రూమ్లను సిద్ధం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో మొత్తం 21 గదులు, ఒక హాల్ ఉంది. జిల్లా ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్ భవనంలో జిల్లా ట్రెజరీ, వెనుకబడిన తరగతుల గృహనిర్మాణ సెల్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ఏర్పాటు చేసే భవనంలోని గదులను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. కంప్యూటర్లు సిద్ధం దసరా నాటికి జిల్లా కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పనులను ప్రారంభించేందుకు ఖమ్మం కలెక్టరేట్ నుంచి 24 కంప్యూటర్లు, ఐదు ప్రింటర్లను పంపించారు. వీటిని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సిద్ధం చేశారు. జిల్లా ప్రారంభం నుంచే పాలన కొనసాగాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త మండలాల పనులను ప్రారంభించారు. మండలాలకు సంబంధించిన ఫైళ్లను వేరు చేసే పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్ వచ్చిన తర్వాత కొత్త మండలాలకు పూర్తి పనులు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లా పేరుతో ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశాలు రావడంతో మండలాల వారీగా మీ సేవలో వేరు చేస్తున్నారు. దసరా తర్వాత ధ్రువీకరణ పత్రాలు కొత్త జిల్లాల పేరుతో రానున్నాయి. చురుగ్గా ఎస్పీ కార్యాలయం పనులు ఎస్పీ కార్యాలయం కోసం సింగరేణి సంస్థ కార్పొరేట్ డిస్పెన్సరీని కేటాయించింది. గత ఐదేళ్ల నుంచి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో చుట్టూ పొదలు, చెట్లతో నిండిపోయింది. ప్రస్తుతం పోలీస్ శాఖ అధికారులు చుట్టూ చెట్లను తొలగింపజేశారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సరిపోయే విధంగా గదులను తయారు చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్లు చేస్తున్నారు. భవనం చుట్టూ గుంతలు ఉండటంతో మట్టిని తొలగించి వాటిని చదును చేయిస్తున్నారు. దసరా వచ్చేస్తుండటంతో పనులను త్వరితగతిన చేపట్టేందుకు కొత్తగూడెం డీఎస్పీ సురేందర్రావు ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి. -
సా..గుతున్న ‘ముచ్చుమర్రి ’
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంత్రులు, జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు జరుగుతున్న పనులకు చాలా వ్యత్యాసం ఉంది. నవంబర్లో మూడు పంపులతో ట్రయల్రన్, డిసెంబర్లో ప్రాజెక్టును జాతికి అంకితం ప్రకటన గడువులోపు నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంపుల అమరిక, అప్రోచ్ చానల్ కాలువ పనులు కూడా పూర్తికాలేదు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్వాటర్ నికర జలాలను వినియోగంలోకి తీసుకోరావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అకాల మరణంతో పనులు ముందుకు సాగడం లేదు. 16 పంప్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎత్తిపోతల పనులో్ల ప్రస్తుతం 8 పంప్లకు సంబంధించిన అర్త్ వర్క్ పనులు తుది దశకు చేరుకోగా మరో నాలుగు పంప్ల పనులు అసంపూర్తిగా శ్రీశైలం బ్యాక్వాటర్లో ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్ట్ పనుల పురోభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గత ఆగష్టు 15 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అధికారిక ప్రకటన చేశారు. తర్వాత జిల్లా కలెక్టర్ గత నెలలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను పరిశీలించి నవంబర్ పదిహేను నాటికి కేసీ కాలువకు మూడు పంపుల ద్వారా ట్రయల్రన్ నిర్వహిస్తామని డెడ్లైన్ విధించారు. అంతేకాదు హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు డిసెంబర్ పదిహేను నాటికి 8 పంప్లతో నీటిని సరఫరా చేసి ప్రాజెక్ట్ను జాతీకి అంకితమివ్వాలని కాంట్రాక్టర్లకు, పర్యవేక్షక నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే ప్రాజెకు్ట పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలంటే మరో ఏడాదికి పైగా పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల్లో కనిపించని పురోగతి ముచ్చుమర్రి పంప్హౌస్ నుంచి సిద్ధేశ్వరం వరకు 6 కిలో మీటర్ల పొడువు ఉండే అప్రోచ్ చానెల్ కాలువ పనులు పూర్తి కాలేదు. 2 కిలోమీటర్ల పనులు బ్యాక్వాటర్లో మిగిలిపోయాయి. ప్రస్తుతం పంప్హౌస్ వద్ద పంప్ల అమరిక పనులు, 220/33 కేవీ సబ్స్టేషేన్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. నవంబర్లో కేసీ కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు కనీసం నాలుగు పంప్ల అమరిక కూడా పూర్తి కాలేదు. మూడు పంప్లను కూర్చోబెట్టేందుకు అన్ని సిద్ధం చేశామని క్రేయిన్ ద్వారా పంప్లను దింపుతామని సైట్ మేనేజర్ కలెక్టర్కు భరోసా ఇచ్చారు. అయితే పని ప్రదేశంలో రెండు పంప్లకు సంబంధించిన పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇంకా మోటర్లు రాలేదని విశ్వసనీయ సమాచారం. తాత్కాలిక సబ్స్టేషన్ పనుల్లో నాణ్యత కరువు: కొణిదేల 11/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ముచ్చుమర్రి పంప్హౌస్ వరకు పంట పొలాల మధ్య స్తంభాల ఏర్పాటులో నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. స్తంభం నాటిన గుంతలో సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర బెడ్ వేయకుండా మట్టితోనే సరిపెడుతున్నారు. భవిష్యత్లో గాలివానకు ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కేసీకి నీరు కలే : శ్రీనివాసులు, సర్పంచ్, పాతముచ్చుమర్రి ఈ ఏడాది కేసీ ఆయకట్టు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. నవంబర్ పదిహేనుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంప్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు దగ్గర చూస్తే పనులు ముందుకు సాగడం లేదు. మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. రైతులను మోసం చేస్తున్నారు: పుల్యాల నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు. పగిడ్యాల వచ్చేనెలలో కేసీ కాలువకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల కష్టమే. ఎందుకో మరి అధికారులు అసత్యప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి తుంగభద్ర నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం: రెడ్డిశేఖర్రెడ్డి, ఈఈ: కలెక్టర్ ఆదేశాలు మేరకు పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నాం. బిల్డింగ్ కట్టుకోవాలంటేనే దాదాపు ఏడాది కాలం పడుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ను ఏడాదికే పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం. ఇంకా డెలివరీ పనులు జరగాలి, దేని సమస్యలు దానికి ఉన్నాయి. -
పంటకాలువల పనులు వేగవంతం చేయండి
– నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – అధికారులకు జిల్లాకలెక్టర్ హెచ్చరిక – పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశం పత్తికొండ టౌన్: పంటకాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్ 15 నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక మండలపరిషత్ సమావేశ భవనంలో మంగళవారం హంద్రీనీవా, ఇరిగేషన్శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు 28, 29 ప్యాకేజీలోని కుడి, ఎడమ కాలువల కింద పంటకాలువల తవ్వకంపై చర్చించారు. పనుల పురోగతిపై సమగ్ర సమాచారం లేకుండా కొందరు రావడంతో వారికి క్లాస్ పీకారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పందికోన రిజర్వాయర్ నుంచి పంటకాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలకు భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, కాలువల తవ్వకం పూర్తికాక పంటలకు సాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫొటోలను తన వాట్సాఫ్కు అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున, శశిదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఇరిగేషన్ సీఈ జలంధర్, హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్ఈ నారాయణస్వామి, ఈఈ ప్రసాద్రెడ్డి, ఆర్డీఓ ఓబులేసు, పత్తికొండ, దేవనకొండ తహసీల్దార్లు పుల్లయ్య, తిరుమలవాణి, హంద్రీనీవా ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కేటీపీఎస్’ నిర్మాణ పనులు ఆగొద్దు
మరింత వేగవంతం చేయాలి కాంట్రాక్ట్ కంపెనీలను ఆదేశించిన జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పాల్వంచ : కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దని, ముందస్తు ప్రణాళికలతో చకచకా సాగేలా చూడాలని టీఎస్ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలో కాంట్రాక్ట్ కో–ఆర్డినేష¯ŒS మీటింగ్(సీసీఎం) నిర్వహించారు. నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్తోపాటు అనుబంధ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు, జె¯ŒSకో డైరెక్టర్లు, కేటీపీఎస్ అధికారులతో మాట్లాడారు. విభాగాలవారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పనులు మందగిస్తున్నాయనే సాకు చెప్పొద్దని, అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘ప్రభుత్వం నుంచి మాపై ఒత్తిడి ఉంది. సీఎం కేసీఆర్కు ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి పనులు పూర్తిచేయాలి’’ అని చెప్పారు. పనులను జెన్కో, కేటీపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రతి వారం ప్రొగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం, 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. కూలింగ్ టవర్ నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ, సచ్చిదానందం, సివిల్ సీఈ అజయ్, ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్ కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్ఈలు నరిసింహ, ఎల్లయ్య, యుగపతి, బీహెచ్ఈఎల్, పవర్మెక్, పుంజులాయిడ్, ఎస్అండ్సీ, సంతోష్ పాల్గొన్నారు. నవంబర్లో ‘భద్రాద్రి’ పనులు ప్రారంభం కిన్నెరసాని (పాల్వంచ రూరల్): భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో (నవంబర్లో) ప్రారంభమవుతాయని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. ఆయన మంగâýæవారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి ప్లాంట్తో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. వచ్చే నెలలో పనులను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. కేటీపీఎస్ 7వ దశ, పులిచింతలలోని విద్యుత్ కర్మాగారాన్ని 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఇంజనీర్లతో కూడా ఆయన మాట్లాడారు. కిన్నెరసాని నీటి మట్టాన్ని గరిష్ట స్థాయిలో ఉంచుతున్నామని, దీని వలన డ్యామ్కు ప్రమాదం లేదని చెప్పారు. -
ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు
ఆర్డీఓ క్వార్టర్లే.. కలెక్టర్ క్వార్టర్లు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు మరమ్మతులు డీఈఓ కార్యాలయానికి రంగులు మహబూబాబాద్ : మానుకోట జిల్లా కార్యాలయాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ఇందిరానగర్కాలనీ సమీపంలోని వైటీసీ భవనాన్ని కలెక్టరేట్గా కేటాయించగా కార్యాలయానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్గా ఆర్డీఓ క్వార్టర్స్నే కేటాయించగా మరమ్మతులు సాగుతున్నాయి. ఇక ఆర్డీఓ నివాసానికి అద్దెకు పట్టణంలోని పలు ఇళ్లను చూస్తున్నారు. కాగా ప్రస్తుత జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ మానుకోటకు కలెక్టర్గా వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైటీసీ భవనంలోని కలెక్టర్ చాంబర్, గదుల మధ్య గోడల నిర్మాణ పనులను ఇటీవల జేసీ పరిశీలించారు. ఈ ప్రాంతంపై జేసీ పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆయనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు. దీంతో ఈ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.15లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శంకర్నాయక్ ఇటీవల ప్రకటించారు. ఈ భవనం ఆవరణలో బోర్లు వేయించడం, మరుగుదొడ్లు, ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. వెంకటేశ్వర్లబజార్లోని ఓ ఇంటిని ఎస్పీ క్యాంపు కార్యాలయంగా అధికారులు పరిశీలించారు. కానీ ఆ భవనానికి అద్దె భారీగా ఉండటంతో మరోచోట చూడాలని అధికారులు యోచిస్తున్నారు. డీఎస్పీ కార్యాలయాన్నే ఎస్పీ క్యాంప్ ఆఫీస్గా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. తొర్రూరు రోడ్లోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని బీసీకాలనీ వద్ద ఉన్న ఒక ఇంటిని కూడా పోలీసులు చూసినట్లు సమాచారం. ఆ ఇంటిని డీఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఎస్పీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయాన్నే డీఈఓ కార్యాలయంగా కేటాయించగా, రంగులు వేస్తున్నారు. శనివారం నుంచి ఆ భవనానికి రంగులు వేస్తున్నారు. ఏదేమైనా మానుకోటలో జిల్లా ఏర్పాటు వాతావరణం నెలకొంది. -
వానా.. ట్రాక్ పని గోవిందా!
* తరచూ రైళ్ల రాకపోకలకు అంతరాయం * ఇటీవలి వర్షాలకు సత్తెనపల్లి– పిడుగురాళ్ల రైల్వే ట్రాకుకు భారీ నష్టం * నిర్వహణలోపంతోనే ఈ పరిస్థితి గుంటూరు (నగరంపాలెం): గుంటూరు డివిజనులో రైళ్ల రాకపోకలు పూర్తిగా వాతావరణం మీదే ఆధారపడి నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..నిజమే.. నిర్వహణలోపంతో ఒక మోస్తరు వర్షం ధాటికే రైల్వేట్రాకు కిలోమీటర్లు మేర కొట్టుకుపోతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత నెలరోజుల కాలంలో వర్షాల కారణంగా గురజాల వద్ద 800 మీటర్లు వరకు ట్రాకు కొట్టుకుపోగా, ఇటీవల కురిసిన వర్షాలకు సత్తెనపల్లి– పిడుగురాళ్ల మధ్యలో రైల్వే ట్రాకుకు భారీ నష్టం వాటిల్లింది. రాజుపాలెం– బెల్లంకొండ, బెల్లంకొండ– రెడ్డిగూడెం మధ్యలో రెండు చోట్ల భారీగా, మూడు చోట్ల రైల్వేట్రాకు కింద మట్టి కొట్టుకుపోయి పట్టాలు సైతం పక్కకు పోయాయి. సత్తెనపల్లి నుంచి నడికూడి మధ్య లో కనీసం 20 చోట్ల పైగా రైల్వే ట్రాకు మీద నుంచి వరదనీరు ప్రవహించటంతో మరమ్మతులకు గురైం ది. డివిజనులో రైల్వే ట్రాకు నిర్వహణ సక్రమంగా లేకపోవటంతోనే భారీగా ట్రాకుకు నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా నిర్మించిన ఆర్యుబీల వద్ద, బ్రిడ్జిల పక్క న సక్రమంగా గట్లు పటిష్టం చేయకపోవటంతో ఎక్కువ స్థాయిలో రైల్వే ట్రాకు కు నష్టం వాటిల్లింది. గత మేనెలలో కూడా డివిజను పరిధిలో వలి గొండ మండలంలో ఆర్యూ బీ వద్ద వర్షానికి ట్రాకు కింద మట్టికొట్టుకుపోయి డెల్టా ఎక్స్ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నడికూడి నుంచి పగిడిమర్రి వరకు 100కిలోమీటర్ల వేగంతో రైలు నడపటానికి తగ్గ సామర్థ్యంతో ట్రాకు నిర్మించామని రికార్డులో చూపుతున్నా...కాల్వలు, చెరువుల వద్ద 20 వరకు కాషన్ ఆర్డర్స్ ఉండటంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా 60కిలోమీటర్లు మించి ప్రయాణించటం లేదు. ఇక ప్యాసింజరు, ఎక్స్ప్రెస్ల స్పీడు సరాసరి 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. జోన్ నుంచి ఉన్నతస్థాయి అధికారులు ట్రాకు పరిశీలనకు వచ్చినప్పుడు ట్రాకు పై కంకర ఎలైన్మెంట్, సుందరీకరణ చేస్తున్నారు తప్పితే పటిష్టత గురించి పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. చిన్నపాటి వర్షానికే ట్రాకు సమీపం లో భారీగా నిలుస్తున్న వర్షంనీటి గురించి గానీ, భారీ వర్షం వస్తే నీటి మళ్ళింపు ఏర్పాట్ల పై గానీ డివిజ ను స్థాయి అధికారులు పట్టించుకోవటం లేదు. ట్రాక్మెన్లను, గ్యాం గ్లోని సభ్యులను తగ్గించి వేయటంతో ట్రాకు తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రతి షిఫ్ట్లో ఒక వ్యక్తి రెండు కిలోమీటర్లు మాత్రమే రెండుసార్లు తనిఖీ చేయా ల్సి ఉండగా సిబ్బంది తక్కువగా ఉండటంతో ఎనిమిది కిలోమీటర్ల వరకు తనిఖీ చేయాల్సి వస్తోంది. జీఎం రవీందర్ గుప్తా పనులు పరిశీలన.. పునరుద్ధరణ పనులను గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జనరల్ మేనేజరు రవీందర్ గుప్తా గురువారం పరిశీలించారు. మేజరుగా దెబ్బతిన్న రెడ్డిగూడెం సమీపంలోని అనుపాలెం వద్ద, సత్తెనపల్లి వద్ద దూళిపాళ్ళ వద్ద లైట్ ఇంజనుతో నిర్వహించిన ట్రయల్రన్ను పరిశీలించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి రైళ్ళు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారం పైగానే నిలిచిన రైళ్ల రాకపోకలు.. గుంటూరు డివిజనుకు ప్రధానమైన నడికూడి–సికింద్రాబాద్ రైల్వేమార్గంl22వ తేదీన వరదనీటికి దెబ్బతినటంతో రైళ్లరాకపోకలు నిలిపివేశారు. దీనితో డివిజనుకు ఆర్థికంగా భారీ నష్టం వచ్చింది. డివిజనులో ప్రయాణికుల ద్వారా రోజుకు రూ.30లక్షల ఆదాయం వస్తుండగా ఈ సెక్షన్∙ద్వారానే రూ. 25లక్షలు సమకూరుతుంది. ఆదే విధంగా సరకు రవాణా వాహనాలు ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా ఈ మార్గం ద్వారానే వస్తుంది. సత్తెనపల్లి– రెడ్డిగూడెం మధ్యలో 48 కిలోమీటరు వద్ద 1.2కిలోమీటరు , 52 కిలోమీటరు వద్ద కీలోమీటరు వరకు కొట్టుకుపోయిన రైల్వేట్రాకు పనులు గురువారం కొంత ముందుకు సాగాయి. ఈ రెండు ప్రాంతాల్లో జోన్ నుంచి వచ్చిన పీ అండ్ డీ చీఫ్ ఇంజనీరు , చీఫ్ బ్రిడ్జి ఇంజనీరు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
దత్తత గ్రామాల్లోనూ పనులు చేయకుంటే ఎలా
ఏలూరు (మెట్రో) జిల్లాలో దత్తత గ్రామాల్లో కూడా పనులు జరగకపోతే ఎలా ? ఏడాది నుండి దత్తత గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కూడా కాకపోతే ఇక అభివద్ధి పనులు వేగవంతం ఎలా అవుతాయని జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో దత్తత గ్రామాలలో అభివద్ధి పనుల అమలు తీరుపై కలెక్టరు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దాలని ఎంతో ఆతతతో ఉన్నారని వారు ఆశించిన మేరకు పనుల ప్రగతి కనిపించడం లేదని పనులు పూర్తవడానికి మరుగుదొడ్లు నిర్మించాలని ఏడాది క్రితమే నిర్ణయించినప్పటికీ 524 మరుగుదొడ్లు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని కలెక్టర్ మండలాధికారులను ప్రశ్నించారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన లేని విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో జాప్యం జరుగుతోందని ప్రజల ఆలోచనాధోరణి మారాలని కలెక్టరు కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా కుటుంబ సభ్యుల ఆత్మగౌరవాన్ని దష్టిలో పెట్టుకుని ఇంటింటా మరుగుదొడ్డి ముఖ్యమనే భావన పెంచుకోవాలని నేడు సెల్ఫోన్కు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వమే రూ. 15 వేలు ఉచితంగా ఇచ్చి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోమంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టరు ప్రశ్నించారు. సంజీవపురం, పెదమైనివానిలంక, పెదకాపవరం, కె.రామవరం, తదితర దత్తత గ్రామాల్లో చేపట్టిన పనులన్ని డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ బాలకష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్. అమరేశ్వరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
దత్తత గ్రామాల్లోనూ పనులు చేయకుంటే ఎలా
ఏలూరు (మెట్రో) జిల్లాలో దత్తత గ్రామాల్లో కూడా పనులు జరగకపోతే ఎలా ? ఏడాది నుండి దత్తత గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కూడా కాకపోతే ఇక అభివద్ధి పనులు వేగవంతం ఎలా అవుతాయని జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో దత్తత గ్రామాలలో అభివద్ధి పనుల అమలు తీరుపై కలెక్టరు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దాలని ఎంతో ఆతతతో ఉన్నారని వారు ఆశించిన మేరకు పనుల ప్రగతి కనిపించడం లేదని పనులు పూర్తవడానికి మరుగుదొడ్లు నిర్మించాలని ఏడాది క్రితమే నిర్ణయించినప్పటికీ 524 మరుగుదొడ్లు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని కలెక్టర్ మండలాధికారులను ప్రశ్నించారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన లేని విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో జాప్యం జరుగుతోందని ప్రజల ఆలోచనాధోరణి మారాలని కలెక్టరు కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా కుటుంబ సభ్యుల ఆత్మగౌరవాన్ని దష్టిలో పెట్టుకుని ఇంటింటా మరుగుదొడ్డి ముఖ్యమనే భావన పెంచుకోవాలని నేడు సెల్ఫోన్కు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వమే రూ. 15 వేలు ఉచితంగా ఇచ్చి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోమంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టరు ప్రశ్నించారు. సంజీవపురం, పెదమైనివానిలంక, పెదకాపవరం, కె.రామవరం, తదితర దత్తత గ్రామాల్లో చేపట్టిన పనులన్ని డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ బాలకష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్. అమరేశ్వరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొంప ముంచిన కక్కుర్తి!
ఎస్సారెస్పీ కాలువకు గండి వానకు కొట్టుకుపోయిన మట్టి నాణ్యత లోపాలే కారణం కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం పనులు పర్యవేక్షించని అధికార యంత్రాంగం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆధునీకరణలో భాగంగా ఎస్సారెస్పీ కాలువను పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత తీసి నాణ్యమైన మట్టిని పోయాల్సి ఉంది. కాంట్రాక్టర్ బయటి నుంచి మట్టిని తెచ్చి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో ఆ మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాలు.. కొన్నిసార్లు అభివృద్ధి పనుల నాణ్యత లోపాలను కనిపించకుండా చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలు మాత్రం పనుల్లో అక్రమాలను బహిర్గతం చేశాయి. దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుని నిలిచిన కాలువ తాజా భారీ వర్షాలకు గండిపడడం... అదీ మరమ్మతులు చేసిన తర్వాత జరగడం నాణ్యత లోపాలను వెల్లడిస్తోంది. నాణ్యత లోపాల కారణంగా కాలువకు గండి పడిందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు. గండి పడిన ప్రాంతంలో చేపట్టిన పనులను ఇంజనీర్లు పర్యవేక్షించలేదని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లా వరకు సరఫరా చేసే ప్రధాన కాలువల్లో నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటి సరఫరా జరగడం లేదు. కాలువలు పటిష్టంగా లేకపోవడం, నిర్మించి 15 ఏళ్లు పూర్తి కావడంతో సరిపడా నీటిని సరఫరా చేయలేక పోతున్నామని ఇంజనీర్ల చెప్పడంతో ప్రభుత్వం కోట్ల రుపాయలతో అధునీకరణ పనులను చేపట్టింది. ఈ పనులు పూర్తి చేశాక కూడా కాలువకు గండి పడడం అనేక విమర్శలకు తావిస్తోంది. పనులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువకు కుడివైపు 5 మీటర్లు, ఎడమ వైపు 7మీటర్ల వెడల్పుతో పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత మేరకు తీసి ప్రమాణాలు కలిగిన మట్టిని పోయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బయటి నుంచి మట్టిని తెచ్చి పటిష్టానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాలువ పటిష్టత కోసం మట్టిని లేయర్లుగా పోస్తూ, నీటిని చల్లుతూ, రోలింగ్ చేయాల్సి ఉండగా... నిధులు కొంత మిగిల్చికోవాలన్న ఉద్దేశంతో మొత్తం మట్టిని ఒకేసారి పోసి రోలింగ్ చేసినట్లు తెలిసింది. దీని వల్ల అడుగు భాగంలో గట్టిగా లేక మట్టి గుళ్లగా మారి భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని తెలుస్తోంది. అధికారులు మాత్రం నాణ్యత లోపాలపై దృష్టి పడకుండా వ్యవహరిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై సీపేజీ(ఊట) రావడంతోనే ఇలా గండి పడిందని అంటున్నారు. ‘మూడో ప్యాకేజీ’లో గండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ప్రధాన కాలువను పటిష్ట పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత సామర్థ్యం మేరకు ఎస్సారెస్పీ నీటి సరఫరా జరిగేలా కాకతీయ ప్రధాన కాల్వను మరమ్మతు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువలోని 191 కిలోమీటరు నుంచి 234 కిలోమీటరు వరకు పటిష్ట పరిచేందుకు రూ.60 కోట్లు అవవసరమని రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాకతీయ కాలువ 191 కిలో మీటరు నుంచి 201 కిలో మీటరు, 201 కిలో మీటరు నుంచి 209 కిలో మీటరు, 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు, 226 కిలో మీటరు నుంచి 234 కిలో మీటరు ప్యాకేజీలు విభజించి టెండర్లు పూర్తి చేశారు. ఎండా కాలంలో నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేశారు. మూడో ప్యాకేజీగా పేర్కొన్న 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు కాలువకు బుధవారం గండి పడింది. ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గండిని మట్టితో పూడ్చినప్పటికీ ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో కాలువ కట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇసుక బస్తాలతో కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కేటీపీఎస్ 7వ దశ టీజీ కాంక్రీట్ పనులు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను గురువారం జెన్కో డైరెక్టర్ («ప్రాజెక్ట్స్) సి.రాధాకృష్ణ పరిశీలించారు. పవర్ మెక్ సంస్థ నిర్మిస్తున్న టర్బైన్, జనరేటర్ డెక్ క్యాస్టింగ్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పని ప్రదేశానికి చేరుకుని పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం, 1100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ .. కర్మాగారంలో కీలకమైన టర్బైన్, జనరేటర్ కాంక్రీట్ పనులను 24 గంటల్లో పూర్తిచేస్తామన్నారు. ఆ తరువాత ఎలక్ట్రికల్ పనులు చేపడతామన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రణాళికాబద్ధగా పనులు సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఈ (సివిల్) అజయ్, కేటీపీఎస్ ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్ఈలు యుగపతి, బాలరాజు, ఉపేందర్, శ్రీనివాస్, డీఈ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ శాంతయ్య, పవర్ మెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం, డీజీఎం ఆనంద్, సీనియర్ మేనేజర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ముకరంపుర : ప్రాజెక్టుల పనుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పర్యటన దృష్ట్యా సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో కలెక్టర్, ఇరిగేషన్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లతో ముందస్తుగా సమీక్షించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మిడ్మానేరుకు ఎడమవైపు గండిపడి బండ్ తెగిపోయిన దృష్ట్యా జరిగిన నష్టం, మిడ్మానేరు డ్యాంకింద ముంపు గ్రామాల ప్రజల తరలింపు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్షించారు. డ్యాంనిర్మాణం సకాలంలో ఆయా ఏజెన్సీలు నిర్మాణాలు పూర్తిచేయకపోవడంతో నష్టం జరిగిందని, సకాలంలో ఎందుకు పూర్తిచేయలేదని, ఆ ఏజెన్సీపై తీసుకున్న చర్యలను సీఈ అనిల్కుమార్ అడిగి తెలుసుకున్నారు. ముంపుగ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసంవంటి అంశాలపై స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆర్అండ్ఆర్ సమస్యలపై సీఈ వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేకాధికారి బీఆర్.మీనా, కలెక్టర్ నీతూ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీ దేవసేన పాల్గొన్నారు. -
ఆర్వోబీ.. నత్తనడక
* రూ.50 లక్షలతో ఆర్వోబీ సుందరీకరణ * నెమ్మదిగా సాగుతున్న పనులు పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తున్న పాలకులు, అధికారులు వాటి పురోగతి గురించి పట్టించుకోకపోవడంతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సమయం గడచినా పనులు పూర్తికావట్లేదు. ఇందుకు తెనాలి పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిదర్శనం. తెనాలి రూరల్ : తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో పట్టణ నడిబొడ్డులో ఉన్న ఈ వంతెన నిత్యం రద్దీగానే ఉంటుంది. 1960 దశకాల్లో ఈ వంతెనను నిర్మించారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రైలు పట్టాల పైన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కింది భాగం పెచ్చులూడి పడుతోంది. పట్టణంలో అతి పెద్దదయిన ఈ వంతెనకు పైపై మెరుగులు దిద్ది సుందరీకరించాలని పాలకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆర్అండ్బీ అధికారులు సుమారు రూ.50 లక్షల అంచనాలు సిద్ధం చేశారు. గోప్యంగానే అయిన వారికి కాంట్రాక్టు ఇప్పించేశారు. ఇంకేముంది పుష్కరాల సందర్భంగా పట్టణాన్ని సుందరీకరిస్తున్నారంటూ ప్రచారమూ సాగింది. ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. పనులను ఆర్భాటంగా ప్రారంభించి, ప్రచారం చేయించుకున్న వారు అవి కొనసాగుతున్న తీరును పర్యవేక్షించడం మరచారు. పనులు ప్రారంభించి రెండు నెలలు దాటినా, ఇప్పటికీ సగం పనులు జరగలేదంటే అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేసిన పనులూ అంత నాణ్యంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న గోడలను పగులగొట్టి, వాటి స్థానే ఇనుప గొట్టాలు ఏర్పాటు చేసి, పసుపు, కాషాయ రంగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంత మేర వేసిన రంగులు నాలుగు రోజులకే లేచి పోతున్నాయి. ఇక ఫుట్పాత్పై టైల్స్ కూడా లేచి పోతున్నాయి. అధికారులు పనులను పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
యుద్ధ ప్రాతిపదికన పనులు
రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సత్తెనపల్లి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండు వేల మీటర్ల రైల్వే ట్రాక్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను శనివారం ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఇక్కడ ట్రాక్ దెబ్బతినడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాటికి పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా యథావిధిగా రైల్వేట్రాక్ పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించి పరిసరాలు పరిశీలించారు. రైల్వే అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయనతోపాటు డీఆర్ఎం విజయశర్మ, డీఐజీ జీఎం ఈశ్వరరావు, ఆర్థిక సలహాదారు పూర్ణచర్ల, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తదితరులు ఉన్నారు. -
ఇక రన్వేపై రయ్రయ్!
విమానాశ్రయ అభివృద్ధి పనులు షురూ 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులు మొదలయ్యాయి. వాటిని వేగవంతంగా పూర్తిచేయాలని ఎయిర్పోర్ట్స్అథారిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ.200 కోట్లతో రన్వే విస్తరణ, కాంపౌండ్వాల్ నిర్మాణం, ఐసోలేషన్ బే నిర్మాణం, తదితర అభివృద్ధి పనులను పూర్తిచేసేందుకు ఎయిర్ పోర్టుడైరెక్టర్ ఎం.రాజకిషోర్ ఆధ్వర్యంలో అంతా సన్నద్ధమయ్యారు. గతంలో చేపట్టిన యాఫ్రాన్ నిర్మాణ æపనులు సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి బహిరంగ సమస్య అపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి అశోక్గజపతిరాజు, కేంద్ర సీనియర్మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహోపాత్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సమస్యల పరిస్కారంకోసం ఎదురుచూపు ఏడాది క్రితం విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి 857 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సంగతి తెలిసిందే. ఈ భూములకు సంబంధించిన పరిహారాన్ని కొందరు రైతులకు అందజేశారు. అయితే సుమారు 60 మంది రైతులు తమకు పరిహారం అందలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ తరహా సమస్యలు విమానాశ్రయ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లు జరుగుతున్నట్టు రైతులు ఆశిస్తున్నారు. -
2017లోగా ఇంటింటికీ తాగునీరు
మార్చి వరకు మొదటి దశలో పూర్తి నాణ్యతతో పనులు చేయాలి మిషన్భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల హుస్నాబాద్/తిమ్మాపూర్/చిగురుమామిడి : రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ 2017లోగా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్భగీరథ పనులు వేగవంతంచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని రాములపల్లె, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి వద్ద జరుగుతున్న వాటర్గ్రిడ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ప«థకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో రూ.6,170కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు మొదటి దశలో పలు గ్రామాలకు, జూన్లో రెండో దశ, సెప్టెంబర్లో మూడో దశకు, డిసెంబర్ వరకు మిషన్ భగీరథను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతగా సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ అమరేంద్ర, డీఈఈ త్రినాథ్, బాలరాజ్, జేఈ రంజిత్, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న ఉన్నారు. -
నిబంధనల మేరకు పనులు చేపట్టాలి
ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు నెల్లూరు(స్టోన్హౌస్పేట): నీరు–చెట్లు పనులు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ వీ కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక హరనాథపురం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని ఎస్ఈ చాంబర్లో ఈఈలు, డీఈలు, ఏఈలతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నీరు–చెట్టు పనులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్పెట్టి డిపార్ట్మెంట్ పరువును కాపాడాలని పలు సూచనలు చేశారు. మూడో విడత నీరు– చెట్టు పనులను ప్రారంభించకముందే రెండో విడత పనులను పూర్తి చేయాలన్నారు. మూడో విడత నీరు –చెట్టు పనులను పర్యవేక్షించేందుకు డ్వామా పీడీ హరితను కలెక్టర్ నియమిం చినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా పనులు అవసరమున్న ప్రాంతాలను పరిశీలించి ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రణాళికల్లో తేడాలు వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
నాణ్యతకు కోత
* పుష్కరాలకు నాసిరకంగా రోడ్డు నిర్మాణం * ఒక్క వర్షంతోనే కోతకు గురైన మార్జిన్లు * వాహనాలు రోడ్డు అంచుకు వెళ్తే ముప్పే * రూ.2 కోట్ల పనుల తీరిదీ తమ్ముళ్ల జేబులు నింపడానికి ప్రభుత్వం పుష్కర పనుల పేరిట కోట్లాది రూపాయలు వెదజల్లింది. కాంట్రాక్టర్లు నాణ్యతకు పాతర వేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నెల రోజులు కూడా గడవక ముందే పనుల్లో డొల్లతనం బయట పడుతోంది. క్రోసూరు: కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. తమకు అధికారపార్టీ అండదండలుంటే చాలన్న చందంగా ఆర్అండ్బీశాఖ అధికారులు వ్యవహరిస్తుండటంతో రోడ్ల నిర్మాణాలు నాసిరకంగానే పూర్తవుతున్నాయి. పుష్కరాల పనుల్లో భాగంగా రూ.2 కోట్ల నిధులతో క్రోసూరు మండలంలోని బయ్యవరం నుంచి క్రోసూరు వరకు 10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయట పడింది. వర్షానికి విప్పర్ల చెక్డ్యాం వద్ద రోడ్డు మార్జిన్లు భారీగా కోత గురయ్యాయి. రోడ్డు మార్జిన్లో ఉన్న చౌడు మట్టి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మార్జిన్ వద్ద మట్టి అంచు కొంత మేర కూలిపోయింది. రోడ్డు మార్జిన్లో వేసిన రాళ్లను కనీసం రోలర్తో చదును చేయకుండా వదిలేయడంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. రోడ్డు మార్జిన్లు అల్పంగా ఉండటంతో ఏదైనా పెద ్దవాహనం వచ్చినా పక్కకు ఒరిగిపోయే ముప్పు కూడా పొంచి ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మళ్లీ మళ్లీ పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగచేస్తున్నారని ప్రజలంటున్నారు. బాగు చేయిస్తాం.. రోడ్డు పని పూర్తి కాలేదు. నార్మ్స్ ప్రకారం రోడ్డు షోల్డర్స్కు బలం కొరకు సైడు మట్టితోనే వేయాల్సి ఉంది. వర్షానికి కోతకు గురైన రోడ్డును కాంట్రాక్టరే బాగు చేయాలి. లేకుంటే బిల్లులు మంజూరు చేయం. రోడ్డు గట్టితనం కోసమే షోల్డర్స్కు మాత్రం రాళ్లు వేసాం. పెద్దసైజు రాళ్లు తొలగిస్తాం. దానిపై తిరిగి కంకర వేసి రోలర్తో చదును చేస్తాం. కొద్దిగా తెరపి ఇచ్చిన వెంటనే పనులు చేస్తాం. – అబ్బాస్ కెనడీ, ఆర్అండ్బీ ఏఈ -
ఆగ్రహ జ్వాల
దివీస్ ల్యాబ్ పనులను అడ్డుకున్న రైతులు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాల తొలగింపు తుని ఎమ్మెల్యే మద్దతు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న దాడిశెట్టి రాజా రూ.350 కోట్లు మిగుల్చుకునేందుకే ఈ కుట్ర అని వెల్లడి సెజ్ ఖాళీ భూములకు బదులు రైతుల భూములు ఇవ్వడమేమిటని నిలదీత తొండంగి : తొండంగి మండలం కోన తీరప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ పనులను పరిసర గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు తమ భూములివ్వడానికి నిరాకరించారు. ఆ భూముల్లో బలవంతంగా పాకలు వేసేందుకు చేసిన యత్నాలను ఆదివారం అడ్డుకున్నారు. పాక వేసేందుకు ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించారు. ఆగ్రహంతో తాటాకులను దగ్ధం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి పనులనూ జరగనివ్వబోమని నినదించారు. వారికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పూర్తి మద్దతు తెలిపారు. అంతకుముందు పంపాదిపేటలో జరిగిన సభలో బాధిత రైతులు, మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తమ భూముల్లో పనులు ప్రారంభించారని తెలిపారు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాజా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సీనియర్ నాయకులు పేకేటి సూరిబాబు, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు సత్యనారాయణ తదితరులు దివీస్ పనులు జరుగుతున్న భూములను పరిశీలించారు. అక్కడ చెట్టు నరుకుతున్న కూలీలతో ఎమ్మెల్యే చర్చించారు. పనులు నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా తాటియాకులపాలెం రైతు నేమాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన భూమిలో బలవంతంగా పాకలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత రైతులు, మహిళలు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాలను తొలగించారు. తాటాకులను, దూలాలను తగులబెట్టారు. కాలుష్య పరిశ్రమ తరలేవరకూ పోరాటం పంపాదిపేటలో జరిగిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, తీరప్రాంత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని, కాలుష్య పరిశ్రమ తరలిపోయే వరకూ రైతుల పక్షాన పోరాడతానని భరోసా ఇచ్చారు. అమాయక రైతుల వద్ద భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. దివీస్ ల్యాబ్్సకు ఫలానా ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ చౌకగా భూములు ఇప్పించేందుకు ఈ పరిశ్రమ కుంపటిని ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు తెచ్చిపెట్టారన్నారు. ‘‘సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాలు సేకరించారు. ఖాళీగా ఉన్న ఆ భూములను దివీస్కు ఎందుకు కేటాయించలేదు? చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు 505 ఎకరాల కోన భూములను కేటాయించడం వారికి పూర్తిగా అన్యాయం చేయడమే. సెజ్లో ఎకరాకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దివీస్ యాజమాన్యం ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండా ఎకరా రూ.5 లక్షలకే లాక్కొని పేదలైన కోన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించకపోవడంతో రూ.24 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. అయినా భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించలేదు. ఆ భూములకంటే సారవంతమైన కోన భూములను ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి సేకరించాలని చూడడం పూర్తిగా అన్యాయం’’ అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలుష్య పరిశ్రమవల్ల తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజలు భూములను వదిలి పూర్తిగా వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుందని, పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉంటుందని అన్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే పరిశ్రమలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టారని.. అధికార బలంతో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్స్పాట్కు వంద మీటర్ల రేడియస్లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్స్పాట్కు వంద మీటర్ల రేడియస్లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖలో రూ.139 కోట్లతో పనులు
బుట్టాయగూడెం : 2016–17 ఆర్థిక సంవత్సరానికి గిరిజిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.139 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని ఇప్పలపాడు సమీపంలో సుమారు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ భవన నిర్మాణం పనులు, కామయ్యపాలెంలోని కోటి రూపాయలతో నిర్మిస్తున్న అదనపు తరగతి భవనాల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఈ విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో 13 జిల్లాల్లోని అన్ని ఐటీడీఏల్లో వసతి గృహాలు, ఇతర భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో మినీ ఆడిటోరియంను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 10 ఏకలవ్య మోడల్ స్కూల్స్ మంజూరయినట్టు చెప్పారు. ఈఈ టీవీఎస్ జోగారావు, డీఈ జి.రామ్గోపాల్, ఏఈ అచ్యుతం పాల్గొన్నారు. -
నీరు–చెట్టు అవినీతిమయం
మూడో విడత నిధులు స్వాహాకు రంగం సిద్ధం పనులకు కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు ‘నీరు– చెట్టు’.. పసుపు చొక్కాల జేబులు నింపే పథకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పనుల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఒకే పనిని నీరు–చెట్టు, ఉపాధి హామీ, ఎఫ్డీఆర్ పథకాలు కింద ఇలా.. అనేక మార్లు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో విడత స్వాహాకు తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు (స్టోన్హౌస్పేట) : జిల్లాలో మొదటి విడతలో రూ.76.04 కోట్లతో 2,402 పనులు జరిగినట్లు అధికారులు లెక్కల్లో చూపారు. రెండో విడతలోనూ రూ.249.33 కోట్లతో 2,487 పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. అయితే ఈ పనుల్లో ఇరిగేషన్శాఖకు 30 శాతం పర్సంటేజ్లు, క్వాలిటీ కంట్రోల్కు, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కు కలిపి మరో 10 శాతం చెల్లించి అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయలను స్వాహా చేశారని రైతు సంఘాల నాయకులు లోకాయుక్తను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే పనులు.. మూడో విడత మొదటి రెండు విడతల్లో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి, నాయుడుపేట డివిజన్ల్లోనే మళ్లీ పనులను అధిక సంఖ్యలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. నీరు –చెట్టు కింద చేసిన పనులను ఉపాధి హామీలో, ఎఫ్డీఆర్లో చూపి అంతటితో ఆగకుండా సీఈ మంజూరుతో పనులు చేసిన ఘనత తెలుగు తమ్ముళ్లకే దక్కుతుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా మరో 1500 పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటిపై ఎస్ఈ కోటేశ్వరరావును ఫోన్లో సంప్రదించగా ప్రస్తుతం మూడో విడత ప్రతిపాదనల అంశం, అధికారులపై క్రమశిక్షణ చర్యల విషయాలు కలెక్టర్ పరిశీలనలో ఉన్నాయని ముక్తాయించారు. కలెక్టర్ వద్ద ప్రతిపాదనల ఫైల్ ఇరిగేషన్ అధికారుల ప్రమేయం లేకుండానే అధికార పార్టీ నాయకుల వాటాల పంపిణీకి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. అయితే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ముత్యాలరాజు విడతలు విడతలుగా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపినట్లు తెలుస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను డ్వామా పీడీ హరిత స్వయంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమ్ముళ్ల ఆధిప్యత్యంలో అధికారులు బలి? నీరు–చెట్టు పనుల కేటాయింపుల్లో తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో అధికారులు బలికానున్నారని తెలుస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసేందకు మరో వర్గం ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమపై వేటు పడకముందే సెలవుపై వెళ్లాలని సంబంధిత అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
పుష్కర ఘాట్లలో అవినీతి ధార
మొక్కుబడిగా పనులు అడుగడుగునా నాసిరకం నిరుపయోగంగా 32 ఘాట్లు అమరావతిలో అసంపూర్తిగా వదిలివేసిన ఘాట్ నిర్మాణం సాక్షి, అమరావతి : పవిత్రమైన పుష్కర పనుల్లోనూ అవినీతి రాజ్యమేలింది. కోట్లాది రూపాయల సొమ్ము కష్ణమ్మ ఒడిలో కలిసిపోయింది. ఎలాగోలా పూర్తయితే చాలనే తీరే నిర్మాణాల్లో కనిపించింది. పుష్కరాలు పూర్తయినా ఆ పేరుతో చేసిన అవినీతి జాడలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల పూర్తయిన పుష్కరాల కోసం గుంటూరు జిల్లాలో 80 ఘాట్లను నిర్మించారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. హడావిడిగా, నాసిరకంగా చేయడంతో పుష్కరాలు పూర్తికాకముందే అనేక ఘాట్ల వద్ద టైల్స్ లేచిపోయాయి. శాశ్వతంగా ఉండేలా నిర్మాణాలు చేస్తున్నామని, విజిలెన్స్, ప్రత్యేక బందాల ద్వారా పనులను తనిఖీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చేసిన హడావిడి మాటలకే పరిమితమైంది. వ్యూహాత్మక జాప్యమే... పుష్కర పనులు ఆలస్యంగా మంజూరు చేయడం వ్యూహాత్మకంగానే జరిగింది. అధికారులు సైతం ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం. జిల్లాలోనే ప్రధాన ఘాట్ అయిన అమరావతిలోనూ నిర్మాణ పనులు అడుగడుగునా నాసిరకంగానే జరిగాయి. కాంక్రీట్ పనులు పూర్తిగా నాసిరకంగా చేపట్టారు. చివరికి టైల్స్ సైతం అనేక చోట్ల సిమెంటు లేకుండా ఇసుకలోనే అతికించారు. పుష్కరాల ప్రారంభం రోజు వరకు పనులు కొనసాగించటం గమనార్హం. ఆ తర్వాత పైపై మెరుగులు మాత్రం అద్దారు. దీంతో పుష్కరాల ప్రారంభానికే టైల్స్ లేచిపోయిన పరిస్థితి కనిపించింది. హడావుడిగా, ఎగుడుదిగుడుగా టైల్స్ వేయటంతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ధరణికోట, అమరలింగేశ్వరుని ఘాట్ కలపకుండానే గుడి వెనుక భాగంలో కాంట్రాక్టర్ వదిలేశాడు. సీతానగరం ఘాట్లోను సిమెంటు పనులు నాసిరకంగానే జరిగాయి. 13 రోజులకే పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. ఆ ఘాట్ల నిర్మాణం.. కొల్లగొట్టేందుకే.. జిల్లాలో గురజాల, రేపల్లె, మంగళగిరి, పెదకూరపాడు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి, అవసరం లేకున్నా కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు ఘాట్ల నిర్మాణాలు చేపట్టారు. దీనికి అనుబంధంగా లింక్ రోడ్లు వేసి కోట్ల రూపాయలను కొల్లగట్టారు. జిల్లాలో బ్యారేజీ దిగువన కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు మండలాల పరిధిలో నిర్మించిన 32 ఘాట్లకు నీరు లేక భక్తులు స్నానాలు చేయలేదు. నదిలో ఇసుక గోతులు ఉన్నాయని, ప్రమాదమని తెలిసినా దేశాలమ్మ ఘాట్, మోతర్లలంక, జువ్వలపాలెం ఘాట్లను నిర్మించారు. పుష్కరాల సమయానికి ప్రమాదం పేరుతో వాటిలో స్నానాలు చేయకుండా నిలిపివేశారు. గుండెమడ, పాటూరు వంటి ఘాట్లలో ఒక్కరు కూడా స్నానం చేయలేదు. ఇలా అవసరం లేకున్నా ఘాట్ల నిర్మాణం పేరుతో పనులు చేసి తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. మరోపక్క అనేక ప్రాంతాల్లో ప్రజల సొమ్ముతో చేపట్టిన నిర్మాణాలకు పసుపు రంగు వేసి పూర్తిగా రాజకీయం ప్రదర్శించారు అధికార పార్టీ నేతలు. సీఎం కుటుంబ సభ్యుల కోసమే.. ఉండవల్లి సమీపంలో వీఐపీ ఘాట్ను నిర్మించినా పుష్కరాల్లో అందులోకి ఎవరినీ అనుమతించలేదు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్నానాలు చేసేందుకు వీలుగా దాదాపు కోటి రూపాయలతో ఈ ఘాట్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
విస్తరణలో తాత్సారం
ముందుకు సాగని కెనాల్ రోడ్డు విస్తరణ పనులు ప్రజల ప్రాణాలు పోతున్నా మూడేళ్లుగా సాగ..దీత అధికార పార్టీ ఎంపీ కాంట్రాక్టు సంస్థ కావడంతో నోరుమెదపని స్థానిక ప్రజాప్రతినిధులు సర్కారుకు ఒత్తిడి తేవడానికి అనపర్తి వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సిద్ధం అనపర్తి (బిక్కవోలు) : గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం కాకినాడ నుంచి వాణిజ్య కేంద్రం రాజమండ్రిని కలుపుతూ చేపట్టిన కెనాల్ రోడ్డు విస్తరణ పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రోడ్డు అభివృద్ధి చేస్తే తమ గ్రామాలకు రాకపోకలు సులువుగా సాగుతాయని భావించిన రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల వారు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాది ఇప్పటికి నలుగురు మృతిచెందారు. కెనాల్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా కాకినాడ నుంచి వేమగిరి వరకు 56 కిలోమీటర్లు రోడ్డును ఎనిమిది నుంచి 10 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి, వేట్లపాలెం నుంచి కాకినాడకు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రపంచబ్యాంకు నిధులు సుమారు రూ.260 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు చేజిక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ మూడేళ్లలో పనులు పూర్తి చేయవలసి ఉంది. నిబంధనల ప్రకారం ఈ ఏడాది అగస్టుకు పనులు పూర్తయి రోడ్డు వినియోగంలోకి రావలసి ఉంది. కాని ఇప్పటి వరకు 5 శాతం మాత్రమే పనులు జరిగాయి. రాజకీయాల్లో హేమాహేమీలుగా చెప్పకునే మూడు నియోజకవర్గాల శాసనసభ్యులు, రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పటికీ పనులు ముందుకుసాగడం లేదు. కాంట్రాక్టు దక్కించుకున్నది తెలుగుదేశం ఎంపీకి చెందిన కంపెనీ కావడంతో.. నిధులిచ్చిన ప్రపంచబ్యాంకు కాంట్రాక్టర్ను తొలగించమన్నా ప్రభుత్వం స్పందించడంలేదు. ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రేపు సూర్యనారాయణరెడ్డి పాదయాత్ర ఈ రోడ్డు పనులు పూర్తికాక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 26వ తేదీన అనపర్తి నుంచి బిక్కవోలు వరకు 12 కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గంలోని జనం పార్టీల కతీతంగా సంఘీభావం ప్రకటిస్తున్నారు. -
మెట్రో పనుల ప్రస్తుత రిజల్ట్
సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగరి కలల ప్రాజెక్టు.. మెట్రో రైలు పాతనగరంలో పరుగులు పెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జేబీఎస్–ఫలక్నుమా (కారిడార్–2) మార్గంలో.. మహాత్మగాంధీ బస్స్టేషన్ నుంచి ఫలక్నుమా (5.3 కి.మీ) మార్గంలో రూటు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి ఏడాదిగా ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. దీంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాతనగరంలోని పలు ప్రార్ధనా స్థలాలను పరిరక్షించేందుకు మెట్రో మార్గాన్ని మూసీ నది మధ్య నుంచి మళ్లించాలని గతంలో సర్కారు సంకల్పించింది. ఈమేరకు అలైన్మెంట్ మార్పుపై అధ్యయనం చేయాలని అప్పట్లో నిర్మాణ సంస్థను సైతం ఆదేశించింది. ఆ దిశగా అధ్యయనం చేపట్టిన నిపుణుల బృందం.. మెట్రో మార్గం మార్పుపై సాంకేతికంగా, వాణిజ్య పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించింది. మూసీనది మధ్య నుంచి మెట్రో మార్గం ఏర్పాటు సాంకేతికంగా కష్టనష్టాలతో కూడుకున్నదని, ఒకవేళ ఈ మార్గంలో రూటును ఏర్పాటు చేసినప్పటికీ వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటు కాదని ప్రభుత్వానికి నివేదించింది. ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం సైతం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినా సమావేశం మాత్రం జరగలేదు. ఏడాది కాలంగా ఈ విషయంపై ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. పనుల ప్రగతి ఇదీ.. మార్గం.. మొత్తం ఏర్పాటు మార్గం పిల్లర్లు చేసినవి (కి.మీలో) నాగోల్ మెట్టుగూడ(స్టేజ్1) 315 315 8.01 మియాపూర్–ఎస్.ఆర్నగర్ (స్టేజ్2) 456 456 11.90 మెట్టుగూడ–బేగంపేట్ (స్టేజ్3) 305 293 7.89 బేగంపేట్–శిల్పారామం (స్టేజ్4) 432 337 8.51 ఎస్.ఆర్.నగర్–ఎల్భీనగర్ (స్టేజ్5) 652 611 16.39 జేబీఎస్–ఫలక్నుమా (స్టేజ్6) 587 186 4.86 మొత్తం 2,747 2,198 57.56 -
ఎంపీ నిధుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : ఎంపీ లాడ్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై పంచాయతీరాజ్ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన శనివారం సమీక్షించారు. గత సంవత్సరం ఎంపీ లాడ్స్కు సంబంధించి కాకినాడ డివిజన్లో 57 పనులకు 47, రాజమండ్రి డివిజన్లో 22కు 10, అమలాపురం డివిజన్లో 76కు 66 పనులు పూర్తయ్యాయన్నారు. 18 పనులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 17 పనులూ పూర్తి కాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులకు సంబంధించిన సమస్యలను గుర్తించి అవసరమైతే ఎంపీల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో భవనాన్ని 590 ఎస్ఎఫ్టీలలో రూ.7.50 లక్షలతో నిర్మించాలన్నారు. అంగన్వాడీ భవన నిర్మాణాల భూమి లెవెలింగ్ను ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టాలన్నారు. తక్కువ పిల్లల హాజరు ఉన్నచోట మంజూరు చేసినవి రద్దు చేసి, ఎక్కువ హాజరున్నవాటికి రీ శాంక్షన్ ఇస్తామన్నారు. రెండు అంగన్వాడీ భవనాలు కలిపి ఒకేచోట నిర్మించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ మోహనరావు, ప్రణాళిక అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహనరావు, పంచాయతీరాజ్ ఈఈలు ఎం.నాగరాజు, రాఘవరెడ్డి, బి.సత్యనారాయణరాజ్ పాల్గొన్నారు. -
కేటీపీఎస్ 7వ దశను వేగవంతం చేయాలి
జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ (800 మెగావాట్లు) నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని, పని ప్రదేశాల్లో మ్యాన్ పవర్ పెంచాలని టీఎస్ జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.రా«ధాకృష్ణ ఆదేశించారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అన్ని విభాగాలకు వెళ్లి పనుల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ ప్రదేశంలో అనేకచోట్ల గుంతల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండడాన్ని గమనించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వర్షం వెలిసిన వెంటనే పని ప్రదేశంలో నీళ్లు లేకుండా చూడాలని ఆదేశించారు. పనులు కొన్నిచోట్ల నత్తనడకన నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనులు సాగించాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవదద్ని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఆయన వెంట ఓ అంyŠ lఎం; 5, 6 దశల సీఈలు వి.మంగేష్కుమార్, పి.రత్నాకర్, ఎస్ఈలు యుగపతి, బాలరాజు తదితరులు ఉన్నారు. -
కలెక్టర్ సీరియస్
శ్రీశైలం: కృష్ణాపుష్కరాల పనుల అసంపూర్తిపై గురువారం కలెక్టర్ విజయమోహన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లను సందర్శించారు. లింగాలగట్టు వద్ద మెట్లమార్గంలో పై భాగాన నాసిరకం కుళాయిలను ఏర్పాటు చేయడంతో పాటు అందుకు సంబంధించిన పైపులు కూడా లీకేజీలు అవుతున్నాయి. ఆ నీరు మెట్ల మార్గం ద్వారా తిరిగి పాతాళగంగలో కలుస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లమార్గం కూడా నాణ్యత లేకుండా నిర్మించారని, కనీసం ప్లాస్టింగ్ కూడా చేయకపోవడంతో ఇంజనీర్లపై మండిపడ్డారు. -
పుష్కర పనులకు తుదిమెరుగులు
పుష్కర పనులకు తుదిమెరుగులు కృష్ణాపుష్కరాలు, పనులు, తుదిమెరుగులు అలంపూర్: పుష్కరాల ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. పుష్కర స్నానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేయనున్నారు. పుష్కర స్నానాలకు వేలాదిగా యాత్రీకులు తరలి రానున్నారు. ఈ క్రమంలో పుష్కర పనుల్లో హడావుడి పెరిగింది. పనులు అలస్యంగా ప్రారంభం కావడంతో ఇంకా కొనసాగుతున్నాయి. ఘాట్ల వద్ద ప్రధాన పనులు పూర్తి చేసినప్పటికీ చివరి దశ పనులు పూర్తి చేయడంలో ఆయా శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. అలంపూర్ మండలంలోని జోగుళాంబ ఘాట్లో ఫ్లోరింగ్ పనులు చివరి దశకు చేరాయి. ఘాట్ల వద్ద విద్యుదీకరణ, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్కు పక్కగా పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఘాట్కు ఇరువైపులా భ్యారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను పసిగట్టడానికి, ఘాట్ను నిరంతరం పరిశీలించడానికి వీలుగా సీసీ కెమెరాలు, ఎల్టీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాట్పై ప్రత్యేక ఆకర్షణ కోసం శివుడి విగ్రహాల ఏర్పాటు జరుగుతోంది.ఘాట్కు ఇరువైపుల సుమారు 48 మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇక్కడే తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. -
పెదకొండూరు ఘాట్ పనుల అడ్డగింత
కూలి కోసం కూలీల ఆందోళన దుగ్గిరాల : పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలీల కథనం మేరకు.. పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణంలో ఇటీవల వరకు పని చేసిన కూలీలకు వేతనాలు చెల్లించలేదు. సుమారు 50 మంది కూలీలకుగాను రూ.60 వేల వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో వేతనాలు చెల్లించాలని ఘాట్ కాంట్రాక్టర్ను కోరారు. వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ అలసత్వం ప్రదర్శించడంతో కూలీలు వారం రోజుల క్రితం పనులకు గైర్హాజరయ్యారు. దీంతో కాంట్రాక్టర్ కొత్త కూలీలతో పనులు తిరిగి చేపట్టారు. విషయం తెలుసుకున్న కూలీలు వచ్చి పనులను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఘాట్లో పనిచేస్తున్న కూలీలకు సమస్యను వివరించి పనులు జరగకుండా నిలుపుదల చేశారు. దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి అక్కడకు చేరుకుని సమస్యపై వివరాలు సేకరించారు. కాంట్రాక్టర్ను ఫోన్లో విచారణ చేశారు. ఈ నెల 12వ తేదీ బకాయిలు చెల్లిస్తామనే హామీ లభించడంతో తిరిగి పనులు ప్రారంభించారు. -
రూ.7కోట్లతో పురావస్తు శాఖ పనులు
రూ.7కోట్లతో పురావస్తు శాఖ పనులు పురావస్తుశాఖ, 7కోట్ల విలువ, పనులు కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా రూ.7కోట్లతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆ శాఖ డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. మంగళవారం ఆమె మండలపరిధిలోని మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని జాకారం, కొండపర్తిలో ఆలయ పునర్నిర్మాణానికి, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ఆధునికీకరణ, ఖైరతాబాద్ మాస్క్, పురానాపూల్ గేట్ నిర్మాణ పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు. సోమశిలలోని పురాతన విగ్రహాలను రీఅలైన్మెంట్ ద్వారా దిమ్మెలపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ నరేందర్రెడ్డి డైరెక్టర్ విశాలాక్షి్మని కలిశారు. మంచాలకట్ట రామ తీర్థాలయ ప్రాశస్త్యాన్ని దేవాదాయ శాఖ, పురావస్తు శాఖలు సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో రామ తీర్థాలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. ఆమె వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రహీంషాఅలీ, ఏడీలు నాగరాజు, నర్సింగ్నాయక్ ఉన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..!
సాక్షి, అమరావతి: జిల్లాలో ఘాట్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అనుపు ఘాట్ నిర్మాణ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్ స్తంభాలు నీళ్లు వస్తే ఏక్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉంది. పొందుగలో ఘాట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే నదిలో స్నానాలు చేసే దగ్గరే మురుగు, చెత్త వేశారు. అమరావతిలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల వద్ద 50 శాతం పనులు కూడా ప Nర్తికాని పరిస్థితి నెలకొంది. కాంక్రీట్, లైటింగ్ పనులు సాగుతున్నాయి. మొత్తం 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ ఉంది. అయితే ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో ధ్యానబుద్ద, అమరావతి ఘాట్లను కలుపకుండానే పనులు నిలిపివేశారు. అసంపూర్తిగా పుష్కర ఘాట్ల పనులు గడువు దాటిపోయినా సా..గుతున్న వైనం -
అసంపూర్తి..అస్తవ్యస్తం
–కొనసా...గుతున్న పుష్కరఘాట్ల పనులు –గడువు మరో నాలుగు రోజులే –నాణ్యతకు తిలోదకాలిస్తున్న కాంట్రాక్టర్లు –వర్షాలకు –మట్టికొట్టుకుపోతున్న రోడ్లు గడువుల మీద గడువులు దాటిపోతున్నాయి. పనులు మాత్రం నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలోని 52 ఘాట్లలో ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. పుష్కరాలు 12వ తేదీన ప్రారంభంకానున్నాయి. గడువు ముంచుకొస్తుండడంతో కాంట్రాక్టర్లు పైపై పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఓ వైపు కష్ణమ్మ పవరళ్లు తొక్కుతోంది. పుష్కరఘాట్ల మీదుగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు జిల్లాలోని ఘాట్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పనులు ఏ మేరకు జరిగాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆదివారం పలు ఘాట్లను విజిట్ చేసింది. అనేకచోట్ల కొనసాగుతున్న ఘాట్ల పనులు. పునాదులు దాటని మరుగుదొడ్లు.. చిన్న జల్లులకు మట్టికొట్టుకుపోయిన రోడ్లు.,.కొన్ని చోట్ల ప్రారంభించని పార్కింగ్ పనులు..ఇవీ.. కనిపించిన దశ్యాలు. పుష్కరాలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది. ఈలోగా పనులు ఎలా పూర్తిచేస్తారన్నది అటు కాంట్రాక్టర్లు.. ఇటు అధికారులకే తెలియాలి. హడావుడిగా పనులు పెబ్బేరు : ఎలాగైనా గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో మండలంలో కాంట్రాక్టర్లు హడావిడి పనులు చేస్తూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. శ్రీరంగాపూర్ వీఐపీ ఘాట్ వద్ద రూ.6.2కోట్లతో చేపడుతున్న ఇంకా మరుగుదొడ్లు, తాగునీటి పనులు, దుస్తులు మార్చుకునే గదులు, సీసీబెడ్ నిర్మాణాలు పూర్తికానేలేదు. రూ.2.8కోట్లతో ఏర్పాటు చేస్తున్న వాహనాల పార్కింగ్ పనులు పూర్తి కాలేదు. ఇక్కడ నల్లరేగడి భూములు ఉండడంతో పార్కింగ్ చేసే స్థలంలో మట్టిని తీసివేసి ఎర్రమట్టితో నింపి రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ నది పక్కనే ఉన్న సుద్దమట్టిని పరిచి రోలింగ్ చేస్తున్నారు. అలాగే మునగమాన్ దిన్నె పుష్కరఘాట్ వద్ద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. తాగునీటి, మరుగుదొడ్ల పనులు సైతం పునాదుల్లోనే ఉన్నాయి. రంగాపూర్ నుంచి జనుంపల్లి మీదుగా వేసిన బీటీ వారానికే దెబ్బతింది. జనుంపల్లి నుంచి మునగమాన్దిన్నె ఘాట్వద్దకు వేస్తున్న బీటీ రోడ్డులో నాణ్యత కరువైంది. కొన...సాగుతున్న పనులు అలంపూర్ : మండలంలోని గొందిమల్ల పుష్కర ఘాట్ వద్ద పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీఐపీ పుష్కర ఘాట్కు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పిండ ప్రదానాల స్థలం, దుస్తులు మార్చుకునే గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర పనులు పూర్తి కాలేదు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రూ.9.5 లక్షలతో గొందిమల్ల ఘాట్ వద్ద 48మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ షెడ్లు పూర్తయినా నీటి పైపులైన్, ఇతర పనులు జరగాల్సి ఉంది. రూ.18 లక్షలతో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్లకు ఇరువైపు నీటి ట్యాంకులు ఏర్పాటుచేశారు. వాటికి రంగులు వేయడం, కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. పుష్కర ఘాట్ వద్ద వాహనాలు, ఆర్టీసీ బస్సుల కోసం రూ.1.5కోట్లతో పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. లో–లెవల్ ఘాట్ పనులు కొలిక్కి వచ్చినా, హై–లెవల్ ఘాట్ పూర్తి కాలేదు. మరో రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయిస్తామని ఏఈలు రవికుమార్, శ్రీనివాసులు తెలిపారు. నిఘా లోపం... దగా అధికం.. నది అగ్రహారం దగ్గర జరుగుతున్న పుష్కర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల నిఘాలోపం ఫలితంగా అనేక అభివద్ధి పనుల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతను ఏకోశాన పట్టించుకోలేదు. రక్షణ కడ్డీలు కొన్నిచోట్ల ప్రారంభం కాకుండానే విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల నీటి ఉధతికి కొట్టుకుపోయాయి. పిండప్రదానం చేసే ఘాట్ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం ఊసేలేదు. తాగునీటి వసతి సింటెక్స్ ట్యాంకుల ఏర్పాటు కోసం దిమ్మెల నిర్మాణం నాసిరకంగా సాగుతుంది. రెండుచోట్ల మాత్రమే కుళాయిలు బిగించారు. ఆలయాల అభివద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటు కొనసాగుతుంది. పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేసే మట్టి రోడ్లు నామమాత్రంగా ఉన్నాయి. దుస్తులు మార్చుకోవడానికి ఇప్పటి వరకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు జరగలేదు. ప్రణాళికలకు పాతర మాగనూర్ : మండలంలోని వాసునగర్, కష్ణ, తంగిడి, ముడుమాల్ గ్రామాల్లోని పుష్కరఘాట్ల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం జరగడంలేదు. ఘాట్లకు వచ్చే భక్తుల రాకపోకలకు రోడ్ల నిర్మాణాలను గతనెల క్రితమే చేపట్టినా అవి నేటికీ పూర్తికాలేదు. మిగిలిన నాలుగు రోజుల్లో పనులు పూర్తికాకుంటే వేలాదిగా వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. నల్లగట్టు – కష్ణ, అలాగే కష్ణ – తంగిడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు, చెక్పోస్టు–వాసునగర్ సీసీ రోడ్డు, కష్ణ నుంచి పుష్కరఘాట్వెళ్లే తాత్కాలిక పనులు పూర్తికాలేదు. అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ స్థలాల పనులుకూడా ఈ నాలుగు రోజుల్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. అసలు భక్తులు ఎక్కువగా ఉండేచోట కాకుండగా ఎక్కడ పడితే అక్కడ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు సూచించినా కాంట్రాక్టర్లు పెడచెవిన పెట్టారు. -
సా..గుతున్న ఎగువ ఘాట్ పనులు
సంగమేశ్వరం(కొత్తపల్లి): సప్తనదుల సంగమేశ్వరంలో ఎగువ ఘాట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో సోమవారం సాయంత్రం నాటికి సంగేశ్వరాలయం పూర్తిగా నీటిలో మునిగిపోనుంది. దిగువనున్న పుష్కరఘాట్లు పూర్తిగా మునిగిపోవటంతో భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకుగాను ఎగువఘాట్ల నిర్మాణం పనులు చేస్తున్నారు. కేవలం నాలుగురోజులు మాత్రమే ఉండటంతో ఎగువఘాట్ల నిర్మాణం పనులు పూర్తవుతాయా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణార్పణం..!
– నీట మునిగిన పుష్కర పనులు – కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలు – ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు – జల దిగ్బంధంలో సంగమేశ్వరం – వరదలో కొట్టుకుపోయిన నాణ్యత – పైకి తేలుతోన్న నాసిరకం పనులు సాక్షి, కర్నూలు: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పుష్కర పనులు నీటిపాలయ్యాయి. కృష్ణమ్మ వరద తాకికి నిర్మాణాలు కొట్టుకుపోతున్నాయి. పదిహేను రోజుల క్రితం వరకు కృష్ణమ్మ ఎక్కడ అంటూ వేయి కనులతో వేచి చూశారు.. ఇప్పుడు.. ఇదిగో నేను రానే వచ్చానంటూ పరవళ్లలో నదీమతల్లి తరలి వచ్చింది. జూరాల నుంచి ఆదివారం సాయంత్రానికి 1.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వెళ్తోంది. ఎగువనున్న ఆల్మట్టి నుంచి 1.62 లక్షల క్యూసెక్కులు.. నారాయణపూర్ జలాశయం నుంచి 1.49 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. దీంతో పుష్కరాలకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే నది పరవళ్లు తొక్కుతోంది. పనుల్లో జాప్యం కారణంగా పుష్కర నిర్మాణాలు కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోతున్నాయి. మరోవైపు..నాసిరకం పనుల జాడ పైకి తేలుతోంది. కొట్టుకుపోతున్న నిర్మాణాలు! కృష్ణా నదీ వరద నీటితో సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం మునిగిపోయింది. ఇక్కడ అభివృద్ధి పనులన్నీ నీటి పాలయ్యాయి. పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన టైల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. సిమెంట్ పూత కూడా కొట్టుకుపోయింది. సరైన ప్రణాళిక వేసుకోకపోవడం.. ముందస్తు అంచనా లేకపోవడంతో నష్టం వాటిల్లినటై ్లంది. శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న లింగాలగట్టు లోలెవల్ ఘాట్ కాంక్రిటు నిర్మాణాలు నీటిలో మునిగిపోయాయి. నీళ్లు ఉండగా సిమెంట్ నిర్మాణాలు చేపట్టడంతో కొట్టుకుపోతున్నాయి. నాణ్యతకు తూట్లు! కష్ణా పుష్కర పనులకు చాలా ఆలస్యంగా ఏప్రిల్ 7న పాలనామోదం లభించింది. నామినేషన్ పద్ధతిలో పనులు చేజిక్కించుకునేందుకు ఆలస్యం చేశారనే విమర్శలు వచ్చాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలతో ప్రభుత్వం జిల్లాలో పుష్కర పనుల కోసం దాదాపు రూ. 160 కోట్లకుపైగా నిధులు వెచ్చించింది. అయితే పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం.. హడావుడి చేపట్టండటంతో పనుల్లో నాణ్యత లోపించింది. వరద నీటిలో నాణ్యత కొట్టుకుపోయింది. వర్షంతో అవస్థలు.. వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో పుష్కర పనులకు ఆటంకం కలుగుతోంది. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులకు చెదురు మదురు వర్షాలు అడ్డంకిగా మారతున్నాయి. టెండర్లు కొంత ముందుగా నిర్వహించి పనులు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. -
సా...గుతూనే!
– పూర్తికాని పుష్కర పనులు – ముంచుకొస్తున్న గడువు – ఘాట్లకు తొలగని విఘ్నాలు – శ్రీశైలం పురవీధుల్లో దర్శనమిస్తున్న బండరాళ్లు సాక్షి ప్రతినిధి,కర్నూలు: – శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ ఎగు వఘాట్. ఈ ఘాట్లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మెట్ల పనులు సాగుతున్నాయి. ఇరువైపులా ఇంకా రక్షణకు చర్యలు కూడా తీసుకోలేదు. – సమయం.. శనివారం ఉదయం 8 గంటలు. ఘాటు పనులు పూర్తికాలేదు. రాత్రింబవళ్లు పనిచేయాలని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ ఆదేశాలు. అయితే, లింగాలగట్టులోని ఎగువఘాటు వద్ద మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఘాటు వద్ద పనిచేస్తూ ఏ ఒక్కరూ కనిపించలేదు. – పాతాళగంగకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతం. ఇక్కడ రక్షణ చర్యలను వెంటనే తీసుకోవాలని స్వయంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సూచించింది. అయితే, రక్షణ చర్యల పనులు ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ చరియ విరిగిపడుతోందననే ఆందోళనతోనే కింద మాత్రం పనులు కానిచ్చేస్తున్నారు. – సున్నిపెంటలో ఏర్పాటు చేయతలపెట్టిన పుష్కరనగర్ ప్రాంతం. ఇక్కడ భూమిచదును పనులు మినహా ఏ ఒక్క పనీ మొదలుకాలేదు. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల పుష్కరాల పనులు మాత్రం ఇంకా సాగు..తూనే ఉన్నాయి. గడువు మీద గడువు... వాస్తవానికి పుష్కరాల పనులన్నింటికీ జూలై చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈలోగా పనులు పూర్తిచేయకపోతే చర్యలూ తప్పవని హెచ్చరించారు. అయితే, ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. అయితే పనుల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో 5వ తేదీ నాటికి ఘాట్ పనులను పూర్తిచేయాలని తాజాగా గడువు విధించారు. అయినప్పటికీ పనుల్లో కొంచెం వేగం పెరిగినప్పటికీ పూర్తికావాల్సిన పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. తాజాగా ఈ గడువు కాస్తా 8వ తేదీకి పెరిగింది. అప్పటికీ పూర్తవుతాయనే నమ్మకం మాత్రం కలగడం లేదు. సబ్కాంట్రాక్టులతోనే సమస్య పుష్కరాల పనుల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దోచేసుకుంటున్నారు. అసలు కాంట్రాక్టర్ను కాదని... తమ అనుచరులకు సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారపార్టీకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు... అసలు కాంట్రాక్టు సంస్థ నుంచి కొంత మొత్తం పర్సంటేజీ ఇచ్చి పనులు తీసేసుకున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కానీ, మనుషులు కానీ లేకపోవడంతోనే వీరందరూ టెండరులో పాల్గొనలేదు. అయినప్పటికీ అధికారపార్టీ ప్రాపకంతో సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు సంపాదించుకున్నారు. వీరికి అనుభవం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి... పుష్కరాలకు ఒకవైపు శ్రీశైలం ముస్తాబవుతోంది. అయితే, గతంలో బహత్తర ప్రణాళిక కింద చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పనులను నిలిపివేశారు. ఇదే విధంగా నీటి సరఫరా వ్యవస్థ కోసం శ్రీశైలం పురవీధుల్లో తవ్విన రోడ్లను తాత్కాలికంగా పూడ్చేశారు. ఇక్కడ ఇప్పటివరకు రోడ్లు వేయలేదు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా మట్టితో పూడ్చిన తర్వాత మిగిలిన బండరాళ్లు ఎక్కడికక్కడ ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. -
పుష్కరఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంగమేశ్వరం(కొత్తపల్లి): సంగమేశ్వరంలో పుష్కరఘాట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కపిలేశ్వరంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో దిగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లు మునిగి అవకాశం ఉందన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకొని ఎగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, దుస్తువుల మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల కోసం పార్కింVŠ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించారు. ఎగువప్రాంతం నుంచి వరద ఉద్ధతి తగ్గకపోతే∙రెండు రోజుల్లో సంగమేశ్వరం గుడి మునిగిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘుబాబు, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దారు నరసింహులు, సీఐ దివాకర్రెడ్డి, ఎసై ్స శివశంకర్నాయక్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూ.60 కోట్లతో పుష్కర పనులు
పీఆర్ ఎస్ఈ జయరాజు గుంటూరు వెస్ట్: పుష్కరాల సందర్భంగా 86 రోడ్లను రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) జీ జయరాజు తెలిపారు. జిల్లా పరిషత్ కాంపౌండ్లో గల తన కార్యాలయంలో శుక్రవారం పుష్కర పనులపై ఆయన ఈఈలు, డీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల మాట్లాడుతూ తొలివిడతలో 53 రోడ్లకుగాను రూ.33 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండో విడతలో విడుదలైన 33 పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. తమ శాఖ నుంచి సుమారు 120 మంది ఉద్యోగులు పుష్కర విధులకు హాజరవుతున్నారని వెల్లడించారు. అంగన్వాడీ భవనాలు జిల్లా వ్యాప్తంగా 636 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు అనుమతులు లభించాయని తెలిపారు. తెనాలి డివిజన్లో 193, గుంటూరు డివిజన్లో 253, నర్సరావుపేట డివిజన్లో 190 భవనాలు ఉన్నాయన్నారు. మరో 110 అంగన్వాడీ భవనాలకు ప్రజాప్రతినిధులు నుంచి సిఫార్సులు అందాయని తెలిపారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం నగర పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, మీసాల కిరణ్, పిల్లి శ్రీనివాస్, నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీను, కృష్ణ, సోమయ్య, వెంకన్న, సతీశ్, బాబూరావు పాల్గొన్నారు. మండలంలో... మండలంలోని కరక్కాయలగూడెంలో రూ. 7 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఎంపీపీ గొట్టెముక్కల నిర్మల, స్థానిక సర్పంచ్ దొంగరి అరుణ సత్యనారాయణతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి.నిజాముద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్కుమార్ దేశ్ముఖ్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీను, బత్తిని మాధవరావు, అంకతి లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.వీరబాబు, సైదయ్య పాల్గొన్నారు. -
మిషన్కాకతీయ ఫైనల్ బిల్లులివ్వండి
ఫేజ్ 2 కింద చెరువులు పూర్తి చేయండి వర్షాలు తగ్గితే మైనర్ పనులు చేపట్టండి మిషన్కాకతీయ ఎస్ఈ పీఏ వెంకటకృష్ణ తిమ్మాపూర్: జిల్లాలో మిషన్ కాకతీయ ఫేజ్–1 కింద చెరువుల పనులు పూర్తిచేసి వాటికి సంబంధించి ఫైనల్ బిల్లులివ్వాలని మిషన్కాకతీయ ఎస్ఈ పీఏ వెంకటకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులకు జియో ట్యాగింగ్పై ఇంజినీర్లకు శిక్షణ అనంతరం పనులపై డివిజన్ల వారీగా ఎల్ఎండీలోని ఏసీఈ ఆఫీస్లో బుధవారం సమీక్ష జరిపారు. ఎస్ఈ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఫేజ్–1కింద జిల్లాలో 823 చెరువులకు రూ.311కోట్లు మంజూరైతే 720 పూర్తిచేసి రూ.90కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతావి త్వరగా పూర్తిచేసి వాటి ఫైనల్ బిల్లులు చెల్లించాలని సూచించారు. మిషన్కాకతీయ ఫేజ్–2 కింద 1081 చెరువులకు ప్రభుత్వం అనుమతిస్తే రూ.468 కోట్లకు మంజూరు ఇచ్చామని, 1,050 చెరువులు ప్రారంభించగా వంద చెరువుల పనులు పూర్తయినట్లు తెలిపారు. చెరువుల్లో 95లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలతో పనులు ఆలస్యమవుతున్నా వర్షాలు లేనప్పుడు మైనర్ పనులు చేపట్టాలని సూచించారు. జియో ట్యాగింగ్పై శిక్షణ మిషన్ కాకతీయలో పనిచేస్తున్న ఇంజినీర్లకు బుధవారం మండలంలోని పలు చెరువుల వద్ద క్షేత్రస్థాయిలో, ఎల్ఎండీలోని ఎస్ఈ ఆఫీస్లో నిపుణులు కౌశిక్, శర్మ, నాయుడు, అజయ్ శిక్షణ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు, పేర్లను మొబైల్లో నమోదు చేస్తే ఆ చెరువుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇస్తారని, దీని ద్వారా పేర్లు ఎన్ని ఉన్నా ఒక చెరువుకు ఒకే నంబర్ ఉంటుందని, డూప్లికేషన్ జరిగే అవకాశం ఉండదన్నారు. చెరువుల పనులను ఫొటో చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఎక్కడైనా చూసుకోవచ్చని తెలిపారు. జియో నంబర్ ద్వారా భవిష్యత్తులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందన్నారు. చెరువుల జియో ట్యాగింగ్ని ఈ నెల 10తేదీలోగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఎస్ఈ ఆదేశించారు. ఈఈలు శ్రీనివాస్గుప్త, వివిధ డివిజన్ల ఈఈలు, డీఈఈలు, జేఈలు పాల్గొన్నారు. -
వేగంగా పుష్కరఘాట్ నిర్మాణ పనులు
నేరేడుచర్ల : మండలంలోని మహంకాళిగూడెం వద్ద పుష్కర ఘాట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఘాట్ ఇన్చార్జి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఘాట్ నిర్మాణానికి రూ. 2.65 కోట్లు మంజూరు కాగా, గతంలో ఉన్న ఘాట్కు అదనంగా 60 మీటర్ల మేరకు విస్తరించి మెట్లు నిర్మించారు. ప్రస్తుతం రక్షణ కోసం ఇనుప జాలీలను నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్లో యాత్రికుల సౌకర్యార్ధం 10 స్నానపు గదులు, 10 మరుగు దొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహంకాళీగూడెంనకు బీటీ రెన్యువల్ పనులు మండలంలోని నర్సయ్యగూడెం నుంచి గుడగుండ్ల పాలెం వరకు పూర్తి చేశారు. పుష్కరఘాట్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంకాళీగూడెం దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లే రహదారికి రూ. 45 లక్షలు మంజూరు చేయగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరేడుచర్లలోని బైపాస్ రోడ్డుకు హుజుర్నగర్ రోడ్డు నుంచి జాన్పహాడ్ రోడ్డు వరకు బీటీ నిర్మాణ పనులు చేపడుతుండగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి జాన్పహాడ్ రోడ్డు వరకు రూ. 20 లక్షలతో మెటల్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఘాట్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మంచినీటి సౌకర్యం కోసం రూ. 15.32 లక్షలతో నీటి శుద్ధి యంత్రాన్ని అమర్చేందుకు తాత్కాలిక గదిని నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల మంచినీటి నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కొరకు మహంకాళీగూడెం గ్రామ శివారులోని పార్కింగ్ స్థలాలను చదును చేస్తున్నారు. నీరు వస్తేనే పుష్కరస్నానం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి సుమారు 15 అడుగుల ఎత్తులో ఘాట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో నదిలో నీటి మట్టం పెరిగితేనే ఘాట్లో స్నానం ఆచరించేందుకు వీలు ఉంటుంది. ఆగస్టు 12 పుష్కరాల ప్రారంభం రోజు వరకు ఘాట్లోకి నీరు వస్తుందని అటు అధికారం యంత్రాంగం, ఇటు ప్రజలు భావిస్తున్నారు. గతంలో పుష్కరాలకు హాజరైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బేతవోలు నుంచి పట్టణానికి నీటి సరఫరా జరిగే పైపులైన్ లీకేజీ వల్ల రహదారి ధ్వంసమైందన్నారు. పైపులైన్ మరమ్మతుల పేరుతో ప్రతిసారీ గుంతలు తీసి రోజుల కొద్దీ ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగరపంచాయతీ, ఆర్అండ్బీ అధికారులు స్పందించి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్పాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అట్లూరి హరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య, చిలకరాజు లింగయ్య, అహ్మద్హుస్సేన్, బెల్లంకొండ గురవయ్య, కోల మట్టయ్య, ఆయూబ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరబాబు, శేఖర్, జాలగురవయ్య, నాగరాజు, సలీం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పుష్కర యాత్రికులకు పన్నెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ఇంఛార్జి డీజీపీ, ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. శనివారం ఆర్టీసీ హౌజ్లో పోలీసు, ఆర్టీసీ, రవాణా శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో మొత్తం 24 వేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని, విజయవాడ నగరంలో 1,300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్లో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. కర్నూలు, గుంటూరులలో రిజర్వ్ ఫోర్సును అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 136 ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలు గుర్తించామని, విజయవాడ నగరంలోనే 22 ప్రదేశాలలో పెయిడ్ పార్కింగ్కు ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్డు మీద ప్రైవేటు వాహనం ఆగితే భారీ జరిమానాతో పాటు క్రేన్ల సాయంతో యార్డుకు తరలిస్తామన్నారు. నో వెహికల్ జోన్ మ్యాపులను త్వరలో విడుదల చేస్తామని సాంబశివరావు ప్రకటించారు. టోల్ప్లాజాల్లో వాహనాలు నిలిచిపోకుండా సీఎం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని, టోల్ ఫీజుపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. ఆటోలు, రవాణా వాహనాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా రవాణా శాఖ నియంత్రిస్తుందన్నారు. పుష్కర యాత్రికులు ఏ బస్ ఎక్కాలి.. ఏ ఘాట్కు ఎలా చేరుకోవాలనే సమాచారాన్ని కరపత్రాలు, బ్యానర్ల ద్వారా బస్సులతో పాటు అన్ని ముఖ్యప్రాంతాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. విజయవాడలో శాటిలైట్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, పండిట్ నెహ్రూ బస్టాండ్ను పుష్కరాలు జరిగే 12 రోజులు సిటీ బస్టాండ్గా మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. ఘాట్లకు, దుర్గ గుడికి పీఎన్బీఎస్ బస్టాండ్ దగ్గర్లో ఉన్నందున దూర ప్రాంత సర్వీసులు నడపబోమన్నారు. నగరంలో 600 సిటీ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. -
పుష్కరఘాట్లకు ప్రభుత్వం తూట్లు
భవానీపురం : కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. పుష్కరాలకు ముందే ఘాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని అర్భాటపు ప్రకటనలు చేసిన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన భవానీఘాట్, పున్నమిఘాట్లను సందర్శించారు. అక్కడ ఇంకా 50 శాతం పనులుకూడా పూర్తికాకపోవడంతో ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీఘాట్లో ఇంకా మెట్లు నిర్మాణ పనులు జరగుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ అరకొర పనులతో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను చూస్తే రోజుకు 24 గంటలు కాదుగదా 30 గంటలపాటు చేసినా ఘాట్లు పుష్కరాల నాటికి పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. పైగా నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకమేనన్నారు. దండుకోవడానికే హడావుడి పనులు కనీసం ఆరు నెలలముందు ప్రారంభించాల్సిన పుష్కర పనులను ఆలస్యంగా చేపట్టడంలో అంతరార్ధం టీడీపీ నాయకుల స్వప్రయోజనాలేనని ఉదయభాను ఆరోపించారు. ముందుగా పనులు ప్రారంభిస్తే టెండర్లు పిలవాల్సి వస్తుందని, అందుకే ఆలస్యంగా మొదలుపెట్టి టీడీపీ నాయకుల బినామీలకు నామినేషన్ పద్ధతిపై అడ్డగోలుగా అప్పగించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పుష్కర ఘాట్ల పనులను పూర్తి చేసి యాత్రీకులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ అక్బర్, చలమలశెట్టి సత్యనారాయణ, మారం వెంగళరెడ్డి ఉన్నారు. -
ట్రాష్రాక్ పనుల పరిశీలన
నాగార్జునసాగర్: స్థానిక ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రంలోని పెన్స్టాక్ ట్రాష్రాక్ గేట్ల పనులను గురువారం సీఎండీ ప్రభాకర్రావు, హైడ్రో ఎలక్ట్రికల్ డైరెక్టర్ వెంకట్రాజన్లు పరిశీలించారు. రూ.12 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా ఈ సీజన్లో అయ్యేంత వరకు పనులు పూర్తి చేసి, అనంతరం వచ్చే సీజన్లో మిగతా పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతకుముందు ఎడమకాల్వ వద్ద గల విద్యుదుత్పాదక కేంద్రం వద్ద ఎస్ఈ రాజనర్సింహా, డీఈ సత్యనారాయణలు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.