CAREER
-
పెళ్లికి వెనుకాడుతున్న పడతులు!
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసంకష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. పిల్లలూ భారమేనా..! పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు. నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది దేశంలో అలాగే హైదరాబాద్లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ.. మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
ఎక్కువమంది కోరుకున్న జాబ్.. 25 దేశాల్లో బెస్ట్ కెరీర్ ఇదే..
మంచి ఉద్యోగం అన్నది ప్రతిఒక్కరి కల. ప్రతి రంగంలోనూ ఎక్కువమందికి ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఉద్యోగాలను ఎక్కువ మంది కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రెమిటీ (Remitly) అనే సంస్థ 186 దేశాల నుండి గూగుల్ (Google) శోధనలను విశ్లేషించి ఒక అధ్యయనం చేసింది. 2024లో "(ఉద్యోగం) ఎలా అవ్వాలి" (how to become) అని వ్యక్తులు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన కెరీర్లను ఈ అధ్యయనం వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన ఉద్యోగం పైలట్ (pilot). దీని కోసం 4,32,000 కంటే ఎక్కువ శోధనలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్,స్లోవేకియాతో సహా 25 దేశాల్లో ఇది అత్యుత్తమ కెరీర్ ఎంపిక. తర్వాత 3,93,000 శోధనలతో లాయర్ వృత్తి రెండవ స్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఆసక్తిలో బాగా పెరుగుదల కనిపించింది. ఇతర ఉన్నత ఉద్యోగాలలో పోలీసు అధికారి (2,72,000 శోధనలు), ఫార్మసిస్ట్ (2,72,630), నర్సు (2,48,720) ఉన్నాయి. గత రెండేళ్లలో పోలీసు వృత్తిపై ఆసక్తి 440 శాతం పెరిగింది.డిజిటల్ కెరీర్ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కన్న సోషల్ మీడియా కెరీర్ యూట్యూబర్. యూట్యూబర్గా మారడం ఎలా అని 1,71,000 శోధనలు వచ్చాయి. యూకే, సింగపూర్, ఇండోనేషియాతో సహా 13 దేశాలలో అత్యధికంగా శోధించిన ఉద్యోగం ఇదే. అయితే 2022 నుండి ఈ కెరీర్పై ఆసక్తి 11% తగ్గింది. ఇతర డిజిటల్ కెరీర్ల విషయానికి వస్తే.. కంటెంట్ క్రియేటర్ 52,000 శోధనలను, సోషల్ మీడియా మేనేజర్ 36,000 శోధనలను పొందాయి. టెక్ ఫీల్డ్ కూడా ఆసక్తిని ఆకర్షిస్తోంది. కోడింగ్ 48,000 శోధనలతో అధిక ర్యాంక్ను పొందింది.డిమాండ్లో హెల్త్కేర్, పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలుహెల్త్కేర్ అనేది ఎక్కువమంది కోరుకునే కెరీర్ మార్గాలలో ఒకటి. 272,000 శోధనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించి హెల్త్కేర్ జాబ్ ఫార్మసిస్ట్. ఇది ముఖ్యంగా జపాన్లో జనాదరణ పొందింది. ఇతర టాప్ హెల్త్కేర్ కెరీర్లలో ఫిజికల్ థెరపిస్ట్ (2,44,000 శోధనలు), టీచర్ (1,75,000), డైటీషియన్ (170,000) ఉన్నాయి.పబ్లిక్ సర్వీస్లో 2,72,730 శోధనలతో పోలీసు అధికారి ఉద్యోగం అగ్రస్థానంలో ఉంది. తర్వాత నర్సింగ్, మిడ్వైఫరీ, అగ్నిమాపక విభాగాలు ఉన్నాయి. డాక్టర్ కావాలనే ఆసక్తి పెరిగినప్పటికీ, నర్సింగ్, మిడ్వైఫరీ కెరీర్ల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధిస్తున్నారు.క్రియేటివ్, స్పోర్ట్స్ కెరీర్లకూ ఆదరణకళలు, వినోద ప్రపంచంలో, దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా శోధించిన సృజనాత్మక వృత్తి నటన. ఇతర ప్రసిద్ధ ఎంపికలలో వాయిస్ యాక్టింగ్, డీజే, సింగింగ్ ఉన్నాయి. "ఫుట్బాల్ ఆటగాడిగా ఎలా మారాలి" అని 95,000 శోధనలతో స్పోర్ట్స్ కెరీర్పై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఇది కాకుండా వ్యక్తిగత శిక్షకులు, కోచ్ల వంటి ఫిట్నెస్-సంబంధిత కెరీర్లు ఆదరణ పొందాయి. -
కెరీర్ క్యాట్ఫిషింగ్.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్..!
తమ అలవాట్లు, సంప్రదాయ విరుద్ధ ధోరణులతో కార్పొరేట్ ప్రపంచంలో జెన్ జెడ్ వార్తల్లో నిలుస్తోంది. ‘కెరీర్ క్యాట్ఫిషింగ్’ అనే కొత్త ట్రెండ్తో హల్చల్ చేస్తోంది. యువత ఉద్యోగ ఆఫర్లను అంగీకరిస్తారు.. కానీ వారి యజమానులకు తెలియజేయకుండా వారి మొదటి రోజున ఆఫీసులో కనిపించకుండా పోతారు. సదరు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో యజమానికి తెలియకోవడాన్ని ‘కెరీర్ క్యాట్ఫిషింగ్’ అంటారు.ఆన్లైన్ రెజ్యూమ్ ప్లాట్ఫామ్ ‘సివిజెనియస్’ నివేదిక ప్రకారం జెన్ జెడ్ ఉద్యోగులు జాబ్ ఆఫర్లను స్వీకరిస్తున్నప్పటికీ యజమానులకు తెలియజేయకుండా మొదటి రోజు హాజరు కావడంలో విఫలమవుతున్నారు. 27 ఏళ్లలోపు ఉద్యోగుల్లో ధిక్కారణ ధోరణి పెరుగుతుందని నివేదిక తెలియజేసింది.నెలల తరబడి ఉద్యోగాల వేట, సుదీర్ఘమైన అప్లికేషన్లు, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. దీనికి సంబంధించి ఫ్రస్టేషన్స్ జెన్ జెడ్లో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై సంవత్సరాల రాస్పిన్కు 32 లక్షల(సంవత్సరానికి) జాబ్ ఆఫర్ వచ్చినా ఆఫర్ను తిరస్కరించడం సోషల్మీడియాలో సెన్సేషన్గా మారింది. ‘ఈ జీతంతో నేను ఎలా బతకగలను? ఈ జీతంతో ఫుల్టైమ్ ఉద్యోగమా!’ అని ఆశ్చర్యపోతుంది ఆమె.ఇదీ చదవండి: ఐస్క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఈ ధిక్కారం ఒక తరం మార్పును నొక్కి చెబుతుంది. ఉద్యోగం లేదా జీవితం వారి అంచనాలకు అందని పరిస్థితి ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించే ధోరణి పెరగుతుంది. నచ్చని, అంచనాలకు తగని విధంగా ఉద్యోగం ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండడానికే యువతలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. -
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రామ్ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఉద్యోగాలను మించి.. కెరీర్పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్ప్రెన్యూర్స్గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
కార్పొరేటర్ టు సీఎం..రాజకీయ వ్యూహాల్లో దిట్ట ఫడ్నవీస్
ముంబయి: మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(54) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు. ఫడ్నవీస్ 1970 జులై 22న నాగ్పూర్లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రిపేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్లో, ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో గంగాధర్ ఫడ్నవీస్ పనిచేశారు. కార్పొరేటర్ టు మూడుసార్లు సీఎంవిధేయతకు ఫడ్నవీస్ మారుపేరు. వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరమనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం. నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి గురువారం (డిసెంబర్ 5)న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. విద్యార్థి నేతగా చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్పుర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఎన్నియ్యారు.1997లో నాగ్పూర్ అక్కడి మేయర్ పదవిని చేపట్టేప్పుడు ఆయన వయసు 27 ఏళ్లంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిచిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండోవ్యక్తి ఆయన.మోదీ,అమిత్షాలకు వీర విధేయుడు తొలిసారి 1999లో నాగ్పుర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికలతో కలిపి ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.2014లో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు. అయిదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శరద్పవార్ తర్వాత అతి చిన్న వయసులో (44ఏళ్లకే) మహారాష్ట్ర సీఎం అయిన రికార్డు ఫడ్నవీస్ సొంతం. 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన(ఉద్ధవ్) పార్టీ హ్యాండివ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.2024 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా మారాలంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్లో ఎంఎస్సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్ముఖ్ (ఫోటోలు)
-
GenAI: మహిళల వృద్ధికి బ్రహ్మాస్త్రం..
ఆకాశంలో సగం అన్న పోవూరి లలిత కుమారి (ఓల్గా) మాటలు నిజమవుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. ప్రస్తుతం ఇండియా టెక్ వర్క్ఫోర్స్లో సుమారు 36 శాతం మంది స్త్రీలే ఉన్నారు. కానీ నాయకత్వ పాత్రల దగ్గరకు వచ్చేసరికి ఈ సంఖ్య తగ్గుతోంది. కార్యనిర్వాహక స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల శాతం 4 నుంచి 8 శాతం మాత్రమే.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) ఈ సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2027 నాటికి గ్లోబల్ AI మార్కెట్ 320 నుంచి 380 బిలియన్లకు చేరుతుందని అంచనా. వృద్ధి 25 నుంచి 35 శాతానికి పెరుగుతుంది. జెన్ ఏఐ ఇందులో 33 శాతం ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని సమాచారం.మహిళల ఎదుగుదలకు జెన్ ఏఐ గణనీయంగా సహాయపడుతుంది. వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి.. విభిన్న బృందాలలో కీలకమైన బాధ్యతలు అందిపుచ్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.భారతదేశ సాంకేతిక రంగానికి వైవిధ్యం అవసరం. ఇది పక్షపాతాలను తొలగించడం, విభిన్న నైతికతలను కలుపుకోవడం ద్వారా సమర్థవంతమైన వ్యవస్థలను నిర్ధారిస్తుంది. టెక్ పరిశ్రమలో లింగ అసమతుల్యతను సరిచేయడానికి అవకాశాలను చేజిక్కించుకోవాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీషా జార్జ్' (Sreyssha George) అన్నారు.నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ 'సంగీతా గుప్తా' మాట్లాడుతూ.. టెక్ పరిశ్రమలో జెన్ఏఐ ఆధిపత్యం చెలాయిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మహిళలు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా స్వంత విజయాన్ని పెంచుకోవడమే కాకుండా ఆయా రంగాల్లో ఆధిక్యత కూడా సాధ్యమవుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?కొత్త టెక్నాలజీకి మద్దతు ఇచ్చే, ప్రోత్సహించే వాతావరణాలను సృష్టించడం ద్వారా GenAI స్వీకరణ సాధ్యమవుతుంది. దీనికి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వృద్ధి మార్గాలను అన్వేషించడం, అధికారిక & అనధికారిక మెంటర్షిప్ ప్రోగ్రామ్ల ద్వారా మార్గనిర్దేశం, నైతిక శిక్షణ అందించడం, సాధికారత, వైవిధ్యం సంస్కృతిని నిర్మించడం వంటి వాటికి జెన్ఏఐ దోహదపడుతుంది. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
12 మందితో ఎఫైర్స్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
1991లో సుభాష్ ఘాయ్ 'సౌదాగర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.కెరీర్ నాశనం.. 1990వ దశకంలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.పలువురితో ఎఫైర్స్మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్'లో హీరో వివేక్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్ లాంటి వారితో ఎఫైర్తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్కు చెందిన సామ్రాట్ దహల్ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ విశేష అదరణ దక్కించుకుంది. -
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్స్కేప్లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.లింక్డ్ఇన్ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్ లైఫ్లో టాప్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్తో పాటు కస్టమర్ సర్వీస్ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్ స్కిల్, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్ షూటింగ్ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. (Image Source : LinkedIn Learning) -
Virat Kohli Completes 15 Years In International Cricket: విరాట్ కోహ్లి @ 15 ఏళ్లు.. కింగ్ అరుదైన ఫొటోలు చూశారా?
-
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్జోన్ దాటి చాలా ఎమోషన్స్తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్లో గోల్డ్మెడల్ గెలిచింది. స్విమ్మింగ్తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. (ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్ ) ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముద్దుగుమ్మ. మోడలింగ్పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నట్లు కృతి సనన్ తెలిపింది. అయితే మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. సినిమాలు వెళ్లిపోదామనుకున్నా అయితే ఓ ర్యాంప్షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది కృతి. ఇంటికొచ్చేస్తానంటూ ఏడుస్తూ అమ్మకి ఫోన్ చేశానని పేర్కొంది. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని ఆ సమయంలో అమ్మ తనకు చెప్పిందని వెల్లడించింది. తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఆదిపురుష్ భామ. ( ఇది చదవండి: ఓవల్లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!) -
నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి
సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్ల్లో కనిపించింది. (ఇది చదవండి: రాధికా శరత్కుమార్కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) -
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్ఫామ్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్ స్పీడే.. దూసుకుపోతుందంతే..!
ప్రతీ గ్రాడ్యుయేట్కు ఒక లెక్క ఉంటుంది.. 4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి కెరీర్ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్ మార్కెట్ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్’ లేబుల్ చాలా మంది గ్రాడ్యుయేట్లకు అడ్డంకి మారుతోంది. ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్ రికార్డ్లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్ల వల్ల అయ్యే తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్–పాండమిక్ జాబ్ మార్కెట్ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్మెంట్ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యమే.. విజయం.. ఫ్రెషర్లు కెరీర్ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్ మార్కెట్ నైపుణ్యం రీస్కిల్లింగ్ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది. ఎంపిక జాగ్రత్త.. వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫైనాన్స్ టెక్నాలజీ పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్చెయిన్ టెక్నాలజీ హాటెస్ట్ సెక్టార్లలో ఒకటిగా ఉద్భవించింది. గత 2022లో, డేటా సైన్స్లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్ ప్రొఫెషనల్ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిపుణుడు తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్ వారి పదవీ విరమణ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు. పేపర్ పులి కావద్దు... కేవలం కాగితంపై స్కిల్స్ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్లు కనెక్షన్లను కలిగి ఉన్నాయి. నెట్వర్క్ పెంచుకోండి.. సామాజిక వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్స్కిల్లింగ్లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్లో అభ్యర్థి తమ నైపుణ్యం సెట్లను అప్డేట్ చేసిన తర్వాత, తదుపరి దశలో తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్ఫామ్లను తరచుగా పరిశీలించాలి. అలాగే సృజనాత్మకతను, వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్ నెట్వర్క్ను రూపొందించుకోవాలి. ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి ఎందుకు మీరు అర్హత పొందారో చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. సుస్థిరమైన సభ్యుల గ్లోబల్ నెట్వర్క్తో కనెక్ట్ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్లు, హ్యాకథాన్లు సమ్మిట్ల వంటి లైవ్ ప్రాజెక్ట్లలో పాల్గొనడం ద్వారా నెట్వర్కింగ్ను బలోపేతం చేసుకోవాలి. పోర్ట్ఫోలియో... ఓ గుర్తింపు. పోర్ట్ఫోలియో అనేది మీ గుర్తింపు, మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్లలో మీరు చూపించిన డైరెక్ట్ రిజల్టులను హైలైట్ చేయండి, పురోగతి భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. –హరికృష్ణన్ నాయర్, కో ఫౌండర్, గ్రేట్ లెర్నింగ్ -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్కు వెళ్లాను. పాండీబజార్లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్బాస్ హౌజ్లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్ఫాదర్గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
అపురూప కల్పన
ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్ను ‘ఆర్కిటెక్ట్’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైన్లతో తనప్రోఫెషనల్ కెరీర్కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది... నేను చేసే వర్క్స్లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్ ముంబైలోని ఆష్తి మిల్లర్ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్ ఆర్టిస్ట్. తండ్రి ఆర్కిటెక్ట్. ఇంటినిండా ఆర్ట్కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్లు, ఆర్ట్గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్ ఇంక్ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్ కెరీర్ ‘ఆర్కిటెక్ట్’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్లతో మిళితం చేసి యూనిక్ స్టైల్తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్లకు సంబంధించిన మెడల్స్ను యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్టెక్ కంపెనీ బ్రాండ్కు సంబంధించి మనీఆర్ట్ సిరీస్ కోసం మిల్లర్ సృష్టించిన 14 లేయర్లతో కూడిన ఆర్ట్ వర్క్కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ప్రతిఫలిస్తాయి. మిల్లర్ ఆర్ట్వర్క్స్ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్ ఆర్ట్వర్క్లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్ అమ్బ్రోగి. ‘మిల్లర్లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్వర్క్స్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్ సంస్థ పికార్ట్కు చెందిన ఆంథోనీ మార్కెస్.ఆంథోనితో కలిసి అర్బన్ మాస్టర్ ప్లాన్స్ నుంచి పర్సనల్ స్పేసెస్ వరకు ఎన్నోప్రాజెక్ట్లలో పనిచేసింది ఆష్తి మిల్లర్.‘మోర్ ఈజ్ బెటర్’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో చోటు సంపాదించింది. -
నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్
నార్త్ నుంచి వచ్చి ముందు సౌత్లో స్టార్ హీరోయిన్ అయ్యారు రకుల్ ప్రీత్సింగ్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘అయలాన్’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్లో కూర్చుని, ఏయే ఆఫీస్కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్లాన్ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్కి వెళ్లేదాన్ని. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్ చేసి, వేరే హీరోయిన్ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు. -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్లో (అవివాహితులకు) అబార్షన్ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్షిప్నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్గా పరిగణిస్తే భవిష్యత్కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్షిప్లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్లో ఇంటర్న్షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్లైన్లోగాని, ఆఫ్లైన్లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్కుమార్రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్
Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నితిన్. దిల్, సై, ఇష్క్ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్లో ఎమోషనల్గా పోస్ట్ చేశాడు నితిన్. ❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3 — nithiin (@actor_nithiin) June 14, 2022 -
జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది. 'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఉండటం చాలా సహజం. మన లైఫ్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది. చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం.. -
సినిమా ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా: హీరోయిన్
Nivetha Pethuraj Comments On Heroine Career: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్. ఆమె నటించిన 'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది. చదవండి: సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అక్షయ్ కుమార్ సినీ కెరీర్కు 30 ఏళ్లు.. ఊహించని సర్ప్రైజ్ వైరల్
Akshay Kumar Completes 30 Years In Bollywood YRF Special Poster: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు ఎలాంటి రియల్ స్టంట్స్ అయిన చేస్తాడు. అలా ఆయన చేసిన స్టంట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్. ఇటీవల 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే', 'బచ్చన్ పాండే' చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు అక్కీ. తాజాగా ఈ యాక్షన్ హీరో హిందీ చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ తొలి చిత్రం 'సౌగంధ్' 1991లో విడుదలైంది. ప్రస్తుతం పరాక్రమవంతుడు పృథ్వీరాజ్ చౌహన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'పృథ్వీరాజ్' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని 'యశ్ రాజ్ ఫిలీంస్' బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్ రాజ్ ఫిలీంస్ అక్షయ్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్ కుమార్ View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) అక్షయ్ కుమార్కు కానుకగా 'పృథ్వీరాజ్' సినిమా కొత్త పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ను పృథ్వీరాజ్ పాత్రలో ఉన్న అక్షయ్ ఫొటోతో పాటు ఆయన కెరీర్లోని అన్ని చిత్రాలతో రూపొందించారు. ఈ కానుకకు అక్షయ్ వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఇందులో 'నా సినీ ప్రయాణం ప్రారంభమై 30 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. నా తొలి చిత్రం సౌగంధ్ 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా మనోహరంగా ఉంది. నా సినీ కెరీర్లో మొదటి షాట్ ఊటీలో జరిగింది. అది కూడా యాక్షన్ షాట్. ఈ పోస్టర్కు ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైనది.' అని తెలిపాడు ఈ యాక్షన్ హీరో అక్కీ. ప్రస్తుతం ఈ సర్ప్రైజ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి: అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు -
డబ్బున్నోళ్లంతా ఎందుకిలా చేస్తారు? ఈలాన్ మస్క్ ఆసక్తికర సమాధానం
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకోవడం, ఆ వెంటనే కోట్లాది మంది యూజర్లు ఉన్న ట్విటర్ను నాటకీయ పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీగా మార్చడం. బస్సుల్లో ఊరెళ్లి వచ్చినట్టు రాకెట్లలో అంతరిక్ష ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించం వంటి పనుల్తో టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయాడు ఈలాన్ మస్క్. దీంతో ఈలాన్ మస్క్ ఎదుగుదలపై రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటికి ఎంతో ఓపిగ్గా బదులిచ్చాడు ఈలాన్ మస్క్. ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు విచిత్రంగా చిత్రలేఖనం వంటి కళలకు స్కూల్స్కి వెళ్తుంటారు. చదువయ్యాక ఉద్యోగాలు చేయరు. వృధాగా గడిపేస్తుంటారు. ఇంత చేసినా ఒక్కోసారి ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చే ఈలాన్ మస్క్ లాంటి వారయితే అనూహ్యమైన విజయాలను సాధిస్తుంటారు. ఇందుకు కారణం ఏంటి అంటూ నేరుగా ఈలాన్ మస్క్నే డోనా అనే టీనేజ్ ట్విటర్ యూజర్ ప్రశ్నించింది. కసి డోనా ప్రశ్నకు ఈలాన్ మస్క్ బదులిస్తూ.. డబ్బులేని వాళ్లతో పోల్చినప్పుడు అదున్నవాళ్ల దగ్గర ఏదైనా సాధించాలనే కసి (మోటివేషన్) తక్కువగా ఉంటుందంటూ చెప్పాడు. నేను మొదటి స్టార్టప్ అయిన జిప్2ను 1995లో ప్రారంభించేప్పుడు నా దగ్గర స్టూడెంట్లోనుగా తీసుకున్న వంద డాలర్లు, ఒక కంప్యూటర్ మాత్రమే ఉందంటూ బదులిచ్చాడు. అవన్నీ కట్టు కథలే ఈ సంభాషణలోకి వచ్చిన ఇండియన్ యూజర్ ప్రణయ్ పటోల్ మాట్లాడుతూ... ఈలాన్ మస్క్ పుట్టుకతోనే ధనవంతుడనే తప్పుడు ప్రచారం బాగా జరుగుతోంది. ఈలాన్ మస్క్ తండ్రికి ఎమరాల్డ్ మైన్స్ ఉండేవంటూ లేని పోని కథలు చక్కర్లు కొడుతున్నాయి... అసలు ఈలాన్ మస్క్ తన కెరీర్ తొలి రోజుల్లో ఎలా పైకి వచ్చాడో మీకు తెలియదంటూ చెప్పాడు. నైట్క్లబ్గా మారిన ఇళ్లు ప్రణయ్ పటోల్ ట్వీట్కి ఈలాన్ మస్క్ సమాధానం ఇస్తూ కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.. ‘ మేము నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించే స్థోమత కూడా ఆ రోజుల్లో లేదు. దీంతో ఆ ఇంటి అద్దె చెల్లించే డబ్బుల కోసం, రాత్రి వేళ నేనుండే ఇంటిని నైట్ క్లబ్గా మార్చేవాడిని. ఎంట్రీకి 5 డాలర్లు వసూలు చేసేవాడిని’ అంటూ తన కెరీర్ తొలి రోజులను వివరించాడు ఈలాన్ మస్క్. సౌతాఫ్రికా నుంచి మొదలు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈలాన్ మస్క్ తన కలల ప్రపపంచాన్ని వెతుక్కుంటూ అమెరికాకి వలస వచ్చాడు. అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీ డిగ్రీ పట్టా పొందాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు కాలిఫోర్నియా చేరుకుని అక్కడే తన సోదరుడు కింబల్తో కలిసి 1995లో వెబ్ సాఫ్ట్వేర్ స్టార్టప్ జిప్2ని నెలకొల్పాడు ఈలాన్ మస్క్. ఈ జిప్2ని కాంపాక్ సంస్థ 307 మిలియన్ డాలర్లకు 1999లో కొనుగోలు చేసింది. అంచెలంచెలుగా జిప్2ను అమ్మగా వచ్చిన డబ్బుతో బ్యాంక్.ఎక్స్ స్టార్టప్లో సహా వ్యవస్థాపకుడిగా మారాడు. 2000లో బ్యాంక్.ఎక్స్ను కాన్ఫినిటీలో విలీనం చేసి.. ఆ తర్వాత పేపాల్ను స్థాపించాడు. ఈ కొత్త స్టార్టప్ పేపాల్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీన్ని 1.5 బిలియన్ డాలర్లకు ఈబేకు కొనుగోలు చేసింది. పేపాల్ను అమ్మగా వచ్చిన సొమ్ముతో 2002లో స్పేస్ఎక్స్, 2004లో టెస్లాలో పెట్టుబడులు పెట్టి సహా వ్యవస్థాపకుడు అయ్యాడు ఈలాన్ మస్క్, ఆ తర్వాత తన అద్భుత వ్యూహ చతురతతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రూపాంతరం చెందాడు. ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేశాడు. If being born to a well-off family is why @ElonMusk succeeded extravagantly in life then explain to me why all these rich kids go to art school, never get a job, and waste away — 𝕯𝖆𝖓𝖆 🌞 🕵️♀️#ShadowCrew (@daelmor) May 3, 2022 చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి: ఎలన్ మస్క్ -
Warren Buffett: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!
వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు. కంపెనీ షేర్హోల్డర్లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు. బఫెట్ ఏం చేశారు. బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు. చదవండి: గేట్స్ ఫౌండేషన్కు బఫెట్ రాజీనామా -
కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా
బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా అభిప్రాయపడింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్కి కంగనా హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో కంగనా 'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నా ముఖంపైనే చెప్పేవారు. కానీ, నా నిర్మాత ఏక్తా కపూర్ అలా అన్లేదు. నా కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసిపనిచేశాను. ఆమె చాలా మంచి వ్యక్తి. నాకు ఫస్ట్ హిట్ను ఇచ్చింది కూడా ఆమె. నాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.' అని తెలిపింది. -
ఫ్రెషర్లకు కొలువుల పండగ!
న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్లీజ్ ఎడ్యుటెక్ ‘కెరీర్ అవుట్లుక్ రిపోర్ట్’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి. గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్లీజ్ ఎడ్టెక్ సీఈవో శంతనురూజ్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది. వీటికి అధిక డిమాండ్ ‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లయ్ చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకూ డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు. ఐటీలో 3.6 లక్షల కొలువులు ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అన్ఎర్త్ ఇన్సైట్’ సంస్థ పేర్కొంది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది. -
టాలెంటెడ్ యంగ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ విశేషాలు
Happy Birthday Naga Shaurya: వరుస ఆఫర్లతో సక్సెస్పుల్గా కరియర్ను ట్రాక్లో నడిపిస్తున్న టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.'చందమామ కథలు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' అంటూ అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టాడు. క్యూట్ లుక్స్తో, లవర్ బాయ్లా ఛలో అంటూ సూపర్ హిట్ కొట్టేశాడు. ఇటీవల ఎయిట్ ప్యాక్ బాడీతో అదరగొట్టి ‘లక్ష్య’న్ని మిస్ చేసుకున్నాడు. ఇపుడిక వరుడు కావలెను అంటూ ఓటీటీలో సందడి చేస్తున్నాడు. జనవరి 22 నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ లవర్బాయ్ గురించిన విశేషాలపై ఓ లుక్కేద్దామా! మాంచి ఒడ్డూ పొడుగుతో అందమైన నవ్వుతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి సినిమాతో ఎట్రాక్ట్ చేసి వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'జ్యో అచ్యుతానంద' 'ఒక మనసు' చిత్రాతో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్కి కూడా దగ్గరయ్యాడు. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకున్నాడు. ముఖ్యంగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన 'ఛలో' తో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య ఆ తరువాత దూకుడును మరింత పెంచాడు. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడట. విజయవాడలో ఉంటున్న రోజులనుంచి సినిమాలలో నటించాలనేకోరిక పుట్టింది. అలా తన డ్రీమ్స్ సాకారం కోసం హైదరాబాదు షిప్ట్ అయ్యాడు. ఐదు సంవత్సరాలు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలు మన వల్ల కాదులే అనుకుంటున్న టైంలో అనూహ్యంగా 2011లో సినీ రంగంలోకి ఎంట్రీ దొరికింది. అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఊహలు గుసగుసలాడే మూవీలో లీడ్ రోల్ పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కమర్షియల్గా సక్సెస్ను అందుకున్నాడు. తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, 2015లో జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి మూవీల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో మెగా డాటర్ నీహారిక కొణిదెలకు జోడీగా ఒక మనసు, మాళవిక నాయర్ హీరోయిన్గా కళ్యాణ వైభోగమే సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత వరుడు కావలెను, 'లక్ష్య' సినిమాల్లో నటించాడు. కానీ ఛలో మూవీ అంతటి రేంజ్ హిట్ దక్కలేదు. వరుస ఆఫర్లు వస్తున్నా బ్లాక్ బ్టస్టర్ హిట్ కొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. అందుకే ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టే తన మూవీలను ఓటీటీ బాట పట్టించాడు. ముఖ్యంగా ఆర్చరీ నేపథ్యంలో తీసిన ‘లక్ష్య’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. కండలు తిరిగిన బాడీతో కసరత్తు చేసినా లక్ష్య టార్గెట్ రీచ్ కాలేదు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను, కేతికశర్మ హీరోయిన్గా నటించిన లక్ష్య మూవీలను ఓటీటీద్వారా విడుదల చేసితన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు గత ఏడాది చివరలో రిలీజయ్యాయి. మరోవైపు నాగశౌర్య బర్త్ డే స్పెషల్గా అప్ కమింగ్ మూవీలపై ఇవ్వనున్న అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. -
సమంతపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్.. మూడు ముక్కల్లో
టాలీవుడ్ బెస్ట్ కపుల్గా పేరొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకుందని ఇంకా చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వీరి మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్ 2న తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో విడాకుల తర్వాత సమంత కెరీర్ క్లోజ్ అవుతుందని అందరు ఊహించారు. ఆ ఊహలను పటాపంచలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో వేగంగా ముందుకు దూసుకుపోతోంది సామ్. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు పుష్పలో స్పెషల్ సాంగ్తో సమంత కెరీర్ తారాజువ్వలా పైకిపోతుంది. ఈ క్రమంలో సమంత గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళిల భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్బంగా సమంత గురించి చెప్పమని యాంకర్ రామ్ చరణ్ను ప్రశ్నించాడు. దానికి సమంత 'కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..' అండూ మూడు ముక్కల్లో చెప్పాడు రామ్ చరణ్. అయితే ఈ మాటలు విన్న సామ్ తెగ సంతోషపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్ సింబల్స్తో ట్విటర్లో షేర్ చేసింది. ♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw — Samantha (@Samanthaprabhu2) December 27, 2021 ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యపై సమంత 'హాట్' కామెంట్స్ వైరల్ -
ఈ రంగంలో అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు మీ సొంతం
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్.. అర్హతలుంటే కొలువులు ఖాయం చేస్తున్న రంగం. ఎంట్రీ లెవల్ మొదలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వరకూ.. చక్కటి ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల ఈ రంగం టెక్నికల్ నుంచి స్పెషలైజ్డ్ జాబ్ ప్రొఫైల్స్ వరకూ.. భారీగా నియామకాలు చేపడుతోంది! ఉద్యోగార్థులు.. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫైనాన్షియల్ సేవల రంగంలో తాజా రిక్రూట్మెంట్ ట్రెండ్స్.. కొలువులు..అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. కరోనా పరిణామాల్లో అంతా డిజిటలైజేషన్ బాట పట్టారు. దాంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ సెక్టార్ పరిధిలోకి వచ్చే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, బీఎఫ్ఎస్ఐ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ.. ఇలా అన్నింటిలోనూ కార్యకలాపాలు తిరిగి వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ.. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లోని సంస్థల్లో నమోదైన నూతన నియామకాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అందుకే కొలువులు గత కొంత కాలంగా అనేక సంస్థలు స్టాక్ మార్కెట్లో ఐపీఓల బాటపట్టాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రయివేట్ ఈక్విటీ సంస్థలకు నిధులు భారీగా వస్తున్నాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు సంస్థలు టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించడంపై దృష్టిపెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం సైతం విస్తరిస్తోంది. ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో నియామకాల జోరుకు కారణాలుగా చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగా సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ..ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. జూనియర్, మిడిల్ లెవల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో.. జూనియర్, మిడిల్ లెవల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కరోనా ముందుకాలం నాటి ఆఫర్స్తో పోల్చుకుంటే.. సగటున 30 నుంచి 50 శాతం మేర కొత్త కొలువులు లభించాయి. జూనియర్ లెవల్లో 1 నుంచి 4ఏళ్ల అనుభవం ఉన్న వారిని, మిడిల్ లెవల్లో అయిదు నుంచి 13ఏళ్ల అనుభవం ఉన్న వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి. బీఎఫ్ఎస్ఐ.. ఎవర్గ్రీన్ ఫైనాన్షియల్ సెక్టార్ అనగానే గుర్తుకొచ్చే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లోని సంస్థలు.. రిక్రూట్మెంట్స్లో ఎవర్గ్రీన్గా నిలుస్తున్నాయి. 2020 సెప్టెంబర్తో పోలిస్తే.. 2021 సెప్టెంబర్ నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 43 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టాలెంట్ కొరత ఫైనాన్స్ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. కంపెనీలకు అవసరమైన టాలెంట్ కొరత నెలకొన్నట్లు చెబుతున్నారు. నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు కంపెనీలు, స్టాఫింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంది. వేతనాలు ఆకర్షణీయం నైపుణ్యాలున్న వారికి ఫైనాన్షియల్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. జూనియర్ లెవల్లో సగటున రూ.8లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో రూ.18లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఫైనాన్షియల్ రంగం.. జాబ్ ట్రెండ్స్.. ముఖ్యాంశాలు ► ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీగా నియామకాలు. ► జూనియర్, మిడిల్ లెవల్లో 30 నుంచి 50 శాతం వరకూ పెరుగుదల. ► జూనియర్ లెవల్లో రూ.8 లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో సగటున రూ.18 లక్షల వరకు వేతనాలు. ► సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ–ఎంఎల్ నిపుణులకు డిమాండ్. రీసెర్చ్ అనలిస్ట్ ఫైనాన్షియల్ రంగంలో ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, ఈక్విటీ, ట్రేడింగ్ సంస్థల్లో కీలకంగా నిలుస్తున్న జాబ్ ప్రొఫైల్.. రీసెర్చ్ అనలిస్ట్. ఆయా స్టాక్స్కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు వాటి సానుకూలతలు, ప్రతికూలతల గురించి సూచించడం.. క్లయింట్ల కోసం ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్పై విశ్లేషణ వీరి ప్రధాన విధులు.ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు.. ఎంబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లో పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్టులుగా నియమించుకుంటున్నాయి. ఫండ్ మేనేజర్ ఆయా ఫండ్స్లో ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి సందర్భంలో సదరు సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక ఫలితాలు, లాభనష్టాలు, డివిడెండ్స్.. భవిష్యత్లో ఆ సంస్థల పనితీరు ఎలా ఉండబోతోంది వంటి అంశాలను విశ్లేషించి.. ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫండ్లలో పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను ఒప్పించడం వంటి కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు.. ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న వారికి ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల నిర్వహణ.. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల ప్రధాన విధి. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్ఫోలియో సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్, పనితీరు, నియంత్రణ,క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. సంస్థలు కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్తో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ నిపుణులకు అవకాశం ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు.. ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్లో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఫలితంగా బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ రంగంలో కొలువులు లభిస్తున్నాయి. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, చెల్లించే సామర్థ్యం, వయసు తదితరాలు గణించి.. పాలసీకి అర్హతలు నిర్ణయించే వారే..యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్. వీరికి బీమా సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. యాక్చుయేరియల్ సొసైటీ నిర్వహించే కోర్సుల ఉత్తీర్ణులకు ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అండర్ రైటర్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లో మరో కీలకమైన కొలువు..అండర్ రైటర్స్. ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకోవాలనే ప్రతిపాదన చేసినప్పుడు.. దాన్ని పరిశీలించి, సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతారో లేదో నిర్ణయించడం వీరి ప్రధాన విధి. ప్రత్యేక అర్హతలున్న వారికే సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందించే అసోసియేట్ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. రిస్క్ అనలిస్ట్స్ నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో.. పాలసీ చేయాలనుకున్న వస్తువులు లేదా నిర్మాణాలను పరిశీలించి.. వాటి జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రిస్క్ అనలిస్ట్లు నివేదికలు ఇస్తారు. సదరు నివేదిక ఆధారంగానే సంస్థ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ క్లెయిమ్ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగిందని.. ఆ కారణంగా బీమా చెల్లించాలనే విషయంపై తుది నిర్ణయం వీరిచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్స్.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. బ్యాంకింగ్లో అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో.. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో సంప్రదింపులు సాగించే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మొదలు ఉన్నత స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వరకూ.. అనేక రకాల అవకాశాలు లభిస్తున్నాయి. బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, కార్పొరేట్ బిజినెస్ సేల్స్ మేకర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రిస్క్ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్షియల్ ప్లానర్ వంటి ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో అందుకోవచ్చు. -
ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే
దేశంలో కామర్స్ కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సీఈసీ ఉత్తీర్ణులయ్యాక.. డిగ్రీ స్థాయిలో బీకామ్తోపాటు సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. వాస్తవానికి సీఈసీ విద్యార్థులు కామర్స్ సంబంధ కోర్సులు మాత్రమే కాకుండా.. బీబీఏ, బీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్ సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. డిగ్రీ స్థాయి కోర్సులు బీకామ్: సీఈసీ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులు ఎక్కువ మంది చేరే కోర్సు.. బీకామ్. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రైవేట్ బిజినెస్/సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. బిజినెస్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, బిజినెస్ రిస్క్ అడ్వైజర్, ఆపరేషన్స్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్, ఎకనామిస్ట్, మార్కె ట్ అనలిస్ట్, బిజినెస్ ఎకనామిక్ రైటర్, బడ్జెట్ అనలిస్ట్గా ఉద్యోగాలు పొందొచ్చు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు బీకామ్ కంప్యూటర్స్: ఇటీవల కాలంలో ఇంటర్ సీఈసీ ఉత్తీర్ణులు ఎక్కువగా చేరుతున్న కోర్సు.. బీకామ్ కంప్యూటర్స్. కార్పొరేట్ రంగంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉపయోగించేందుకు వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఈకోర్సు విద్యార్థులు కామర్స్తోపాటే కంప్యూటర్ నైపుణ్యం కూడా సొంతం చేసుకుంటారు. బీకామ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణులు వివిధ విభాగాల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్, యాప్ డెవలపర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో ఎంకామ్ కంప్యూటర్స్లో చేరొచ్చు. బీకామ్(హానర్స్): ఇటీవల విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న కోర్సు.. బీకామ్ హానర్స్. ఇది పలు ప్రభుత్వ/ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో చేరాలంటే..సీఈసీ ఇంటర్మీడియెట్ కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. బీకామ్ హానర్స్లో.. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్/ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్/ఎకనామిక్స్/బ్యాంకిం గ్ అండ్ ఇన్సూరెన్స్/టాక్సేషన్/మార్కెటింగ్ /హెచ్ఆర్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నా యి. బీకామ్ హానర్స్ పూర్తి చేసినవారికి మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, కామ ర్స్, బ్యాంకింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, రీసెర్చ్ అసోసియేట్స్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బీఏ ఎకనామిక్స్: ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు ఇది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్) సబ్జెక్టులు చదివినవారు మూడేళ్ల బీఏ ఎకనామిక్స్లో చేరితే ఉజ్వలంగా రాణించొచ్చు. వీరు బీఏ ఎకనామిక్స్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ ఫైనాన్స్/ఎంఏ ఎకనామిక్స్లో చేరి.. అద్భుత అవకాశాలు అందుకునే వీలుంది. వీరికి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగం, ప్రభుత్వ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ): బిజినెస్, మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునేవారికి బీబీఏ కోర్సు ఉపయుక్తంగా ఉంటుం ది. ముఖ్యంగా పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో..ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీబీఏ ఎంచుకోవడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ కోసం ఎంబీఏ చేయవచ్చు. బీబీఏ ఉత్తీర్ణులయ్యాక కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ మొదలైన విభిన్న విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజర్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్గా పనిచేయవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ): చార్టర్డ్ అకౌంటెన్సీ నిపుణులకు జాబ్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో ప్రధానంగా అకౌంటింగ్, ట్యాక్సేషన్పై దృష్టిసారిస్తారు. కామర్స్, అకౌంటెన్సీ, ట్యాక్సేషన్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఇంటర్మీడియట్ తర్వాత సీఏ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఈ కోర్సును అందిస్తోంది. సీఏ కోర్సు ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్.. ఇలా మూడు స్థాయిల్లో ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, వర్క్స్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ మొదలైన కార్పొరేట్, ఆర్థిక విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేయవచ్చు. సీనియర్ సీఏల వద్ద పనిచేయడం ద్వారా అనుభవం పొందొచ్చు. కంపెనీ సెక్రటరీ: కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ కోరుకునే కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి కార్పొరేట్ రంగం అవకాశాలను అందిస్తుంది. కంపెనీ సెక్రటరీలో.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్.. ఇలా మూడు స్థాయిలు ఉంటాయి. సరైన ప్రణాళికతో ముందుకెళితే ఇంటర్మీడియెట్ సీఈసీ తర్వాత మూడేళ్లలోనే సీఎస్ కోర్సును పూర్తిచేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక సీఈఓలు, ఎండీలకు సలహాలిచ్చే కంపెనీ సెక్రటరీగా అవకాశాలు దక్కించుకోవచ్చు. దాంతోపాటు అనుభవం, నైపుణ్యాల ఆధారంగా లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ పాలసీ మేకర్, కార్పొరేట్ ప్లానర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ లా: కామర్స్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలోని ప్రముఖ లా స్కూల్స్ బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ఇంటర్మీయెట్ తర్వాత క్లాట్లో ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. న్యాయ విద్యలో.. కార్పొరేట్ లా, ట్యాక్స్ లా/సివిల్, క్రిమినల్ లా/బిజినెస్ అండ్ లేబర్ లా వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. -
అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!
‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. కరోనా సమయంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ రాలేదు కాబట్టి మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’’ అని నటుడు రాజా రవీంద్ర అన్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకపోతేనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఓ పాయింట్ను వినోదాత్మకంగా చెప్పాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాజు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. యాభై ఏళ్లు దాటిన రాజుని మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోదు. ఆ సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయితో చాటింగ్ చేస్తాడు. ఓ చిన్న తప్పు కారణంగా ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేదే కథ. విలన్ పాత్రలు చేయడం ఈజీ. కానీ కామెడీ చాలా కష్టం.. సరైన టైమింగ్ ఉండాలి. చిరంజీవిగారి ‘ఆచార్య’లో మంచి పాత్ర చేశాను. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రోజ్ విల్లా’తో పాటు సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాను. నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోతే టీ, కాఫీలు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండిపోతా’’ అన్నారు. -
క్రీడా రంగంలో అద్భుతమైన కెరీర్.. ముఖ్యమైన సమాచారం మీకోసం
ప్రపంచ క్రీడా వేదిక టోక్యో ఒలింపిక్స్లో మన క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. అయినప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు ఆటలతో కెరీర్ కష్టమనుకుంటారు. అందుకే పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సుల వైపు పోత్సహించినట్టుగా.. క్రీడల వైపు ప్రోత్సహించడం లేదు. వాస్తవానికి ప్రతిభ ఉంటే.. స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్ కోర్సులను అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(ఇంపాల్)’ని∙ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరెన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో స్పోర్ట్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... మన యువత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ.. క్రీడలను కూడా కెరీర్గా మలచుకోవచ్చని నిరూపిస్తోంది. పలువురు స్పోర్ట్స్తో పేరు ప్రఖ్యాతులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్ ఒక్కటే కాదు.. హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి క్రీడలపైనా ఆసక్తి ఎక్కువే. ఆయా క్రీడాకారులకు అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కోహ్లీ, సానియా మీర్జా, పీవీ సింధు, అభినవ్ బింద్రా, సుశీల్ కుమార్, విశ్వనాథ్ ఆనంద్, మేరీకోమ్ వంటి వారే అందుకు నిదర్శనం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు క్రీడాకారుడిగా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభతోపాటు బలమైన సంకల్పం, పట్టుదల చాలా అవసరం. ⇔ ఒక వయసు దాటాక స్పోర్ట్స్ కెరీర్ ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. క్రీడాకారుడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా అద్భుతమై రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెటిక్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ సెకాలజీ, స్పోర్ట్స్ మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాల్లో ప్రవేశించవచ్చు. ⇔ స్పోర్ట్స్ ప్లేయర్, స్పోర్ట్స్ టీచర్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కోచ్ అండ్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్, పర్సనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ అథ్లెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్ వంటి విభాగాల్లో రాణించవచ్చు. ⇔ స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపినవారికి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు, అకాడమీలు శిక్షణనిస్తున్నాయి. చురుకైన యువతకు చక్కటి శిక్షణ ఇచ్చి.. ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకూ క్రీడలకు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా » బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్ » బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్) » ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు) » ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు) » ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ, ఎంఎస్సీ/ఎంఫీల్/పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముంది. ప్రవేశం–అర్హతలు స్పోర్ట్స్ కోర్సుల్లో ప్రవేశానికి పలు అర్హతలు నిర్దేశించారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సులు పూర్తిచేసినవారు పీజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఎంబీబీఎస్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేయవచ్చు. అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ,టెస్టులు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. పలు స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లు ⇔ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇంపాల్); ⇔ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(పటియాలా); ⇔ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ (న్యూఢిల్లీ); ⇔లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (గ్వాలియర్); ⇔లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం); ⇔టాటా ఫుట్బాల్ అకాడమీ (జంషెడ్పూర్); ⇔ నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూరు); ⇔ ఢిల్లీ యూనివర్సిటీ. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలోని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. ► బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్: నాలుగేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ కోర్సులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్): బీపీఈఎస్ కోర్సు కాలపరిమితి మూడేళ్లు. ఇంటర్మీడియెట్(10+2)లేదా తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్లో 70 శాతం, క్రీడల్లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు): బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, బీపీఈఎస్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్/ బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు): ఈ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి బీపీఈఎస్/ బీపీఈడీ/బీఏ(హానర్స్), బీఏ సైకాలజీ/స్పోర్ట్స్ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 100 మార్కులు, వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కుల వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ముఖ్య సమాచారం ► ఎన్ఎస్యూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2021 ► ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్: 10 సెప్టెంబర్ 2021 ► ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: సెప్టెంబర్ 22–24 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nsu.ac.in స్సోర్ట్స్ సైకాలజీకి క్రేజ్ క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులు కొరత నెలకొంది. దాంతో మన దేశ క్రీడా సంఘాలు అమెరికా,ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ,ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్ సైకాలజీ కోర్సు మాత్రం చాలా తక్కువ యూనివర్సిటీల్లో ఉంది.వాటిలో చెప్పుకోదగ్గవి.. ►గురునానక్దేవ్ యూనివర్సిటీ(అమృత్సర్): ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ. ►తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(చెన్నై): ఎంఎస్సీ/ ఎంఫిల్/ పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ. ► రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ: ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ. ►లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(గ్వాలియర్):ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ. -
కి..కి..కిరణ్ అంటూ వచ్చి....
-
కి..కి..కిరణ్ అంటూ వచ్చి....
సైకో లవర్లా ప్రేమించిన అమ్మాయిని వేధించినా... కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే ప్రియుడిగా కనిపించినా వెండితెర మెప్పు పొందడం అతనికే చెల్లించింది. రాజ్ మేరా నామ్ అంటూ రోమాంటిక్ హీరోగా అంతులేని పాపులిటీ సొంతం చేసుకున్నాడు. దీవానగా ప్రయాణం మొదలెట్టి ‘దిల్వాలే’గా ఎదిగి... డాన్గా, రా.వన్గా కొత్త ఎత్తులకు చేరాడు. అసలు పేరు షారుఖ్ఖాన్ అయితే బాలీవుడ్ బాద్షా, కింగ్ఖాన్ సర్వనామాలుగా మార్చుకున్నాడు. వెండితెరపై 29 ఏళ్లుగా ప్రేక్షకులను రంజిప చేస్తూ... ఈ 30వ ఏట పఠాన్గా మనల్ని అలరించబోతున్నాడు. -
నా కెరీర్లో ప్రధానంగా మూడు మార్పులొచ్చాయ్: సమంత
‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను సమంత మాయ చేసిందనే చెప్పాలి. సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ను సంపాదించింది ఈ చెన్నై బ్యూటీ. ప్రస్తుతం సౌత్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఫ్యాన్సును సంపాదించుకున్న సామ్ ఇటీవల వెబ్సిరీస్లోనూ అడుగు పెట్టి అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ తన కెరీర్ ప్రారంభించి 11 సంవత్సరాలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనలో వచ్చిన మూడు ప్రధాన మార్పులను చెప్పుకొచ్చింది. సామ్ ఆ ఇంటర్వ్యూలో.. కెరీర్ పరంగా తాను చాలా అంటే చాలా కష్టపడి పనిచేసే వ్యక్తినని, అదే సమయంలో కాస్త అభద్రతా భావం, అనేక స్వీయ సందేహాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. నా సినీ కెరీర్లో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వాటిని అధిగమించడం నేర్చుకుంటూ, అదే క్రమంంలో నా అభద్రతాభావాలను తగ్గించుకోవడమే గాక పెద్ద రిస్క్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు తనపై నమ్మకంగా ఉందని, ముందున్న భయాలు, అభద్రతాభావాలను పక్కన పెట్టేసి, పెద్ద రిస్క్లనైనా తీసుకోవడం లాంటి మూడు ప్రధాన మార్పులు తనలో వచ్చాయని సామ్ చెప్పుకొచ్చింది. -
నా తప్పులు తెలుసుకున్నా: హెబ్బా పటేల్
ప్రస్తుత ప్రపంచంలో మనం ఏరంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని కచ్చితంగా ఆహ్వానించాలని అంటోంది అందాల భామ హెబ్బా పటేల్. కెరీర్ మొదట్లో నటించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తన అందం, నటనతో యువతను కట్టిపడేసిన హెబ్బా గత కొన్నాళ్లుగా కాస్త వెనుకపడింది. నితిని ‘భీష్మ’లో అలా తళుక్కున మెరిసి, రామ్ ’రెడ్’ చిత్రంలో ఐటెమ్ పాత్రలో కనిపించడం మినహా పెద్దగా చెప్పకునే పాత్రలేమీ చేయలేదు. దీనికి గతంలో తను చేసిన తప్పులే కారణమని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ఆరంభంలో కుమారి 21 ఎఫ్ , ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్నప్పటికీ అనంతరం సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేయడంతో కెరీర్ పరంగా వెనకబడింది. “24 కిస్సెస్’ సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లో మాత్రమే కనిపించింది. అయితే ఒకానొక సమయంలో తన కెరీర్ గురించి భయమేసిందంటోంది హెబ్బా పటేల్. కానీ లాక్డౌన్ విరామ సమయంలో కెరీర్లో చేసిన తప్పుల్ని సమీక్షించుకున్నానని, ఇకపై కథల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్’లో పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని అంటోంది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడ తను కోరుకున్న పాత్రలు లభిస్తున్నాయని తెలిపింది. చదవండి: న్యూస్ రీడర్గా రమా రాజమౌళి.. వీడియో వైరల్ -
ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్షిప్ ప్రోగ్రాం’ ప్రారంభించింది. ఇది 12 వారాల పాటు ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిభావంతులైన నిపుణులకు అవసరమైన శిక్షణ కల్పించడం, సలహాలివ్వడం, ఇతరత్రా అవసరమైన వనరులను సమకూర్చేందుకు ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే ప్రొఫెషనల్స్లో చాలామంది మహిళలు కూడా ఉంటున్నారని, తొలి బ్యాచ్లో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ విధులపై ఆసక్తి ఉన్న వారికి చోటు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సుప్రీం తీర్పు నిరాశపర్చింది : సైరస్ మిస్త్రీ ) -
ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలి?
నేను ప్రస్తుతం ఐటీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలో చెప్పండి? –నగేశ్ చాలామంది టెక్నికల్ కోర్సుల విద్యార్థులు తమకు ఉన్నత చదువులు చదవాలని ఉన్నా.. క్యాంపస్ ఎంపికల్లో ఆఫర్ రావడంతో అందులో చేరిపోతున్నారు. మంచి వేతనంతో పాటు సౌకర్యాలు అందిస్తుండటంతో అదే జాబ్లో కొనసాగుతుంటారు. కానీ కొంతకాలానికి ఉన్నత విద్య కోర్సు చదువుదాం అనే ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు చేస్తున్న జాబ్ను వదిలి మళ్లీ కోర్సులో చేరాలంటే.. కుటుంబం నుంచి మద్దతు లభించదు. చేతిలో ఉన్న ఉద్యోగం వదిలేయడం సరైన నిర్ణయం కాదని సన్నిహితులు సూచిస్తుంటారు. ఇవన్నీ సర్వ సాధారణమే! మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు. ఇంజనీరింగ్ నేపథ్యంతో సాఫ్ట్వేర్ జాబ్లో చేరి ఉంటే.. ఐదారేళ్ల అనుభవం తర్వాత మరింత ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఎంబీఏ ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఐటీ జాబ్లో ఐదేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే.. ఎంబీఏ చేయాలన్న మీ ఆలోచన సరైనదే. దీనిద్వారా మీరు కెరీర్లో మేనేజ్మెంట్ విభాగంలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న కెరీర్లో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి చాలామంది ఇంజనీరింగ్ పూర్తికాగానే ఎంబీఏలో చేరిపోతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం–బీటెక్ పూర్తికాగానే ఎంబీఏలో చేరడం వల్ల తమకు ఏ స్పెషలైజేషన్ నచ్చుతుందో సరిగా అంచనా వేయలేరు. దానివల్ల ఎంబీఏ చేసిన రెండేళ్ల కాలం నష్టపోతున్నారు. మరోవైపు ఎంతో విలువైన ఉద్యోగ అనుభవం అవకాశం కూడా కోల్పోతున్నారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో రెగ్యులర్ ఎంబీఏ, పీజీడీపీఎం, పీజీడీఎం వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫుల్టైమ్ టైమ్ కోర్సులు. వీటిని తప్పనిసరిగా విద్యా సంస్థకు వెళ్లి చదవాల్సిందే. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి అనువుగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అనుభవం పొందిన వారు ఎంబీఏతో మేనేజ్మెంట్ విభాగంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఐటీ ప్రొఫెషన్స్లో ఉన్నవారికి అనువైన ఎంబీఏ స్పెషలైజేషన్స్.. ఎంబీఏ–ఐటీ లేదా టెక్నాలజీ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్, ఎంబీఏ–స్ట్రాటజీ మేనేజ్మెంట్ » ఎంబీఏ–కన్సల్టింగ్ మేనేజ్మెంట్,–ఎంబీఏ–ఫైనాన్స్ లీడర్షిప్ » ఎంబీఏ–ఆపరేషన్స్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇలాంటి స్పెషలైజేషన్స్ను ఎంచుకోవచ్చు. -
హెచ్సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్: ఇంటర్తోనే ఐటీ కొలువు
ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. కానీ, ఉన్నత విద్య కూడా కొనసాగించాలనుకుంటున్నారా ?! మీలాంటి విద్యార్థులకు సరితూగే కొలువుల కోర్సే.. హెచ్సీఎల్ అందిస్తున్న టెక్బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. ఇందులో చేరితే అనుభవంతోపాటు కొలువూ సొంతమవుతుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా టెక్బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ తదితరాల గురించి పూర్తి సమాచారం.. హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్లు, ఇంటర్ విద్యార్థులకు ఉపయో గపడేలా పలు ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. తాజాగా హెచ్సీఎల్ ఐటీ ఇంజనీర్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్సీఎల్ టెక్బీ.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఫుల్టైమ్ జాబ్ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్. హెచ్సీఎల్లో ఎంట్రీ లెవల్ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్లో ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్–పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్బీ ప్రోగ్రామ్కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ.2లక్షల–2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అర్హత ► 2019, 2020లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2021లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ► అభ్యర్థి ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను చదివుండాలి. ఫీజు ► ప్రోగ్రామ్ ఫీజు ట్యాక్స్లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. ► అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. ► విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. ► శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు∙పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు. శిక్షణ ► హెచ్సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్.. అభ్యర్థులను హెచ్సీఎల్ ప్రాజెక్ట్స్పై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది. ► ఫౌండేషన్ ట్రైనింగ్లో భాగంగా.. ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్ను బోధిస్తారు. ► అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అసైన్మెంట్స్, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి. అభ్యర్థులు టెక్నాలజీ సర్వీసెస్కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు. ఉద్యోగ వివరాలు ► శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్లో ఫుల్ టైమ్ ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు. ► ఆఫర్ అందుకున్నవారు దేశంలోని హెచ్సీఎల్ క్యాంపస్ల్లో అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ► హెచ్సీఎల్ హెల్త్కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ► బెనిఫిట్ బాక్స్ ప్రోగ్రామ్ కింద డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్ను అందుకోవచ్చు. ఉన్నత విద్య ► కెరీర్ రూపకల్పనలో విద్యది కీలకపాత్ర. దీన్ని గుర్తించిన హెచ్సీఎల్.. బిట్స్ పిలానీ, సస్త్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో టెక్బీ స్కాలర్స్కు ప్రత్యేక ఉన్నత విద్యా ప్రోగ్రామ్స్ను ఆఫర్చేస్తోంది. బిట్స్, పిలానీ ► బిట్స్ పిలానీ సహకారంతో ఎంప్లాయిబిలిటీ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ప్రోగ్రామ్ను హెచ్సీఎల్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కోర్సులకు సంబంధించిన తరగతులను హెచ్సీఎల్ క్యాంపస్లలో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్స్కు సంబంధించిన ఫీజులో కొంత మొత్తాన్ని హెచ్సీఎల్ భరిస్తుంది. ఈ బీఎస్సీ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... ఇదే ఇన్స్టిట్యూట్లో ఎమ్మెస్సీ/ఎంటెక్ కోర్సుల్లో చేరే వీలుంది. ► హెచ్సీఎల్ టెక్ బీ అభ్యర్థులు తంజావూర్లోని సస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో మూడేళ్ల బీసీఏలో చేరొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ/ఎంటెక్లో ప్రవేశం పొందే వీలుంది. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.hcltechbee.com -
శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు
పెద్దయ్యాక ఏమౌతావ్? పిల్లల్ని అడుగుతాం. వాళ్లకేం తెలుసు ఏమవ్వాలో?! ఏదో ఒకటి చెబుతారు. అవడానికి ఏమేం ఉన్నాయో.. ముందు మనం చెప్పాలి వాళ్లకు. శ్యామ్ చెబుతున్నాడు. యు కెన్ బి ఎనీ థింగ్’అంటూ.. పెద్దయ్యాక ఏమేం అవొచ్చో ‘ర్యాప్’ డ్యాన్స్తో చూపిస్తున్నాడు. శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు. శ్యామ్ వైట్కి ఆరేళ్లు. నల్లవాళ్లబ్బాయి. ర్యాప్తో సీన్లోకి వచ్చాడు! ‘ఆల్ఫాబెట్ ర్యాప్’ అని.. వాళ్ల డాడీ శ్యామ్ పాడి, ఆడిన ఆ వీడియోకి పేరు పెట్టాడు. ఆఫ్రికన్ స్టెయిల్లో చేతులు, తల ఆడిస్తూ ఎ ఫర్ ఆర్కిటెక్ట్, బి ఫర్ బయోకెమిస్ట్.. అని శ్యామ్ తీసిన దిద్దనక రాగాల ర్యాప్ను చూసి మిషల్ ఒబామా కూడా నవ్వును ఆపుకోలేకపోయారు! వాడి ఫీలింగ్స్, ఆ ఊగడం అది. ‘‘నాకు తెలుసు. ఇవి ఒత్తిళ్లతో కూడిన కాలాలు. ఈ వీడియో నా ముఖంపై స్ట్రెస్ను పోగొట్టి నన్ను ఆహ్లాదపరిచింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మనమంతా మన కిడ్స్ కోసం ఒక్కక్షణం ఆగి ఆలోచించేలా చేస్తాడు శ్యామ్. భవిష్యత్తులో వాళ్లను ఎలా చూడాలని అనుకుంటున్నామో మనకో ఆలోచన ఉంటుంది. అయితే శ్యామ్ ‘ఎబిసి ర్యాప్’ వెర్షన్ వేరేలా ఉంది. తనేం అంటాడంటే.. ‘యు కెన్ బి ఎనీ థింగ్’ అంటాడు. అవును. పిల్లల్ని తమకు ఇష్టమైన కలను కనమని శ్యామ్ చెబుతున్నాడు’’ అని మిషెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శ్యామ్ కెమెరాను చూస్తూ నిలబడి పాడుతుంటాడు. తండ్రి బాబీ వైట్ కొడుకు వెనుక బల్ల ముందు కూర్చొని బీట్ ఇస్తుంటాడు. అదొక లయబద్ధమైన స్ఫూర్తి గీతం. రెండున్నర నిముషాల క్లిప్. ఇలా మొదలౌతుంది. ముందు తండ్రి అతడిని అడుగుతాడు. పెద్దయ్యాక ఏమౌతావ్ అని. ఏమైనా అవ్వొచ్చు అంటాడు శ్యామ్! ‘అంటే?’ అని తండ్రి అడుగుతాడు. ఇక శ్యామ్ ప్రారంభిస్తాడు. యు కెన్ బి ఎ ‘ఎ’.. యు కెన్ బి యాన్ ఆర్కిటెక్ట్! క్యాచ్ ఎ బిల్డింగ్ టు కిస్ ద స్కై. (నువ్వు ఆర్కిటెక్ట్ అవొచ్చు. ఆకాశాన్ని కిస్ చెయ్చొచ్చు.) యు కెన్ బి ఎ ‘బి’. యు కెన్ బి ఎ బయోకెమిస్ట్. మేక్ మెడిసిన్స్.. సేవ్ లైవ్స్. (నువ్వు బయోకెమిస్ట్ కావొచ్చు. మందులు కనిపెట్టి, ప్రాణలను నిలపొచ్చు). యు కెన్ బి ఎ ‘సి’. కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలపర్. (నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ప్రోగ్రామ్స్ రాయొచ్చు)... ఇలా ఎ టు జడ్.. ర్యాప్ సాగుతుంది. శ్యామ్ పాటకు, స్టెప్స్కి చక్కగా జోడీ కుదిరింది. కొరియోగ్రఫీ కూడా శ్యామ్దే! ఎ నుంచి జడ్ వరకు ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తూ శ్యామ్ ర్యాప్ కొట్టడానికి టెలీ ప్రాంప్టరేం లేదు. గుర్తుపెట్టుకున్నాడు! ర్యాపింగ్ నైపుణ్యాలను మధ్యమధ్య కుమారుడికి కొంత అద్దాడు తండ్రి. ‘యు కెన్ బి ఎ ‘డి’. ఎ డెంటిస్ట్. బికాజ్ ఎవ్రీబడీ లవ్స్ టు స్మైల్ అన్నప్పుడు.. నవ్వినట్లుగా పెదవులను సాగదీయమని చెబుతాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్లో చివరికి వచ్చేసరికి ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకూ అనిపిస్తుంది ఈ పిల్లాడు ఎక్స్, వై, జడ్లకు ఏం చెబుతాడో అని. జడ్ కి ‘జలస్లీ స్ట్రైవ్’ అంటాడు. అసూయతో రగిలిపోతూ కష్టపడి సాధించమని. ‘వై’కి యువర్ ఓన్ బాస్ అంటాడు. నువ్వే నీకు బాస్వి కమ్మని. ‘ఎక్స్’ ప్రత్యేకంగా చెప్పలేదు. సమ్ ‘ఎక్స్’.. ఏదైనా అవ్వు కానీ, సోమరిగా మాత్రం ఉండిపోకు అని చెబుతాడు. ర్యాప్ ముగియగానే తండ్రి ఆనందం పట్టలేక గట్టిగా పిడికిలితో బల్లను గుద్దుతాడు. ఈ తండ్రీ కొడుకులది యు.ఎస్.లోని టెన్నెనీ రాష్ట్రంలోని మెంఫిస్. శ్యామ్ తన కడుపులో ఉండగా శ్యామ్ తల్లి పుస్తకాలు బాగా చదివారట. రెండేళ్ల వయసులోనే శ్యామ్ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నించేవాడని కూడా ఈ ‘యు కెన్ బి ఎనీథింగ్’ ర్యాప్కి వచ్చిన స్పందనకు చూసి ఆ తల్లి ఉప్పొంగిపోతూ చెబుతున్నారు. స్టెఫానీ ఆమె పేరు. గత సెప్టెంబరులోనే శ్యామ్కు ఆరో ఏడు వచ్చింది. తండ్రి రాసి ఇచ్చిన ఏబీసీ ర్యాప్ను లిరిక్ లైన్స్ గుర్తుపెట్టుకుని పాడటానికి శ్యామ్ యాభైసార్లకు పైగా మననం చేసుకున్నాడు. ఇప్పటికింకా వైరల్ అవుతూనే ఉన్న ఈ వీడియోకు గత ఐదు రోజుల్లో యూట్యూబ్లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్బుక్లో మూడు లక్షలసార్లు షేర్ అయింది. నువ్వు ఏమైనా అవొచ్చు అంటున్న శ్యామ్.. ఇంతకీ తను ఏమవ్వాలని అనుకుంటున్నాడు? ఆర్కెటెక్ట్ అవుతాడట. ఆకాశాన్ని చుంబించే భవంతులకు ప్లాన్లు గీయడం కోసం. View this post on Instagram Robert Samuel raps about career choices for kids. A post shared by Sam (@rsamuelw3) on Oct 26, 2020 at 12:14pm PDT -
విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్
శృంగవరపుకోట రూరల్: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు. ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు చూపిస్తున్నారు. శిక్షణ తరగతుల నిర్వహణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చినవీరభద్రుడు, పాఠశాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా వెబ్నార్లో రాష్ట్రంలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సెకెండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 9, 10, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్లైన్లో శిక్షణ అందజేస్తున్నారు. కేరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. కెరీర్ పోర్టల్లో నమోదు ఎలా?.. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’లో విద్యార్థి తమ చైల్డ్.ఇన్ఫో ద్వారా రిజిస్టర్ కావాలి. పాస్వర్డ్గా 123456 ఉంటుంది. నమోదు తొమ్మిది భాషల్లో చేసుకోవచ్చు. విద్యార్థి తమకు నచ్చిన భాషలో ఎంపిక చేసుకుని లాగిన్ అయ్యి.. డాష్కోడ్లో మై కెరీర్లో డెమోలో ప్రొఫైల్ నింపాలి. విద్యార్థి చదువు, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్తో సహా ఎంటర్ చేస్తే ఈ పోర్టల్లో నమోదు అయినట్లే. కోర్సుల సమాచారం ఇలా... 550 క్లస్టరర్లతో కూడిన 672 రకాల కోర్సులు, ఉపాధి, ఉద్యోగావకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. వ్యవసాయం/అందం/ఆరోగ్యం/వృత్తి నైపుణ్యం/64 కళలకు సంబంధించిన కోర్సులు/ బయలాజికల్, మెరైన్, రబ్బర్, ఆరి్టఫీషియల్, ఎనర్జీ, సో లార్ తదితర ఇంజినీరింగ్ కోర్సుల వివరాలు ఉంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత వాటి భవిష్యత్తు, జీతభత్యాలు, ఆంధ్రప్రదేశ్లోని కాలేజీలు, ఉపకార వేతనాలు పొందే వీలుంది. (ఉదాహరణకు సంతూర్, గ్లో అండ్ లవ్లీ, రమణ్కుమార్ ముంజల్, ఆర్కేఎం ఫౌండేషన్) వారి ఉపకార వేతనాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్లో ఉంటాయి. కోర్సులు, పరీక్షల వివరాలు.. వివిధ రకాల నోటిఫికేషన్లు, ఫీజులు, పరీక్షలు, కోర్సుల వివరాలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, జీతం, ఉపకార వేతనాలు తదితర వివరాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్లో ఉంటాయి. విద్యార్థులకు సువర్ణవకాశం.. 9, 10 తరగతులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, లైఫ్స్కిల్స్పై రూపొందించిన చక్కని కార్యక్రమం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపయోగకరమయ్యే కోర్సుల వివరాలతో కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారమే. – ఇందుకూరి అశోక్రాజు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, భవానీనగర్, ఎస్.కోట మండలం ఉపాధి, ఉద్యోగావకాశాలు.. ఈ కెరీర్ పోర్టల్లో లైఫ్స్కిల్స్, కెరీర్ గైడెన్స్ అందుతుంది. సెకెండరీ స్థాయి విద్యార్థులు తమ భవిష్యత్ను తామే నిర్మించుకోవచ్చు. 672 రకాల ఉపాధి అవకాశాల్లో విద్యార్థులు నచ్చిన అవకాశం గురంచి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. భవిష్యత్లో ఏం కాదల్చుకున్నామో విద్యార్థి దశలోనే గుర్తిస్తే ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. – రహీం షేక్లాల్, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ హైసూ్కల్, ధర్మవరం -
రిస్క్ తీసుకున్నా
విక్రమ్ప్రభు హీరోగా నటించిన ‘ఇదు ఎన్న మాయమ్’ (2015) చిత్రంతో తమిళంలో, రామ్ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’ (2016) చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేష్. ‘మహానటి’ చిత్రంతో తనలో అద్భుత నటి ఉందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్ జోరుగా ఉంది. ఈ విషయం గురించి కీర్తీ సురేష్ మాట్లాడుతూ –‘‘నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్లో రిస్క్ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. నేను ఓవర్నైట్ స్టార్ని కాలేదు. కానీ ఊహించనదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి ఫేమ్ వచ్చిందని మాత్రం చెప్పగలను. అలాగే ఇంత తక్కువ సమయంలో జాతీయ అవార్డు (‘మహానటి’ చిత్రానికి) సాధిస్తానని కూడా ఊహించలేదు. నేను చేసిందల్లా శక్తివంచన లేకుండా నా పాత్రలకు న్యాయం చేయడమే’’ అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కీర్తీ సురేష్. అలాగే ఇటు తెలుగు అటు తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘మిస్ ఇండియా, గుడ్లక్ సఖి, పెంగ్విన్ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. -
కెరీర్ బెస్ట్ 17వ ర్యాంకులో రోహిత్
దుబాయ్: భారత ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్కు ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకులో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్ పాయింట్ల దిగువన పడిపోయాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో ఇప్పుడు 899 పాయింట్లున్నాయి. టాప్ ర్యాంకులో ఉన్న స్టీవ్ స్మిత్ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్ అశ్విన్ టాప్–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్షిప్లో భాగమైన ఈ సిరీస్లో భారత్ తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది. అమ్మాయిల జట్టు పటిష్టంగా... ఐసీసీ మహిళల జట్ల వన్డే ర్యాంకింగ్స్లో భారత జట్టు నిలకడగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ... పాయింట్ల పరంగా పటిష్టమైంది. 122 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉండగా... 125 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టి20ల్లో కూడా కంగారూ జట్టుదే టాప్ ర్యాంకు కాగా... భారత్ ఐదో స్థానంలో ఉంది. -
పెళ్లనేది కెరీర్కి అడ్డంకి కాదు
‘‘నేను ఇప్పటివరకూ చేసినవి దాదాపు హోమ్లీ క్యారెక్టర్లే. అయితే ‘పహిల్వాన్’లో కొంచెం గ్లామరస్ రోల్ చేశా. హోమ్లీ రోల్సే కాదు.. ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ఆకాంక్షా సింగ్. నాగార్జున సరసన ‘దేవదాస్’, సుమంత్తో ‘మళ్ళీరావా’, సుదీప్తో ‘పహిల్వాన్’ చిత్రాల్లో నటించిన ఆకాంక్షా సింగ్ చెప్పిన విశేషాలు. ► ‘మళ్ళీరావా’ నుంచి ‘పహిల్వాన్’ వరకూ నా సినిమాలను ప్రేక్షకులు ఆదిరించి, సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్లో ఎక్కువమంది హైదరాబాద్వారే కావడం హ్యాపీ జైపూర్లో పుట్టి పెరిగాను. తెలుగులో ఎక్కువ కాలం పని చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారి పాత్ర చూసి ‘దేవుడా.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఇవ్వు’ అనుకున్నా. ► పెళ్లి చేసుకున్నందు వల్ల నా కెరీర్కి ఇబ్బంది అనే ఆలోచనే లేదు. ఎంతో మంది పెళ్లి అయినా హీరోలుగానే చేస్తున్నారు.. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. అలాంటప్పుడు పెళ్లి వల్ల కెరీక్కి ఇబ్బంది అని హీరోయిన్లనే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోనూ పెళ్లి అనేది కెరీర్కి అడ్డంకి కాదు. నా భర్త కునాల్ నటుడు కాదు. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా పని చేస్తున్నా. దానికి కారణం ఆయన ప్రోత్సాహమే. ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా సినిమాలో హాకీ ప్లేయర్ పాత్ర చేస్తున్నా. -
మమ్మీ నా బుక్సేవీ!
చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. మాధవ్ శింగరాజు కాబోయే భర్తతో కన్నా, చేయబోయే డిగ్రీతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడపిల్లలు. భర్తొస్తే భార్య హోదా వస్తుందని, భార్య హోదా గుర్తింపు తెస్తుందని వాళ్లకేం ఉండదు. చదువు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చని, కెరీర్ని చక్కగా తమకు ఇష్టమైనట్లు మలుచుకోవచ్చని ఉంటుంది. ఒకవేళ డిగ్రీ కంటే భర్తగారే ముందొచ్చినా, ఆ భర్తగారిని కూడా కెరీర్లో ఒక భాగంగానే చూస్తారు.. కెరీర్కి అడ్డంకి గానో, కెరీర్కి సపోర్ట్గానో. మంచి భర్త దొరకాలని ఈ జనరేషన్లో ఆడపిల్లలెవరూ ఆలయాలకు వెళ్లి రావడం లేదు. వచ్చేవాడు ఎలాంటి వాడో దేవుడికే తెలియనప్పుడు గుడికెళ్లి ప్రదక్షిణలు చేసే బదులు కెమిస్ట్రీలో, మేథ్స్లో ఏం ప్రశ్నలు వస్తాయో ఇంట్లో కూర్చుని గెస్ పేపర్ తయారు చేసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. ఊహించిన ప్రశ్నలే రాకున్నా, పూర్తిగా ఊహకు అందనివైతే రావు. భర్తగా ఎలాంటి వాడు వస్తాడో దేవుడే గెస్ చెయ్యలేనప్పుడు టెన్తో, ఇంటరో అయిన పిల్లేం గెస్ చేస్తుంది. చదువులో ఎంత ‘టెన్ బై టెన్’ గ్రేడ్ తెచ్చుకుంటే మాత్రం?! అక్క భర్తను అంతా దేవుడు అంటున్నా, ఆ భర్తలో ఎంత శాతం దేవుడున్నాడో అక్క చెప్పకపోయినా, తనకు తెలియందా! పెళ్లయి ఏళ్లవుతున్నా అక్క చెప్పులు గుమ్మం లోపలే అరగని ఆభరణాల్లా ఉండిపోయాయంటే అక్క ఆశలన్నిటినీ ఎటూ కదలనివ్వకుండా దేవుడులాంటి ఆ భర్తగారే భుజాలపై మోసుకు తిరుగుతున్నాడనే కదా. మోయడమే కనిపిస్తుంది లోకానికి. ‘‘నన్ను కిందికి దింపు ప్లీజ్.. నేనూ నడవగలను కదా’’ అని అక్క చేసే మూగ ఆక్రందనలు వినిపించవు. నడవడమే కాదు, తను పరుగెత్తగలదు, ఎగరగలదు. కాళ్లల్లో సత్తువ ఉంటుంది. రెక్కల్లో బలం ఉంటుంది. అయినా సరే.. దేవుడి లాంటి భర్త కదా.. అక్కను మోసుకునే తిరుగుతాడు! అంత మంచి భర్త పొరపాటున ఎక్కడొచ్చి పడతాడోనని భయము, బెంగ ఉండే ఆడపిల్లలు కనిపిస్తారేమో బహుశా గుళ్లలో.. ‘దేవుడి లాంటి భర్తను మాత్రం ఇవ్వకు దేవుడా’ అని వేడుకోడానికి. అమ్మ, నాన్న వినకపోతే దేవుడే కదా చెప్పుకోడానికి మిగిలేది. దేవుడి దగ్గర కూడా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ చదువు. ‘సీటొచ్చేటట్టు చెయ్ ప్లీజ్’ అని. లీస్ట్ ప్రయారిటీ భర్త. ‘ఇప్పట్లో పెళ్లి ముహూర్తాన్ని దగ్గరకు రానీయకు ప్లీజ్’ అని. చదువుకి, జీవితానికి అంత లింకు పెట్టేసుకుంటారు అమ్మాయిలు. చదువు.. వాళ్ల లవ్ ఇంట్రెస్ట్. బాలికల్ని చదివించని కాలంలో ‘మళ్లీ బాలురదే పైచేయి’ అని ఏటా రిజల్ట్స్ వచ్చేవి. బాలురు ఇప్పుడు ఏ ఫలితాల్లోనైనా మునుపటంత ధారాళంగా కనిపిస్తున్నారా? లేదు. బాలికల్ని కూడా చదివిస్తున్నాం కదా. చదువంటే తమకెంత ప్రాణమో చూపిస్తున్నారు. ప్రాణాలు గుండెల్లో ఉంటాయనుకుంటాం. ఆడపిల్లలకు పుస్తకాల్లోని పాఠాల్లో ఉంటాయి.చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. ఆ మహిమ అలా ప్రవహించి చదివే వాళ్ల ముఖాల్లోకీ వచ్చేస్తుంది. రకుల్ప్రీత్ సింగ్ ఇన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలిస్తే ఏం అనిపించదు. రకుల్ప్రీత్ సింగ్ ‘జీసస్ అండ్ మేరీ కాలేజ్’లో మేథమేటిక్స్ చదివారట అని తెలిస్తే అందులోకి గ్లామర్ వచ్చేస్తుంది! రష్మికా మండన్నా మళ్లొకసారి విజయ్ దేవరకొండతో నటిస్తున్నారని తెలిస్తే ఏం అనిపించదు. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివారని, సైకాలజీ–జర్నలిజం–ఇంగ్లిష్ లిటరేచర్లో డిగ్రీ చేశారంటే ‘ఇంట్రెస్టింగ్!’ అనిపిస్తుంది. చదువు కోసం కెరీర్లో, చేస్తున్న పెద్ద జాబ్లో బ్రేక్ తీసుకునే అమ్మాయిలు కొందరు ఉంటారు! ‘రియల్లీ గ్రేట్’ అనిపిస్తుంది. జాబ్నీ, చదువునీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఇంకా గ్రేట్గా కనిపిస్తారు. ఇక ఇంటిని, ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకునే వాళ్లైతే గ్రేట్ అనే మాట సరిపోదు. సెల్యూట్ కొట్టాలి. ఎంత పేరు, ఎంత డబ్బు, ఎన్ని ఆభరణాలు, ఎంత మంచి భర్త ఉన్నా.. వాళ్లింకా ఏదో చదువుతున్నారంటే గౌరవం వచ్చేస్తుంది వాటన్నిటికీ. దివ్యమైన వెలుగేదో ఫోకస్ అవుతుంది వాటన్నిటిపైన. హిమాదాస్ స్ప్రింటర్. అస్సాం అమ్మాయి. 2000 సంవత్సరంలో పుట్టింది. 2018లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టింది. ‘ధింగ్ ఎక్స్ప్రెస్’ అని పేరు. ధింగ్ ఆమె పుట్టిన ఊరు. వరల్డ్ యు20 ఛాంపియన్షిప్స్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి హిమాదాస్. దోహాలో ఈ సెప్టెంబరులోనో, అక్టోబరులోనో జరగబోతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం ప్రస్తుతం టర్కీలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమె అక్కడ ఉండగానే ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాసైంది. 500కి 349 మార్కులు వచ్చాయి. అస్సామీ లాంగ్వేజ్ పేపర్లో 80 శాతానికి పైగా స్కోర్ చేసింది హిమ. పరీక్షలు గత ఫిబ్రవరిలో జరిగాయి. అప్పటికే తను టర్కీలో ఉంది. పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం ట్రైనింగ్కి బ్రేక్ తీసుకుని వచ్చింది! ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే టైమ్ అంతా ప్రిపరేషన్కే అవుతుందని గౌహతి వెళ్లి అక్కడి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఎగ్జామ్కీ, ఎగ్జామ్కీ మధ్య విరామాలలో వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ప్రాక్టీస్ చేసింది. తిరిగి టర్కీ వెళ్లిపోయింది. గతేడాది కూతురు బంగారు పతకం సాధించుకొచ్చినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేరు ఆమె తల్లిదండ్రులు. ఆమె ఫస్ట్క్లాస్లో పాసైందని తెలిసినప్పట్నుంచీ ఇంటిపైన మేఘాలలోనే వాళ్ల నివాసం!ఆడపిల్లలు చదువుతో ఇంత గౌరవాన్ని, గర్వాన్ని తెచ్చిపెడతారు కదా.. ఎందుకని మనం హఠాత్తుగా ‘ఇక దిగమ్మా’ అని మధ్యలోనే చదువు నిచ్చెనని పక్కకు తీసేస్తాం?! నిచ్చెన పైనుంచి దించి, భుజాలపైకి ఎక్కించడానికి మంచి కుర్రాడుంటే చూడమని ఎందుకు వాళ్లకూ వీళ్లకూ చెప్పడం మొదలుపెడతాం? బాధ్యతను నెరవేర్చడం! బాధ్యతగా నిచ్చెన వేశాం కదా, అలాగే బాధ్యతగా భుజాల్ని వెతుకుతాం. నిచ్చెన చివరివరకు ఆడపిల్లని ఎక్కనిస్తే భుజాలను వెతికే అవసరం ఉండదన్న ఆలోచనను మన బాధ్యత మనకు రానివ్వదేమో మరి. పిల్లలు తమ చదువుని బాధ్యతగా కాక, ప్రాణంగా ఫీల్ అవుతున్నప్పుడు మన ప్రాణసమానం అయిన పిల్లల చదువుల్ని, ఆశల్ని ఎందుకు అర్ధంతరంగా ఎవరి భుజాలపైనో ఎక్కించాలని చూడడం! భుజాలపైకి ఎక్కితేనే కానీ కిచెన్లోని ఉప్పు డబ్బానో, షెల్ఫ్లోని పాల డబ్బానో అందదని ఆడపిల్లల్ని చదువు మాన్పించేస్తామా?! ∙ -
విలన్ అంటే నేనే గుర్తుకు రావాలి
తన సంతోషాన్ని మాత్రమే వెతుక్కునే గుణం, నచ్చనివారికి చెడు జరగాలనే తలంపే విలనిజంలో ప్రధానంగా ఉంటుంది. విలన్గా నటనలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ముత్యాల ముగ్గు’ సీరియల్లో నందిక క్యారెక్టర్ ద్వారా తెలుగు బుల్లితెరపై విలనిజాన్ని చూపుతుంది నవ్య. కన్నడ టీవీ సీరియల్లో రాణించి, తెలుగు సీరియల్ ద్వారా విలన్గా పరిచయమైన నవ్యారావు పంచుకున్న ముచ్చట్లు ఇవి. నా ఫ్రెండ్స్, బంధువులతో పాటు మా చెల్లెల్లు కూడా ‘ఎందుకు నెగిటివ్ రోల్స్ చేస్తావు. నిన్నందరూ బ్యాడ్ అనుకుంటారు తెలుసా’ అంటుంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల నటనలో మన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఈ విషయం పదే పదే వారికి చెప్పలేక నవ్వేసి ఊరుకుంటాను. పాజిటివ్ రోల్స్ చేయాలని నాకూ ఉంది. అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటాను. రియాలిటీ షో ఎమ్కామ్ పూర్తయ్యాక ఓ రోజు కన్నడ టీవీలో ఒక జ్యువెలరీ షో కోసం యాంకర్స్ కావాలనే ప్రకటన చూశాను. నా ఫొటోలు, వివరాలు వారికి పంపించాను. సెలక్ట్ అయ్యాను. అలా టీవీలోకి వచ్చాను. దీని తర్వాత ఒక రియాలిటీ షోకి అవకాశం వచ్చింది. ‘అండమాన్లో పట్టణ ప్రజలు ఎలా ఉంటారు’ అనే టాపిక్ మీద ఆ షో నడిచింది. అక్కడ ఎవరి తిండి వారు వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలి, ఫోన్ ఇతరత్రా సదుపాయాలేవీ ఉండవు. అలాంటి చోట పదిహేను రోజులు ఉండటం చాలా కష్టమైంది. కానీ, వర్క్ నచ్చటంతో అంత దూరమైనా లెక్క చేయలేదు. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కన్నడలో ఓ సీరియల్ చేశాను. ఆ తర్వాత తెలుగులో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్కి అవకాశం వచ్చింది. అయితే, పాజిటివ్ రోల్ కోసం ఎదురుచూస్తున్న నాకు మళ్లీ నెగిటివ్ రోలే వరించింది. ముందు కొంచెం నిరుత్సాహ పడ్డాను. తర్వాత నా రోల్ ప్రాధాన్యత తెలిసి చాలా సంతోషించాను. సరైన ఫీల్డ్ మా నాన్నగారు గణేష్ టీవీ సీరియల్ ఆర్టిస్. నేను ఈ ఫీల్డ్ రావాలని నాన్నగారు ఎప్పుడూ అనుకోలేదు. నేనూ ముందు ఆలోచించలేదు. చదువు తర్వాత లెక్చరర్గా స్థిరపడాలనేది నా ఆలోచన. అయితే, నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోవడంతో సీరియల్ ఆఫర్స్ నాకు వచ్చాయి. అమ్మ, చెల్లి ఉన్నారు. నాన్న తర్వాత ఇంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆలోచించి సీరియల్కి ఓకే చేశాను. కన్నడ సీరియల్ తర్వాత ఆరునెలల పాటు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో ఒక కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ జాబ్లో చేరాను. అక్కడకు వచ్చినవారు నన్ను కలిసి ‘మీరు ఫలానా సీరియల్లో నటించారు కదా!’ అని దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండేవారు. చాలా ఇబ్బంది అనిపించేది. పనిచేసే చోట ఇలాంటి వాతావరణం ఉండకూడదు అనుకున్నాను. ‘ఏ ఫీల్డ్లో గుర్తింపు వచ్చిందో ఆ ఫీల్డ్లోనే కొనసాగడం మంచిది’ అని ఆ తర్వాత సీరియల్ ఒప్పుకున్నాను. ముత్యాల ముగ్గు ఈ సీరియల్ తెలుగువారికి నన్ను చాలా చేరువచేసింది. హీరోయిన్ కన్నా పది రెట్ల ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న పాత్ర. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ‘నందిక’ పాత్ర ఎంతో మేలు చేసింది. నా కెరియర్లో ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ సీరియల్లో భూమి–అంబిక అక్కచెల్లెళ్లు. భూమి పల్లెటూరి అమ్మాయి, అంబిక సిటీ అమ్మాయి. భూమికి పూర్తి వ్యతిరేక పాత్ర నాది. నాకేదైనా, ఎవరైనా నచ్చారంటే వాళ్లు నాతోనే ఉండాలి. ఆ వస్తువు, ఆ మనిషి నాకే చెందాలి. అందుకోసం ఎంతదూరమైన వెళతాను. భూమి అంటే నాకు పడదు. నాకు నచ్చిన విరాట్ను తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లను విడదీసి విరాట్ను నేను సొంతం చేసుకోవాలి. ఎవరికి ఎలాంటి చెడు జరిగినా డోన్ట్ కేర్.. అన్నట్టుగా ఉంటుంది నా పాత్ర. నందికలో చాలా మధనం ఉంటుంది. బ్యాడ్ మార్క్ పడకూడదు నెగిటివ్, పాజిటివ్ .. ఏ రోల్ చేసినా ఇక్కడ మన మీద ఒక్క బ్యాడ్ మార్క్ కూడా పడకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రోల్ వేసినా క్యాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్స్టైల్ ద్వారా మెప్పించాలి. ఒకసారి ప్రాజెక్ట్కి ఓకే చేశాక మన బాధ్యత చాలా ఉంటుంది. ఇండస్ట్రీలో హార్డ్ వర్క్కే ఎక్కువ ప్రాధాన్యత. నేనెక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. క్లాసులకు వెళ్లింది లేదు. మా నాన్నగారు ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల స్వతహాగా నాకు యాక్టింగ్ వచ్చి ఉంటుంది. అలాగే, నా సీనియర్ ఆర్టిస్టుల నుంచీ నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
చేత వెన్న మనసు
చిన్నికృష్ణుని చేతిలో ఎప్పుడూ వెన్నముద్ద ఉంటుంది. అందుకే ‘చేత వెన్నముద్ద’ అనే మాటతో ఆయన వర్ణన మొదలౌతుంది. శ్రీకృష్ణుని చేతిలో ఉన్నట్లే.. పుష్ప చేతిలోనూ ఎప్పుడూ వెన్న ఉంటుంది. అయితే అది వెన్నముద్ద కాదు. వెన్న లాంటి మనసు! ఆమె పేరు పుష్ప, వయసు 31. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె ఏటా యాభై నుంచి అరవై పరీక్షలు రాస్తుంటుంది. గడచిన పన్నెండేళ్లుగా ఇదే వరుస. ఆమె ఇన్నిన్ని పరీక్షలు రాస్తున్నది తన కెరీర్ కోసం కాదు. ఇంకా పెద్ద జీతం కోసం పెద్ద కంపెనీలో ఉద్యోగం ఆశించి కూడా కాదు. పరీక్షలు రాయలేని పిల్లల కోసం రాస్తోందామె. ఇప్పటికి ఏడు వందలకు పైగా పరీక్షలు రాసింది. ఏడాదికి యాభై నుంచి అరవై అంటే నెలకు సరాసరిన నాలుగు లేదా ఐదు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షకు మూడున్నర గంటలు, పరీక్ష కేంద్రానికి ప్రయాణం చేసే టైమ్ అంతా కలుపుకుంటే ఆ రోజు ఆరేడు గంటలకు పైగానే కేటాయించాలి. పరీక్షల టైమ్ ఆఫీస్ టైమ్ ఒకే టైమ్లో ఉంటాయి. ఆమె స్వచ్ఛందంగా చేస్తున్న సేవను గుర్తించిన కంపెనీ పుష్పకు ఆ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. పరీక్ష రాయాల్సిన రోజు, పరీక్ష పూర్తయిన తర్వాత ఆఫీసుకు వెళ్లగలిగినట్లు షిఫ్ట్ మార్చుకోవడానికి అనుమతించింది. పుష్ప నిస్వార్థమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది. పరీక్షకు రానివ్వని రోజు ‘‘అప్పుడు ఏడవ తరగతిలో ఉన్నాను. క్లాసులో మిగిలిన వాళ్లంతా పరీక్షకు సిద్ధమవుతున్నారు. నన్ను మాత్రం పరీక్ష రాయడానికి వీల్లేదన్నారు. మా అమ్మానాన్న స్కూలు ఫీజు కట్టని కారణంగా నన్ను పరీక్ష రాయవద్దని చెప్పేశారు టీచర్లు. నా జీవితంలో అత్యంత దుర్దినం అది. ఆ రోజు మా పొరుగింటి వాళ్లు ఫీజు కట్టి ఆ గండాన్ని గట్టెక్కించారు. మరో నాలుగేళ్లకు పియుసిలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి. అప్పుడు ఒక పోలియో వ్యాధిగ్రస్థుడు ఆర్థిక సహాయం చేయడంతో ఆ కష్టం నుంచి బయటపడ్డాను. సమాజం నుంచి తీసుకున్నాను, సమాజానికి తిరిగి ఇవ్వాలి. నేను చేయగలిగింది చేయాలని మాత్రమే అనుకున్నానప్పుడు. ఇలా పరీక్షలు రాయాలనే నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి ఎన్జీవో నడుపుతున్న మా ఫ్రెండ్ విజువల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్కి పరీక్ష రాస్తావా అని అడగడంతో 2007లో పరీక్ష రాశాను. అప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ, విజువల్లీ చాలెంజ్డ్, ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్లకు స్క్రైబ్గా (పరీక్ష రాయలేని వాళ్లకు, వాళ్లు చెప్తుంటే పరీక్ష రాసి పెట్టడం) చేస్తున్నాను. ఎక్కువగా టెన్త్క్లాస్ వాళ్లకు స్క్రైబ్గా ఉన్నాను. చాలా ప్రశ్నలకు ఆన్సర్లు కంఠతా వచ్చేశాయి. స్టూడెంట్స్ సమాధానం చెప్పడంలో మధ్యలో తడుముకుంటున్నా సరే నాకు సమాధానం సాగిపోతుంటుంది. నిత్య విద్యార్థిని కదా మరి’’ అన్నారు పుష్ప సంతృప్తిగా నవ్వుతూ. – మంజీర -
అమ్మాయిలూ.. చలో
ప్రయాణాలు ఎదుగుదలకు తోడ్పతాయి. కెరియర్లోనే కాదు, మనిషిగా కూడా ఎదుగుతాం! ఎదిగాక చేయవలసిన ప్రయాణాలు కొన్ని ఉంటాయి. అవి ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. ఆహ్లాదం కలిగిస్తాయి. ఆదర్శవంతంగా ఉంటాయి.పెద్దపెద్ద హోదాల్లోని మహిళలు కొందరుఎప్పుడూ ప్రొఫెషనల్ ట్రిప్పుల్లో ఉంటారు. వాళ్ల ట్రిప్ స్టెయిల్లో మనకు పనికొచ్చే టిప్స్ ఇవి. ఫర్జానా హక్ (ముంబై) హెడ్, యూరప్ టెలికామ్ బిజినెస్ యూనిట్గ్లోబల్ హెడ్, స్ట్రాటెజిక్ గ్రూప్ అకౌంట్స్, టి.సి.ఎస్.టాటా గ్రూప్లో ట్రైనీగా చేరి, ఉన్నతస్థాయికి ఎదిగిన ఫర్జానా ఏడాదికి 180 నుంచి 200 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఎక్కువగా ఐరోపా దేశాలకు ప్రొఫెషనల్ ట్రిప్ కొట్టి వస్తారు. ప్రయాణ సమయంలో పుస్తకాలు చదవడం ఇష్టం. పుస్తకాల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ఫ్లయిట్లోనే నోట్ చేసుకుంటారు. ఫర్జానా దగ్గర తాతగారు కానుకగా ఇచ్చిన ఇంకు పెన్ను ఉంది. ఇప్పటికీ ఆ పెన్ను వాడుతున్నారు.అమ్మాయిలకిచ్చే సలహా : జర్నీని ఎంజాయ్ చెయ్యండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి మీ లైఫ్లో ప్రాధాన్యం ఇవ్వండి. అవనీ బియానీ (ముంబై) కాన్సెప్ట్ హెడ్, ఫుడ్హాల్ ఈ రిటైల్ ఫుడ్ చెయిన్... అసలు బియానీ ఐడియాల వల్లే నడుస్తోంది. నెలలో కొన్నిరోజులైనా ఈమె బిజినెస్ ట్రిప్ ఉంటారు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్లలో పనులు చక్కబెట్టుకొస్తుంటారు. బీచ్ లవర్. స్కీయింగ్ ఇష్టం. తెల్లవారక ముందే బయల్దేరే విమానాల ప్రయాణం బియానీకి అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని మనుషులు, కొత్త ప్రదేశాలు ఆమె నిరంతర ఉల్లాస రహస్యం. ఐప్యాడ్ లేకుండా బియానీ అడుగు బయటపెట్టరు. అమ్మాయిలకిచ్చే సలహా : కొత్త రుచులకోసమైనా ప్రయాణాలు చేసి తీరవలసిందే. ప్రియా పాల్ (కోల్కతా) చైర్ పర్సన్, ది పార్క్ హోటల్స్నెలలో కనీసం 10 నుంచి 12 రోజులో విమానాల్లో చక్కర్లు కొడుతుంటారు! నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, ప్యారిస్, లండన్లలో ఆమెకు పని ఉంటుంది. ఎక్కువగా న్యూయార్క్ వెళుతుంటారు. అక్కడి ‘నోమాడ్’ లో దిగుతారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మళ్లీ వెహికిల్స్ ఎక్కకుండా.. వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్కీ, లంచ్కీ, డిన్నర్కి, ఇంకా.. సైట్ సీయింగ్లకు నడిచే వెళ్లమని ఆమె సలహా ఇస్తారు.అమ్మాయిలకిచ్చే సలహా : మీరు ఉన్న చోటి నుంచి కొత్తగా ఎక్కడికైనా సరే నాలుగు అడుగులు వేసి రండి. గుంజన్ సోనీ (బెంగళూరు) హెడ్, జబాంగ్ అండ్ సీఎంవో, మింత్రాఫ్యాషన్ పోర్టల్ హెడ్డుగా ఏడాదికి 200 రోజులు బిజినెస్ ట్రిప్పులోనే ఉంటారు. ఢిల్లీ, హాంకాంగ్, సింగపూర్, లండన్, యు.ఎస్. ఆమె తరచూ వెళ్లే ప్రదేశాలు. మీటింగ్ ఉన్న దేశంలో లేదా సిటీలో ఇరవై నాలుగు గంటల ముందే సోనీ సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు గుర్తుపెట్టుకుని మరీ గిఫ్టులు కొంటారు.అమ్మాయిలకిచ్చే సలహా : తప్పనిసరిగా ప్రయాణాలు చెయ్యాలి. అందువల్ల మన ప్రపంచం విస్తృతమౌతుంది. విష్పలరెడ్డి (న్యూఢిల్లీ) చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, ఊబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియాఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కోలకు ట్రావెల్ చేస్తుంటారు. కొండప్రాంతపు బీచ్లను ఇష్టపడతారు. వెళ్లిన చోట పని పూర్తి కాగానే తప్పనిసరిగా అక్కడి ఫ్రెండ్స్ని కలుస్తారు. లండన్ వెళ్లినప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్ సమీపంలోని గోరింగ్ హోటల్లో స్టే చేస్తారు. ఒంటరిగా ప్రయాణం చేయడం ఇష్టం. ఏకాంతం లభిస్తుందట. అమ్మాయిలకిచ్చే సలహా : ఒంటరిగా ప్రయాణించడంలోని స్వేచ్ఛను అనుభూతి చెందండి. అవనీ దావ్దా (ముంబై) మేనేజింగ్ డైరెక్టర్, గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ఏడాదిలో 40 రోజులు టూర్లోనే ఉంటారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ, దుబాయ్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు తిరుగుతుంటారు. ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుండే కంపెనీకి ఎం.డీ. అయిన దావ్దాకు లండన్ వెళ్లినప్పుడు సెయింట్ జేమ్స్ కోర్ట్లో లంచ్గానీ, డిన్నర్ గానీ చేయడం ఇష్టం. మాయిశ్చరైజర్, సౌకర్యవంతంగా ఉండే కాలిజోళ్లను దగ్గర ఉంచుకోవడం మర్చిపోరు. టూర్లో రూమ్ సర్వీస్ని అస్సలు ఉపయోగించుకోరు. బయటికి వెళ్లే తిని వస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : ప్రయాణాలు మీ జీవితానికి సహజసిద్ధమైన పౌష్టికాహారాన్ని అందిస్తాయి. అపూర్వ పురోహిత్ (ముంబై) ప్రెసిడెంట్, జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్మీడియా పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అపూర్వ ప్రింట్, రేడియో, డిజిటల్ కంటెంట్ కోసం గత ఐదేళ్లలో దాదాపుగా ప్రతి వారం విదేశీయానంలోనే ఉన్నారు! యు.కె. సింగపూర్, హాంకాంగ్, న్యూఢిల్లీ బెంగళూరు.. ప్రధానంగా ఆమె ప్రయాణ ప్రదేశాలు. ఎప్పుడూ తను వాడే షాంపూ, కండిషన్ కూడా ఆమె బ్యాగ్లో ఉంటాయి. అమ్మాయిలకిచ్చే సలహా : కెరీర్, కుటుంబం.. ఈ రెండింటి లోనూ సక్సెస్ సాధించాలి. రాధా కపూర్ (ముంబై) ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐ.ఎస్.డి.ఐ.ఐ.ఎస్.డి.ఐ. అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్. ఇక చెప్పేదేముందీ డిజైనింగ్ ఒక సృజనాత్మక అన్వేషణ. ప్రపంచమంతా తిరుగుతారు రాధ. ముఖ్యంగా ప్యారిస్, న్యూయార్క్ మీటింగులకు. ఫ్లయిట్ దిగాక పనుల్లో బిజీ అయిపోతారు కానీ, ఫ్లయిట్లో ఉన్నప్పుడు ఏమీ తినరు. ఫ్లయిట్ దిగాక పనులు అయ్యాక కానీ తన సొంత పనులు చూసుకోరు. యోగాకి మాత్రం టైమ్ అడ్జెస్ట్ చేసుకుంటారు. అమ్మాయిలకిచ్చే సలహా : ఎక్కువ తినకండి. స్లిమ్గా ఉండండి. ప్రయాణాలు చేస్తూ ఉండండి. ఉపాసన టాకు (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, మొబీక్విక్ ఈ మొబైల్ పేమెంట్ కంపెనీ సారథి నెలలో కనీసం రెండుసార్లు జర్నీ చేస్తారు. కొన్నిసార్లు తన రెండేళ్ల బిడ్డను కూడా వెంట తీసుకెళతారు. తరచూ సింగపూర్, యు.కె., యు.ఎస్. వెళ్లొస్తుంటారు. ఆమె హ్యాండ్బ్యాగ్లో ఏ సమయంలోనైనా దువ్వెన, చార్జర్, ఎలర్జీ మందులు ఉంటాయి. వెళ్లిన చోట వీలుని బట్టి స్నార్కెలింగ్, హైకింగ్, సైక్లింగ్ చేస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : మీ సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా టూర్ల కోసం తీసిపెట్టుకోండి. డాక్టర్ హర్ష బిజ్లానీ (ముంబై) మెడికల్ హెడ్, ది ఏజ్లెస్ క్లినిక్ అండ్ సెలబ్రిటీ స్కిన్ ఎక్స్పర్ట్ప్రయాణాలు చేయడమే కాదు, ప్రయాణించి వచ్చిన వారికి స్కిన్ మళ్లీ ‘గ్లో’అవడానికి సలహాలు ఇస్తుంటారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ నీళ్లు తాగుతుండాలని, క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. లాస్ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్, సింగపూర్.. ఇలా అనేక దేశాల్లో కాన్ఫరెన్స్లకు వెళ్లొస్తుంటారు బిజ్లానీ. ఏడాదిలో 30 నుంచి 45 రోజులు ఆమెకు టూర్లు ఉంటాయి. వెళ్లినచోట కొత్త కొత్త రెస్టారెంట్లను కనిపెట్టడం, జిమ్కు వెళ్లడం ఆమె అలవాటు. అమ్మాయిలకిచ్చే సలహా : నిరంతరం ప్రయాణిస్తూ ఉండండి. ప్రపంచాన్ని శోధించండి. తెలుసుకునే ఆసక్తి ఉంటే తెలియని వాటి గురించి భయమే ఉండదు.ఇన్పుట్స్: సిఎన్ ట్రావెలర్ రాధికా ఘాయ్ (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, చీఫ్ బిజినెస్ స్టాఫ్, షాప్క్లూస్.కామ్ ఏడాదికి 120 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఈ వ్యవధిలో ఆకాశంలో ఆమె ప్రయాణించే దూరం 6 లక్షల 70 వేల మైళ్లు. సింగపూర్ ఆమెకు ఇష్టమైన డెస్టినేషన్. వెస్టిన్లో ఓ కప్పు కాఫీ తాగి, మీటింగ్స్ని ముగించుకుని మెరీనా బే శాండ్స్లో షాపింగ్ చేసి, డెంప్సీహిల్లోని ఏ రెస్టారెంట్లోనైనా లంచ్, డిన్నర్ చేయడం.. సింగపూర్లో ఆమెకు ప్రియమైన వ్యాపకాలు. పెద్దగా లగేజ్ తీసుకెళ్లరు. ఓ చిన్న సూట్కేస్లో అన్నీ సర్దేసుకుంటారు. స్నీకర్స్ (తేలికపాటి షూజ్) తప్పనిసరి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకం చదువుతూ, కునుకుతీస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : విహరించండి, విందులు ఆరగించండి. -
పైలెట్స్కు బంగారు భవిష్యత్తు
-
మార్పుల దిశగా..యూజీసీ నెట్!
అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించాలనుందా! జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్తో పరిశోధనల వైపు అడుగులు వేయాలనుందా! ఈ రెండిటిలో మీ మార్గం ఏదైనా యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి నెట్ సిలబస్ సమూలంగా మారనుంది. నెట్ పరిధిలోని అన్ని సబ్జెక్టుల సిలబస్ను మార్చి.. నూతన సిలబస్ను తీసుకొచ్చే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నెట్లో జరగనున్న మార్పులపై విశ్లేషణ.. యూజీసీ వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ దిశగా నూతన సిలబస్ రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సబ్జెక్టు నిపుణుల పేర్లను సిఫారసు చేయాలని యూనివర్సిటీలను కోరింది. ఇప్పటికే దేశంలోని చాలా యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు.. సిలబస్, కరిక్యులంలో మార్పులు చేశాయి. ప్రస్తుతం తాజా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాదాపు అన్ని కోర్సుల సిలబస్లోనూ కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. దీంతో యూజీసీ సైతం నెట్ సిలబస్ను తాజా అకడమిక్ సిలబస్కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించి, మార్పులకు శ్రీకారం చుట్టింది. 25 కమిటీల ఏర్పాటు ప్రస్తుతం నెట్ను 100 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుండగా... ఇప్పటికే 25 సబ్జెక్టుల సిలబస్లో మార్పులను సూచించేందుకు ఆయా సబ్జెక్టుల నిపుణులతో 25 కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి ప్రస్తుతం అకడమిక్గా అమలవుతున్న సిలబస్ను అధ్యయనం చేసి.. చేయాల్సిన మార్పులను సిఫారసు చేస్తాయి. మిగిలిన సబ్జెక్టుల సిలబస్ రివ్యూ కమిటీల ఏర్పాటును మరో నెల లోపు పూర్తిచేయనున్నట్లు సమాచారం. వృత్తి విద్యలో భారీ మార్పులు! వృత్తి విద్యా కోర్సుల సిలబస్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ పేపర్ల సిలబస్లో ఎక్కువ మార్పులు జరిగే అవకాశముంది. ఏడాదికి ఒకసారే! నెట్ నిర్వహణలోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యూజీసీ ప్రస్తుతం ఏటా రెండుసార్లు నెట్ నిర్వహిస్తోంది. అయితే, ఇక నుంచి ఏడాదికి ఒకసారే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సెషన్కు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మాత్రం లక్ష నుంచి లక్షా పదివేల మధ్యే ఉంటోంది. దీంతో రెండుసార్లు నిర్వహించడం అనవసరమనే అభిప్రాయానికి యూజీసీ వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా ఈ విధానం 2019 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఎన్టీఏ ద్వారా నిర్వహణ ప్రస్తుతం నెట్ నిర్వహణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చేపడుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ బాధ్యతను నూతనంగా ఏర్పాటుచేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో సింగిల్ టెస్టింగ్ విండో తరహాలో తెరపైకొచ్చిన ఎన్టీఏ.. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది. తొలి ఆరుశాతంతోనే మెరిట్ ఇప్పటికే యూజీసీ రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో (అన్ని వర్గాల నుంచి) మొదటి ఆరు శాతానికి సమానమైన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఉదాహరణకు లక్ష మంది పరీక్షకు హాజరైతే వారిలో తొలి ఆరు శాతం (అంటే ఆరువేల మంది) మందిని నెట్ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. వీరికే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్నకు అర్హత లభిస్తుంది. ఇలా తొలి ఆరు శాతంలో నిలిచిన అభ్యర్థులనే ఉత్తీర్ణులుగా ప్రకటించాలనే నిర్ణయాన్ని విద్యావేత్తలు సైతం హర్షిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని యాజీసీ 2017, నవంబర్ సెషన్ నుంచి అమల్లోకి తెచ్చింది. తొలి ఆరు శాతంతో రూపొందిన మెరిట్ జాబితాలోని వారికి రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయనుంది. ఇప్పటì వరకు సబ్జెక్టు వారీగా, అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా టాప్–15 శాతంలో నిలిచిన వారితో జాబితా రూపొందించి, వారిని అర్హులుగా ప్రకటిస్తూ వచ్చింది. జేఆర్ఎఫ్ ప్రక్రియ యథాతథం నెట్ అర్హతతో మొదటగా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అర్హత లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియలో మార్పులు చేస్తున్నప్పటికీ.. తర్వాత దశలో ఎంపిక చేసే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హుల ఎంపిక విధానం మాత్రం ప్రస్తుత తరహాలోనే కొనసాగుతుంది. ముఖ్య సమాచారం ♦ మొత్తం అన్ని పేపర్లలోనూ సిలబస్ మార్పులకు శ్రీకారం. ♦ ఇప్పటికే 25 సబ్జెక్టు కమిటీల ఏర్పాటు. ♦ వృత్తి విద్యా సబ్జెక్టుల్లో అధికంగా మార్పులు జరిగే అవకాశం. ♦ 2018 నుంచి ఏటా ఒక సారే నెట్ నిర్వహించే అవకాశం. యూజీసీ నెట్ పరీక్ష విధానం యూజీసీ నెట్ను మూడు పేపర్లలో నిర్వహిస్తారు. వివరాలు.. పేపర్–1 అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకూ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్–2, 3లు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల ఆధారంగా ఉంటాయి. వీటిలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్) అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే షార్ట్లిస్ట్ జాబితా రూపకల్పన ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. ఆహ్వానించదగ్గ పరిణామం యూజీసీ నెట్ సిలబస్లో మార్పులు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల తాజా పరిస్థితులకు అనుగుణంగా బోధన, పరిశోధనా నైపుణ్యాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. ఇటీవల అభ్యర్థులు సైతం అకడమిక్గా కొత్త అంశాలను నేర్చుకుంటున్నారు. వాటిలో తమకున్న సామర్థ్యాన్ని బహిర్గతం చేసే అవకాశం కలుగుతుంది. – డాక్టర్ డి.ఎన్.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు, డైరెక్టర్ డాక్టర్ సీఆర్రావు ఏఐఎంఎస్సీఎస్. -
డీప్.. డీప్.. డిప్రెషన్
ఒత్తిడికి చిత్తవుతున్న యువతరం చదువు, కెరీర్, ప్రేమ వైఫల్యాలు, సోషల్ మీడియానే కారణం ఒంటరితనం.. ప్రతికూల ఆలోచనలతో తీవ్ర ఒత్తిడిలోకి.. నిస్పృహలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొందరు ‘కాస్మోస్’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో సర్వే బాధితుల్లో 18–25 ఏళ్ల మధ్య వయసు వారు.. 64% 25–44 ఏళ్ల వయసు వారు 50% సాక్షి, హైదరాబాద్ : ‘‘సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. బౌండరీలు దాటే మనస్సు మాదీ..’’అని పాడు కోవాల్సిన యువతరం ఇప్పుడు తీవ్ర ఒత్తిడితో చిత్తవుతోందట. మార్కులు, ర్యాంకులు.. కెరీర్, ఉద్యోగం.. టీనేజ్ లవ్, వైఫల్యాలు ఇలా సవాలక్ష సవాళ్లతో సతమతమవుతోందట. ఏకా గ్రత కోల్పోయి.. ఏ పనిమీదా మనసు లగ్నం చేయలేక.. ఒంటరితనం.. నెగెటివ్ ఆలోచనలు చుట్టుముట్టి డిప్రెషన్కు లోనవుతోందట. ఒత్తిడి శ్రుతిమించితే కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్యకు సైతం పాల్పడటం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ మానసిక వైద్యశాల ‘కాస్మోస్’దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో యువత ఒత్తిడితో కుంగిపోతున్నట్లు వెల్ల డైంది. ఈ జాబితాలో మన నగరానికి చెందిన సుమారు 20 కళాశాలలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడుపుతున్న కుర్రకారు ఆత్మీయ సంబంధాలు, స్నేహితులతో ఆటపాటలకు దూరమవుతూ ఒత్తిడి అనే ఉపద్రవంలో చిక్కుకుంటోందని మాన సిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా 18–25 ఏళ్ల మధ్యనున్న యువతరంలో ఏకంగా 64 శాతం మంది ఇలాంటి పరిస్థితితో బాధపడుతుండటంతో ఆందోళన కలిగిస్తోందంట ున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కళాశాలలో సీటు సాధించడం మొదలుకుని మార్కులు, ర్యాంక్లు తెచ్చుకోవడం.. అత్యుత్తమ కెరీర్ ఎంచుకోవడం.. క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగం సాధించడం.. ఆ మధ్యలో టీనేజ్ లవ్లు.. ప్రేమ వైఫల్యాల వంటి సవాళ్లు యువతరాన్ని చుట్టుముడుతున్నాయని పేర్కొంటున్నారు. యువతలో ఒత్తిడికి కారణాలివే.. సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడం. మార్కుల రేస్లో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం. తెలిసీతెలియని వయసులో డ్రగ్స్, తాగుడు, పోర్న్ సైట్స్ వంటివాటికి అలవాటుపడటం. టీనేజ్లో ఆకర్షణకు లోనుకావడం. వన్సైడ్ లవ్. మంచి కళాశాలలో సీటు సాధించలేకపోవడం. కెరీర్పరంగా ఒడిదుడుకులు. చదువును నిర్లక్ష్యం చేయడం. చదువుకు అనుగుణంగా ఉద్యోగం దొరక్కపోవడం. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంట్లో వారి నుంచి సరైన మార్గదర్శనం లభిం చకపోవడం. 25–44 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇలా.. ఇక 25–44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగానికి సంబంధించి అధిక పని ఒత్తిడి, కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవడం, దాంపత్య సమస్యలు, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవ్వడం వంటి కారణాలతో సుమారు 50 శాతం మంది ఒత్తిడితో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ఇలా చేస్తే ఒత్తిడిమాయం.. సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదు. చదువు, మార్కులు, ర్యాంకులు, కెరీర్ ఎంచుకునే విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. యువతరంతో తల్లిదండ్రులు, టీచర్లు స్నేహితుల్లా మెలిగి.. వారు ఎదుర్కొంటున్న మాన సిక సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలి. దురలవాట్లు, డ్రగ్స్కు దూరంగా ఉండటం. చెడు స్నేహాలను వదిలేయడం. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. ఎంచుకున్న రంగం, కెరీర్లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి విజయగాథలను తెలుసుకోవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి. వివిధ రకాల ఆకర్షణలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగా, నడక, మార్షల్ ఆర్ట్స్, ధ్యానం వంటిలో ఏదో ఒకదానికి నిర్ణీత సమయం కేటాయించాలి. మానసిక విశ్రాంతికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, గార్డెనిం గ్ వంటి కార్యకలాపాలతో బిజీగా ఉండాలి. ఇష్టమైన పుస్తకాలు చదవాలి. నలుగురితో సరదాగా మాట్లాడటం, నవ్వడం, నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, నిద్రపో వడం వంటి సూత్రాలను విధిగా పాటించాలి. – డాక్టర్ అనిత, సైకియాట్రిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, రిమ్స్ -
క్రీడలను కూడా కెరీర్గా..: ప్రధాని మోదీ
కినలూర్ (కేరళ): కొంతకాలంగా భారత్లో క్రీడాముఖ చిత్రం మారుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మైదానాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో పాటు చాలామంది క్రీడలను ఫుల్ టైమ్ కెరీర్గా మలుచుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు చెందిన స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్లో ప్రపంచ స్థాయి సింథటిక్ ట్రాక్ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ‘ఇంతకుముందు క్రీడలను కెరీర్గా తీసుకునే వాతావరణ దేశంలో ఉండేది కాదు. అయితే ఇప్పుడా అభిప్రాయం మారుతోంది. ప్రతిభావంతులకు సరైన సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రిటర్న్స్ రామ్గారూ.. నేను బి.టెక్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలనీలో ఒకతను అయిదు నెలలుగా నన్ను ఫాలో అవుతున్నాడు. నేను కాలేజ్కి వెళ్లేటప్పుడు నా వెనకే వస్తాడు. అతను నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడో ఇప్పటికీ అర్థం కాలేదు. అతనిది లవ్వా? ఆకర్షణా? తెలియదు. నాతో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాడు. కాని నాకు భయం వేసి మాట్లాడకుండా వెళ్లిపోయాను. అతని వల్ల నా చదువు దెబ్బతింటోంది. నాకు నా కెరీర్ ముఖ్యం. ఒక వేళ అతను నన్ను లవ్ చేస్తున్నట్లయితే నేను రిజెక్ట్ చేస్తే అతని కెరీర్ నా వల్ల పాడవుతుందని భయం వేస్తోంది. మీరే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారని ఎదురుచూస్తున్నాను. – ఆనందిత, ఇ–మెయిల్ పొల్యూషన్ అమ్మా... పొల్యూషన్.... ఎక్కడ చూసినా పొల్యూషనే... వీధులంతా పొల్యూషనే... ఎక్కడబోతే అక్కడ పొల్యూషన్ ఫాలో అవుతోంది. ఏం చేయమంటావు చెప్పు. మురికి గుంట పక్క నుంచి వెళ్తుంటే ముక్కు మూసుకుంటాం. షేర్ ఆటోలో హోరెత్తించే పాటలు వినబడుతుంటే చెవులు మూసుకుంటాం. పొగలు కక్కుతున్న లారీ వస్తుంటే కళ్లూ, ముక్కు రెండూ మూసుకుంటాం. ఇన్ని పొల్యూషన్లకీ రియాక్షన్గా ఇంద్రియాలను మూసుకుంటున్నాం కదా! నిలువెత్తు పొల్యూషన్ నీ వెనకే వస్తుంటే హృదయం మూసుకోవడం మంచిది! ఏమంటావు... ఆ జింగిరీ కెరీర్ ఏమవుతుందో అని టెన్షన్ పడి నీ కెరీర్ని జింగిరీ చేసుకోవడం ఊ... హు... నాట్ ఓకే. మంచితనం అన్నిచోట్లా ప్రదర్శించవద్దు.... జీవితంలో దెబ్బతింటావు. నువ్వు బంగారంరా... నీకు ఇష్టం లేకపోయినా ఇంకొకరు తప్పు చేస్తున్నా నువ్వు చూపిస్తున్న బాధ్యత చాలా గొప్పది. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయునది నా బంగారుకొండ ఆనందిత... కాని నిన్ను ఫాలో అయ్యేవాళ్ళని పట్టించుకునే బదులు, నువ్వు ఫాలో అవ్వాలనుకున్న కెరియర్ని పట్టించుకుంటే సంతోషంగా ఉంటావు. పిచ్చితల్లీ... అర్థం చేసుకోరా...! ‘నీలాంబరీ... ఆన్సర్ రాసి అలసిపోయాను. ఒక జింగిరి ఇవ్వు’... అన్నాను. ‘అంతగా అనాలనిపిస్తే నన్ను అనండి. అంతేకాని నా అరటిపండును జింగరీ అనకండి’ అని విసవిసా వెళ్లిపోయింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
కెరీర్ కోర్సులకు బోధకులు కావాలి
నగర పాలక పాఠశాలల్లో పోస్టులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కేరీర్ ఫౌండేషన్ కోర్సులను బోధించేందుకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కమిషనర్ పి.అరుణ్బాబు సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ బోధించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో పీరియడ్కు రూ.250 గౌరవ వేతనమని తెలిపారు. బీఎస్సి, బీఈడీ, ఎంఎస్సీ, బీటెక్ అర్హత కల్గినవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నగరపాలక సంస్థ ఉప విద్యాశాఖ అధికారి 98665 14224, జిల్లా కన్వీనర్ 81421 16699 లేదా దగ్గర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదించాలని సూచించారు. -
మిస్ క్వీన్...
సాక్షి, సిటీబ్యూరో: నగరం వేదికగా మరో అందాల పోటీకి తెరలేచింది. ‘మిస్ క్వీన్ హైదరాబాద్’ పేరుతో ఈ పోటీ నిర్వహించనున్నట్టు సోమవారం నిర్వాహకులు ప్రకటించారు. అర్హతలు, నిబంధనలను అనుసరించి నగరానికి చెందిన యువతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చునని తెలిపారు. సినిమా, మోడలింగ్ తదితర గ్లామర్ సంబంధిత రంగాల్లో రాణించే ఆసక్తి ఉన్న వారికి ఈ పోటీల అనంతరం మంచి కెరీర్ ఉంటుందన్నారు. ఇప్పటికే పోటీలకు ప్రాథమిక అర్హత సాధించిన యువతులు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. -
ఇటు వంట... అటు ఉత్కంఠ!
ఎప్పుడూ షూటింగులేనా? ఖాళీ సమయాల్లో ఇంటి పనులేమైనా చేస్తారా? అసలు మీకు వంట చేయడం వచ్చా? అని త్రిషను అడిగితే.. ‘తినడం మాత్రం బాగా వచ్చు’ అని కూల్గా అంటారు. ‘‘మా ఇంట్లో కిచెన్ చూసి చాలా రోజులైంది. ఇక, గరిటె తిప్పే టైమ్ ఎక్కడుంది?’’ అని కూడా అంటున్నారు. కథానాయికగా దాదాపు పదమూడేళ్ల నుంచి వరుస సినిమాలతో త్రిష ఎప్పుడూ బిజీగానే గడిపారు. ఇప్పుడామెకు వంట చేసే అవకాశం లభించింది. అంటే.. అంత ఖాళీగా ఉన్నారా? అనుకోవద్దు. ఎందుకంటే.. వంట చేసేది ఇంట్లో కాదు, షూటింగులో. ప్రస్తుతం మాదేశ్ దర్శకత్వంలో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’. ఈ చిత్రంలో చెఫ్గా నటిస్తున్నారామె. కెరీర్లో ఫస్ట్ టైమ్ ఈ పాత్రలో కనిపించనున్నారామె. పాత్రలో పర్ఫెక్షన్ కోసం షూటింగ్ ప్రారంభించడానికి ముందు చెఫ్స్ నుంచి సలహాలు తీసుకున్నారట. వంటతో పాటు ప్రేక్షకులను ఆమె ఉత్కంఠకూ గురి చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్లో దెయ్యంగానూ కనిపించనున్నారు. -
ఆడపిల్లకు ‘సేఫ్ జోన్’ లేదు
ధీర దత్ పదేళ్లప్పుడు తనతో తను యుద్ధం. పీజీలో ప్రేమలోంచి బయట పడేందుకు యుద్ధం. జర్నలిస్ట్గా అవినీతి, అక్రమాలతో యుద్ధం. వ్యక్తిగతంగా విసుర్లు, విమర్శలతో యుద్ధం. ప్రస్తుతం ఆర్ణబ్ గోస్వామితో మాటల యుద్ధం! వార్ కరస్పాండెంట్ బర్ఖాదత్.. ఎప్పుడూ... ఏదో ఒక వార్ జోన్లో ఉంటూనే ఉంటారు. ఆ మాటే అని చూడండి... ‘అసలు వార్ జోన్లో లేని ఆడపిల్ల ఎవరో చెప్పండి’ అని అడుగుతారు బర్ఖా. బర్ఖాదత్.. ధీర వనిత! ధీర దత్!! ఆడపిల్లకు అమ్మ ఒడి తప్ప ప్రపంచంలో వేరే ‘సేఫ్ జోన్’ లేదు. ఒడిలో ఉన్నంత వరకే అభయం. ఒడి దిగితే అరణ్యం. ఇల్లు, కాలేజ్, కెరియర్... చెడు చూపు ఏ వైపు నుంచి మెల్లిగా చెట్టు దిగి వస్తుందో చెప్పలేం. ఏ పుట్టలోంచి చల్లగా పాక్కుంటూ వస్తుందో కనిపెట్టలేం. ఏ పాతాళంలోంచి పువ్వులా పరిమళమై విరుస్తుందో, ఏ గగనంలోంచి నవ్వులా పరవశమై కురుస్తుందో అస్సలు ఊహించలేం. ప్రభాదత్కి ఇలాంటి భయాలేం లేవు. పిల్లని ఒడిలోంచి తోసేసింది! చెట్టు పుట్టా ఎక్కడం నేర్చుకో. కొండల్నీ గుట్టల్నీ తొలుచుకుంటూ వెళ్లిపో. నింగిలోకి విహంగమై ఎగిరిపో. ఎక్కడా.. నిలవకు, తడవకు, జడవకు. ఇదీ ఆ ఇంట్లో ఫస్ట్ చైల్డ్కి ఫస్ట్ లెసన్. ప్రభాదత్ జర్నలిస్ట్. బర్ఖాదత్ కూడా జర్నలిస్టే అయింది. తండ్రిలా ఆమె ఎయిర్ ఫోర్స్ని ఎంచుకోలేదు. అన్ని ఫోర్సులను రాత్రీపగలు మునివేళ్లపై నిలిపి ఉంచే మీడియా ఫోర్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మీడియాలోనే.. ఒక శక్తిమంతమైన క్షిపణి.. బర్ఘాదత్. ఆ క్షిపణి ఇప్పుడు.. సాటి జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామిపై నిప్పులు కురిపిస్తూ విరుచుకు పడడం దాదాపుగా ఒక యుద్ధవార్తే అయింది. ‘గ్రౌండ్ జీరో’ జర్నలిస్ట్! కేట్ ఆడీ, లిండ్సే హిల్సమ్, అలెక్స్ క్రాఫోర్డ్, ఆర్లా గ్యూరిన్, జీనా కోడర్, మార్తా గెల్హార్న్, బర్ఖాదత్... అంతా ఒకే బెంచ్ స్టూడెంట్స్. ఒకే కాలంలో కాకపోవచ్చు. యుద్ధ కాలాల్లో.. ‘గ్రౌండ్ జీరో’ (విస్ఫోటస్థలి) లోకి వెళ్లి పోయి అక్కడి నుంచి వార్తల్ని ప్రత్యక్షంగా అందించిన మహిళా జర్నలిస్టులు. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ దేశాల మధ్యలోకి వెళ్లి యుద్ధాన్ని కవర్ చెయ్యడానికి గట్స్తో పని లేదు. జర్నలిజం మీద భక్తి ఉంటే చాలు. భక్తితో పాటు బర్ఖాకు జర్నలిజంపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. వాటిని శంకిస్తే మాత్రం ఆమె అపరకాళే అవుతుంది. అయింది. ప్రో-పాకిస్థానీ పావురం?! ఆర్ణబ్ గోస్వామి సంగతి తెలిసిందే. ‘టైమ్స్ నౌ’ న్యూస్ రూమ్లో రంకెలేస్తూ, డిబేట్ కి వచ్చినవాళ్ల పీక నొక్కేస్తుంటాడు. అరవడం ఆయన యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్). జూలై 8న కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బర్హన్ వాని ఎన్కౌంటర్ జరిగిన తర్వాత టీవీలన్నీ ఎన్కౌంటర్పై డిబేట్ పెట్టాయి. ఆర్ణబ్ తన డిబేట్లో జర్నలిస్టుల్ని ఉతికేశారు. భారతదేశంలో ఉంటున్న ప్రో-పాకిస్థానీ జర్నలిస్టు పావురాల్ని జైల్లో పడేసి రెక్కలు కత్తిరించేయాలి అనేశారాయన! ఆ మాట ఎన్డీటీవీలో పనిచేస్తున్న బర్ఖాదత్కు తగిలింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్ణబ్ పని చేస్తున్న ఫీల్డులోనే తను పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా మాటల వార్ నడుస్తోంది. ‘‘న్యూస్ రూమ్లో కూర్చొని చెత్తను పోగేసుకునే నీలాంటి వ్యక్తికి జనం మధ్య తిరిగి వాస్తవాలను చూస్తుండే జర్నలిస్టులను అనే అర్హత లేదు’’ అని ఆర్ణబ్పై విరుచుకుపడ్డారు బర్ఖాదత్. బర్హన్ ఎన్కౌంటర్ విషయంలో బర్ఖా మన సైనికుల్ని తప్పుపట్టే విధంగా మాట్లాడారన్నది ఆర్ణబ్ ఆరోపణ. పోరాటమే ఊపిరి రాజకీయ నాయకులతో యుద్ధం. అధికార యంత్రాంగంతో యుద్ధం. అవినీతి, అక్రమాలపై యుద్ధం. అప్పుడప్పుడు ఆర్ణబ్లాంటి వాళ్లతో యుద్ధం. ఆ యుద్ధంలో ఆమె గెలిచారా లేదా అన్నది కాదు, పోరాడారా లేదా అన్నదే ముఖ్యం. బర్ఖా పోరాట యోధురాలు. ఆమె దేశభక్తిపై అనుమానాలు రేకెత్తించడానికి, ఆమె శీల ప్రతిష్టను భంగపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు బర్ఖా. రెండేళ్ల క్రితం ఆమెపై ఒక రూమర్ వచ్చింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, వాళ్లిద్దరూ కశ్మీర్ ముస్లింలని! బర్ఖా వాటిని పట్టించుకోలేదు. తనతో తను తొలి యుద్ధం! పట్టించుకోకుండా ఉండడానికి కూడా ఒకోసారి పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వస్తుంది! ప్రత్యర్థులను, విరోధులను, పనిలేనివాళ్లను తన మాటలతో, తన నిర్లక్ష్యంతో, తన పరిణతితో తేలిగ్గా మట్టి కరిపించగల బర్ఖా.. బాల్యంలో ఒక్క విషయంలో మాత్రం తనతో తనే తలపడలేకపోయారు! అప్పుడు తనకు పదేళ్లు. పదేళ్లు కూడా ఉన్నాయో లేవో. ఆ సంఘటన మాత్రం బర్ఖాకు బాగా గుర్తుంది. అత్తయ్యలు, మామయ్యలు; పిన్నమ్మలు, బాబాయిలు; బంధువులు, స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు... పంజాబీ ఇళ్లల్లో సందడికి కొదవేముంది? ఆ బంధువుల్లో.. ఓ ‘మంచి మామయ్య’ బర్ఖాను ఒకరోజు ఆడుకుందాం రమ్మని తన గదికి తీసుకెళ్లి మీద చెయ్యి వేశాడు. బ్యాడ్ టచ్కీ, గుడ్ టచ్కీ తేడా తెలియని వయసు. కానీ ఆ టచ్లో అసహజత్వం ఉందని మాత్రం బర్ఖాకు అర్థమవుతోంది. మంచి మామయ్య ఏదో డర్టీ పని చేస్తున్నాడు. భయపడిపోయింది. అక్కడి నుంచి పరుగెత్తింది. ఆ తర్వాత ఆ మంచి మామయ్య దగ్గరికి వెళ్లలేదు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. అలాగని ఆ ‘డర్టీ’ నుంచి తనూ బయటికి రాలేదు. తనేదో తప్పు చేసిన ఫీలింగ్! కొన్నేళ్ల పాటు ఆ ఫీలింగ్ బర్ఖాను వెంటాడింది. ఎంతవరకు అంటే... ఇంకో డర్టీ ఫెలో ఆమె జీవితంలోకి ప్రవేశించేంత వరకు. కాలేజ్లో... ప్రేమ వయెలెన్స్ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో మూస్ కమ్యూనికేషన్ పీజీ కోర్సులో చేరింది బర్ఖా. అప్పటికామె పరిపూర్ణమైన స్త్రీ. తన జీవితం ఎలా ఉండాలన్న దానిపై ఆమెకు స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒక్కమాటలో... లోకం తెలిసిన పిల్ల. అప్పుడొచ్చాడు కో-స్టూడెంట్ ఒకడు. వచ్చి, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అన్నాడు. అంత లోకాన్ని చూసిన పిల్ల, అన్ని పుస్తకాలను చదివిన పిల్ల.. అతడి ప్రేమలో పడిపోయింది! తర్వాత అతడు బర్ఖాను సాధించడం మొదలు పెట్టాడు. ఓరోజు చెంప పగలగొట్టాడు. చెయ్యి మెలితిప్పాడు. కిందపడేసి, తలను నేలకేసి కొట్టాడు! ఇదంతా కాలేజ్లోనే. కాలేజ్లో డొమెస్టిక్ వయలెన్స్! ఎలాగో అతడిని వదిలించుకుంది. పీజీ అయ్యాక ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి వెళితే.. అక్కడికి అతడు కూడా వచ్చాడు! కెమెరామెన్గా అప్లై చేశాడని తెలిసింది బర్ఖాకు. ‘అతడికి ఉద్యోగం ఇచ్చేపనైతే.. నేనిక్కడ ఉద్యోగం చెయ్యాల్సిన పని లేదు’ అని గట్టిగా చెప్పేసింది బర్ఖా. ఆమె కోసం అతడిని వద్దనుకుంది ఎన్డీటీవీ. ప్రతి ఆడపిల్లా ఒక యోధురాలు ఆడపిల్ల జీవితమే ఒక యుద్ధం అంటారు బర్ఖాదత్. ఆమె ఉద్దేశం.. పరిస్థితులు స్త్రీని యుద్ధ సైనికురాలిగా మార్చేస్తాయని. దేశాలకు యుద్ధాలు రావచ్చు రాకపోవచ్చు. హద్దుల్ని చెరిపేసుకుంటే, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నంలో స్త్రీ.. బాల్యంలో, యవ్వనంలో, ఆ తర్వాత కూడా యుద్ధం చేస్తూనే ఉండాల్సి వస్తుందని చెప్పడానికి బర్ఖా జీవితం ఒక నిదర్శనం. రచనలు బర్ఖాదత్ 2015లో ‘ది అన్క్వైట్ లాండ్’ అనే పుస్తకం రాశారు. భారతదేశపు తప్పొప్పులపై రిపోర్టర్గా బర్ఖా పరిశీలన, విశ్లేషణల సంకలనం ఈ పుస్తకం. అంతకుముందు 2002 నాటి గుజరాత్ అల్లర్లపై ప్రముఖ ఇండో-అమెరికన్ జర్నలిస్టు రాసిన ‘గుజరాత్: ది మేకింగ్ ఆఫ్ ట్రాజెడీ’ పుస్తకంలో బర్ఖా.. ‘నథింగ్ న్యూ?: ఉమెన్ యాజ్ విక్టిమ్స్’ అనే విమర్శనాత్మక అధ్యాయం రాశారు. విమర్శలు, వివాదాలు 2008లో ముంబై దాడుల ప్రత్యక్ష వార్తాసేకరణకు (లైవ్ కవరేజీకి) వెళ్లినప్పుడు బర్ఖాదత్ అక్కడి తాజ్మహల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లలో బస చేసిన కొందరిని ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రత్యక్షసాక్షులుగా టీవీలో చూపించి, వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా రిపోర్టింగ్ను సంచలనాత్మకం చెయ్యడం ఆమెపై విమర్శలకు దారితీసింది. పనులు నడిపించడంలో మోరుమోసిన లాబీయిస్టు నీరా రాడియాతో 2జి స్ప్రెక్ట్రమ్ అమ్మకాలకు సంబంధించి సంభాషణ జరిపిన వారిలో బర్ఖా దత్కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించడంతో బర్ఖా దత్ తను నిర్దోషినని నిరూపించుకోవలసి వచ్చింది. బర్ఖాదత్ - బాలీవుడ్ బర్ఖాదత్ స్ఫూర్తితో బాలీవుడ్లో ‘లక్ష్య’, ‘ఫిరాక్’, ‘పీప్లీ లైవ్’, ‘నో వన్ కిల్డ్ జెస్సీకా’ చిత్రాలు వచ్చాయి. మలయాళంలో వచ్చిన ‘కీర్తిచక్ర’ చిత్రంలోని జర్నలిస్ట్ పాత్రకు కూడా బర్ఖానే ప్రేరణ. అవార్డులు: పద్మశ్రీ, అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్, ఇండియన్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్, కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అవార్డ్. బర్ఖా దత్ (44), టీవీ జర్నలిస్ట్ జననం : 18 డిసెంబర్ 1971 జన్మస్థలం : న్యూ ఢిల్లీ తల్లిదండ్రులు : ఎస్.పి.దత్ (ఎయిర్ ఇండియా అధికారి){పభాదత్ (హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్) తోబుట్టువు : బహర్ దత్ (చెల్లెలు) (సి.ఎన్.ఎన్.-ఐ.బి.ఎన్. జర్నలిస్ట్) చదువు : ఇంగ్లిష్ లిటరేచర్ (డిగ్రీ) ఢిల్లీ మాస్ కమ్యూనికేషన్ (రెండు పీజీలు) జామియా మిల్లియా, కొలంబియా కెరీర్ ప్రారంభం : ఎన్డీటీవీతో. ప్రస్తుతం : ఎన్డీటీవీలోనే న్యూస్ యాంకర్, కన్సల్టింగ్ ఎడిటర్ ప్రతిష్ట : కార్గిల్ యుద్ధక్షేత్రంలో రిపోర్టింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రాతో ఇంటర్వ్యూ (కశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధక్షేత్రాల రిపోర్టింగ్) వైవాహిక స్థితి : అవివాహిత -
కాస్త మెరుగు పడిన జోస్న!
న్యూఢిల్లీః భారత స్వ్రాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప ఈ సారి ర్యాంకుల్లో కొంత మెరుగు పడింది. ఇంతకు ముందున్న ర్యాంకు కంటే రెండు స్థానాలకు ఎదిగి ఇప్పుడు 11వ స్థానంలో నిలిచింది. ప్రొషెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ర్యాంకుల్లో జోస్న కొంతశాతం మెరుగు కనబరిచింది. గతవారం హాంకాంగ్ లో జరిగిన టోర్నీలో తనదైన ప్రతిభను ప్రదర్శించి ర్యాంకుల జాబితాలో స్క్వాష్ క్రీడాకారిణి జోస్న మరో మెట్టు ఎక్కగలిగింది. గతంలో 13వ ర్యాంకులో ఉన్న జోస్నతాజా జిబితాలో 11వ ర్యాంకును సాధించింది. తన ఇండియా టీమ్ మేట్ దీపికా పల్లికల్ కూడ తన స్థానంలో కాస్త మెరుగును కనబరిచి 18 వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే గాయంతో చికిత్స పొందుతున్న సౌరవ్ ఘోషల్ పురుషుల ర్యాంకుల్లో 17వ స్థానంలో ఉన్నాడు. -
కెరీర్ ప్రారంభంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్.. రవి వయసు 23 ఏళ్లు. కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వచ్చే సంపాదనలో కొంత పొదుపు చేయాలనుకున్నాడు. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ఖలీద్ తారసపడ్డాడు. రవి తన సందేహాలను ఖలీద్కు చెప్పాడు. ఖలీద్ అతనికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అవేంటో చూద్దాం... * ముందు ఎంత మొత్తంలో రిస్క్ భరించగలమో అంచనా వేసుకోవాలి. సాధారణంగా యుక్త వయసులోని వారు ఎక్కువ రిస్క్ను భరించగలరు. * రిస్క్ను భరించగలిగినప్పుడు.. దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. * ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలో ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు కమోడిటీ మార్కెట్లో (బంగారం) కొంత ఇన్వెస్ట్ చేయాలి. * మనం సేవింగ్ చేయాలనుకుంటున్న మొత్తంలో 70-75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకుగానూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలి. ఇది లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఓరియెంటెడ్గా ఉండాలి. * ఇక 25-20 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఆదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు లిక్విడిటీ, స్థిరత్వం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. * పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఇకచివరగా మిగిలిన మొత్తాన్ని బంగారంలో పెట్టుబడిగా పెట్టాలి. చాలా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. * ఇన్వెస్ట్మెంట్లను రెగ్యులర్గా చేయాలి. సిప్ పద్ధతిని అనుసరించడం ఉత్తమం. -
పవిత్ర ప్రేమకు ‘మతం’ అడ్డు
తల్లిదండ్రులు సమ్మతించినా అడ్డుపడుతున్న కులసంఘాలు బైక్ ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న మండ్య పోలీసులు ప్రేమికులకు మద్దతుగా ‘ప్రగతిపర వేదిక’ బెంగళూరు: వారి ప్రేమకు మతాలు అడ్డంకి కాలేదు. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ ఇద్దరూ కెరీర్లో స్థిరపడ్డాక తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాలు వివాహానికి సమ్మతించడంతో ఆ కుటుంబాల్లో, ప్రేమికుల హృదయాల్లో ఆన ందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళ కులసంఘాలు వారి ప్రేమకు అడ్డుపడుతున్నాయి. ఆ ప్రేమికులది నిజమైన ప్రేమకాదని, ప్రేమ పేరిట జరుగుతున్న లవ్జిహాది అని గోలపెడుతున్నాయి. వీరి పెళ్లి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగరాదని మండ్యలోని ఒక్కలిగర సంఘానికి చెందిన కార్యకర్తలు శుక్రవారం మండ్య నగరంలో బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. దీంతో ఆ ప్రేమజంట ఒక్కటయ్యేందుకు ‘మతం’ అడ్డుగోడగా మారుతోంది. 12 ఏళ్ల ప్రేమ...... మండ్య నగరంలోని అశోకనగర్లోని రెండవ క్రాస్లో నివాసం ఉంటున్న డాక్టర్ హెచ్,వి.నరేంద్రబాబు, గాందీనగరలో నివాసం ఉంటున్న బియ్యం వ్యాపారి ముఖ్తార్ ఆహ్మద్లు ఇద్దరు బాల్య స్నేహితులు. దాంతో నరేంద్రబాబు కుమార్తె అశితా, ముఖ్తార్ అహ్మద్ కుమారుడు షకిల్ చిన్నప్పటి నుంచి ఎంబీఎ వరకు కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు 12 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దాంతో ఇరు కుటుంబాల వారు ఇద్దరి పెళ్లికి కూడా ఒప్పుకొని ఈ నెల 17న మైసూరు నగరంలోని తాజ్ కన్వెన్షన్ హాల్లో పెళ్లి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘటణ కార్యకర్తలు గత మంగళవారం యువతి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ప్రేమ పేరిట హిందూ యువతిని ముస్లిం మతంలోకి మార్చి లవ్ జిహాదికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. అయితే ఇందులో లవ్ జిహాది లాంటిదేదీ లేదని, తమ బిడ్డలు వివాహానంతరం కూడా మతం మారబోరని ఇప్పటికే ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయినప్పటికీ మండ్యలోని కొన్ని సంఘాలు, ఒక్కలిగర సంఘం సభ్యులు ఈ వివాహాన్ని అడ్డుకోవాలని కోరుతూ బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బైక్ ర్యాలీకి బయలు దేరిన 15 మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శనివారం మండ్య బంద్కు సైతం ఈ సంఘం సభ్యులు పిలుపునిచ్చాయి. ఇదే సందర్భంలో మండ్యలోని కొన్ని ప్రగతిపర సంఘాలు మాత్రం ఈ ప్రేమ జంట వివాహానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ప్రేమ జంటకు తాము అండగా ఉంటామని చెబుతూ వారు సైతం మండ్యలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. మమ్మల్నిలా వదిలేయండి... ఇక ఈ విషయంపై అశితా స్పందిస్తూ....‘మమ్మల్నిలా వదిలేయండి. మేమిద్దరం 12 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. కెరీర్లో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం. ఇందులో నిజమైన ప్రేమ తప్పితే మరే విషయం లేదు. మా పెళ్లైన తర్వాత అత్తగారింట్లో రమ్జాన్ జరుపుకుంటాను, పుట్టింట్లో రామనవమి జరుపుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని పేర్కొన్నారు. -
పొగతో కెరీర్కు సెగ
పరిపరి శోధన పొగతాగే అలవాటుతో ఆరోగ్యానికి మాత్రమే కాదు, కెరీర్కూ సెగ తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారి కంటే పొగతాగని వారే కెరీర్లో ముందుకు దూసుకుపోతారని, పొగరాయుళ్లు తమ అలవాటు కారణంగా కెరీర్లో వెనుకబడిపోతున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. ఇదిలా ఉంటే, పొగరాయుళ్లకు ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు కాలిఫోర్నియా కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ అష్టకష్టాలు పడి ఉద్యోగం సంపాదించినా, పొగరాయుళ్ల ఆదాయం పొగతాగని వారి ఆదాయం కంటే తక్కువగానే ఉంటోందని వారు అంటున్నారు. -
అధ్యయనం తప్పనిసరి
డ్యూటిప్స్ ఉద్యోగాలు చేసే మహిళలు కెరీర్లో ఎదగాలంటే, తొలుత తమ శక్తి సామర్థ్యాలను, లోపాలను నిష్పాక్షికంగా అంచనా వేసుకోవాలి.పనితీరులో మెరుగుదల కోసం శక్తి సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. పనితీరుకు ఇబ్బందికరంగా ఉంటున్న లోపాలను ఇతరులు గుర్తించకముందే దిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. కెరీర్లో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.లక్ష్యసాధనకు ఆటంకం కల్పించే అలవాట్లు ఏవైనా ఉంటే, వాటిని వదిలించుకోవాలి. అవసరమైతే విద్యార్హతలను మెరుగుపరచుకోవాలి. అధ్యయనానికి తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి. -
కెరీర్ను గౌరవించండి
ఐఐఎం విద్యార్థులకు వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ సూచన విశాఖపట్నం: వేతన ప్యాకేజీలతో నిమిత్తం లేకుండా ఎంచుకున్న వృత్తిని గౌరవించాలని ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని ఐఐఎం విద్యార్థులకు సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విశాఖపట్నం ప్రథమ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు, సమాజాభివృద్ధికి పాటుపడేందుకు వేతనాలకై చూడకుండా వృత్తిని గౌరవించాలని చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి హార్డ్వర్క్, సిన్సియారిటీ ఎంతో ముఖ్యమని తెలిపారు. తీర ప్రాంత రక్షణ, దేశ ఆర్థికాభివృద్ధిలో నేవీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. -
గాన గంధర్వుడు రిటైర్ అవుతున్నారా?
హైదరాబాద్: గానగంధర్వుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయిదు దశాబ్దాల సుదీర్ఘ కరియర్కు ముగింపు పలకబోతున్నారా? పాటల పల్లకీలో ఊరేగుతూ 49 సం.రాల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాన్ని రేకిత్తిస్తోంది. పాటలకు న్యాయం చేయలేను అని అనిపించినపుడు పాటలు పాడటం నిలివేయాలని భావిస్తున్నానంటూ బాలూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పాటలు పాడేందుకు భౌతికంగా,మానసికంగా తన బలం సరిపోదన్నారు. సామర్ధ్యం లేనపుడు.. పరిశ్రమను ఇంకా పట్టుకొని వేలాడం సముచితం కాదని పేర్కొన్నారు. జీవితంలో అన్ని అవకాశాలు అడగక్కుండానే వచ్చి వరించాయన్నారు. సుదీర్ఘ కాలం సినీ కళామతల్లికి సేవ చేసే అదృష్టం కలిగడం చాలా సంతోషంగా ఉందని ఇక తనకు ఎలాంటి కోరికలు లేవని తెలిపారు. రోజుకు 11గంటలకు పనిచేస్తూ.. ప్రతీరోజు ఒక సవాల్గా స్వీకరించానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తెలుగు సినీ నేపథ్యగాయకుడిగా తెరపైకి వచ్చిన ఆయన ప్రస్థానంలో ఎక్కడా వెనకడుగులేదు. హీరోలకు, నటులకు అనుగుణంగా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టు కోవడం ఆయన ప్రత్యేకత. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు వారి మదిలో బాలుగా మిగిలిన లెజెండ్ ఆయన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,తులు, హిందీ, ఇంగ్లీషు, లాంటి దాదాపు 15 భాషల్లోగానస్వరాలను ప్రేక్షకులకు అందించి, ఎన్నో అభినందనలను, అవార్డు, రివార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగానూ, సంగీత దర్శకుడిగాను పనిచేసి ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు. బాలుకి 29 సార్లు నంది అవార్డులు, కలైమామణి, విశ్వగానయోగి, నాదనిధి, గానగంధర్వ వంటి బిరుదులను పొందారు. 2001వ సంవత్సరంలో పద్మశ్రీ, 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు ఆయను వరించాయి. ప్రముఖ హిందీ గాయకుడు మహ్మద్ రఫీ తన అభిమాన గాయకుడనీ, ఆ లెజండ్రీ గాయకుడినుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువుగారు కోదండిపాణికి ఆజన్మాంతం రుణపడి వుంటానన్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించకపోవడం తన జీవితంలో తీరని లోటని బాలు పేర్కొన్నారు. -
అందగాళ్లకు అన్నీ కష్టాలే..!
టింగురంగళ్లలా తయారయ్యే అందగాళ్లను చూస్తే చాలామందికి కాస్తంత అసూయగానే ఉంటుంది. అందగాళ్లను అంతా అబ్బురంగా చూస్తారు. అమ్మాయిలూ ఎక్కువగా వారి వెంటే పడతారు. ఇలాంటి సహజ పరిణామాలన్నీ అందగాళ్లకు కాస్తంత ఆనందాన్నే ఇస్తాయి. మరి, వాళ్లకు కష్టాలేమిటి అనుకుంటున్నారా? అందగాళ్లకు బయట ఫాలోయింగ్ ఎలా ఉన్నా, కెరీర్లో మాత్రం ఇబ్బందులు తప్పవని లండన్ వర్సిటీ కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అందగాళ్ల పట్ల వాళ్ల బాస్లకు కాస్తంత బెదురు ఉంటుందని, వీలైనంతగా వాళ్లను అణగదొక్కడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే, అందగత్తెలైన మహిళలకు కెరీర్లో ఇలాంటి సమస్యలేవీ ఎదురుకావని కూడా వారు చెబుతున్నారు. బాస్ల అసూయ కారణంగానే అందగాళ్లు కెరీర్లో నష్టపోతారని, ఏడాదిపాటు జరిపిన తమ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడిస్తున్నారు. -
ఆమె ఓ సూపర్ మోడల్!
న్యూయార్క్ : ఆమె ఓ క్యాన్సర్ పేషెంట్.. వ్యాధి ముదిరి ఫోర్త్ స్టేజ్ లో ఉంది. కానీ అందమైన ఫోటోలతో, అద్భుతమైన మోడల్ గా అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. క్యాన్సర్ వ్యాధి బారినపడగానే తీవ్రమైన భయాందోళనలకు లోను కావడం చాలామంది బాధితుల్లో కనిపిస్తుంది. తమకు తాము మరణశాసనం రాసుకున్నట్టుగా కుంగిపోతారు. ముఖ్యంగా వ్యాధి నివారణలో భాగమైన కీమో థెరపీ, దాని దుష్ప్రభావాలకు మరింత బెంబేలెత్తిపోతారు. కానీ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్న ఓ మోడల్ ఇపుడు ప్రపంచంలోని క్యాన్సర్ వ్యాధి పీడితులకు స్ఫూర్తిగా నిలిస్తోంది. ఒకవైపు రోగం పీడిస్తున్నా ఆత్మవిశ్వాసంతో తన వృత్తిలో ముందడుగు వేయడం ఆకర్షిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మసౌందర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. డయానా క్రిష్టియన్ (25) మూడు సంవత్సరాల క్రితం లింఫోమియా బారిన పడింది. న్యూయార్క్ నుండి ఫ్యాషన్ బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే చిన్నవయసులోనే ఈ మహమ్మారి ఆమెను కూడా వణికించింది. వ్యాధిని గుర్తించే సమయానికి దాదాపు నాలుగు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కీమో థెరపీ, రెండుసార్లు స్టెమ్ సెల్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ మూలంగా పూర్తిగా నీరసించిపోయింది. జుట్టుమొత్తం ఊడిపోయింది. అయినా తన రూపం చూసుకొని కంగిపోలేదు. తన కరియర్ లో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. చికిత్స అనంతరం తన స్నేహితుడు సహాయంతో కొన్ని ఫోటోలు తీసి ఒక పోర్ట్ ఫోలియె క్రియేట్ చేసుకుంది. అలా ఆమె పోర్ట్ ఫోలియోలోని ఫోటోలు పెద్దపెద్ద కంపెనీల, ఫోటో గ్రాఫర్ల దృష్టిని ఆకర్షించాయి. ఎలాంటి విగ్ గానీ, స్కార్ఫ్ ధరించకుండానే ఫోటోలకు ఫోజులిస్తూ, ర్యాంపై పై నడుస్తే ధీశాలిగా నిలిస్తోంది. దీంతోపాటు చాలా మేజర్ కంపెనీలకు తమ మోడలింగ్ చేస్తూ సూపర్ మోడల్ గా నిలిచింది. క్యాన్సర్ సోకినంత మాత్రాన ఎక్కడా అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సూపర్ మోడల్ డయానా పిలుపునిస్తోంది. తన అనారోగ్యానికి దాచడం తనకు ఇష్టం లేదని, తను ఎలా ఉన్నానో, వాస్తవంగా ఎలా కనిపిస్తున్నానో అలాగే ప్రపంచానికి తెలియాలని డయానా పేర్కొంది. -
కరీనాకు ఏదీ సరిపోదు!
టాప్ స్టోరీ డేట్లు కుదరలేదు... కథ నచ్చలేదు... డబ్బుల లెక్క తేలలేదు... కారణాలు ఏవైనా కరీనా కపూర్ వదులుకున్న సినిమాలు చాలానే. అందులో ఓ అరడజనయితే, ఆమె మిస్ చేసుకున్న అద్భుతమైన హిట్లు. కరీనా ఖాతాలో మిస్సయిన ఆ ఆరు సినిమాల కథాకమామిషు... అంచనా తప్పింది! ‘ఊహూ.. ఇది వర్కవుట్ కాదు..’ అని బలంగా అనుకుని, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రాన్ని తిరస్కరించారు కరీనా కపూర్. ఆ చిత్రం ద్వారా కరీనాను కథానాయికగా పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఐశ్వర్యారాయ్ని కథానాయికగా తీసుకున్నారు. కట్ చేస్తే... ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు పలు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఐశ్వర్యా రాయ్ కెరీర్ సక్సెస్ ట్రాక్లోకి వెళ్లడానికి కారణంగా నిలిచిన చిత్రం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’. ఒకవేళ ఈ చిత్రం అంగీకరించి ఉంటే ఓ ఏడాది ముందే తెరపై మెరిసేవారు. అలా కెరీర్ మొదట్లోనే ఓ సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారు కరీనా. కానీ, ఆమె పరిచయం అయిన ‘రెఫ్యూజీ’ కూడా మూమూలు సినిమాయేం కాదు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాకపోతే ‘హమ్ దిల్ దే చుకే సనమ్’తో పోలిస్తే మాత్రం రేంజ్ తక్కువనే చెప్పాలి. డబ్బే ప్రధానం! కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మూవీ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా నటనకు ముగ్ధుడైన దర్శకుడు కరణ్ జోహార్ తన తదుపరి చిత్రం ‘కల్ హో నా హో’లో కూడా ఆమెనే కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. కానీ, ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఘనవిజయం, అందుకు ముందు చేసిన రెండు, మూడు చిత్రాల విజయంతో కరీనా తన పారితోషికం పెంచేశారు. అ బ్యూటీ అడిగిన పారితోషికం కరణ్ జోహార్కి రీజనబుల్గా అనిపించక పోవడంతో ప్రీతీ జింతాను తీసుకు న్నారాయన. అందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రీతీకి మంచి పేరు వచ్చింది. ‘‘అంత మంచి పాత్ర వదులుకుని తప్పు చేశాను’’ అని ‘కాఫీ విత్ కరణ్’లో కరీనా పేర్కొన్నారు. జీవితాంతం ఆ పశ్చాత్తాపం ఉంటుందని ఆమె అన్నారు. ఫ్యాషన్... పరేషాన్! మధుర్ భండార్కర్ సినిమాలో అవకాశం అంటే కథానాయికలకు పండగే అనాలి. అవార్డులు దక్కించుకునే పాత్రలు ఇస్తారాయన. అందుకే మధుర్ అవకాశం ఇస్తే, ఏ కథానాయికా కాదనరు. కానీ, ‘ఫ్యాషన్’ చిత్రానికి అడిగినప్పుడు కరీనా కుదరదనేశారు. అలా చెప్పాల్సి వచ్చినందుకు ఆమె చాలా బాధపడ్డారు కూడా. కేవలం డేట్స్ ఖాళీ లేనందువల్లే ఆమె ఈ చిత్రాన్ని వదులుకున్నారు. కట్ చేస్తే... ఆ అవకాశం ప్రియాంకా చోప్రాకు దక్కింది. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఉత్తమ నటిగా ప్రియాంకకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఆ విధంగా బంగారం లాంటి అవకాశం వదులుకుని పరేషాన్ అయిపోయారు కరీనా. మరోసారి అంచనా తప్పింది! కెరీర్ ప్రారంభంలో సంజయ్ లీలా భన్సాలీ ఇచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఆఫర్ను కాదన్న కరీనా కపూర్ మరోసారి ఆయన చిత్రాన్ని తిరస్కరించారు. కరీనాతో ఒక్క సినిమా చేయాలనే ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ‘గోలియోం కీ రాస్లీలా: రామ్-లీలా’కి ఆమెను అడిగారు. కరీనా కూడా ఈ చిత్రంలో నటించ డానికి సుముఖత వ్యక్తపరిచారు. లుక్ టెస్ట్లో కూడా పాల్గొన్నారామె. కానీ, ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమెకు కథ అంత అసంతృప్తిగా అనిపించ లేదట. దాంతో తప్పుకున్నారు. ఆ విధంగా ఆ లక్కీ చాన్స్ దీపికా పదుకొనేని వరించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలాగే, రణ్వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ కేక అని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. క్వీన్ కాలేకపోయారు కంగనా రనౌత్ కెరీర్ను మంచి మలుపు తిప్పిన చిత్రం ‘క్వీన్’. చేస్తే ఇలాంటి సినిమా చేయాలని ఇతర కథానాయి కలు సైతం అనుకున్న చిత్రం ఇది. ఈ చిత్రదర్శకుడు వికాస్ బెహల్ క్వీన్ పాత్ర కోసం ముందు కరీనానే అడిగారు. మరి... ఈ చిత్రాన్ని కరీనా ఎందుకు తిరస్కరించారనే కారణం బయటికి రాలేదు. ఆమె కుదరదన్న తర్వాత కంగనా రనౌత్ను ఎంపిక చేశారు. ఈ చిత్రం కంగనాను ఎంతో మందికి హృదయరాణిగా మార్చేసింది. పెళ్లి కారణంగా మిస్సయిన హిట్ మూవీ ఇప్పుడు సినిమాల కన్నా పెళ్లే ముఖ్యం అంటూ కరీనా కపూర్ వదులుకున్న చిత్రం ‘దిల్ ధడక్నే దో’. రియల్ లైఫ్ కజిన్స్ రణ్బీర్ కపూర్, కరీనా కపూర్ లను ఈ చిత్రంలో కజిన్స్గా నటింపజే యాలని జోయా అనుకున్నారు. ఈ చిత్రకథ ఎక్కువ శాతం ఓ నౌకలో జరుగుతుంది. దాదాపు నెల రోజుల పాటు చిత్రబృందం మొత్తం ఆ నౌకలోనే ఉండాలనే నిబంధన కరీనాకి నచ్చలేదు. దాంతో ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. కరీనా ఎప్పుడైతే ఈ చిత్రాన్ని వదులకున్నారో అప్పుడు రణ్బీర్ కూడా కుదరదన్నారు. దాంతో కరీనా స్థానంలో ప్రియాంకా చోప్రాను, రణ్బీర్ పాత్రకు రణ్వీర్ సింగ్ను తీసుకున్నారు. ఈ ఏడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ విధంగా కరీనా కెరీర్లో ఓ హిట్ మూవీ తగ్గింది. లేటెస్ట్గా... సెక్షన్ 84 ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్లో నటించే అవకాశాలను కథానాయికలు అంత సులువుగా వదులుకోరు. కానీ, కరీనా వదులుకున్నారు. ఇటీవల ‘సెక్షన్ 84’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కరీనా కపూర్ను సంప్రతించారు దర్శకుడు రాజ్కుమార్ గుప్తా. కథ అంతగా అసంతృప్తిగా అనిపించకపోవడం వల్లే ఈ చిత్రం వదులుకు న్నానని కరీనా పేర్కొన్నారు. ఇందులో కథానాయిక మానసిక రోగి అని సమాచారం. ఒకవేళ కరీనా ఒప్పుకుని ఉంటే, గత నెల ఈ చిత్రం షూటింగ్ ఆరంభం అయ్యుండేది. ఆమె అంగీకరించకపోవడంతో ఆ స్థానంలో వేరే ఎవర్ని తీసుకోవాలనే డైలమాలో దర్శకుడు ఉన్నారట. ఒకవేళ ఈ చిత్రం కూడా హిట్టయితే అప్పుడు కరీనా ఏడు హిట్ సినిమాలు మిస్ చేసుకున్నట్లు అవుతుంది. -
మహేశ్ సినిమా చేద్దామన్నారు
‘‘నిర్మాతగా పలు జయాపజయాలు చూశాను. విజయాలకు పొంగిపోలేదు. అపజయాలకు కుంగిపోలేదు’’ అని నిర్మాత యమ్మెస్ రాజు అన్నారు. ఈ దసరాతో ఆయన నిర్మాతగా ప్రవేశించి పాతికేళ్లయ్యింది. ఈ సందర్భంగా పాత్రికేయులతో తన కెరీర్, ఇతర విశేషాల గురించి ఎమ్మెస్ రాజు పంచుకున్న విశేషాలు... ఆయన మాటల్లోనే... తొలి సినిమా ‘శత్రువు’ను ప్యాషన్తో నిర్మించాను. ఆ తర్వాత నిర్మించిన ‘పోలీస్ లాకప్’ కూడా విజయం సాధించింది. మూడో సినిమా ‘స్ట్రీట్ ఫైటర్’ స్ట్రీట్కి తెచ్చేసింది. కానీ, అధైర్యపడలేదు. ఆ తర్వాత తీసిన ‘దేవి’ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఓ టెక్నికల్ వండర్ చూపించాలనే ఆకాంక్షతో ‘దేవీపుత్రుడు’ తీశాను. ఆ చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో, జీవితంలో మళ్లీ సక్సెస్ వస్తుందా? అనుకున్నాను. నేను స్టోరీ, స్క్రీన్ప్లే తయారు చేసుకుని ‘మనసంతా నువ్వే’ నిర్మించాను. ఆ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నీ స్నేహం’ కూడా ఫర్వాలేదనిపించుకుంది. వరుసగా మూడు సంచలన విజయాలు ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’... ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత తీసిన ‘పౌర్ణమి’ నాకు అమావాస్య అయ్యింది (నవ్వుతూ). ఓ పాజిటివ్ మైండ్తో ‘ఆట’ తీస్తే, సక్సెస్ అయ్యింది. అప్పుడే కన్నడ చిత్రం ‘ముంగారు మళె’ని ‘వాన’గా నా దర్శకత్వంలోనే రీమేక్ చేశాను. క్లయిమ్యాక్స్ వల్లే కన్నడ చిత్రం ఆడిందనీ, మార్చొద్దనీ వేరేవాళ్లు అంటే, అలానే ఉంచేశాను. క్లయిమ్యాక్స్ వల్లే ఆ సినిమా పోయింది. అప్పుడనుకున్నా.. మన మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని. ఈ నాలుగేళ్లు విలువైనవి ‘మస్కా’ తర్వాత మా బేనర్లో మళ్లీ సినిమాలు తీయలేదు. ఈ నాలుగేళ్ల విరామాన్ని మా అబ్బాయి (సుమంత్ అశ్విన్) కెరీర్పై దృష్టి పెట్టడానికి వినియోగించాను. తెలుగు, హిందీ.. ఇలా భాషాభేదం లేకుండా అన్ని సినిమాలూ చూసి, అప్డేట్ అవుతుంటాను. ఆ అవగాహనతో మా అబ్బాయి ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందో ప్లాన్ చేశాను. ఇప్పటివరకూ తను ఆరు సినిమాల్లో హీరోగా నటిస్తే, నాలుగు సక్సెస్ అయ్యాయి. ఆ విధంగా తన కోసం కేటాయించిన ఈ నాలుగేళ్లు నాకు విలువైనవిగా అనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సుమంత్ అశ్విన్ ‘కొలంబస్’ సక్సెస్ బాటలో సాగడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి నేనే కథ-స్క్రీన్ప్లే ఇచ్చాను. ఈ చిత్రవిజయానికి స్క్రీన్ప్లే ఓ కారణం అని అందరూ అంటున్నారు. కమల్, ఆమిర్ దారిలో మా అబ్బాయి... కమలహాసన్, ఆమిర్ఖాన్, అజిత్ వంటి హీరోలను తీసుకుంటే.. వాళ్లు ముందు సాఫ్ట్ రోల్స్ చేసి, ఆ తర్వాత పవర్ఫుల్ రోల్స్ చేశారు. తిరుగు లేని మాస్ హీరోలనిపించుకున్నారు. మా అబ్బాయి కూడా వీళ్ల బాటలో ఇప్పుడు తన వయసుకి తగ్గట్టుగా ప్రేమకథా చిత్రాలు, లవ్స్టోరీ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూ గ్రాఫ్ పెంచుకుంటాడు. భవిష్యత్తులో ఈ ముగ్గురి హీరోల్లా స్థిరపడతాడు. మహేశ్, ప్రభాస్ వెరీ సపోర్టివ్ నా సంస్థలో మహేశ్బాబు చేసిన ‘ఒక్కడు’, ప్రభాస్ చేసిన ‘వర్షం’ సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ అగ్రహీరోలుగా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. మహేశ్, ప్రభాస్ నాకెప్పుడూ సపోర్టివ్గానే ఉంటారు. ఈ మధ్య మహేశ్ని కలిసినప్పుడు ‘ప్లాన్ చేయండి... సినిమా చేద్దాం’ అనడం ఆనందం అనిపించింది. వచ్చే ఏడాది మా సుమంత్ ఆర్ట్స్ బేనర్లో ఓ స్టార్ హీరోతో, మా అబ్బాయితో ఓ సినిమా నిర్మిస్తా. చిన్న క్లూ ఏమిటంటే ఆ స్టార్ హీరో మా బేనర్లో ఒక సినిమా చేశాడు. వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. -
రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి..
హైదరాబాద్: దాదాపు దశాబ్దకాలంపాటు (1970-1980) తెలుగు చిత్రసీమపై ఏడిద నాగేశ్వరరావు ప్రభావం అమోఘం. పూర్తిగా కళాభిరుచి ఉన్న సాంప్రదాయబద్ధమైన చిత్రాలను నిర్మించి విమర్శకులు ప్రశంసలను నాగేశ్వరరావు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషివంటి చిత్రాలు ఆయనకే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకే గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. పలు చిత్రాలు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతోపాటు నంది అవార్డులను కూడా సాధించాయి. అంతర్జాతీయ వేదికలపై ఆయన నిర్మించిన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. కొన్ని చిత్రాలు రష్యా భాషలోకి కూడా అనువాదం అయ్యాయి. రంగస్థల నటుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన చిత్ర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం సాగించి చివరకు సినిమా నిర్మాతగా మారారు. నిర్మాణ రంగం నుంచి వైదొలగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నంది అవార్డుల కమిటీ చైర్మన్గా, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.