Crime News
-
Vizag: మరో 24 గంటల్లో భార్య డెలివరీ... భార్యను హతమార్చిన భర్త
-
మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..
వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ మర్డర్తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్ హాల్ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు. ట్రాక్టర్ వద్ద రోదనలు.. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. -
చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కరీంనగర్: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొదీ్దన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్కు, బుగ్గారం మండలం యశ్వంత్రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.ఆరు నెలల క్రితం పాప జననం..ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్రావ్పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషి టర్ అయిన పగడాల విజయ్కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగాడాల విజయ్కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్కాలనీ పువ్వాడఅజయ్నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు. -
నీవు నాకు తెలుసు.. నీ నంబర్ నా దగ్గర ఉంది..!
వట్పల్లి(అందోల్): ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. ఫోన్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్పై వట్పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగా రం గ్రామానికి చెందిన కూనూరు సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె కూనూరు భార్గవి(22) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటూ పీజీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. భార్గవి తండ్రి సుదర్శన్ పది నెలల క్రితమే చనిపోయాడు. తల్లి లక్ష్మి కుట్టు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శనివారం మధ్యాహ్నం తల్లి బయటకు వెళ్లగా.. భార్గవి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో రామగిరి సెంటర్లోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ వద్దకు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తమకు ఫొటోలు ప్రింట్ తీసి ఇవ్వాలని కోరారు. దీంతో సురేష్ ప్రింట్ మిషన్ ఆన్ చేసి కంప్యూటర్పై కూర్చున్న సమయంలో నిందితులు మొదట అతడి గొంతు కోసి ఆ తర్వాత గుండెలపై విచక్షణారహితంగా పొడవడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలు, ఫింగర్ ప్రింట్స్ టీంలను పిలిపించి వివరాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీసీ కెమెరాల సీడీఆర్ను సేకరించడంతో పాటు మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు ఏ దారి గుండా బయటకు వెళ్లారు. హత్యకు ముందు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో నల్లగొండ పట్టణంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పాత కక్షలతోనే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటో స్టూడియోలు బంద్ చేసి ర్యాలీ..మృతుడు సురేష్ నల్లగొండతో పాటు నకిరేకల్, చిట్యాల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో ఫొటో కలర్ ల్యాబ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సురేష్ హత్యకు గురికావడంతో నల్లగొండలో శనివారం ఫొటో, వీడియో గ్రాఫర్లు, కలర్ ల్యాబ్ యజమానులు ఫొటో స్టూడియోలు బంద్ చేసి నల్లబ్యాడీ్జలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సురేష్ చిత్రపటానికి నివాళులరి్పంచారు. నిందితులను అరెస్ట్ చేసి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.నకిరేకల్లో అంత్యక్రియలు నకిరేకల్: సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం రాత్రే ఘటనా స్థలం నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సురేష్ సొంతూరు నకిరేకల్కు అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ ఆస్పత్రి మార్చురీ వద్ద సురేష్ కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. సురేష్ సొంతూరు కట్టంగూర్ మండలం పందెనపల్లి కాగా.. కొన్నేళ్ల క్రితమే కుటుంబం అంతా నకిరేకల్లోని చీమలగడ్డ ఫ్లైఓవర్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని గూనల వ్యాపారం చేసుకుంటున్నారు. సురేష్ తల్లి, భార్య నాగమణి కలిసి గూనల వ్యాపారం నిర్వహిస్తుండగా.. సురేష్ ఏడేళ్ల క్రితమే నల్లగొండలో ఫొటో కలర్ ల్యాబ్ పెట్టుకుని ప్రతిరోజు నకిరేకల్ నుంచి వెళ్లి వస్తున్నాడు. సురేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్ తండ్రి 30ఏళ్ల క్రితమే చనిపోగా.. తల్లి రెండు నెలల క్రితమే మృతిచెందింది. సురేష్ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో టీపీసీసీ నేత దైద రవీందర్ తదితరులు ఉన్నారు. -
కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పాస్టర్ ప్రవీణ్ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు. -
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
సాక్షి, నల్లగొండ జిల్లా: శాలి గౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో మృతదేహం బయటపడింది. మేడిపల్లికి చెందిన మహేశ్వరి (26)గా పోలీసులు గుర్తించారు. మహేశ్వరీని హత్య చేసింది సవతి తల్లిగా పోలీసులు తేల్చారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చి మూసీ వాగులో సవతి తల్లే యువతిని పాతిపెట్టింది. మృతిచెందిన యువతి సొంత గ్రామం జనగామ జిల్లా దేవర ఉప్పల మండలం పడమటి తండా గ్రామంగా పోలీసులు గుర్తించారు.మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్లోని లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జాటోత్ మహేశ్వరి (26) అనే యువతి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన అదృశ్యమైంది. ఈ నెల 2న తండ్రి జాటోత్ పీనా మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సవతి తల్లి లలిత పన్నాగంతో మహేశ్వరిని హత్య చేసినట్లు తేలింది. తనకు దక్కాల్సిన ఆస్తిని పెళ్లి పేరుతో మహేశ్వరి తీసుకుపోతుందనే కారణంతోనే లలిత ఈ హత్య చేసినట్లు సమాచారం.లలిత మేనమామ రవితో పాటు మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని లలిత అంతమొందించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సవితి తల్లి లలిత, మేనమామ రవి, మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. నిందితులు చెప్పిన సమాచారంతో వంగమర్తిలో మహేశ్వరి మృతదేహాన్ని వెలికితీశారు. -
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.బెయిల్ బయటకు వచ్చిన అజయ్ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది. -
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్ను పోలీస్ స్టేషన్కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్ను పీఎస్లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం.. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది. -
16 రోజుల్లో.. ఉగ్ర విధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే. పాక్ నుంచి కథ నడిపిన రియాజ్... పాకిస్థాన్లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్మెట్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది. సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు.. ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్పేట, అబిడ్స్, దిల్సుఖ్నగర్ల్లో రెక్కీ చేసినా.. దిల్సుఖ్నగర్నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు. మలక్పేట రైల్వేస్టేషన్లో పార్క్ చేసి.. ఆ సైకిల్ను మలక్పేట రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్బజార్కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్పేట రైల్వేస్టేషన్ పార్కింగ్లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది. విధ్వంసానికి ముందే గది ఖాళీ.. రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్మెట్లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్సుఖ్నగర్కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు. మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు. -
Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్నగర్లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్నగర్లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
జగిత్యాలజోన్: ముగ్గురు పిల్లలున్న వివాహితపై కన్నేసి, మాట వినకుంటే కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన నిందితుడు ఇల్లంతకుంట శ్రీధర్కు యావజ్జీవ శిక్ష, రూ 1.02 లక్షల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. పీపీ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం కొడిమ్యాలలో నివాసం ఉండే దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. వీరి ఇంటి పక్కన ఉండే ఇల్లంతకుంట శ్రీధర్ సదరు మహిళపై కన్నేశాడు. కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తన పిల్లలతో కలిసి అదే గ్రామంలో వేరే చోటుకు అద్దె ఇంట్లోకి మారింది. అక్కడికి వెళ్లిన శ్రీధర్ మహిళకు ఇల్లు ఎందుకు అద్దెకిచ్చావని యాజమానితో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ తిరిగి సొంతింటికి వచ్చింది. ఏప్రిల్ 14, 2019 రోజున సదరు మహిళ ఇంట్లో బీడీలు చుడుతుండగా, శ్రీధర్ వచ్చి తన కోరిక తీర్చమని వేదించాడు. ఒప్పుకోకపోవడంతో తన ఇంట్లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో మహిళ పిల్లలు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, ఇంట్లోంచి కేకలు వినపడ్డాయి. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పివేస్తుండగా శ్రీధర్ అక్కడి నుంచి పారిపోయాడు. సదరు మహిళను జగిత్యాలకు తరలించి, అనంతరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐలు సీహెచ్.నాగేందర్, కె.కిశోర్ కేసు నమోదు చేసి, శ్రీధర్ను అరెస్ట్ చేసి, చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కేవీ.సాగర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో, పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన ఇల్లంతకుంట శ్రీధర్కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1.02 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఫుడ్ పాయిజన్తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్స్టేషన్లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు. -
యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మియాపూర్లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్గంజ్లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో సెక్యూరిటీ గార్డు జై సింగ్ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్ను టార్గెట్గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉంచారు. అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు. -
సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
ప్రభాకర్రావే కీలకం.. బెయిల్ ఇవ్వొద్దు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్పై పోలీసులు తరఫున కౌంటర్ దాఖలు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.కౌంటర్ కాపీలో ఏముందంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్రావే కీలకం. ఎస్ఐబీలో ఎస్వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్రావు ఆధ్వర్యంలోనే ఎస్వోటీ పనిచేసింది. ఫోన్ట్యాపింగ్కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు.... ఓఎస్డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్కు రాలేదు’’ అని ఉంది. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్ లభించింది. -
కర్ణాటకలో లైంగిక వేధింపులు.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.బెంగళూరులోని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండమని నేను ప్రతీరోజు పోలీసులకు చెబుతూనే ఉంటాను. ఇటీవల జరిగిన ఓ ఘటనపై ఉదయం కూడా కమిషనర్తో మాట్లాడాను. ఇక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది. పోలీసులు 24X7 పనిచేస్తున్నారు. మేము చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.Sexist shocker from Karnataka Home Minister G Parameshwara- HM trivialises molestation incident: 'Such incidents happen in big cities'- Home Min underplays issue of #WomenSafetyMirror Now's @NehaHebbs shares details | @RitangshuB#BengalururMolestationShocker pic.twitter.com/mThTr3kkVJ— Mirror Now (@MirrorNow) April 7, 2025హోంమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడుతూ..‘హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఇది చాలా సున్నితమైన విషయం. లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలను ఆయన సాదారణ విషయంగా భావిస్తున్నారా?. ఇలా మాట్లాడి తన బాధ్యత నుండి ఆయన తప్పించుకుంటున్నారు. జవాబుదారీగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రత పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025 -
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
బద్వేలు అర్బన్ : భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ... ఇదే అదునుగా భావించి ఆ అల్లుడు ఆమె ఇంటికే కన్నం వేశాడు. రూ.6 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ వెల్లడించారు. గోపవరం మండలం టీ.సండ్రపల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భర్త అయిన మంగుదొడ్డి మురళి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వీరు గతంలో నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో నివసిస్తూ రెండేళ్ల క్రితం నుంచి అత్తగారింటికి సమీపంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న అర్బన్ సీఐ రాజగోపాల్ అయితే గత నెల 18వ తేదీన పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన టీ.సండ్రపల్లెకు వెళ్లారు. వారితో పాటు మురళి కూడా వెళ్లాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గత నెల 27న బద్వేలుకు వచ్చిన మురళి తెలుగుగంగ కాలనీలో ఉన్న అత్తగారింటికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.6 లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు (ఒక లాంగ్చైన్, ఒక జత బంగారు గాజులు, ఒక జత బుట్టకమ్మలు, ఒక పాపిడిబిళ్ల) ఎత్తుకెళ్లాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తిరిగి టీ.సండ్రపల్లెకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఉన్నాడు. మరుసటిరోజు ఇంటి తాళాన్ని తెరిచి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు పెంచలమ్మ రెండవ కుమార్తె శిరీషకు విషయం తెలపడంతో ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ చేసింది అల్లుడు మురళినే అని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తనతో పాటు ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, సిబ్బంది కలిసి నిందితుడు మురళిని పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నగలు స్వా«దీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకటే‹Ù, ఓబులేసు, చెన్నారెడ్డి, నరసింహులు, కోటేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్పేట్లోని ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025 -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్లోని కాళీమందిర్కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి అదృశ్యం నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛా ఫ్ వచి్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టెక్కీనని చెప్పి రెండో పెళ్లి
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్కు ఆరు నెలల క్రితం ఇన్స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.రోజూ ఆఫీసుకు డ్రాప్సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు. దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.భార్యను గొంతుకోసి హతమార్చిన భర్తబొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు. ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది. -
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్హౌజ్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
నవరాత్రి వేడుకలను నిష్టగా ఆచరించేందుకు ఆ వివాహిత ఏడాదిగా ఎదురుచూస్తూ వచ్చింది. తీరా ఆ సమయం వచ్చేసరికి అందులో పాల్గొనలేకపోయింది. ఆ బాధతోనే మానసికంగా కుంగిపోయింది. తన బదులు ఆ పూజలు చేసేందుకు భర్త సైతం సిద్ధం అయ్యాడు. అయినా కాని ఆమె కోలుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా ప్రాణమే తీసుకుంది!. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని(36).. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రి ప్రారంభమైంది. అయితే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చింది. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఏడాదిగా ఆ పూజ కోసమే ఎదురు చూసిన ఆమె.. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఇది సహజంగా జరిగేదే అని భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. బదులుగా తాను పూజలు చేస్తానని చెప్పినా వినలేదు. తప్పు జరిగిపోయిందంటూ ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో పుట్టింట్లో అయినా ఆమె సంతోషంగా ఉంటుందని భావించి కొన్నాళ్లు ఉండమని దింపి వచ్చాడు. అయితే.. తల్లిదండ్రులు ఓదార్చిన ఆమె ఆ బాధ నుంచి బయటపడలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అంత కష్టం ఏమొచ్చిందో..
నెల్లూరు: ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలికకు ఏ కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూరులో గురువారం జరిగింది. ఎస్సై జిలానీ, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని వందూరుగుంట ప్రాంతానికి చెందిన ప్రకాష్, రత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ప్రకాష్ పెయింట్ పనిచేస్తుంటాడు. రత్నమ్మ ప్రభుత్వాస్పత్రిలో తాత్కాలిక నర్సుగా వ్యవహరిస్తోంది. పెద్ద కుమార్తె నిహారిక (11) జెడ్పీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నిహారిక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. నానమ్మ భోజనం తినాలని చెప్పగా స్కూల్లోనే చేశానంది. ఆ సమయంలో రత్నమ్మ సమీపంలోని తెలిసిన వారింటికి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఇంటికొచ్చి కుమార్తెను పిలవగా స్పందన లేదు. దీంతో నానమ్మ మిద్దైపెన బాత్రూమ్కు వెళ్లిందని చెప్పడంతో తల్లి అక్కడికి వెళ్లి పిలిచింది. అయితే నిహారిక పలక్కపోవడంతో కేకలు వేసింది. కిందనే ఉన్న భర్త ప్రకాష్కు తెలిపింది. అతను పైకి వచ్చి కొంత ప్రయత్నం చేసి తలుపు తీశాడు. ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించిన నిహారికను చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తల్లి గుర్తించింది. హుషారుగా తిరిగే నిహారిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ కానిస్టేబుల్ విజయకుమార్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’
కరీంనగర్: వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఎవరికి ఆపద వచ్చినా సహకరించుకుంటారు.. సుఖదుఃఖాలనూ పంచుకుంటారు.. చివరకు మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లారు.. హృదయం ద్రవింపజేసిన ఈ ఘటన రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మహమ్మద్ గౌస్(34), షేక్ ఇమ్రాన్(28) దుర్మరణం చెందారు. ఎస్సై శ్రావణ్కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామగుండానికి చెందిన మహమ్మద్గౌస్ ఎన్టీపీసీలో జీమ్ ట్రైనర్. విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో వీసా దరఖాస్తు చేసేందుకు తన ఇంటిసమీపంలో ఉండే స్నేహితుడు, కారు డ్రైవర్ షేక్ ఇమ్రాన్తో కలిసి బంధువుల కారులో గురువారం ఉదయం హైదారాబాద్ వెళ్లారు. అక్కడ పనులు పూర్తిచేకుని రాత్రివేళ బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ చేరుకున్నారు. ఇక్కడి రాజీవ్ రాహదారిపై ఆగిఉన్న లారీని అదుపుతప్పి వెనకాల ఢీకొన్నారు. తీవ్రగాయాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్గౌస్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మహమ్మద్ గౌస్ కారు నడుపుతుండగా ఇమ్రాన్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఆగిఉన్న లారీని ఢీకొట్టగా రెండు బెలూన్స్ తెరుకున్నాయి. అయినా, ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. గౌస్కు భార్య, పాప(4), బాబు(1.5) ఉన్నారు. ఇమ్రాన్కు ఇంకా పెళ్లికాలేదు. ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’ రామగుండం: ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు అవసరమైన వీసా పనిపూర్తయ్యింది.. నాలుగైదు రోజుల్లో వీసా వస్తుంది..’ అని తన తండ్రి పాషాతో ఫోన్లో మాట్లాడిన మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహ్మద్ గౌస్ ఉరఫ్ నిసార్ బాడీబిల్డర్. స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహించినా నష్టాలు వచ్చాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కారులో వెళ్లి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసుకుని తండ్రి పాషాతో మాట్లాడారు. అంతలోనే సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన ఇమ్రాన్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల్లో నలుగురు స్నేహితులు.. పట్టణానికి చెందిన ఎండీ గౌస్, ఇమ్రాన్, షేక్ అఫ్సరొద్దీన్, సయ్యద్ ఇమ్రాన్ నలుగురూ మంచి స్నేహితులు. వీరిలో సయ్యద్ ఇమ్రాన్ గతేడాది అక్టోబర్ 8న అంతర్గాం గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కలిసి విందు చేసుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. అదే ఏడాది డిసెంబర్ 24న షేఖ్ అఫ్సరొద్దీన్ ద్విచక్ర వాహనంపై రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నలుగురు మంచిస్నేహింతులు నా లుగు నెలల్లోనే కానరానికి లోకాలకు వెళ్లడం వారి కుటుంబాన్ని తీరని విషదం నింపినట్లయ్యింది. అంత్యక్రియలకు హాజరు రామగుండం: మృతుల అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వీటికి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ హాజరయ్యారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
కర్ణాటక: భార్య అదృశ్యమైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. మా కూతురిని హత్య చేశాడంటూ అనుమానంతో అత్తంటివారు ఫిర్యాదు చేయటంతో భర్తను కేసు పెట్టి జైలుకు పంపారు. ఎలానో శిక్ష నుంచి బయట పడ్డారు. ఇదీ కథ కాదు. ఐదేళ్లు క్రితం జరిగిన యద్దార్థ ఘటన. ఇప్పుడు ఆ భార్య ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. ఈ విచిత్ర సంఘటన కొడగు జిల్లా కుశాలనగర తాలూకా బసవనహళ్లి గ్రామంలో జరిగింది. ఓ రోజు మిస్సింగ్ కుశాలనగర తాలూకా బసవనహళ్లికి చెందిన సురేశ్, మల్లిగె దంపతులు కూలిపని చేసుకుని జీవిస్తుండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక రోజు మల్లిగె అదృశ్యమైంది. ఆమె ఆక్రమ సంబంధం కారణంగా వెళ్లిపోయిందని భర్త చెప్పేవాడు. ఓ రోజు మల్లిగెకి ఫోన్ చేసి నాతో సంసారం చేయకున్నా పర్వాలేదు. ఇద్దరు పిల్లలున్నారు. చూసుకోవడానికైనా రావాలని మల్లిగెని ప్రాధేయ పడ్డాడు. ఆమె మనసు కరగలేదు. చివరికి సురేశ్ 2021లో కుశాలనగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. 2022లో శవం లభ్యం 2022లో సురేశ్కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లు సమాచారం ఇచ్చారు. పిరియాపట్టణ పోలీసులు సురేశ్తో పాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించగా ఇది మల్లిగెది అని గుర్తించారు. అక్కడే అంత్యసంస్కారంను పూర్తి చేయించారు. తన అల్లుడే ఆమెను చంపాడని అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండేళ్లు తరువాత డీఎన్ఎ పరీక్షల రిపోర్ట్ రాగా, ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్ జైలు నుంచి బయట పడ్డారు. ఇలా దొరికింది ఇలా ఉండగా మల్లిగె ఈ నెల 1ను తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఒక హోటల్కు వెళ్లింది. అక్కడ సురేశ్ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్కు, పోలీసులకు పంపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తను ప్రియునితో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజర్ పరిచి మైసూరు జైలుకు తరలించారు. అప్పట్లో లభించిన శవం ఎవరిది, అన్యాయంగా సురేశ్ను జైలుకు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్స్టేషన్కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్గా పనిచేస్తున్న సందీప్రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పదండి అంటూ కిషోర్, సందీప్లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్స్టేషన్లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్లో ప్రత్యక్షం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్కు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది. అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది. -
పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు. -
టీచర్తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో నివాసం ఉండే తాటి పార్ధసారథికి స్వప్నతో వివాహం జరగగా వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్తో పరిచయం ఉంది. స్వప్న తల్లిగారి ఇంటి ప్రాంతంలో వెంకట విద్యాసాగర్ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి హెచ్చరించినా స్వప్న పట్టించుకోలేదు.ఈ క్రమంలోనే పార్ధసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి వస్తుండగా అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్కుమార్, శివశంకర్, ఏటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు.దీంతో, ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్ధసారథి కొత్తగూడెం వచ్చి మార్చి 31వ తేదీన సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్ధసారథి తన బైక్పై బయలుదేరాక స్వప్న వెంటనే వెంకట విద్యాసాగర్కు ఫోన్ చేసి తన భర్త వెళ్తున్న సమాచారం తెలిపింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్ధసారథిని వెంబడిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్తండా సమీపంలోకి చేరుకోగానే అడ్డగించి దారుణంగా హత్య చేశారు.ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్ను అరెస్ట్ చేయగా వినయ్కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఏడాది క్రితం పార్ధసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్టీం, డాగ్స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు. -
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్గౌడ్, హరీశ్గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్నగర్కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
విడాకులు ప్లీజ్
కర్ణాటక: అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడి జైలుపాలైన నటి, ఓ డీజీపీ దత్త కుమార్తె రన్య రావు కుటుంబంలో కలతలు తీవ్రమయ్యాయి. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త జతిన్ హుక్కేరి కోరుతున్నారు. ఈ మేరకు బెంగళూరు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. పెళ్లయినప్పటి నుంచి రన్య రావుతో సంసారం ఇబ్బందిగానే ఉందని ఆయన దూరంగా ఉంటున్నారు. ఇంతలో బంగారం స్మగ్లింగ్లో భార్య అరెస్టు కావడంతో ఇక కాపురం కుదరదని భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 6వ తేదీన బెంగళూరులో బాస్టిన్ రెస్టారెంట్లో రన్యా, జతిన్హుక్కేరి ఇద్దరూ ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా కలుసుకున్నారు. అలా పరిచయం పెరిగి పెళ్లి వరకూ వచ్చింది. అక్టోబరు 24వ తేదీన జతిన్, రన్య నిశి్చతార్థం జరిగింది. గత ఏడాది నవంబరు 27 తేదీన తాజ్వెస్ట్ ఎండ్హోటల్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది, ల్యావెల్లీ రోడ్డులోని ఖరీదైన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆది నుంచీ గొడవలు తరువాత నెలకే రన్య, జతిన్ మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటలు లేవని జతిన్ పిటిషన్లో ప్రస్తావించారు. బంధుమిత్రులు రాజీకి ప్రయతి్నంచినా ఫలితం లేదని తెలిసింది. ఆమె తరచూ దుబాయ్కు వెళ్లి వచ్చేది, దీనిని భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. మరోవైపు స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కేసుల్లో చిక్కుకుంది. -
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్మేట్తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. -
విశాఖ మధురవాడలో దారుణం
-
నాగర్కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. -
విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గతంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో జరిగిన మరో ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ప్రేమోన్మాది నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలు లక్ష్మి చెల్లి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు నవీన్ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. పెళ్లి చేస్తామని చెప్పిన కానీ దారుణంగా చంపాడు. కాళ్లు, చేతులు నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె అన్నారు. -
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో జాకెట్లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. -
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. #Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025 -
అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం
చిత్తూరు అర్బన్ : తీసుకున్న రూ.10 వేల అప్పుకు వడ్డీల మీద వడ్డీలు కట్టినా.. అవమానకరంగా మాట్లాడినందుకు ఓ మహిళ ఆత్మహత్యే శరణ్యంగా భావించింది. ఏకంగా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా స్థానికులు, పోలీసులు వచ్చి సకాలంలో ఆమెను రక్షించారు. ఆదివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన ప్రియాకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈమె భర్త కూలీ పనులు చేస్తుండగా ప్రియా ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమె తన పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టడానికి రాజా అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గానూ ప్రతివారం రూ.3 వేలు చొప్పున రెండు నెలలుగా చెల్లించారు. అయితే అది మొత్తం వడ్డీ కింద జమ చేసుకున్నారని, అసలు రూ.10 వేలు ఇచ్చి తీరాల్సిందేనంటూ రాజా అనే వ్యక్తి ఇటీవల బాధితురాలిని బెదిరించాడు. ఫోన్లో సైతం ఆమెను అసభ్యంగా తిడుతూ వేధించాడు. ఈ బాధలు, అవమానం భరించలేని ప్రియా.. ఆదివారం మధ్యాహ్నం మెసానిక్ మైదానం సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అటువైపుగా రైలు వచ్చేందుకు 15 నిముషాలు ఉందనగా, ప్రియాను గుర్తించిన జ్ఞానరాజ్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి పక్కకు లాక్కెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలను తెలుసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురిచేసిన రాజా అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.వివాహిత ఆత్మహత్య చిత్తూరు నగరంలో హేమలత (48) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన హేమలతకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాత్ రూమ్ కి వెళ్లి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెంకు చెందిన సాగర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. సాగర్కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో కార్తీక్, ఆకాష్ కవల పిల్లలు. కొద్ది రోజుల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలను లక్ష్మి తరచూ చిత్రహింసలకు గురిచేస్తోంది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని వారిని ప్రతీరోజు కొడుతూనే ఉండేది. ఈ క్రమంలో ఆదివారం దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తీక్ను గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు తల పగిలి అక్కడికక్కడేచనిపోయాడు. పెద్ద కుమారుడు ఆకాశ్ శరీరంపై రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. దీంతో, ఆకాశ్కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి మరణంతో లక్ష్మి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. లక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
తల్లి ఫోన్ మాట్లాడలేదనే వేదనతో..
అన్నానగర్: గుజరాత్కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది. ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. దంపతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
తమిళనాడు: తనకు వివాహమైనప్పటికీ స్నేహితుడి భార్యను తీసుకెళ్లి గుట్టుగా కాపురం చేస్తున్న వ్యక్తి చివరకు అనుమానాస్పద స్థితిలో శవమై వెలుగులోకి వచ్చాడు. అతడితో సహజీవనం చేస్తున్న స్నేహితుడి భార్య అదృశ్యం కావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కటైమేడు గ్రామానికి చెందిన గోకుల్(25) వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతడు ఆంబూరుకు చెందిన తన స్నేహితుడి భార్యను నాగర్కోయిల్కు తీసుకెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వ్యవహారం గోకుల్ భార్య తులసికి తెలియడంతో ఆమె ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తూండడంతో అప్పట్లో పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో గోకుల్ నివసిస్తున్న ఇంటి నుంచి గురువారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండడంతో దానిని పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గోకుల్ విగతజీవిగా ఉండటం గుర్తించారు. దీంతో వేలూరులోని అతని భార్యకు సమాచారమిచ్చారు. అయితే గోకుల్తో ఉన్న మహిళ ఏమైంది? గోకుల్ హత్యకు గురయ్యాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు. -
భర్త సంపాదన ప్రియుడిపాలు!
కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్ సైకిల్ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్ నోట్ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు. -
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
విజయనగరం: బిడ్డా.. చనిపోయేందుకే వచ్చావా.. ఎంతఘోరం జరిగిపోయింది.. అండగా ఉంటానని చెప్పి అందని లోకాలకు వెళ్లిపోయావా... అంటూ ఆ తల్లి రోదన అక్కడివారికి కన్నీరు తెప్పించింది. పొట్టకూటి కోసం తల్లికి తోడుగా వలసవెళ్లి రెండు నెలల తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన సీతంపేట మండలం దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.కాగుమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి (14) దోనుబాయి ఆశ్రమపాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కూలిపని కోసం విజయవాడకు వలస వెళ్లిన తల్లి లండమ్మకు తోడుగా వెళ్లిపోవడంతో ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. పరీక్షలని తెలియడంతో ఈ నెల 27న పాఠశాలకు వచ్చి ఎప్పటివలే విద్యార్థులతో కలసిమెలసి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఫలహారం అనంతరం పాఠశాల పై అంతస్తులో తన గదిలో బంకర్ బెడ్ మంచానికి ఊయల కట్టుకుని సరదాగా ఊగుతున్నాడు. ఈ క్రమంలో గట్టిగా ఊగడంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. మంచం కూడా విద్యార్థిపై పడి తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలా కారుతుండడాన్ని చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి భానుప్రతాప్తో పాటు వైద్యసిబ్బంది సేవలందించినా ఫలితం లేకపోయింది. తండ్రి భీముడు రెండేళ్ల కిందటే మృతిచెందాడు. ఇద్దరు అన్నదమ్ములు గణే‹Ù, ప్రసాద్ ఉన్నారు. ఎస్ఐ షేక్ మస్తాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికి తోడుగా వలస వెళ్లి... మృతుడి పెద్దఅన్నయ్యకు వివాహం కాగా, చిన్న అన్నయ్య నిరుద్యోగి. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనుల కోసం విజయవాడకు తల్లి బయలుదేరగా తోడుగా చలపతి వెళ్లాడు. ఐదు రోజుల కిందటే గ్రామానికి వచ్చారు. తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతాయని గురువారం పాఠశాలకు వెళ్లాడు. ఇంతలో బిడ్డ మృతి చెందాడన్న పిడుగులాంటి సమాచారం అందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.కుటుంబాన్ని ఆదుకుంటాం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతివార్త తెలుసుకున్న వెంటనే ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొరను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామపెద్దలు ఎస్.భాస్కరరావు, విజయ్, రవి తదితరులు పీఓను కోరారు. ముందుగా రుణ సౌకర్యం కలి్పంచి ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ, హెచ్ఎంలు ఎ.భాస్కరరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు. -
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
విజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నగరంలో మహిళ దారుణ హత్య
నిజామాబాద్ రూరల్: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ సురేష్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. కంఠేశ్వర్ బైపాస్ నుంచి దాస్నగర్ కెనాల్ కట్టవైపు వెళుతున్న ఓ కారు సిగ్నల్స్ వద్ద ఆపకపోవడంతోపాటు, కారు డిక్కీలోని కవర్ బయటకు కనబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు. మాక్లూర్ పోలీసులు కారును ఆపగా, డిక్కీలో మహిళ మృతదేహం ఉండటంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన బింగి కమల(46)గా గుర్తించారు. ముబారక్ నగర్కు చెందిన రాజేష్ వాళ్ల అమ్మకు అదేప్రాంతానికి చెందిన కమల చెడు వ్యసనాలు అలవాటు చేస్తోంది. దీంతో ఆగ్రహించిన రాజేష్ గురువారం కమలను కంఠేశ్వర్ బైపాస్ లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా రాజేష్ కమలను బండరాయితో మోదీ హత్య చేశాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కాలువలో పడేయడానికి కారు డిక్కీలో పెట్టి బయలుదేరాడు. మృతదే హానికి కప్పిన కవర్ బయటకు రావడం, సిగ్నల్స్ వద్ద కారు ఆపకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాంగ్రాలో మరో మహిళ..ఖలీల్వాడి: నగరంలోని పాంగ్రా కల్లుబట్టి సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. సీఐ శ్రీనివాసురాజు తెలిపిన వివరాలు ఇలా.. పాంగ్రా కల్లుబట్టి సమీపంలోని ఇంట్లో నివాసముంటున్న చంద్రకళ(50)కు తన కూతురు మౌనిక నాలుగు రోజులుగా ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మౌనిక శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా చంద్రకళ హత్యకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు, ఈనెల 23న ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారురు. పోలీసులు పలువురు యువకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
పుట్టినరోజు నాడే ప్రాణం తీశారు
సాక్షి, పెద్దపల్లి: కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (20), అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు యువతి తండ్రి ముత్యం సదయ్య అడ్డుచెప్పాడు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసిన సాయికుమర్ను ఇకపై తన కూతురితో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అయినా యువతీయువకులు తరచూ మాట్లాడుకోవడంతోపాటు గురువారం ఉదయం కలిసే సాయికుమార్ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో రగిలిపోయిన యువతి తండ్రి ముత్యం సదయ్య గురువారం రాత్రి 10 గంటలకు సాయికుమార్ను గొడ్డలితో నరికి చంపాడు. పుట్టినరోజు వేడుకల్లోనే.. పెద్దపల్లిలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని సాయికుమార్ గురువారం కలిశాడు. ఆమెతో కలిసి బర్త్డే వేడుకలు చేసుకున్నాడు. రాత్రికి గ్రామంలో నలుగురు స్నేహితులు పూరెల్ల అఖిల్, చిలుమల హన్సిక్, కామెర అభిషేక్, చెవుల రాకేశ్తో కలిసి కేక్ కట్ చేశాడు. ఆపై స్నేహితులంతా మద్యం తాగేందుకు సిద్ధమయ్యారు. స్నాక్స్ కోసం రాకేశ్, అభిషేక్ కిరాణా దుకాణానికి వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయికుమార్పై దాడి చేశాడు. సాయికుమార్ ప్రాణభయంతో పరుగులు తీసినా సుమారు 200 మీటర్లు వెంటాడి గొడ్డలితో వేటు వేశాడు. ఈ క్రమంలో స్నేహితుడు అఖిల్ సదయ్యను అడ్డుకొని అతన్నుంచి గొడ్డలిని లాక్కున్నాడు.రక్తపుమడుగులో సాయికుమార్ కొట్టుమిట్టాడుతుండటంతో సదయ్య అక్కడి నుంచి నుంచి పారిపోయాడు. దాడి విషయాన్ని స్నేహితులు సాయికుమార్ తండ్రి పర్శరాములుకు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్ను సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం పోస్ట్మార్టం అనంతరం ముప్పిరితోటలో అంత్యక్రియలు నిర్వహించారు. పర్శరాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదయ్య కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితుడు జూలిపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడని సమాచారం. సదయ్యగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఓ వీడియో క్లిప్ వైరల్గా మారింది.వెంటాడిన మృత్యువు..గురువారం తెల్లవారుజామున బాబాయ్ భరత్కు కిడ్నీలో నొప్పి వస్తోందని చెప్పడంతో సాయికుమార్ ఆయన్ను తీసుకొని కారులో కరీంనగర్ ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గమధ్యలో దుబ్బపల్లి వద్ద కారు బోల్తాపడి రెండు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో భరత్కు స్వల్ప గాయాలవగా సాయికుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ రాత్రికి మాత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సాయికుమార్ చెల్లెలు 2016లో డెంగీతో మరణించగా ప్రస్తుతం కొడుకు సైతం మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.పథకం ప్రకారమే హత్య.. నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా ప్రే మించుకుంటున్నారు. దీంతో మాకు టుంబాల మధ్య గొడవలయ్యాయి. నా కొడుకును చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి గతేడాది ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశా. యువతి తల్లితో హరీశ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని నా కొడుకు చూశాడు. ఇది అందరికీ చెబుతా డనే భయంతో హరీశ్, యువతి తల్లిదండ్రులతో కలిసి చంపినట్లు అనుమానంగా ఉంది. – పర్శరాములు, మృతుడి తండ్రి -
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ అనే యువకుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరతోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. దీంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. -
భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్పూర్కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత!
సంగారెడ్డి, సాక్షి: బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటిదాకా సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు.. అభం శుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రిలోనే తుదిశ్వాస విడిచారు. అమీన్ పూర్(Ameenpur) మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. భార్యా, ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Wife Rajitha) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భర్త చెన్నయ్య చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారని నిర్ధారించుకున్నారు. సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8)గా పేర్లను ప్రకటించారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.కాగా, ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషం ఇచ్చి చంపారన్న విషయం ధృవీకరణ కాలేదని.. కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి రజిత ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎస్పీ.. ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
నాగర్ కర్నూల్: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని రామంతాపూర్కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్, యశిత్..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్పేట్లోని పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు. -
భర్త దూరపు బంధువుతో భార్య వివాహేతర సంబంధం..!
కర్ణాటక: వివాహేతర సంబంధం వద్దని దండించిన భర్తను, ప్రియునితో కలిసి హతమార్చిందో భార్య. ఈ కేసులో భార్యతో పాటు ప్రియునికి జీవితఖైదును విధిస్తూ హోసూరు కోర్టు జడ్జి సంతోష్ తీర్పు చెప్పారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37), పికప్ వాహన డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రైతుల పొలాల నుంచి కాయగూలను వాహనంలో మార్కెట్కు తీసుకెళ్లేవాడు. తనకు తోడుగా దూరపు బంధువైన మంచుగిరి గ్రామవాసి తంగమణి (24)ను తోడుగా తీసుకెళ్లేవాడు. తంగమణి తరచూ అయ్యప్ప ఇంటికెళ్లి వస్తుండేవాడు. హత్య చేసి నాటకం ఈ నేపథ్యంలో అయ్యప్ప భార్య రూప (29)తో తంగమణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకొన్న అయ్యప్ప భార్యను నిలదీశాడు. దీంతో అయ్యప్పను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర చేశారు. 2021 అక్టోబరు 21వ తేదీన ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్న అయ్యప్పను గొంతుకోసి చంపారు. మత్తులో తానే గొంతు కోసుకొని చనిపోయాడని భార్య నాటకమాడింది. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు తీవ్ర విచారణ జరుపగా అయ్యప్ప భార్య, ప్రియుని బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నేరం రుజువు కావడంతో మంగళవారం సాయంత్రం జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. -
హౌ టు కిల్ పుస్తకం చదివి.. అల్లుడిని చంపిన అత్త
యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది. గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ మృతి
బెంగళూరు: బైక్పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్తో కలిసి బైక్పై కుణిగల్ రైల్వేస్టేషన్కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమెపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్లు పంపేవాడు. శంషాబాద్లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్మెయిల్కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. జూన్ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్మేకర్తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఫ్రంట్ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడి నుంచి సరూర్నగర్లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్లో చుట్టి సరూర్నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంట్తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసు(Apsara Case)లో సంచలన తీర్పు వెలువడింది. సాయికృష్ణను దోషిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాల అదనపు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. 2023 జూన్లో శంషాబాద్లో జరిగిన అప్సర హత్య కేసు సంచలనం సృష్టించింది. సరూర్ నగర్లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయికృష్ణ(Sai Krishna)కు.. అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వాళ్ల బంధం కొనసాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలంటూ ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే.. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను పక్కా ప్రణాళిక వేసి సాయికృష్ణ హతమార్చాడు. ఆపై శంషాబాద్ నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి.. మ్యాన్హోల్లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల పేరుతో.. చెన్నైకి చెందిన అప్సర కుటుంబం.. హైదారాబాద్కు వలస వచ్చింది. అప్పటికే అప్సర డైవోర్సీ. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర గుడిలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. శంషాబాద్లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్గా భావించి అప్సరను శంషాబాద్ వైపు తీసుకెళ్లి హత్య చేశాడు. -
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వివాహిత ఆత్మహత్య
-
ఆదిలక్ష్మిని అతి కిరాతకంగా చంపిన ప్రియుడు..
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జానపాడు గ్రామానికి చెందిన తాటి కొండలు, తాటి ఆదిలక్ష్మి(30)లు భార్యాభర్తలు. నిత్యం పని నిమిత్తం పిడుగురాళ్ల పట్టణంలోని సున్నపు బట్టీలకు వస్తుంటారు. ఈ క్రమంలో వేముల ఏడుకొండలు అనే బట్టీ మేస్త్రీతో ఆదిలక్ష్మికి పరిచయమేర్పడింది. దీంతో ఆదిలక్ష్మి కొండలను వదిలిపెట్టి ఐదేళ్లుగా పిడుగురాళ్ల పట్టణంలో పిల్లలతో పాటు ఏడుకొండలుతో సహజీవనం సాగిస్తోంది.ఆదిలక్ష్మి డ్వాక్రా ద్వారా రూ.3 లక్షలు తీసుకుందని, ఆ డబ్బుల విషయంలో ఆదిలక్ష్మికి, ఏడుకొండలకు తరచూ గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. రోజులాగే పిల్లలిద్దరూ వారి అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం రక్తంతో ఉంది. వెంటనే పిల్లలు వారి అమ్మమ్మకు విషయం చెప్పడంతో అమ్మమ్మతో పాటు చుట్టుపక్కల బంధువులు వచ్చి చూడగా.. ఇంటి నుంచి దారి పొడవునా రక్తపు మరకలు కనిపించాయి.సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రక్తపు మరకలను చూసుకుంటూ వెళ్లగా కొత్తగా కడుతున్న స్కూల్ సమీపంలోని క్వారీ వద్ద తాళిబొట్టు, రక్తపు మరకలు కనిపించాయి. వారు వెంటనే క్వారీలోకి దిగి వెతకగా ఆదిలక్ష్మి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు ఏడుకొండలు ఉన్నట్టు తెలిసింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ఫోన్ రిపేర్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుకుపడుతోంది. -
మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్త చేతుల మీదుగా.. అల్లుడి హత్య
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని మోహించి పెళ్లాడాడు, కానీ అక్కడితో తన బతుకు అంతమవుతుందని ఊహించలేకపోయాడు. హెసరఘట్ట వద్ద బీజీఎస్ లేఔట్లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లోకనాథ్ సింగ్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.డిసెంబరులో వివాహం...పోలీసుల కథనం మేరకు... మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలక్రిష్ణకు సన్నిహితునిగా లోకనాథ్ సింగ్కు పేరుంది. 22న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. లోకనాథ్ భార్య తల్లి (అత్త) స్వయంగా అల్లున్ని హత్య చేయించిందని తెలిసింది. గత డిసెంబర్లో లోకనాథ్ ఒక యువతిని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇష్టం లేకపోయినా, ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కానీ అల్లునిపై పగ పెంచుకున్నారు. అనుకున్న ప్రకారం శనివారం బీజీఎస్ లేఔట్కు లోకనాథ్తో పాటు భార్య, అత్త వచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడంలో భార్యతో కలిసి లోకనాథ్ మద్యం తాగాడు. లోకనాథ్తో వచ్చిన గన్మ్యాన్ను అత్త ఏదో సాకుతో పంపించేసింది. లోకనాథ్కు భోజనంలో మత్తు మందిచ్చింది. అతి తినగానే మద్యం, మత్తు ప్రభావం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. అత్త పదునైన కత్తితో అల్లున్ని గొంతుకోసి ప్రాణాలు తీసింది. తరువాత తల్లీ కూతురు ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరో స్నేహితులు హత్య చేసినట్టు నాటకం ఆడారు. పోలీసులు తల్లి, కుమార్తెను అరెస్టు చేశారు. -
శంకర్-దివ్య విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే.. .. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది. భారత్కు వచ్చిన దివ్యఅమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.దివ్య ఏమన్నారంటే..ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు. English Translation of @myprasanna 's video:"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. -
అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
నంద్యాల: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
భర్తను చంపేందుకు తార్ కార్తో ఢీకొట్టి..
మునిపల్లి(అందోల్): కట్టుకున్న భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర చేసిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన భర్త తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... పెద్దగోపులారం గ్రామానికి చెందిన కొమిశెట్టిపల్లి రవి ఝరాసంగం మండలంలోని దేవరాంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 22న బైక్పై వెళ్లి విధులు నిర్వహించుకొని బుదేరా నుంచి గోపులారానికి వస్తున్న క్రమంలో నల్ల రంగు తార్ కార్తో రవిబైక్ను ఢీకొట్టి వెళ్లిపోయారు. బైక్పై నుంచి కిందడిన రవి అప్రమత్తమై తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ డిటేల్స్ ద్వారా నేరస్తులను గుర్తించారు. హత్య చేయడానికి గల ముఖ్య కారణం రవి భార్య హరితనే తేల్చారు. హరిత సంగారెడ్డికి చెందిన మిర్దొడ్డి సాయి ప్రదీప్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకొని ప్రియుడుతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో ఏ1గా హరిత, ఏ2 మిరుదొడ్డి సాయి ప్రదీప్, ఏ3 దాసోజీ సాయికిరణ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి జైలుకు పంపించారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్ఐ ఎం. రాజేశ్ నాయక్, కానిస్టేబుల్స్ పాండు, తుకారాం, హనీఫ్, సునీల్లను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. -
Hyderabad: కారుతో ఢీ కొట్టి.. గొడ్డళ్లతో నరికి
నాగోలు: పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టి అతడు కింద పడిన తర్వాత గొడ్డళ్లు, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బోడ్డు మహేష్(31) పాత నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అదే ప్రాంతంలో ఉన్న పగిళ్ల పురుషోత్తం మహేష్కు స్నేహితుడు. రెండేళ్ల క్రితం హయత్నగర్లో పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో మహేష్ పురుషోత్తంపై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే స్నేహితులు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒప్పించారు. రాజీ పడేందుకు మహేష్ గత డిసెంబర్ 20న హయత్నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే అతను కోర్టు హాజరుకాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్కు చెప్పి పురుషోత్తంను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అదే రోజు కొత్తపేట– నాగోలు రోడ్డులో అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నట్లు సమాచారం అందడంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్తో కలిసి అతడిపై వేట కొడవలితో దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దాడికి పాల్పడిన మహేష్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్కుమార్, పరుశురాంలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇటీవలే మహేష్ అతని స్నేహితులు జైలు నుండి బయటికి వచ్చారు. అయితే మహే‹Ùపై కక్ష పెంచుకున్న పురుషోత్తం అతని స్నేహితులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు. మాటు వేసి..దాడి చేసి.. శనివారం రాత్రి మహేష్ తన స్నేహితుడితో కలిసి బైక్పై ఎల్బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి నిందితులు కారుతో మహేష్ బైక్ను ఢీ కొట్టారు. కింద పడిన అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వారు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్ల, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. మహేష్ వెంట ఉన్న స్నేహితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ను కామినేని హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్ తలపై నిందితులు గొడ్డలితో నరకడంతో గొడ్డలి తలలోనే ఇరుక్కు పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. పోలీసుల అదుపులో నిందితులు... మహేష్ ను హత్య చేసిన నిందితులు పురుషోత్తం, భరత్నగర్కు చెందిన సందీప్, నాగార్జున, రాములను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్పోర్ట్లో దారుణం: పెంపుడు కుక్కను చంపేసి.. విమానం ఎక్కేసింది
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్గా ఎయిర్పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు. -
మేము ఇద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!
ఉత్తర ప్రదేశ్ మీరట్కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలియజేశారు.మాకు లాయర్ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు. -
ఇంకెవ్వరికీ ఇలా జరగొద్దు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): ‘మా కుటుంబం తరపున అందరికీ ఒక విన్నపం.. ప్లీజ్.. మా చెల్లికి జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకుండా చూడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. దయచేసి మీ ఇంట్లో వారికి ఏ చిన్న జ్వరం వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి దయచేసి..’అంటూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో ఒక కుటుంబం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. నర్సింగ్పల్లికి చెందిన ఎల్లుల్ల స్ఫూర్తి (21)తోపాటు ఆమె తల్లి స్వప్న ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. స్వప్న కోలుకుంది. స్ఫూర్తికి మాత్రం డెంగీ కారణంగా రోజురోజుకూ ప్లేట్లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. స్ఫూర్తి శనివారం కన్నుమూసింది. తమ కుటుంబానికి కలిగిన విషాదం ఇంకెవ్వరికీ రావొద్దని కోరుతూ.. స్ఫూర్తి కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
పరీక్ష రాసి వస్తూ.. పైలోకాలకు..
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదో తరగతి పరీక్ష రాసి సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో విద్యారి్థని మృతి చెందింది. ఆమె సోదరుడు గాయాల పాలయ్యాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉంటున్న పెనుదాస్ చత్రియా, సబితా చత్రియా దంపతులకు కుమారుడు సుమన్ చత్రియా, కుమార్తె ప్రభాతి చత్రియా (16) ఉన్నారు. ప్రభాతి చత్రియా రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ«శాలలో ఆమె పదో తరగతి పరీక్షలు రాస్తోంది. శనివారం ఆమె పరీక్ష రాసిన అనంతరం సోదరుడు సుమన్ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో గచ్చిబౌలి ప్లైఓవర్పైకి రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుమన్ ఎడమ వైపు పడిపోగా ప్రభాతి కుడివైపు పడిపోయింది. బస్సు వెనుక చక్రం ప్రభాతి పైనుంచి వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.సుమన్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభాతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్పై ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ప్రభాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. -
నాన్నా.. నేనేం నేరం చేశాను..!
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. -
మేనరికం పెళ్లి .. భార్యను ముట్టుకోని భర్త..!
మహబూబ్నగర్ క్రైం: భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. వివరాలు.. మండలంలోని పేరపల్ల సమీపంలోని డ్రైవర్ గోపితండాకు చెందిన శారు రాథోడ్ (20)ను సమీపంలోని రెడ్యానాయక్ తండాకు చెందిన మేనత్త కొడుకు వినోద్నాయక్కు ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాయి నిర్ణయించాయి. మేనరికం పెళ్లి ఇష్టం లేకపోయినా వినోద్నాయక్ పెద్దల మాటకు అడ్డు చెప్పకుండా జనవరి 21న వివాహం చేసుకున్నాడు. గడిచిన ఈ రెండు నెలల నుంచి భార్యకు దూరంగానే ఉంటూ తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మరోసారి భార్యతో గొడవ పెట్టుకొని ఆమెను కొట్టాడు. కుటుంబ సభ్యులు కలుగజేసుకొని వినోద్ను బయటికి పంపించారు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి గొడవ పెట్టుకొని ఆమె గొంతును నులిమి చంపాడు.అనంతరం నేరం తన మీదుకు రాకుండా ఉండేందుకు అందరిని నమ్మించడానికి పురుగుమందు తాగించి, చీరతో ఉరి వేసే ప్రయత్నం చేశాడు. అది విఫలం కావడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లతో కలిసి విచారణ జరిపారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్ తరలించారు. -
భార్యను కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం..
అన్నమయ్య: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తతో పాటు అత్తా, మామ, ఆడపడచు వేధిస్తున్నారని లలితమ్మ అనే బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన కోనకుంట రాయుడు కుమార్తె లలితమ్మకు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని గ్యాదోల్లపల్లికి చెందిన బంగారప్ప కుమారుడు క్రాంతి కుమార్తో నాలుగేళ్ళ కితం వివాహమైది. మూడేళ్ళ పాటు ఈ దంపతుల జీవనం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం కాగా ఇటీవల మరో కుమార్తె జన్మనిచ్చింది. అయితే గత ఏడాది నుంచి తనను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మహిళతో గుట్టుగా అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ లలితమ్మ భర్తపై నెల రోజుల క్రితం పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో పోలీసులు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ తరుణంలో తన భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు బి.కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో లలితమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు. తన భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, కట్టుకున్న భార్యతో పాటు పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అత్తామామ, ఆడ పడచుతో పాటు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లలితమ్మ పేర్కొంది. ఈ విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ లలితమ్మ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నామని తెలిపారు. -
ఇంకా పచ్చని పందిరి తీయలేదు..ఇంతలోనే విషాదం
సత్తుపల్లిటౌన్/రూరల్: ఇంకా పచ్చని పందిరి తీయలేదు.. భాజాభజంత్రీల శబ్దం చెవులను వీడలేదు.. ఇంతలోనే నూతన వధూవరులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వధువు తల్లి మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లికి చెందిన వ్యాపారి అడపా రాజేంద్రప్రసాద్ – పుష్పావతి ఏకైక కుమార్తె హర్షిణి వివాహం ఈనెల 16న జరిగింది.నూతన వధూవరులతో కలిసి అందరూ అశ్వారావుపేట సమీపాన శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లారు. ఆతర్వాత నూతన దంపతులను జంగారెడ్డిగూడెంలోని అత్తగారి ఇంటికి సాగనంపి.. హర్షిణి తల్లిదండ్రులు పుష్పావతి(55), రాజేంద్రప్రసాద్ కారులో సత్తుపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమాన బేతుపల్లి సమీపంలో వీరి కారు – ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుష్పావతి, రాజేంద్రప్రసాద్కు గాయాలు కాగా 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేసరికి పుష్పావతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ విషయం తెలియడంతో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన హర్షిణి తల్లి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పలువురు వ్యాపారులు, స్థానికులు సైతం పుష్పావతి మృతదేహం వద్ద నివాలులరి్పంచారు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ విషాదాలు
-
ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Political Honey Trap: 20 ఏళ్లుగా ‘వలపు వల’లో రాజకీయ నేతలు!
బెంగళూరు: కన్నడనాట పొలిటికల్ హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం కలకలం రేగింది. మంత్రులు సహా అనేకమంది నేతలు వలపు వల విసిరారని.. అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఉన్నత న్యాయస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించుకుంది. తనపై రెండుసార్లు హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార, విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయన. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరు(King Ping) ఉన్నారనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజన్న సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. హనీ ట్రాప్ ఆరోపణలపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర సభలో స్పందించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. మంత్రివర్గంలోని ఒక సీని యర్ సహచరుడిపై హానీ ట్రాప్ ప్రయత్నాలు జరిగి నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.బుధవారం రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వీ సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హనీ ట్రాప్ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను ఓడించలేక అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మాట్లాడుతూ... రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారని, ఇందులో భాగంగా హనీ ట్రాప్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. గత వారం తుమకూరు(Tumakuru)కు చెందిన ఓ బీజేపీ నేతపై జరిగిన హనీ ట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్ప స్వామి అనే నేతకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పోలీసులను ఆశ్రయించగా.. ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
Hyderabad: లక్కీ భాస్కర్ కాదు ఇక్కడ .. మగ్గం వర్క్ ఆదిలక్ష్మి ..!
హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ.. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం. పలు కేసుల్లో నిందితురాలు.. తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్స్టేషన్లో 2 కేసులు, మరోస్టేషన్లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించడం లేదు.. సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది. -
‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’.. చిన్నారి వ్యాఖ్యలపై నాన్నమ్మ ఆవేదన
మీరట్: ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ వెలుగుచూసింది. భర్త హత్య అనంతరం.. ప్రియుడితో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో మృతుడి కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ హత్యను ఆమె చూసి ఉండవచ్చని తెలుస్తోంది.మీరట్కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని సమాచారం. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి తల్లి ఈ విషయాలను వెల్లడించారు. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని ఆ చిన్నారి పొరుగింటి వారికి పదే పదే చెప్పడం గమనించిన ముస్కాన్ బాలికను వేరే చోటుకు పంపించేసింది’ అని సౌరభ్ తల్లి రేణు దేవీ ఆవేదన వ్యక్తంచేశారు.సౌరభ్ తల్లి రేణు దేవీ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు సౌరభ్ను అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్కు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారు ఉంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న డ్రమ్మును వారు పైకి ఎత్తలేకపోయారు. దీంతో, లోపల ఏముందని అడిగితే చెత్తాచెదారం అని ముస్కాన్ చెప్పిందట. అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.#WATCH | Meerut, UP | Saurabh Rajput Murder case | Mother of deceased Saurabh Rajput says, "They (Muskan and her partner Sahil) murdered my son, and after that she went for a trip...She locked the body in the room...the owner of the house had asked them (Saurabh and Muskan) to… https://t.co/QyeUSKIwcu pic.twitter.com/hgs3tLfMsk— ANI (@ANI) March 19, 2025అయితే, పోలీసులు వచ్చేలోపే మా కోడలు అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మా ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుంది. చిన్న పాప పదే పదే.. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ పొరుగింటి వారికి చెప్పింది. అది గమనించిన ముస్కాన్.. పాపను వేరే చోటకు పంపించేసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.డ్రమ్ములో మృతదేహం..సౌరభ్ రాజ్పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్కు సాహిల్(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టిన రోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.మా కుమార్తెను ఉరితీయండి..!నిందితులు ముస్కాన్, సాహిల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. -
ప్లాట్ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి..
నంద్యాల జిల్లా: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
పార్వతీపురం మన్యం: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటరీ్మడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. నీలగిరి తోటలు దగ్ధంవేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
పోలీసులే దొంగను నిద్రలేపారు
కర్ణాటక: అర్థరాత్రి వేళ ఇంటి చోరీకి వచ్చిన దొంగ ఆరవేసిన టవల్, పంచను చోరీ చేసి పక్కింటి మీద నిద్రించగా, మంగళవారం ఉదయం పోలీసులు అతనిని నిద్రలేపి ఠాణాకు తీసుకెళ్లారు. నవ్వు పుట్టించే ఈ తమాషా సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. నగర శివార్లలోని సోమినకొప్ప టీచర్స్ కాలనీలో కుమార్ అనే వ్యక్తి ఇంటి పై అంతస్తులోకి ఓ యువ దొంగ చొరబడ్డాడు. అక్కడ ఉన్న బీరువాను తెరిచి చూడగా అందులో ఏమీ దొరకలేదు. టవల్, పంచ తదితర దుస్తులను తీసుకుని పక్కింటి మిద్దైపెన వాటిని పరచుకుని నిద్రించాడు. తెల్లవారగానే కుమార్ ఇంటి పైభాగంలో ఆరవేసిన దుస్తుల కోసం రాగా, గది తలుపులు, బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు, వెంటనే పోలీసులు వచ్చి చూడగా పక్కింటిపై నిద్రిస్తున్న దొంగ కనిపించాడు. వినోబానగర ఎస్ఐ సునీల్, సిబ్బంది ఆ దొంగను నిద్ర లేపి పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
నా చావుకు భార్య, అత్తమామలే కారణం..!
నిర్మల్: ‘నా చావుకు భార్య, అత్తమామలే కారణం.. నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి..’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాండ్రపు అంజన్న(26) కాసిపేటకు చెందిన శిరీషను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వారం రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో సోమవారం కూతురిని చూడడానికి అంజన్న కాసిపేటకు వెళ్లగా.. భార్య, అత్తమామలు దూషించారు. దీంతో ఆవేదనకు గురైన అంజన్న ఇంటికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు కారకులు అంటూ భార్య, అత్తమామలు, పెద్దమనుషులు పలువురి పేర్లు పేర్కొన్నాడు. రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. -
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా బుజ్జమ్మ..!
నారాయణపేట రూరల్: తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాయితో మోది హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జలాల్పూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అలియాస్ వెంకటమ్మ(36)కు 15 ఏళ్ల క్రి తం కర్ణాటక రాష్ట్రం నస్లైకి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయి తల్లి వారింట్లో ఉంటోంది. జీవనోపాధి కోసం పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసే పనిచేస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇరువురి ప్రవర్తనపై అను మానం వచ్చిన మొగులప్ప భార్య లక్ష్మి గతంలో పలుమార్లు బుజ్జమ్మతో గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య ఎన్నోసార్లు గొడవలు, దాడులు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు లక్ష్మి ఆవేశంగా వెళ్లింది. ఇది గమనించిన బుజ్జమ్మ తనపై దాడి చేయడానికి వస్తుందని ఉపాధి హామీ మేటికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, నర్సరీ గేటుకు తాళం వేసుకుంది. అయినప్పటికీ లక్ష్మి ముళ్లపొదలను దాటు కుంటూ లోపలికి వెళ్లి రాయితో బలంగా బుజ్జమ్మ తలపై మోదడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు నందిపాటి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్కు చెందిన షేక్ మహ్మద్బాబా, వెంగళరావ్నగర్కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్నగర్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి
అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్జెండర్ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.దీపు అనే ట్రాన్స్జెండర్ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్షీట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వాడిని అప్పగించండితమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయ్యో.. పాపంకశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు. అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్జెండర్గా తేలింది. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. అనకాపల్లిలో మహిళ దారుణ హత్య -
కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి
సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. -
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం!
హైదరాబాద్: యూట్యూబర్లు, పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిసున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వాళ్ల సంపాదన, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఆరా తీసిన ఈడీ.. వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్ఫాలో చేయండి -
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
రామచంద్రపురం రూరల్/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపాన కన్న తండ్రే తన బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన ఘటన సోమవారం జరిగింది. బంధువులు, ద్రాక్షారామ పోలీసుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు గృహోపకరణాలను వాయిదాలపై అందించే వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి ఒక వ్యక్తి రూ.30 లక్షలు బాకీ పడ్డాడు. మరోవైపు అప్పులు అధికంగా ఉండడంతో ‘‘అందరం కలిసి చనిపోదామని’’ భార్య విజయతో తరచూ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బావమరిది సురేంద్ర కొంత ఆర్థిక సాయం చేశాడు. అయినా సరే చనిపోదామనే రాజు అంటూండేవాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి అప్పులు తీరుద్దామని విజయ చెబితే పరువు పోతుందని అనేవాడు. పిల్లలను నమ్మించి.. రాజు కుమారుడు రామసందీప్ (10), కారుణ్యశ్రీ (6) రామచంద్రపురంలోని భాష్యం స్కూలులో నాలుగు, ఒకటో తరగతులు చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లి పిల్లలను బైక్పై ఎక్కించుకున్న రాజు.. ఇంటికి కాకుండా, వెంటూరు నుంచి కాలువ గట్టు మీదుగా నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపాన ఉన్న పంట కాలువ వద్దకు తీసుకెళ్లాడు. గట్టుపై దాదాపు 350 మీటర్ల దూరం వెళ్లాక పిల్లలను హఠాత్తుగా కాలువలోకి తోసేశాడు. సుడిలో చిక్కుకుని కారుణ్యశ్రీ గల్లంతవగా.. కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని వేలాడి సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడు బయటకు వచి్చ, అటుగా వెళ్తున్నవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ ఎం.లక్ష్మణ్ ఫైర్ సిబ్బందిని రప్పించి, గాలింపు చేపట్టగా సాయంత్రానికి కారుణ్యశ్రీ మృతదేహం లభ్యమైంది. తల్లి విజయ, అమ్మమ్మ, మావయ్య ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, పిల్లలను కాలువలోకి నెట్టేశాక రాజు బైక్పై పరారైనట్లు సమాచారం. అతడి ఆచూకీ లేకపోవడంతో భార్య విజయ, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’ రోజూ మాదిరిగానే తండ్రి రాజు తమను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడని చిన్నారులు భావించారు. అయితే, దారి మారడాన్ని గమనించిన కుమారుడు సందీప్ ‘నాన్నా ఎక్కడకు వెళ్తున్నాం?’ అని ప్రశ్నించగా.. ‘అప్పులున్నాయి. మనం చనిపోదాం’ అని రాజు చెప్పాడు. ‘నాన్నా చంపొద్దు ప్లీజ్’ అంటూ సందీప్ భయంతో ఏడుస్తూ వేడుకున్నా రాజు వినలేదు. కాగా, చెల్లెలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కుతుకులూరులో ఉండే సురేంద్ర ఆదివారం తమ ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మవారి జాతరలో కారుణ్యశ్రీతో దుస్తులు, గాజులు పెట్టించాడు. ఇంతలోనే ఇలా జరగడంతో సురేంద్ర తీవ్రంగా కలత చెందాడు. -
తల్లి శవంతో నెల రోజులుగా ఇంట్లోనే..
కడప కల్చరల్ : కడప నగరం శాటిలైట్సిటీ వద్దగల ఇంట్లో నెల రోజుల క్రితం ఓ వృద్దురాలు మరణించింది. ఆమెకు పెళ్లికాని 45–55 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు కుమారులు మినహా ఇంకెవరూ లేరు. ఆమెకు వచ్చే పెన్షన్తోపాటు అక్కడ, ఇక్కడ చిన్న చితకా పనులు చేసి వారిని పోషించేది. నెల కిందట ఆమె మరణించింది. ఈ విషయం బయట ఎవరికీ తెలియదు. ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. తల్లి మరణించినా కూడా శవంతోపాటు అక్కడే ఉండిపోయారు. ఒక కుమారుడు మూడు రోజుల తర్వాత ఉరి వేసుకుని మరణించాడు. దుర్వాసన రావడంతో ఆ ప్రాంతీయులు పోలీసుల ద్వారా ఇంటిని పరిశీలించగా విషయం తెలిసింది. మున్సిపల్ సిబ్బంది ద్వారా మృతదేహాలను ఖననం చేయించారు. మిగిలిన పెద్ద కుమారుడు జనార్దన్ ఇల్లు వదిలి బయటే తిరుగుతూ ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఒకరు పోరుమామిళ్లలోగల శ్రీ వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు పాపిజెన్ని రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. ఆయన తన బృందంతో వచ్చి కడప నగరం చెన్నూరు బస్టాండులో ఉండిన జనార్దన్ను వెతికి పట్టుకుని తన ఆశ్రమానికి తరలించారు. మొదట ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించలేదు. మొత్తానికి ఆయనను ఒప్పించి ప్రత్యేక వాహనంలో ఆశ్రమానికి తీసుకెళ్లారు. మానసిక వైద్యం చేయించి శుభ్రంగా తీర్చిదిద్దారు. జనార్దన్ ప్రస్తుతం వ్యక్తులను గుర్తు పెట్టి మాట్లాడే స్థితికి వచ్చాడు. ఈ అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
అన్నానగర్: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్ షాక్కు గురయ్యాడు. ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో భూపాలన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆరీ్టఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు. -
ఎల్ఐసీ ఏజెంట్ రెండో పెళ్లి.. నువ్వంటే ఇష్టం లేదు..!
అన్నానగర్: రాజామంగళం సమీపం ఎల్ఐసీ ఏజెంట్ ఇంట్లో వరుడుని చూడటానికి వచ్చినట్లు నటించి, 8 తులాల నగలు అపహరించిన ఘట వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా రాజామంగళం ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అభిప్రాయ బేధాల కారణంగా ఆరేళ్ల కిందట భార్య అతడితో విడిపోయింది.ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అతనిని చూసుకోవడానికి ఎల్ఐ సీ ఏజెంట్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూసి మధురై చెందిన మురుగేశ్వరి అనే మహిళ ఎల్ఐసీ ఏజెంట్ని సంప్రదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా చూడబోతున్నట్లు కూడా తెలిపింది. మురుగేశ్వరి, అతని చెల్లెలు కార్తిగైయాయిని(28), ముత్తులక్షి్మ(45), పోదుమ్ పొన్ను (43) ఎల్ఐసీ ఏజెంట్ ఇంటికి వచ్చారు.అక్కడ ఎల్ఐసీ ఏజెంట్తోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకుంటే ఎల్ఐసీ ఏజెంట్ 8 తులాల బంగారు గాజులు, ఉంగరాలు లాంటి నగలను అమ్మాయికి ఇస్తామని తెలిపాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలు దీన్ని నిశితంగా గమనించారు. దీంతో ఎల్ఐసీ ఆ నగలను టేబుల్ డ్రాయర్లో ఉంచి వచ్చిన వారిని గమనించడంలో నిమగ్నం అయ్యా డు. వరుడిని చూసేందుకు వచ్చిన నలుగురు మహిళలు రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎల్ఐసీ ఏజెంట్ టేబుల్పై ఉన్న నగలను పరిశీలించగా అవి కనిపించలేదు. దీంతో షాక్కు గురైన అతను తన కొడుకు, కుమార్తెకు సమాచారం ఇచ్చాడు.వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలే చోరీ చేసి ఉంటారని ఎల్ఐసీ ఎజెంట్ అనుమానించి వెంటనే మురుగేశ్వరిని సెల్ఫోన్లో సంప్రదించగా అది స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత మురుగేశ్వరితో పాటు వచ్చిన మరో అమ్మాయికి ఫోన్ చేయగా.. నువ్వంటే ఇష్టం లేదని అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఆభరణాల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఎల్ఐసీ ఏజెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధురైకి చెందిన నలుగురు మహిళలను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నగలు చోరీ చేసినట్లు తేలింది. అనంతరం మురుగేశ్వరి, కార్తిగైయాయిని, ముత్తులక్షి్మ, పోదుమ్ పొన్ను అనే నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. -
నేడు కోర్టు ముందుకు కొత్త హరిబాబు?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం.. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో మరో ఇద్దరు..? కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. -
ఐదు నెలల చిన్నారిని తల్లే చిదిమేసింది..
ఆరిలోవ(విశాఖ): భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరిలోవ సీఐ కథనం ప్రకారం జీవీఎంసీ 12వ వార్డు పరి«ధి పెదగదిలి దరి సింహగిరి కాలనీకి చెందిన గొర్లె వెంకటరమణకు శిరీషతో 2013లో వివాహమైంది. వెంకటరమణ ఏయూలో సీనియర్ అసిస్టెంట్. శిరీష హౌస్వైఫ్. సుమారు 11 ఏళ్లు తర్వాత వారికి పాప పుట్టింది. ఆ తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వెంకటరమణ భార్యపై అనుమానంతో బెడ్ రూమ్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో శిరీష తన ఐదు నెలల కుమార్తెతో ఈనెల 13న జోడుగుళ్లుపాలెం బీచ్కు వెళ్లింది. అక్కడ తెన్నేటి పార్కు దిగువున బంగ్లాదేశ్ నౌక చాటుకు వెళ్లి కుమార్తెను సముద్రం నీటిలో ముంచేసింది. కొంతసేపటి తర్వాత భర్తకు ఫోన్ చేసి కుమార్తె నీటిలో మునిగిపోయి చనిపోయిందని.. తాను కూడా చనిపోతానంది. వెంటనే భర్త బీచ్కు చేరుకుని పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శిరీషనే బిడ్డను హత్య చేసి ఉంటుందన్న అనుమానంతో ఆరిలోవ పోలీ సులకు భర్త ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారించారు. దీంతో పాపను తానే చంపినట్టు శిరీషా ఒప్పుకొంది. ఇంటి వద్దే తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసి.. జోడుగుళ్లుపాలెం బీచ్లో నీటిలో ముంచేసింది. అనంతరం తాను కూడా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంతలో అక్కడ సందర్శకులు కొందరు చూడటంతో ఆత్మహత్య వీలుపడలేదు. -
ఉయ్యాల తాడే.. ఆమెకు ఉరితాడు
కాకినాడ క్రైం: అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన బిడ్డను నిద్రపుచ్చేందుకు కట్టిన ఉయ్యాల తాడుతోనే.. ఆ తల్లి ఉరి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారుకుంది. మద్యానికి బానిసైన భర్త వైఖరి.. అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఆందోళన.. జీవితాన్ని ఎదురొడ్డలేనేమోనన్న నిస్సహాయత వెరసి.. ఎన్నో కలలుగన్న ఆ వివాహిత తన నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించి తనువు చాలించింది. ఎన్నో కలలు చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు మద్యం ముందు భార్యాబిడ్డలు ఆనకపోవడంతో.. తమ మరణంతోనైనా భర్తకు కనువిప్పు కలుగుతుందనుకుంటూ తనకు తాను మరణ దండన విధించుకుంది. తన ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను శాశ్వతంగా దూరం చేసి, జీవితాంతం గుండెకోతను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతి(26)కి 2017లో కాకినాడకు చెందిన తలాటం సురేష్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కార్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ పెళ్లయిన తొలి నాళ్లలో భార్యతో బాగానే ఉండేవాడు. మద్యం అలవాటు శ్రుతి మించడంతో కొంతకాలం తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరికి నాలుగేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో జోగుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అతడి వైఖరితో స్వాతి తీవ్ర అసహనంతో ఉండేది. ఎంత నచ్చజెప్పినా సురేష్లో మార్పు రాలేదు. స్నేహితులతో కలిసి తాగుబోతులా మారాడని తల్లిదండ్రుల వద్ద స్వాతి బాధపడుతుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య వాదులాటలు జరిగేవి. ఆదివారం అర్థరాత్రి మద్యం తాగొచ్చిన సురేష్.. భార్యాపిల్లలు పడుకున్న గదిలో నిద్రపోయాడు. భర్త రాకను స్వాతి గమనించి, ఇంతేనా జీవితం అంటూ ప్రశ్నించింది. దీంతో సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇలాగే ఉంటే తమ పిల్లల సంగతేంటని ప్రశ్నించడంతో, సురేష్ తిరగబడ్డాడు. దీంతో విసుగెత్తిన స్వాతి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడునే ఉరితాడుగా మార్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు నగేష్ ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నాం!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు కేసుకు సంబంధించి ఆమె భర్త జతిన్ హుక్కేరీని మరోసారి కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. గతేడాది నవంబర్ లో తమ పెళ్లి జరగ్గా, డిసెంబర్ నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తన క్లయింట్ కు ఇందులో ఎటువంటి సంబంధం లేదని, జతిన్ ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. దాంతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఈనెల 11వ తేదీన కూడా హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేయగా, మరోసారి రన్యారావు భర్త జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని డీఆర్ఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.కాగా, 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శనివారం సెషన్స్ కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. -
భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పాయకాపురం ఎల్బీఎస్ నగర్కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్స్టేష¯Œన్కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది. దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగి్నమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి నిశ్చితార్థం రద్దు చేయించి..
హైదరాబాద్: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు. కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
మానవత్వం మంటగలిసేలా భార్యపై దాడి
మైసూరు: భార్య పోలీసు స్టేషన్లో కేసు పెట్టిందనే కోపంతో భర్త, అతని బంధువులు కలిసి వివాహితను రోడ్డుపై అర్ధనగ్నంగా చేసి దాడికి పాల్పడ్డారు. మైసూరు నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. మహేష్కు బాధిత యువతి (24)తో పెళ్లయింది. మరింత కట్నం తేవాలని తరచూ వేధించడంతో ఆమె భర్త, మామ మల్లయ్య, బావ శివు పైన కేసు వేసింది. ఇది ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది. ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం భార్యను కలిసిన మహేష్ .. కలిసి ఉందామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. రెండు రోజులకే మళ్లీ సతాయించడం మొదలుపెట్టాడు. తమపై పోలీసు స్టేషన్లో, కోర్టులో పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని భర్త, మామ తదితరులు ఆమెతో గొడవకు దిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. చీరను లాగేసి దాడి చేశారు. ఇరుగుపొరుగు అడ్డుకోబోతే వారిని బెదిరించారు. బాధితురాలు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. -
‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’
అన్నమయ్య: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు
జగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్ కలిసి క్షణికావేశంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్స్టేషన్లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడి ఇంట్లో ఆయుధాలుకుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నిందితుల రిమాండ్జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్బాబు కలిసి కమలాకర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్ ఎస్సై సధాకర్ పాల్గొన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న 45 రోజులకే..
మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్కుమార్ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
అత్తతో అల్లుడి అనైతిక బంధం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మామ
జడ్చర్ల(మహబూబ్నగర్): వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్నగర్కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్కుమార్తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్నగర్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
అతివేగం ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది...
మరో కుటుంబంలో ‘కారు’ చీకటి కమ్ముకుంది. అతివేగం ఇంకో ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది. కొత్తగా రూపుదిద్దుకున్న హైవే రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కడదాకా కలిసుందామని బాసలు చేసుకున్న దంపతులకు ఇదే ఆఖరి ప్రయాణమైంది. కాలం ఎంత కర్కశమైందంటే.. అమ్మానాన్న చనిపోతే ఆ విషయం అదే వాహనంలో ఉన్న బిడ్డకు తెలియరాలేదు. సారవకోట, పాతపట్నం: సారవకోట మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం శ్రీరామ్నగర్కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్(56), ఆయన భార్య పెద్దగోపు వాణి(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం శ్రీరామ్నగర్కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ ఆయన భార్య వాణి, కుమారుడు కీర్తి విహార్ ఒడిశాలోని పర్లాకిమిడి రాజవీధికి చెందిన తులగ హేమలత, ఇంజు చక్రవర్తిలు కలిసి ఆదివారం ఉదయం కారులో శ్రీకాకుళంలో వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరుగు ప్ర యాణంలో సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపానికి వస్తుండగా.. సరిగ్గా మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఆ దెబ్బకు లారీ ముందు యాక్సిల్ విరిగిపోయి ముందు చక్రం డీజిల్ ట్యాంకుకు ఢీకొట్టింది. ఆ ధాటికి కారు డ్రైవింగ్ చేస్తున్న వెంకటప్రసాద్, వెనుక సీట్లో కూర్చున్న భార్య వాణి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు పక్క సీట్లో కూర్చున్న ఇంజు చక్రవర్తికు, వెనుక సీట్లో కూర్చున్న కీర్తి విహార్కు, తులగ హేమలతకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి హైవే అంబులెన్స్కు సమాచారం అందించారు. వారు వచ్చి క్షతగాత్రులను పాతపట్నం సీహెచ్కు తరలించారు. అనంతరం శ్రీకాకుళం తీసుకెళ్లారు. అతివేగమే కారణమా..? ⇒ కారు లారీని ఢీకొన్న ధాటికి కారు ముందు భా గం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి పాడైపోయాయి. ⇒ లారీ ముందు భాగం యాక్సిల్ విరిగిపోయి డీజిల్ ట్యాంకును సైతం ఢీ కొనడంతో డీజిల్ పూర్తిగా కారిపోయింది. ⇒ ప్రమాదం జరిగిన స్థలంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో లారీ డ్రైవర్, బైక్పై అటుగా వస్తున్న పెద్దలంబకు చెందిన శ్రీను, బొంతుకు చెందిన జయరామ్, స్థానికుల సాయంతో కారు డోర్ను గునపాలతో పొడిచి తీశారు. ⇒ సంఘటన స్థలాన్ని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు, సారవకోట ఎస్ఐ అనిల్ కుమార్ పరిశీలించారు. మృతదేహాలను పాతపట్నం సీహెచ్సీకు తరలించారు. ఆదివారం కాకపోయి ఉంటే.. కురిడింగి ప్రాథమిక పాఠశాల ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గు రి చేసింది. పాఠశాల విడిచిపెట్టే సమయం, ప్రమాదం జరిగిన సమయం ఒకటే కావడం గమనార్హం. ఆదివారం ప్రమాదం జరగడంతో పిల్లలు రోడ్డు మీదకు రాలేదని, లేదంటే మరింత ఘోరం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్డు లేక పోవడం, హైవే సిబ్బంది పాఠశాల జోన్ అని కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయ్యో ఆ కుటుంబం.. ప్రమాదంలో చనిపోయిన వెంకటప్రసాద్(56) వాణి(45) దంపతులది పర్లాకిమిడిలోని రాజవీధి. వెంకటప్రసాద్ అమరావతి ట్రావెల్స్ బస్సులకు భాగస్వామి. గత ఎనిమిదేళ్లుగా పాతపట్నంలో నివాసం ఉంటున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విశాల్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. రెండో కుమారుడైన కీర్తి విహార్ ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను భువనేశ్వర్లో బీటెక్ చేస్తున్నాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా చాలా సేపటి వరకు తెలియలేదు. -
ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..?
జమ్మికుంట(హుజూరాబాద్): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ హైదరాబాద్లో ఎల్ఈడీ బల్బస్ ఈవెంట్ వర్క్స్ చేస్తుంటాడు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు. -
దేవుడా..నా కూతుర్ని ఎందుకు చంపేశావ్.!
శివమొగ్గ: ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్ చేయబోయిన యువతి కరెంటు షాక్ కొట్టి మరణించింది. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి జిల్లాలోని హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. మృతురాలు నిసర్గ (18). ఆమె హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ చదివేది. షాక్తో యువతి అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటివరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. మరణంలోనూ జీవనదానంశివమొగ్గ: బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ మానవత చాటిన ఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. కృషినగర 1వ క్రాస్ నివాసి ఎస్సీ రమేష్ (57) అనే వ్యక్తి ఈనెల 10న సాయంత్రం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్డెడ్ అని డాక్టర్లు నిర్థారించారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆయన భార్య సవిత, కుమారుడు నిశ్చిత్, కుటుంబ సభ్యులు అవయవాల దానానికి అంగీకరించారు. ఆయన దేహం నుంచి గుండె, మూత్రపిండాలు సహా పలు ముఖ్య భాగాలను సేకరించి అవసరమైన రోగుల కోసం ఆగమేఘాల్లో తరలించారు. సోలార్ రమే‹Ùగా శివమొగ్గలో పేరొందిన రమేష్ చనిపోతూ పలువురికి సాయం చేశారని బంధుమిత్రులు నివాళులు అరి్పంచారు. -
HYD: గురుశిష్యులు అరెస్ట్.. యాసిడ్ దాడి కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్లో కలకలం సృష్టించిన ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యాసిడ్ దాడి కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు.గురువును వేధిస్తున్నాడనే కారణంగా శిష్యుడు యాసిడ్తో దాడి చేశారు. సైదాబాద్ ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్న రాజశేఖర్ శర్మను అకౌంటెంట్ నర్సింగరావు వేధిస్తున్నాడని జాబ్లీహిల్స్ టీటీడీ ఆలయ పూజారి హరనాథ్ శర్మ.. యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గురుశిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారుశుక్రవారం ఆలయంలో విధుల్లో ఉన్న ఎకౌంటెంట్ నర్సింగరావుపై యాసిడ్ దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజ్ ద్వారా విచారణ చేపట్టారు. బాధితుడు నర్సింగరావుతో కొంత కాలంగా ఆలయ పూజారితో విభేదాలు ఉన్నాయని సమాచారం. -
రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. -
సారీ నాన్నా.. యూజ్లెస్గా ఉండలేను!
శ్రీకాకుళం: ‘సారీ నాన్న.. నాకెంతో చేశారు.. నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయస్సు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్లెస్గా ఉండటం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్టని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలనినాకు లేదు..’ అని వాట్సాప్ డీపీలో మెసేజ్ పెట్టి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరం వెళ్తాను డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని, అదయ్యాక వెళ్లు అని చెప్పి రూ.550 ఇచ్చింది. డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు. అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న హరికృష్ణను పలాసలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం మెడికవర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే హరికృష్ణ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కస్టడీలోని యువకుడి మృతితో కలకలం
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన అలకుంట సంపత్ (31) జగిత్యాల జిల్లాలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పని చేస్తున్నారు. సంపత్తోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేటకు చెందిన చిరంజీవి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్కు చెందిన మిట్టాపల్లి నర్సారెడ్డిలు పనిచేస్తున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారు. కొంతమందిని లావోస్ దేశానికి డేటాఎంట్రీ ఆపరేటర్ల పేరిట పంపించారు. తీరా అక్కడ సైబర్నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం ఆలకుంట సంపత్, చిరంజీవి, నర్సారెడ్డిలపై జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ముగ్గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. 12న కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్కు తీసుకురాగా, గురువారం రాత్రి సంపత్ ఎడమ చేయి లాగుతోందని పోలీస్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్ మృతి విషయాన్ని గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు తమకు చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు.ఫస్ట్క్లాస్ జడ్జి సమక్షంలో..సంపత్ మృతదేహానికి ఫస్ట్క్లాస్ జడ్జి హరికృష్ణ సమక్షంలో ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును సీపీ సాయిచైతన్యకు అందించారు. సంపత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.గుండె సమస్యతో మృతి చెందాడు‘అలకుంట సంపత్ గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందాడు. సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతను థాయిలాండ్, మయన్మార్, లావోస్ తదితర ప్రాంతాలకు పంపించేవాడు. మోసపోయిన వారి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు గురువారం జగిత్యాలలోని సంపత్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేశారు. అదే రోజు రాత్రి ఎడమ చేయి, ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో పోలీసులు జీజీహెచ్కు తీసుకువెళ్లారు. జీజీహెచ్లోని సీసీటీవీ ఫుటేజీలో సంపత్ నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించాం. జీజీహెచ్కు వెళ్లిన తర్వాత సంపత్ కుప్పకూలిపోయాడు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. సంపత్ మృతిపై ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ కొనసాగుతోంది.’ అని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమగ్ర విచారణ జరపాలిసంపత్ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జీజీహెచ్కు చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త సంపత్ మృతి చెందాడని భార్య ఆరోపించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని జీజీహెచ్ ఎదుట ఉన్న రోడ్డుపై ధర్నా చేశారు. న్యాయం చేస్తామని, జడ్జి సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం చేయించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. -
వరకట్న వేధింపులకు యువతి బలి
అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్కు చెందిన అమరే‹Ùకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హోలీ వేళ కాకినాడలో విషాదం.. చదవు రాకపోతే చంపేస్తారా? నాన్న..
కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు. -
కుటుంబ విషయాల్లో అడ్డొస్తుందని తల్లి హత్య
నిజామాబాద్: కన్న తల్లిని కట్టుకున్న భర్తతో కడతేర్చింది ఓ కూతురు. ఈ ఘటనలో దంపతులిద్దరిని పోలీ సులు అరెస్టు చేశారు. నగరంలోని నార్త్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. నాగారం 300క్వార్టర్స్లో రమేష్, సౌందర్య అనే దంపతులు నివసిస్తున్నారు. సౌందర్య తల్లి విజయలక్ష్మి నాలుగు సంవత్సరాలుగా వీరివద్దనే ఉంటోంది. ఈక్రమంలో విజయలక్ష్మీ తరుచూ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడంతో కూతురు, అల్లుడికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించి బుధవారం రాత్రి విజయల క్ష్మి పడుకోగానే దంపతులు ఇద్దరు కలిసి ఆమె ము ఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి, చేతితో గొంతు పిసికి చంపారు. సహజ మరణంగా నమ్మించడానికి యత్నించగా, అనుమానం వచ్చి స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. విచార ణలో వారు నేరం అంగీకరించడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసు లు తెలిపారు. ఎస్సై గంగాధర్, సిబ్బంది ఉన్నారు. -
కిలాడీ లేడీ బాగోతం బట్టబయలు
సాక్షి, వరంగల్: వరంగల్లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయపడుతున్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. వరంగల్లోని మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా దందా సాగిస్తోంది.వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి.. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతోంది. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే, వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు బట్టబయలయ్యాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం రెండు రోజుల్లో ఆ కిలాడీ లీలలు పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది. -
హైదరాబాద్ లో హోలీ ముసుగులో గంజాయి వినియోగం
-
అడ్వాన్స్గా రూ.30వేలు.. నా భర్త చంపేయండి గోపి..!
హన్మకొండ: భర్తను కడతేర్చడానికి భార్య సుపారీ(Supari) అందజేసింది. ఎలాగైనా, ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో గురువారం భార్యతోపాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్ సుమన్కు, మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది.ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్లో వేర్వేరుగా ఉంటున్నారు. సుమన్ హైదరాబాద్లోనే(Hyderabad) ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నరేశ్ అనే యువకుడు సుమన్కు వాట్సాప్ కాల్(WhatsApp call) చేసి నిన్ను చంపేందుకు ప్రయత్నం జరుగుతుందని, తనకు డబ్బులు ఇస్తే ఆ ప్రయత్నాన్ని ఆపుతానంటూ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన సుమన్.. ఈనెల 9వ తేదీన నరేశ్పై నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.నరేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో సుమన్ భార్య మంజుల..(Manjula) మరికొందరితో కలిసి భర్తను చంపించేందుకు నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపికి రూ.30వేల సుపారీ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. దీంతో మంజుల, ఆమెకు సహకరించిన ఆమె బావ ములుగుకు చెందిన మోతీలాల్, వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నరేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేశ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రియురాలితో పెళ్లి కోసం.. -
తల్లిని దారుణంగా హత్య చేసిన తనయుడు
శంషాబాద్: ఆస్తి కోసం ఓ వ్యక్తి కన్న తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన చంద్రకళ(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రకాష్ (35) ఆవారాగా తిరిగేవాడు. గతంలో అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్న అతడికి ఇద్దరు కుమార్తెలు. రాఘవేంద్రకాలనీలోని వంద గజాల ఇంటిలో తన వాటా తనకు ఇవ్వాలని ప్రకాష్ గత కొన్నాళ్లుగా తల్లిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి పత్రాలు తనకు ఇవ్వాలని వేధిస్తున్నా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లి నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పలుమార్లు తల్లితో గొడవ పడటంతో ఆర్జీఐఏ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మద్యం మత్తులో ఘాతుకం... బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రకాష్ ఆస్తి పత్రాల కోసం మరోమారు తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అతను పక్కనే ఉన్న కర్రతో పాటు గ్యాస్ సిలిండర్తో తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రంగులు వేయకండని బ్రతిమాలాడు.. అయినా చంపేశారు..!
జైపూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడ్ని కొట్టి చంపేశారు రాల్వాస్ గ్రామంలో ముగ్గురు యువకులు. హోలీ పండుగ పేరుతో హన్స్ రాజ్ అనే యువకుడిపై రంగులు చల్లేందుకు ముగ్గురు యువకులు వచ్చారు. లైబ్రరీలో బుక్స్ చదువుకుంటున్న తరుణంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.వారు రంగులు చల్లే క్రమంలో హన్స్ రాజ్ వద్దని వారించాడు. తనపై చల్లవద్దని, ప్రస్తుతం కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని విన్నవించాడు. అయితే రంగులు చల్లించుకోవడానికి నిరాకరిస్తావా అంటూ హన్స్ రాజ్ ను చావబాదారు సదరు యువకులు. బెల్ట్ లతో, స్టిక్స్ తో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయిన హన్స్ రాజ్.. ప్రాణాలు కోల్పోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని అశోక్, బబ్లూ, కలుకరణ్ గా గుర్తించారు. వీరిని వెంటనే అరెస్టు చేసినట్లు అడిషనల్ ఏఎస్సీ దినేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.నేషనల్ హైవే దిగ్బంధనం.. పెద్ద ఎత్తున ఆందోళనఈ అమానుష ఘటనపై హన్స్ రాజ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హన్స్ రాజ్ భౌతిక కాయాన్ని తీసుకుని నేషనల్ హైవేను బ్లాక్ చేశారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారు ఆందోళన విరమించారు. హన్స్ రాజ్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని నేషనల్ తొలగించి, ఆందోళన విరమించారు రాల్సాస్ గ్రామస్థులు.