Declines
-
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
భారతీయ అమెరికన్లలో హారిస్కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్కు జైకొట్టారు. ట్రంప్కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్కు, 39 శాతం మంది ట్రంప్కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్కు, 27 శాతం ట్రంప్కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెపె్టంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి. తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్సీఆర్లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. మిగిలిన అన్ని పట్టణాల్లో క్షీణించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు జూలై–సెపె్టంబర్ కాలంలో 26% క్షీణించి 13,355 యూని ట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → చెన్నై మార్కెట్లో 18 శాతం తక్కువగా 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. → కోల్కతా మార్కెట్లో 23% తక్కువగా 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → పుణెలోనూ 19% క్షీణించి అమ్మకాలు 21,306 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 10% తగ్గి 20,460 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ముంబైలో 17 శాతం తక్కువగా 10,966 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కావచ్చు. అదే నవీ ముంబైలో మాత్రం 4 శాతం అధికంగా 7,737 యూనిట్ల అమ్మకాలు జరగొచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అవుతాయి. సాధారణమే.. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో విక్రయాలు కొత్త ఆవిష్కరణల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ, అమ్మకాల్లో స్వల్ప క్షీణత అన్నది చరిత్రాత్మకంగా ఉన్న ధోరణే కానీ, ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదు’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. -
క్రౌడ్స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్స్ట్రైక్కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్స్ట్రైక్కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
ఆహార ధరలు దారుణం.. పరిశ్రమ పేలవం..
న్యూఢిల్లీ: భారత తాజా కీలక ఆర్థిక గణాంకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.75 శాతంగా నమోదయ్యింది. ఇది ఏడాది కనిష్టం అయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. 2024 ఏప్రిల్లో ఈ రేటు 4.83 శాతంకాగా, 2023 మేనెల్లో ఈ రేటు 4.31 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రకారం 6 శాతం వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అయితే తమ లక్ష్యం ఎప్పుడూ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి అని ఆర్బీఐ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యా లయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రిటైల్ ద్ర వ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల్లో పట్టణ ప్రాంతాల్లో 4.15% ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. పరిశ్రమ పేలవంమరోవైపు పరిశ్రమల పురోగతికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల ఏప్రిల్లో 5 శాతంగా నమోదయ్యింది. గత 3 నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4%. పారిశ్రామిక రంగం వాటా 28.3 %. సేవల రంగం వాటా 53.3%. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70%.ఇంధన డిమాండ్కు భారత్ దన్ను న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్కు భారత్ చోదకంగా ఉండగలదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)నివేదిక తెలిపింది. 2023–2030 మధ్య కాలంలో భారత్లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉందని ఆయిల్ 2024 రిపోర్టులో పేర్కొంది. 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఐఈఏ వివరించింది. 2025–2030 మధ్య కాలంలో భారత్లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదని ఐఈఏ తెలిపింది. -
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది. -
ఫిబ్రవరిలో 0.2 శాతం టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్లో ప్లస్లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. జనవరిలో 6.85 శాతంగా ఉన్న ఆహార టోకు ధరల స్పీడ్, ఫిబ్రవరిలో 6.95 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో కూరగాయల ధరలు 19.71 శాతం (జనవరి) నుంచి 19.78 శాతానికి ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 16.06 శాతం నుంచి 18.48 శాతానికి చేరాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగానికి వస్తే, రేటు 0.51 శాతం నుంచి 1.59 శాతానికి ఎగసింది. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలు జనవరిలో 1.13 శాతం తగ్గితే, ఈ తగ్గుదల ఫిబ్రవరిలో 1.27 శాతంగా ఉంది. -
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్అండ్వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
తగ్గిన నగదు చలామణి
ముంబై: వ్యవస్థలో నగదు చలామణి కొంత తగ్గింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో నగదు చలామణి వృద్ధి 3.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి వృద్ధి 8.2 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా నగదు చలామణి వృద్ధి నీరసించడానికి రూ.2,000 నోట్ల ఉపసంహరణ కారణమని పేర్కొంది. నగదు చలామణి అంటే ప్రజల వద్ద వినియోగంలో ఉన్న కాయిన్లు, నోట్లు. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లకు సంబంధించి రెండంకెల వృద్ధిని చూపించగా, రూ.2,000 నోట్ల ఉపసంహరణ ఈ వృద్ధికి మద్దతుగా నిలిచినట్టు ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ మనీ (చలామణిలో ఉన్న నోట్లు, కాయిన్లు, ఆర్బీఐ వద్దనున్న బ్యాంక్ల డిపాజిట్లు) ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో 5.8 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.2 శాతంగా ఉంది. ఇందులో బ్యాంకుల డిపాజిట్లు కాకుండా, చలామణిలో ఉన్న కాయిన్లు, నోట్ల వరకే చూస్తే వృద్ధి 3.7 శాతం కాగా, ఏడాది క్రితం 8.2 శాతంగా ఉంది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 31 నాటికి వ్యవస్థలోని మొత్తం రూ.2,000 నోట్లలో 97.50 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయి. ఇప్పటికీ రూ.8,897 కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. 2023 మే 19 నాటికి వ్యవస్థలో చలామణిలోని మొత్తం రూ.2,000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే, ఈ నోట్ల జమ, మారి్పడి సేవలను 2023 అక్టోబర్ 7 నుంచి బ్యాంకులు నిలిపివేశాయి. -
సోలార్ ఇన్స్టలేషన్లు 44 శాతం డౌన్..
న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది. 2022లో భారీ స్థాయి సోలార్ ఇన్స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఆర్థిక మాంద్యంలోకి జపాన్
టోక్యో: జపాన్ మాంద్యంలోకి జారిపోయింది. జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, జూలై– సెప్టెంబర్లో 2.9% మేర క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలో ఉందనేందుకు గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీ నపడింది. ఫలితంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్..అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. -
ఆఖర్లో అమ్మకాల బెల్
ముంబై: చివరి గంటలో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమై 71,731 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 21,772 వద్ద నిలిచింది. అయితే తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు పరిమిత శ్రేణిలో స్వల్ప లాభాల మధ్య కదిలాయి. చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో కుదేలయ్యాయి. వెరసి ఒక దశలో 72,386 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివర్లో 71,602 వరకూ నీరసించింది. నిఫ్టీ సైతం 21,964– 21,727 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రిలయన్స్, ఎయిర్టెల్, మారుతీ సైతం ఇండెక్సులను బలహీనపరచినట్లు పేర్కొన్నారు. కారణాలివీ... జనవరి నెలకు యూఎస్ ఉద్యోగ గణాంకాలు బలపడటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపకపోవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 4 శాతం ఎగువకు చేరడం, దేశీయంగా తాత్కాలిక బడ్జెట్కు ముందు మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు ఉసిగొలి్పనట్లు విశ్షించారు. దిగ్గజాల తీరిలా నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్ 6 శాతం ఎగసింది. కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, టాటా స్టీల్ 5–2% మధ్య జంప్చేశాయి. అయితే యూపీఎల్ 11 శాతం పతనంకాగా.. బజాజ్ ఫైనాన్స్, ఫిన్, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, మారుతీ, అ్రల్టాటెక్, హెచ్సీఎల్ టెక్, టైటన్, అపోలో హాస్పిటల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, ఆర్ఐఎల్ 3.2–1.2 శాతం మధ్య క్షీణించాయి. క్యూ3 ఫలితాల నిరాశతో యూపీఎల్ 11 శాతం పతనమైంది. షేర్ల స్పీడ్... టాటా మోటార్స్: క్యూ3 (అక్టోబర్–డిసెంబర్)లో నికర లాభం రెట్టింపై రూ. 7,100 కోట్లను తాకడంతో 6 శాతం జంప్చేసి రూ. 950 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8 శాతం దూసుకెళ్లి రూ. 950 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! కంపెనీ మార్కెట్ విలువ రూ. 15,950 కోట్లు బలపడి రూ. 3.07 లక్షల కోట్లను దాటింది. ఎల్ఐసీ: లిస్టయిన తదుపరి తొలిసారి రూ. 1,000 మార్క్ను అందుకుంది. 6 శాతం లాభపడింది. తద్వారా రూ. 6 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది. ఒక్క రోజులో రూ. 35,230 కోట్లను జమ చేసుకుంది. విలువరీత్యా గత నెలలో ఎస్బీఐను దాటేసింది. -
ఎస్బీఐ లాభం 35% డౌన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో రూ. 9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.14,205 కోట్లతో పోలిస్తే లాభం 35 శాతం తగ్గింది. ప్రధానంగా వేతనాలు, పెన్షన్ల కోసం వన్టైమ్ ప్రొవిజనింగ్ బ్యాంక్ లాభదాయకతకు గండి కొట్టింది. ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న 17% వేతన సెటిల్మెంట్ కారణంగా వేతనాలు, పెన్షన్ల కోసం అదనపు వన్టైమ్ ప్రొవిజనింగ్ను చేయాల్సి వచి్చందని, ఇది గనుక లేకపోతే నికర లాభం రూ.16,264 కోట్లుగా ఉండేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత లాభదాయకత ప్రకారం, రూ.40,000 కోట్లను సులభంగా సమీకరించగమని ఖారా చెప్పారు. అవి లేకుండా కూడా అదనంగా రూ.7.5 లక్షల కోట్ల రుణాలిచ్చే లిక్విడిటీ బఫర్ ఉందని ఆయన వివరించారు. మొండి బకాయిలు దిగొచ్చాయ్... క్యూ3లో స్థూల మొండి బకాయిలు 72 బేసిస్ పాయింట్లు దిగొచ్చి 2.42 శాతానికి (రూ.86,749 కోట్లు) తగ్గాయి. /æక నికర మొండి బకాయిలు కూడా 13 బేసిస్ పాయింట్లు తగ్గి 0.64 శాతానికి (రూ.22,408 కోట్లు) చేరాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి అని ఖారా పేర్కొన్నారు. కాగా, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 1 శాతం తగ్గి 3.28 శాతానికి పరిమితమైంది. మొత్తం రుణాలు 14.38 శాతం ఎగబాకి రూ.35.84 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 13.02 శాతం పెరిగి రూ. 47.62 లక్షల కోట్లకు ఎగిశాయి. పేటీఎం కస్టమర్లకు స్వాగతం... మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను దాదాపు నిలిపేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో, పేటీఎం కస్టమర్లకు (ఎక్కువ మంది వ్యాపారులే) సాయపడేందుకు ఎస్బీఐ సిద్ధంగా ఉందని చైర్మన్ ఖారా చెప్పారు. -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
చైనా జనాభా రెండో ఏడాదీ తగ్గింది
బీజింగ్: అధిక జనాభాతో మన దేశం జనభారత్గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది. వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదలచేయడంతో ఈ విషయం వెల్లడైంది. జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అమలుచేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జని్మస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు. -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్కామ్లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్తో పోలిస్తే నవంబర్లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్బీఎఫ్సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
నిరాశపరిచిన షిప్పింగ్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: షిప్పింగ్ కార్పొరేషన్ సెపె్టంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతానికి పైగా క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.114 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,458 కోట్ల నుంచి రూ.1,662 కోట్లకు వృద్ధి చెందింది. వ్యయాలు రూ.1,331 కోట్ల నుంచి రూ.1,113 కోట్లకు క్షీణించాయి. ప్రతీ షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్పై జాబ్ పోస్టింగ్లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
దిగొస్తున్న టమాటా ధర
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది. ఈ ధరలు వచ్చే సెపె్టంబర్ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్లోని పింపాల్గావ్ బస్వంత్ మార్కెట్కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది. -
ఇక్రా రేటింగ్స్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది. క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. -
ఎస్బీఐ కార్డ్స్ లాభం క్షీణత
ముంబై: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 5 శాతం నీరసించి రూ. 593 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 627 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వసూళ్లు తగ్గడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,263 కోట్ల నుంచి రూ. 4,046 కోట్లకు జంప్చేసింది. వడ్డీ ఆదాయం రూ. 1,387 కోట్ల నుంచి రూ. 1,804 కోట్లకు బలపడింది. ఫీజు ఆదాయం సైతం రూ. 1,538 కోట్ల నుంచి రూ. 1,898 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.24 శాతం నుంచి 2.41 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.9 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 859 వద్ద ముగిసింది. -
స్టార్టప్లకు నిధుల కొరత..
ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. తగ్గిన వేల్యుయేషన్స్ .. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు. డేటాలో మరిన్ని అంశాలు.. ► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత. ► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. ► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్ఫ్రా.మార్కెట్, జెట్వెర్క్, ఇన్సూరెన్స్దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అధిక వేల్యుయేషన్స్తో ఒత్తిడి .. అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
భారత కంపెనీల్లో తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు (పీఈ, వీసీ) ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో 23 శాతం మేర తగ్గి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) 27.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలోని పెట్టుబడులు 20.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడులు 35.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను పరిశ్రమ మండలి అయిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఏవీసీఏ), కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడుల లావాదేవీలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు సంఖ్యా పరంగా 44 శాతం తగ్గాయి. మొత్తం 427 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంమీద పీఈ, వీసీ పెట్టుబడుల ధోరణి సానుకూలంగానే ఉందని, ముఖ్యంగా స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. పీఈ, వీసీ సంస్థలు ఈ ఏడాది ఆరు నెలల్లో 10.2 బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఇది రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని ఈ నివేదిక తెలిపింది. నెలవారీగా చూస్తే పీఈ, వీసీ పెట్టుబడుల విలువ జూన్లో 3.1 బిలియన్ డాలర్లుగా ఉందని, మే నెలతో పోలిస్తే 9 శాతం తక్కువని పేర్కొంది. -
ఆఫీస్ లీజింగ్లో స్తబ్ధత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్ మార్కెట్ జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్ క్వార్టర్లో ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్ మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ రంగం ముందు ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్లో రియల్ ఎసేŠట్ట్ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. ► విడిగా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. ► కోల్కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18%గా నమోదైంది. ► ఈ ఏడాది జనవరి–జూన్ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
బంధన్ బ్యాంక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 19 శాతం క్షీణించి రూ. 721 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 887 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 2,514 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,385 కోట్ల నుంచి రూ. 4,908 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.25 శాతం నుంచి 6.76 శాతానికి తగ్గాయి. అయితే నికర ఎన్పీఏలు 1.92 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 8 శాతం నుంచి 7.3 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.44 శాతంగా నమోదైంది. డిపాజిట్లు రూ. 1.08 లక్షల కోట్లను తాకగా.. అడ్వాన్సులు(రుణాలు) రూ. 1.03 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 2.5 శాతం ఎగసి రూ. 221 వద్ద ముగిసింది. -
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికానికి(క్యూ1) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 290 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 560 కోట్లు ఆర్జించింది. ఇందుకు అనూహ్య(వన్టైమ్) నిర్వహణేతర వ్యయాలు ప్రభావం చూపాయి. దివాలా చట్ట మార్గంలో కంపెనీ ఇటీవల సొంతం చేసుకున్న మిత్రాతోపాటు, 700 మెగావాట్ల ఇండ్–బరత్ థర్మల్ ప్లాంటు లావాదేవీ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం 3 శాతం నీరసించి రూ. 3,013 కోట్లకు చేరింది. ఈ కాలంలో నికరంగా 6,699 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇది 14 శాతం అధికంకాగా.. మిత్రా, పునరుత్పాదక ఇంధన(ఆర్ఈ) సామర్థ్య విస్తరణ ఇందుకు దోహదం చేశాయి. 2023 జూలై 14 నుంచి మూడేళ్ల కాలానికి రాజీవ్ చౌధ్రిని అదనపు, స్వతంత్ర డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.6% బలపడి రూ.304 వద్ద ముగిసింది. -
ఐదు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 8 శాతం పెరిగాయి. కానీ, విడిగా చూస్తే హైదరాబాద్ సహా ఐదు మార్కెట్లలో అమ్మకాలు పడిపోగా, కేవలం మూడు పట్టణాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో మొత్తంమీద ఎనిమిది మార్కెట్లలో కలసి అమ్మకాలు 8 శాతం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 శాతం తగ్గాయి. ఈ వివరాలను ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ వెల్లడించింది. ఈ ఎనిమిది పెద్ద పట్టణాల్లో ఏప్రిల్–జూన్ కాలంలో 80,250 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 74,320 యూనిట్లుగా ఉన్నాయి. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ ఏప్రిల్–జూన్ 2023’ నివేదికను ప్రాప్టైగర్ బుధవారం విడుదల చేసింది. ప్రధానంగా ముంబై, పుణె, అహ్మదాబాద్లో ఇళ్ల విక్రయాలు పెరగ్గా, హైదరాబాద్తోపాటు చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లో తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కొనుగోళ్ల పరంగా బలమైన సానుకూల సెంటిమెంట్కు దారితీసిందని ఆర్ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ప్రాప్టైగర్, హసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ ఇవన్నీ కూడా ఆర్ఈఏ ఇండియా కిందే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల అమ్మకాల వృద్ధికి కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం ఇవన్నీ కారణాలుగా ప్రాప్టైగర్ నివేదిక వివరించింది. పట్టణాల వారీగా విక్రయాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 7,680 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 7,910 యూనిట్లతో పోలిస్తే 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో అమ్మకాలు 17 శాతం పెరిగి 8,450 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో విక్రయాల పరంగా 19 శాతం క్షీణత కనిపించింది. 6,790 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ► చెన్నైలో అమ్మకాలు 5 శాతం తగ్గి 3,050 యూనిట్లుగా ఉన్నాయి. ► కోల్కతాలో 40 శాతం తగ్గి 1,940 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం వృద్ధితో 30,260 యూనిట్లకు చేరాయి. ► పుణెలోనూ 37 శాతం అధికంగా 18,850 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత్లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహం మే నెలలో తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే గత నెలలో 44 శాతం, ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 52 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. 3.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022 మే నెలలో ఇవి 6.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ లాబీ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చాలా మటుకు ఫండ్స్ గత ఏడాదిన్నరగా పుష్కలంగా నిధులు సమీకరించినప్పటికీ వాటిని ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. వృద్ధి, మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత పోర్ట్ఫోలియో కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. పెట్టుబడులపరంగా టెక్ రంగంలో కాస్త స్తబ్దత నెలకొందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆరి్థక సేవల విభాగాల్లోకి కాస్త పెట్టుబడులు వచి్చనట్లు సోని వివరించారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే పెట్టుబడుల ప్రవాహం ఆశావహంగానే కనిపిస్తోందని, 2023లో మొత్తం పెట్టుబడులు గతేడాది కన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► మే నెలలో మొత్తం 71 లావాదేవీలు జరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే 42 శాతం తగ్గాయి. ► వృద్ధి దశలోని సంస్థల్లో పెట్టుబడులు 4 శాతం తగ్గాయి. 17 డీల్స్ కుదరగా 1.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మే లో 19 ఒప్పందాలు కుదరగా, 2 బిలియన ్డాలర్లు వచ్చాయి. ► రియల్ ఎస్టేట్పై ఫండ్స్ అత్యధికంగా ఆసక్తి చూపాయి. ఏడు డీల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2022 మే నెలలో 12 డీల్స్ ద్వారా 1.1 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. 864 మిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15 డీల్స్తో టెక్నాలజీ రంగం రెండో స్థానంలో నిల్చింది. ఈ రంగంలో పెట్టుబడులు 159 శాతం పెరిగాయి. ► ఫండ్స్ గతేడాది మేలో 745 మిలియన్ డాలర్లు సమీకరించగా.. ఈసారి 2.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. -
టోకు ధరలు దిగివచ్చాయ్..!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెల్లో పెరుగుదల లేకపోగా 3.48 శాతం (క్షీణత) తగ్గింది. గడచిన ఏడు సంవత్సరాల్లో (2015 నవంబర్లో మైనస్ 3.7 శాతం) ఈ స్థాయిలో టోకు ధరలు నమోదుకావడం ఇదే తొలిసారి. హైబేస్ ఎఫెక్ట్తోపాటు (గత ఏడాది మే నెల్లో భారీ టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం) సూచీలో మూడు ప్రధాన విభాగాలైన– ఆహార, తయారీ, ఇంధన ధరలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. 2022లో మే నెలలో 16.63 శాతం టోకు ద్రవ్యోల్బణం (హై బేస్) నమోదుకావడం ఇక్కడ గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేనెల్లో 25 నెలల కనిష్టం 4.25 శాతంగా నమోదయిన సానుకూల ఫలితం నేపథ్యంలోనే టోకు ధరలకు సంబంధించి కూడా ఎకానమీకి ఊరటనిచ్చే తాజా ఫలితం వెలువడింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే... ► ఏప్రిల్లో ఫుడ్ ఆర్టికల్స్ ధరల 3.54 శాతం తగ్గితే (వార్షికంగా పోల్చి) తాజా సమీక్షా నెల్లో తగ్గుదల 1.51 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 20.12 శాతం తగ్గాయి. ఆలూ ధరలు 18.71%, ఉల్లిధరలు 7.25% తగ్గాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం 5.76 % ఎగశాయి. గోధుమలకు సంబంధించి ద్రవ్యోల్బణం కూడా 6.15%గా ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం మేలో 9.17 శాతం (మైనస్) తగ్గింది. ఏప్రిల్ నెలలో 0.93 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్లో మైనస్ 2.42 శాతంగా ఉంటే, మేలో మైనస్ 2.97 శాతంగా నమోదయ్యింది. ప్రతి ద్రవ్యోల్బణం... వరుసగా రెండో నెల ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్లడాన్ని... సాంకేతికంగా ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఈ ప్రాతిపదికన ప్రతి ద్రవ్యోల్బణం నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 1.51%గా నమోదయ్యింది. రానున్న నెలల్లో కూడా ఇదే ధోరణి కొనసాగితే, బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో 2023లో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2022 మే తర్వాత 2.50% పెరుగుదలతో 6.5 శాతానికి చేరిన రెపో రేటును గత రెండు ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడమే దీనికి కారణం. -
రికార్డు స్థాయిలో వేర్ హౌస్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల నుంచి గోదాములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంత్సరంలో (2022–23) ఎనిమిది ప్రధాన పట్టణాల్లో రికార్డు స్థాయిలో గోదాముల లీజు పరిమాణం 51.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా భారత వేర్ హౌసింగ్ (గోదాములు) మార్కెట్పై మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఎనిమిది పట్టణాలకు గాను ఏడుపట్టణాల్లో గోదాముల అద్దె 3–8 శాతం మధ్య పెరిగింది. తయారీ/అసెంబ్లింగ్ కోసం పారిశ్రామిక రంగం నుంచి కూడా గిడ్డంగులకు డిమాండ్ను పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం 2022–23లో గోదాముల మొత్తం లీజు పరిమాణం 5,13,24,201 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2021–22లో ఇది 5,12,94,933 చదరపు అడుగులుగానే ఉండడం గమనార్హం. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్కతాలో గోదాముల లీజు డిమండ్ పెరగ్గా, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మార్కెట్లలో తగ్గింది. హైదరాబాద్లో డౌన్ హైదరాబాద్లో గోదాముల లీజు పరిమాణం 2022–23లో 7 శాతం తగ్గి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో అత్యధికంగా 25 శాతం మేర లీజు పరిమాణం పెరిగింది. 7.4 మిలియన్ దరపు అడుగులకు చేరింది. ఆ తర్వాత కోల్కతాలో 18 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్లో 5 శాతం తగ్గి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా, పుణెలో 2 శాతం తక్కువగా 74 మిలియన్ చదరపు అడుగులుగా, చెన్నైలో 11 శాతం క్షీణించి 4.5 మిలియన్ చదరపు అడుగులుగా, అహ్మదాబాద్లో 29 శాతం పడిపోయి 3.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా లాజిస్టిక్స్ రంగం 39 శాతం లీజుకు తీసుకుంది. రిటైల్ రంగం వాటా 13 శాతంగా ఉంటే, తయారీ, ఇతర రంగాల వాటా 30 శాతంగా ఉంది. ఈ కామర్స్ సంస్థల వేర్హౌసింగ్ లీజు పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. కరోనా సంక్షోభ సమయంలో ఎక్కువ సామర్థ్యాలను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2021–22లో గోదాముల్లో ఈ కామర్స్ రంగం లీజు వాటా 23 శాతంగా ఉంటే, 2022–23లో 7 శాతానికి పరిమితమైంది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మొత్తం 412 మిలియన్ చదరపు అడుగుల వేర్ హౌసింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఇందులో 12 శాతం ఖాళీగా ఉంది. -
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
పీసీ మార్కెట్ 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్మెంట్/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్మెంట్తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్మెంట్ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్మెంట్ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్టాప్లకు డిమాండ్ ఉందని, నోట్బుక్ల డిమాండ్ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. అగ్రస్థానంలోనే హెచ్పీ కంపెనీ హెచ్పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్మెంట్ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్ చేసింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శా తంగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం చొప్పున ఉంది. -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఎగుమతులు మూడో నెలా డౌన్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్లో ఇవి 58.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్లో డిమాండ్ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. 20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు .. ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్లో ఇది 18.36 బిలియన్ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. 2022–23 గణాంకాల సవరణ.. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం.. ► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్ డాలర్లకు చేరాయి. -
కొత్త ఫండ్ పథకాల వసూళ్లు తగ్గాయ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల సమీకరణ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 42 శాతం తగ్గిపోయింది. మొత్తం 253 ఎన్ఎఫ్వోల ద్వారా ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) మొత్తం రూ.62,342 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2021–22లో మ్యూచువల్ ఫండ్స్ 176 ఎన్ఎఫ్వో ల రూపంలో సమీకరించిన మొత్తం రూ.1,07,896 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. 2021–22తో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఎన్ఎఫ్వోలు వచ్చినప్పటికీ, సమీకరించిన మొత్తం తగ్గడం కనిపిస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటికి 12 ఎన్ఎఫ్వోలను ఫండ్స్ సంస్థలు తీసుకొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎన్ఎఫ్వోలలో ప్యాసివ్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి. 182 ఓపెన్ ఎండె డ్ పథకాలు కాగా, 71 క్లోజ్ ఎండెడ్ పథకాలు న్నాయి. సాధారణంగా బుల్ మార్కెట్లలో ఎక్కువ ఎన్ఎఫ్వోలు వస్తుంటాయి. ఆ సమయంలో మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న సానుకూల సెంటిమెంట్ ఆధారంగా నిధులు సమీకరించడం ఏఎంసీ లకు సులభం అవుతుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సెబీ కొత్త పథకాలను చేపట్టొద్దంటూ మూడు నెలల పాటు నిషేధం విధించడాన్ని గమనించాలి. ఇది కూడా ఎన్ఎఫ్వోల సంఖ్యపై ప్రభా వం చూపించింది. ఇక 2020–21లో 84 నూతన పథకాల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. ‘‘ఇన్వెస్టర్లు ఏదైనా కొత్త పథకం వినూత్నంగా ఉన్నప్పుడు, తమ పోర్ట్ఫోలియోలో వైవిధ్యం పరంగా అంతరా న్ని భర్తీ చేస్తుందని భావించినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరుతో కూడిన పథకాల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలి’’అని మార్నింగ్స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేలపుర్కార్ సూచించారు. అన్ని కొత్త పథకాలు ఒక్కటే కాదని, వాటి ల్లోని అనుకూల, ప్రతికూలతలను చూసి పెట్టుబడు ల నిర్ణయం తీసుకోవడం సుముచితమని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
వేదాంతా లాభం క్షీణత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 57 శాతం క్షీణించి రూ. 3,132 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,261 కోట్లు ఆర్జించింది. అల్యూమినియం బిజినెస్ తగ్గడం, రైటాఫ్లు లాభాలను దెబ్బతీశాయి. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం(రూ. 3,092 కోట్లు) 1 శాతం బలపడింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 37,225 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,342 కోట్ల టర్నోవర్ సాధించింది. జింక్ నుంచి ముడిఇనుము వరకూ కమోడిటీ ధరలు తగ్గడం ఫలితాలను ప్రభావితం చేసింది. వీటికితోడు చమురు, గ్యాస్ బిజినెస్ నుంచి రూ. 1,336 కోట్లమేర అనుకోని నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,45,404 కోట్ల టర్నోవర్ అందుకుంది. పెట్టుబడులకు సై గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ అగర్వాల్, కుమార్తె ప్రియా అగర్వాల్లను బోర్డు ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా తిరిగి నియమించినట్లు వేదాంతా పేర్కొంది. చమురు, గ్యాస్ అన్వేషణకు 29.6 కోట్ల డాలర్ల పెట్టుబడి వ్యయాలకూ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు 2.3 శాతం నీరసించి రూ. 275 వద్ద ముగిసింది. -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్లో 4.79 శాతంగా, గత ఏప్రిల్లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఏప్రిల్లో ఆదరణ తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్టుబడులు 68 శాతం తగ్గిపోయి రూ.6,480 కోట్లకు పరిమితమయ్యాయి. అయినా, ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 26వ నెలలోనూ నమోదైంది. వచ్చిన కొద్ది పెట్టుబడుల్లోనూ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తం ఆకర్షించాయి. ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. మొత్తం మీద 42 సంస్థలతో కూడిన మ్యూచువల్ పండ్స్ పరిశ్రమ ఏప్రిల్ నెలలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రధానంగా డెట్ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేసింది. అంతకుముందు మార్చి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నికరంగా రూ.56,884 కోట్ల పెట్టుబడులను నష్టపోవడం గమనార్హం. కానీ, ఏప్రిల్లో రూ.1.06 లక్షల కోట్లను రాబట్టాయి. దీంతో మ్యచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ చివరికి రూ.41.62 లక్షల కోట్లకు ఎగిసింది. ► ఈక్విటీల్లో ఫోకస్డ్ మినహా అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్మాల్ క్యాప్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, మిడ్క్యాప్ పథకాల్లోకి రూ.1,791 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.206 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.52 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.738 కోట్లు చొప్పున ఆకర్షించాయి. ► డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్లోకి రూ.122 కోట్లు రాగా, సెక్టోరల్ (థీమ్యాటిక్) ఫండ్స్లోకి రూ. 614 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ విభాగంలోకి రూ.61 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి రూ.550 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్లోకి రూ.291 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.131 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ.63,219 కోట్లను ఆకర్షించాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.13,961 కోట్లు, అల్ట్రాషార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోకి రూ.10,663 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఇక గోల్డ్ ఈటీఎఫ్లు సైతం రూ.125 కోట్లను ఆకర్షించాయి. ఇండెక్స్ ఫండ్స్లోకి రూ.147 కోట్లు, ఇతర ఈటీఎఫ్ల్లోకి రూ.6,790 కోట్ల చొప్పున వచ్చాయి. సిప్ ద్వారా రూ.13,728 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.13,728 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన మొత్తం రూ.14,276 కోట్లతో పోలిస్తే తగ్గాయి. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి కాస్త అధిక మొత్తంలోనే పెట్టుబడులు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రస్తుత పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఈక్విటీ పథకాలకు అదనపు పెట్టుబడులను కేటాయించే విషయమై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోందని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన మనీష్ మెహతా పేర్కొన్నారు. -
ఏప్రిల్లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్లో గణనీయ డిమాండ్ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
యూపీఎల్ లాభాలకు గండి
ముంబై: సస్య సంరక్షణ ఉత్పత్తులను అందించే యూపీఎల్ మార్చి త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలు కలిపి) నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.792 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.1,379 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 5 శాతం పెరిగి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,861 కోట్ల నుంచి రూ.16,569 కోట్లకు వృద్ధి చెందింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పెరిగి రూ.53,576 కోట్లుగా నమోదైంది. నికర లాభం పెద్దగా వృద్ధి లేకుండా రూ.4,437 కోట్ల నుంచి రూ.4414 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్ను కంపెనీ బోర్డ్ సిఫారసు చేసింది. గత త్రైమాసికంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు యూపీఎల్ సీఈవో మైక్ ఫ్రాంక్ తెలిపారు. ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, సాగు సీజన్ ఆలస్యం కావడం లాభాలపై ప్రభావం చూపించినట్టు చెప్పారు. స్థూల రుణ భారం 600 మిలియన్ డాలర్లు మేర, నికర రుణ భారం 440 మిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించారు. 2023–24లో మార్కెట్ అవరోధాలను అధిగమించి, లాభాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
పసిడి దిగుమతులు 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి. అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. -
బంగారం డిమాండ్కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
ఏప్రిల్లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్లో వైట్–కాలర్ జాబ్స్కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్తో పోలిస్తే నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
స్మార్ట్ఫోన్ల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి. డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్పాయింట్ తెలిపింది. దీనితో షిప్మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది. ► యాపిల్ షిప్మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్ను ఆఫ్లైన్లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది. ► మార్చి త్రైమాసికంలో షిప్మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. ► వన్ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది. ► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్గా నిల్చింది. ► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి. ► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ► 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి. ► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. -
హింద్ జింక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4) లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 2,583 కోట్లకు పరిమితమైంది. పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 2,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,074 కోట్ల నుంచి రూ. 8,863 కోట్లకు నీరసించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,511 కోట్లకు ఎగసింది. -
డిసెంబర్ త్రైమాసికంలో క్యాడ్ 2.2 శాతం
ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం. వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం. -
రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!
న్యూఢిల్లీ: అఫర్డబుల్ ఇళ్లు (రూ. 40 లక్షల లోపు గృహాలు) సరఫరా గణనీయంగా తగ్గుతోంది. 2018 నుంచి గతేడాది వరకూ నాలుగేళ్ల వ్యవధిలో ఏడు ప్రధాన నగరాల్లో ఇది 20 శాతానికి పడిపోయింది. 2018లో ఇది 40 శాతంగా ఉండేది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఆవిష్కరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థలం ఖరీదుగా మారడం, లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, తక్కువ వడ్డీ రేటుతో అవసరమై నంతగా రుణలభ్యత లేకపోవడం తదితర అంశాలు తాజా అఫర్డబుల్ ఇళ్ల సరఫరా పడిపోవడానికి కారణమని అనరాక్ పేర్కొంది. 2018లో ఏడు నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో 40 శాతం అఫోర్డబుల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30 శాతానికి, 2021లో 26 శాతానికి, గతేడాది 20 శాతానికి తగ్గిపోయింది. ‘అఫర్డబుల్ ఇళ్ల విభాగం పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణాల్లో ఒకటి స్థలమే. మధ్య స్థాయి, ప్రీమియం ఇళ్లతో డెవలపర్లు సులభంగానే స్థలం ఖర్చులు రాబట్టుకోగలరు. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్ ) కానీ అఫర్డబుల్ ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇక ఈ ప్రాజెట్లకు లాభాల మార్జిన్లు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. ముడి వనరుల ఖర్చులు (సిమెంటు, ఉక్కు, లేబర్ మొదలైనవి) పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్ ఇళ్ల నిర్మాణం మరింత కష్టంగా మారుతోంది‘ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. డిమాండు రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు అపార్ట్మెంట్లకు డిమాండు ఉంటోందని ఆయన పేర్కొన్నారు. (7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
సూచీలకు పన్ను పోటు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్ సెషన్ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఏఎంసీ షేర్ల పతనం.. తాజా ఫైనాన్స్ బిల్లుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్ 3.2 శాతం, నిప్పన్ లైఫ్ ఇండియా 1.3 శాతం చొప్పున క్షీణించాయి. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం.. కారణాలివీ.. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు. డీల్స్ వెనకడుగు ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రణాళికలున్నాయి. మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం. -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్వెస్ట్ బ్యాంక్కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
ఎఫ్పీఐ పెట్టుబడుల విలువ డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడుల విలువ 2022 డిసెంబర్కల్లా 11 శాతం క్షీణించింది. మార్నింగ్స్టార్ నివేదిక ప్రకారం 584 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ విలువ 2021 డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందుకు ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల రిటర్నులు నీరసించడం, ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే త్రైమాసికవారీగా చూస్తే ఎఫ్పీఐల పెట్టుబడులు 3 శాతం బలపడ్డాయి. 2022 సెప్టెంబర్కల్లా 566 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. డిసెంబర్కల్లా 584 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. కాగా.. దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పీఐ పెట్టుబడుల వాటా సెప్టెంబర్తో పోలిస్తే డిసెంబర్కల్లా 16.97 శాతం నుంచి 17.12 శాతానికి మెరుగుపడింది. 2020, 2021 కేలండర్ ఏడాదుల్లో వృద్ధి చూపిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు 2022లో కుదుపులు చవిచూసిన విషయం విదితమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే దేశీ మార్కెట్లు సానుకూల రిటర్నులు ఇచ్చిన జాబితాలో నిలవడం గమనార్హం! 4.5 శాతం ప్లస్ బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పుంజుకుంది. అయితే స్మాల్ క్యాప్ 1.8% నష్టపోయింది. 2022లో పలు ప్రతికూలతల నడుమ దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయి. -
ఆదిత్య బిర్లా లాభం 94 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కన్సాలిడేటెడ్ లాభం డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు, 94 శాతం తగ్గిపోయి రూ.11 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.197 కోట్లుగా ఉంది. ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.3,589 కోట్లకు చేరింది. ప్రధానంగా మార్కెటింగ్ వ్యయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు రెండు రెట్లు పెరగడం నికర లాభం తగ్గిపోయేందుకు కారణమైనట్టు సంస్థ తెలిపింది. వ్యయాలు 31 శాతం పెరిగి రూ.3,603 కోట్లుగా ఉన్నాయి. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్స్టయిల్ విభాగం ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,466 కోట్లుగా ఉంటే, ప్యాంటలూన్స్ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,159 కోట్లుగా ఉంది. తన బ్రండెడ్ అవుట్లెట్లను 245 వరకు పెంచుకుంది. -
యస్ బ్యాంక్కు మొండి బాకీల భారం
ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
సోలార్ రంగంలో తగ్గిన కార్పొరేట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సోలార్ రంగంలో కార్పొరేట్ ఫండింగ్ గతేడాది మొదటి తొమ్మిది నెలల్లో 13 శాతం తగ్గింది. 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మెర్కామ్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 2021లో ఇదే కాలంలో 27.8 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది. వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ (వీసీ, పీఈ), డెట్ ఫైనాన్స్, పబ్లిక్ మార్కెట్ ఫండింగ్ను కార్పొరేట్ ఫండింగ్గా చెబుతారు. 2021తో పోలిస్తే గతేడాది వీసీ పెట్టుబడులు 56 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డెట్ ఫైనాన్స్ 24 శాతం తగ్గి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్స్ 5.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో వచ్చిన 7.5 బిలియన్ డాలర్లతో పో లిస్తే 32 శాతం తక్కు వ. అంతర్జాతీయంగా సోలార్ రంగంలో 2022లో మొత్తం 128 విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగాయి. ‘‘ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యం ఈ రంగానికి మద్దతుగా నిలిచింది. సోలార్ ప్రాజెక్టుల కొనుగోళ్ల పరంగా 2022 ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసీ, పీఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్లో వృద్ధిలేకపోగా..
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022 డిసెంబర్లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి. ► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల పరిస్థితి ఇలా... ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్ భరత్వాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్–డిసెంబర్ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్–డిసెంబర్ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్లు నిలిచాయి. -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ల లక్ష్యాలు మిస్..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిర్దేశించుకున్న 10 లక్షల యూనిట్ల కన్నా అమ్మకాలు 20 శాతం తక్కువగా నమోదు కావచ్చని పరిశ్రమ సమాఖ్య ఎస్ఎంఈవీ భావిస్తోంది. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల సబ్సిడీని విడుదల చేయకుండా ఆపి ఉంచడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2022 సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ టూ–వీలర్ల అమ్మకాలు 6 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మూడు ప్రధాన ఎలక్ట్రిక్ టూవీలర్ల సంస్థలు (హీరో ఎలక్ట్రిక్, ఓలా, ఒకినావా) తొలిసారి 1 లక్ష వార్షిక విక్రయాల మైలురాయిని దాటాయి. ఈ మూడింటికి 50 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. 2022లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ నీతి ఆయోగ్, ఇతరత్రా పరిశోధన ఏజెన్సీలు అంచనా వేసిన స్థాయిలో విక్రయాలు ఉండటం లేదని ఎస్ఎంఈవీ తెలిపింది. ’వాహన్’ పోర్టల్ గణాంకాల ప్రకారం గతేడాది నవంబర్లో 76,162 యూనిట్లు అమ్ముడు కాగా డిసెంబర్లో 28 శాతం తగ్గి 59,554 యూనిట్లకు పడిపోవడం ఒక హెచ్చరికగా కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్తో ముగిసిన తొలి తొమ్మిది నెలల్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు, ఇదే తీరు కొనసాగితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నీతి ఆయోగ్ అంచనా వేసిన 10 లక్షల యూనిట్లకు 20 శాతం దూరంలో ఆగిపోవచ్చని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెప్పారు. గత రెండు నెలలుగా అమ్మకాలు తగ్గుతుండటానికి పలు అంశాలు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల పైచిలుకు సబ్సిడీని చాలా నెలలుగా విడుదల చేయకుండా ఆపి ఉంచడంతో పలు కంపెనీలకు (ఓఈఎం) నిర్వహణ మూలధనంపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని గిల్ చెప్పారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 20 లక్షల యూనిట్ల అమ్మకాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. ఓఈఎంలపై ఆరోపణలు .. దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా ఫేజ్ 2 స్కీము కింద ఇస్తున్న సబ్సిడీలను కొన్ని తయారీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రెండు కంపెనీలను, వాటి మోడల్స్ను ఫేమ్ స్కీము నుంచి సస్పెండ్ చేసింది. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తగు ఆధారాలు ఇచ్చే వరకూ వాటి పెండింగ్ క్లెయిముల ప్రాసెసింగ్ను ఆపివేసింది. బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఒకాయా ఈవీ, జితేంద్ర న్యూ ఈవీ టెక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (గతంలో యాంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్), రివోల్ట్ ఇంటెలికార్ప్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్, ఏవన్ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, ఠుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ఉన్నాయి. -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్హౌసింగ్కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి. 2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. -
17 శాతం తగ్గిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022–23, ఏప్రిల్–అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది. వెండి దిగుమతులు అప్... ఇక వెండి దిగుమతులు అక్టోబర్లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021–22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. -
దేశంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు)లో నిరుద్యోగ రేటు 7.2 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగం 9.8 శాతంగా ఉండడం గమనార్హం. నాడు కరోనా తీవ్రత అధికంగా ఉండడం ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపించింది. 15 ఏళ్లు నిండి, అర్హతలుండీ పనిలేని వారిని ఈ గణాంకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడం, క్రమంగా పురోగతి చూపిస్తున్న క్రమంలో నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోంది. 16వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) గురువారం విడుదల చేసింది. ► జూలై–సెప్టెంబర్ మధ్య పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.6 శాతంగా ఉంది. ► పట్టణ మహిళల్లో ఇది 9.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో పట్టణాల్లో మహిళా నిరుద్యోగ రేటు 11.6 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 9.5 శాతంగా ఉంది. ► ఇక పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగం 6.6 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 9.3 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఇది 7.1 శాతంగా ఉంది. ► 2017 ఏప్రిల్ నుంచి ఎన్ఎస్వో ప్రతి మూడు నెలల కాలానికి సంబంధించి నిరుద్యోగం వివరాలను విడుదల చేస్తోంది. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గాయి. ఈ కాలంలో 26.9 బిలియన్ డాలర్ల (రూ.2.2 లక్షల కోట్లు) ఎఫ్డీఐ మన దేశంలోకి వచ్చినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది. ఆ తర్వాత మారిషస్ 3.32 బిలియన్ డాలర్లు, యూఏఈ 2.95 బిలియన్ డాలర్లు, యూఎస్ఏ 2.6 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.76 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.18 బిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్డీఐ మన దేశంలోకి వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లోకి 4.16 బిలియన్ డాలర్లు రాగా, ట్రేడింగ్ 3.28 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.3 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ పరిశ్రమ 932 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగం 990 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్డీఐని రాబట్టాయి. -
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్లో తాజాగా 12వ విడత ఇన్స్టాల్మెంట్ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
ఫేస్బుక్లో అన్ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్బర్గ్కు తిప్పలు తప్పలేదు. జుకర్బర్గ్కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్గా మెసేజ్లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
బలహీన కరెన్సీల్లో రూపాయి
ముంబై: గత వారం రోజుల వ్యవధిలో అత్యంత అధ్వాన్నంగా పడిపోయిన వర్ధమాన దేశాల కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ వారం రోజుల్లో 2.4 శాతం క్షీణించింది. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మిగతా వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి గట్టిగానే నిలబడింది. 7.6 శాతం మాత్రమే పతనమైంది. ప్రస్తుతం 81.73 వద్ద ట్రేడవుతోంది. కొరియా కరెన్సీ వోన్ (–16.9 శాతం), ఫిలిప్పీన్స్ పెసో (–14.3 శాతం), థాయ్ బాహత్ (–13.3 శాతం), చైనా యువాన్ (–12.8 శాతం) మరింత భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం తదితర అంశాలు డాలర్ బలోపేతానికి దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీనివల్ల వర్ధమాన మార్కెట్లే కాకుండా సంప న్న మార్కెట్ల కరెన్సీలు కూడా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. యూరో 13.2 శాతం, పౌండ్ స్టెర్లింగ్ .. యెన్ చెరి 18.2 శాతం మేర క్షీణించడం ఇందుకు నిదర్శనమని వివరించింది. రూపాయిని స్థిరపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరింత అధిక స్థా యిలో వడ్డీ రేట్లను పెంచాల్సి ఉండవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు, విదేశీ మారక నిల్వలు (ఫారె క్స్) క్షీణించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ఐపీవో నిధుల సమీకరణ వీక్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పబ్లిక్ ఇష్యూల వేగం తగ్గింది. దీంతో 14 కంపెనీలు మాత్రమే లిస్టింగ్కురాగా.. కేవలం రూ. 35,456 కోట్లు సమీకరించాయి. గతేడాది తొలి అర్ధభాగంలో 25 ఇష్యూల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న రూ. 51,979 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు 32 శాతం క్షీణించాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాలివి. నిజానికి మొత్తం నిధుల సమీకరణలో 58 శాతం వాటాను ఆక్రమించిన ఎల్ఐసీ ఇష్యూ(రూ. 20,557 కోట్లు)లేకుంటే ఈ సంఖ్య మరింత నిరుత్సాహకరంగా కనిపించేదని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అయితే ప్రైమ్ గణాంకాల ప్రకారం ఇకపై ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇప్పటికే 71 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు అనుమతులు పొందాయి. తద్వారా రూ. 1,05,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. ఇవికాకుండా మరో 43 కంపెనీలు రూ. 70,000 కోట్ల పెట్టుబడుల కోసం సెబీని ఆశ్రయించాయి. అనుమతులు వెలువడవలసి ఉంది. మొత్తం ఈ జాబితాలో 10 న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీలుకాగా.. రూ. 35,000 కోట్ల సమీకరణకు వేచి చూస్తున్నాయి. ఈక్విటీ నిధులు సైతం డీలా తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ సైతం 55 శాతం క్షీణించింది. రూ. 41,919 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో ఈక్విటీ మార్గంలో రూ. 92,191 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఎల్ఐసీని మినహాయిస్తే డెల్హివరి రూ. 5,235 కోట్లు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రూ. 1,581 కోట్లు సమకూర్చుకున్నాయి. 14 కంపెనీలలో డెల్హివరీ మాత్రమే న్యూఏజ్ టెక్ కంపెనీ కావడం గమనార్హం! పేటీఎమ్సహా కొన్ని ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచడం ప్రభావం చూపింది. దీంతో 14 ఐపీవోలలో 4 కంపెనీలకు మాత్రమే 10 రెట్లు, అంతకుమించిన స్పందన లభించింది. ఈ కాలంలో కేవలం 41 కంపెనీలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో 87 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. మరో 2 కంపెనీలు రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు వీలుగా రెండు కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. జాబితాలో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్, ఉదయ్శివ్కుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. దీంతో ఈ నెల(సెప్టెంబర్)లో ఇప్పటివరకూ కొత్తగా 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టినట్లయ్యింది. కాగా.. ఐపీవోలో భాగంగా ఎన్విరో ఇన్ఫ్రా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇక ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రెండు సంస్థలూ వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనున్నాయి. ప్రభుత్వం తదితర సంస్థలకు చెందిన నీటిపారుదల పథకాలు, వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ సేవలు ఎన్విరో అందిస్తోంది. ఉదయ్శివకుమార్ రహదారుల నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. తదితరాల నిర్మాణం, నిర్వహణలను ఎన్విరో చేపడుతోంది. రోడ్లు, బ్రిడ్జిలు, ఇరిగేషన్, కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం తదితరాలను చేపడుతోంది.