executive officer
-
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్16) బాధత్యలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. -
శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, సింహాచలం దేవాలయాల ఈవోలు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఈజవో లవన్న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. ఇక, లవన్న.. శ్రీశైలం ఈవోగా రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే, సింహాచలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసమూర్తి నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన -
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా శిరీష
విశాఖపట్నం: కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకూ ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామచంద్రస్వామి దేవస్థానం ఆస్తులు, అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వా«దీనం చేసుకొని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. దీంతో శిరీషాను అమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో శిరీష ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
శ్రీవారి దర్శన సమాచారం ఇవ్వడానికి..
సాక్షి, తిరుమల : శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏ సమాయానికి దర్శనమవుతుందో తెలియజేయడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమాచార ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించేందుకు చేపట్టామని అన్నారు. జూన్ మాసానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఈ నెల 8న సాయంత్రం అంకురార్పణ, 13న విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 13 నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘మహసంప్రోక్షణ’పై పుస్తకం తెస్తాం.. తిరుమల శ్రీవారి ఆలయంలో గతేడాది నిర్వహించిన మహసంప్రోక్షణ, 2030లో నిర్వహించే మహసంప్రోక్షణ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకువస్తామని ఈవో వెల్లడించారు. ఆగమ సలహా మండలి సూచన మేరకు రూ.1.5 కోట్లతో రథ మండపం, రూ.23 కోట్లతో నారాయణ గిరి ఉద్యానవనంలో క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నామని తెలిపారు. రూ.4.5 కోట్లతో శ్రీవారి పుష్కరిణి ఆధునికీకరణపనులు చేస్తూన్నామని తెలిపారు. ఏఫ్రిల్ 24 నుంచి 27 వరకు వరహాస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ ఉంటుందని పేర్కొన్నారు. -
తాజా మార్పులపై అవగాహన తప్పనిసరి
తిరుపతి అర్బన్: టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తీసుకునే తాజా మార్పులపై ముందుగా టీటీడీ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఈఓ అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ విషయమై గురువారం తిరుమల, తిరుపతిలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి శ్వేత భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకు వసతి, దర్శనం, ఇతర సౌకర్యాల గురించి వివరించడంలో పాటించా ల్సిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ టీటీడీలో ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను భక్తులకు సకాలంలో చేరవేయడంలో సమాచార కేంద్రాల సిబ్బంది మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు. సిబ్బందికి సంపూర్ణ అవగాహన ఉంటేనే భక్తులకు కావాల్సిన సమాచారాన్ని సమగ్రంగా, స్పష్టంగా చెప్పగలుగుతారన్నారు. భక్తుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి ఆయా విభాగాలకు తెలియజేయాలన్నారు. దర్శనం, సేవల రద్దు సమాచారంలో జాగ్రత్తలు టీటీడీ పరిధిలోని అన్ని సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది శ్రీవారి దర్ళనం వేళలు, ఆర్జిత సేవల రద్దు సమాచారం తెలుసుకుని భక్తులకు చెప్పడంలో జాగ్రత్త వహించాలని ఈఓ కోరారు. టీటీడీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తిరుమలలో గదులకు సంబంధించిన సమస్యలపై భక్తులు కాల్ సెంటర్కు ఫోన్చేస్తే అక్కడి సిబ్బంది తక్షణం ఎఫ్ఎంఎస్ హెల్ప్లైన్కు కలపాలని ఈఓ ఆదేశించారు. అదేవిధంగా భక్తులు ఏ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారో గుర్తించి నమోదు చేసుకోవడం ద్వారా ఆ విభాగంలోని ఉద్యోగులను అప్రమత్తం చేయవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ద్వారా సమాచారం అడుగుతున్న నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సమాచారం ఇచ్చే అంశాలపై సాంకేతిక విభాగం అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. టీటీడీ ప్రాజెక్ట్ల స్పెషలాఫీసర్ ముక్తేశ్వరరావు, శ్వేత డైరెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగస్టు 12 నుంచి శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఆగస్టు కోటాలో 56,310 టికెట్లను.. ఉదయం 10.00 గంటలకు ఆన్లైన్లో పెట్టామన్నారు. ఆన్లైన్ డిప్ విధానంలో 9,960 సేవా టికెట్లు విడుదల చేశామన్నారు. వీటిల్లో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయన్నారు. విశేషపూజ 1,500, శ్రీవారి కల్యాణం 10,925, ఊంజల్సేవ 3,450, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకార సేవ 12,600 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో అదనపు బూందీ పోటు శ్రీవారి ఆలయానికి మరో అదనపు బూందీ పోటు నిర్మించే యోచనలో ఉన్నట్టు సింఘాల్ తెలిపారు. ఇటీవల వరుసగా బూందీపోటులో అగ్నిప్రమాదాలు జరుగుతున్నందున మరొకటి నిర్మిస్తే రోజువారీ శుభ్రత చర్యలు చేపట్టేందుకు వీలు ఉంటుందని చెప్పారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఎయిర్పోర్టు మోడల్ తరహాలో తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్ట్మెంట్లలో స్కానింగ్ కేంద్రాలు, డీఎఫ్ఎండీ, మెటల్ డిటెక్ట ర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సీసీ టీవీలు, వీడి యో వాల్ పనులూ పూర్తి చేస్తామన్నారు. -
వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
సాక్షి, తిరుమల: తిరుమల లో శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. వసం తోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగారు. మహిళలు గోవింద నామ స్మరణలతో ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. వేలాదిమంది భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం ముగిసిన తర్వాత స్వామివారిని ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మంటపానికి వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జీయర్ నేతృత్వంలో రామకృష్ణ దీక్షితులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిం చారు. వసంతోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పట్టువస్త్రం, ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులతో కలిసి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్నారు. -
చేసేపని మంచిదైతే..అవాంతరాలన్నీ చిన్నబోతాయ్..
దైవక్షేత్రాల్లో ఈఓ స్థాయి ఉద్యోగం చేయడమంటే కత్తిమీద సామే. అయితే తండ్రి అడుగుజాడలు, భర్త ప్రోత్సాహంతోనే సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నా. చిన్నతనం నుంచి నాకు ఓ ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేంటంటే.. ‘మనం చేసే పని మంచిదైతే అవాంతరాలన్నీ చిన్నబోతాయని’. ఈ సిద్ధాంతాన్ని నమ్మి వృత్తిలో సేవే పరమావధిగా త్రికరణశుద్ధితో పనిచేస్తున్నాను.. అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్బముళ్ల భ్రమరాంబ ‘సాక్షి’తో తన భావాలను పంచుకున్నారు. మాది సంప్రదాయ కుటుంబం. నలుగురు అక్కచెల్లెళ్లం. సొంతూరు విజయనగరం జిల్లా అయినా మా తండ్రి సుబ్బారావు ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో కట్టుబాట్లు ఎక్కువే. చదువులకు బయటకు పంపడానికి నాన్న ఒప్పుకునేవారు కాదు. అయితే బలవంతంగా ఒప్పించి మెట్రిక్యులేష న్ పూర్తి చేశాను. మా తండ్రి దేవా దాయశాఖలో పనిచేస్తూ 1982లో మృతి చెందారు. మా అక్కచెల్లెళ్లలో ఏ ఒక్కరూ ఆయన స్థానంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురాకపోవడంతో నేను 18 ఏట ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి దేవాదాయశాఖలో వివిధ కేడర్లలో ఉద్యోగం చేసి, ప్రస్తుతం శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నా ను. నా భర్త ప్రసాద్ విశాఖపట్నంలో ఎల్ఐసీ హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ పరంగా ఆయన నాకు ఎంతో అండ. లింగవివక్షతో ఉద్యోగ విరమణకు పూనుకున్నా.. స్వతహాగా మహిళను కావడంతో ఉద్యోగరీత్యా అనేక సందర్భాల్లో నేను లింగవివక్షను ఎదుర్కొన్నాను. ఒకానొ క దశలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 2013లో రాష్ట్ర దేవాదాయ శాఖకు విన్నవించాను. అయితే వారు నా పనితనాన్ని మెచ్చి నా ఉద్యోగ విరమణ దరఖాస్తును తిరస్కరించారు. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా చొరవ తీసుకుని పనిచేసే భావన నాలో పెరిగింది. బాధ్యతల్లో ఆత్మసంతృప్తి.. విజయనగరం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో అనేక ఒత్తిళ్లు చవి చూశా. అయితే ఉద్యోగ ధర్మమే నన్ను నడిపించింది. విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాను. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మూడుసార్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మద్దతుగా ఉండడంతో పాటు శ్రీకాళహస్తి పాలక మండలి, అధికారుల సహకారంతో మహాకుంభాభిషేకంతో పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేయగలిగా. ఇక ఆలయ మాస్టర్ప్లాన్ పూర్తిచేస్తే ముక్కంటీశునికి నా సేవ పరిపూర్ణమైనట్లు భావిస్తా. -
వివాదాల్లో ఈవో.. కారణాలు ఏవేవో!
సాక్షి, విజయవాడ: దశాబ్దకాలంలో టి.చంద్రకుమార్, ఈ.గోపాలకృష్ణారెడ్డి, ఎన్.విజయకుమార్, ఎం.రఘునాథ్, కె.ప్రభాకరశ్రీనివాస్, సీహెచ్ నర్సింగరావు దుర్గగుడికి పూర్తికాలం ఈవోలుగా పనిచేశారు. ఇందులో ప్రభాకర శ్రీనివాస్, నర్సింగరావు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు కాగా, మిగిలిన వారు దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ కేడర్వారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ గట్టిగా రెండేళ్లు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోపణపై అర్థంతరంగా బదిలీ అయినవారే. సీహెచ్ నర్సింగరావు ఒక అర్చకుడిని మనోవ్యధకు గురిచేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. అర్చకులంతా «నిరసన తెలియజేయడంతో నర్సింగరావును బదిలీ చేశారు. ఒక మహిళా ఉద్యోగినిపై తన పీఏ సహాయంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో ప్రభాకర శ్రీనివాస్ను మార్చారు. ఈవో పీఏ ఒక మహిళా ఉద్యోగిని లైగింకంగా వేధిస్తూ ఎస్ఎంఎస్ పెట్టడం వివాదాస్పదమైంది. దేవస్థాన హుండీల్లో ఉండాల్సిన డబ్బు ఈవో కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడంతో అమ్మవారి సొమ్ము దారి మళ్లుతోందంటూ రఘునాథ్ను ఆ సీటు నుంచి తప్పించారు. టెండర్లలో అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం చేశారని విజయకుమార్ను, ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇళ్లను తొలగించేందుకు అమ్మవారి సొమ్మును చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయని చంద్రకుమార్ను బదిలీ చేశారు. ఇక రెండుసార్లు ఇన్చార్జిగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ ఒకసారి పాలకమండలితో విభేదించి, రెండోసారి పుష్కరాలకు పూర్తిస్థాయి ఈవోను వేయాలని మార్చారు. తాత్కాలిక ఈవోగా పనిచేసిన ఆర్.కృష్ణమోహన్ హయాంలో తొక్కిసలాట జరగడంతో ఆయననూ మార్చారు. తొలి మహిళా అధికారికీ తప్పని అవమానం దుర్గగుడికి తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారికి అవమానం తప్పలేదు. టీటీడీ తరహాలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చి ఆమెను దుర్గగుడి ఈవోగా వేశారు. ఆమెపై ఆరోపణలు రావడంతో చివరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం రద్దు చేశారు. దేవస్థానంలో తాంత్రిక పూజలు చేయించిన విషయం పొక్కడంతో ఈవో పదవి నుంచి తప్పించారు. ఈవోగా రెండేళ్లూ పనిచేయని సూర్యకుమారి తన పదవీ కాలమంతా వివాదస్పదంగానే గడిపారు. ఆదాయం పెంచడం కోసం టికెట్ రేట్లు పెంచడం, అమ్మవారి మూలధనాన్ని దుబారా చేయడం.. ఇలా అనేక విమర్శలు మూటగట్టుకున్నారు. కనీసం మూడేళ్లు ఉంటేనే అభివృద్ధి ఈవోలు కనీసం రెండేళ్లయిన పనిచేయకుండా మార్చివేయడంతో దేవాలయం అభివృద్ధి కుంటుపడుతోంది. దసరా, భవానీ దీక్షల విరమణ చేస్తే వారికి కొంత అవగాహన వస్తుంది. ఇలా అవగాహన పెంచుకుని పట్టు బిగించేలోపే ఈవోను బదిలీ చేసేస్తున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అర్చకులతోపాటు అనేక మంది సిబ్బంది దీర్ఘకాలం దేవస్థానంలోనే ఉండటంతో వచ్చిన ఈవోలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరకు ఈవోలు అప్రదిష్టను మూటగట్టుకుని వెళ్తున్నారు. -
నోరు మెదపవద్దని సీఎం ఆదేశం
-
పాలకమండలి సభ్యులపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని వాస్తవాలు బైటపెట్టిన పాలక మండలిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గగుడి వివాదంపై పాలక మండలి సభ్యులు ఇకపై నోరు మెదపవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం పాలక మండలి సభ్యులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే ఆలయంలో పూజలు జరగలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎలా ప్రకటించారని పాలకమండలి సభ్యులు...ఎమ్మెల్సీని నిలదీశారు. ఈవో వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇలాగే ముదిరితే పాలక మండలినే రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ సభ్యులను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అలాగే ఈవో సూర్యకుమారి తప్పేమీ లేదని చెప్పకపోతే దుర్గగుడి ఆయల ప్రతిష్ట దెబ్బతింటుందని సూచన చేశారు. కాగా సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. -
అసలేం జరిగింది?
సాక్షి, విజయవాడ: సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్గా మారింది. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. మరోసారి బయటపడిన విభేదాలు దుర్గగుడి పాలకమండలికి, ఈవో సూర్యకుమారికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాంత్రిక పూజలు జరగడంపై తాము గతనెల 30న పాలకమండలిలో చర్చించినా ఈవో సూర్యకుమారి వేగంగా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆమెను ఈవో పదవి నుంచి తొలగించి విచారణ చేయాలంటూ పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాలను మీడియా వద్ద ఏకరువు పెట్టారు. సూర్యకుమారి కూడా సాయంత్రం 4 గంటలకు తనను కలిసిన మీడియాతో మాట్లాడేటప్పుడు పాలకమండలి సభ్యులను కలుపుకోలేదు. పాలకమండలి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు స్పందించలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెబుతుంటే.. కేవలం శుద్ధిచేసే కార్యక్రమమే జరిగిందంటూ ఈవో సూర్యకుమారి చెప్పారు. వైదిక కమిటీ, ఆలయ అర్చకులతో ఆరోజు సంఘటనపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ మాట్లాడటం సరికాదంటూ ఈవో సూర్యకుమారి వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఏం జరిగిందనే అంశంపై తాము విచారణ చేయిస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట దుర్గగుడిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దేవాలయ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. ఇటీవల దేవస్థానంలో ఒక అటెండర్ చంద్రశేఖర్ టికెట్లు రీసైక్లింగ్ చేస్తుండగా అయ్యప్ప భక్తులకు పట్టుబడ్డాడు. చివరకు చంద్రశేఖర్ను సస్పెండ్ చేశారు. అంతకుముందు విజిలెన్స్ నివేదికలోనూ ఏడాది కాలంగా దేవస్థానంపై జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేశారు. ప్రసాదాల తయారీ నుంచి ఇంజినీరింగ్ విభాగం వరకూ జరుగుతున్న అవినీతిని ఈ నివేదికల్లో విజిలెన్స్ అధికారులు ఏకరువు పెట్టారు. -
పూజల కోసం పిలిచారని చెప్పలేదు
-
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు ఆన్లైన్ బుకింగ్
తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)– 2018 డైరీలు, క్యాలెండర్ల కోసం భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో జేఈవో పోలా భాస్కర్తో కలసి ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వీటిని ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయొచ్చన్నారు. -
పట్టు చిక్కేదెప్పుడు?
సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు దుర్గగుడిపై పట్టుకోసం తహతహలాడుతున్నారు. దేవస్థానంలో తమ మాటే చలామణి అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాలయం అంతర్గత విషయాలపై చూపించే ఆసక్తి దేవస్థానానికి నిధులు రాబట్టడంపై చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సభ్యులు తరచుగా ఈవో సూర్యకుమారితో విభేదించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నిధులు రాబట్టడంలో విఫలం పాలకమండలి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వద్ద తమ పరపతి ఉపయోగించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. కనీసం వారు చేసిన తీర్మానాలను ప్రభుత్వంతో అమలు చేయించలేకపోతున్నారు. దసరా ఉత్సవాలకు రూ.10 కోట్లు కావాలని తీర్మానం చేయడం మినహా ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి రాబట్టలేకపోయారు. అంతరాలయ దర్శనం రూ.300 నుంచి రూ.150 తగ్గించాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండకు నిధులు విడుదల చేసింది కానీ దుర్గగుడిపై నిర్లక్ష్యం చూపింది. పరిచయాలున్నా విరాళాలు నిల్ పాలకమండలిలో కొంత మందికి అధికార పార్టీ పెద్దలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి దాతల నుంచి దేవస్థానానికి చందాలు రాబట్టలేక పోతున్నారు. దీంతో అమ్మవారి మూలధనం తరిగిపోతోంది. మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలను ఒప్పించి విరాళాలు తెప్పించి దేవస్థానాన్ని ఆదాయంలో అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. దుర్గగుడికి ఆదాయం ఇచ్చేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిని గుర్తించి నిధులు రాబట్టడంపై పాలకమండలి శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిపై ప్రణాళిక ఏదీ? లడ్డూ ప్రసాదాలు ధరను తొలుత రూ.15 పెంచాలని యోచించారు. అయితే నాణ్యత పెంచి రూ.20 చేయాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి ఉమామహేశ్వరరావు పిలిచి పాలకమండలిని ప్రశ్నించారు. రేట్లు ఎందుకు పెంచామో చెప్పి ఆయన్ను ఒప్పించలేక, ఆయన సూచన మేరకు లడ్డూ రేటును రూ.15కు తగ్గించారు. పాలకమండలి సమావేశం జరిగితే, ఈవోతో విభేదించడమే తప్ప, అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపాదనలు పట్టించుకోని ఈవో బియ్యం మిల్లర్ల వద్ద రూ.41 కొనడాన్ని ఆక్షేపిస్తూ టెండర్లు పిలిస్తే రూ.38కే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తారనే వాదన చేశారు. అయితే రూ.38లకు లభించే బియ్యం ఒకలోడు తీసుకుని అగ్మార్కుకు పంపించి, వాటిని పరిశీలించిన తరువాత టెండర్ ఇద్దామనే ఈవో ప్రతిపాదనపై పాలకమండలి సభ్యులు సరిౖయెన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అన్నదానం, ప్రసాదాలు, స్టోర్స్, కేశఖండన వంటి వాటిపై పట్టుకోసం కమిటీలు వేయమంటూ ప్రతిపాదన తెస్తున్నారు. విభాగాలకు కమిటీలు ఏర్పడితే అక్కడ పనిచేసే సిబ్బందికి సమస్యలు తప్పవు. గతంలో ఉన్న పాలకమండలి సభ్యులు గ్యాస్ సిలిండర్లు, ప్రసాదాలు కూడా దేవస్థానం నుంచే తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి వచ్చి ఐదు నెలలు గడిచినా ఈవోతో విభేదించడం తప్ప భక్తులకు పెద్దగా ఒరిగిందేది కనపడటం లేదు. ఈ పాలకమండలి ఉన్నా,లేకున్నా ఒకటేలాగా ఉందనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచే వినవస్తోంది. -
రూ.3లక్షలకే ఉద్యోగం..
సాక్షి, అమరావతి : పవిత్రమైన భగవంతుడి సన్నిధిలో గడిపే పోస్టులకూ ప్రభుత్వ పెద్దల అండతో బేరసారాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖలో నిరుద్యోగులకు అవకాశం కల్పించటం ద్వారా భర్తీ చేయాల్సిన గ్రేడ్– 3 ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈవో) పోస్టులను సర్కారు వద్ద పలుకుబడి కలిగిన బ్రోకర్లు రూ. 3 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టారు. ముందుగా లక్ష చొప్పున వసూలు చేసిన బ్రోకర్లు తాత్కాలిక సిబ్బందికి పదోన్నతులు కల్పించటం ద్వారా భర్తీ చేసేందుకు మెమో కూడా జారీ చేయించటం గమనార్హం. రంగంలోకి బ్రోకర్లు దేవాదాయ శాఖలో గ్రేడ్–3 ఈవో పోస్టులు 167 ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆలయాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేసేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ‘సాక్షి’ రెండేళ్ల కిత్రమే పలు కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా ఆగింది. అయితే కొద్ది విరామం తరువాతబ్రోకర్లు మరోసారి దందాకు దిగారు. గుట్టుగా రూ.కోటిన్నర గుంజారు ఆలయాల్లో సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండదు. ఆలయ ఆదాయం నుంచే వీరికి జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయి. గ్రేడ్–3 ఈవో పోస్టును మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ ట్రెజరీల నుంచి జీతాలు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతి ద్వారా గ్రేడ్ –3 ఈవో పోస్టు దక్కించుకుంటే పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారనే ఉద్దేశంతో లక్షలు చెల్లించేందుకు సిద్ధపడటాన్ని బ్రోకర్లు అవకాశంగా మలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 167 మందిని గుర్తించి ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రూ. కోటిన్నరకు పైగా గుంజారు. మంత్రి కార్యాలయానికీ వాటాలు..! బ్రోకర్లు నజరానాగా వాటాలు పంచడంతో పదోన్నతుల ద్వారా భర్తీకి అనుమతిస్తూ ఉన్నతాధికారులు మోమో కూడా జారీ చేసినట్టు సమాచారం. మోమో జారీలో ఓ మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మోమో జారీ అయిన తర్వాత కూడా పోస్టులు దక్కకపోవడంతో డబ్బులు సమర్పించుకున్నవారు ప్రస్తుతం సచివాలయంలోని దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
ప్రభుత్వ అనుమతితోనే టీటీడీలో ఉద్యోగాల భర్తీ
రూ.300 స్లాట్ తరహాలో దివ్యదర్శనానికి ఏర్పాట్లు: టీటీడీ ఈవో అనిల్ కుమార్ తిరుపతి అర్బన్: ఖాళీగా ఉన్న టీటీడీ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే భర్తీచేస్తామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ టీటీడీ ఈవోతో ‘మీట్ ద ప్రెస్’ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోపు పిల్లల తల్లి దండ్రుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. నడిచివచ్చే భక్తులకు అమలు చేస్తున్న దివ్య దర్శనం విధానాన్ని రద్దుచేసే ఆలోచన లేదన్నారు. రూ.300 స్లాట్ తరహాలో ఈ నెల 17 నుంచి దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేక విధానం ద్వారా రోజుకు 20వేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించి ప్రయో గాత్మకంగా పరిశీలిస్తామన్నారు. గదుల మంజూరుకూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విధానంతో గదులు పొందే సౌలభ్యాన్ని అమలులోకి తేనున్నా మని ఈవో వెల్లడించారు. భక్తులు గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద వివరాలను టీటీడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెఫరెన్స్ టోకెన్ ఇచ్చి పంపేస్తారన్నారు. కేటాయించిన కాటేజీ, గది నంబర్లను వారి మొబైల్కు మెసేజ్ ద్వారా పంపుతామన్నారు. భక్తుడు ఆ సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి డబ్బు చెల్లిస్తే గది మంజూరు చేస్తామన్నారు. -
టీటీడీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి
- భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయం - మాస్టర్ప్లాన్ అమలులో ఇబ్బందులు - సోలార్ వ్యవస్థతో ఖర్చు తగ్గిస్తున్నాం - ·ప్రీ ఫ్యాబ్రికేషన్ గదుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం - ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఓ నారాయణభరత్ గుప్త శ్రీశైలం: తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు.. చేయలేకపోయిన కార్యక్రమాలను వివరించారు. భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. క్షేత్రంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఆధునిక టాయిలెట్స్ నిర్మాణం.. కాల్సెంటర్ ఏర్పాటు..ప్రగతి పనులుగా చెప్పుకొచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... వసతిపై స్పష్టత లేదు.. మొత్తం రూ.580 కోట్లతో మాస్టర్ప్లాన్ అంచనాలను రూపొందించారు గాని.. ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి దశలో డార్మెంటరీలు, అండర్గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థ, వాటర్ ట్రీట్ మెంట్ప్లాంట్, మంచినీటి సరఫరా వ్యవస్థ, సివరేజ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఉన్నంత వరకు దాదాపు అన్ని పూర్తిస్థాయిలో ముగింపు దశకు చేరుకున్నాయి. రెండో ఫేజ్లో వసతిగదుల నిర్మాణం కోసం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అవి ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అన్నదానిపై స్పష్టత లేదు. మల్లికార్జునసదన్ నిర్మించి ఎనిమిదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గదిని కూడా దేవస్థానం కట్టించలేదు. అంటే ఏ అధికారి ఆ దిశగా ఆలోచించలేదు. ప్రత్యేక గదులు.. దేవస్థానానికి ఉన్న నిధులతో ఆర్సీసీ బిల్డింగ్ నిర్మించాలంటే కనీసం చదరపు అడుగుకు సుమారు రూ. 2వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి తోడు కాలవ్యవధి కూడా ఎక్కువవుతుంది. ఈ పరిస్థితుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రీ ప్యాబ్ కన్స్ట్రక్షన్ ద్వారా ప్రత్యేక గదులను 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని చూస్తున్నాం. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 1700 చదరపు అడుగుకు అవుతుంది. అయితే ఈ గదులకు కామన్ బాత్రూమ్స్ మాత్రమే ఉంటాయి. మరో 50 అడుగుల పెంపుదలతో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 1900 నుంచి రూ. 2వేల వరకు చదరపు అడుగుల వ్యయంతో ఏసీ గదులను అందులోనే అటాచ్డ్ బాత్రూమ్లతో నిర్మించే పనిలో ఉన్నాం. సోలార్ వెలుగులు.. ఔటర్రింగ్రోడ్డు నిర్మాణ పనులను రూ.75 కోట్లతో ఆర్కె కన్స్ట్రక్షన్ చేపడుతోంది. ప్రతి ఏటా దేవస్థానం విద్యుత్ శాఖకు సుమారు రూ. 3కోట్లకు పైగా కరెంట్ బిల్లులు చెల్లిస్తోంది. దీనిని తగ్గించుకునేందుకు ఒకే సారి పెట్టుబడి పెట్టి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా దేవస్థానం అన్నపూర్ణ భవన్లో రూ 2 కోట్ల వ్యయంతో, మల్లికార్జునసదన్, వీవీఐపీ భ్రామరీసదన్, పలు కాటేజీలకు సోలార్ వ్యవస్థ ద్వారా వేడినీటితో పాటు విద్యుత్ వ్యయాన్ని కూడా తగ్గించే పనిలో ఉన్నాం. ఆయా వసతి గదుల్లో వైఫై సదుపాయాన్ని కూడా భక్తులకు కల్పిస్తున్నాం. అలాగే శ్రీశైలం టీవీ చానల్ను ఏర్పాటు చేయాలని భావించాం. ఇప్పటి వరకు చానల్కోసం రూ. 30లక్షల వరకు ఖర్చు చేశాం. దాతలు సహకరిస్తే మరింత తొందరగా చానల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ¯ð ల్లూరు ఏసిటీ నెట్వర్క్ వారి సహకారంతో ఛానెల్ను ఆప్లికింగ్ లేదా నెట్వర్క్ బ్యాకింగ్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నాం. చంద్రావతి కల్యాణమండపం నుంచి ఘంటామఠం, ఉద్యానవనం, శివాజీగోపుర మాడ వీధి అక్కడి నుంచి కృష్ణదేవరాయగోపురం నుంచి భక్తులు వచ్చేలా క్యూల నిర్మాణం జరుగుతోంది. ఇందు కోసం సుమారు రూ. 30 కోట్ల అంచనాతో ప్రణాళికను రూపొందిస్తున్నాం. కాల్ సెంటర్... భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు ఇది పని చేస్తుంది. ఫో¯Œన్ నంబర్లు 833901351,52, 53, 54,55,56.. గడిచిన 3 నెలల్లో 16 వేల ఫోన్ కాల్స్ ను కాల్ సెంటర్ రిసీవ్ చేసుకున్నాం. అభివృద్ధి ఇదీ.. పాతాళగంగ మార్గంలోని నీలకంఠ , భ్రమరాంబా వసతి సముదాయం (పిలిగ్రామ్స్ అమినిటీస్ కాంప్లెక్స్) నుంచి భక్తులు తాత్కాలిక వసతిని పొందవచ్చు. ఈ సముదాయంలో బెడ్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులతో పాటు లాకర్ సౌకర్యం కూడా కల్పించాం. భ్రమరాంబా వసతి సముదాయంలో ఏసీ సౌకర్యం ఉంది. ఆలయ సమీపంలోని అన్న పూర్ణభవనంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు అన్న ప్రసాదాలు (భోజన ప్రసాదం), సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు అల్పాహారం అందజేస్తున్నాం. అన్నదానం నిధుల నుంచి వచ్చే వడ్డీని ఆధారం చేసుకుని భక్తులకు అల్పాహార సౌకర్యాన్ని కూడా కల్పించాం. స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం, ఏకాంత సేవ తదితర సేవా టిక్కెట్లను ముందస్తుగా ఇంటర్నెట్ నుంచిపొందవచ్చు. దేవస్థానం గదులను , కాటేజీలను, రిజర్వ్ చేసుకునే సదుపాయం కల్పించారు. వివరాలకు www.srisailamonline.com ను సందర్శించవచ్చు. క్యూ కాంప్లెక్స్చ ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవ కౌంటర్లు, మల్లికార్జున సదన్ , గంగా సదన్ మొదలైన చోట్ల గల ప్రత్యేక కౌంటర్ల నుంచి ఆర్జితసేవ టిక్కట్లను పొందవచ్చు. శివగంగా జలప్రసాద పథకం కింద ఆలయ ప్రాంగణం, గౌరీసదనం, మల్లికార్జున సదనం, టూరిస్ట్ బస్టాండ్ , చంద్రవతి కళ్యాణ మండపం ప్రాంతాల్లో ఉచిత రక్షిత మంచినీటి కేంద్రాలు(మినరల్వాటర్ ప్లాంట్లు) ఏర్పాటు చేశాం. పాతాళగంగ మార్గంలో అధునాతన కళ్యాణ కట్ట నిర్మించాం.. ఉదయం 4.30 నుండి రాత్రి 9 వరకు భక్తులు ఇక్కడ తలనీలాలను సమర్పించవచ్చు. క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీ స్వామి వార్ల కైంకర్యానికి పూలతోటలను పెంచుతున్నాం. శ్రీశైల క్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చి దిద్దేందుకు పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొడిచెత్త, తడిచెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్బిన్లను ఏర్పాటు చేశాం. శ్రీశైలాలయ పరిసరాలు విశాలంగా కనిపించేందుకు మాడ వీధుల విస్తరణ పనులను చేపట్టాం. ప్రస్తుతం దక్షిణమాడ వీధి పనులు పూర్తయ్యాయి. పడమర, తూర్పు, ఉత్తర మాడ వీధి పనులు కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రోత్సవాల్లోగా వీటిని పూర్తి చేస్తాం. -
టీటీడీపై రూ.50 కోట్లకుపైగా జీఎస్టీ భారం
తిరుమల: జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి దేవస్థానంపై రూ.50 కోట్లకుపైగా అదనపు భారం పడుతున్నదని ఈవో సింఘాల్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...బంగారు డాలర్ల విక్రయంపై 3 శాతం, రూ.1000,రూ.2500 మధ్య అద్దె ఉన్న గదులకు 12 శాతం పన్ను, రూ.2500 అద్దెపైబడిన గదులకు 15 శాతం పన్నును భక్తుల నుంచి వసూలు చేయాల్సి వస్తున్నదన్నారు. భక్తులపై భారం పడుతున్న దృష్ట్యా టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. నెలలో రెండు రోజులు వృద్దులు, దివ్యాంగులకు గతంలో 1500 టోకెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు నాలుగు వేలకు పెంచామని, దీన్ని 18, 25 తేదీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే స్వామివారి దర్శనానికి ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు అనుమతిస్తామని, వీరికి 19, 26 తేదీలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని అన్నారు. అయితే దర్శన టికెట్లపై జీఎస్టీ ప్రభావం లేదన్నారు. కాగా, జూన్ నెలలో శ్రీవారిని 25,77,165 మంది భక్తులను దర్శించుకున్నారని, కోటి 74వేల 161మంది భక్తులకు లడ్డూలు అందించామని, ఆ నెలలో హుండీ ఆదాయం రూ.66 కోట్ల 56 లక్షలు వచ్చిందని సింఘాల్ తెలిపారు. టీటీడీ వద్ద పాతనోట్లు రూ.25 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ►ఇక అక్టోబర్ నెలకు సంబంధించి 56,295 ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల ►లక్కీడిప్ విధానానికి 12,495 ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు ►సుప్రభాతం 7,780, అర్చన 120, తోమాల సేవ 120 టిక్కెట్లు ►అష్టదల పాదపద్మారాధన 300, నిజపాద దర్వనం 2300 టిక్కెట్లు ►లక్కీడిప్ కింద విశేషపూజ 1875 టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచిన టీటీడీ ►లక్కీడిప్ కింద సేవా టిక్కెట్ల నమోదుకు వారం రోజుల వరకూ అవకాశం ►ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ టిక్కెట్ల కేటాయింపు ►టిక్కెట్ల కేటాయించిన భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం -
ఆలయంలో అపచారం
భద్రాద్రిలో లక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు మూయని అర్చకులు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడి ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మవారి కోవెల తలు పులను శుక్రవారం రాత్రి మూయకుండానే వదిలేశారు. రాత్రి వేళ విధుల్లో ఉన్న సెక్యూరిటీ(ఎస్టీఎఫ్)సిబ్బంది దీనిని గుర్తించి, తెల్లవార్లూ అక్కడనే కాపలా కాయాల్సి వచ్చింది. భద్రాద్రి రామాలయ తలుపులు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు మూస్తారు. గర్భగుడి తలుపులతో పాటు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా ఇదే సమయంలో మూస్తారు. అయితే శుక్రవారం రాత్రి విధు ల్లో ఉన్న అర్చకుడు పూజాది కార్యక్రమాల అనంతరం లక్ష్మి అమ్మవారి కోవెల ప్రధాన తలుపులు వేయకుండా బయట గేట్లును వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం(రాజగోపురం) తలుపులు కూడా వేసి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత ఆలయం లోపల విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, దీనిపై ఆలయ అర్చకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి కావటంతో ఆ సమయంలో ఎవరూ అందుబాటులోకి రాలేదని ఎస్టీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తీసిన సమయంలో ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ సిబ్బంది ఆలయ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం విధులకు హాజరైన అర్చకులు సంప్రోక్షణ అనంతరం తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శేఖర్ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అర్చకుడికి మెమో జారీ చేస్తాం లక్ష్మి తాయారు అమ్మవారి కోవెల తలుపులు శుక్రవారం రాత్రి వేయకుండా వదిలేసిన విషయమ వాస్తవమే. దీనిపై ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడికి మెమో జారీ చేస్తాం. ఎందుకిలా జరిగిందనే దానిపై ఆయన వివరణ కోరుతాం. ఆయన ఇచ్చిన సమాధానం అనంతరం ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను. – ఈఓ ప్రభాకర శ్రీనివాస్ -
శ్రీవారి ఆలయంలో కొత్త క్యూలైను
- శనివారం నుంచి అమలు.. తగ్గిన 300 మీటర్ల దూరం - త్వరగా స్వామి దర్శనం, తోపులాటల నివారణకు శ్రీకారం - టీటీడీ కొత్త ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వీయ పర్యవేక్షణ సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో శనివారం నుంచి కొత్త క్యూలైను అమలు చేశారు. దీని ఫలితంగా భక్తులకు త్వరగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించటంతోపాటు 300 మీటర్ల క్యూలైన్ దూరం, తోపులాటలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గతంలో సర్వదర్శనం, కాలిబాట, రూ. 300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి మహద్వారం దాటుకున్న తర్వాత పడకావలి ఎడమవైపు రంగనాయక మండపం వెనుక నుంచి కల్యాణోత్సవం మండపం మీదుగా వెండివాకిలి ద్వారా అనుమతించేవారు. క్యూలైన్లలో తోపులాటలు, ఒకే సమయంలో ఆలయంలోకి వెళ్లిన భక్తులకు స్వామి దర్శన సమయంలో వ్యత్యాసంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ కొత్త ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు కొత్త క్యూలైన్లకు శ్రీకారం చుట్టారు. పడకావలిలోని తులాభారం మండపం పక్క నుంచి తిరుమల రాయమండపం మీదుగా కల్యాణోత్సవం వెలుపల క్యూలైను మీదుగా వెండివాకిలి వరకు కొత్త క్యూలైన్ ఏర్పాటు చేశారు. సుమారు 40 మీటర్ల పొడవు, 6 అడుగుల వెడల్పుతో దీన్ని అమలు చేశారు. ఇక్కడే ఉన్న పాత క్యూలైన్ను రెండు లేన్లుగా విస్తరించారు. దీనివల్ల పడకావలి నుంచి ధ్వజమండపం మీదుగా నేరుగా వెళ్లే భక్తులకు, కొత్త క్యూలైన్లో వెళ్లే భక్తులకు స్వామి దర్శనం సమయంలో వ్యత్యాసం కేవలం 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉండనుంది. ఈ కొత్త క్యూలైన్ పక్కాగా అమలు చేయటం కోసం కొత్త ఈవో, జేఈవో వారం రోజులుగా ఆలయంలోనే ఎక్కువ సమయం ఉంటూ ఇంజనీర్లకు మార్పులుచేర్పులు చెబుతూ పనులు చేయించారు. -
దేవాదాయ శాఖలో అవినీతి జలగ
► ఈఓ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు ► రూ.కోటికి పైగా అక్రమాస్తుల గుర్తింపు ► తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు తణుకు: దేవాదాయ శాఖలో ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఓ అధికారిని ఏసీబీ అధికారులు గుర్తించారు. తూర్పుగో దావరి జిల్లా పెద్దాపురంలో దేవాదాయశాఖకు చెందిన రాజా వత్సవాయి సు బ్బు, బుచ్చమ్మ ఆశ్రమం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న చీమలకొండ సా యిబాబు నివాసంతోపాటు కార్యాల యం, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు చేశారు. ఆశ్రమంలో అన్నదానం జరగకుండా జరిగినట్టుగా రికార్డులు చూపిస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణల కారణంగా ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ప్రాథమిక సమాచారం మేరకు సాయిబాబు కూడబెట్టిన రూ.90 లక్షల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు అధికారులు చెబుతుండగా ఆయన స్థిరాస్తుల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం వేకువజాము నుంచి మొదలైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. సాయిబాబును మంగళవారం కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. మొదట్నుంచీ ఆరోపణలే.. రెండేళ్లుగా పెద్దాపురం సత్రానికి ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు తణుకు మండలం కోనాల, ముద్దాపురం గ్రూపు ఆలయాలకు ఇన్చార్జి ఈవోగా పదిహేనేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు పెంటపాడు మండలం బైరాగిమఠం (సత్రం) ఈఓగా పనిచేసిన ఆయనపై గతం నుంచి అవినీతి అరోపణలు ఉన్నాయి. ఆరుళ్ల సాయిగా అతడిని పిలుస్తుంటారు. ఇరగవరం మండలం రేలంగి స్వగ్రామం కాగా తణుకు పట్టణంలోని బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. అంతేకాకుండా మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, అపార్టుమెంట్లోని ప్లాటు ఉన్నాయి. పెద్దాపురంలోని కార్యాలయంతోపాటు భీమవరంలోని ఆయన బావమరిది ఇల్లు, రేలంగి, తణుకులో స్నేహితుడి ఇళ్లలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు అవినీతి ఆరోపణలు ఆధారంగా కొద్దికాలంగా అతడి కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఏసీబీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అనుమతితో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో సెర్చ్ వారెంట్ తీసుకుని ఏ కకాలంలో దాడులు చేశారు. ఇల్లే కార్యాలయంగా.. సోదాల సమయంలో కోనాల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 35 ఎకరాల భూముల డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కార్యాలయ రికార్డులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన అధికారులకు ఇంటినే కార్యాలయంగా వాడుకుంటున్నానని సాయిబాబా చెప్పడం కొనసమెరుపు. వీటితోపాటు కుటుంబ సభ్యుల 14 బ్యాంకు ఖాతాల పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేశారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ విలేకరులకు చెప్పారు. కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇంట్లోకి ఎలా వచ్చాయనే వివరాలు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సోదాల్లో డీఎస్పీ గోపాలకృష్ణతోపాటు సీఐలు విల్సన్, బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖలో కలకలం దేవాదాయశాఖలో ఈఓగా పనిచేస్తున్న చీమలకొండ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించడం ఆ శాఖలో కలకలం రేపింది. సోమవారం వేకువజాము నుంచి తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాలు ఆ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. -
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
-
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
- టీటీడీ ఈవో సింఘాల్ వెల్లడి - కంపార్ట్మెంట్లలో ఉచిత ఫోన్, హెల్ప్డెస్క్ సౌకర్యం సాక్షి, తిరుమల: ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న గదులు తిరిగి రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రిఫండ్ చేస్తామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. గది పొందిన తర్వాత కూడా నిర్ణీత సమయాని కంటే ముందుగా ఖాళీ చేసినా కొంత నగదు తిరిగి చెల్లిస్తామని శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత జూలై నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తమ బంధువులతో మాట్లాడేందుకు వీలుగా ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి, ప్రతి కంపార్ట్మెంట్లోనూ జూన్ నెలాఖరులోగా ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. లక్కీడిప్ పద్ధతిలో ఆర్జిత సేవాటికెట్లు సెప్టెంబర్కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 16 ఉదయం 11 గంటల నుంచి లక్కీడిప్ పద్ధతిలో కేటాయిస్తామని ఈవో తెలిపారు. ఈ కొత్త విధానంలో మొదటి మూడు రోజులపాటు భక్తులు కోరుకున్న సేవా టికెట్ల కోసం నమోదు చేసుకుంటారని, ఆ తర్వాత కంప్యూటర్ ర్యాండమ్ విధానంలో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామన్నారు. యాగఫలంతో విస్తారంగా వర్షాలు.. తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన కారీరిష్టియాగం, వరుణజపం ఫలితంగా వర్షాలు విస్తారంగా కురిసి దేశం, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని టీటీడీ ఈవో సింఘాల్ ఆకాంక్షించారు. శుక్రవారం పారువేట మండపం, వరాహస్వామి ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో వరుణయాగం ముగిసింది. వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, తద్వారా దేశంలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో సుమారు 30 మంది రుత్వికులు ఈ యాగం నిర్వహించారన్నారు. -
టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్
సాక్షి, తిరుమల: టీటీడీ నూతన ఈవో అనిల్కుమార్ సింఘాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.56కు తిరుమల ఆలయం లోని రంగనాయకుల మండ పంలో బదిలీ అయిన ఈవో డి.సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల విరాళం ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఏపీ ఐఏఎస్లలో ముసలం
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. రాష్ట్రంలోని వివిధ కేడర్లకు చెందిన ఐఏఎస్ల బదిలీలు జరగనుండటంతో కొన్ని పోస్టులను తమకు ఇవ్వాలంటే.. తమకే ఇవ్వాలని ఉత్తరాది, దక్షిణాదికి చెందిన అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ఏకే సింఘల్ టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఈ చిచ్చు రాజుకుంది. ఉత్తరాది వ్యక్తయిన సింఘల్కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వొద్దని, ఈవో పోస్టుకు తన పేరును పరిశీలించాలని జవహర్రెడ్డి కోరినట్లు తెలిసింది. కొందరు ముఖ్య అధికారులు ఏకే సింఘల్కు మద్దతిస్తున్నారంటూ జవహర్ రెడ్డి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారని సమాచారం. ఇదిలావుండగా.. ఈవో పోస్టుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 58,067 టికెట్లు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో వెల్లడించిన టికెట్లలో.. సుప్రభాతం 6,542, అర్చన 120, తోమాల 120, విశేషపూజ 1,875, అష్టదళ పాదపద్మారాధన సేవ 60, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం 11,250, వసంతోత్సవం 12,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, సహస్రదీపాలంకార సేవ 14,250, ఊంజల్సేవ 3,000 టికెట్లు ఉన్నాయి. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1,038 కోట్లు, ఈ–హుండీ ద్వారా రూ.15.64 కోట్లు, లడ్డూలు 10.43 కోట్లు, 2.48 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామన్నారు. తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల సేవలకు సంబంధించి ఇంటెర్నెట్ కోటాలోని 120 టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఈనెల 14వ తేదీ తమిళ కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి ఎస్వీబీసీ తమిళ చానెల్–2 పూర్తి స్థాయిలో ప్రసారాలు సాగిస్తామన్నారు. అంతర్జాతీయ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించేందుకు అనువుగా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. టీటీడీ ఆరంభించిన గోవిందా మొబైల్ యాప్ నుంచి హుండీ, ఈ–డొనేషన్, రూ.300 టికెట్లకు మంచి స్పందన లభిస్తోందన్నారు. -
సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఆహ్వానం
అమరావతి: ఈ నెల 10వ తేదీన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో సాంబశివరావు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన ఈవో సీఎంను కలిసి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరారు. శ్రీరామనవమి బ్రహోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో పురాతన ప్రసిద్ధ రామ మందిరమైన ఒంటిమిట్ట దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు ఈవో తెలిపారు. -
టీటీడీ యాప్ ప్రారంభం
ఇకపై మొబైల్ఫోన్ నుంచే టీటీడీ సేవలు: ఈవో సాంబశివరావు సాక్షి, తిరుమల: మొబైల్ ఫోన్ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ–హుండీ, ఈ–డొనేషన్ సౌకర్యాలు పొందేలా టీటీడీ మొబైల్యాప్ రూపొందించింది. ఉగాది సందర్భంగా తిరు మల ఆలయం వద్ద బుధవారం ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్’ పేరుతో కొత్త యాప్ను టీటీడీ ఈవో డాక్టర్ దొండ పాటి సాంబశివరావు ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ.. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్తో ఇప్పటివరకు 1.30 కోట్ల మంది శ్రీవారి దర్శనం చేసుకు న్నట్లు వివరించారు. ఐటీ సంస్థ టీసీఎస్ సహకారంతో మొబైల్ యాప్ రూపొందించి నట్లు తెలిపారు. ఇకపై భక్తులు శరవేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా యాప్ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతానికి ఈ–హుండీ, ఈ–డొనేషన్, రూ.300 దర్శన టికెట్ల బుకింగ్, గదుల బుకింగ్ సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గూగుల్ స్టోర్, టీటీడీ వెబ్సైట్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ వెబ్సైట్కున్న 33 లక్షల మంది యూజర్లు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. టీటీడీ ఆన్లైన్ సేవలు భేష్: సుధానారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవ స్థాపకులు సుధానారాయణమూర్తి టీటీడీ ఐటీ సేవల్ని అభినందించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టీటీడీ శ్రీవారి భక్తులకు మరింత చేరువైందన్నారు. భక్తులు కూడా సులభతరంగా టీటీడీ సేవలు పొందవచ్చన్నారు. టీటీడీ యాప్ను ఈ ఆంగ్ల అక్షరాలతో "GOVINDA TIR UMALA TIRUPATI DEVASTHANAMS"డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయం లో బుధవారం ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వర కు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహిం చారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, మరోపీఠంపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ ఈవో సాంబ శివరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు. శాస్త్రోక్తంగా ఆస్థాన కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. ఆలయ మహ ద్వారం నుంచి గర్భాలయం వరకు 60వేల కట్ పుష్పాలు, 8 టన్నుల సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్ప కలశం, నవధాన్యాలతో శ్రీవేంకటేశ్వరుడు, ఆలయం వెలుపల పుష్పగజేంద్రుడు, పండ్ల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
-
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్లయించింది. వీఐపీ దర్శనాల్లో మూడో కేటగిరిని తొలిగించామని, ఇక మెదటి రెండు కేటగిరిలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో డి.సాంబశివరావు సోమవారం మీడియాకు తెలిపారు. ఈ నిబంధన ఏప్రిల్ 7 నుంచి 10 వారాలపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. శుక్ర, శని వారల్లో వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో రద్దీని బట్టి మార్పులు చేస్తామని తెలిపారు. వకులమాత అతిథి భవన నిర్మాణానికి రూ.39 కోట్లు కేటాంయించామని, రాయచోటి, అప్పలాయగుంటలో రూ.4.5 కోట్లతో కళ్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ఈవో తెలిపారు. -
మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం
నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చ సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్లు, లడ్డూ ధరల పెంపు, కాటేజీల అద్దెలు పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం(నేడు) జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు కూడా చేశారు. అలాగే 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగే తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. -
రామా.. ఎంత అపచారం!
మూలవరులను తాకిన భక్తులు భద్రాచలం: భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లి, స్వామి మూర్తులను తాకినట్లుగా తెలిసింది. గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లకూడదనే విషయం తెలియని సదరు భక్తులు, స్వామి సేవలో తరించాలనే అలా చేసి ఉంటారని ఆలయన అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి ఆలయంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో విధులు నిర్వహించే అర్చకులు అక్కడ లేకపోవడం గమనార్హం. విషయాన్ని కొంతమంది భక్తులు ఈవో రమేష్బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్చకులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఈవో తెలిపారు. -
అక్రమార్కులకు ఎంపీ మాగంటి వత్తాసు
► దేవస్థానం ప్రహరీ కూల్చివేయాలని హుకుం ► కుదరదన్న ఈవో కొండలరావు ► ఎండోమెంటు జేసీకి ఎంపీ ఫోన్ కొల్లేటికోట (కైకలూరు): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి ఆయన. అమ్మ దర్శనానికి వస్తున్నా భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులను అరికట్టాల్సింది పోయి, దోచుకోవడానికి దారి మార్గం కోసం ఎదురుచూస్తున్న వారికి టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) వత్తాసు పలకడం విమర్శలకు దారితీసింది. వివరాలు.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర సోమవారం ప్రారంభమైంది. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు హాజరయ్యారు. ఎంపీ వద్దకు సమీపంలో ఇద్దరు దుకాణదారులు మా వ్యాపారాలకు అడ్డుగా దేవస్థాన ప్రహరీ ఉందని, దారి మార్గం కల్పించాలని కోరారు. ముందుగా సిద్ధం చేసుకున్న యాత్రికులను తీసుకొచ్చి ప్రహరీకి గోడ ఉంటే బాగుండదని చెప్పించారు. దీంతో ఎంపీ దేవస్థానం ఈవో ఆకుల కొండలరావును పిలిచారు. జాతర 15 రోజులు ప్రహరీ కూల్చి దారి ఇవ్వాలన్నారు. ఇది నా పరిధి కాదని, జాయింట్ కమిషనరు అనుమతులు ఉండాలన్నారు. ఎంపీ చెప్పిన చేయరా? అంటూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్కు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. సమీపంలోని కొందరు ఈవో సెల్ నుంచి ఫోన్ చేయండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. చివరకు ఫోన్ కలవకపోవడంతో మరో సారి మాట్లాడుదామని ఎంపీ వెళ్లిపోయారు. ప్రహరీ కథ ఇది..: పురాతన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు ఎకరం స్థలం ఆక్రమణలకు గురయ్యింది. ప్రతి ఆదివారం వచ్చే భక్తులను సమీప కొందరు దుకాణదారులు కొల్లేరు జలగల మాదిరిగా పీడిస్తూ అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. దీంతో సర్వే చేయించి రూ.14 లక్షల 50వేల నిధులతో దేవస్థానం చుట్టూ ప్రహరీ నిర్మించింది. వెనుక నడక మార్గానికి కొంత వదిలారు. ప్రహరీ వలన అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు అక్రమ వసూలు బారి నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు అడ్డేలేదని భావించిన వారికి ఇది మింగుడు పడలేదు. స్థానిక టీడీపీ నేతను ఆశ్రయించారు. ఆయన వచ్చి హడావుడి చేశారు. అది బెడిసి కొట్టడంతో ఇటీవల ఈవోను బెదిరించేందుకు దుకాణదారులు ప్రయత్నించారు. దీంతో ఈవో కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గుమ్మనంగా ఉన్నఆక్రమణదారులు ఎంపీ మాగంటి రాగానే రెచ్చిపోయారు. కేవలం డబ్బులు దండుకోవడానికి అలవాటు పడిన వ్యాపారులకు ఎంపీ కొమ్ముకాస్తారా? లేదా భక్తుల దోపిడీని అడ్డుకుని ప్రహరీని కాపాడతారా? అని భక్తులు, దేవాలయ సిబ్బంది ఆసక్తిగా చూస్తున్నారు. -
2,858 కోట్లతో టీటీడీ బడ్జెట్
2017– 18 వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2017–2018 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858.48 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2016–17లో టీటీడీ రూ.2,678 కోట్లతో బడ్జెట్ ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1010 కోట్లు రావచ్చని అంచనా వేయగా రూ.1,110 కోట్లకు పెరిగాయని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్తోపాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్, ఈవో ప్రకటించారు. శ్రీవారికి రూ.11 కోట్లతో కాసుల హారం తిరుమల శ్రీవారికి రూ.11 కోట్లతో 30 కిలోల బంగారు సహస్ర కాసుల హారం తయారు చేయాలని నిర్ణయించారు. 2012లో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు రామలింగరాజు కానుకగా ఇచ్చిన రూ.10.91 కోట్ల నగదును ఈ హారం తయారీకి వాడనున్నట్టు చైర్మన్, ఈవో వెల్లడించారు. తిరుమలలో రూ.5కోట్లతో సర్వదర్శనం భక్తులకు కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు. 2017–18 ఆదాయ అంచనా ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1,110 కోట్లు‡రావచ్చని అంచనా వేశారు. ► వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సుమారు రూ.10వేల కోట్లపై వడ్డీ రూ.807.72 కోట్లు రావచ్చని అంచనా వేశారు. ► ఇక రూ.500 వీఐపీ దర్శనం రూ.28 కోట్లు, రూ.50 సుదర్శనం రూ.3కోట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం రూ.225 కోట్లు వసూలు కావచ్చని భావిస్తున్నారు. ► ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.165 కోట్లు, గదుల అద్దె వసూళ్ల ద్వారా రూ.124 కోట్లు రావచ్చని అంచనావేశారు. ► కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్లు, బంగారు డాలర్ల విక్రయం వల్ల రూ.20 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై రూ.56.51 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 164.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. 2017–2018 వ్యయాల అంచనా ► ఉద్యోగుల జీతాల కోసం రూ.575 కోట్లు, పెట్టుబ డులు రూ.533.21 కోట్లు, సరుకుల కొనుగోళ్లు రూ.471.85 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.185 కోట్లు, పెన్షన్ ఫండ్ రూ.75 కోట్లు కేటాయించారు. ► గ్రాంట్లు రూ.192 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.253.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.52 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.85.70 కోట్లు, ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానం, ఇతర ఖర్చులు రూ.26 కోట్లు, ప్రచారానికి రూ.8.5 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.149.46 కోట్లు కేటాయించారు. -
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఈవో
మంచిర్యాల: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్లో గురువారం వెలుగుచూసింది. పీఆర్డీ కార్యాలయంలో ఈవోగా పని చేస్తున్న నజీమొద్దిన్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈవోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. -
శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 18 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.1,03,06,383 లభించినట్టు ఆలయ కార్యనిర్వాహణా««ధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. 239 గ్రాముల బంగారం, 3 కేజీల 152 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలు లభించినట్టు చెప్పారు. రూ1,15,116 విరాళం అందజేత చిన వెంకన్న ఆలయానికి మంగళవారం కామవరపుకోటకు చెందిన దాత గంటా బులిస్వామి కుటుంబ సభ్యులు 1,15,116 రూపాయలను అన్నదాన విరాళంగా అందజేశారు. విరాళాన్ని దాతలు ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన భక్తులు విరాళం అందచేశారు. పటమటకు చెందిన కోనేరు మురళీకృష్ణ, విజయలక్ష్మి దంపతులు భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. వారు నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ల విరాళాన్ని ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు. -
పర్వదినాలకు టీటీడీ సిద్ధం
- రేపు కొత్త సంవత్సరం,8న ముక్కోటి ఏకాదశి, 9న ద్వాదశి - పకడ్బందీ ఏర్పాట్లు.. సాక్షి, తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు టీటీడీ సిద్ధమైంది. ఈ మూడు పర్వదినాల్లోనూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక షెడ్లు నిర్మించారు. క్యూలోని భక్తులపై ఎండ, వాన, మంచు పడకుండా రేకులు అమర్చారు. ఈదురు గాలుల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పక్క భాగాల్లోనూ రేకులు అమర్చారు. ఈ పర్వదినాల్లో తొలుత మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లలోని 54 కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత తాత్కాలిక షెడ్లలోకి అనుమతిస్తారు. ఈ క్యూల వద్దే మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాల కేంద్రాలు, షెడ్లు అమర్చారు. ఆరు మందికే వీఐపీ దర్శనం కొత్త సంవత్సరం, 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశిలో స్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీల్లో ఒకరికి 6 టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. వేకువజామున 1 నుంచి 3 గంటల్లోపే ప్రముఖులకు దర్శనం పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. కేటాయించిన టికెట్లను బట్టి అరగంట అటుఇటుగా క్యూలైను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీలు నియమించారు. 4 గంటల్లోపే సామాన్యులకు దర్శనం పర్వదినాల్లో వేకువజాము 4 గంటల్లోపే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఏకాదశిలో మాత్రం ఇతర దర్శనాలు లేకుండానే నిర్విరామంగా సర్వదర్శనం మాత్రమే అమలు చేయనున్నారు. గతేడాది అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా అమలుచేయాలని ఈవో, జేఈవో నిర్ణయిం చారు. పండుగ వేళల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు వేల సంఖ్యలో గదులు ముందస్తుగానే రిజర్వు చేశారు. అయితే, సామాన్య భక్తుల రద్దీని బట్టి సామాన్యులకే ఎక్కువ సంఖ్యలో గదులు ఇవ్వాలని ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను చైనా బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. అనంతరం మల్లేశ్వరాలయం , చండీయాగం విశేషాలు, అమ్మవారి ప్రసాదాల గురించి చైనా బృందానికి ఈవో సూర్యకుమారి వివరించారు. చైనా బృందం అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలిస్తుండటంపై భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
ఈవోకు మంత్రి భార్య వేధింపులు
ఆలయ సిబ్బంది ఎదుట శ్రీకాళహస్తి ఈవోపై విరుచుకుపడ్డ మంత్రి సతీమణి మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే యోచనలో ఈవో భ్రమరాంబ శ్రీ కాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి మరోసారి అక్కసు ప్రదర్శించారు. బదిలీపై వెళ్లిపోండంటూ తీవ్రస్థాయిలో హుకుం జారీచేశారని తెలిసింది. సోమవారం ఆలయ పరిపాలన భవనానికి వచ్చిన మంత్రి సతీమణి బృందమ్మ ఈవో భ్రమరాంబపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఈవో తీవ్ర మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్థానిక టీడీపీ నాయకులు చెప్పినట్లు నడుచుకోలేదని మంత్రి సతీమణి ఈవోపై వేధింపులకు దిగారని తెలిసింది. గత ఏడాది అక్టోబర్ 8 వతేదీన భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే పాలనాదక్షతను ప్రదర్శించి గత ఏడాది బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించి సామాన్య భక్తుల ప్రశంసలు అందుకున్నారు. అయితే అప్పటికే ఆలయంలో నిత్యం తనిఖీలు చేపడుతూ అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్న మంత్రి సతీమణి బృందమ్మ పెత్తనానికి అడ్డుకట్ట వేశారు. ‘‘ఆలయంలో పాలనావైఫల్యాలపై మాకు సూచనలివ్వండి గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు ’’ అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి ఆలయ పాలనలో మంత్రి సతీమణి పెత్తనానికి బ్రేక్ పడినట్లయింది. మాస్టర్ప్లాన్ లో టీడీపీ నేతలకు అనుకూలంగా ఈవో వ్యవహరించలేదని అక్కసుతోనే పరోక్ష వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయానికి వచ్చిన బృందమ్మ చైర్మన్ చాంబర్కు ఈవోను పిలిపించుకుని బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది ఎదుటే ఆమెను తీవ్రస్థాయిలో మందలించారని సమాచారం. ‘‘మీరు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లకుంటే మేమే బలవంతంగా సాగనంపుతాం’’ అంటూ బెదిరింపుల పర్వానికి దిగారని తెలిసింది. దీని వెనుక తమ అనుయాయుల స్వప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఉన్న ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన అతిథిగృహాలు గాలిగోపురానికి అతి సమీపంలో ఉండటం, మాస్టర్ప్లాన్ లో దానిని మినహాయించడానికి ఈవో ససేమిరా అనడంతోనే పరోక్షంగా ఈవోను టార్గెట్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనధికార వ్యక్తుల పెత్తనంపై విసిగిపోయిన ఈవో భ్రమరాంబ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆలయంలో ఓవైపు పెద్దఎత్తున మాస్టర్ప్లాన్ పనులు జరుగుతున్నాయి. జనవరి ఆరో తేదీ నుంచి మహాకుంభాభిషేకం, ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆలయ కార్యనిర్వహణాధికారిపై మంత్రి సతీమణి ఆధిపత్యం చెలాయించేందుకు అనధికారిక హోదాలో కర్రపెత్తనం చేస్తున్నారు. ఆలయ పెద్దలపై ఆమె అజమాయిషీని ప్రదర్శించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారిక హోదాలో ఆమె ఆలయ పరిపాలనలో జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తిలో కూడా మంత్రి కుటుంబీకుల ఆగడాలు శ్రుతిమించాయని పట్టణంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా సంఘటన అధికారులలో గుబులు రేపుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో నిర్వహించే మహత్కార్యాలను సమిష్టిగా సమన్వయంతో నిర్వహించాల్సిన తరుణం సమీపిస్తున్న వేళ ఈవోపై ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి సతీమణి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
19 రోజులు.. రూ.1.35 కోట్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించా రు. ఆలయ ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 19 రోజులకు నగదు రూపంలో రూ. 1,35,45,752, కానుకల రూపంలో 371 గ్రాముల బంగారం, 4.236 కిలోల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. ఓ విదేశీ భక్తుడు అమెరికన్ కరెన్సీ నోట్ల కట్టను హుండీలో సమర్పించాడని, దీంతో పాటు ఇతర దేశాల కరెన్సీ నోట్లు లభించాయని చెప్పారు. -
దుర్గా దివ్య దర్శన్ యాత్ర
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : విజయవాడ–గుంటూరు (కాజా) మధ్య ఆలయాలను సందర్శించేలా దుర్గగుడి దేవస్థానం రూపొందించిన దుర్గా దివ్య దర్శన్ యాత్రను దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఆదివారం ప్రారంభించారు. తొలుత టోల్గేటు సమీపంలోని కామధేను అమ్మవారి వద్ద యాత్ర బస్సుకు దుర్గగుడి ఈవో పూజలు నిర్వహించారు. అనంతరం యాత్రికులతో కలిసి ఈవో సూర్యకుమారి బస్సులో కొండపై అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారి దర్శించుకున్న యాత్రికులకు ప్రసాదాలను అందజేశారు. తొలి రోజున 16 సిట్టింగ్ బస్సు ఏర్పాటు చేయగా 11 మంది యాత్రలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనం అనంతరం పొలకంపాడు శివాలయం, తాడేపల్లిలోని నక్షత్రవన సందర్శనం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సీతానగరం మద్వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీకృష్ణ మందిర సందర్శనంతో యాత్ర ముగిసింది. -
అనర్హులకు ఈఓ పోస్టులు!
- దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం - కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు - సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం - ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి తో ఫైలు చకచకా కదిలి.. ఇప్పుడు దేవాదాయ మంత్రి వద్దకు చేరింది. దేవాదాయశాఖను ప్రక్షాళన చేసేందుకు దేవాదాయ మంత్రి చైర్మన్గా ఐదుగురు మంత్రులతో ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారానికి తెరలేచింది. ఆదాయం ఆధారంగా దేవాలయాల స్థాయి పెంచాలని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం, నిర్మల్ జిల్లా బాసర ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉండాలి. ప్రస్తుతం ఏసీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న అధికారులు ఇక్కడ ఈఓలుగా ఉన్నారు. ఈ దశలో సాధారణ సూపరింటెండెంట్లకు ఆ పోస్టులు కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రకరకాల ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని ఉన్న సూపరింటెండెంట్లకు ఇన్చార్జి ఈవోలుగా కూర్చోబెట్టాలని వారు ఒత్తిడి ప్రారంభించారు. దీంతో అధికారులు ఆ ఫైల్ను దేవాదాయ మంత్రి వద్దకు పంపినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సూపరింటెండెంట్లు నేరుగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదు, అలాంటి వారిని ఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో ఫైలు చకచకా కదిలింది. వీరికి పోస్టింగ్స్ ఇస్తే మరికొందరు సూపరింటెండెంట్లు కూడా దొడ్డిదారిన ఈఓ పోస్టులు కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఉజ్జిన రాధారూప విరాళం మొత్తాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతకు ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు విరాళం బాండ్ను, ప్రసాదాలను అందించి అభినందించారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.5 లక్షల విరాళం అందించారు. పాలకొల్లుకు చెందిన అడ్డాల వెంకట సత్యనారాయణ రూ.4 లక్షలు తన కుటుంబసభ్యుల పేరున అందజేశారు. పెనుగొండకు చెందిన పిల్లి సత్తిరాజు, లక్ష్మీ శైలజ దంపతులు వారి పేరున రూ.లక్ష జమచేశారు. దాతలకు ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్లు అందజేసి అభినందించారు. -
తిరుమలలో బ్యాటరీ బస్సులు
తిరుపతి అర్బన్: తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీటీడీ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమల, తిరుపతిలో యాత్రికుల సౌకర్యార్థం ఉచిత బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అయితే తిరుమలను పూర్తి కాలుష్య రహితంగా మార్చే క్రమంలో రెండు బ్యాటరీ(ఎలక్ట్రికల్ ఆధారిత) బస్సులను ప్రయోగాత్మకంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ డ్రైవర్లు కూడా తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్రోడ్డును ప్రమాదరహితంగా మార్పుచేసి అందరి మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. -
వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. -
మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈనెల 11 నుంచి 18 వరకు జరగనున్న శ్రీవారి ఆశ్వీయుజమాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను దేవస్థానం శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ గోపురాలకు విద్యుద్దీప అలంకరణలు, ప్రాకారాలకు రంగులు వేయడం వంటి పనులను సిబ్బంది శరవేగంగా నిర్వర్తిస్తున్నారు. ఆలయ ప్రధాన కూడలిలో 60 అడుగుల ద్వారకాధీశుని భారీ విద్యుత్ కటౌట్ను నిర్మిస్తున్నారు. శేషాచలకొండపై దేవతామూర్తుల భారీ విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలోని పలు ప్రధాన కూడళ్లలోను, భీమడోలు, గుండుగొలనులోను బ్రహ్మోత్సవాలను తెలిపే ఆర్చిగేట్లును నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 11న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెలుగాను ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు తెలిపారు. 15న రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, మరుసటి రోజు రాత్రి శ్రీవారి రధోత్సవాన్ని క్షేత్ర పురవీధుల్లో జరుపుతామని వివరించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి – ఈనెల 3న శ్రీవారికి సీఎం పట్టువస్రాల సమర్పణ – ఉత్సవాల్లో రెండు ఘాట్రోడ్లలో వాహనాల అనుమతి సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదే స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవర్ల దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సుట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో టోల్ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. శ్రీవారి భక్తుల వైద్యసేవల కోసం 12 ప్రథమ చికిత్సా కేంద్రాలు , 10 అంబులెన్స్లు ఏర్పాటు చేశామన్నారు. సాధారణరోజుల్లో 3500 మంది పోలీసులు, గరుడ సేవలో మొత్తంగా 4700 మందిని భద్రతకు వినియోగిస్తామన్నారు. ఈనెల 3వ తేది ధ్వజారోహణం సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అదే సందర్భంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, గడిచిన బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని మరింత ఉన్నతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వాహన సేవలతోపాటు శ్రీవారి ఆలయంలో మూలవర్ల దర్శనంకోసం తరలివచ్చే భక్తులకోసం క్యూలైన్లు విస్తరించామన్నారు. సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, భక్తుల భద్రతే ధ్యేయంగా భద్రత కల్పించామన్నారు. ఉత్సవాలకోసం రెట్టింప స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
11 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 18 వరకు జరగనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రారంభం రోజైన విజయదశమి నాడు స్వామివారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 12న ధ్వజారోహణను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణను జరపడం పరిపాటి. 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న చిన వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం జరపనున్నట్టు ఈవో చెప్పారు. 16న సాయంత్రం శ్రీవారి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యూత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు, ధ్వజ అవరోహణ జరుపుతారు. 18న రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో చెప్పారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణం, ఆర్జిత సేవలు రద్దుకానున్నాయని ఈవో తెలిపారు. -
డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్టా..? లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ప్రస్తుతం ఉన్న 56 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డి ప్యూటీ ఈవో) పోస్టులు రద్దయ్యాయా? ఈ ప్రశ్నకు విద్యా శాఖ మౌఖి కంగా లేదని సమాధానం చెబుతోంది. ప్రభుత్వానికి ఇటీవల విద్యా శాఖ ఇచ్చిన నివేదికలో మాత్రం ఈ పోస్టులను చూపించలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతి జిల్లాకు ఓ డీఈవోను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రస్తుతమున్న 11 మంది డిప్యూటీ ఈవోలను ఇన్చార్జి డీఈవోలుగా నియమిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఇన్చార్జి డీఈవోలుగా వెళ్లిపోయాక ఖాళీ అయ్యే స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. వాటి భర్తీ ప్రస్తావన లేకుండానే కొత్త జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు, విద్యా విభాగం వివరాలను పొందుపరిచింది. దీంతో ఆయా పోస్టులను రద్దు చేస్తోందన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గా ల్లో నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులుం డగా, కొత్తగా వచ్చే డిప్యూటీ ఈవోలు 11 మందిని కలిపి 23 పోస్టులవుతున్నాయి. మరో 4 పోస్టుల్లో ఏడీ లేదా డైట్ లెక్చరర్లను ఇన్చార్జి డీఈవోలుగా నియమించడం ద్వారా మొత్తం 27 జిల్లాలకు 27 మందిని డీఈవోలుగా నియమించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏజెన్సీ డీఈవో పోస్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ పోస్టులపై సందిగ్ధత నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 467 మండల విద్యాధికారి పోస్టులుండగా, 44 మంది పనిచేస్తున్నారు. మిగతా పోస్టుల్లో సీనియర్ హెడ్మాస్టర్లను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తామని నివేదికలో పేర్కొంది. డిప్యూటీ ఈవో పోస్టులను రద్దు చేయొ ద్దని, ప్రస్తుత పాఠశాలల సంఖ్య పెరిగినందున ఈ పోస్టులను జిల్లాకు ఒకటి నియమించాలని పీఆర్టీయూ- తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి కోరారు. -
బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు
సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు సాక్షి, తిరుమల: అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాలి. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించడం లేదని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు : బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు, నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు. -
మద్ది హుండీ ఆదాయం రూ.27,04,522
గుర్వాయిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్) : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవాదాయశాఖ తనిఖీదారు కేవీవీ రమణ పర్యవేక్షణలో 85 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.27,04,522 నగదు, 10 గ్రాముల బంగారం, 134 గ్రాముల వెండి, 9 విదేశీ నోట్లు లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు చెప్పారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సభ్యులు పాల్గొన్నారు. -
మద్ది హుండీ ఆదాయం రూ.27,04,522
గుర్వాయిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్) : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవాదాయశాఖ తనిఖీదారు కేవీవీ రమణ పర్యవేక్షణలో 85 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.27,04,522 నగదు, 10 గ్రాముల బంగారం, 134 గ్రాముల వెండి, 9 విదేశీ నోట్లు లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు చెప్పారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సభ్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.1.50 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెంకు చెందిన కందుకూరి నాగరాజు విరాళం మొత్తాన్ని కందుకూరి విశ్వనాథ్ పేరున జమచేశారు. దాతను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం ఓ భక్తుడు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మా రామకృష్ణ తన తల్లిదండ్రులు గంగరాజు, గంగామహాలక్ష్మి పేరున విరాళం అందజేశారు. ఆలయ అధికారులు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్ ధర పెంపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత కల్యాణం టికెట్ ధరను పెంచినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకూ రూ.1,000 ఉన్న టికెట్ రుసుంను రూ.1,500కు పెంచామని, కొత్త ధర గురువారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిత్య కల్యాణం జరిపించుకునే దంపతులకు పంచె, కండువ, రవికతో పాటు ఐదు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు, ఒక శర్కర పొంగలి ప్యాకెట్ ఇస్తున్నారు. ధర పెంచిన నేపథ్యంలో వీటితో పాటు అదనంగా చీర కూడా అందిస్తామని ఈవో తెలిపారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు విరాళాల వెల్లువ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఆదివారం విరాళాలు వెల్లువెత్తాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం చిన్నం సుబ్బారావు, జగదీశ్వరి దంపతులు రూ.2,02,232ను విరాళంగా అందజేశారు. దీనిలో సుబ్బారావు పేరున రూ.1,01,116, జగదీశ్వరి తల్లిదండ్రుల పేరున రూ.1,01,116ను అందజేశారు. సుబ్బారావు కుమారుడు, కోడలు రాంబాబు, ప్రమీళకుమారి, కుమార్తె అల్లుడు అంబటి గాంధీ, నాగమణి ఉన్నారు. మచిలీపట్నంకు చెందిన డేరం రామకష్ణ శర్మ, సీతామహాలక్ష్మి దంపతులు తమ కుమార్తె శైలజ పేరున రూ.1,01,116ను అందజేశారు. దాతలకు ఈవో త్రినాథరావు విరాళం బాండ్లు అందజేశారు. -
వర్షాల కోసం మద్దిలో వరుణ జపం
జంగారెడ్డిగూడెం రూరల్ : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో శుక్రవారం వరుణ జప పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకు మూడు రోజుల పాటు వరుణ సూక్త పారాయణం, వారణానువాక జపం, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. -
నేటినుంచి వరుణ జపాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు వరుణ జపాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. దీనిలో భాగంగా జరుగనున్న సహస్ర ఘటాభిషేకం నిమిత్తం ఘటాలు గురువారం ఆలయానికి చేరుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ మూడు రోజులపాటువరుణ సూక్త పారాయణలు, వారుణానువాక జపాలు, రుద్రహోమం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు. 28న సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. -
త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలి
– ఇతర ధార్మిక సంస్థలకు టీటీడీ ఆదర్శంగా నిలవాలి – స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలనే త్యాగం చేసిన త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు కాంక్షించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం టీటీడీ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో టీటీడీ భద్రతా దళాల కవాతును తిలకించి, గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాన్య భక్తులు కూడా శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనడమే గాక పారదర్శకత పెంచేందుకు వీలుగా ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవా టికెట్లను ఇంటర్నెట్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిందన్నారు. రెండో దశలో దివ్యదర్శనం(కాలి నడకన వచ్చే) భక్తులకు మెరుగైన వసతులతో కూడిన కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని లడ్డూ కౌంటర్ల వద్ద 2 గ్రాముల శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కాషన్ డిపాజిట్లు లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భజన మండళ్ల సంఖ్యను పెంచడం ద్వారా నాటక రంగానికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, కళా బృందాల నృత్యాలు, టీటీడీ సెక్యూరిటీ గార్డు తిరుపాల్ ప్రదర్శించిన మ్యాజిక్ షో ఆకట్టుకున్నాయి. 202 మందికి ఉత్తమ సేవల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ డీఈవో విజయకుమార్, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, లా ఆఫీసర్ వెంకటరమణ, డిప్యూటీ ఈవోలు చెంచులక్ష్మి, చిన్నంగారి రమణ, విజయసారథి, ట్రాన్స్పోర్టు జీఎం శేషారెడ్డి, భద్రతాధికారి శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : పుష్కరాలను పురస్కరించుకుని కనకదుర్గప్రభ ధర్మ ప్రచార మాసపత్రిక కృష్ణా పుష్కర ప్రత్యేక సంచికను రూపొందించింది. బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలనా భవనంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి ఈ సంచికను ఆవిష్కరించారు. కృష్ణా పుష్కర వైభవం, కృష్ణా పుష్కరాలు–మన కర్తవ్యం, సర్వపాప హరిణి కృష్ణవేణి, పుష్కరాల ప్రాశస్త్యం, పుష్కర వైశిష్ట్యం, పుష్కర స్నాన విధానం.. వంటి ఆధ్యాత్మిక రచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య, పర్యవేక్షకుడు ఈవీ సుబ్బారావు, సంపాదకుడు కె.గంగాధర్, కో–ఆర్డినేటర్ సైదా తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య పవిత్రోత్సవాలు వచ్చే నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరపనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రారంభం రోజైన ఆగస్టు 16న అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. 17న పవిత్రాధివాసం, 18న పవిత్రారోపణ, 19న పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో వివరించారు. ఆలయంలో జరగాల్సిన నిత్యార్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు ఉత్సవాల రోజుల్లో రద్దు చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
20 నుంచి సమగ్ర ఆర్థిక, సామాజిక సర్వే
రెండు దశల్లో 33 రోజుల పాటు సర్వే 430-460 ఇళ్లతో ఎన్యుమరేటర్ బ్లాక్ {పతి బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్ స్పాట్లోనే టాబ్లెట్స్లో ఆన్లైన్ డేటా ఎంట్రీ త్వరలో బ్లాకుల వారీగా సర్వే షెడ్యూల్ ఖరారు విశాఖపట్నం : తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా ఇంటింట సమగ్ర ఆర్థిక సామాజిక సర్వే (స్మార్ట్స్ పల్స్ సర్వే) చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడలా ఒక్క రోజులోనే కాకుండా 33 రోజుల పాటు ఈ సర్వే చేపట్టేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. జూన్ 20 నుంచి 30 వరకు, జూలై 6 నుంచి 31 వరకు రెండు దశల్లో ఈ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. 430-460 ఇళ్లను ఓ ఎన్యుమరేటర్ బ్లాకుగా విభజించారు. ప్రతీ బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్ను ఏర్పాటు చేశారు. స్పాట్ లోనే ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా టాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నారు. ప్రతీ ఒక్కరి బయోమెట్రిక్, ఐరిష్లను కూడా సేకరించేందుకు యంత్రాలను సమకూర్చనున్నారు. ఇందుకోసం జిల్లా మండల కేంద్రాల్లో గణన కోసం ఎంపిక చేసిన బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. బ్లాకులు, తేదీల వారీగా త్వరలో సర్వే షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సెర్ఫ్ క్లస్టర్ కో ఆర్డినేటర్, వీఏఓ, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంఆర్ఐ తదితరులతోనూ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా బిల్ కలెక్టరు, వివిధ శాఖల సిబ్బంది, అధికారులతో ఈ టీమ్లను ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ, వుడా, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది సేవలను ఇందుకోసం వినియోగించనున్నారు. బ్లాకుల్లో ఇంటింటి సర్వే ప్రణాళికా బద్ధంగా చేసేందుకు వీలుగా ఎన్యుమరేషన్ బ్లాకులు తేదీల వారీగా షెడ్యూల్ తయారు చేసి ప్రజలందరికి తెలియజేసేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా సెర్ప్ సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బంది వద్ద ఉన్న టాబ్లెట్స్, ఐరిష్, బయోమెట్రిక్ యంత్రాలను సమీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తహశీల్దార్లను ఆదేశించారు. ఎన్యుమరేటర్లకు జిల్లా, మండల స్థాయిల్లో తక్షణమే శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ నివాస్, జేసీ-2 డివి రెడ్డి, డీఆర్ఒ చంద్రశేఖరరెడ్డి, వుడా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, జీవీఎంసీ రెవెన్యూ అధికారి వి.రవీంధ్ర, ఆర్డీఓ వెంకటేశ్వరు, సీపీఒ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
యాగంటి ఆలయ ఈవోపై హత్యాయత్నం
-పెట్రోల్ పోసిన జూనియర్ అసిస్టెట్ యాగంటి: కర్నూలు జిల్లా యాగంటి ఈవోపై హత్యాయత్నం జరిగింది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఆపారన్న అక్కసుతో కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం ఆలయ ఈవో ఆదిశేషనాయుడుపై పెట్రోల్ పోశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఈవోపై పోసి నిప్పు అంటిస్తానని బెదిరించడంతో అక్కడున్న సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆదిశేషనాయుడు యాగంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రింగయ్యారు.. ఖంగుతిన్నారు
భద్రాద్రిలో వేలం పాట వాయిదా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దుకాణాల నిర్వహణ తదితరాల కోసం బుధవారం వేలం పాటల నిర్వహణలో పాటదారులంతా రింగయ్యారు. కాంట్రాక్ట్ కాల పరిమితిని ఏడాది కాకుండా మూడేళ్లకు పెంచాలని, లేకపోతే తామంతా వేలం పాటకు దూరంగా ఉంటామని దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పారు. కార్యనిర్వహణాధికారిణి(ఈఓ) కూరాకుల జ్యోతి ఒక మెట్టు దిగి, కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించేందుకు అంగీకరించారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. వీరంతా రింగయ్యారని, తక్కువ మొత్తంతో ఎక్కువ కాలంపాటు పాట పాడుకునేందుకు పన్నాగం పన్నారని గ్రహించిన ఈఓ.. మొత్తంగా వేలం పాటలనే రద్దు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో పాటదారులంతా ఖంగుతిన్నారు. ఇలా, కథ అడ్డం తిరగడంతో.. ‘దీన్నంతటికీ నువ్వే కారణం’ అంటూ, పాటదారులు తమ ‘రింగ్’ లీడర్పై కస్సుబస్సుమన్నట్టు సమాచారం. భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పరిధిలో దుకాణాలను అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు బుధవారం జరగాల్సిన వేలం పాట వాయిదా పడింది. పర్ణశాల దేవాలయం వద్ద కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించేందుకు, కుటీరం వద్ద ఫొటోలు తీసేందుకు, సీతవాగు వద్ద గైడ్ లెసైన్స్ హక్కుల కోసం, భద్రాద్రి దేవాలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఫొటోలు తీసుకునేందుకు అధికారులు వేలం పాట పెట్టారు. దుమ్ముగూడెం మండలం కాశీనగరం వద్ద 2.67 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారు. కాశీనగరం భూమి కౌలు ఏడాదికి గతంలో రూ.16,200 ఉంది. ఇది ప్రస్తుతం రూ.20వేలకు వెళ్లింది. దీంతో దీనిని దేవస్థానం అధికారులు ఖాయం చేశారు. పాటలన్నింటికీ తీవ్రమైన పోటీ ఏర్పడింది. పాటదారులంతా కాల పరిమితి పెంచాలని డిమాండ్ లేవనెత్తారు. గతంలో ఏడాదికి మాత్రమే లెసైన్స్ హక్కులు ఇచ్చేవారు. దీనిని మూడేళ్లకు పెంచకపోతే పాటలో పాల్గొనేది లేదని వారు తెగేసి చెప్పారు. వాస్తవంగా, భద్రాచలం దేవ స్థానంతోపాటు, పర్ణశాల వద్ద ఫొటోలు తీసేందుకు గతంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వచ్చిన పాటదారులంతా.. వేలం కాల పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించకపోతే వేలంపాటకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వేలం పాట నిర్వహించేందుకు వచ్చిన ఇన్చార్జ్ ఏఈఓ కనకదుర్గ, సూపరింటెండెంట్ వెంకటప్పయ్య, సెక్షన్ ఇన్చార్జ్ పోతుల శ్రీను చర్చించుకున్నారు. విషయాన్ని దేవస్థానం ఈఓ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. పాటదారుల డిమాండుకు ఈఓ కొంతవరకు తలొగ్గారు. కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతామంటూ ఒక మెట్టు దిగొచ్చారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. మూడేళ్లకు పొడిగిస్తేనే వేలం పాటలో పాల్గొంటామని బెట్టు చేశారు. అందరూ ఇదే మాటపై ఉండడాన్నిబట్టి, వారంతా రింగయ్యారని ఈఓ గ్రహించారు. వారి డిమాండును అంగీకరిస్తే దేవస్థానం ఆదాయం తగ్గే పరిస్థితి ఉండడంతో.. ఏకంగా వేలం పాటల నిర్వహణను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతా పాటదారులు ఖంగుతిన్నారు. వారిలో కొంతమంది.. తమ ‘రింగ్’ లీడర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట ఆగిపోవడానికి కారణమయ్యావంటూ నిందించారు. నేడు విస్తా కాంప్లెక్స్ దుకాణాలకు వేలం గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, విస్తా కాంప్లెక్స్లోని పలు దుకాణాల నిర్వహణకు గురువారం వేలం నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు. పాదరక్షలు భద్రపరిచేందుకు, పడమర మెట్ల పక్కన పూజాది సామాగ్రి విక్రయించేందుకు మంచి పోటీ ఉండే అవకాశముంది. గతంలో వీటిని దక్కించుకున్న వారే తిరిగి పొందేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. -
నేనూ వీఐపీనే
► శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోతో ధర్మకర్తల మండలి సభ్యుడి వాగ్వాదం ► చివరకు సహచర సభ్యుల జోక్యంతో సహస్రలింగేశ్వరస్వామి వద్దే పూజలు శ్రీకాళహస్తి : ఆలయు ధర్మకర్తల వుండలి సభ్యుడైన నేను వీఐపీనే. సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేసుకోవడానికి అర్హత లేదా ? అంటూ సీతారావుయ్యు ఈవో భ్రమరాంబను ప్రశ్నించారు. దాంతో వారి వుధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల వుండ లి సభ్యుడు సీతారావుయ్యు, ఆయన కువూర్తెతో కలిసి స్వా మివారి సమీపంలోని సహస్రలింగేశ్వరస్వామి వద్ద రూ. 2500 టికెట్ ద్వారా రాహుకేతు పూజలు చేసుకోవడానికి వె ళ్లారు. అరుుతే ఆలయు పీఆర్వో వి.బాబు వీఐపీలకు వూ త్రమే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని, వీఐపీలు కానివారిని రూ.2500 టికెట్ తీసుకున్నా....వినాయుకస్వామి ఆలయుం ఉన్న వుండలంలో పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని చెప్పారు. ఆమె అనువుతి ఇస్తేనే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుస్తావుని స్పష్టం చేశారు. దాంతో సీతారావుయ్యు ఫోన్లో ఈవోతో వూట్లాడారు. ఆమె ధర్మకర్తల వుండలి సభ్యులకు సహస్రలింగేశ్వరస్వామి వద్ద రాహుకేత పూజలు చేసుకునే అర్హత ఉంది. కానీ కుటుంబసభ్యులకు అవకాశం లేదని చెప్పారు. దాంతో ఆయున వాగ్వాదానికి దిగారు. చివరకు సీతారావుయ్యు కువూర్తెతో కలిసి తిరిగి వెళ్లిపోతుండగా తోటి ధర్మకర్తల వుండలి సభ్యులు చిట్టివేలు జయుగోపాల్, గుర్రప్పశెట్టి,కండ్రిగ ఉవు జోక్యం చేసుకుని సహస్రలింగేశ్వరస్వామి సన్నిధిలోనే వారికి రాహుకేతు పూజలు చేరుుంచారు. -
డిసెంబర్ కు అష్టాదశ పురాణాల అనువాదం
యూనివర్సిటీ క్యాంపస్: అష్టాదశ పురాణాల అనువాద ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు పండితులను కోరారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రెండు రోజుల పాటు జరిగిన పండిత పరిషత్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... అష్టాదశ పురాణాల్లో 3.70 లక్షల శ్లోకాలు ఉండగా ఇప్పటి వరకు 2.57 లక్షల శ్లోకాల అనువాదం పూర్తయిందని... మిగిలిన అనువాదం కూడా పూర్తి చేసి డిసెంబర్ నాటికి ముద్రించాలని సూచించారు. అలాగే, వ్యాస భారతం, వాల్మీకి రామాయణం గ్రంథాల ప్రచురణ పూర్తికావచ్చిందన్నారు. పబ్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ... అష్టాదశ పురాణాలను ఒక్కో పురాణాన్ని ఓ చిన్న పుస్తకం రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. -
కారు హల్చల్పై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకురావడంపై ఈవో సాంబశివరావు స్పందించారు. ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓ ఎర్ర రంగు కారు మూడు గేట్లను దాటుకుని శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ముందు వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి రాజుకు చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.అయితే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో ఈవో ఆగ్రహంచి చర్యలకు ఆదేశించారు. -
‘రాజన్నే’ నంబర్ వన్!
వేములవాడకు రూ.84.92 కోట్ల ఆదాయం వేములవాడ: రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదాయార్జనలో మాత్రం ముందంజలో నిలిచింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.84.92 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు యాదాద్రి నర్సింహస్వామి రూ.73 కోట్లతో మొదటిస్థానంలో, రాజన్న రూ.70 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున వేములవాడకు తరలివచ్చారు. ఆనవాయితీ ప్రకారం శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం పెరిగి రూ.84.92 కోట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. యాదాద్రికి రూ.75 కోట్లతో రెండోస్థానం దక్కింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అందుకనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. -
బంగారు వాకిలికి సొబగులు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల మధ్యలో ఉండే బంగారు వాకిలికి అమర్చిన బంగారు రేకులు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి కొత్త బంగారు రేకులు అమర్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అందుకు అయ్యే రూ. 86 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్కు అనుమతిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను చైర్మన్, ఈవో, జేఈవో మీడియాకు వివరించారు. తీర్మానాలు ► తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ రెండో సత్రం వద్ద 2.74 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. దీనికి బదులుగా తిరుచానూరు వద్ద ఉన్న రైల్వే స్థలాన్ని టీటీడీకి అప్పగించనుంది. ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని పురాతన శ్రీఅలగమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోనున్నారు. ► తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె (కంఠహారం) వితరణకు అనుమతి. ► రూ. 2.55 కోట్లతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి. ► తిరుపతి కోదండరామస్వామి ఆలయం లో అమావాస్య రోజున సహస్ర కలశాభిషేకం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఆర్జిత సేవలు ప్రారంభానికి నిర్ణయం. -
దుర్గగుడి ఈవో వేధింపులపై ఆగ్రహం
అర్చకుల నిరసనలు ఆర్జిత సేవలు రద్దు నేడు ఏపీలోని13 జిల్లాల నుంచి అర్చకుల రాక విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో గురువారం నుంచి నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈవో నర్సింగరావు వేధింపుల కారణంగా ఆలయ అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు ఆస్పత్రిపాలు కావడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు దిగారు. అర్చకులు, వేద పండితులు, వివిధ శాఖలకు చెందిన ఆలయ అధికారులు, సూపరిండెంటెంట్లు, ఏఈవోలు, రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన దీక్ష రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారికి నిత్యం జరిగే శ్రీచక్ర నవార్చన, చండీయాగం, కుంకుమార్చన, శాంతి కల్యాణాలను నిలిపేశారు. దీక్ష చేపట్టిన అర్చకుల్లో రాజకొండ గోపీకి ఎండ తీవ్రత కారణంగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షలకు మద్దతుగా 13 జిల్లాలకు చెందిన పలు అర్చక సంఘాలు, సమాఖ్యల వారు శుక్రవారం వస్తున్నట్లు దుర్గగుడి అర్చకులు తెలిపారు. అధికారుల వేధింపుల కారణంగానే అర్చకుడు మంగళపల్లి సుబ్బారావు (37) అనారోగ్యం పాలయ్యారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విధులు సరిగా నిర్వర్తించనందునే జరిమానా వేశానని, సుబ్బారావును ఎవరూ వేధించలేదని ఈవో చెప్పారు. అరసవల్లిలో అర్చకుల ఆందోళన శ్రీకాకుళం సిటీ: విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో నర్సింగరావును సస్పెండ్ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం ప్రతినిధులు కొత్తలంక మురళీకృష్ణ, శ్రీనివాసదీక్షితులు డిమాండ్ చేశారు. వారు గురువారం శ్రీకాకుళ ం జిల్లా అరసవల్లిలో ఆందోళన చేపట్టారు. కాగా ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లారు. తన కుమారుడు వివాహం ఉన్నందున ఈ నెల 30వరకు తాను సెలవు పెట్టినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తాత్కాలిక ఈవోగా కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్కు బాధ్యతలు అప్పగించారు. -
శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం
తిరుపతి: పదవి ఉంది.. డబ్బు ఉంది.. వ్యవస్థతో ఎలా అయినా ఆడుకోవచ్చు అనుకుంటున్నారు నేతల కుమారులు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడి కీచక పర్వం మరచిపోకముందే తాజాగా మరో నాయకుడి కుమారుడు రెచ్చిపోయాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు. శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు. దర్శనం కల్పిస్తారా లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవో పై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం. 'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబు తో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు ఈ రోజు ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్ఎల్ఏ లకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారిపై తిట్ల పురాణానికి దిగారు. -
నవమి నాటికి మూలమూర్తులకు బంగారు కవచం
* 12 కేజీల బంగారం వితరణ ఇచ్చిన బెంగళూరు భక్తుడు * 15న చినజీయర్ స్వామి రాక * విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ జ్యోతి భద్రాచలం : భక్తరామదాసు ప్రతిష్ఠించిన భద్రాద్రి రాములోరు (గర్భగుడిలోని మూలవరులు) ఇక స్వర్ణ కవచంతో మెరిసిపోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న జరిగే శ్రీసీతారాముల పెళ్లి రోజున (శ్రీరామనవమి) బంగారు కవచాన్ని వారికి అలంకరించనున్నారు. బెంగళూరుకు చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ భక్తుడు 12 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి తమకు అందజేశారని దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు ఈ కవచాన్ని అలంకరిస్తామని చెప్పారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వర్ణ కవచం తయారీని ప్రముఖ స్థపతి పాకున్నం రామన్కుట్టి దండపాణికి అప్పగించినట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి మూలవరులకు వజ్రాలతో పొదిగిన స్వర్ణ కవచాన్ని అలంకరిస్తామని వివరించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా ఈ నెల 10 నుంచి 18 వరకు కీలక ఘట్టం ఉంటుందని, ఈ నెల 15న చినజీయర్ స్వామి హాజరుకానున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ప్రత్యేక వేడుకలు... ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శతవర్ష ప్రయుక్త సువర్ణ భద్రకవచ సమర్పణాత్మక నవాహ్నిక శ్రీరామ మహాక్రతువు వేడుకలు ఈ నెల 10 నుంచి 18 వరకు కొనసాగిస్తామని తెలిపారు. 350 ఏళ్ల కిందట భక్త రామదాసు వారి ఆచార్యులైన రఘునాథ భట్టాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ప్రాచీన దివ్య ఉత్సవమూర్తులకు అలంకరణ చేయనున్న సువర్ణ భద్ర కవచ సమర్పణ మహాక్రతువులో భాగంగా చివరి తొమ్మిది రోజుల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు రోజుకు 12 వేల సార్లు శ్రీరామ మహామంత్రం హవనం, పంచగవ్యాభిషేకం చేస్తామని తెలిపారు. తొలిరోజు బాలకాండ, రెండవ, మూడవ రోజు అయోధ్యకాండ, 4వ రోజు అరణ్యకాండ, 5వ రోజు కిష్కిందకాండ, 6వ రోజు సుందరకాండ, 7, 8 రోజుల్లో యుద్ధకాండ, 9వ రోజు మహాపుర్ణాహుతి ప్రతిష్ఠాంగ మహాపట్టాభిషేకం నిర్వహిస్తామని వేదపండితులు వివరించారు. కార్యక్రమంలో పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ఏఈఓ శ్రావణ్కుమార్, డీఈ రవీందర్ పాల్గొన్నారు. -
‘న్యూ జనరేషన్ టీటీడీ వెబ్సైట్ రూపొందిస్తున్నాం’
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం విదేశీ భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యూజనరేషన్ టీటీడీ వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఈవో డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు. టీసీఎస్, సిఫీ సంస్థ సహకారంతో.. శ్రీవారి దర్శనంతో పాటు వసతి, లడ్డూ ప్రసాదం, ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల బుకింగ్ విధానాలను సరళీకృతం చేశామని వివరించారు. అలాగే భక్తుడి ఫొటో లేకుండా కేవలం గుర్తింపు కార్డు నంబర్ల సాయంతోనే ఈ టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దాతలకు సులభంగా సేవలు అందించేందుకు ఐటీ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 16న ఏపీ, తెలంగాణ లోని సుమారు 300 ఆలయ ప్రాంతాల్లో గోపూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్మప్రచారం విస్తరణలో భాగంగా త్వరలో ఎస్వీబీసీ తమిళ చానల్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇదే రికార్డు వచ్చే నెల 1 నుంచి 29 వరకు మొత్తం 54,047 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు సంఖ్యని ఆయన చెప్పారు. -
'తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు'