Gandhi
-
సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: సంతానం కోసం ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేసే స్థోమత లేనివారికి అండగా నిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం.. మరిన్ని జిల్లాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్లోని గాందీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలిజేషన్) కేంద్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పేదలు వస్తున్నారు. దీంతో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే వరంగల్లో కేంద్రం ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో మరో 5 ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు రంగంలో 358 ఫెర్టిలిటీ సెంటర్లు తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్నారు. çరాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. చాలా సెంటర్లు సిట్టింగ్ల పేరుతో ఏళ్లకేళ్లు చికిత్సలు అందిస్తూ రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి.. గాం«దీ, పేట్ల బురుజు, వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు జీవో 520 విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అవి ఏర్పాటు కాలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేసి, అదే ఏడాది అక్టోబర్లో గాం«దీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, డాక్టర్లు, రీ ఏజెంట్స్, ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో నామ్కే వాస్తేగా మిగిలింది. అక్టోబర్లో గాం«దీ, పేట్ల బురుజులో ప్రారంభం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించింది. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొని అక్టోబర్ 15న ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అవసరమైన అన్ని రీ ఏజెంట్స్, ఔషధాలు పంపిణీ చేశారు. పేట్లబురుజు ఆసుపత్రిలోనూ ఎంబ్రయాలజిస్ట్ను నియమించి, ఈ నెల 9న ఐవీఎఫ్ సేవలు ప్రారంభించారు.గాం«దీలోని ఐవీఎఫ్ సెంటర్లో ఔట్పేషెంట్ (ఓపీ) కింద ఈ నెల 20 వరకు 271 మంది సంతానం కోసం రాగా, ఫాలిక్యులర్ స్టడీ కింద 66 మంది, ఐయూఐ కింద 26 మందికి పరీక్షలు నిర్వహించారు. ఐవీఎఫ్కు ఆరుగురు ఎంపికయ్యారు. పేట్ల బురుజులో 82 మంది ఓపీలో, ఫాలిక్యులర్ స్టడీకి 16 మంది, ఐయూఐకి 10 మందికి పరీక్షలు నిర్వహించారు. నలుగురిని ఐవీఎఫ్కు ఎంపిక చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్లలో మరిన్ని ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజనర్సింహ ఇటీవలే శాసనమండలిలో ప్రకటించారు. -
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
చిన్నారులతో పాటు చీపురు పట్టిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేడు (బుధవారం) దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చీపురు పట్టి, పరిసరాలను పరిశుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛతా హి సేవా 2024’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న భారత దేశాన్ని అందరం కలిసి సాకారం చేద్దామన్నారు. అందుకు ఈరోజు మనకు ఈ స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నేటితో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు.గత పక్షం రోజుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతర కృషితోనే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చుకోగలం. ఈ రోజున పరిశుభ్రతకు సంబంధించిన సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మిషన్ అమృత్ కింద దేశంలోని పలు నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించనున్నామన్నారు. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ను మరో మైలురాయి దాటిస్తుందన్నారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్లోని రాజ్గిర్లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’
లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది. యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.దీంతో ఆయన రాంపూర్ మార్కెట్లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది. తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది. ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన -
గాంధీ, ఉస్మానియాల్లో డాక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో డాక్టర్ల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఈనెల 9వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14వ తేదీన నియామకపత్రాలు ఇవ్వనున్నారు.ఈ రెండు ఆస్పత్రుల్లో 235 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఉస్మానియాలో 8 ప్రొఫెసర్ పోస్టులు, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గాంధీ ఆస్పత్రిలో 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్, 24 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 4 ట్యూటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 9న గాంధీ మెడికల్ కాలేజీ పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వారితోపాటు కొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్లో చేరగా.. ఈ ఇద్దరి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్కు వచ్చారు. ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు
-
అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్ చూడటం తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్ తెలిపింది. ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా? అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. Rather surprised to see this from a mainstream Bollywood actor. Janhvi Kapoor on Ambedkar, Gandhi & caste 👏pic.twitter.com/KyH8Ad08f5— Siddharth (@DearthOfSid) May 24, 2024 -
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్నాడ్లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ డైరీలో మహాత్ముని వాక్కులు
జనవరి 30న అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1948లో ఇదే రోజున నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ గుజరాత్ నివాసి. మహాత్మా గాంధీ నేర్పిన పాఠాలు ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ గురించి లోతైన అధ్యయనం చేశారు. మహాత్మా గాంధీ తెలిపిన పలు విషయాలను ప్రధాని మోదీ తన పర్సనల్ డైరీలో రాసుకున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలు ట్విట్టర్ హ్యాండిల్ ‘మోదీ ఆర్కైవ్’లో షేర్ అయ్యాయి. ప్రధాని మోదీ తన డైరీలో రాసుకున్న మహాత్మా గాంధీకి సంబంధించిన అమూల్య విషయాలు దీనిలో ఉన్నాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలను యూజర్స్ కోసం అందుబాటులో ఉంచామని ‘మోదీ ఆర్కైవ్’ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిని చూస్తే ప్రధాని మోదీ మహాత్మాగాంధీ గురించి వివరంగా చదవడమే కాకుండా, గాంధీజీ చెప్పిన అమూల్యమైన విషయాలను తన వ్యక్తిగత డైరీలో రాసుకున్నారని తెలుస్తుంది. ఇవి ప్రధాని మోదీకి మార్గదర్శకంగా నిలిచాయి. మహాత్మా గాంధీ తన 78 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ కాంప్లెక్స్లో నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని కాల్చి చంపాడు. భారతదేశ విభజనపై గాంధీ అభిప్రాయాలను గాడ్సే వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గౌరవార్థం ఆయనను గుర్తుచేసుకుంటూ జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. We bring to you pages from @narendramodi's personal diary, which demonstrate that not only did he extensively read #MahatmaGandhi, but he also wrote down Gandhi's quotes in his personal diary as something of inspirational value to him. These entries continued to guide his… pic.twitter.com/MCvgCBMCx1 — Modi Archive (@modiarchive) January 30, 2024 -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024 -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్లు రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు?
అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత దక్కిన అధికారం కాంగ్రెస్ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్ను విజయపథంలో నడిపించిన కమల్నాథ్ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించారు. పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్తో అనుబంధం ఉన్న నేతగా కమల్నాథ్ పేరు తెచ్చుకున్నారు. పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్కు అండగా నిలిచిన కమల్నాథ్.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది. అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్సభ టిక్కెట్ ఇవ్వడంతో కమల్నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్నాథ్ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్నాథ్, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
నితీష్ కుమార్ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్కు చేరిన రెండు విమానాలు -
యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? మహాత్మా గాంధీ 1938, నవంబర్ 26న ‘హరిజన్’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్లో ‘ఇంగ్లండ్ బ్రిటీష్ వారికి చెందినట్లే, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? -
ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? తరువాత ఏం జరిగింది?
అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్ బాగ్పత్ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా ఇందిర.. గుర్జర్ నేత వికల్ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా, ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్లో ఆవిష్కరించనున్నారు. ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
ఘనంగా మహాత్మ గాంధీ 154వ జయంతి వేడుకలు
-
స్వాతంత్రం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు?
అక్టోబర్ 2 గాంధీ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అందించారు. భారతదేశంలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మోహన్దాస్ అనంతరం ఇంగ్లండ్కు వెళ్లారు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లి, వలసదారుల హక్కులను కాపాడేందుకు అక్కడ సత్యాగ్రహం నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ ఎలా జాతిపిత అయ్యారు? ప్రతి భారతీయుడు ఆయనను బాపు అని ఎందుకు పిలుస్తారనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు. భారత స్వాతంత్ర్యం తరువాత గాంధీజీ భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పనిచేశారు, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. సత్యం, సంయమనం, అహింసల మార్గాన్ని అనుసరించాలని చెబుతూ, అందుకు స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తన సర్వస్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే మనిషికి ఆనందాన్నిస్తుందని ఆయన తన నడత ద్వారా చూపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. సరళత, నిర్లిప్తత, ఆత్మతో అనుసంధానం అనే భావనలతో గాంధీజీ జీవించారు. ధోతీ ధరించి, ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించి, ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీజీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ప్రజలు ఆయనను బాపు అని పిలవడం ప్రారంభించారు. మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ‘జాతి పితామహుడు’ అని పిలిచి గౌరవించారు. మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్.. గాంధీజీని ఉన్నతునిగా పేర్కొన్నారు. అప్పటి నుండే అందరూ గాంధీజీని ‘జాతిపిత’ అని పిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు?
ఆమధ్య రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. తాను పండిట్ నెహ్రూ పేరు చెప్పడాన్ని మర్చిపోతే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందన్నారు. కానీ నెహ్రూ ఇంటిపేరును కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, రాయ్ బరేలీ ఎంపీ అయిన తన ముత్తాత ఫిరోజ్ గాంధీ ఇంటి పేరును రాహుల్ గాంధీ తన ఇంటి పేరుగా పొందారు. ఫిరోజ్ గాంధీ 1960లో తన 48 ఏళ్ల వయసులో మరణించారు. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘంఢీ. ఆయన 1912,సెప్టెంబర్ 12న బొంబాయిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతిమాయి, జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ. వీరు పార్సీ మతానికి చెందివారు. జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ మెరైన్ ఇంజనీర్. తండ్రి మరణించినప్పుడు ఫిరోజ్ గాంధీ చాలా చిన్నవాడు. యువ ఫిరోజ్ నాటి రోజుల్లో లేడీ డఫెరిన్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్న తన అత్త షిరిన్ దగ్గర ఉండేందుకు అలహాబాద్ చేరుకున్నారు. ఫిరోజ్ అలహాబాద్లోని ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఫిరోజ్ గాంధీ జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం. రెండవది నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడటం. ఫిరోజ్ గాంధీ ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆ కళాశాల వెలుపల జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఒకరోజు ఆమె అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఫిరోజ్ ఆమెకు సాయం అందించారు. ఆ రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ‘ఆనంద్ భవన్’ కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచే ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యం కొనసాగింది. అదే సమయంలో ఫిరోజ్ తన ఇంటిపేరులో ‘ఘంఢీ’ని ‘గాంధీ’గా మార్చుకున్నారు. మహాత్మా గాంధీపై గల గౌరవంతోనే ఫిరోజ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీతో పరిచయం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. ఫిరోజ్ ఆమె కంటే 5 ఏళ్లు పెద్ద. కాగా కమలా నెహ్రూ.. ఇందిర, ఫిరోజ్ల వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగరిక ఘోష్ తన పుస్తకం ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’లో.. టీబీ కారణంగా కమలా నెహ్రూ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఫిరోజ్ ఆమెను చికిత్స కోసం జర్మనీ తీసుకువెళ్లారని రాశారు. ఇది కూడా చదవండి: లండన్లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి? -
‘గాంధీ’లో ర్యాగింగ్కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్లో, మూడవ భాగాన్ని సూరత్లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
గాంధీ జంక్షన్లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..
కరీంనగర్: 715 ఫీట్లలోతులో బోర్వెల్.. 492 ఫీట్ల మేర కేసింగ్ పైప్.. ఇది నగరంలోని కిసాన్నగర్ గాంధీ జంక్షన్ వద్ద వేసిన అధికారులు వేసిన బోర్వెల్ లెక్కలు. జంక్షన్ అభివృద్ధిలో భా గంగా ఇటీవల వేసిన బోర్వెల్కు సంబంధించిన లెక్కలు నగరపాలకసంస్థలో జరుగుతున్న అక్రమాలను తారాస్థాయికి తీసుకుపోయాయి. అవడానికి చిన్నబిల్లు అయినా, వేసిన కేసింగ్ పైప్ లెక్కలు చూసి కాంట్రాక్టర్లు కళ్లు తేలేస్తున్నారు. సింగరేణి మి నహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే ఇంత లోతులో కేసింగ్ పైప్లైన్ వేసిన దాఖలాలు లేవని బోర్వెల్ యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 175 ఫీట్లలోతులో బోరు.. నగరంలోని కూడళ్ల ఆధునీకరణలో భాగంగా కిసాన్నగర్ గాంధీ జంక్షన్ను అభివృద్ధి చేసి నాలు గు నెలల క్రితం ప్రారంభించారు. జంక్షన్ అభివృద్ధిలో భాగంగా అక్కడ బోర్వెల్ వేశారు. ఈ బోర్ వెల్కు సంబంధించిన చెల్లింపులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఎంబీ రికార్డ్ ప్రతులతో ఈ బోర్ 715 ఫీట్లు (218 మీటర్లు) వేసినట్లు, 492 ఫీట్ల (150 మీటర్లు) కేసింగ్పైప్ వేసినట్లు తేలింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా 50, 60 ఫీట్లకు మించి కేసింగ్ వేయరు. గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి ప్రాంతాల్లో మాత్రమే కేసింగ్ పైప్లు ఎక్కువగా వేస్తారు. కానీ కరీంనగర్ సిటీలో ఈ స్థాయిలో కేసింగ్ పైప్లు వేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని బోర్వెల్ యజమానులంటున్నారు. తాము ఇప్పటివరకు 492 ఫీట్ల కేసింగ్ పైప్ అనే ముచ్చటే వినలేదని ఆశ్చర్యపోతున్నారు. గ్రానైట్ పనులు నిత్యం నడిచే బావుపేట ప్రాంతంలో కూడా 70, 80 ఫీట్లకు మించి కేసింగ్ వేయలేదంటున్నారు. తన 35ఏళ్ల సీనియార్టీలో వంద ఫీట్ల కేసింగ్ పైప్ ఒక్కసారి కూడా వేయలేదని నగరానికి చెందిన ఓ సీనియర్ బోర్వెల్ యజమాని పేర్కొన్నారు. అవినీ తిలో చరిత్ర సృష్టించే ఘనత వహించిన కొంతమంది అధికారులు ఇష్టారీతిన చేస్తున్న అంచనాలు, బిల్లుల వ్యవహారానికి ఇది సజీవ తార్కాణం. సున్నా జత చేశారా...? చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు సున్నా జత చేశారా అనే చర్చ సాగుతోంది. అక్కడ 15 మీటర్ల మేరనే కేసింగ్ పైప్ వేశారని, దానికి సున్నా జత చేసి 150 మీటర్లుగా రాశారని, అలాగే రూ.9,060 బిల్ అయితే సున్నా కలిపి రూ.90,600 గా మార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలోనూ ఈ జంక్షన్లో గాంధీ విగ్రహాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా బోర్వెల్ లెక్కల్లో నమ్మలేని పనులు జరిగినట్లు బిల్లులు సృష్టించడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై సమగ్రవిచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బోర్వెల్ కేసింగ్ పైప్ వ్యవహారంపై ఇంజినీరింగ్ అధికారులు స్పందించలేదు. ముందుగా తమ పరిధిలోకి రాదంటూ దాటవేశారు. సంబంధిత ఏఈ విషయం విన్న తరువాత స్పందించడం మానేశారు. -
జనరల్ డయ్యర్ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్ను క్షమించారు. ‘డయ్యర్ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్వాలాబాగ్లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్దళ్ అభ్యర్థి శరద్ యాదవ్పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను ఓడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
శేరీలింగంపల్లి నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..!
శేరీలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ 2014లో టిడిపి,బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలవగలిగారు. గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు. గాందీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. శేరిలింగంపల్లిలో 2014లో టిడిపి అభ్యర్ధిగా అరికపూడి గాందీ 75904 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.శేరీలింగంపల్లిలో ఒకసారి బిసి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి గెలవగా, రెండుసార్లు కమ్మ సామాజికవర్గం నేత గెలుపొందారు. శేరీలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రైలు పుస్తకం
ఈ దేశానికి స్వాతంత్య్రం రైలు వల్లే వచ్చిందంటే ఉలిక్కిపడవలసిన అవసరం లేదు. జూన్ 7, 1893 రాత్రి– సౌత్ ఆఫ్రికా డర్బన్ నుంచి ప్రెటోరియాకు గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మొదటి తరగతి టికెట్ ఉన్నా, అది ‘వైట్స్ ఓన్లీ క్యారేజ్’ కావడాన పీటర్మార్టిస్బర్గ్ అనే చిన్న స్టేషన్ లో కిందకు ఈడ్చేశారు. వివక్షతో కూడిన ఆధిపత్యం ఎంతటి క్రూరమైనదో గాంధీకి అవగాహన వచ్చిన సందర్భం అది. భారతదేశం వచ్చాక ఇక్కడ బ్రిటిష్వారి పాలనలో అంతకన్నా ఘోరమైన వివక్షను, ఆధిపత్యాన్ని దేశ జనులు అనుభవిస్తున్నారని ఆయనకు తెలియచేసింది రైలే. ‘మూడవ తరగతి పెట్టెల్లో విస్తృతంగా తిరిగాక ఈ దేశమంటే ఏమిటో అర్థమైంది’ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత స్వాతంత్య్ర సంకల్పం తీసుకున్నాడు. నిజానికి గాంధీ రైలు ప్రయాణాలే జనం చెప్పుకుంటారుగాని నెహ్రూ కూడా ‘నేను ఈ దేశాన్ని రైలులో తిరగడం ద్వారానే ఆకళింపు చేసుకున్నాను’ అని ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో రాసుకున్నాడు. ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా వాసికెక్కిన లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ రాజ్యం, పాలన బలపడాలంటే భారతదేశంలో రైళ్ల వ్యవస్థ సమర్థంగా విస్తరించాలని భావించాడు. అయితే డల్హౌసీ ఒకటి తలిస్తే దేశ జనులు మరొకటి తలిచారు. ఏనాడు కనని, వినని ప్రాంతాలను రైలు ద్వారా సగటు భారతీయుడు తెలుసుకున్నాడు. బహు జాతులతో, సంస్కృతులతో సంపర్కంలోకి వచ్చాడు. అలా మనదంతా ఒక జాతి, ‘భారత జాతి’ అనే భావన పాదుకొనడానికి, అందరూ ఏకమై బ్రిటిష్ వారిపై పోరాడటానికి మొదటి భూమికను ఏర్పరించింది ఈ దేశంలో రైలే. ‘భారతీయులు తమ పల్లెటూళ్లను రైల్వేస్టేషన్ లోకి తీసుకొస్తారు. పల్లెల్లో వాళ్ల ఇళ్లల్లోకి రానీయకపోవచ్చు. కాని పల్లె స్వభావం మొత్తం స్టేషన్ లో ప్రదర్శనకు పెడతారు’ అని అమెరికన్ ట్రావెల్ రైటర్ పాల్ థెరూ ‘ది గ్రేట్ రైల్వే బజార్’ (1975) పుస్తకంలో రాశాడు. నిజమే. గడ్డి మోపులు, ధాన్యం బస్తాలు, కోళ్ల గంపలు, కుండలు, గిన్నెలు, కట్టెలు, పాల క్యాన్లు, సైకిళ్లు, పనిముట్లు, అరుపులు, కేకలు, అక్కరలు, మక్కువలు... వారు స్టేషన్ కు తేనిది ఏమిటి? బండి ఎక్కించనిది ఏమిటి? ‘భారతదేశంలో రైలు కంపార్ట్మెంట్ అంటే ఇల్లే. అందులో ప్రతి ఒక్క ఇంటి సభ్యుణ్ణి చూడొచ్చు. రైలులో వారు అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నలుగానే ఎక్కువగా ప్రయాణి స్తారు. ప్రయాణికులుగా తక్కువగా మారుతారు’ అని మరొక పాశ్చాత్య రచయిత రాశాడు. దొరలు ఎక్కే ఈ పొగబండి జన సామాన్యానికి అందుబాటులోకి వచ్చాక కథ, కవిత, నవల, సినిమా, నాటకాల్లో దీని ప్రస్తావన లేకుండా సృజన సాగలేదు. భారతీయ రైళ్లను, వాటి కిటికీల గుండా కనిపించే దేశాన్ని మొదట రడ్యార్డ్ కిప్లింగ్ ‘కిమ్’ (1901) నవలలో రాశాడు. అయితే రైలును ఒక చారిత్రక సాక్ష్యంగా కుష్వంత్ సింగ్ మలిచాడు. మనో మజ్రా అనే చిన్న సరిహద్దు గ్రామంలో జనం ఒక ట్రైన్ ఆ ఊరి మీదుగా వెళితే నిద్ర లేస్తారు. మరో ట్రైను కూత వినిపిస్తే మధ్యాహ్నం కునుకు సమయం అని గ్రహిస్తారు. ఇంకో ట్రైన్ శబ్దం వచ్చాక రాత్రయ్యింది పడుకోవాలి అని పక్కల మీదకు చేరుతారు. 1947లోని ఒక వేసవి రోజు వరకూ వారి దినచర్య అలాగే ఉండేది. కాని ఆ రోజున వచ్చిన ఒక రైలు వారి జీవితాలను సమూలంగా మార్చేసింది. ఆ ఊరి వాళ్లు ఆ రైలు రాకతో హిందువులుగా, ముస్లింలుగా, సిక్కులుగా విడిపోయారు. ఆ తర్వాత? ‘ట్రైన్ టు పాకిస్తాన్ ’ నవల చదవాలి. రైలు ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ‘గాలి వాన’ అనే గొప్ప కథ రాశారు పాలగుమ్మి పద్మరాజు. మనుషుల ప్రాథమిక సంవేదనల ముందు వారు నిర్మించుకున్న అహాలు, జ్ఞానాలు, ఆస్తులు, అంతస్థులు, విలువలు గాలికి లేచిన గడ్డిపోచల్లా కొట్టుకుని పోతాయి అని చెప్పిన కథ ఇది. చాసో ‘ఏలూరెళ్లాలి’ కథ రైలు పెట్టెలోనే మనుగడ రహస్యాన్ని విప్పుతుంది. రైలు చుట్టూ ఎన్నో ప్రహసనాలు, పరిహాసాలు. తిలక్ రాసిన ‘కవుల రైలు’లో కవులందరూ ఎక్కి కిక్కిరిసిపోతారు. పాపం ప్లాట్ఫారమ్ మీద ఒక యువతి మిగిలిపోతుంది. ‘నీ పేరేమిటమ్మా’ అంటాడు స్టేషన్ మాస్టరు. యువతి జవాబు– ‘కవిత’! ‘షోలే అంత పెద్ద హిట్ ఎందుకయ్యింది’ అని ఎవరో అడిగితే ‘రైలు వల్ల’ అని సమాధానం ఇచ్చాడు అమితాబ్. ‘షోలే’ సినిమా రైలుతో మొదలయ్యి రైలుతో ముగుస్తుంది. అందులోని ట్రైన్ రాబరీ వంటిది ఇప్పటికీ మళ్లీ సాధ్యపడలేదు. ‘సగటు ప్రేక్షకుడికి రైలు కనపడగానే కనెక్ట్ అయిపోతాడు’ అని అమితాబ్ ఉద్దేశం. ‘ఆరాధన’లో రైలు కిటికీ పక్కన పుస్తకం చదువుకుంటున్న షర్మిలా టాగోర్ను, రోడ్డు మీద జీప్లో పాడుకుంటూ వస్తున్న రాజేష్ ఖన్నాను మర్చిపోయామా మనం? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్– కదిలిపోతున్న రైలులోని హీరోను అందుకోవడానికి హీరోయిన్ పరుగులు– సూపర్హిట్ ఫార్ములా! అందుకే రైలు ఈ దేశ ప్రజల జీవనంలో అవిభాజ్యం. అంతేనా? రైలు ఈ దేశంలో ఎన్నో బరువుల, బాధ్యతల, మమతల, కలతల, కలల వాహిక. గమ్యంపై ప్రయాణికుడు పెట్టుకునే నమ్మకం. ‘చేరి ఫోన్ చేస్తారు’ అని కుటుంబం పెట్టుకునే భరోసా. బెర్త్పై నిశ్చింతగా ముసుగు తన్నే నిద్ర. దానికి దెబ్బ తగిలితే భారతీయుడు విలవిల్లాడతాడు. ‘నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. మృత్యుశకటం లాంటి రైలు కంటే ఎప్పటికీ రాని రైలు మేలైనది అనిపిస్తే ఆ నేరం ఎవరిది? -
తిరుపతి ఐఐటీలో సందడి చేసిన సింగర్ నిఖితా (ఫొటోలు)
-
టీనేజ్లో గాంధీజీని తీవ్రంగా విమర్శించేవాడిని: కమల్ హాసన్
సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్కి చెప్పారు. తాను టీనేజ్లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు. సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో కమల్హాసన్కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్ హాసన్తో అన్నారు. అలాగే రాహుల్ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్ చేయగా, అందుకు ప్రతిగా కమల్ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు. (చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు) -
రాహుల్ స్పీచ్లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
దుర్గా మండపంలో విగ్రహం వివాదం.. మహిశాసురుడిలా గాంధీ!
కోల్కతా: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్కతాలో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వివాదానికి కేంద్ర బిందువైంది. త్రిశూలంతో దుర్గామాత వధిస్తున్న మహిశాసురుడు.. గాంధీజీ రూపురేఖల్లో ఉండటమే ఇందుకు కారణం. బట్టతలతో, గుండ్రని కళ్లద్దాలతో ధోతీ ధరించినట్లు ఆ విగ్రహముంది. గాంధీజీని అవమానించాలనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించాయని పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్సహా పలు పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. అయితే, ఈ ఘటనను అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి సమర్థించుకున్నారు. ‘అసురుడి ముఖం అలా ఉండటం కేవలం యాదృచ్ఛికం. అయినా, ఆ బొమ్మ చేతిలో రక్షణ కవచం ఉంది. గాంధీజీ అవేం ధరించడుకదా. అయినా నేతాజీ, భగత్సింగ్లే నిజమైన హీరోలు. గాంధీజీని విమర్శించాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ ఇదే బీజేపీ, సంఘ్ పరివార్ నిజమైన భావజాలం. మిగతాదంతా డ్రామా. మహాత్ముడిని ఇలా అవమానిస్తారా?’ అని టీఎంసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కునాల్ ఘోష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెల్సుకున్న పోలీసులు మండపానికి వెళ్లి రాక్షసుడి ముఖాన్ని మరో రూపంలోకి మార్చాలని నిర్వాహకులకు సూచించారు. చదవండి: మంగళ్యాన్ కథ ముగిసింది -
వలస కూలీల హీరో.. లాయర్ గాంధీ
వలస ఒప్పంద కూలీలైన ‘గిరిమిటియా’లను ఆ చెర నుంచి విడిపించడం కోసం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయిన లాయర్ గాంధీ.. ఆ పని సాధించాకే తిరిగి ఇండియా వచ్చారు. గాంధీజీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటం చేశారో అంతటి పోరాటం దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం చేశారు. 1893 మే నెలలో న్యాయవాదిగా వృత్తి ధర్మంతో దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు గాంధీ. ఆ పని సంవత్సరంలో అయిపోయింది. 1894లో స్వదేశానికి తిరిగి రావలసి వుంది కానీ ఆ దేశంలో వారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వలన కలిగే నష్టాలేమిటో అక్కడి మన భారతీయులకు వివరించడానికి గాంధీజీ ఆగిపోయారు. అలా గాంధీజీ బిల్లు గురించి చెప్పేసరికి వారంతా గాంధీజీని అక్కడే (దక్షిణాఫ్రికాలో) ఉండిపోయి తమ కష్టాలను నివారించమని కోరారు. దాంతో గాంధీజీ అక్కడే 21 సంవత్సరాలు.. అంటే 1914 వరకూ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ప్రధానంగా గిరిమిటియాల సమస్యను పరిష్కరించాడు. ‘గిరిమిటియా’ అంటే ‘ఒప్పంద వలస కూలీ’ అని బ్రిటిష్ అర్థం. పద్ధతి రద్దు కాలేదు ఐదేళ్లు పని చేస్తామని అంగీకరించి ఒప్పందం పత్రంపై సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు ఉపాధి కోసం వెళ్లిన వారిని గిరిమిటియాలు అంటారు. అటువంటి గిరిమిటియాలకు 1914లో విధించిన 3 పౌండ్ల పన్ను రద్దు అయినప్పటికీ, ఆ విధానం మాత్రం పూర్తిగా రద్దు కాలేదు. (1916లో మదన్ మోహన్ మాలవ్య పెద్దల కౌన్సిల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దీనికి సమాధానంగా లార్డ్ హార్డింగ్ తగిన సమయం వచ్చినప్పుడు ఆపుతామని అన్నారు.) గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లే నాటికి ఆ దేశం నాలుగు కాలనీల సమూహం. నేటాల్, కేఫ్, ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్. డచ్చి వారు (బోయర్స్) ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లోనూ, బ్రిటిష్ వారు నేటాల్, కేఫ్ ప్రాంతాల్లోనూ ఉండేవారు. వీరు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉండేవారు. చివరకు బోయర్స్ వార్తో దక్షిణాఫ్రికా యావత్తూ బ్రిటిష్ వారి వశమయ్యింది. అయితే భారతీయుల న్యాయపరమైన హక్కుల రక్షణకే ఈ యుద్ధం చేశామని బ్రిటిష్ వారు చెబుతూ వచ్చారు. ఇష్టమైతే మరో ఐదేళ్లు దక్షిణాఫ్రికాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఖనిజ సంపద, వజ్రాలు పైకి తీయడానికి శ్వేత జాతీయులకు భారతీయ కూలీల సహాయం విధిగా కావాలి. కనుక భారతీయ కూలీలను కాంట్రాక్టు పద్ధతిమీద దక్షిణాఫ్రికా పంపడానికి ఇండియాలోని బ్రిటిష్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటువంటి కాంట్రాక్టు కూలీల జట్టు ఒకటి 1860లో దక్షిణాఫ్రికా చేరింది. కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతోనే వారికి ఇష్టమయితే మరో అయిదు సంవత్సరాల పాటు తిరిగి కూలీలుగా కాంట్రాక్టు లో చేరవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణానికయ్యే ఖర్చుకు ఎంత భూమి లభిస్తుందో అంత భూమిని వారికే కేటాయిస్తారు. ఆ భూమిలో స్థిరపడి వారు అక్కడే సేద్యం చేసుకోవచ్చు. అలా స్థిరపడిన వారి అవసరాలు తీర్చడానికి అచిరకాలంలోనే భారతీయ వర్తకులు కూడా అక్కడ ప్రవేశించారు. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో భారతీయ జనాభా పెరిగింది. అవసరం కోసం ఆసరా! 1969లో ఇంకా కూలీలను ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు ‘కూలీ కాంట్రాక్టు కాల పరిమితి అయిపోవడంతోనే వారు ఆ దేశంలోని సాధారణ చట్టాలను అనుసరించి జీవించడానికి వీలుండాలనీ, ఏ విధమైన నిర్బంధాలు ఉండకూడదని’ బ్రిటన్ స్పష్టం చేసింది. 1858లో విక్టోరియా రాణి ప్రకటనలో కూడా ‘‘మన ఇతర దేశాల ప్రజల వలనే భారతీయులకు కూడా సమాన హక్కులుంటాయి’’అని హామీ ఇచ్చారు. భారతీయ వర్తకులు చౌకగా జీవించగలిగేవారు. అందువల్ల బ్రిటిష్ డచ్ వర్తకులకన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మగలిగేవారు. దాంతో భారతీయ వర్తకులు యూరోపియన్ వర్తకులకు బాగా పోటీగా వున్నారని వారు గ్రహించారు. భారతీయ వ్యవసాయదారులు కొత్త రకాలైన కాయలను, పండ్లనూ, చౌకగానూ, విస్తారంగానూ పండించడం మొదలుపెట్టారు. అలా భారతీయుల్ని స్వేచ్ఛగా తమ దేశంలోనికి రానిచ్చినట్లయితే వారు వ్యవసాయంలోనూ, వ్యాపారం లోనూ తెల్లవారిని తుడిచి పెట్టేస్తారేమోనని వారు భయపడ్డారు. అందువల్ల భారతీయులపై అనేక ఆంక్షలను విధించడం ప్రారంభించారు. 1885 లో 3 వ నెంబరు చట్టాన్ని ట్రాన్స్ వాల్ లో ప్రవేశపెట్టారు. ఆసియా వాసులు.. ముఖ్యంగా భారతీయులు పారిశుధ్య కారణాల వల్ల వారికి ప్రత్యేకించబడిన ప్రాంతాలలోనే నివసించాలనీ, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో తప్ప స్థిరాస్తులను సంపాదించుకోకూడదని, వ్యాపారనిమిత్తం వచ్చేవారు లైసెన్సు పొంది రిజిస్టర్ చేయించుకుని రావాలని శాసించింది ప్రభుత్వం. ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతటా భారతీయుల మీద జాతి విద్వేషం, రైళ్లలోనూ, బస్సుల్లోనూ, స్కూళ్లలోనూ, హోటళ్లలోనూ అపారంగా పెరిగిపోయింది. పర్మిట్ లేకుండా భారతీయులను ఒక కాలనీ నుంచి మరో కాలనీకి పోనివ్వలేదు. భారతీయుల సంఖ్య హెచ్చుగా వున్న ‘నేతాల్‘ లో భారతీయుల ఓటు హక్కును రద్దు చేశారు. ఆ క్రమంలో గాంధీజీ ఓడలో దక్షిణాఫ్రికాలోని టయోటా రేవుకు చేరారు. ఓడ దిగక ముందే.. ‘మీరు తిరిగి వెళ్లిపోండి లేకపోతే సముద్రంలో ముంచేస్తాం, తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ ఇచ్చివేస్తాం‘ అని ఓడ ప్రయాణికులను అక్కడివారు హెచ్చరించారు. చివరకు పోలీసు వారి సహాయంతో ఓడ దిగగానే గాంధీజీ పై రాళ్ల దాడి జరిగింది. ఎలానో గాంధీజీ ని పోలీసులు ఇంటికి చేర్చారు. స్థానికులు గాంధీజీ ఇంటి ముందు చేరి ‘గాంధీ ని మాకు అప్పగించండి’ అని గొడవ చేశారు. ప్రిటోరియా లో గాంధీజీకి క్షవరం చేయడానికి క్షురకుడు కూడా నిరాకరించాడు. ఆ విధంగా న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలను నివారించడానికి గాంధీజీ 21 సంవత్సరాలు పోరాటం చేయాల్సివచ్చింది. ఆ పోరాటం వల్లనే గిరిమిటియా సమస్య కూడా పరిష్కారమయ్యింది. 1914 లో గాంధీజీ భారత్కు తిరిగి వచ్చి అకుంఠిత దీక్షతో దక్షిణాఫ్రికా పోరాట అనుభవంతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 1947 లో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకురాగలిగారు. – డా. కాశింశెట్టి సత్యనారాయణ,విశ్రాంత ఆచార్యులు (చదవండి: సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా) -
తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్: ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ గాంధీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నేతలను సమీకరించి పోరాడితే.. కేసీఆర్ తెలంగాణ తేవడంతోపాటు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నార న్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
బాపూ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర బాపూ డైరీనీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రగతిభవన్లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వడ్ల సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ డైరీలో ఐక్యరాజ్య సమితి సూచించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలను పొందుపరిచినట్లు వెల్లడించారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సంస్థ ప్రతినిధుల కృషిని మంత్రి కేటీఆర్ అభినందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని గోశాలలో నిర్వహిస్తున్న రామచంద్ర ప్రకృతి ఆశ్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్ను కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి, ఆశ్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఎస్.వి.సి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ మాట కూడా వినరా?
గాంధీజీ–అంబేడ్కర్ మధ్య వివాదమూ, చర్చలూ, ఆ తర్వాత 1932 సెప్టెంబర్ 24న జరిగిన పూనా ఒడంబడిక– ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య వివరించారు (సాక్షి; సెప్టెంబరు 23). యువతరంలో చాలామందికి అంతగా తెలియని ఉదంతమిది. 30 ఏళ్ళ యువ అంబేడ్కర్– అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలనీ; అదీ దళితుల ద్వారానే ఎన్నిక య్యేలా ఉండాలనీ బ్రిటిష్ పాలకులను కోరారు. ఇది హిందువులను చీలుస్తుం దనే కారణంతో గాంధీ వ్యతిరేకించినా, ‘కమ్యూనల్ అవార్డు’ పేరిట బ్రిటిష్వారు అంగీకరించారు. ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ ఆమరణదీక్ష, ఫలితంగా అంబేడ్కర్పై ఒత్తిడి, చివరకు పూనా ఒడంబడిక జరి గాయి. దాని ఫలితమే నేడు అమలులోవున్న రిజర్వుడ్ స్థానాల విధానం. ఈ విధానంలో ‘నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నిక కావటం లేదు’ అన్న వాస్త వాన్ని లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఐతే అంబేడ్కర్ ఆశిం చినట్టుగా ఎన్నుకుంటే సామాజిక, రాజకీయరంగంలో ‘మౌలిక మార్పులు’ వచ్చేవి అనటం వాస్తవ విరుద్ధం. ఈ విషయాన్ని 1955 నాటికే అంబేడ్కర్ గుర్తిం చారు. విద్యావంతులైన దళితులు, వారి ప్రతినిధులు దళిత జనబాహుళ్యాన్ని విస్మరిస్తున్నారని బాహాటంగా 1956 మార్చి 18 ఆగ్రా ఉపన్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా తమ భవంతిలోకి ఆహ్వా నిస్తే, వెళితే వెళ్ళండి. అమ్ముడుపోవాలనుకుంటే మీ ఇష్టం... ఇతరుల నుంచి కాదు, నా వాళ్లనుండే నాకు ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తున్నాను’ అన్నారు. అంబేడ్కర్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవ కుండా చూశాయి పాలకవర్గాలు. రాజ్యాంగం ఆమోద మైన రెండేళ్ళకే, వయోజన ఓటింగుతో జరిపిన పార్ల మెంటు తొలి 1952 ఎన్నికల్లోనూ (ఆయన ఓట్లలో నాల్గవ స్థానంలో ఉన్నారు), 1954 ఉప ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ దళిత అభ్యర్థితో రిజర్వుడ్ సీటులోనే ఆయన్ని ఓడించారు. ఆమాటకొస్తే 1946లోని పరి మిత ఓటింగ్తో జరిపిన ఎన్నికల్లోనూ అదే స్థితి! సొంత రాష్ట్రం సంయుక్త మహారాష్ట్ర నుంచి గెలిచే సీటు లేక, తూర్పు బెంగాల్ వెళ్ళి అక్కడి దళిత, ముస్లిం పార్టీల మద్దతుతో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. తమ ప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న ఒక ‘రాజకీయ ఉద్యమా’నికి సన్నద్ధం కావాలని లక్ష్మయ్య రాశారు. ఇది సాధ్యం కాదు. గెలిచిన అభ్య ర్థులనే కాదు, పార్టీలనే కొనేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు. ఎస్సీ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ తన సమావేశంలో – అంబేడ్కర్ ఆధ్వర్యంలోనే– 1955 ఆగస్టు 21 నాడు ఒక తీర్మానం (నంబర్ 6) పాసు చేసింది, బొంబాయిలో ఏకగ్రీవంగా: ‘పార్లమెంటు, శాసనసభలు, మున్సిపాలిటీలు, జిల్లాబోర్డులు వంటి స్థానిక సంస్థలలో ఎస్సీలకున్న రిజర్వేషన్ నిబంధ నను వెన్వెంటనే – రాబోయే ఎన్నికలకు ముందే – రద్దుచేయాలి అని వర్కింగ్ కమిటీ భావిస్తున్నది’. ప్రభుత్వం ప్రచురించిన అంబేడ్కర్ సమగ్ర రచనల్లో ఉంది (వాల్యూం 17; పేజీ 439). ధనంజయ కీర్ రాసిన ప్రసిద్ధ జీవిత చరిత్రలోనూ దీన్ని పేర్కొన్నారు. రాజకీయ రిజర్వేషన్ని ‘రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని’ తీర్మానించినట్టు ఇలా పేర్కొన్నారు: కాంగ్రెసు నిలబెట్టిన ‘ఎలకల్లాటి’ ఎస్సీ అభ్యర్థులు, ఫెడరేషన్ నిల్పిన ‘సింహాలను’ వారి కేంద్రాల్లోనే ఓడించారని దిగ్భ్రాంతితో చేసిన తీర్మానం ఇది. అంబేడ్కర్ అక్కడితో ఆగలేదు. తానే స్థాపించిన ఆ ఫెడరేషన్ని (ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఓడారు) రద్దుచేయటానికి, కులప్రాతిపదిక లేని రిపబ్లిక్ పార్టీ స్థాపనకు నిర్ణయించి 1956 సెప్టెంబర్ 30న ప్రకటిం చారు. ఆ డిసెంబర్ 6న మరణించారు పైవే కాదు, ఇంకా అనేక విషయాలను మేధావులు దాచిపెడుతుం టారు. తమకి అంగీకారం వున్నా లేకపోయినా అంబే డ్కర్ అభిప్రాయాలను, చరిత్రను మరుగుపరచడం అంబేడ్కర్వాదులకు తగదు. అంబేడ్కర్వాద నాయ కులు అనేకమంది కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు; కాంగ్రెస్తోనేకాదు, బీజేపీతోనూ బీఎస్పీ కలిసి పని చేసింది. అందువల్ల లక్ష్మయ్య సూచనలు సాధ్యం కావు, అభిలషణీయమూ కాదు. – ఎం. జయలక్ష్మి ఏజీఎం(రిటైర్డ్), ఆప్కాబ్, హైదరాబాద్ -
గాడ్సే మరణ వాంగ్మూలం
జాతి పిత మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ హంతకుడు గాడ్సే నేపథ్యంలో ‘మరణ వాంగ్మూలం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై పరిశోధన చేశాను. గాంధీ తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మృతి చెందారు. గాంధీ హత్యలో గోపాల్ గాడ్సే ప్రమేయం ఏంటి? అనే అంశాల్ని కూడా చూపించనున్నాం’’ అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ–‘‘గాడ్సే రాసిన పుస్తకం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్లో తన వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘భరద్వాజ్గారు గాడ్సే మీద సినిమా గురించి చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. సినిమాని డిసెంబర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాత సూరజ్. -
సంఘ సంస్కరణకర్తగా గాంధీజీ
పుత్లీభాయి కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మనదేశానికి ఖ్యాతి తెచ్చినవారిలో అగ్రగణ్యుడుగా నిలిచాడు. మానవాళికి ఎన్నో క్రొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన ఆ మహా త్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో వున్నాయి. వారు ప్రవేశపెట్టిన సంఘసంస్కరణల గురించి పరిశీలిద్దాం. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు మనపై అధికారం చెలాయించడానికి రెండు కారణాలు ప్రధానమైనవిగా గమనించారు గాంధీజీ. వారి ఆధునిక సాంకేతిక ఆయుధబలం మొదటి కారణమైతే భారతీయులలో నాడు లోపించిన ఐకమత్యం రెండోది. బ్రిటిష్ వారి ఆయుధబలానికి ప్రతిగా మన సంఖ్యాబలాన్ని ఒడ్డడానికి అనుకూలమైన అహింసామార్గాన్ని అవలంబించారు. ఇటీవలకాలంలో దేశవిదేశాలలోని పెక్కు విశ్వవిద్యాలయాలు అహింసామార్గాన్ని పరిశోధించి అవిష్కరించిన రెండు సత్యాలు– (1) సామాన్యమానవునికి సాయుధపోరాటంలో కన్నా అహింసామార్గంతోకూడిన పోరాటంలో పాల్గొనడానికి పదకొండు రెట్లు అవకాశముంటుంది. (2) గత శతాబ్ద కాలంలో జరిపిన సాయుధపోరాటాలు 27% విజయం సాధించగా అహింసామార్గంతోకూడిన పోరాటాలు 51% విజయం సాధించినవి. మనలో ఐకమత్య లేమికి ప్రధాన కారణాలు కులమత భేదాలన్న విషయం గమనించిన బాపూజీ వాటిని రూపుమాపడానికి ఎన్నో సంఘసంస్కరణలు ప్రవేశపెట్టారు. తండ్రి పోర్బందర్ సంస్థానంలో దీవాన్ కావడంతో వారిం టికి అన్యమతస్తుల బడుగువర్గాలవారి రాకపోకలు మెండుగా వుండేవి. దాంతో గాంధీజీకి సహజంగానే విశాల దృక్పథం వుండేది. మార్గాలు వేరైనా అన్నిమతాల గమ్యం ఒకటేనన్నారు. అనామధేయుడైన భగవంతునికి సహస్రనామాలన్న సత్యాన్ని నొక్కి వక్కాణించారు. ఎవరేపేరుతో పిలిచినా పలికే భగవంతుడొక్కడేనన్నారు. గాంధీజీ ప్రవేశపెట్టిన సంఘసంస్కరణలన్నిటికీ మూలం తాను నమ్మిన ఈ అద్వైతంలో దొరుకుతుంది. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ మొదటి అధ్యాయం చంపారణ్ రైతుసమస్య పరిష్కారం. ఆనాటి జమీందారి వ్యవస్థ బ్రిటిష్ వారి పరిపాలనలో ప్రథమాంకం. శిస్తువసూలులో వారిది ప్రముఖపాత్ర. నూటికి తొంభైఐదుమంది రైతులు జమిందారులవద్ద పొలం కౌలుకి తీసుకొనేవారు. కౌలుకి తీసుకొన్న పొలంలో కొంతభాగం నాటి ప్రముఖ వాణిజ్య పంట అయిన ఇండిగోను పండించి మొత్తం ఇండిగో పంటని జమీందారుకివ్వాలన్నది నియమం. గత్యంతరంలేని రైతులు ఆ నియమాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదు. అద్దకంలో ఇండిగో ప్రముఖపాత్ర వహించినంతకాలం జమీందారులు తృప్తిగావున్నారు. జర్మనీవారు ఇండిగోకి ప్రత్యామ్నాయంగా కృత్రిమ డై కనిపెట్టడంతో ఇండిగో ధరలు గణనీయంగా పడిపోయాయి. దానితో రైతులపై జమీందారుల దౌర్జన్యం మితిమీరింది. ఇండిగోతోపాటూ రైతుల పంటధాన్యాలను కూడా చెల్లించుకోవల్సివచ్చింది. గాంధీజీ రైతులను, జమీందారులను విస్తృతంగా కలిసి పరిష్కారాన్వేషణలో నిమగ్నమైనారు. దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలు తెలుసుకొన్న కలెక్టరు ఆ ప్రాంతం నుంచి తక్షణమే గాంధీని వెళ్లిపోవాలని ఆదేశించారు. గాంధీజీ సహజంగానే ఆ ఆదేశాన్ని ఉల్లంఘించారు. అంతే సహజంగా గాంధీజీని బోనెక్కించారు కలెక్టరు. సమస్యా పరిష్కారం నేరమైతే నిస్సందేహంగా నేరస్తుడనని ఒప్పుకొంటానన్నారు గాంధీజీ. చట్టప్రకారం శిక్షార్హుడనని అందుకు తను సిద్ధంగా వున్నానని చెప్పారు. విషయం తెలిసిన గవర్నర్ హుటాహుటిన కలెక్టరు చేత కేసు విరమణ చేయించారు. పత్రికలద్వారా విపులంగా తెలుసుకొన్న ప్రజానీకానికి అసలుసిసలు శాసనోల్లంఘన అంటే ఏమిటో తెలి సింది. గాంధీగారు నాటినుంచి బాపూజీ ఐనారు. చంపారణ్లో రైతులపై జమిందారుల దోపిడీని కట్టడంచేయడంతో గాంధీజీ సరిపెట్టుకోలేదు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని రైతులు దోపిడీకి గురికావడంలో ఆశ్చర్యంలేదని గమనించిన గాంధీజీ పాఠశాలల్ని ఏర్పరచారు. స్త్రీపురుషుల అసమానతలను అంటరానితనాన్ని ఖండించారు. పరిసర పరిశుభ్రతను ప్రోత్సహించారు. సంఘసంస్కరణ బాధ్యతను కూడా చంపారణ్లోనే తన భుజాలపై వేసుకొన్నారు. స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని నాయకుడైనాడు. అలనాడు బడుగువర్గాలకు ఆలయప్రవేశంలేదు వారిని మతం మార్పించడంలో మిషనరీలు అంతగా కృతకృత్యులవడానికి ముఖ్యకారణమిదే కావచ్చు. నలుగురు మంచినీళ్ళు తెచ్చుకొనే బావి దగ్గరకొచ్చే ఆస్కారం లేదు. వారి పిల్లలు పాఠశాలకెళ్లే అవకాశాలు తక్కువ. ఒకవేళ వెళ్లగలిగినా అక్కడ వారెదుర్కొనే అవమానాలు అన్నీఇన్నీకావు. అందుకు బీఆర్ అంబేడ్కర్ పడ్డ అగచాట్లే తార్కాణం. పైగా వారికి చతుర్వర్ణాలలో తావివ్వక పంచములన్నారు. అంటరానివారని ఊరివెలుపల బ్రతకమన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురై అవమానాలకు గురైన గాంధీజీ అంటరానితనం అమానుషం అని ఎలుగెత్తిచాటడంలో ఆశ్చర్యమేముంది? నేటికి స్వాతంత్య్రభారతం సాధించిన ఘనవిజయాలలో అతిముఖ్యమైనది అంటరానితనాన్ని దాదాపుగా రూపుమాపడమని చెప్పవచ్చు. వారికి నేడున్న విద్యావుద్యోగావకాశాలు బ్రిటిష్ పాలనలో కలలోకూడా ఊహించుకోలేము. అలనాడు స్త్రీల పరిస్థితి కూడా దారుణంగా వుండేది. వారికి చదువుకొనే అవకాశాలు బహుతక్కువ. ఇంతెందుకు కస్తూరి గాంధీనే పెద్దగా చదువుకోలేదంటే సామాన్య వనితల విషయం చెప్పపనిలేదు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో వుంటుందని గాంధీజీ చెప్పేవారు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులుగా ఉండేవారని చెప్పటానికి వేదోత్తములైన గార్గివాచక్నవి సులభ మైత్రేయి గురించి ఉదహరించేవారు. జనక మహారాజు రాజసూయ యాగసమయంలో జరిగిన చర్చలో యాజ్ఞవల్క్యుడు గార్గివాచక్నవి పోటీపడ్డ కథను బృహదారణ్యకోపనిషత్లో ప్రస్తావించిన విషయం గుర్తుచేసేవారు. శారీరకంగా పురుషులది పైచేయి అయినా మానసికంగా స్త్రీలది పైచేయి అన్న నిజం గాంధీ ఆనాడే గ్రహించారు. స్వాతంత్య్రపోరాటంలో సైతం వారిని ప్రోత్సహించారు. అరుణా అసఫ్ ఆలీ సరోజినీ నాయుడు వంటి వారికి నాయకత్వపు అవకాశాలు కల్పించారు. కులమతభేదం వలదని నినాదాలివ్వడమే కాకుండా ఆచరణలో కూడా చూపించారు. ప్రేమవివాహాలపై కూడా గాంధీగారిది విశాలదృక్పథమే. కులాలు వేరైనా రాజాజీ కుమార్తెతో తన తనయుడికి వివాహం జరిపించారు. మతాలు వేరైనా ఇందిరానెహ్రూకి ఫిరోజ్ గాంధీతో దగ్గరుండి వివాహం జరిపించారు. గాంధీజీకే కాదు ఆయన శిష్యులకి కూడా కులమత భేదాలు లేవు. హిందూ కుటుంబంలో పుట్టిన అరుణా గంగూలీ ఒక ముస్లింని ప్రేమించి పెండ్లి చేసుకొని అరుణా అసఫాలీ అయినారు. అగ్రవర్ణాలకి చెందిన సరోజినీ రైతు కుటుంబానికి చెందిన వారిని పెండ్లాడారు. గాంధీజీ వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. ప్రముఖ గాంధేయవాది కమలాదేవి ఛటోపాధ్యాయ గారి ద్వితీయ వివాహం ఇందుకు నిదర్శనం. స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన గాంధీగారి గురించి రాజ కుమారి అమృత కౌర్ చెప్పిన నాలుగు మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. ‘గాంధీగారిలో మేము జ్ఞానసంపన్నులైన తండ్రినేకాదు అమృతతుల్యమైన తల్లినికూడా చూశాము. మా కష్టసుఖాలను ఆయనతో అరమరికలు లేకుండా పంచుకొనేవారిమి. అహింసామార్గం పుణ్యమా అని స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం దొరికింది’. (నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా) ఎంఆర్కే కృష్ణారావు, రిటైర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా -
మతరహిత దేశం.. గాంధీ స్వప్నం
గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15.. శాంతిని కోరుకుంటూ ఉపవాసం పాటించాల్సిన దినం. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగారు. ‘ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపుల వంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజుకూ వర్తించేటటువంటి, జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఘనమైన సమాధానం ఇచ్చారు. ’ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. అది 1946 నవంబర్ 6 నడిరాత్రి. దశాబ్దాలుగా మహాత్మాగాంధీ కాంక్షించిన స్వాతంత్య్రం మరికొన్ని నెలల్లో సిద్ధించబోతోంది. అప్పుడే దేశ విభజన శాపంలా ముందుకు వచ్చి అరాచకం, హత్యాకాండ రగులుకున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రాత్రి మహాత్మాగాంధీ ఒక పెర్రీ బోట్లో చాంద్పూర్ చేరుకున్నారు. క్రూర హింసాకాండకు గురైన హిందువుల పిలుపునందుకుని ఆయన నాటి తూర్పు బెంగాల్లోని నౌఖాలి మాగాణిప్రాంతంలో పూర్తిగా నాలుగు నెలల కాలం గడపదలిచారు. తన పర్యటనలో తొలి మజిలీలో అడుగుపెట్టిన వెంటనే బీహార్లో ముస్లింలపై పాశవిక ప్రతిదాడి మొదలైందన్న వార్తలు గాంధీ చెవిన పడ్డాయి. తీవ్ర విషాదంతో, అవమానంతో గాంధీ చెప్పారు. ‘ఈరోజు భారత స్వాతంత్య్రం బెంగాల్, బిహార్లలో ప్రమాదంలో పడింది. బిహారీలు పిరికిపందల్లా వ్యవహరించారు. బిహారీలు నిజంగా ఎదురుదెబ్బ తీయాలని భావించి ఉంటే వారు నౌఖాలికి వచ్చి అక్కడ ప్రాణాలివ్వడానికి సిద్ధపడి ఉండాలి’. ఆ మరుసటి రోజు రెండు ప్రతినిధి బృందాలు గాంధీని కలిశాయి. మొదట ముస్లిం ప్రతినిధులు వచ్చి, చాంద్పూర్లో ఎలాంటి అలజడులూ జరగకుండా చూస్తున్నామని చెప్పారు. తర్వాత హిందూ ప్రతినిధులు వచ్చారు. తమకు పోలీసు, మిలటరీ రక్షణ కావాలని చెప్పారు. ఆ సాయంత్రం చాంద్పూర్లో 15 వేలమంది (ఎక్కువమంది ముస్లింలే) హాజరైన సభలో గాంధీ ప్రసంగించారు. ‘ఇక్కడ బలవంతపు మత మార్పిడిలు జరిగాయని విన్నాను. బలవంతంగా గొడ్డుమాంసం తిని పించారని విన్నాను. బలవంతంగా పెళ్లిళ్లు జరిపిం చారని విన్నాను. ఇక హత్యలు, లూటీలు, దోపిడీల విషయం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు విగ్రహాలు కూల్చేశారు. ముస్లింలు విగ్రహారాధన చేయరు. నేను కూడా పాటించను. కానీ ఆ విగ్రహాలను పూజిస్తున్న వారి వ్యవహారాల్లో వీరు ఎందుకు తల దూర్చినట్లు? ఇలాంటి ఘటనలు ఇస్లాం పేరుకు కళంకం తెస్తున్నాయి’. తూర్పు బెంగాల్లో దహనకాండ పూర్తిగా అంతం కాకున్నా కాస్త చల్లారింది. తర్వాత గాంధీ 1947 మార్చి 3న ప్రత్యర్థి యుద్ధరంగమైన బిహా ర్కు వెళ్లారు. అక్కడ బిర్ అనే గ్రామంలో అమాయక ముస్లింలపై పాశవిక హింసాకాండ గురించి తెలుసుకుని ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీ తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయారు. ‘110 సంవత్సరాల వయసు ఉన్న ఒక వృద్ధ మహిళను మీ కళ్లముందే నరికిపారేస్తుంటే మీరు చూస్తూ ఇంకా ఎలా బతికి ఉన్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇక విశ్రాంతి తీసుకోను, ఇతరులను విశ్రాంతిగా ఉంచను. ఈ ప్రాంతమంతటా కాలినడకతోనే తిరుగుతాను. ఏం జరిగిందని ఇక్కడ పడి ఉన్న అస్థిపంజరాలను అడుగుతాను. ఈ మొత్తం ఘటనలన్నింటికీ పరిష్కారం కనుగొనేదాకా నేను శాంతిగా ఉండలేను. నాలో మంటలు రేగుతున్నాయి’ అని గాంధీ పేర్కొన్నారు. రెండు భూభాగాల్లో అధికార మార్పిడికి చర్యలు తుదిరూపం తీసుకుంటున్న సందర్భంలో గాంధీ ఆ తతంగానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఆయన హృదయం చెబుతున్న చోటికే ఆయన పాదాలు అడుగేశాయి. హింసాకాండ బాధితులు ఎక్కడుంటే అక్కడికల్లా ఆయన వెళ్లిపోయారు. ఇక ఆగస్టు మొదట్లో ఆయన బిహార్ నుంచి బెంగాల్కు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా వ్యవస్థ విఫలం స్పష్టంగా కనబడుతున్న నౌఖాలీకి తిరిగి వెళ్లాలన్నదే ఆయన ఉద్దేశం. కలకత్తాలో, అతిపెద్ద ముస్లిం ప్రతినిధి బృందం గాంధీని కలిసి అల్లర్లు జరగనున్నట్లు కనిపిస్తున్న నగరంలోనే ఉండిపోవాలని కోరారు. అయితే రెండు షరతులపై గాంధీ అందుకు అంగీకరించారు. ఒకటి. నగరంలో శాంతి పరిరక్షణకోసం తనను ఉండిపోవాలని కోరుతున్న కలకత్తా ముస్లింలు నౌఖాలీలో హిందువుల భద్రతకోసం ప్రయత్నం చేయాలి. రెండు, నగరంలో ముస్లిం నివాసుల భద్రతకు హిందువులు హామీ ఇచ్చేటటువంటి ముస్లిం ప్రాంతంలోనే తాను ఉంటాడు. గాంధీ ఎక్కడ విడిది చేయాలో నిర్ణయించారు. అది బెలియాఘట్ శివార్లలోని హైదరి మంజిల్. అది ఎంతో పాడుపడిన ఇల్లు అని మను గాంధీ నమోదు చేశారు. ‘ఆ ఇంటిలో ఏ సౌకర్యమూ లేదు. అన్ని వైపులా తెరుచుకునే ఉంటుంది. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఆ ఇంటిలోని ప్రతి అంగుళం దుమ్ముతో నిండివుంది. ఇంటినిండా వర్షధారలు కాస్త సౌకర్యంగా ఉన్నట్లు కనిపించే ఒక్క గదిలోనే బాపూతో సహా అందరూ గడిపారు’.ఆగస్టు 9న సమాచార శాఖకు చెందిన ఒక అధికారి గాంధీని కలిసి ఆగస్టు 15న జాతినుద్దేశించి సందేశం ఇవ్వాలని కోరారు. కానీ గాంధీ నిరాకరించారు. మీరు సందేశం ఇవ్వకపోతే ఆనాటి కార్యక్రమం పాడైపోతుందని ఆ అధికారి ఒత్తిడి చేశారు. దానికి గాంధీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘నేను సందేశం ఇవ్వను.. ఆ కార్యక్రమం పాడు కానివ్వండి’. ఆగస్టు 14న అక్కడ వాతావరణంలో కాస్త మార్పు కలిగినట్లు కనిపించింది. ప్రీమియర్ హెచ్ఎస్ సుహ్రావర్ధికి ఆరోజు తన కార్యాలయంలో చివరి రోజు. దాంతో స్వాతంత్య్ర ఉత్సవ కార్యక్రమాలను చూపించడానికి, చివరి బ్రిటిష్ గవర్నర్ నిష్క్రమించడాన్ని, భారత తొలి గవర్నర్ పదవీ స్వీకారాన్ని, పీసీ ఘోష్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును గాంధీకి చూపించడానికి తన వాహనంలో తీసుకుపోయే అవకాశాన్ని పొందారాయన. ఆ రోజు నగరంలో పరిస్థితులను చూసిన తర్వాతే గాంధీ తన సందేశం ఇచ్చారు. అది నాటి పరిస్థితులను ప్రతిధ్వనించిన సందేశం. ‘రేపు బ్రిటిష్ బంధనాలనుంచి విముక్తి పొందుతున్నాం. కానీ ఈ అర్ధరాత్రి నుంచే హిందూస్తాన్ రెండు ముక్కలవుతోంది. కాబట్టి రేపు అటు ఆనందాన్ని, విషాదాన్ని కలిగించే రోజుగా ఉండబోతోంది’ అని గాంధీ ఆ సందేశంలో పేర్కొన్నారు. గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15 ఉపవాసం పాటించాల్సిన దినం. ఆయన హృదయంలో ఆనాడు ఆగ్రహజ్వాలలు రేగుతూ ఉండిపోయాయి. 1942లో ఆ రోజునే మరణించిన తన పుత్రసమానుడైన కార్యదర్శి మహదేవ్ దేశాయి గురించి తల్చుకున్నారు. బెలియాఘటలో తాను ఉంటున్న చోటుకు వేలాదిమంది జొరబడ్డారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు కూడా వారిలో ఉన్నారు. ఆయన వారితో ఇలా అన్నారు. ‘ఊరించే సంపదల మాయలో పడవద్దు’. ఆ మరుసటి దినం 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగాడు. ’ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపులవంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఈరోజుకూ వర్తిస్తూ జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్న ఘనమైన సమాధానం ఇచ్చారు. ‘ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. (హిందూస్తాన్ టైమ్స్ సౌజన్యంతో) వ్యాసకర్త మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీవిశ్లేషణ -
అనంత్ ‘చరిత్ర’ పాఠాలు
నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అలాంటివారిలో ఒకరు. పార్టీలో శరవేగంతో ఎదగడానికో...అధినేత దృష్టిలో పడితే ఇప్పుడున్న స్థానాన్ని మించిన అవకాశాలు వస్తాయనో భావించి ఇష్టానుసారం మాట్లాడే నేతలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. కానీ అనంత్కుమార్ హెగ్డే ఆ కోవలోకి రారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకొచ్చినవారు కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపీగా పనిచేసినవారు. అలాంటి నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే కొత్తగా వచ్చే నాయకులకు, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పోతాయి. ఆ సంగతి ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఇంతక్రితం కూడా పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై నిరసనలు పెల్లుబికాయి. ఒకసారైతే నోరు జారారనుకోవచ్చు. కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటి వెనక నిర్దిష్టమైన ఉద్దేశాలు న్నాయని, ప్రయోజనాలున్నాయని అనుకోవాల్సివస్తుంది. ఆయన తాజాగా దేశ స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరెత్తకుండా, ఆయన్నుద్దేశించే అంటున్నట్టు అందరికీ అర్థ మయ్యేలా నిందాపూర్వకంగా వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి, అది తీసుకున్న మలుపుల గురించి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని, ఉంటారని ఆశించలేం. అలాగే స్వాతంత్య్రోద్యమంపైనా, దాని తీరుతెన్నులపైనా భిన్నాభిప్రాయం ఉండటం తప్పేం కాదు. ఆ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోనే షహీద్ భగత్సింగ్ వంటి వారికి గాంధీ అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి ఉండేది. బలప్రయోగంతో ప్రజల స్వాతంత్య్రేచ్ఛను అణిచివేయాలని చూస్తున్న బ్రిటిష్ పాలకులకు అదే భాషలో బదులీయాలని ఆయన వాదించేవారు. నేతాజీ సుభాస్చంద్ర బోస్ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)ను స్థాపించి, యువతీయువకులను సమీకరించారు. అయితే హెగ్డే అభ్యం తరం పూర్తిగా వేరు. ఆయన దృష్టిలో స్వాతంత్య్రోద్యమంలో రెండు రకాలవారున్నారు. ఆయుధా లతో పోరాడినవారు. మేధోశక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసినవారు. వీరుగాక మరో రకం సమర యోధులున్నారు. ఈ సమరయోధులు బ్రిటిష్ పాలకులతో లాలూచీ పడి ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ సారథులు దాన్నెలా నడపాలో ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారినుంచి సలహాలు తీసుకునే వారు. పాలకులు చెప్పినట్టల్లా చేస్తామన్న అవగాహనతో, సర్దుబాట్లతో ఆ ఉద్యమం సాగింది. తమ ఉద్యమాన్ని గుర్తించి, తమను అరెస్టు చేసి జైలుకు పంపమని ఈ ఉద్యమ సారథులు పాలకులను వేడుకునేవారు. జైళ్లలో తమను జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరేవారు. ఇలాంటి నాయకులపై బ్రిటిష్ పోలీసులు ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. ఇంతవరకూ ఎవరి గురించి మాట్లాడు తున్నారో స్పష్టత లేకుండా ప్రసంగించిన అనంత్కుమార్ ఆ తర్వాత కాస్త స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ను సమర్థించేవారంతా ఆమరణ నిరాహార దీక్షల వల్లా, సత్యాగ్రహం వల్లా స్వాతంత్య్రం వచ్చిందని చెబుతుంటారని, కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. సత్యాగ్రహం వల్ల బ్రిటిష్ పాలకులు ఈ దేశం వదిలిపోలేదని, వారు నిరాశానిస్పృహలకు లోనై స్వాతంత్య్రం ప్రకటిం చారన్నది హెగ్డే అభిప్రాయం. ఇలా స్వాతంత్య్రోద్యమ చరిత్రనంతా ఏకరువు పెట్టాక, ఈ ఉద్యమం నడిపించినవారు మన దేశంలో మహాత్ములయ్యారని వ్యాఖ్యానించారు. నిజంగా ఈ దేశం కోసం పనిచేసి, పెను మార్పులు తీసుకురావడానికి త్యాగాలు చేసినవారిని చరిత్ర చీకటి కోణాల్లోకి నెట్టేశారని ఆవేదన చెందారు. ఎవరికీ తెలియని ఈ చరిత్రనంతా తాను ఎక్కడ అధ్యయనం చేశారో ఆయన చెప్పలేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించాక తన మాటల్ని మీడియా వక్రీకరించిందని ఆయనంటున్నారు. తాను గాంధీ, నెహ్రూ పేర్లెత్తలేదని చెబుతున్నారు. ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ సమరం నడిపిందీ, ఆమరణ దీక్షలు చేసిందీ ఎవరో హెగ్డే చెప్పకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఉద్యమాలు సాగించినవారు మహాత్ములయ్యారన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేరూ ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ స్వాతంత్య్రోద్యమం గురించి ఎంతో కొంత తెలిసినవారికి కూడా ఎవరినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారో సులభంగా తెలుస్తుంది. నిజానికి అలా తెలియాలనే ఆయన అంత వివరంగా, అంత ‘స్పష్టంగా’ మాట్లాడారు. కాకపోతే పేర్లు నేరుగా వెల్లడించడానికి ఇంకా సమయం రాలేదని అనుకుని ఉండొచ్చు. ‘పెదవి దాటని మాటలకు మనం యజమానులం. పెదవి దాటి బయటకు వచ్చిన మాటలకు మాత్రం మనమే బానిసలవుతామ’ని బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మహాత్ముణ్ణి గుర్తుకుతెచ్చేంతగా వ్యాఖ్యానించిన హెగ్డే...తమ మేధో శక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసిన ఆ మహానుభావులెవరో కూడా స్పష్టంగా చెప్పివుండాల్సింది. అప్పట్లో ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి పాటుబడి, చరిత్ర చీకటికోణాల్లో మగ్గిపోయిన వారెవరో కూడా వివరించి ఉండాల్సింది. ఆయన అలా చేసివుంటే ఈ చర్చ మొత్తం వేరుగా ఉండేది. అలాగే తన ‘లాలూచీ’ ఆరోపణలకు సమర్థనగా బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలేమైనా వెల్లడించివుంటే అందరూ సంతోషించేవారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా గత నవంబర్లో ఇదేవిధంగా మహాత్మా గాంధీని ఏమనలేదు. కానీ ఆయన్ను పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశ భక్తుడన్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ మందలించింది. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చెప్పింది. స్వాతంత్య్రోద్యమాన్ని పల్చన చేసి, దాని సారథుల్ని కించపరిచి సాధించదల్చు కున్నదేమిటో హెగ్డే చెప్పాలి. తమ పార్టీ వారినుంచే తరచు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలెందు కొస్తున్నాయో బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
గాందీజీపై హెగ్డే వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం
-
చిన్న చిన్న పాఠాలు
గురువు అంటే బెత్తం పట్టుకుని బడిలో తారసపడే వ్యక్తి మాత్రమేనా? అభ్యాసంలో చేయి పట్టి నడిపించేవాడు మాత్రమేనా? తప్పులను దండించి సరిదిద్దేవాడు మాత్రమేనా? ఒక్క చదువులో సాయం పట్టేవాడు మాత్రమేనా? దారి పొడవున ఎందరో గురువులు. ఎన్నో మలుపులు. ఎన్నోచోట్ల ఎందరో గురువులు తారసపడి జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అది చిన్న సలహాలా ఆ క్షణానికి అనిపించవచ్చు. కాని అది జీవితానికి సరిపడా గురోపదేశం కూడా కావచ్చు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత హక్కుల కార్యకర్త, కళాకారిణి మాయా యాంజిలో తనకు జీవితంలో గురోపదేశంలా ఉపయోగపడిన సలహా తన నానమ్మ నుంచే అందిందని చెప్పుకుంది. ‘మా నానమ్మ నాతో ఏమందంటే– అమ్మాయ్.. లోకం నిన్ను ఒక దారిలో నిలబెట్టి ముందుకు వెళ్లమంటే... ఆ దారి నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? ఆ దారి చూపే గమ్యం ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్లడం కూడా ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్. ఏమీ చేయకు. చప్పున ఆ దారి వొదిలి నీదైన దారిని కనిపెట్టు.. అని చెప్పింది. నేను అలా నా దారిని కనిపెట్టుకున్నాను’ అందామె.టాటా సంస్థల్లో ఒక ముఖ్య అధిపతి, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జంషెడ్ జె.ఇరానీకి తన పదిహేడో సంవత్సరం అతి ముఖ్య ఉపదేశం తండ్రి నుంచే అందింది. విదేశాలలో చదువుకోవడానికి వెళుతున్న జంషెడ్ ఇరానీతో తండ్రి– ‘అబ్బాయ్... ప్రపంచంలో పుట్టే ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఆ పదోవాడికి పని చేసి పెట్టడానికే పుడతారు. కనుక నువ్వు ఆ పదోవాడిగా ఉండటానికే ప్రయత్నించు’ అన్నాడు. అప్పటి వరకూ ఒక లక్ష్యం లేని జంషెడ్ ఆ సలహా విని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే సంపద అంటే ఆర్థిక సంపద మాత్రమే కాదు. ఆత్మిక సంపద కూడా. అలాంటి సంపదను కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విలువైన సలహాలు గురోపదేశాలై జీవితాన్ని నడిపిస్తాయి. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ తన భర్తను కోల్పోయినప్పుడు ఆమెకు ఇద్దరు కుమార్తెలే ఉండటాన, కుమారుడు లేనప్పుడు భర్త ఆస్తి దక్కని చట్టం నాడు ఉనికిలో ఉండటాన, బంధువులు ఆ చట్టాన్ని ప్రస్తావించి తనకు ఏమీ దక్కని పరిస్థితి తెచ్చి పెట్టబోతున్నారని గ్రహించి వారందరి మీద కోపంతో ఆమె అమెరికా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. అప్పుడు గాంధీజీ ఆమెను పిలిచి ‘నీ లోపల అశాంతి పెట్టుకుని ఎంత దూరం వెళ్లినా ప్రశాంతత పొందలేవు. సామరస్యం వల్లే శాంతి వస్తుంది. ఎవరో మనకు హాని చేస్తారని అనుకుంటాం కాని మనకు మనం తప్ప ఎవరూ హాని చేయలేరు. నువ్వు నీ వారితో సయోధ్య చేసుకో’ అని చెప్పారు. ఆ మాట విన్న విజయలక్ష్మి బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లింది. వాళ్లందరూ ఎంతో రిలీఫ్ పొందారు. ఆమెకు కూడా ఆందోళన వదిలిపోయింది. బంధాలు నిలబడ్డాయి. అంతే కాదు... గుడ్డిగా వెళ్లే దారిలో చిన్న టార్చిలైట్లాగా మిత్రుల నుంచి గురోపదేశం అందుతుంది. నటుడు మనోజ్ బాజ్పాయ్ థియేటర్ ఆర్టిస్ట్గా ఢిల్లీలో సంవత్సరాల తరబడి పని చేశాడు. ఎన్నేళ్లు పని చేసినా నటుడుగా పేరు, గుర్తింపు తప్ప ఆర్థిక ఉన్నతి లేదు. కాని తోటి నటులంతా అలాగే ఉన్నారు కనుక అలా ఉండటమే జీవతం కాబోలు అని అతను అనుకున్నాడు. కాని ‘బాండిట్ క్వీన్’ ఆడిషన్స్ కోసం ఢిల్లీ వెళ్లిన దర్శకుడు శేఖర్ కపూర్ మనోజ్ బాజ్పాయ్ని ఒక పాత్రకు ఎంపిక చేసి ‘జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని, అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు లేని ఇలాంటి జీవితంలో ఎన్నాళ్లుంటావ్. సినిమాల్లో నటించు’ అని హితవు పలికాడు. ఆ సలహా అతణ్ణి ఇవాళ ఎక్కడ నిలబెట్టిందో మనకే తెలుసు.+ తెలుగులో వేటూరి సుందరరామ మూర్తికి కూడా పాత్రికేయ వృత్తి మీద, కవిగా జీవనం సాగించం మీద మాత్రమే ఆసక్తి వుండేది. కాని ఆయన విద్వత్తును గమనించిన ఎన్.టి.రామారావు ‘సినిమాలకు పాటలు రాయండి’ సలహా ఇచ్చారు. కాని దానిని వేటూరి పాటించలేదు. రెండు మూడేళ్లు గడిచిపోయాయి. మళ్లీ మద్రాసులో వేటూరి తారసపడ్డారు ఎన్.టి.ఆర్కు. ఆయన తన సలహాను మర్చిపోలేదు. ఈసారి కోపంగా ‘ఎందుకు మా సలహా వినరు. సినిమాలకు రాయండి’ అని హూంకరించారు. అంతేకాదు అవకాశాలు ఇప్పించారు. వేటూరి సుందరరామమూర్తికి ఆ సలహా గురోపదేశంలా పని చేసింది. సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ ఒకరోజు నటుడు అశోక్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అశోక్ కుమార్తో కూచొని మాట్లాడుతూ ఉంటే లోపలి నుంచి సైగల్ గొంతుతో పాట వినిపిస్తూ ఉంది. అచ్చు సైగల్ గొంతులాగానే. అది విన్న ఎస్.డి.బర్మన్ ‘లోపల పాడుతున్నది ఎవరు?’ అని అశోక్ కుమార్ని అడిగాడు. ‘మా తమ్ముడే’ అని అశోక్ కుమార్ తన తమ్ముడిని పిలిచి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు బర్మన్ ‘చూడు.. బాగా పాడుతున్నావు. కాని సైగల్ లాగా పాడుతున్నావు. అనుకరణలో భవిష్యత్తు లేదు. నవ్వు నీలాగా పాడటం నేర్చుకో పైకొస్తావు’ అన్నాడు. ఆ కుర్రాడు ఆ ఉపదేశం పాటించి భవిష్యత్తులో కిశోర్ కుమార్ అయ్యాడు. రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయదినోత్సవం ప్రపంచ కోటీశ్వరుడు వారెన్ బఫెట్ తనకు అందిన అతి గొప్ప గురోపదేశంగా ఒక మిత్రుడు వాక్కు గురించి ప్రస్తావిస్తాడు. బఫెట్ అంటాడు– ‘‘ఒక మిత్రుడు నాతో ఒకసారి అన్నాడు – ‘బఫెట్ నీకు గనక కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజుకు నోరు మూసుకొని ఉండు. మరునాడు కూడా అలాగే అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో’ అని. నా జీవితంలో ఆ సలహాను పాటించి లాభం పొందుతూనే ఉన్నాను’’ అంటాడాయన. ఉర్దూ కవిత్వంలో ‘తరన్నుమ్’ అనేది గాన పద్ధతి. కవిత్వాన్ని పాటలాగా పాడి వినిపిస్తారు. ప్రఖ్యాత కవి కైఫీ ఆజ్మీ ఇంకా తాను అంత ప్రఖ్యాతం కాక మునుపు ఒకసారి హైదరాబాద్లో సరోజిని నాయుడును కలిశారు. ‘ఏదీ నీ కవిత్వం వినిపించు’ అని ఆమె అడిగారు. కైఫీ తన కవిత్వాన్ని తరన్నుమ్ పద్ధతిలో పాడి వినిపించాడు. అది విని సరోజిని నాయుడు ‘కైఫీ... దయచేసి ఇక మీదట ఎవరికీ ఇలా పాడి నీ కవితను వినిపించకు. భావస్పోరకంగా చదువు. చాలు’ అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి కైఫీ తన కవితను పాడటం మానేశాడు. ఆయన గొంతే ఆ తర్వాతి కాలంలో కవితా ఉనికి అయ్యింది. పాఠాలు ఇలాంటివే చాలా దొరుకుతూ ఉంటాయి. అవి పాఠాలుగా గ్రహించినప్పుడే మనం ఉత్తమ శిష్యులవుతాము. ఆ తర్వాత గురువులవుతాము. బడి బయట ఎందరో ఉపాధ్యాయులు. వారందరికీ వందనాలు.– సాక్షి ఫ్యామిలీ -
గాంధీజీపై ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య
ముంబై: జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేనే నిజమైన దేశ భక్తుడని ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు మరిచిపోకముందే.. ముంబైలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి గాంధీపై అనుచితంగా ట్వీట్ చేశారు. వివరాలు.. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న నిధి చౌదరి.. ‘మహాత్మాగాంధీ ముఖచిత్రాన్ని భారత కరెన్సీపై తొలగించాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను, పలు సంస్థలు, రోడ్లకు పెట్టిన గాంధీ పేరును మార్పు చేయాలి. థ్యాంక్యూ గాడ్సే’అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో గాంధీపై చేసిన ట్వీట్ను ఆమె డిలీట్ చేశారు. గాంధీపై వివాదాస్పద ట్వీట్ చేసిన నిధి చౌదరీని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చవాన్, ఎన్సీపీ నేత జితేంద్ర డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె తన ట్వీటును తొలగించారు. ‘గాంధీని నేను అవమానించ లేదు. గాంధీ జాతిపిత. నేను వ్యంగ్యంగా చేసిన ట్వీటును తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని మరో ట్వీటులో ఆమె చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ గాంధీజీని అవమానించలేదు. వ్యంగ్యంగా రాసిన పోస్టును అపార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గాంధీపై వ్యతిరేక, తప్పుడు వ్యాఖ్యానాలు అనేకమంది చేస్తున్నారు. ఈ వ్యతిరేక వ్యాఖ్యలను గాంధీ చూడకపోవడమే మంచిదని భావించి గాడ్సేకు ధన్యవాదాలు చెప్పానని నిధి తెలిపారు. -
ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్, బిజినెస్ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చేరారు. గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ను భోపాల్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని వ్యాఖ్యానించడం విశేషం. गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए। — Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019 -
గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్పై చర్య తీసుకోవాలి
గాంధీఆస్పత్రి : గాంధీ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు చెందిన రూ.6.50 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్లో కూడా ఈ విషయం స్పష్టమైందని తక్షణమే ప్రిన్సిపాల్పై చర్యలు చేపట్టి, తమకు డబ్బులు ఇప్పించాలని నర్సింగ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్రెడ్డి, గాం«ధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ ఆస్పత్రికి అనుసంధానంగా బోయిగూడలోని గాంధీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపాల్ మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జమాఖర్చులపై ఆడిట్ చేయాలని డీఎంఈ ఆదేశించారు. బుధవారం రాత్రి ముగిసిన ఆడిట్లో విద్యార్థినులకు చెందిన సుమారు రూ. 6.50 లక్షలు గోల్మాల్ జరిగిందని ఆడిట్లో వెల్లడైందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, అవకతవకలకు బాధ్యులైన ప్రిన్సిపాల్పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎంఈ, సూపరింటెండెంట్లకు ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ మాట్లాడుతూ ఆడిట్ ముగిసినా పూర్తి నివేదిక తమకు అందలేదన్నారు. విచారణ అధికారిగా ఆర్ఎంఓ–1 జయకృష్ణ కొనసాగుతున్నారని, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘మన్కీ బాత్’ మాటలకు అర్థాలు వేరు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ‘మన్కీబాత్’లో చెప్పే మాటలు, ఆయన లోపలి మాటలు పరస్పరం భిన్నమైనవి, మోసపూరితమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. మగ్దూంభవన్లో బుధవారం నిర్వహించిన ‘లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సులో సురవరం మాట్లాడారు. తమకు అనుకూలంగా లేని వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా బీజేపీ, సంఘ్పరివార్ శక్తులు ముద్ర వేస్తున్నాయని విమర్శించారు. నాడు గాంధీని హత్య చేసిన అసహనమే నేడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో బుసలు కొడుతోందన్నా రు. మైనారిటీలు, దళితులతోపాటు శాస్త్రీయ ఆలోచనలు ప్రచారం చేసే మేధావులు, భావప్రకటనా స్వేచ్ఛ కోరే ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘ నేతలు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రస్తుతం మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల దాడి జరుగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలను బలహీనపరచడం ద్వారా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సమావేశానికి డా.సుధాకర్ అధ్యక్షత వహించగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కొల్లాయి కట్టి... 99 ఏళ్లు!
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938 మాలపిల్ల సినిమాలో సూరి బాబు పాడిన గీతం. నిజానికి ఈ కొల్లాయి కట్టే ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే మనం కొంత ఆలోచిస్తాం కానీ, ఎవరీ వ్యక్తి అంటే, ఒక్క క్షణమైనా తడుముకోకుండా, కొల్లాయి కట్టినది గాంధీజీ అని చెప్పేస్తాం. పైపెచ్చు తెలుగు సాహిత్యంలో, ‘కొల్లాయిగట్టితేనేమి’ ఒక ప్రఖ్యాత తెలుగు నవల కూడా. 1960లలో ఈ నవల రాసింది మహీధర రామమోహనరావు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల ఇది. అయితే గాంధీజీ జీవితంలో కూడా ఇది జరిగింది సెప్టెంబర్ 1921లో. తన పత్రిక నవజీవన్లో గాంధీ ఇలా చెప్పారు. ‘‘మదరాసు నుంచి మదురైకి రైలుబండిలో వెళ్తుండగా, ఏమీ పట్టనట్టుగా రైలు పెట్టెలో ఉన్న జనాలను చూశాను. అందరూ విదేశీ దుస్తుల్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి నేను నచ్చచెప్పబోయాను. వారు తలలు అడ్డంగా ఊపి ‘‘మేం చాలా పేదవారం, ఖాదీ ధారణ చేయడానికి, కొనాలంటే ఖాదీ చాలా ఖరీదు’’ వారి మాటల అంతరార్థం నేను గ్రహించాను. నేను పూర్తి దుస్తుల్లో ఉన్నాను, తలపై టోపీతో సహా. వీరు చెప్పింది కొంతవరకూ సత్యమే అయినా, కోట్లాదిమంది ప్రజలు కేవలం ఒక్క లంగోటీతో కాలం గడుపుతూ ఇదే నిజాన్ని చెప్తున్నారనిపిం చింది. వారికి నేనేమని సరైన జవాబివ్వగలను, నా వంటిమీది అదనపు దుస్తులను ప్రతి అంగుళమూ గనుక వదులుకుంటే, అలా చేయడం ద్వారా, ఈ దేశపు కోట్లాది మందికి దగ్గర కాగలిగితే.. మరునాడు ఉదయం మదురై సమావేశం తరువాత, వెంటనే నేను ఆ పని చేశాను’’. అలా మదురై మహాత్మునికి కొల్లాయి కట్టించిన తల్లి. తన దుస్తుల ధారణ, జాతీయోద్యమంలో భాగం చేయగల మేధావి గాంధీజీ. కొల్లాయి గాంధీజీ బ్రాండ్గా ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరకొర దుస్తుల ఫకీరు, అతిపెద్ద ఉపఖండ స్వాతంత్య్ర పోరాట నాయకుడని, గాంధీజీ ఆకర్షణ వలయంలో పడిపోయింది. ఈ దుస్తుల పద్ధతి, ఒకసారి అయిదో జార్జ్ చక్రవర్తిని బకింగ్ హామ్ భవంతిలో కలవడానికి వెళ్లాల్సివచ్చినప్పుడు, ఇవే దుస్తులా అని ప్రపంచం, పాలక వర్గాలు విస్మయంలో పడ్డాయి. చక్రవర్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చాలీ చాలని దుస్తుల్లోనే వెళ్తారా? అన్నది మీడియా ప్రశ్న. ‘‘మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’’ అన్నది గాంధీజీ ఇచ్చిన చురుకైన జవాబు. విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ రోజుల్లో ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా బ్రిటిష్ వారి పై ఆర్థిక పరమైన దెబ్బ తీశారు గాంధీజీ. ఇలా కొల్లాయి కట్టిన ఘట్టానికి నాంది, సెప్టెంబర్ 1921లో గాంధీజీ బస చేసిన మదురైలోని పడమటి మాసి స్ట్రీట్లోని డోర్ నంబర్ 251 ఇల్లు. ఇప్పుడు అదే భవనంలో ఖాదీ ఎంపోరియం నడుస్తున్నది. కొల్లాయిగట్టితేనేమి, మహీధర వారి నవల 1920 డిసెంబర్–1921 ఏప్రిల్ వరకూ కథా కాలంగా నడుస్తుంది. టెక్నికల్గా, ఈ నవలలో కథనడిచే కాలానికి ఇంకా గాంధీజీ (సెప్టెంబర్ 1921 దాకా) కొల్లాయి కట్టడం ప్రారంభించలేదు. అందుకే మహీధర వారు, ఎంత చారిత్రక దృష్టితో చెప్పారు అంటే, ఈ నవల కథాకాలం పూర్తి అయిన కొద్ది నెలలకు కానీ గాంధీజీ కొల్లాయి కట్టడం మొదలు కాలేదు. అంటే గాంధీజీ కొల్లాయి కట్టడానికి ముందర కాలంలో, అసలు కొల్లాయి కట్టు గురించి ఏ పాటలూ లేని కాలంలోకి వెళ్ళి (1920–21) తను 1960లో రాసిన నవలకి ఇలా పేరు పెట్టిన సంగతి వివరించారు. అలా 1921లో తన దుస్తుల ధారణ కూడా స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేసిన వ్యూహకర్త గాంధీజీ. ఆ దుస్తుల వ్యూహానికి ఇది 99వ వత్సరం. 70ఏళ్ల రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో, గాంధీజీ కొల్లాయి ధారణ ఈ దేశానికి చేసిన మేలు ఎంతో, స్వదేశీ ఉత్పత్తుల సమాదరణ వల్ల ఎంత అభివృద్ధి సాధించగలమో కూడా ఇంకా మనం గ్రహించవలసి ఉన్నది. (నేడు కృష్ణానదీ నౌకావిహార సాహిత్య సభలో మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలపై సాయంత్రం 5 గంటలకు రామతీర్థ ప్రసంగం) వ్యాసకర్త కవి, విమర్శకులు‘ 98492 00385 రామతీర్థ -
సభ సజావుగా నడిపించే బాధ్యత నాపై ఉంది
-
గాంధీకి లేనిది.. పటేల్కు ఎందుకు..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ విగ్రహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత శశిథరూర్ పలు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి దేశంలో ఎక్కాడా అంతపెద్ద విగ్రహం లేదని.. గాంధీకి కట్టని విగ్రహం పటేల్కు ఎందుకు కట్టారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. పటేల్ చాలా సాధారణమైన వ్యక్తని.. గాందేయవాదైన పటేల్కు గంభీరమైన రూపంగల విగ్రహాన్ని నిర్మించడం సబబేనా అన్నారు. గాంధీకి పటేల్ శిష్యుడు వంటివాడని.. శిష్యుడికి 182 మీటర్ల విగ్రహం ఎందుకని థరూర్ ప్రశ్నించారు. గాంధీ పెద్ద విగ్రహం పార్లమెంట్లోనే ఉందని.. గురువుని కాదని శిశ్యుడికి అతిపెద్ద విగ్రహం నిర్మించడం సరికాదని అన్నారు. పటేల్ తన జీవితకాలమంతా గాంధీ సిద్దాంతాలతో, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కావాలనే పటేల్ను వారి నాయకుడిగా వర్ణించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా సర్దార్ వల్లభ్భాయ్ అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
ఉక్కుమణి
మణి.. అమూల్యమైనది.‘ఉక్కు’కు తోడైన ఆ మణి..తండ్రి జీవితాన్నుండి ప్రభావితమైతండ్రి జీవితాన్ని ప్రభావితం చేసి..వారసత్వానికే వన్నె తెచ్చింది.ఉక్కు సంకల్పం నాన్నది. ఉద్యమ గుణం మణిది. అందుకే మణిబెన్.. ఉక్కుమణి! నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. నేడే గుజరాత్లో పటేల్ ఐక్యతా ప్రతిమ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఆ ఉక్కుమనిషికి చివరి వరకు బాసటగా ఉన్న కుమార్తె మణిబెన్ పటేల్ గురించి స్ఫూర్తిదాయకమైన విశేషాలు, విశేషాంశాలూ ఇవి.‘నేనూ పెద్దవాడినైపోయాను. ఇప్పటికైనా ఏదో మార్గం ఎంచుకోవాలి నువ్వు!’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1944లో తన ఏకైక కుమార్తె మణిబెన్ పటేల్కు ఇచ్చిన సలహా ఇది. ‘పటేల్: ఏ లైఫ్’ పేరుతో గాంధీజీ మనుమడు రాజ్మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. కూతురితో ఈ మాట అనే నాటికి సర్దార్ స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ కుడిభుజం. తొందరలోనే స్వరాజ్యం వస్తుందని అంతా నమ్ముతున్న కాలం. ఆ అంచనా వాస్తవం కూడా. గాంధీజీకి ముఖ్య అనుచరుడిగా, జవహర్లాల్ నెహ్రూకు సముడిగా స్వతంత్ర భారతదేశంలో పటేల్ స్థానం ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయినా ఆయన కూతురికి ఇలాంటి సలహా ఇచ్చారు. అంటే తన సంతానం రాజకీయాలలోకీ, ప్రభుత్వ పదవులలోకీ రావాలని ఆయన ఎంతమాత్రం అనుకోలేదు. సర్దార్ పటేల్, జవేర్బాయి పటేల్లకు ఒక కూతురు, కొడుకు. కూతురే మణిబెన్. కొడుకు దహ్యా పటేల్. పటేల్కు 33 ఏళ్ల వయసులో భార్యా వియోగం జరిగింది. పటేల్కు సంతానమంటే ఎంతో అనురాగం. ద్వితీయ వివాహం చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనీ, అవి పిల్లలను ఇబ్బంది పెడతాయనీ చేసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే బారిస్టర్ చదువు కోసం సర్దార్ టెంపుల్ టౌన్కు (ఇంగ్లండ్) వెళ్లారు. అప్పుడే చాలాకాలం మణిబెన్ నానమ్మ దగ్గర, పెదనాన్న విఠల్భాయ్ పటేల్ల దగ్గర పెరిగింది. విఠల్భాయ్ పటేల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే. జీవితాంతం తండ్రికి బాసట మణి, దహ్యా కూడా గుజరాత్ విద్యాపీలో చదువుకున్నారు. మణి గుజరాతీ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. నిజానికి మణిబెన్ (1903–1990) దేశ సేవకు అంకితమైంది. ఆమె స్వాతంత్య్రోద్యమంలో తండ్రితో, గాంధీజీతో కలసి నడిచారు. జీవితాంతం తండ్రికి బాసటగా ఉన్నారు. మణిబెన్ తండ్రికి కార్యదర్శి, వ్యక్తిగత సేవిక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే న ర్స్. ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసే పని కూడా ఆమెదే. ఆయన బట్టలు కూడా ఉతికేవారు. తండ్రి జీవిత చరమాంకంలో ప్రతిక్షణం ఆయనను వెన్నంటే ఉన్నారు మణి. అందుకే ఆమె రాసిన డైరీ ‘ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్’ ఎన్నో కీలక చారిత్రకాంశాలను, ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటలకు ఎక్కడం సాధ్యంకాని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్లోని కరంసద్లోనే (సర్దార్ పటేల్ పూర్వీకుల స్వగ్రామం) మణి జన్మించారు. స్వస్థలంలోను, గుజరాత్ విద్యాపీuŠ‡లోను చదువుతున్నప్పుడే గాంధీజీ ఉపన్యాసాలు, బోధనలు ఆమెకు ఉత్తేజం కలిగించాయి. 1918లో ఆమె అహమ్మదాబాద్లోని గాంధీజీ ఆశ్రమంలో చేరారు. మనవరాలి పెళ్లి గురించి పటేల్ తల్లి లాద్బా (తండ్రి పేరు జవేర్భాయ్, పటేల్ భార్య పేరు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది) తపన పడుతూ ఉండేవారు. కానీ పెళ్లి విషయంలో కూతురి అభిప్రాయం ఏమిటో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఆయన అడగలేదు. కారణం– ఆ ఇంట పిల్లలు పెద్దల ఎదుట నోరు విప్పరు. పెద్దలు కూడా అంతే. పిల్లలతో చాలా తక్కువ మాట్లాడతారు. తాను 33వ ఏట కూడా చుట్టు పక్కల పెద్దలు ఉంటే పెదవి కదపలేదని ఒక లేఖలో పటేల్ రాశారు. 1926లో మరోసారి మణి అహ్మదాబాద్లోని గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. 1927 జనవరిలో గాంధీజీ నుంచి పటేల్కు ఒక లేఖ అందిది. ‘వివాహం చేసుకునే యోచన ఏదీ ప్రస్తుతం మణి దగ్గర లేదు. ఆ విషయం గురించి మీరు ఆందోళన చెందవద్దు. నాకు వదిలిపెట్టండి!’ ఇదీ సారాంశం. చివరికి ఆమె అవివాహితగానే ఉండిపోయారు. సత్యాగ్రహంలో మూడో పటేల్ సహాయ నిరాకరణోద్యమంలో ఆమె గాంధీజీ, తన తండ్రిలతో కలసి పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనూ కొద్దికాలం ఉన్నారు. 1928 నాటి బార్డోలీ సత్యాగ్రహంలో ముగ్గురు పటేళ్లు కనిపిస్తారు. మొదటివారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్. రెండు, ఆయన అన్నగారు విఠల్భాయ్ పటేల్. మూడు, మణిబెన్ పటేల్. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మణి అరెస్టయ్యారు. పూనా దగ్గరి ఎరవాడ జైలుకు ఆమెను పంపారు. గాంధీజీ చరిత్రలోనే కాకుండా, ఉద్యమ చరిత్రలో కూడా కీలకమైన రెండు ఘట్టాలు అక్కడే చోటు చేసుకున్నాయి. ఆ జైలుకు వెళ్లిన పదిరోజులలోనే గాంధీజీకి ఎంతో ఆప్తుడు, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్ అనార్యోంతో హఠాత్తుగా కన్నుమూశారు. తరువాత కొద్దికాలానికే కస్తూర్బా కూడా అక్కడే కన్నుమూశారు. అంటే గాంధీజీని బాగా కదిలించిన, కుంగదీసిన రెండు ఘటనలకు మణి ప్రత్యక్ష సాక్షి. నెహ్రూ తీరుకు నిరాశ! 1950లో తండ్రి మరణించిన తరువాత మణిబెన్ ప్రథమ ప్రధాని నెహ్రూను కలవడానికి ఢిల్లీ Ðð ళ్లారు. ఆ క్షణాలను గురించి అమూల్ రూపశిల్పి వర్ఘీస్ కురియన్ (‘నాకూ ఉంది ఓ కల’ పుస్తకంలో) మనసును కదిలించే ఒక ఘట్టాన్ని నమోదు చేశారు. మణిబెన్ స్వయంగా కురియన్కు ఈ సంగతి చెప్పారు. ‘నీవు మాత్రమే ఈ పని చేయాలి’ అంటూ తండ్రి చివరి క్షణాలలో పెట్టిన షరతు మేరకు ఒక పెద్ద సంచి, పద్దుల పుస్తకం ఒకటి నెహ్రూకు అప్పగించారు మణి. ఆ సంచిలో 35 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ పుస్తకం పార్టీ ఖర్చులు, విరాళాల వివరాల పుస్తకం. ఈ రెండు అప్పగించిన తరువాత నెహ్రూ నోటి నుంచి ఒక మాట కోసం మణి ఎదురు చూశారట. అదేమిటని కురియన్ అడిగారు. ‘ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న మాట ఆయన నోటి నుంచి వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన (నెహ్రూ) ‘థాంక్స్’ అనే వెళ్లిపోయారు’ అని సమాధానమిచ్చారామె. నెహ్రూకూ, పటేల్కు మధ్య వైరుధ్యాలు ఆ కాలానికి ఎంత తారస్థాయిలో ఉండేవో దీనిని బట్టే అర్థమవుతుంది. పటేల్ మరణించడానికి రెండు నెలలముందు జరిగిన ఒక ఉదంతం గురించి మణిబెన్ డైరీలో ఏం రాశారో అహ్మదాబాద్కు చెందిన రతీన్దాస్ వెల్లడించారు. ‘బాబ్రీ మసీదు జీర్ణోద్ధరణ, సోమ్నాథ్ ఆలయ పునర్ నిర్మాణం వేరువేరు అంశాలు.సోమ్నాథ్ ఆలయం కోసం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదు’ అని పటేల్ వివరణ ఇవ్వగానే నెహ్రూ మౌనం వహించారన్నదే ఆ పేజీలోని మాటల సారాంశం. మరోసారి ‘మణి’ దండి యాత్ర గాంధీజీ మరణించే వరకు ఢిల్లీలోని బిర్లా భవన్లోనే మణిబెన్ కూడా ఉన్నారు. ఆయన హత్యకు గురైన తరువాత కూడా కొద్దికాలం అక్కడ ఉండవలసిందని బిర్లాలు కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు.తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మణిబెన్ 1976లో మరోసారి దండి యాత్ర జరిపారు. కారణం– భారత ప్రజానీకంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించడమే. అది ఎమర్జెన్సీ కాలం.అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న నాయకులను విడుదల చేయాలనీ, ఎమర్జెన్సీ ఎత్తివేయాలనీ, పత్రికల మీద సెన్సార్ షిప్ను వెంటనే తొలగించాలనీ నినాదాలు ఇస్తూ ఆమె దండి యాత్ర నిర్వహించారు.ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మణిబెన్ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వీక్షించి 1990లో అంతిమ శ్వాస విడిచారు. ‘పటేల్ది ఒక తాత్విక వారసత్వం.దానిని మేం సొంతానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. దానిని ప్రజలే అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. రుద్దే ఆలోచన మాకు లేదు’ అంటున్నారు పటేల్ వారసులు. ముందే రాజకీయాల్లోకి రాలేదు పటేల్ మరణించిన తరువాత మాత్రమే మణిబెన్ రాజకీయాలలోకి వచ్చారు. గుజరాత్ కాంగ్రెస్ శాఖకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్నో సాంఘిక, విద్యా సంస్థల కోసం పనిచేశారు. నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ తరఫున తొలి లోక్సభకు (1952–1957) ఆమె దక్షిణ కైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత రెండో లోక్సభకు (1957–1962) ఆనంద్ నియోజక వర్గం నుంచి గెలిచారు. 1964–70 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. – గోపరాజు నారాయణరావు -
గినీస్ బుక్ రికార్డ్: 5149 విద్యార్ధులు గాందీ వేషధారణ
-
గాంధీజీ కలను నిజం చేద్దాం
న్యూఢిల్లీ: స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. వచ్చే నెల అక్టోబర్ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. అనంతరం ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ స్కూల్లో పరిసరాల్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. 4.5లక్షల గ్రామాలు బహిర్భూమి రహితం ‘స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు 40 నుంచి 90 శాతానికి విస్తరించాయి. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం నాలుగేళ్లలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 450 జిల్లాలు, 4.5 లక్షల గ్రామాలు బహిర్భూమి రహితంగా మారడాన్ని మీరు ఊహించారా? ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని ప్రధాని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2, 2018 నాటికి దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ బహిర్భూమి∙రహిత రాష్ట్రంగా మారనుందని స్వచ్ఛ భారత్ సర్వే వెల్లడించిందని గుర్తు చేశారు. ‘అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ 1.36 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం’ అని యోగి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ప్రభు త్వం చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసించారు. మీడియా కృషిని ప్రశంసించిన ప్రధాని ప్రజల జీవన ప్రమాణాల్ని మెరగుపర్చడంలో స్వచ్ఛత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వల్ల మూడు లక్షల మంది ప్రాణాల్ని కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. డయేరియా కేసులు 30 శాతం తగ్గుతాయి’ అని ఆయన వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, బిహార్, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల ప్రజలతో మోదీ సంభాషించారు. కశ్మీర్లోని లేహ్ ప్రాంతంలో ప్యాంగాంగ్ సరస్సు శుద్ధిలో పాలుపంచుకుంటోన్న టిబెట్ సరిహద్దు పోలీసు బలగాలతో పాటు పట్నా సాహిబ్ గురుద్వారాకు చెందిన సిక్కు మతపెద్దలు, అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మతగురువులు, దైనిక్ జాగరణ్ మీడియా గ్రూపు సిబ్బందితో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో వార్తా పత్రికలు, చానళ్లు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీలకు ప్రశంసలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్టాటాలు కూడా ప్రధానితో సంభాషించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాల్ని కొనియాడారు. అలాగే తమిళనాడులో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాలుపంచుకోవడాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫరీదాబాద్లో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, పట్నాలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. -
గాంధీ అరెస్ట్
మే–17 ఇయక్కం కన్వీనర్ తిరుమురుగన్ గాంధీ అరెస్టు అయ్యారు. విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు చెన్నై పోలీసులు బెంగళూరు బయలు దేరి వెళ్లారు. సాక్షి, చెన్నై : తమిళాభిమాన సంఘంగా మే–17 ఇయక్కం కార్యకలాపాలు రాష్ట్రంలో సాగుతున్నాయి. దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న తిరుమురుగన్ గాంధీని ఇటీవల పోలీసులు టార్గెట్ చేశారు. గత ఏడాది ఆయన్ను గూండా చట్టం కింద సైతం అరెస్టుచేసి కొంతకాలం కటకటాల్లో పెట్టారు. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఆ కేసు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మీద పోలీసులు పలు రకాల కేసుల్ని నమోదు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తూత్తుకుడి అల్లర్ల కేసులో తిరుమురుగన్ పేరును చేర్చారు. అలాగే, గ్రీన్ హైవేకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ పలు కేసుల్ని నమోదు చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా లుక్ అవుట్ నోటీసు సైతం జారీచేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం నిమిత్తం ఇక్కడి నుంచి జెనీవాకు వెళ్లారు. అక్కడ తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ గురించి , గ్రీన్ హైవే ప్రాజెక్ట్ గురించి, తమిళనాట ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లోనూ వివాదాల్ని పసిగట్టిన పోలీసులు తిరుమురుగన్ గాం«ధీని టార్గెట్ చేశారు. బెంగళూరులో అరెస్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశాన్ని ముగించుకుని బుధవారం బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే, లుక్ అవుట్ నోటీసును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తిరుమురుగన్ గాంధీని అరెస్టు చేయడానికి తగ్గట్టు విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బెంగళూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీదున్న కేసుల్ని పరిగణించి అరెస్టుచేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. తిరుమురుగన్ గాంధీని తమ కస్టడికి తీసుకుని చెన్నైకి అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం తిరుగు పయనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, తిరుమురుగన్ గాంధీని బెంగళూరులో అరెస్టు చేయడాన్ని తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంనేత దినకరన్తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఈ అరెస్టును ఖండించారు. -
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
గాంధీ ఆస్తులపై ఏసీబీ ఆరా
జంగారెడ్డిగూడెం:లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఆరాతీశారు. స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి గాంధీ, ఆయన బినామీల పేరున ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది రికార్డులు తనిఖీ చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో 4.50 ఎకరాలు, దిప్పకాయలపాడులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో కూడా ఏమైనా ఆస్తులు ఉన్నయా, ఆయన బినామీలు ఎవరైనా ఉన్నారా అనేది ఆరా తీస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారి గాంధీ అరెస్టు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపేట గాంధీని ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో నాటకీయ పరిణామాల మధ్య చంచల్గూడ జైలుకు తరలించారు. గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ వారాసిగూడలోని గాంధీ నివాసంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాంధీని అరెస్టు చేసి, ఆయన నివాసం నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు :గాంధీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో మల్లంపేట గాంధీకి వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ తనకు గుండెపోటు వస్తోందని, కాలేయ సమస్య ఉందని, శ్వాస ఆడటంలేదని చెప్పడంతో సాయం త్రం 5 వరకు వైద్య పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను మెట్టుగూడలోని న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. అనంతరం గాంధీని ప్రత్యేక వాహనంలో చంచల్గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్న సమయంలో గాంధీ కుటుంబ సభ్యులు, బంధువులు మీడియాను అడ్డుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీయరాదంటూ అడ్డంగా నిలబడి హడావుడి చేశారు. కాగా, చంచల్గూడ జైలు వైద్యులు గాంధీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో శనివారం సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఓ న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం. సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శనివారం రాత్రి అనంతరం కూడా సో దాలు కొనసాగుతున్నాయి. సమీప బంధువు ఫిర్యాదుతో గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన సమీప బంధువు ఒక రు ఇటీవల ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అన్ని వివరాలు, ఆధారాలు సమర్పించారు. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఏసీబీ అధికారులు.. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ను కలసి.. తమకు అందిన ఫిర్యాదు, తాము సేకరించిన ఆధారాలను సమర్పించారు. పూర్తిస్థాయి ఆధారాలు ఉండటంతో గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుకు ఏసీజే గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు శనివారం గాంధీపై కేసు నమోదు చేసి... హైదరాబాద్తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, మరికొన్ని చోట్ల గాంధీ, ఆయన సమీప బంధువుల నివాసాల్లో ఏకకాలం లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదేళ్లకు పైగా ఒకే కోర్టులో.. మల్లంపేట గాంధీకి ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2015లో హైదరాబాద్లోని నాగోల్లో జరిగిన గాంధీ కుమార్తె వివాహ వేడుకల్లో ఆ నేత చాలాసేపు గడిపారని కొందరు న్యాయాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఢిల్లీస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సైతం గాంధీ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఓ దశలో గాంధీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏకంగా ఐదేళ్లకుపైగా కొనసాగారు. ఓ న్యాయాధికారి ఒకే కోర్టులో ఐదేళ్లకుపైగా కొనసాగడాన్ని అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. దాడుల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.57 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. బంజారాహిల్స్లో రూ.10.52 లక్షల విలువైన ఫ్లాట్ డీడీ కాలనీలో రూ.33.51 లక్షల విలువైన ఫ్లాట్ వారాసిగూడలో రూ.35 లక్షల విలువైన ఇల్లు వారాసిగూడలోనే రూ.70 లక్షల విలువైన నూతన మూడు అంతస్తుల భవనం రూ.12.30 లక్షల విలువైన వెర్నా కారు రూ.17 లక్షల విలువైన కారోలా ఆల్టిస్ కారు రూ.3.5 లక్షల విలువైన ఆల్టో కారు రూ.60 వేల విలువైన హోండా యాక్టివా టూ వీలర్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో రూ.48.65 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కరగపాడులో రూ.23 లక్షల విలువైన 8.73 ఎకరాల భూమి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో రూ.30 లక్షల విలువైన 1.5 కేజీల బంగారం బ్యాంకు లాకర్లో రూ.2 లక్షల విలువగల 4 కేజీల వెండి అభరణాలు బ్యాంకు ఖాతాలో రూ.9 లక్షల నగదు నిల్వ.. ఇంట్లో రూ.89 వేల నగదు రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు రూ.33 లక్షల విలువగల చిట్టీల డబ్బు -
ప్రిసైడింగ్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. నాంపల్లి కోర్టులో పనిచేస్తున్న గాంధీ ఆదాయానికి మించి అస్తులున్నాయనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. హైదరాబాద్, గోదావరి జిల్లాల్లోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల ఇంటిపైన సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వ్యవసాయ భూములతో పాటు 30 తులాల బంగారం, ఓ లాకర్ను కనుగొన్నట్టు ఆయన వెల్లడించారు. ఏడు చోట్లు తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. -
కేరళలో గాంధీ విగ్రహానికి అవమానం
న్యూఢిల్లీ : విగ్రహాల విధ్వంసం దేశమంతా దావానంలా వ్యాపిస్తోంది. కేరళ, కన్నూర్లోని తాళిపరంబ ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ అవమానానికి గురైంది. విగ్రహాన్నుంచి కళ్లజోడుని దుండగులు వేరుచేశారు. గాంధీజీ తల నుంచి వేరుపడివున్న కళ్లజోడుని ఈ ఉదయం స్థానికులు గుర్తించారు. తమిళనాడులోని తిరువత్రియూర్ పెరియార్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి రంగులు పూసి దుండగులు అవమానం చేశారు. త్రిపుర ఎన్నికల్లో విజయానంతరరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చిన సంగతి.. కోల్కతాలో మంగళవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం కూల్చివేతకు గురైన విషయం విదితమే. -
మేం కట్టం..
పాలకుల ఆజ్ఞల్ని శిరసావహించేవారు కొందరైతే, వాటిని పూచికపుల్లగా ధిక్కరించి విప్లవాగ్ని రగిల్చినవారు మరికొందరు. చరిత్ర పుటల్లో కొందరు ఇలాంటి ధిక్కారాలకు పాల్పడి పాలకుల పాలిట సింహస్వప్నమై నిలిచారు. పన్ను పోట్లపై దండెత్తారు. ‘దండి’గా ధిక్కరణ ►తెల్లవాడి దురహంకారంపై తొలి దెబ్బ. రవి అస్తమించని సామ్రాజ్యం మాది.. అంటూ విర్రవీగుతున్న ఆంగ్లేయుల నెత్తిపై తొలి పిడుగు.. అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా 1930 మార్చి 12న జాతిపిత బాపూజీ నేతృత్వంలో సాగిన ఈ సత్యాగ్రహం ఏప్రిల్ 6న గుజరాత్లోని దండిలో బ్రిటిష్ చట్టాలను ధిక్కరించి ఉప్పును తయారుచేయడంతో ముగిసింది. ఉక్కు మహిళకూ తప్పలేదు.. ►స్థానిక, సేవల పన్నులకు వ్యతిరేకంగా 1990లో బ్రిటన్ పౌరులు సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2కోట్ల మంది ఈ పన్నులను చెల్లించేందుకు నిరాకరించారు. ట్రఫాల్గర్ స్క్వేర్ వద్దకు లక్షలాదిగా చేరుకుని సర్కారుపై యుద్ధభేరి మోగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు, అల్లర్లు చెలరేగాయి. చివరికి నాటి ప్రధాని, ఉక్కు మహిళ మార్గరేట్ థాచర్ ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. టీ కప్పులో ‘బోస్టన్’తుపాను.. ►ఆంగ్లేయుల గుత్తాధిపత్యానికి ‘బోస్టన్ టీ పార్టీ’ఉదంతం చెంపపెట్టులాంటిది. బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఈస్టిండియా కంపెనీకి, వారి తొత్తులకు మాత్రమే టీ పొడి దిగుమతిపై పన్నును మినహాయించడం వలస పాలనలో మగ్గుతున్న అమెరికా వర్తకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో బోస్టన్ వర్తకులు తిరుగుబాటు చేసి అక్కడి నౌకల్లోని టీ పొడి మొత్తాన్ని సముద్రంపాలు చేశారు. 1773 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటన చరిత్రలో బోస్టన్ టీ పార్టీగా వినుతికెక్కింది. ప్రజలకోసం నగ్నంగా.. ►పన్నుల పేరిట భర్త అరాచకాన్ని చూడలేక భార్యే ఎదురుతిరిగిన సంఘటన ఇది. 11వ శతాబ్దంలో ఇంగ్లండ్లోని మెర్సియా రాజ్యపాలకుడు లియోఫ్రిక్ ప్రజలపై విపరీతంగా పన్నులు వేసి వేధించేవాడు. సామాన్యుల కష్టాలకు చలించిపోయిన అతడి భార్య లేడీ గొడవపడి భర్తతో వాగ్వాదానికి దిగింది. రెచ్చిపోయిన భర్త.. నగ్నంగా శ్వేతాశ్వంపై నగరాన్ని చుట్టొస్తే పన్నుల భారం తగ్గిస్తానన్నాడు. ఆమె ఒప్పుకుంది. గుర్రంపై నగ్నంగా వెళుతున్నప్పుడు ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దన్న షరతుతో నగ్నంగా నగర వీధుల్లో దౌడులు తీసింది. బడ్జెట్.. ‘బొగెట్టీ’ ►బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలుసంచిలో తీసుకొచ్చేవారు. అందువల్లే ఈ మాట వాడుకలోకి వచ్చింది. -
మహాత్ముని మరణం 30 జనవరి 1948
వడివడిగా, వేగంగా ప్రార్థనకు నడుస్తూ వస్తున్నారు గాంధీజీ. బిర్లాహౌస్ (ఢిల్లీ) మైదానంలోని జనం లేచి ‘బాపూజీ, బాపూజీ’ అని ఆరాధనతో తన్మయమౌతున్నారు. అచ్ఛాదన లేని ఆయన ఛాతీ ఎన్ని మృత్యువులనైనా చేరదీసి, సేదతీర్చే ప్రేమ మందిరంలా ఉంది. మళ్లొకసారి తుపాకీ సర్దుకున్నాడు గాడ్సే. గాంధీజీకి ఎదురు నడుస్తున్నాడు గాడ్సే. మృత్యువా? మహాత్ముడా? ఎవరు ఎవరిని గౌరవిస్తారో, ఎవరు ఎవరికి శిరస్సు వంచి నమస్కరిస్తారో, ఎవరు ఎవరిని అంతిమంగా ఒడిలోకి తీసుకుంటారో.... కొద్దిసేపట్లో తేలిపోతుంది. గాంధీజీకి ఇటు మనూ, అటు అభా ఉన్నారు. తృటిలో మృత్యువు అక్కడికి చేరుకుంది. గాంధీజీకి అతి దగ్గరగా వచ్చి, వంగి, చేతులు జోడించాడు గాడ్సే. ఆ చేతుల మధ్య తుపాకీ ఉంది! మృత్యువును జయించడమంటే... మృత్యువును వట్టి చేతులతో సాగనంపడం కాదని మహాత్ములు మాత్రమే అనగలరు. ఇవ్వడానికి గాంధీజీ దగ్గర నిండు ప్రాణాలున్నాయి. తృణప్రాయంగా వాటిని అర్పించగల గుండె ధైర్యం ఉంది. మహాత్ముని శరీరంలోకి మూడు గుండ్లు దూసుకెళ్లాయి. కోట్ల హృదయాలకు తూట్లు పడ్డాయి. బాపూజీ భౌతికంగా మరణించి నేటికి డెబ్భై ఏళ్లు. ఆయన అనుసరించి, మానవాళికి అందించి వెళ్లిన జీవిత సందేశాలు మాత్రం ఏనాటికీ మరణం లేనివి. -
మహాత్ముడి ఫొటో మార్ఫింగ్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా గాంధీ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారని, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, ఆ సందర్భంగా అక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను మసక వెలుతురులో చూపించారని ఆరోపించింది. దీనిపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. వెనుక వైపు గాంధీ చిత్రపటం ఉండగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అయితే కొందరు ఆకతాయిలు గాంధీ ఫొటోను మొగల్ చక్రవర్తిగా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది మహాత్మాగాంధీని అవమానించడమేనన్నారు. కాగా, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, తగు చర్యలు తీసుకుంటామని సైబర్ సెల్ ఎస్పీ శైలేంద్రసింగ్ చెప్పారు. -
వెయ్యి మంది గాంధీలొచ్చినా!
న్యూఢిల్లీ: స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను రాజకీయం చేయటం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెయ్యి మంది మహాత్మా గాంధీలొచ్చినా దేశాన్ని స్వచ్ఛంగా మార్చలేరని, 125 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమ లక్ష్యాలను చేరుకోవటం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. చీపురు పట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించినపుడు తనను చాలా మంది విమర్శించారన్నారు. ‘మోదీని విమర్శించాలంటే చాలా అంశాలున్నా యి. కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చే అంశాలపై హాస్యాస్పదంగా మాట్లాడటం, రాజ కీయం చేయటం సరికాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. మహాత్ముడు చూపిన మార్గంలో ముందుకెళ్తాను’అని ప్రధాని పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటి సెలవును వృథా చేస్తున్నా నంటూ కొందరు ప్రజలు, మరికొందరు తోటి రాజకీయ నాయకులు విమర్శించారన్నారు. ‘వెయ్యి మంది మహాత్మా గాంధీలు, లక్ష మంది నరేంద్ర మోదీలు, ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఏకమైనా స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోవటం కష్టం. 125 కోట్ల మంది దేశ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం’ అని మోదీ వెల్లడించారు. తను చాలా విషయాల్లో ఓపికగా ఉంటానన్న మోదీ.. విమర్శలను సహించడంలోనూ తన సామర్థ్యా న్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. ‘ఐదేళ్ల క్రితం విద్యార్థులు స్కూళ్లు ఊడుస్తుంటే పెద్ద వివాదం చేశారు. తల్లిదండ్రులు కూడా టీచర్ల తీరును తప్పుబట్టారు. కానీ ఇప్పుడు ఆ విద్యార్థులే స్కూళ్లల్లో పారిశుధ్యం కోసం పనిచేస్తుండటాన్ని గొప్ప విషయంగా చూస్తున్నారు’ అని ఆయన తెలిపారు. మీడియా, పౌర సమాజం సభ్యులు స్వచ్ఛత ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయటంలో కీలక భూమిక పోషించారన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో సాధించింది స్వల్పమేనని.. చేయాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు. -
గాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా దివంగత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్లో నివాళులర్పించారు. నిరాడంబర వ్యక్తిత్వం, సమర్థ నాయకత్వానికి మారుపేరైన లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్' అన్న ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన నిజమైన పరిపాలకుడని, యువతే కాదు దేశ నిర్మాతలకు సైతం ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ శాస్త్రి పాల్గొన్నారని స్మరించుకున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మహాత్మాగాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. Remembering Mahatma Gandhiji on his 148th jayanthi. His life is an inspiration and should be emulated by each one of us. — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017 My tributes to Lal Bahadur Shastriji on his jayanthi. pic.twitter.com/y30fdonIqV — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017 -
అప్పుడు గాంధీగారికి 78 ఏళ్లు... నాకిప్పుడు 60 ఏళ్లే! ప్రయత్నిస్తా!
రాజకీయాలపై తన అభిప్రాయాలను కమల్హాసన్ సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప్రస్తుత రాజకీయాలపై ఆయన స్పందిస్తున్న తీరు సంచలనమవుతోంది. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయడానికేనా ఇదంతా? అని కమల్ను ప్రశ్నిస్తే... ‘‘నేనలా చెప్పానా? మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు?’’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి, మీ లక్ష్యం ఏంటి? అనడిగితే... ‘‘కరప్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ఉద్యమిస్తా. కేవలం తమిళ రాజకీయాల్లోని కుళ్లుని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అవినీతిని కడిగేస్తా’’ అంటున్నారు కమల్హాసన్. ఒంటి చేత్తో మీరు పోరాటం చేయగలరా? అంటే... ‘‘కనీసం నన్ను ప్రయత్నించనివ్వండి. నా స్ఫూర్తి ప్రదాత గాంధీగారు 78 ఏళ్ల వయసులో కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడినప్పుడు... 60 ఏళ్ల వయసులో నేను ప్రయత్నించలేనా?’’ అని కమల్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... కమల్ పై విధంగా స్పందించారు. అంతే కాదు... రజనీకాంత్కు వ్యతిరేకంగా తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. -
ప్రియమైన బాపూ.. నువ్వే ప్రేరణ!
⇒ ఉత్తరం రాయండి.. బహుమతి గెల్చుకోండి ⇒ ప్రధాని సూచనతో తపాలా శాఖ వినూత్న కార్యక్రమం ⇒ ఉత్తమ లేఖకు సర్కిల్ స్థాయిలో రూ.25 వేలు.. జాతీయ స్థాయిలో రూ.50 వేలు ⇒ గాంధీ జయంతి రోజున సబర్మతి ఆశ్రమంలో అందజేత సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీకి లేఖ రాయాలనుకుంటున్నారా..? అయితే ఆయన జీవి తం మీకు ఎలా ప్రేరణ కలిగించిందో ఓ ఉత్తరం రాయండి.. అది ఆకట్టుకునేలా ఉంటే సబర్మతి ఆశ్ర మానికి చేరుకుంటుంది. మీకు నగదు పురస్కారం దక్కుతుంది! ఈ మేరకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో మహాత్ముడి చిత్రాలతో ఉన్న కొన్ని తపాలా కవర్లను విడుదల చేశారు. ఆ సందర్భంగా మహాత్ముడిని జనం మరోసారి తలచుకోవటంతోపాటు ఉత్తరాలు రాసే మధుర జ్ఞాపకాన్ని నెమరేసుకోవటం ఒకేసారి జరిగేలా ఓ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తపాలా శాఖకు సూచించారు. దీంతో ‘ప్రియ బాపూ... నువ్వే నా ప్రేరణ’ పేరుతో తపాలా శాఖ ఓ కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. మహాత్ముడి ప్రేరణ ప్రభావాన్ని స్వీయానుభవంలో వివరిస్తూ ఆగస్టు 15లోపు తెలం గాణ సర్కిల్ తపాలా చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్కు చేరేలా ఉత్తరం స్వదస్తూరీతో రాసి పంపాలి. వాటి ల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మూడు నగదు పురస్కారాలను తపాలా శాఖ అందించనుంది. వా టిని జాతీయ స్థాయి పురస్కార ఎంపికకు కూడా పంపుతుంది. అక్కడ ఎంపికైతే మరో దఫా పుర స్కారం వరిస్తుంది. అలా ఉత్తమమై నవి సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటాయి. అక్కడ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వాటిని ప్రదర్శించ టంతోపాటు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పోటీ ఇలా... ఈ పోటీ రెండు వయసుల వారికి ఉంది. 18 ఏళ్లలోపు వారు, అంత కంటే ఎక్కువ వయసున్న వారికి విడివిడిగా ఏర్పాటు చేశారు. ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలకు మించకుండా, ఏ4 సైజ్ కాగితంలో అయి తే వెయ్యి పదాలకు మించకుండా వ్యాసం రాసి రూ.5 పోస్టు కవర్లో ఉంచి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్, అబిడ్స్ హైదరాబాద్, 500001 చిరునామాకు పంపాలి. గాంధీజీని ఉద్దేశిస్తూ తమ జీవితంలో ఆయన ఎలా స్ఫూర్తి నింపారో రాయాలి. దాంతోపాటు వయసు పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి. బహుమతులు ఇలా.. సర్కిల్ స్థాయిలో మొదటి ఉత్తమ లేఖకు రూ.25 వేలు, రెండో లేఖకు రూ.10వేలు, మూడో ఉత్తమ లేఖకు రూ.5వేలు నగదు బహుమతి ఉంటుం ది. ఇది రెండు వయసుల వారికి విడివిడిగా ఉంటుంది. ఇవి జాతీయ స్థాయి లో మళ్లీ ఎంపికైతే మొదటి ఉత్తమ లేఖకు రూ.50 వేలు, 25 వేలు, రూ.10 వేలు బహుమతి ఉంటుంది. అక్టోబర్ 2న వాటిని సబర్మతి ఆశ్రమంలో ప్రద ర్శిస్తారు. ఇందుకు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇన్లాండ్ లెటర్లను, పెన్నులను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. దాదాపు 3 నుంచి 5 లక్షల లేఖలను సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గాంధీ ‘బంధీ’
కలెక్టర్ కార్యాలయం ముందుభాగంలో ఉన్న ఐలాండ్లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు గ్రహణం వీడలేదు. దీంతో మహాత్ముని విగ్రహం జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ చాంబర్ వెనుక గదిలో బంధీగా ఉండిపోయింది. రెండేళ్ల కిందట ఇస్కాన్ మందిరం వారు అందజేసిన ఈ విగ్రహాన్ని ఐలాండ్లో ఏర్పాటు చేయడానికి ఖజానా శాఖ అధికారులు అప్పట్లో అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఖజానాకు ఎదురుగా నంది విగ్రహం ఉందని, దానికి అడ్డుగా విగ్రహం ఉంచడం సరికాదని చెప్పడంతో ఏర్పాటు చేయలేదని సమాచారం. ఇక అప్పటి నుంచి విగ్రహం గదికే పరిమితం అయ్యింది. ఆ తరువాత విగ్రహం ఏర్పాటు అంశం పూర్తిగా మరుగునపడింది. -
డల్లాస్లో ఘనంగా యోగా దినోత్సవం
డల్లాస్: టెక్సాస్లో గల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వద్ద మూడో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్జీఎమ్ఎన్టీ, కన్సూలెట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 300 మంది ఔత్సాహికులు యోగా డే వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో రావు కల్వల మాట్లాడుతూ.. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా డే ప్రపోజల్ను పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టెక్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మ్యాట్ రినాల్డి మాట్లాడుతూ.. అమెరికాలో అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడానికి డా.తోటకూర ప్రసాద్ చేసిన కృషిని కొనియాడారు. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. దాదాపు 5000 సంవత్సరాల క్రితం రిషీకేష్లో యోగా ప్రారంభమైందని తెలిపారు. మూడో అంతర్జాతీయ యోగా వేడుకలు గాంధీజి విగ్రహం ముందు జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. గాంధీ ప్రతి రోజు మెడిటేషన్, యోగా సాధన చేసే వారని చెప్పారు. -
రాజ్నాథ్సింగ్ రాయని డైరీ
‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా’’ అని చంపారన్ నుంచి వచ్చిన ఒక సీనియర్ సిటిజన్ ఈ ఉదయం నన్ను పట్టుకుని అడిగాడు! చూడ్డానికి ఆయన అచ్చు గాంధీజీలా ఉన్నారు. చేతిలో కర్ర లేదు. కళ్లకు గుండ్రటి ఫ్రేమ్ ఉన్న అద్దాలు లేవు. ఇంకో చేతిలో పుస్తకమూ లేదు. అయినా గాంధీజీలానే ఉన్నారు. ఆయన అడిగిన ప్రశ్నను బట్టి, ముఖ్యమైన పనేమీ లేకుండానే ఆయన నన్ను కలవడానికి వచ్చినట్లు అనిపించింది. అంత ముఖ్యం అయి ఉంటే, నేనే అతడి దగ్గరికి ఢిల్లీ నుంచి చంపారన్ వెళ్లి ఉండేవాడిని! చంపారన్ బిహార్లో ఉంటుంది. బిహార్లో నితీశ్కుమార్ ఉంటాడు. బిహార్లోనే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉంటాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉన్నా సరే, ఈ పెద్దాయన కోసం అక్కడికి వెళ్లి ఉండేవాడిని. వెళ్లి, సమస్య ఏమిటని అడిగి ఉండేవాడిని. ఎంతైనా ఈ బిహారీ గాంధీజీకి కూడా నేను హోమ్ మినిస్టర్నే కదా. హోమ్ మినిస్టర్ ఏ స్టేట్కి అయినా వెళ్లొచ్చు. అక్కడ బీజేపీ ప్రభుత్వం లేకపోవచ్చు. అయినా వెళ్లొచ్చు. అక్కడ నితీశ్, లాలూ ఉండొచ్చు. అయినా వెళ్లొచ్చు. ముఖం చూడ్డం ఇష్టం లేక వెళ్లడం మానేస్తే, మనం చూడాలనుకున్న ముఖాలను చూడలేం. మనల్ని చూడాలనుకున్నవాళ్లకూ ముఖం చూపించలేం. ‘‘పెద్దాయనా.. ముందు మీరు కూర్చోండి. మీకు ఏ విధంగానైనా సహాయపడ గలగడం కోసమే కదా మేమంతా ఇక్కడ.. ఈ ఢిల్లీలో సిద్ధంగా ఉన్నాం’’ అన్నాను. ఆయన కూర్చోలేదు! ‘‘నాకు సహాయం వద్దు. సమాధానం కావాలి’’ అన్నారు.‘‘చెప్తాను కూర్చోండి’’ అన్నాను. ‘‘చెప్పండి. కూర్చుంటాను’’ అన్నారు. గాంధీజీ కంటే మొండివాడిలా ఉన్నాడు. ‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా?’’ అని మళ్లీ అడిగాడు. ‘‘ఉంది పెద్దాయనా.. గాంధీజీపై గౌరవం ఉంది. గాంధీజీ సత్యాగ్రహం చేసిన చంపారన్పై గౌరవం ఉంది. చంపారన్లో ఉంటున్న మీపైనా గౌరవం ఉంది’’ అన్నాను. ‘‘మరి చంపారన్లో వందేళ్ల సత్యాగ్రహ సభ జరుగుతుంటే.. ఆ సభకు మీరెందుకు రాలేకపోయారు?’’ అని ప్రశ్నించాడు పెద్దాయన. ‘‘రాలేకపోవడం.. గౌరవం లేకపోవడం రెండూ ఒకటేనా పెద్దాయనా’’ అని అడిగాను. ‘‘రాజ్నాథ్జీ.. మీకోసం ఎల్తైన వేదికపైన కుర్చీ వేశారు. ఆ కుర్చీపైన అందరికీ కనిపించేలా మీ పేరు కూడా రాశారు. లాలూజీ ఏమన్నారో తెలుసా? గాంధీజీకి పూలదండ వేసిన చేత్తోనే మీరు గాడ్సేకీ వేస్తారని, అలాంటి మనిషి సత్యాగ్రహ సభకు ఎందుకు వస్తారనీ! ఆ మాట నిజమేనా రాజ్నాథ్జీ.. చెప్పండి’’ అన్నారు. ఏం చెప్పను?! ‘‘ఆగ్రహాన్ని నా దగ్గర వదిలేసి, లాలూజీ కనిపెట్టిన సత్యాన్ని తిరిగి మీతోనే చంపారన్ మోసుకెళ్లండి పెద్దాయనా’’ అని చెప్పాను. -
ఆ సెలైన్లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. నీలోఫర్లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు. -
బాపు
-
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాత్మాగాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న భారతదేశం తయారవ్వాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, కృష్ణమోహన్, సీఐలు నాగరాజ యాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం... రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి ఎస్పీ ఆకే రవికృష్ణ ఆర్థిక సాయాన్ని అందించారు. ఏఆర్పీసీ రామాంజనేయులు, సివిల్ పీసీ నాగరాజు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురై మతిస్థిమితం కోల్పోయి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలు చంద్రరేణుక, కాంతమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
అమరులకు వందనం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం బ్రిటిష్ పతాకం పరిచిన చీకట్ల కింద మగ్గిపోతున్న భారతావనికి కొత్త సూర్యోదయాన్ని చూపించి తాను అస్తమించారు బాపూజీ. మాతృభూమికి స్వేచ్ఛావాయువుల నిచ్చి తుదిశ్వాస వదిలారాయన. జనవరి 30, 1948న గాడ్సే తుపాకి గుళ్లకు బలైనప్పటికీ చాలామంది ప్రపంచ ప్రజల గుండెల్లో ఆయన స్మృతి ఈనాటికీ పదిలమే. గాంధీజీ స్ఫూర్తి, ఆదర్శం ప్రపంచ చరిత్రలో అనంతమైన అధ్యాయాలుగా మిగిలాయి కూడా. అహింస అనే ఆయన ఆదర్శానికి కైమోడ్పులు ఘటిస్తూనే స్వాతంత్య్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్కు దీటుగా తమవైన పంథాలలో ఉద్యమించి త్యాగాలు చేసిన వారినీ స్మరించుకోవడం ఇవాళ్టి తరాల బాధ్యత. మితవాదులైనా, అతివాదులైనా, తీవ్ర జాతీయవాదులైనా– దాస్య శృంఖలాలు తెగే వరకే ఆ దృష్టి. ఆ విభజన. మార్గం వేరైనా, వారందరి లక్ష్యం దేశ స్వాతంత్య్రమే. ఎవరి త్యాగమైనా స్వరాజ్య భారతికీ, కొత్త తరాల దృష్టిలోనూ విలువైనదే కావాలి. అందుకే గాంధీజీ వర్ధంతికే ఆ మృతవీరులనూ స్మరించుకునే సమున్నత ఆదర్శాన్ని ఈ దేశం పాటిçస్తున్నది. గాంధీజీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిపారు. నిజమే! ఆయనకు ముందు జరిగిన పోరులలోనూ, అలనాటి వీరులలోనూ అలాంటి శక్తే కనిపిస్తుంది. ఇదీ నిజమే! కానీ..... రక్తదీపావళిని మరిపించే ఆ త్యాగమూర్తుల జీవితాలలో మనకు తెలిసినవి ఎన్ని? వారిలో ఎందరిని తలుచుకుంటున్నాం? ఎంతమంది గురించి మన తరం వాళ్లం చదువుకున్నాం? చరిత్ర పుటలలో ఓ చోటు కోసమనీ, స్వతంత్ర భారతంలో పదవులొస్తాయనీ వారు తమ సర్వస్వం అర్పించలేదు. కేవలం దేశం కోసం ప్రాణాలర్పించారు. నిస్వార్థంగా నిష్క్రమించారు. అందుకే ఆ హుతాత్మల త్యాగ నిరతిని గాలికి వదిలేయడం ఏ దేశమైనా చేయవలసిన పనికాదు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా కాల్చిన మంగళ్ పాండే సాహసం, నానా సాహెబ్, లక్ష్మీబాయి, తాంతియా తోపే, తురేబాజ్ ఖాన్, వీరందరి వెనుక నిలిచిన సిపాయీల త్యాగాలు మరచిపోతామా! చిన్న ఉద్యమంతో పెద్ద త్యాగం చేసిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేని తలచుకోవడం మన విధి. పంజాబ్లో కొన్ని క్షణాల పాటు ఆరో నదికి– నెత్తుటి నదికి జన్మనిచ్చిన జలియన్వాలాబాగ్ దురంతంలో నేలకూలిన వారిని స్మరించేందుకు రెండు నిమిషాలు కేటాయించలేమా? స్వరాజ్యం నా జన్మహక్కు అన్న తిలక్, లాఠీదెబ్బలకు బలైన లజ్పతిరాయ్, అండమాన్ జైలులో కఠోర శిక్షలు అనుభవించిన సావర్కర్, ఇంకా ఎందరో త్యాగధనులు... గదర్వీరులు లాలా హరదయాళ్, సోహన్సింగ్ భాక్నా, కర్తార్ సింగ్, పృథ్వీసింగ్ ఆజాద్, రాస్ బిహారీ బోస్, ఉద్దమ్సింగ్, మౌల్వీ బర్కతుల్లా, దర్శి చెంచయ్య వంటి వారి స్వాతంత్య్ర కాంక్ష సదా స్మరణీయమే. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యకు వేలాడాడు ఖుదీరాం. అషఫుల్లా ఖాన్, మదన్లాల్ థింగ్రా చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హిందుస్తాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పేరు గుర్తుకు వస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దద్దరిల్ల చేసిన బాంబు పేలుడు చెవిని తాకడమే కాదు, భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఉడుకు రక్తపు చుక్కలు కంటి ముందు కదులుతాయి. కొండకోనలలో సంతాల్ హూల్ అంటూ సంతాల్ తెగ ఆదివాసులు, ఉల్గులాన్ అంటూ బిర్సా ముండా నేతృత్వంలో ముండా తెగ గిరిజనులు; ఇంకా ఖోలీలు, ఖోందులు, రాణీ గ్లెయిడినీ నాయకత్వంలో పోరాడిన నాగా వీరులు, నల్లమల చెంచులు.. ఎందరో గిరిపుత్రులు బ్రిటిష్ దాష్టీకం మీద శర సంధానం చేశారు. ప్రాణాలు వదిలారు. ‘జైహింద్’ అంటూ... ‘చలో ఢిల్లీ’ అంటూ నినదించిన సుభాష్ బోస్, షానవాజ్ ఖాన్, మోహన్సింగ్ దేవ్ వంటి ఆజాద్ హింద్ ఫౌజు జవానులు; చిట్టగాంగ్ మహావీరుడు సూర్యసేన్... ఎందరని! ఎన్నెన్ని త్యాగాలని! ఎన్నెన్ని రక్త తర్పణలని! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్వేచ్ఛాకాంక్షతోనే దేశం ప్రతిధ్వనించింది. వీటి నడుమనే కనిపిస్తుంది విశాఖ మన్య పోరాటం. ఆ మహా యుద్ధానికి నాయకుడే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు. ఇది తెలుగు గడ్డ మీద జరిగిన పోరు. అయినా ఇప్పటికీ తెలుగువారికి తెలియని సత్యాలెన్నో! ఈ వారం నుంచి మొదలయ్యే ‘ఆకుపచ్చని సూర్యోదయం’ సీరియల్ ఆ లోటును పూరిస్తుందని మా నమ్మకం. -
చరఖా తిప్పితే గాంధీ కాలేరు
‘ఖాదీ’ క్యాలెండర్లో మోదీ చిత్రంపై విపక్షాల ఆగ్రహం • ఖాదీ ఖ్యాతినీ హైజాక్ చేయాలని చూస్తున్నారన్న రాహుల్ • గతంలోనూ గాంధీజీ చిత్రం లేకుండా క్యాలెండర్ వచ్చింది.. • ఇదంతా అనవసర రాద్ధాంతమన్న పీఎంవో న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ క్యాలెండర్, డైరీపై గాంధీ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను ముద్రించడంపై వివాదం మరింత ముదిరింది. చరఖా తిప్పినంత మాత్రాన ఎవరూ గాంధీ కాలేరు అంటూ కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు శుక్రవారం విమర్శల దాడి ప్రారంభించాయి. మంగళయాన్ యాత్ర విజయవంతమైన సమయంలో ఆ ఘనత కోసం వెంపర్లాడిన మోదీ... ప్రస్తుతం ఖాదీ ప్రచారకర్తగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో విమర్శించారు. ‘చరఖాతో పాటు మహాత్ముడి చిత్రం తొలగించి మోదీబాబు ఫొటో పెట్టారు.. జాతిపిత చిత్రాన్నే తొలగిస్తారా.. మోదీగారూ.. ఏంటిది?’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఖాదీ, గాంధీజీ అనే పదాలు దేశ చరిత్ర, స్వావలంబన, పోరాటానికి చిహ్నాలని, క్యాలెండర్ నుంచి గాంధీజీ ఫొటో తొలగించడం మహా పాపమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం... ఇదంతా అనవసర రాద్ధాంతంగా కొట్టిపారేసింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ (కేవీఐసీ) క్యాలెండర్, డైరీలపై మహాత్మా గాంధీ ఫొటో తప్పనిసరనే నిబంధన ఏదీ లేదని, గతంలోనూ గాంధీజీ ఫొటో లేకుండా క్యాలెండర్లు వెలువడ్డాయంటూ సమర్థించుకుంది. 1996, 2002, 2005, 2011, 2012, 2013, 2016 సంవత్సరాల్లో విడుదలైన క్యాలెండర్లలో గాంధీ ఫొటో లేదని పేర్కొంది. మోదీ యువత చిహ్నమని అభివర్ణిస్తూ.. యువతలో ఖాదీ ఉత్పత్తులపై ప్రజాదరణ పెరుగుతుండటం దీనికి నిదర్శనమని చెప్పింది. ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించేందుకే.. ‘ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించి నేతన్నల జీవితాల్ని మెరుగుపర్చేందుకే ప్రధాని మోదీ చిత్రాన్ని క్యాలెండర్, డైరీలపై ముద్రించాం. గాంధీజీ స్థానాన్ని మోదీతో భర్తీ చేశారంటున్న వారిని ఒక్కటే ప్రశ్న వేస్తాను. వేరెవరితోనైనా గాంధీజీని పోల్చగలమా? మహాత్ముడి ఖ్యాతి అంత తక్కువా? గాంధీజీ స్థానం ఎన్నటికీ వేరొకరు భర్తీ చేయలేరు. ఇదంతా అనవసర వివాదం’ అంటూ కేవీఐసీ చైర్మన్ వీకే సక్సేనా వివరణ ఇచ్చారు. ఖాదీ పరిశ్రమ మొత్తం గాంధీజీ సిద్ధాంతం, ఆదర్శాలపై ఆధారపడి ఉందని, కేవీఐసీకి ఆయన ఆత్మ. కాబట్టి ఆయనను విస్మరించే ప్రశ్నే లేదన్నారు. ఫ్యాషన్గా మారింది: తుషార్ గాంధీ గాంధీజీ చరఖా సాధికారతా సాధనమని, అయితే పేరు ప్రఖ్యాతులు పొందేందుకు ప్రస్తుతం అది ఫ్యాషన్ వస్తువుగా మారిపోయిందంటూ మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేద, బలహీనవర్గాలకు బాపూజీ చరఖా ఉత్పత్తి, సాధికారత సాధనం. స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయుధంలా పనిచేసింది. ప్రస్తుతం అది కేవలం ఫొటోలు తీసుకునే పరికరంగా మారిపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. గాంధీ సిద్ధాంతాల ప్రచారం: బీజేపీ కేవీఐసీ క్యాలెండర్లపై గాంధీజీ చిత్రాలను అనేకసార్లు ముద్రించలేదని, దీనిపై కాంగ్రెస్ అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని బీజేపీ ఆరోపించింది. మహాత్ముడి సిద్ధాంతాల్ని ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం గాంధీ పేరును, ఫొటోల్ని వాడుకొని ఆయన ఆశయాల్ని, ఆదర్శాల్ని విస్మరించిందని బీజేపీ విమర్శించింది. -
అందుకే మోదీ ఫోటో పెట్టారు: కమల్ రాజ్
న్యూఢిల్లీ : గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్ వివాదంపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు క్యాలండర్తో ఆటు డైరీలపై జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని మోదీ ఫోటో పెట్టడాన్ని కేంద్రమంత్రి కమల్ రాజ్ మిశ్రా సమర్థించారు. ఖాదీ వినియోగాన్ని ప్రధాని ప్రోత్సాహిస్తున్నారని, మోదీ ఫోటో పెట్టాలన్నది ఖాదీ బోర్డు నిర్ణయమని ఆయన అన్నారు. విపక్షాలవి అనవసర ఆరోపణలు అంటూ కమల్ రాజ్ కొట్టిపారేశారు. ఖాదీ సంస్థ కేలండర్, డైరీలపై కేవలం మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే పెట్టాలన్న నిబంధనేమీ లేదన్నారు. కాగా కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని ఖాదీ బోర్డు పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. అయితే మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
గాంధీ స్థానంలో మోదీ
ముంబై: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్, డైరీలపై ఖాదీకి మారుపేరైన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేసింది. కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. వీటిని చూసి ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కొందరు నోరెళ్లబెట్టారు. గురువారం ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని మౌన నిరసన తెలిపారు. గాంధీ చిత్రాలతో వీటిని పునర్ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
నేషనల్ మెడికల్ కమిషన్ను రద్దు చేయాలి
– ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, మల్లికార్జున కల్లూరు (రూరల్): నేషనల్ మెడికల్ కమిషన్ను రద్దు చేయాలని ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ మల్లికార్జున డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ఎదుట ఐఎంఏ చేపట్టిన దేశవ్యాప్త సత్యాగ్రహం కార్యక్రమానికి కర్నూలు మెడికల్ రెప్రజెంటేటివ్ అసోసియేషన్ మద్దుతుతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ, మల్లికార్జున మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అతిపెద్దదని, 30 రాష్ట్రాల్లో 1765 బ్రాంచులుండి దేశవ్యాప్తంగా 2,70వేల మంది డాక్టర్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ను రద్దు చేసి ఎంసీఐని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. పీసీ, పీఎన్డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లను సవరించాలన్నారు. వినియోగదారుల రక్షణ యాక్ట్ను సవరించి మృతుల కుటుంబాలకు ఇచ్చే కాంపన్సేషన్ను ఆపేయాలన్నారు. షెడ్యూల్డ్ మందులు అల్లోపతి వైద్యులు మాత్రమే రాయాలన్న హక్కులు సరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు బాలమద్దయ్య, రామచంద్రనాయుడు, అల్లారెడ్డి, రామ్మోహన్రెడ్డి, కుళ్లాయప్ప, రమేష్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలతో మహాత్ముడికి నీరాజనం
అనంతపురం కల్చరల్ : కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా మచ్చా నరసింహులు నేతృత్వంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టవర్క్లాక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి పూలమాలలు పలువురు రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు. అనంతరం నిరుపేద మహిళలకు నూతన వస్త్రాలనందించారు. అలాగే అమ్మవారిశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అన్ని పార్టీల వారు ఒకే వేదికపై సందడి చేశారు. ఎంపీ దివాకరరెడ్డి, మేయర్ స్వరూప, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సత్కరించారు. అలాగే పాతూరు అమ్మవారి శాల, హరిశ్చంద్ర ఘాట్, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తాడిపత్రి బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయం అధ్యక్షులు ముత్యాల రంగయ్య నేతృత్వంలో 500 మంది పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గాంధీ మార్గంలో పయనించాలి
జయంతి వేడుకల్లో జేసీ సత్యనారాయణ రాంనగర్ : మహాత్మా గాంధీ ప్రపంచానికి చూసిన శాంతి, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 147వ జయంతి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గాన్ని ఎచుకుని మానవ జాతి మనుగడకు మార్గం చూపిన మూల పురుషుడన్నారు. గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. మానవ సమాజం శాంతి, స్వచ్ఛత, క్షమాగుణం కలిగి ముందుకు సాగాలన్నారు. హింస వల్ల అంతా నష్టమేగాని ఏమి లాభం ఉండదని, దేశంలో నానాటికి హింసా ప్రవృత్తి పెరుగుతందని, దానిని విడనాడి శాంతియుత మార్గంలో నడవాలని సూచించారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు గాంధీజీని స్మరించుకుంటున్నారన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింసా తత్వం మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, టీఎన్జీఓ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, వీఆర్వోల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె జాన్పాషా తదితరులు బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
గాంధీ చూపిన మార్గంలో నడవాలి
నల్లగొండ (నల్లగొండ రూరల్) : గాంధీ చూపిన మార్గంలో నడవడం ద్వారా చక్కటి సమాజం నిర్మితం అవుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్రావు, రాజశేఖర్రెడ్డిలు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. అహింస, సత్యమే గాంధీ ప్రధాన సూత్రాలన్నారు. న్యాయవాదులు నిరంతరం కొత్త కొత్త చట్టాలను అధ్యయనం చేస్తూ, న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకుముందు న్యాయశాఖ అభివృద్ధి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి కె.రాధారాణి, జేసీ సత్యనారాయణ, ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి, న్యాయమూర్తులు శైలజాదేవి, సత్యనారాయణ, బార్అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్యగౌడ్, కొండ శ్రీనివాస్, శ్రీనివాసులు, ఎన్.నర్సింహారెడ్డి, అమరేందర్రెడ్డి, పాదం శ్రీనివాస్, సంధ్యారాణి, బీమార్జున్రెడ్డి, లెనిన్బాబు పాల్గొన్నారు. -
గాంధీ విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
– జిల్లా జడ్జి తుకారాంజీ ఏలూరు (సెంట్రల్) : ప్రతి ఒక్కరూ జాతిపిత గాంధీజీ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని నడిచినప్పుడే దేశంలో ప్రగతి సాధ్యపడుతుందని జిల్లా జడ్జి తుకారాంజీ అన్నారు. స్థానిక జిల్లా జైలులో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవ సభలో జిల్లా జడ్జి తుకారాంజీ, కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జడ్జి మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడానికి ఏటా ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జైలులో జీవనం సాగించే నిందితులు, ఖైదీలకు వివిధ వత్తుల్లో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివద్ధి సాధించే అవకాశాలుంటాయని, అందుకు అనుగుణంగా జైలులో ఏయే వత్తులు అమలు చేయవచ్చునో ప్రణాళిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నరసింహమూర్తి, జిల్లా జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మహాత్ముడికి ఘన నివాళులు
-
జాతిపితకు ఘన నివాళి
-
మహాత్ముడికి ఘన నివాళులు
న్యూఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించారు. నేడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. -
అలుపెరుగని సత్యాగ్రహ స్ఫూర్తి
సందర్భం జాతి, మత, పాలక దురహంకారాల పట్ల నిశ్శబ్ద నిరసనను పాలకులు ఎంత కఠినంగా అణచివేయాలని ప్రయత్నిం చినా, వారి ప్రయాస విజయవంతం కానీయని ఒక ప్రజా చైతన్య తరంగం సత్యాగ్రహం. రాజ్యమూ, దాని బల గాలూ సర్వ శక్తివంతమై ఉన్నప్పుడు, ‘‘సత్యంతో నా ప్రయోగాలు’’ అంటూ గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం నుంచి.. ఇది మానవుల మధ్య గెలుపు ఓటముల ప్రశ్న కాదు, ప్రజలకు కావాల్సింది, సహజీవన సౌహార్ద సంస్కృతి అంటూ, తామే అధినాధులం అను కునే వారికి, వారు చేస్తున్నది తప్పు అని ధైర్యంగా చెప్పగలగడం.. 20వ శతాబ్దంలో మానవాళి చరిత్రలో ఒక గొప్ప మానసిక విజయం. గాంధీజీ దక్షిణాఫ్రికాలో శ్వేత దురహంకార ప్రభుత్వపు అమానవీయ ఆంక్షలపై చేసిన పోరాటం, ఒక ఈగ రొద వంటిది. అది కనిపిస్తుంది, కానీ కరవాలానికి అందదు. రొద ఆపదు. విద్యావంతుడు, లాయర్, రచయిత అయిన గాంధీజీ తన ఆదర్శా లకు ఒక నిర్మాణం, కార్యరూపం ఇవ్వడానికి అక్కడి భారతీయులు, ఇతర శ్వేతేతర జాతుల ప్రజలను కూడగట్టగలిగాడు. పది వేళ్ల ముద్రలు గల ఒక గుర్తింపు పత్రం, (అంటే ఇప్పటి ఆధార్ కార్డ్ వంటిది) ప్రజలందరి వద్ద కాక, కేవలం భారతీయుల వద్దే ఉండాలన్న దక్షిణాఫ్రికా శాసనాన్ని వ్యతిరేకించాడు. భారతదేశంలో జరిగిన వివాహాలను అక్కడి పాలకులు గుర్తించ నిరాకరిస్తే, అది నిలుపుదల చేయాలని తాము నడుపుతున్న పత్రిక ‘‘ఇండియన్ ఒపీనియన్’’లో ప్రతిఘటించాడు. లండన్ నుంచి ప్రధానమంత్రులు దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు, గాంధీతో సంప్రదింపులు జరిపేలా ఒత్తిడి పెంచగలిగాడు. ఈ క్రమంలోనే గాంధీ 1908లో దక్షిణాఫ్రికాలో జైలు జీవితం అనుభవించాడు. భారతీ యులపై వివక్షా శాసనాలు అమలు జరిపే ప్రభుత్వ ప్రతినిధి జనరల్ స్మట్స్. ఆయనే గాంధీ తొలి జైలర్ కూడా. ఆగస్ట్ 16, 1908న భారతీయుల ప్రత్యేక రిజిస్ట్రేషన్ పత్రాలు బహిరంగంగా తగులబెట్టే కార్యక్రమానికి గాంధీ ఏర్పాటు చేసిన సత్యాగ్రహ సంఘం సభ్యులు జోహాన్నెస్బర్గ్లోని హమీల్డా మసీదు వద్ద గుమి కూడారు. వేలాది అవమానపూరిత పత్రాలను దహనం చేశారు. ఆసియా ప్రజలపైగల రిజిస్ట్రేషన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, 1908- 09 కాలంలో వేలాదిమంది జైలుకు వెళ్లారు. సౌత్ ఆఫ్రికాలో పనివారుగా ఉన్న భారతీయ శ్రామికుల పట్ల గల వివక్షను, మూడు పౌండ్ల పన్ను వగైరాలను తొలగించాలని, గాంధీజీ ఇచ్చిన పిలుపుతో అక్కడ ఎప్పుడూ లేనంతగా అలజడి చెలరేగింది. సామూహిక ప్రదర్శనలు, లాంగ్ మార్చ్లు జరి గాయి. ఒక దశలో వేలాదిమంది గని కార్మికులు అరెస్ట్ అయ్యారు. ఈ అలజడి దేశవ్యాప్తంగా అలుముకునే ప్రమాదకర పరిస్థితుల్లో గాంధీని అరెస్ట్ చేశారు. కానీ, గని పనివారి సమ్మె కొనసాగు తుంది. ఆ సమయంలో యూరోపియన్ రైల్ రోడ్ కార్మికుల సమ్మె కూడా జరిగింది. ప్రభుత్వం, దేశం, దిగ్బంధంలో ఉండగా, తాము డర్బన్కు తలపెట్టిన బహిరంగ యాత్రను గాంధీ నిలుపుదల చేసి, ‘‘మన ప్రత్యర్థి ఇబ్బందుల్లో ఉండగా, మనం వారికి సమస్య కారాదు’’ అని ప్రభుత్వంతో సంఘీభావం ప్రకటిస్తాడు. అపుడు స్మట్స్ కార్యదర్శి ‘‘మీ ప్రజలు అంటే ఇష్టం లేదు మాకు, వారికి సాయంచేయాలని కూడా మాకు లేదు. కానీ మాకు అవసరాలున్నప్పుడు, మీరు ముందుకొచ్చి మాతో సహకరిస్తారు. అటువంటి మిమ్మల్ని, మీ అనుచరులను ఎలా మేం బందీలను చేయగలం? మా ఇంగ్లిష్ కార్మికుల సమ్మెల్లో లాగా మీరు కూడా హింసకు పాల్పడితే, మిమ్మల్ని ఇట్టే అణచి వేయగలం. కానీ మీరు శత్రువుకు కూడా హాని కలిగించరు. మిమ్మల్ని మీరు బాధలకు, దురవస్థలకు గురి చేసుకుని, ఆ క్రమంలో ఒక విజయం పొందా లని తపిస్తారు. ప్రత్యర్థుల పట్ల మర్యాదతో, సౌజన్యంతో నడు చుకుంటారు. అదే మమ్మల్ని మీ పట్ల పూర్తిగా నిస్సహాయులను చేస్తున్నది’’ అని గాంధీ సత్యాగ్రహం విషయంలో తాము ఎలాంటి సందిగ్ధతలో చిక్కుకున్నది వివరిస్తాడు. 1915లో భారత దేశంలో అడుగు పెట్టేసరికి, ఈ దేశం ఎరుగని ఒక ఆత్మశక్తితో వచ్చాడు. 1917 ఏప్రిల్ 10న బిహార్లోని చంపారన్లో గాంధీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి సత్యాగ్రహం మొదలై రెండేళ్లు కొనసాగింది. తాను ఈ దేశ ప్రజలతో కలసి నడిపించిన దేశ విముక్తి పోరాటం, తన జీవిత కాలంలోనే విశాల ప్రపంచం గుర్తించేలా విజయవంతం కావడానికి 1915 నుంచి 1947 దాకా ముప్ఫై రెండేళ్ల కాలం పట్టింది. దేశ దేశాల జైళ్లు, జైలర్లు, యుద్ధాలు, అణచివేతలు, తూటాలు, ఆయన బక్కపలు చని దేహంలోని వజ్ర సంకల్పాన్ని తాకలేకపోయాయి. గాంధీజీ జయంతినాడు, మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఈ దేశ ప్రజలు ఆలోచించవలసిన సమయం ఇది. వారికి నా అంజలి. (నేడు మహాత్మాగాంధీ 147వ జయంతి, చంపారన్ సత్యాగ్రహానికి వందేళ్లు సందర్భంగా) వ్యాసకర్త కవి, విమర్శకులు 98492 00385 - రామతీర్థ -
ఖమ్మంలో మహాత్మ
- నేడు జాతిపిత జయంతి - ఆయన పేరు మీదే గాంధీచౌక్ - నేటికీ ఆయన బాటలో గాంధేయవాదులు ఖమ్మం గాంధీచౌక్: స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన గాంధీ అక్కడి నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. కొద్ది క్షణాలపాటే సాగిన ఆ ప్రసంగం నాటి యువతలో ఎనలేని స్ఫూర్తినింపింది. మహాత్ముని 147వ జయంతి సందర్భంగా ‘సండే స్పెషల్’గా ఆ నాటి స్మృతులు.. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ అహింసే ఆయుధంగా స్వాతంత్రోద్యమం నడిపారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు. మహాత్ముడిగా వెలుగొందిన గాంధీ 1948 జనవరి 30న ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళ్తుండగా గాడ్సే చేత చంపబడ్డారు. జాతిపిత మహాత్మగాంధీ 147వ జయంతిని ఆదివారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీకి ఖమ్మంతో ఉన్న అనుబంధాన్ని ఓసారి మననం చేసుకుందాం.. ఖమ్మంతో అనుబంధం స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన మహాత్ముడు విజయవాడ నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు, ప్రస్తుతం ఇక్కడ వంతెన నిర్మించారు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. ఆయన పేరుమీదే ఖమ్మంలోని గాంధీచౌక్ను ఏర్పాటు చేశారు. ఆయన మాటలు విన్న, ఆయనను చూసిన కొందరు ఆయన విధానాలను నేటికీ పాటిస్తున్నారు. వారిలో ఖమ్మానికి చెందిన ఇద్దరు గాంధేయవాదులు ఏమంటున్నారో తెలుసుకుందాం... అహింసే ఆయుధంగా..: శిరం వినాయక హన్మంతరావు మహాత్ముడు గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా వాడుకున్నారు. ఆ విధానం దేశం యావత్తు గర్వించదగినది. బారిస్టరు చదివిన గాంధీజీ ఎంతో నీతి నిజాయితీగా ఉండటంతోనే ఉద్యమంలో రాణించారు. యావత్తు దేశం ఆయనను గర్వంగా మహాత్మునిగా పిలుచుకోవడం మరువ లేనిది. ఆయన మార్గదర్శకత్వంలో జీవనం సాగిస్తున్నాం. ‘దేశంలో మార్పు కోరుకుంటే మొదట నీ నుంచే ప్రారంభం కావాలి..’ అనే మహాత్ముని సూత్రం నాకే కాదు యావత్ జాతికి స్ఫూర్తినిచ్చింది. ‘నాదగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నాగమ్యం’ అన్న ఆయన మరో నినాదం దేశవిదేశాలతో స్నేహసంబంధాలను నెరపేందుకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇలాంటివెన్నో విషయాలు మహాత్ముని నుంచి మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుత సమాజానికి ఇవి ఎంతో అవసరం కూడా. గాంధీ సంఘ సంస్కర్త కూడా: పెనుగొండ రామ్మోహన్రావు మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడే కాదు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త కూడా. నేడు స్వచ్ఛ భారత్గా చెప్పుకునే విధానం ఆయనదే. ఆయన గొప్ప చదువులు చదివినా మురికి వాడల్లో తిరుగుతూ చీపిరి పట్టుకొని వీధులు ఊడ్చి సంఘంలో ఆదర్శంగా నిలిచారు. అంటరానితనం నిర్మూలనకు నడుం బిగించారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవిస్తున్నాం. ‘వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి, తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే..’ అన్న గాంధీ సూత్రం వ్యక్తిత్వం అనేది మనిషికి ఎంత అవసరమో తెలియజెబుతోంది. ‘విధి నిర్వహణకు మించిన దేశ సేవలేదు’ అన్న గాంధీ మరో నినాదం మన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ‘ఔన్నత్యం సంపద వలన రాదు.. సద్గుణాల వలన వస్తుంది’ అనే నినాదం ధనం చుట్టూ పరుగులు పెడుతున్న నేటి మానవాళికి ఓ చెంపపెట్టు. -
బాపు మాట.. అదే మా బాట
* మంతెనవారిపాలెంలో గాంధీజీ అడుగుజాడలు * స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న మంతెనవారిపాలెం గ్రామస్తులు మంతెనవారిపాలెం (పిట్టలవానిపాలెం): బ్రిటీష్ సామ్రాజ్య కబంద హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలుగు తేజం మంతెన వెంకట్రాజు. మహాత్ముని శాంతి మంత్రమే బ్రహ్మోపదేశంగా ఆయన అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు ఆయన. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయులను ఒక్కసారి స్మరించుకుందాం. 1927లో మంతెనవారిపాలెంలో గాంధీజీ బస.. స్వాతంత్య్ర సమరంలో జాతిపిత మహాత్మాగాంధీని మంతెనవారిపాలెం గ్రామానికి తీసుకొచ్చిన ఘనత మంతెనకే దక్కింది. ఈ గ్రామంలో కనుమూరి వెంకట్రాజు ఇంట్లో రెండు రోజులపాటు బస చేసిన గాంధీజీ గుర్తుగా పాఠశాల ఆవరణలో సమారు 20 అడుగుల ఎత్తులో గాంధీజీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. నాడు గాంధీజీ బస చేసిన కనుమూరి ఇల్లు గ్రామంలో నేటికీ దర్శనమిస్తుంది. అప్పటి నుంచి ఆ ఇంటిని అందుకు చిహ్నంగా నూతన రంగులతో అలంకరించుకుంటున్నారు. గ్రామంలో మంతెన వెంకట్రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంస్య, తామ్ర పత్రాలు పొందిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను అక్కడ చిత్రీకరించారు. అవి నేటికీ దర్శనమిస్తాయి. రాజకీయ పాఠశాల జాతీయస్థాయిలో ప్రప్రథమంగారాజకీయ పాఠశాల నిర్వహించిన ఘనత మంతెనకే దక్కుతుంది. 1938లో ఏర్పాటైన రాజకీయ పాఠశాలను మహాత్మాగాంధీ ప్రారంభించారు. అక్కడ ప్రసంగించిన ఆయన రెండు రోజులపాటు బస చేయడం విశేషం. రాజకీయ పాఠశాలలో నేడు రాజకీయాల్లో ఉద్దండులుగా వెలుగొందిన పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు శిక్షణ పొందారు. వీరిలో అఖిల భారత కమ్యూనిస్ట్ నాయకుడు ఎస్.ఎ. డాండే, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన కమ్యూనిస్ట్ నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మోటూరి హనుమంతరావు, కొండపల్లి సీతారామయ్య, మాకినేని బసవపున్నయ్య, దత్తు మజుందర్, జాతీయ నాయకుడు జయప్రకాష్నారాయణ తో పాటు సీనియర్ పార్లమెంటేరియన్గా పేరుగాంచిన ఆచార్య ఎన్జీ రంగా వంటి ప్రముఖులు ఉన్నారు. -
వేలం కాదిది ముడుపుల మాయాజాలం
గాంధీ సత్రం షాపుల కేటాయింపులో గోల్మాల్ టీడీపీ నేతల అండతో దక్కించుకున్న పాత వ్యాపారులు 22 దుకాణాల దఖలుకు చేతులు మారిన రూ.లక్షలు తుని : సత్యమే ఆయుధమన్న వాడు, లక్ష్యమే కాదు.. దాన్ని సాధించే మార్గమూ స్వచ్ఛంగా ఉండాలన్న వాడు జాతిపిత గాంధీజీ. ఆయన పేరిట ఉన్న సత్రానికి సంబంధించిన దుకాణాల వేలంలోనే పారదర్శకతకు పాతరేశారు అధికార టీడీపీ నేతలు, అధికారులు. బుధవారం జరిగిన వేలం తంతును చూసి అనేకులు ‘ఔరా! మహాత్ముని పేరిట ఉన్న సత్రం మాటున ఎంత మకిలి!’ అని ముక్కున వేలేసుకున్నారు. దేవాదాయ ధర్మాధాయ శాఖ పరిధిలో ఉన్న స్థానిక గాంధీ సత్రానికి 66 దుకాణాలు ఉన్నాయి. వాటి లీజును మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంది. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న యజమానులను ఖాళీ చేయించి బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు వేలం కం టెండర్కు ప్రకటన ఇచ్చారు. బుధవారం ఆ శాఖ ఇన్స్పెక్టర్ డి.సతీష్కుమార్ పర్య వేక్షణలో వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎప్పటి నుంచో ఆ దుకాణాల్లో తిష్టవేసిన వ్యాపారులు బహిరంగ వేలం వేస్తే బయటి వారు వచ్చి హెచ్చుపాటకు పాడతారని భయపడ్డారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించారు. దుకాణాలు వారి చేజారిపోకుండా ఉండేందుకు ఒక్కో షాపునకూ భారీ మొత్తంలో ముడుపులు చెల్లించేందుకు సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు జరగాల్సిన వేలాన్ని అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లోపాయకారీ వ్యవహారాన్ని పసిగట్టిన మీడియా ప్రతినిధులు ఈఓ పులి నారాయణమూర్తిని ప్రశ్నించగా ఉదయం 9 గంటలకే వేల జరిగిపోయిందన్నారు. నోటీసులో 10 గంటలకు జరుగుతుందని ఉండగా ముందే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అయితే అందరూ బయటకు వెళ్లాక తమకు కావాల్సిన వ్యక్తులకు దుకాణాలు కేటాయించేలా వేలం తంతు నడిపించారు. పాత హక్కుదారుల బినామీలకే షాపులను కేటాయించేందుకు రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయని సమాచారం. నిబంధనల మేరకే వేలం : ఈఓ కాగా 66 షాపుల్లో 22 షాపులకు వేలం నిర్వహించామని ఈఓ సాయంత్రం విలేకరులకు తెలిపారు. ప్రసుత్తం ఉన్న అద్దెపై 45 శాతం పెరిగిందన్నారు. ఇంకా 44 దుకాణాలకు వేలం వేయాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే వేలం నిర్వహించామని, ఎలాంటి అవకతవకలకూ తావు లేదని చెప్పారు. అయితే తెర వెనుక ముడుపులతో తంతులా జరిగిన వేలంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, మిగిలిన దుకాణాలకు పారదర్శకంగా వేలం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
అనుక్షణం ఉత్సాహంతో ఉరకలెత్తేవాడే కార్యసాధకుడు
కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఎక్కడెక్కడ రాముడు శోకానికి గురయ్యే సన్నివేశం వస్తుందో అక్కడక్కడ వాల్మీకి మహర్షి అద్భుతమైన శ్లోకాలను మనకు అందించారు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వశుడైపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే... ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు అనిర్వేదోశ్రీయం మూలం, అనిర్వేదపరం సుఖం, అనిర్వేదోహి సతతం, సర్వార్థేషు ప్రవర్తకః ’’ - (నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించకూడదు.) అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. ఇద్దరు ఖైదీలు జైలు ఊచల నుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో కూడా ఆశావాదిగా ఉండాలి. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్కు వెడితే.. ‘‘నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వారు నిరాశావాదానికి గురయ్యారా? లేదే! గాంధీగారు ముందు నడిచివెడుతుంటే అందరూ వెనక నడిచేవారు. ఒకసారి పొట్టి శ్రీరాములుగారు ముందు నడుస్తుంటే.. వెనకన ఉన్న వాళ్ళు అడ్డొచ్చి ‘‘గాంధీగారికంటే ముందు నడుస్తావేంటి, వెనకకురా’’ అన్నారు. గాంధీగారు కల్పించుకుని ‘‘శ్రీరాములు మిగిలిన వాళ్ళలాకాదు, నియమబద్ధమైన జీవితం గడుపుతున్నవాడు. నా కోసమే బతుకుతున్నవాడు. ముందు నడవనీయండి’’ అన్నారు. గాంధీగారు ఏం చెప్పారో దానికోసమే బతికిన శ్రీరాములు గారు చివరకు శరీరత్యాగానికి కూడా వెనకాడలేదు. అంతటి మహానుభావులు వారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వెళ్ళి - ‘‘మిమ్మల్ని జగద్గురు అని సంబోధించాలనుకుంటున్నాం, అలా పిలవవచ్చా?’’ అని విన్నవించుకున్నారు. దానికి ఆయన ‘‘నిరభ్యంతరంగా పిలవవచ్చు. నేను జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే. జగద్గురు అన్నది బహువ్రీహి సమాసం. జగత్తు అంతా గురువుగా కలిగినవాడు - అని కూడా అర్థం. నేను జగత్తుకు గురువును కాదు, ఈ జగత్తు అంతా నాకు గురువు కాబట్టి నేను జగద్గురువునే ’’ అన్నారు. ఇదీ విద్యా దదాతి వినయం అంటే! నేను ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రం చేత విర్రవీగితే నా అంత అహంకారి ఇంకొకడు ఉండడు. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నేను సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. తనకు అన్నీ వచ్చు అని కాదు, రానివెన్నో అనుకోవడం గొప్ప. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాళ్ళు కూడా నాకేమి వచ్చు అని ఆగిపోయారు. ఎందువల్ల ? పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్ని రకాల నేలల గురించి చదివాను. ఎన్నో రకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో’’ అంటాడు. చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఎంత చదువుకున్నా సంస్కారంలేని నాడు, ఆ చదువు పదిమందికి పనికొచ్చేది కాదు. తన తండ్రి ఎటువంటి కష్టాల్లోంచి వచ్చాడో తెలుసుకోవడానికి, చెప్పడానికి సిగ్గుపడే కొడుకు కొడుకే కాదు. తాను ఎన్ని కష్టాలుపడ్డాడో చెప్పుకోవడానికి నామోషీ పడే వ్యక్తి శీలవంతుడు కానే కాదు. నీవు ఎక్కడపుట్టావు, ఎక్కడ పెరిగావు... ఇవి కావు. నీవు దేనిగా మారావు, ఏయే గుణాలు సంతరించుకున్నావు. ఉత్థానపతనాలకు ఎలా ఎదురొడ్డి నిలిచావు, ఎవరు నీకు ఆదర్శం వంటి విషయాలు నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. వెయిటింగ్ లిస్ట్లో నీకు సీటు ఖరారుకాకపోతే, ఒక రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసివస్తే... అయ్యబాబోయ్, నావల్లకాదు అని దిగిపోయినవాడు జీవితంలో మంచి సాధకుడు కాలేడు. అలా దిగిపోకుండా వెళ్ళగలిగినవాడికి అంత ధైర్యం ఎలా వస్తుందంటే... మహాత్ముల జీవితాల నుంచి నేర్చుకున్న పాఠాలతో! -
గాంధీ, నెహ్రూ, వాజేపేయి చేయలేదా?
న్యూఢిల్లీ: ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మాజీ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సందీప్ కుమార్ కు చెందిన ఓ అభ్యంతరకర వీడియో బయటకు రావడంపై శుక్రవారం ఆయన స్పందించారు. సందీప్ చేసింది తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. శృంగారం మానవ లక్షణం అని సందీప్ ను సమర్ధించే ప్రయత్నం చేశారు. సందీప్ వివాదంపై అశుతోష్ తన బ్లాగ్ లో వివరణ ఇచ్చారు. దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సామాజిక బాధ్యతలను మరిచి ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని వివాదాస్పదంగా మాట్లాడారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వాజ్ పేయిలు కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయని చెప్పారు. అయితే వారు రాజకీయంగా ఏ విధంగానూ నష్టపోలేదని అన్నారు. నెహ్రూ తనతో పాటు పనిచేసే మహిళలతో వివాహేతర సంబధాలు కలిగి ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయని చెప్పారు. ఎడ్వినా మౌంట్ బాటెన్ తో నెహ్రూకు ఉన్న అనుబంధం గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగేదని బ్లాగ్ లో రాశారు. 1910లో గాంధీజీ సర్లా చౌదరితో అనుబంధాన్ని పెంచుకున్నారని.. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువని చెప్పారు. సర్లా తన ఆత్మకు భార్య అని గాంధీజీనే స్వయంగా చెప్పారని తెలిపారు. దీంతో సీ రాజగోపాలాచారి మిగిలిన పార్టీ సీనియర్ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకుని గాంధీజీ ఆమెను వదలివేసేలా చేశారని అన్నారు. ఆ తర్వాతి రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకునేందుకు యువతులతో కలిసి గాంధీజీ నిద్రించారని చెప్పారు. నెహ్రూ ఈ విషయంపై గాంధీతో మాట్లాడినా ఆయన వినలేదని తెలిపారు. అటల్ బీహారీ వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలను పాటిస్తూ వివాహం చేసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తాను బ్యాచిలర్ నే కానీ బ్రహ్మచారిని మాత్రం కాదని ఆయనే ప్రకటించారని గుర్తుచేశారు. వాజ్ పేయి బహిరంగంగానే కళాశాల స్నేహితురాలితో కలిసి తిరిగారని.. అప్పుడు ఎవరూ ఆయనకు అడ్డుచెప్పలేదని అన్నారు. సోషలిస్టు లీడర్ రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెస్, చైనీస్ లీడర్ మావో జె డాంగ్ ల జీవితాలను కూడా అశుతోష్ ఉదాహరణగా పేర్కొన్నారు. -
ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి
పల్లిపాడు(ఇందుకూరుపేట) : దక్షిణాఫ్రికాలో అహింసాయుత మార్గంలో గాంధీ చేసిన పోరాటం ఆయనకు దేశంలో మరెన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసెందుకు స్ఫూర్తినిచ్చిందని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి అన్నారు. మండలంలోని పల్లిపాడు పినాకినీ సత్యగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన గాంధీ అధ్యయన తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఉద్యమాల్లో గాంధీ ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో హిందూ, ముస్లింల మధ్య వివాదాలు తొలగించి వారి ఐకత్యకు పాటుపడ్డారన్నారు. తొలుత ఆశ్రమ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ముని సిద్దారెడ్డి, ఆశ్రమ కమిటీ కన్వీనర్ గణేశం కష్ణారెడ్డి, సభ్యులు నారాయణ, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. స్థానిక నాయకులు, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ వారికి గాంధీ విగ్రహం తొలగించటంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులదే ప్రధాన పాత్ర అని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతలకు ఈ ప్రభుత్వం పట్టించిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముణ్ని అర్ధరాత్రి హత్యచేసి మురికినీటిలో పడేయటం దారుణమన్నారు. మూడురోజుల్లో విగ్రహాన్ని నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పటతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాగ్దాద్లో నరమేధం
షాపింగ్ సెంటర్ వద్ద ఆత్మాహుతి దాడి.. 119 మంది మృతి.. 140 మందికిపైగా గాయాలు - రంజాన్ షాపింగ్లో ఘాతుకం - దాడి తామే చేశామన్న ఐసిస్ బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు మళ్లీ దారుణ మారణకాండకు తెగబడ్డారు. ఆదివారం జనసమ్మర్దమున్న వాణిజ్య ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 119 మంది అమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఈ దాడిలో మరో 140 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అమెరికా, ఇరాక్ బలగాలతో పోరులో ఐసిస్ వరుస ఓటములతో భారీగా నష్టపోతున్నా.. ఇలాంటి దాడులకు పాల్పడే శక్తిసామర్థ్యాలు దానికి ఇంకా ఉన్నాయని తాజా నరమేధం హెచ్చరిస్తోంది. జన ం మధ్య ఆత్మాహుతి దాడి.. నగరంలోని కారాదా జిల్లాలో జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ సెంటర్ వెలుపల పేలుడు పదార్థాలున్న కారులో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ వారంలో రానున్న రంజాన్ పర్వదినం కోసం శనివారం అర్ధరాత్రి దాటాక ఉపవాసాలు ముగించుకుని షాపింగ్ కోసం వచ్చిన ప్రజలను బాంబర్ లక్ష్యంగా చేసుకున్నాడు. మృతుల్లో ఎక్కువ మంది బహుళ అంతస్తుల షాపింగ్, వినోదాల మాల్లో బలైన వారేనని పోలీసులు చెప్పారు. వీరిలో కొందరు మంటల్లో కాలిపోయి, కొందరు పొగతో ఊపిరాడక చనిపోయారని వెల్లడించారు. షాపింగ్ సెంటర్, చుట్టుపక్కల దుకాణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వాహనాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. మంటలు, పొగ, శిథిలాలు, మృతదేహాలు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. ఆదివారం పొద్దుపోయాక కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ కనిపించారు. షియాల లక్ష్యంగా దాడి: ఐసిస్ పేలుడు తర్వాత... ఇది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఒక మిలిటెంట్ల వెబ్సైట్లో ప్రకటించింది. తమ భద్రతా ఆపరేషన్లలో భాగంగా షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఒక ఇరాకీ ఈ దాడి చేశాడంది. కాగా, కరాదా పేలుడు జరిగిన కాసేపటికి నగర ఉత్తర ప్రాంతమైన షాబ్లో శక్తిమంతమైన బాంబు పేలింది. ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. ఈ దాడి కి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన వెలువడలేదు. బాగ్దాద్కు 50 కి.మీ దూరంలో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాక్ ప్రభుత్వ బలగాలు వారం కిందట ఐసిస్ నుంచి తిరిగి చేజిక్కించుకున్న నేపథ్యంలో కరాదా దాడి జరిగింది. ఇరాక్లో ఈ ఏడాదిలో ఉగ్రవాదులు భారీ మారణహోమానికి పాల్పడడం ఇది రెండోసారి. మే నెల 11న బాగ్దాద్లో ఐసిస్ మూడు చోట్ల జరిపిన కారు బాంబు దాడుల్లో 93 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఇరాక్లో మోసుల్ నగరం ఒక్కటే ఐసిస్ అధీనంలో ఉంది. ఘటనా స్థలానికి ప్రధాని.. కరాదా షాపింగ్ ప్రాంతాన్ని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ, ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించి తీరతామన్నారు. అక్కడ గుమికూడిన జనం ‘అబాదీ దొంగ‘ అంటూ నినాదాలు చేశారు. భూకంపం అనుకున్నా.. ‘మొదట భూకంపం వచ్చిందేమో అనుకున్నా. నా సరుకులను మూటగట్టుకుని ఇంటికి వెళ్తుండగా భారీ శబ్దంతో మంటలు కనిపించాయి. వెనక్కి వెళ్దామంటే భయమేసింది. నా స్నేహితులకు ఫోన్ చేశాను. కానీ ఎవరి నుంచీ జవాబు రాలేదు. వారిలో ఒకతను చనిపోగా, మరొకతను గాయపడ్డాడు. ఒకరు గల్లంతయ్యాడు’ అని కరాదా పేలుడు సాక్షి, వ్యాపారి కరీం సమీ చెప్పాడు. తన కుటుంబం నడుపుతున్న షాపులో ఆరుగురు ఉద్యోగులు చనిపోయారని హుసేన్ అలీ అనే సైనికుడు చెప్పాడు. ‘నేను మళ్లీ యుద్ధానికి వెళ్తాను. అక్కడైనా శత్రువు ఎవరో తెలుసుకుని పోరాడతాను. ఇక్కడ ఎవరితో పోరాడాలో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నాడు. సోనియా సంతాపం బాగ్దాద్ బాంబు పేలుళ్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించి, బాధితులకు సంతాపం తెలిపారు. గత వారం మానవతకు భయోత్పాతంగా గడిచిందని ఈ దాడులను, బంగ్లా రాజధాని ఢాకాలో ఓ హోటల్పై ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. -
థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది. ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు. 'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హింసకు దారి తీసిన (వాట్సాప్) సోనియాగాంధీ ఫోటో..
జబల్పూర్ః కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటో వాట్సాప్ లో కనిపించడం హింసాత్మకంగా మారింది. పోలీస్టేషన్ కు చేరిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చినికి చినికి గాలివానై ఒకరి మృతికి కారణమవ్వడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడేట్టు చేసింది. జబల్పూర్ లో రెండు వాట్సాప్ వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి చెందిన ఓ అభ్యంతర కర ఫోటోను వాట్సాప్ మెసెంజెర్ గ్రూప్ లో పోస్టు చేయడంతో అసలు వివాదం ప్రారంభమైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి చనిపోగా, తీవ్ర గాయాలైన ఉమేష్ వర్మ అనే వ్యక్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఏరియా సిటీ ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ తెలిపారు. తాము ఫిర్యాదు చేసేందుకు విజయనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసమయానికి ప్రత్యర్థి బృందం తమపై కత్తులతో దాడి చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ఆరోపించారు. విజయ నగర్ ఫ్రెండ్స్ పేరిట రాజ్.. తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు వీలుగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. కాగా ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి ఆ గ్రూప్ లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్లుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమన్నట్లుగా అర్థం వచ్చే ఓ క్యాప్షన్ కూడ పెట్టడం అసలు వివాదానికి తెరలేపింది. గత రాత్రి అహింసా చౌక్ లో ఇరువర్గాల సభ్యులు కలుసుకొని ఫోటో పోస్టు చేయడంపై తీవ్రంగా వాదించుకోవడం కూడ జరిగింది. అదే సమయంలో అక్కడికి చేరిన పోలీసులు వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇరువర్గాల సభ్యులను పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచారు. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరిన వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకోవడంతోపాటు, దాడులకు దిగడంతో ఉమేష్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయని, అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ బృందంలోని సభ్యుడైన అనిమేష్ ఆరోపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఆ గొడవ పోలీస్ స్టేషన్ లో జరగలేదని, ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కు వచ్చే దారిలోనే గొడవ జరిగిందని సీఎస్పీ బల్సావర్ చెప్తుండగా... పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెడితే అసలు నిజం బయట పడుతుందని అనిమేష్ డిమాండ్ చేస్తున్నాడు. ఇరు వర్గాలపైనా కేసు నమోదు చేశారని, తదుపరి దర్యాప్తు జరుగుతున్నట్లు కొద్దిపాటి గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది నాయక్ తెలిపారు. -
మహిళా జర్నలిస్టులతో మనేకా గాంధీ భేటీ
మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఆ మంత్రిత్వ శాఖ.. దేశంలోని సుమారు 250 మంది మహిళా జర్నలిస్టులతో సమావేశమైంది. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించడంతో పాటు అభివృద్ధికి చేపట్టాల్సిన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆహ్వానించింది. ఉమెన్ జర్నలిస్ట్ వర్క్ షాప్ పేరిట న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శిశు సంక్షేమశాఖ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా జర్నలిస్టులతో అభివృద్ధిపై ముచ్చటించిన కేంద్ర మంత్రి మనేకా గాంధీ... జర్నలిస్టుల సలహాలను, సూచనలను కోరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన కార్యక్రమానికి దేశంలోని సుమారు 30 రాష్ట్రాలు, మూడు వేర్వేరు మాధ్యమాల నుంచి 250 మంది దాకా మహిళా పాత్రికేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సమస్యలు, పనిచేసే చోట మహిళల పరిస్థితి వంటి అనేక విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో మనేకా గాంధీ... మహిళలు, పిల్లల సమస్యలపై వివరణాత్మక మెళకువలను అందించడంతోపాటు... జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చిన సమస్యలపై స్పందించారు. వివిధ శాఖల ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, బాలల హక్కుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పాత్రికేయుల అభిప్రాయాలను కోరారు. ఈ సందర్భంలో జర్నలిస్టులు ఇప్పటికే దేశంలో ప్రబలంగా ఉన్న 'విచ్ హంట్', 'నట పరాటా' వంటి సమస్యలను వెలుగులోకి తేగా... ఇటువంటి తీవ్రమైన ఆచారాలను, వివక్షతను నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చివరి నిమిషంలో పేషెంట్లను ఆస్పత్రికి తీసుకొచ్చే పరిస్థితులు, రక్తమార్పిడి వల్ల హెచ్ఐవీ సోకిన సంఘటనలను మహిళా జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా సబల వంటి ప్రణాళికలతో డబ్ల్యూసీడీ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలను మనేకా గాంధీ పాత్రికేయులకు వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి కావలసిన సహకారం అందించడం, డ్రాపవుట్స్ ను నిర్మూలించడం వారిలో మరింత అవగాహన పెంచడం అవసరమన్న ఆమె... మొదటిసారి అసోంలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు షెల్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్... డబ్ల్యూసీడీ సాధించిన విజయాలను మహిళా జర్నలిస్టులకు వివరించారు. ఉజ్జ్వల్ యోజన, ధన్ వికాస్ వంటి వివిధ పథకాలను వివరిస్తూ... వాటిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వాటి వినియోగంపై జనంలో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా నిర్మలా తెలిపారు. -
గాంధీ పాఠ్యాంశాలు తొలగించిన త్రిపుర బోర్డు
అగర్తల: ఇటీవల రాజస్థాన్ ఎడ్యుకేషన్ బోర్డు తమ కరికులం నుంచి నెహ్రూకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించిన విషయం మరువక ముందే ఇప్పుడు త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (టీబీఎస్ఈ) మహాత్మా గాంధీ్కి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తోమ్మిదో తరగతి సెలబస్ లో గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కమ్మూనిష్ట్ ప్రభత్వం ఉన్న ఈ రాష్ట్రంలో కారల్ మార్క్స్, అడాల్ఫ్ హిట్లర్, సోవియట్ , ప్రెంచ్ విప్లవాలు, క్రికెట్ పుట్టుక ఇంకా చాలా పాఠ్యాంశాలున్నాయి. కానీ భారత జాతీయోధ్యమానికి సంబంధించిన విషయాలు లేవని త్రిపుర హిస్టరీ సొసైటీ మెంబర్ సంతోష్ షా తెలిపారు. దీనిపై స్పందించిన టీబీఎస్ఈ బోర్డు చైర్మన్ మిహిర్ దెబ్ తాము సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారమే పాఠ్యాంశాలను రూపొందించినట్టు తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. -
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది. యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్ ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది. -
సోనియాతో వీహెచ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని శనివారం ఆమె నివాసంలో కలిశారు. వచ్చే జూన్లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లి సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో ఓబీసీ రిజర్వేషన్లపై పోరాడానని, పదవిలో ఉన్నా, లేకున్నా బీసీల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తానని వివరించారు. పార్టీ అభివృద్ధి కోసం ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లపై పోరాడతానని చెప్పారు. వీహెచ్ వెంట భార్య చంద్రకళ, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
చచ్చేంత చావు
మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కాని... బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతుంటే చూడలేకపోతున్నాం! స్వతంత్య్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్.. అన్న ఆకలిరాజ్యం సినిమా పాట మానవత్వంలేని ఆకలిని సజీవంగా ఉంచింది! ధార్మిక ఆలోచనలు ఉన్న చాలామంది నమ్మే విషయం.. మనిషి పోయినా ఆ మనిషి ఆనవాళ్లు ప్రేమరూపంలో, ఎనర్జీ రూపంలో మనవెంటే ఉంటాయని! ఈ కథనం వాస్తవం! మన కళ్లముందే జరిగిన డబ్బు మాయ! తల్లి చావు వార్త అందరికీ తెలిస్తే ఖర్చు భరించలేమని గోప్యంగా ఖననం చేసిన కొడుకు కథ! తప్పు ఆ కొడుకుదా? తప్పొప్పులు ఖాయం చేసే వ్యవస్థదా? లేక అమ్మ ప్రేమని కూడా అమ్మేసే డబ్బుదా?మట్టిలో గింజ పెడితే చెట్టవుతుంది! కానీ ఈ చెట్టంత కొడుకు కాసుల కోసం చేసిన నిర్వాకం అందరినీ విస్మయపరిచింది! అమ్మలకు బతకడమే చావై పోయిన ఈ రోజుల్లో చావు.. మానవత్వం చచ్చినంత చావైంది! కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీజీ తన జీవితంలో ఏనాడూ డబ్బును ఆశించలేదు. కాని ఆయన బొమ్మ ఉన్న ఆ నోట్లను మాత్రం ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉన్నారు. ఉంటారు. ఆదర్శం కంటే అణా పైసలకే ఎక్కువ విలువ ఉన్న రోజులు వచ్చాయి. బంధాలను వెల కట్టలేము అనుకునే రోజులు పోయి ‘వెల’ను బట్టే బంధాలు మిగుల్చుకునే రోజులు ఏనాడో వచ్చేశాయి. బతికి ఉన్న మనిషి చనిపోయాడని పాలసీ క్లయిమ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడో జరిగితే జనం వింతగా చెప్పుకున్నారు. కాని ఇప్పుడు అలాంటివి కోకొల్లలు. కడుపున పుట్టిన పిల్లలు భారమవుతారని వదిలేసేవాళ్లు కొందరైతే కని పెంచినవారు భారమవుతారని వదిలేసేవాళ్లు మరికొందరు. డబ్బు పాపిష్టిది అని తెలిసినా పాపిష్టి పనులు చేయడానికి సిద్ధపడేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. కొద్దిపాటి డబ్బుల కోసం చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం చైన్ స్నాచర్లుగా, కిడ్నాపర్లుగా, దోపిడీ దొంగలుగా మారుతున్న చదువుకున్న యువకులను చూస్తుంటే ఆందోళనగా ఆనిపిస్తుంది. డబ్బు సహాయం ఎక్కడ చేయాల్సి వస్తుందోనని ప్రాణ స్నేహాలను వదలుకునేవారు కొద్ది పాటి డబ్బుల్లో తేడా వస్తే ప్రాణస్నేహితులను కడతేర్చేవారు నిత్యం కనిపిస్తున్నారు. పూర్వికులు ‘పైసా మే పరమాత్మ హై’ అన్నారు తప్ప ‘పైసా హీ పరమాత్మా హై’ అనలేదు. సాటి మనిషిలో పరమాత్ముణ్ణి చూస్తే బంధాలు అనుబంధాలు మనిషితనం మిగులుతాయి. రూపాయిలో దేవుడున్నాడనుకుంటే ఇదిగో ఇలాంటి ఘటనలే జరుగుతాయి. వరంగల్జిల్లా, భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ నివాసి.. కట్కూరి శ్రీనివాస్. సింగరేణి సివిల్ ఆఫీస్లో ఉద్యోగం. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లు. తల్లి కట్కూరి మల్లమ్మ. ఎనభై ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతోంది. నలుగురు కొడుకులు మూడు నెలలకొకరు చొప్పున తల్లి బాగోగుల బాధ్యతను పంచుకున్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీనివాస్ మూడు నెలల కిందట కరీంనగర్జిల్లాలోని గోదావరిఖనిలో ఉంటున్న తన తమ్ముడు కృష్ణ దగ్గర్నుంచి తల్లిని భూపాలపల్లికి తీసుకొచ్చాడు. మొన్న శుక్రవారం (ఒకటవ తేదీ )ఉదయం మల్లమ్మ పెద్ద కూతురు బల్ల సరస్వతి తల్లిని చూడడానికి సోదరుడు శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. తల్లితో మంచిచెడు మాట్లాడి ఆమెకు పళ్లరసాన్ని తాగించి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. అదే రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మల్లమ్మ మరణించింది. తల్లి మరణ వార్తను ఊళ్లోనే బంధువుల ఇంట్లో ఉన్న అక్కకు కానీ మిగిలిన తోబుట్టువులకు కానీ తెలియపర్చలేదు శ్రీనివాస్. తెలియపర్చకపోగా అప్పటికప్పుడు ఓ టాటా ఏస్ ప్యాసింజర్ వాహనాన్ని తీసుకొని వచ్చి భార్య కృష్ణవేణి సహాయంతో తల్లి మృతదేహాన్ని కెటికె 2వ గని దగ్గరున్న శ్మశాన వాటికకు తీసుకెళ్ళాడు. మృతదేహాన్ని ఖననం చేశాడు. బంధువుల ఇంటికి వెళ్ళిన సరస్వతి సుమారు 6 గంటల సమయంలో తిరిగి శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగింది. వాళ్లు ‘మీ అమ్మ చనిపోయింది. మీ తమ్ముడు, మరదలు కలిసి శవాన్ని ఖననం చేయడానికి వెళ్లారు’ అని చెప్పారు. ఆ మాటలకు సరస్వతి అవాక్కయింది. ఏడుస్తూ పోలీస్స్టేషన్కు వెళ్లి తమ్ముడు శ్రీనివాస్, మరదలు కృష్ణవేణిపై ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణంపై అనుమానం ఉందని, దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు ఎస్సై గణపతి నరేష్ కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్ను విచారించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్ళి స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టమ్ నివేదికలో మల్లమ్మది సహజ మరణమనే తేలింది. అంత్యక్రియల ఖర్చులకు భయపడేనా.. ? కొంతకాలంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో శ్రీనివాస్కు విభేదాలున్నాయట. ఇంతలోకే తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియలు, కర్మకాండల ఖర్చులు తానే భరించాల్సి వస్తుందని భావించిన శ్రీనివాస్ ఆమె మరణవార్తను గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. - పి రవిభాస్కర్ సోషల్స్టిగ్మా గురించి బాధపడక్కర్లేదు కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులను ఓదార్చి, వాళ్లకు కొంత స్వాంతన ఇవ్వడం ఓ ఆనవాయితీ, ఆచారం. అయితే మారిన కాలంలో ఇవన్నీ ఓ భారంగా మారాయి. నిజానికి పదమూడు రోజుల పండగలాంటివన్నీ కొంతమందికి పనికల్పించే కట్టుబాటు, ఏర్పాటు. పోయిన మనిషిని కనీసం యేడాదికి ఒక్కసారన్నా స్మరించుకోవాలని చేసిన ఏర్పాట్లే తద్దినాలు, శ్రాద్ధాలు. కానీ ఇవన్నీ ఇప్పుడు దిగువమధ్యతరగతి వాళ్లకు ఆర్థికభారంగా పరిణమించాయి. అనారోగ్యంతో చనిపోతే బతికున్నవాళ్లకు మరీ కష్టం. ఆ మనిషికైన ఆసుపత్రి ఖర్చు అప్పటికే ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి ఉంటుంది. చనిపోయాక కర్మకాండల పేరుతో జరిగే తంతు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు మారిన ఈ కాలంలో పరామర్శ, ఓదార్పుల పేరుతో ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. ఫోన్లు వచ్చాయి. సోషల్నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంది. అందులో ఓ మెసేజ్ పెడితే చాలు. ఫోన్చేసి పలకరిస్తే చాలు. లోయర్మిడిల్ క్లాస్ కూడా అయ్యో చెప్పకపోతే.. పిలవకపోతే ఎవరు ఏమనుకుంటారో.. అనే సోషల్స్టిగ్మా గురించి భయపడక్కర్లేదు.. బాధపడక్కర్లేదు. అంత్యక్రియలు, కర్మకాండల పేరుతో వేలకువేలు ఖర్చుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. - యండమూరి వీరేంద్రనాథ్. కుటుంబ సభ్యులకైనా చెప్పాల్సింది శ్రీనివాస్ వాళ్లమ్మ మరణవార్తను గుప్తంగా ఉంచి, మూడోకంటికి తెలియకుండా అంత్యక్రియలు జరిపించడానికి తోబుట్టువులతో ఉన్న మనస్పర్థలే కారణమని తేలింది. ఎన్ని స్పర్థలున్నా తన దగ్గరున్నప్పుడు తల్లి చనిపోతే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎందుకంటే వాళ్లకూ ఆమె తల్లే కదా! తల్లిని చివరిచూపు చూసుకోవాల్సిన హక్కు వాళ్లకూ ఉంటుంది కదా! ఒకవేళ అంత్యక్రియలు, కర్మకాండలు ఆయనకు భారవమవుతాయన్న భావనే ఉంటే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పి కన్విన్స్ చేయాల్సింది. తలా కొంచెం ఆ బాధ్యతను పంచుకునేలా వాళ్లను ఒప్పించాల్సింది. ఇవేవీ లేకుండా.. తల్లి మరణవార్తనే గోప్యంగా ఉంచడమనేది కరెక్ట్ కాదు. - డాక్టర్ నాగలక్ష్మి.జి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
ప్రత్యేక హోదా సాధిద్దాం
♦ పార్లమెంటు లోపల, బయటా పోరాడతాం ♦ ఏపీసీసీ నేతలతో సోనియా ♦ కాంగ్రెస్ కష్టం వృథా కాదన్న రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడి సాధిద్దామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వం లో 300 మందితో కూడిన ప్రతినిధి బృందం ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా కోటి సంతకాల సేకరణను, 13 జిల్లాల్లో మట్టి, నీళ్లను సేకరించి ఢిల్లీకి తెచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం వీటిని ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రదర్శించారు. కోటి సంతకాల జాబితాలో సోనియా, మన్మోహన్సింగ్, రాహుల్గాంధీ సంతకాలు చేశారు. సోనియా మాట్లాడుతూ.. ‘ముందుగా లెమాటి వెంకయ్య (గుండెపోటుతో మృతి చెందిన చలోఢిల్లీ బృందంలోని సభ్యుడు) కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నా. ప్రత్యేక హోదా సాధనకు మీరు కోటి సంతకాల సేకరణ, మట్టి, నీళ్లు సేకరించి తీసుకొచ్చి పోరాడుతున్న తీరుకు అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పన్ను రాయితీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అనేక అంశాల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేయాల్సిందిపోయి అనిశ్చితిలో పడేసింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నాయి. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ప్రకటన చేస్తారనుకుంటే ఏపీకి నీళ్లు, మట్టి ఇవ్వడం బాధాకరం. మేమంతా మీవెంట ఉంటాం. పార్లమెంటులోనూ, వెలుపలా పోరాడుదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం..’ అని పేర్కొన్నారు. హామీలు నెరవేరేంతవరకు పోరాడుదాం.. ఏపీ ప్రజలకు విభజన చట్టం హామీలతోపాటు నాడు రాజ్యసభలో తానిచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కోరారు. ఆనాడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. హోదా వచ్చే వరకూ పోరాడుదామని, విభజన హామీలు నెరవేరే దాకా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఏపీభవన్ వద్ద ధర్నా.. ఏఐసీసీలో అగ్రనేతలతో సమావేశం అనంతరం రఘువీరారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు కనుమూరి బాపిరాజు, చింతామోహన్, రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంత్కుమార్, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, కొండ్రు మురళీ, మండలిలో కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య, మహిళా నేత సుంకర పద్మశ్రీ తదితరులతో కూడిన 300 మంది నేతల బృందం ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించింది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. అనంతరం నేతలను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు వీధిలోని స్టేషన్కు తీసుకెళ్లి సాయంత్రం వదిలిపెట్టారు. నేతల బృందం సాయంత్రం ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని కలిసింది. ప్రత్యేక హోదా అమలు చేసేలా కేంద్రానికి సూచించాలని విన్నవించింది. కాంగ్రెస్ కృషి వృథా కాదు : రాహుల్ కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల క్రితం పెద్దమార్పు చోటు చేసుకుంది. నాటి ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏపీకి అండగా ఉంటామన్నాం. కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాయపడడం లేదు. స్పెషల్ స్టేటస్ కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు నేను కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చాను. కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదు’ అని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్తో గోపీనాథ్, గాంధీల భేటీ
నేడు సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీ టీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్, గాంధీ సీఎం కేసీఆర్తో మరోమారు భేటీ అయ్యారు. కాగా, వీరిద్దరూ శుక్రవారం సీఎం సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ‘సీఎం వీరిద్దరినీ శుక్రవారం మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే వారు సాదాసీదాగా సీఎం అధికార నివాసంలో చేరుతారా? లేక తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట చేసి పార్టీలోకి వస్తారా అన్న విషయంపై చర్చిస్తారు..’ అని పార్టీ వర్గాలు చెప్పాయి. -
ఆ మాట రవీంద్రుడిదే
మోహన్దాస్ గాంధీకి ‘మహాత్మ’ అన్న బిరుదు ఇచ్చినదెవరు? నిస్సందేహంగా విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరేనని గుజరాత్ హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పు చెప్పింది. ఈ విషయం చిన్న తరగతుల పాఠ్య గ్రంథాలలోనే ఉందనీ, నిజానికి ఈ విషయాన్ని జాతికి తెలియచేసిన ఘనత వాటిదేననీ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జేబీ పార్దివాలా తీర్పు చెప్పారు. రాజ్కోట్ జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో గాంధీజీని మహాత్మ అని మొదట పిలిచినవారు ఒక పత్రికా రచయిత అని పేర్కొంది. దీని మీద సంధ్యా మారు అనే యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంతో మహాత్మ అని గాంధీజీని మొదట పిలిచినవారు రవీంద్రులేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ సంధిగ్ధం తొలగిపోయినందుకు సంతోషిద్దాం. -
గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్లది ఏకాభ్రిపాయం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్లకు వేర్వేరు సైద్దాంతిక భావాలున్నా... దేశ పురోగతిపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉండేవారని సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు విశ్వనాథ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సెమినార్లో ప్రసంగిస్తూ... భావజాలాలపై చర్చించుకునేవారని, దేశాభివృద్ధి విషయంలో ఉమ్మడి లక్ష్యంతో సాగేవారని ఆయన గుర్తు చేశారు. -
గాంధీ యాత్ర చిరకాలం గుర్తుంటుంది
జోహన్నెస్బర్గ్: తమ జీవితంలో గాంధీ మెమోరియల్ యాత్ర చిరకాలం గుర్తిండిపోతుందని భారత చిన్నారులు తెలిపారు. మహాత్మగాంధీ జీవితంపై కేరళలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన చిన్నారుల్ని దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివసించిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి భారత కాన్సుల్ జనరల్ రణ్ధీర్ జైస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిన్నారులు మాట్లాడారు. ఈ యాత్ర తన లో బాగా మార్పును తీసుకు వచ్చిందని, గాంధీజీ ఆచరించిన విలువల్ని తాను ఇక నుంచి పాటిస్తానని క్రిస్ ల్యూక్ అనే చిన్నారి పేర్కొన్నాడు. మరోవైపు ఆనాటితో పోలిస్తే ఈ రోజుల్లో సమాజంలో మార్పు వచ్చిందని, కానీ గాంధేయ విలువలు ఆదర్శంగా ఉన్నాయని స్వాతి అనే మరో చిన్నారి పేర్కొంది. ఈ యాత్రలో గాంధీ మునిమనవ రాళ్లు ఈలా గాంధీ, కీర్తి మీనన్ను కలుసు కున్నారు. అలాగే డర్బన్లో గాంధీ నిర్వహించిన ఫీనిక్స్ ఆశ్రమాన్ని విద్యార్థులు సందర్శించారు. -
గాంధీనగర్ బస్తీ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్
-
మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
-
స్వీయాతిశయ యశోభూషణులు
జాతిహితం జాతీయ రాజకీయాలను శాసించే ఆ ముగ్గురూ తమకు తామే గొప్పవారమనే దృష్టితో ప్రత్యర్థుల పట్ల తీవ్ర తృణీకారంతో, శత్రుత్వంతో ఉండటం సాధారణమైంది. రాహుల్ వివేకశూన్యుడని, చెడిపోయిన పిల్లాడనీ, కేజ్రీవాల్ను రభస సృష్టించే అరాచకవాదనీ మోదీ భావిస్తారు. మోదీని హిందూ ఉన్మాదనీ, తన కుటుంబ హక్కయిన అధికారాన్ని దోచుకున్న వ్యక్తనీ రాహుల్ భావిస్తారు. మోదీ, రాహుల్లు దొంగల ముఠాల నేతలనీ, జైళ్లలో ఉండాల్సినవారనీ కేజ్రీవాల్ భావిస్తారు. ఫలితం, అత్యంత విచ్ఛిన్నకర రాజకీయాలు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్లు ముగ్గురినీ ఒకే గాటన కట్టి చూపే వాదన ఇది. ముగ్గురూ పూర్తి భిన్నమైన వ్యక్తులు. అయితే వారిలో ఒకే అసాధారణమైన, ముఖ్య సాధారణ విలక్షణత ఉంది. వారిలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రథమ పురుషలో సంబోధించుకుంటూ ఉంటారు. 2014 ఎన్నికల ప్రచారానికి ముంద టి, తర్వాతి మోదీ ఉపన్యా సాలను మరోసారి విని చూడండి. మోదీ ఇది చేయడు లేదా ఇది మోదీ మాత్రమే చేస్తాడు అనడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఇక కేజ్రీవాల్ ఈ విద్యలో ఆరితేరిన వారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘‘కేజ్రీవాల్’’ మాత్రమే ఢిల్లీని బాగు చేయగలరు అనేది ఆయన సర్వసాధారణ ప్రయోగంగా ఉండేది. వాస్తవానికి ఆయన ఢిల్లీలోని ఒక కిక్కిరిసిన ఒక పేద మురికివాడలోని బహిరంగసభలో తనను తాను ‘‘కేజ్రీవాల్’’ అని మూడుసార్లు సంబోధిం చుకున్నారు. అంతేకాదు, బీజేపీ వారి పిల్లలు కూడా ఆకలి కడుపులతో నిద్రించాల్సి వస్తోందని తనకు తెలుసనీ, ‘‘కేజ్రీవాల్ మాత్రమే వారి సమస్యలను పరిష్కరించగలడు’’ కాబట్టి ఆప్లో చేరిపోవాలనీ వారికి చెప్పారు. గత వారం రాహుల్ షకుర్బస్తీ మురికివాడ కూల్చివేత నిర్వాసితు లతో మాట్లాడుతూ.. ఈసారి ఏ మురికివాడను కూలదోయడానికి వచ్చినా వెంటనే ‘‘రాహుల్గాంధీ’’ని పిలవండి, ‘‘ఆయన (‘నేను’ కాదు) ఇక ఏ మురికివాడనూ నిర్మూలించనివ్వరు’’. ‘ప్రథమ’తోటే చిక్కులు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్రధారులు ముగ్గురూ ఇలా తమను తాము ప్రథమ పురుషలో తమ గొప్పదనాన్ని తామే అతిశయింపజేసుకుని సంబో ధించుకోవడం ఆశ్చర్యకరమైన కాకతాళీయత. గతంలో, కనీసం దాదాపు గత నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఇది ఎక్కడా ఎరుగనిదనేది నిస్సందేహం. ఇందిర, రాజీవ్, వీపీ సింగ్, వాజ్పేయీ, అద్వానీ, సోనియా, అంతా ప్రజా దరణగల నేతలే. అయినా వారెవరూ ఇలా ఎన్నడూ మాట్లాడలేదు. నెహ్రూ, గాంధీలూ మాట్లాడలేదు. వాజ్పేయీ ఒకే ఒక్క సందర్భంలో అలాంటి ప్రథమ పురుష ప్రయోగం చేశారు. అదీ కూడా ఆయన తనను తాను తప్పు పట్టుకునే విధంగానే అన్నారు. కార్గిల్ యుద్ధం జరుగుతుండగా ఆయన కార్యాలయం నాకు ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను కలుసుకో డానికి సమయం ఇచ్చింది. కానీ, నేను ఒక గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. నేను ఆయన్ను ఆట పట్టిద్దామని కార్గిల్లో ముమ్మరమైన పోరు సాగుతుండగా పగటి పూట ఎలా నిద్ర పోగలుగుతున్నారన్నాను. పరి హాసం గా, తెచ్చిపెట్టుకున్న అతి గాబరాతో ‘‘అవును, అవును, ఒక రైఫిల్ తెచ్చి ఇవ్వండి, అటల్జీ యుద్ధరంగానికి పోతాడు, దేశానికి ఇప్పుడు జవాన్ల కొరత వచ్చి పడింది!’’అన్నారు. ఆయనెన్నడూ వ్యవహార శైలిలో అలా అనలేదు. తమ గురించి తాము ఇలా ప్రథమ పురుషలో మాట్లాడటం కొత్త పరి ణామం. ఇదేమైనా అహంకారోన్మాదం పెరగడాన్ని సూచిస్తోందా? విచ్ఛిన్న రాజకీయాలకు, పార్లమెంటు పని చేయలేకపోవడానికి సైతం అదే కారణ మా? ఏదేమైనా మన అతి పెద్ద నేతలు ఒకరితో ఒకరు తప్ప ఎక్కడైనా మాట్లాడుతుండే పరిస్థితి నెలకొంది. రాజీ, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. చరిత్ర చారెడు మానసిక రుగ్మత జనరంజక మనస్తత్వశాస్త్రంతో ఉన్న ప్రమాదాలేమిటో నాకు తెలుసు. అయినా ఇది దాన్ని శోధించాల్సిన పరిస్థితి. మిమ్మల్ని మీరు ప్రథమ పురుషలో సంబోధించుకోవడాన్ని ‘‘ఇల్లీయిజం’’ అంటారని కొంత పరిశోధన తదుపరి నాకు తెలిసింది. చరిత్రలో జూలియస్ సీజర్ నుంచి నెపోలియన్ వరకు అక్కడి నుంచి (కొన్నిసార్లు) మార్గరేట్ థాచర్, మన దారాసింగ్ వరకు అలాంటి పదప్రయోగం చేశారు. సాల్వడార్ డాలీ ఒక ఇంటర్వ్యూలో మాత్రమే తన గురించి ప్రథమ పురుషను ఉపయోగించారు. వీరంతా నైపుణ్యంగలవారు, విజయవంతమైన వారు, గొప్ప ప్రాబల్యాన్ని, ప్రాచు ర్యాన్ని పొందినవారు. కానీ వారిలో ఎవరూ హేతుబద్ధమైనవారు, రాజీపడేవారు, సర్దుబాటు స్వభావం గలవారూ కారు. ఆ మూడు లక్షణాలూ నేటి మన చర్చలో కనిపించడం లేదు. ఈ అంశాన్ని శతాబ్దాల తరబడి చర్చిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాన్ని రాజసాన్ని వ్యక్తం చేసే ‘‘మేము’’తో పోలుస్తున్నారు. మార్క్టై్వన్ ఇక్కడా చమత్కారాన్ని వదల్లేదు. ‘‘రాజులు, అధ్యక్షులు, సంపాదకులు, కడుపులో ఏలిక పాము లున్నవారు’’ మాత్రమే సంపాదకీయపరమైన ‘‘మేము’’ అనే పదాన్ని ప్రయోగించే హక్కును కలిగి ఉన్నారన్నాడు. ఈ ప్రత్యేక మానసిక స్థితిని చాలా మంది నిపుణులు విశ్లేషించారు. వాటిలో తాజాది, ఎక్కువగా వర్తించేది బెంగళూరుకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త శ్యామ్భట్ది. ‘టైమ్స్ నౌ’ అర్నాబ్ గోస్వామికి రాహుల్ ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా చర్చకు వచ్చింది. అందులో ఆయన తనను తాను ‘‘రాహుల్ గాంధీ’’ అని సంబోధించుకున్నారు. ఒక సందర్భంలో వరుసగా రెండు వాక్యాల్లో మూడు సార్లన్నారు: ‘‘...రాహుల్గాంధీ ఎవరో, ఏమిటో, రాహుల్ గాంధీ ఉన్న పరిస్థితులేమిటో మీరు కాస్త తెలుసుకోవాలి. ఆ పనిచేస్తే మీకు రాహుల్ గాంధీ దేనికి భయపడతారు, దేనికి భయపడరనే ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది.’’ ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా నన్నిది బాగా ఆకర్షించింది. తనను తాను ప్రథమ పురుషలో సంబోధించుకోవడం (ఇల్లీయిజం అనే దృగంశం) మానసి కపరమైన మౌలిక సమస్యను సూచిస్తుంది... ఇల్లీయిజం తనతో తనకున్న ఇబ్బందికి సూచన... స్వయం మోహితత్వానికి సంబంధించిన గాయాలను తమకు సంబంధించిన కుహనా గొప్పతనంతో తాదాత్మ్యం చెందడం ద్వారా అలాంటివారు రక్షణ పొందుతారు. కాగా వాస్తవంలో వారి వ్యక్తిత్వం చాలా దుర్భలమైనది...’’ నేనిక ఈ విషయాన్ని మిగతా మనస్తత్వ శాస్త్రవేత్తల చర్చకు వదిలేస్తాను. పార్లమెంటరీ రాజకీయాలకు ఆవశ్యక లక్షణాలైన మౌలి కమైన నమ్రత, సర్దుబాటుతత్వం ప్రజా జీవితంలోని ప్రముఖులలో లోపిం చడం అనే వాస్తవం మాత్రం రాజకీయంగా వర్తించేది. అలా అతిశయించిన అంతరాత్మ ఉన్న వ్యక్తి, తను తప్పుకావచ్చని అంగీకరిస్తాడని ఆశించలేరు. నేనెప్పుడూ తప్పు కాకపోయినట్టయితే, ఆవతలి వ్యక్తి చెప్పేదానిలోనూ ఏదో సమంజసమైనది ఎలా ఉంటుంది? ‘ఎన్డీటీవీ’ వారి ‘వాక్ ద టాక్’ కార్యక్రమంలో ఎల్కే అద్వానీ నాతో మాట్లాడుతూ (జూన్ 2008), బీజేపీని కాంగ్రెస్ శత్రువుగా చూడటమే ఆ పార్టీతో వ్యవహరించడంలో ఉన్న ఒక ఇబ్బంది అన్నారు. నేడు, ఆ ముగ్గురు నేతలకూ తమ స్వీయ గొప్పదనం (లేదా అభద్రత?) దృష్టి కోణం నుంచి ప్రత్యర్థుల పట్ల విపరీతమైన తృణీకారభావం, క్రూర శత్రుభావమూ సర్వ సాధారణమైపోయాయి. రాహుల్ వివేకశూన్యుడని, చెడిపోయిన పిల్లాడనీ, కేజ్రీవాల్ను రభస సృష్టించే అరాచకవాదనీ మోదీ భావిస్తారు. రాహుల్, మోదీని హిందూ ఉన్మాదనీ, తన కుటుంబ గుత్త హక్కయిన గుజరాత్ను చేజి క్కించేసుకోవడమే గాక జాతీయాధికారాన్ని సైతం దోచుకున్న వ్యక్తనీ భావిస్తారు. ఇక కేజ్రీవాల్... మోదీ, రాహుల్లు ఇద్దరూ దొంగల ముఠాల నేతలనీ, వారంతా జైళ్లలో ఉండాల్సినవారనీ భావిస్తారు. ముగ్గురిదీ ఫ్యూడల్ మనస్తత్వమే ఫలితం, ఇటీవలి చరిత్రలోనే అత్యంత విచ్ఛిన్నకరమైన నేటి రాజకీయాలు. పీవీ నరసింహారావు మైనారిటీలో ఉంటూ ఐదేళ్లు సాగించిన పాలనలో చట్టాలు ఆమోదం పొందాయి. వీపీ సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ల దినదిన గండం ప్రభుత్వాలూ చట్టాలు ఆమోదం పొందాయి. నేడు లోక్సభలో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా చట్టాలు చేయలేకపోతున్నాం. సంఖ్యల సంగతి ఎలా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ప్రతిపక్షం ఉంటుందని అంగీకరించే విశాల హృదయం ఆ పార్టీ నాయకత్వానికి లేకపోవడమే అందుకు కారణం. గెలిచినవారిదే అంతా అనేది ప్యూడల్ మనస్తత్వం. ఆ కారణంగానే బీజేపీ, కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష నాయక హోదాను నిరాక రించింది. అలాగే, రాహుల్ కాంగ్రెస్ కూడా ప్రజాభిప్రాయం బీజేపీకి లోక్సభలో 282 సీట్లను కట్టబెట్టి, తన సొంత బలాన్ని 44 లేదా 45కు కుదిం చిందన్న తర్కాన్ని గౌరవించడమూ లేదు, పైగా చాలా తలపొగరుతనాన్నీ ప్రదర్శిస్తోంది. తన బలాన్ని పలు రెట్లు హెచ్చించి చూపే సామాజిక మాధ్యమాలు, టీవీ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల అండతో కేజ్రీవాల్ కూడా ఆ రెండు పార్టీలను అలాంటి తృణీకార దృష్టితోనే చూస్తున్నారు. మరింత సంప్రదాయక కాలంలోనైతే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీవంటి వివేకవంతులు ఎవరైనా జోక్యం చేసుకుని, శాంతి నెలకొనేలా చేయాలంటూ ముగించే వాడిని. కానీ, మన రాజకీయాలను శాసించే ఆ ముగ్గురి వ్యక్తిత్వాలూ ఒకే విధమైనవైన దృష్ట్యా అదిప్పుడు చాలా కష్టమనిపిస్తోంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
'గాంధీ' వైద్య విద్యార్థిని అదృశ్యం
అత్తాపూర్ (రంగారెడ్డి): గాంధీ మెడికల్ కళాశాలలో చదివే ఓ విద్యార్థిని అదృశ్యం అయింది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి వీకర్సెక్షన్ కాలనీకి చెందిన శ్రీనివాసచారీ కుమార్తె విజయలక్ష్మి(25) సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం ఉయదం కళాశాలకు వెళ్లినవిజయలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు తెలిసిన వారితోపాటు బంధువులు, స్నేహితుల్ని విచారించారు. ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'నన్ను జైలులో పెట్టుకోండి'
-
గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..!
సదస్సులో ఆఫ్రికా నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో పలువురు ఆఫ్రికా అగ్ర దేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. భారత్- ఆఫ్రికాల మధ్య సత్సంబంధాలకు ఆ ముగ్గురు నేతలు చేసిన కృషిని, ఆఫ్రికా, ఇండియాల మధ్య చరిత్రాత్మక సంబంధాలను తమ ప్రసంగాల్లో వారు గుర్తు చేశారు. ‘దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా, భారత్లను ఐక్యంగా ఉంచుతున్న బంధాలను, ఆ విషయంలో ఇద్దరు దార్శనిక ప్రధానులైన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పేర్కొన్నారు. 1955లో జరిగిన ప్రఖ్యాత బాండుంగ్ సదస్సులో, అనంతరం అలీనోద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను జుమా గొప్పగా ప్రశంసించారు. ఆఫ్రికా - ఇండియా డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏర్పాటులో, ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో ఇందిరాగాంధీ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అహింసా విధానంలో వలసపాలనకు అంతం పలికే ఉద్యమానికి గాంధీ, నెహ్రూలు నేతృత్వం వహించారని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ను గొప్ప పార్టీగా ముగాబే అభివర్ణించారు. ఆఫ్రికాలో వలస పాలనకు వ్యతిరేకంగా నెహ్రూ, తన తాత కలిసి పనిచేశారని మొరాకో రాజు మొహమ్మద్6 గుర్తు చేశారు. -
మరణం లేని సందేశం
మానవేతిహాసంలో మహాత్ముని స్థానం సర్వోత్కృ ష్టం, మహోన్నతం. మేమాయన్ని గురించి తీర్పు చెప్ప లేనంత అపరిచితులం. మాలో కొందరికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రేమమయమైన, ప్రబల మైన ఆయన ఉన్నత వ్యక్తిత్వ ప్రభావం మాపై చాలా ఉంది. మా ప్రాణంలో ప్రాణంలా సంలీనమై ఉన్న ఆయన్ను మేమిపుడు ఘోరంగా పోగొట్టుకున్నాం. ఆయన లేని మా జీవితాలు దుర్భరం. మా మధ్య పెన వేసుకున్న గాఢానుబంధం కారణంగా ఆయన వ్యక్తి త్వాన్ని వాస్తవంగా వెలగట్టడం కష్టమే అవుతుంది. అం తటి సన్నిహిత సంబంధం లేని ఇతరులు ఆ వినయ శీలియైన శాంతిదూత అంతరంగంలో వెలిగే సజీవ అగ్నిజ్వాల విశేషాన్ని గమనించలేరు. అందుచేత ఆ రెండువర్గాలు ఆయన సమగ్ర వ్యక్తిత్వ నిరూపణలో సంపూర్ణ న్యాయం చేయలేవు. ఈనాటి సమస్యలు, సంఘర్షణలు ప్రధాన విషయాలైనప్పుడు భవిష్యత్తులో చరిత్రకారులకు అటువంటి మనోనేత్రం ప్రధానం అవు తుందేమో, నాకు తెలియదు. సమీప భవిష్యత్తులో మాదిరిగానే, భవిష్యత్తులో సయితం ఈ సమున్నత మూర్తి ఘనమైన మర్యాదామన్ననలను అందుకోగల డనటంలో నాకు లవలేశం అనుమానం లేదు. ఆయన ప్రవచించిన సందేశ మాధుర్యాన్ని ఈనాటి కంటే రేపటి తరమే అధికంగా ఆస్వాదిస్తుంది, ఆచరిస్తుంది. ఆ సం దేశం ప్రత్యేకించి ఒక దేశానికో, ఒక వర్గానికో సంబం ధించినది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలకూ, మాన వాళి మొత్తానికీ ఈ సత్య సందేశం అన్వయిస్తుంది. బాపూజీ తన కాలంనాటి భారతదేశానికి సంబంధిం చిన కొన్ని అంశాలకు అన్వయించి సత్యాన్ని ఉద్ఘాటించి ఉండవచ్చు. కాలమాన పరిస్థితులననుసరించి మార్పు లు సహజం. నాటి ప్రత్యేక అంశాల ప్రాధాన్యం క్రమం గా తగ్గిపోవచ్చు. కానీ మహాత్ముని సందేశ సారం దేశ, కాలాతీతమై విరాజిల్లుతుంది. తత్ఫలితంగా మానవు డిని అర్థం చేసుకోవడంలో బాపూ సందేశం కీలకాంశ మవుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించే క్రమంలో ఆ సమయానికి అవసరమైన అనేక విషయాలను బాపూ బోధించారు. భయాన్నీ, ద్వేషాన్నీ పరిత్యజించ మన్నారు. సమైక్యత, సమత్వం, సౌభ్రాత్రం గురించీ, అణగారిన పేద జన సముద్ధరణ గురించీ, శ్రమకు ఉన్న గౌరవం, ఆత్మ ఔన్నత్యాలను గురించీ మనకు విశదీక రించారాయన. సత్యమే దైవమనీ, దైవమే సత్యమనీ పదే పదే ఉద్ఘోషించారు. నాయకుడైనవాడు ప్రజలను నడిపించేవాడే కాదు. కొందరు ఆధునికుల ఆలోచన ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అతడు తలవంచి నడవవలసి ఉంటుంది. అలా వంచని వాడు నేత కాలేడు. మానవాభివృద్ధికి సరైన ప్రగతిపథంలో అనుచరగణాన్ని ఎక్కువ దూరం నడిపించలేడు. తన అభీష్టాన్ని అనుసరించి ఒంటరిగా క్రియాశీలి అయితే తాను నడిపించే అనుచరులకే తాను దూరంకాక తప్ప దు. తన సహచరులు కోరుకునే స్థాయికి తనను తాను దిగజార్చుకుంటే తన ఆదర్శాన్ని తానే ఒమ్ము చేసినట్టు. తాను నమ్మిన సత్యంతో సమాధానపడినట్లవుతుంది. ఆ విధంగా సత్యంతో రాజీపడడం ప్రారంభిస్తే ఇక వాటికి ముగింపు ఉండదు. సత్యపథం చేజారిపోతుం ది. అట్టి స్థితిలో అతడేం చేయాలి? అతడు సత్యాన్నో, సత్య పార్శ్వాన్నో గ్రహించడానికి పరిమితం కారాదు. తాను దర్శించిన సత్యకాంతిని ఇతరులు కూడా దర్శిం చేలాగ చేయగల నేతే విజేత. ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో సగటు ప్రజా నాయకుడైనవాడు పరిస్థితులకు అనుగుణంగా తనను తాను చక్కదిద్దుకుంటూ ఉండాలి. తులనాత్మకంగా తక్కువ చెడులో కాలుమోపాలి. అలా సరిపుచ్చుకోక తప్పదు. మహాత్మునిలో మహాద్భుత విషయం ఏమిటంటే, తాను నమ్మిన ఆదర్శాలనూ, భావించిన సత్యాన్నీ సం పూర్ణ రూపంలో ఆవాహనం చేశాడు. అసంఖ్యాక మానవ బిందు సమూహాన్ని సింధు రూపంగా పరివర్త నం గావించాడు. నిష్టాగరిష్టుడే గానీ, లొంగినవాడు మాత్రం కాదు. కాలానుగుణ అవసరానికి కనురెప్ప పాటు లేనివాడు. మార్పు చెందే పరిస్థితులకు అనుగు ణంగా తనను తాను మార్చుకున్నవాడు. తాత్కాలి కమైన ఈ మార్పులూ చేర్పులూ అప్రధానమైనవి. ప్రధానమైన సిద్ధాంతం వరకు ఏమాత్రం చెదరని, బెద రని వెండికొండ మహాత్మాగాంధీ. తాను చెడు అని భావించిన దానితో ఏనాడూ రాజీ పడలేదు. సమస్త భారతజాతిని సమున్నత శిఖారారోహణం గావించడం లో తాత్కాలికంగానైనా విజయం సాధించగలిగారు. చరిత్రలో అదొక మహాద్భుతమైన ఘనకార్యం. ఆ సాధించింది కొనసాగుతుందా? అది సాధించిన ఫలి తాలు కొనసాగుతాయనడంలో అనుమానం లేదు. కాని దాని శిక్షణలో కొంత ప్రతి చర్య ఉంటుంది. కొంత మంది కొన్ని పరిస్థితుల ప్రభావంతో తమ సహజ స్థితి నుంచి ఉచ్ఛస్థితికి చేరినప్పటికీ తిరిగి వెనుకటి స్థితి కంటే తక్కువ స్థితికి దిగజారిపోతారు. మనం ఈరోజు అటువంటి సంఘటననే చూస్తున్నాం. దుఃఖభాజన మైన గాంధీజీ హత్యోదంతంతోనే అట్టి ప్రతిస్పందన మనం చూశాం. గాంధీజీ తన జీవితకాలం మొత్తం ఏ ప్రమాణాలకూ, నైతిక విలువల పరిపోషణకూ అంకిత భావంతో కృషి సాగించాడో; ఆ ప్రమాణాలూ, విలు వలూ ఇలా పతనం కావడాన్ని మించిన విషాదం ఇంకే ముంటుంది? బహుశా ఇది తాత్కాలిక దశ కావచ్చు. ప్రజలు తిరిగి యథాపూర్వ సుస్థితిని చేరుతారు. భారత దేశ ఆత్మ గంభీరమైనది. బాపూ బోధించిన ప్రధాన సూత్రాలు మన జాతీయ జీవితాన్ని పునీతం చేస్తాయ నడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. (1950 దశకంలో డీజీ టెండూల్కర్ రాసిన ‘మహాత్మా’ పుస్తకానికి పండిట్ నెహ్రూ రాసిన పీఠికలోని కొన్ని భాగాలు. తెలుగుసేత: యెనిశెట్టి సాంబశివరావు మొబైల్: 77021 74606) -
మహాత్ముని సూక్తి
మొదట వారు నిన్ను విస్మరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీతో పోరాటం చేస్తారు. అప్పుడు నువ్వే గెలుస్తావు. నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు. ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పేదో నీతోనే మొదలవాలి. కుండెడు బోధల కంటే గరిటెడు ఆచరణ గొప్పది. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.. ఎందుకంటే క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే మరచిపో! ఎవరి నుంచైనా సహాయం పొందితే జీవితాంతం గుర్తుంచుకో!! రేపే చనిపోతానన్నట్టుగా జీవించు ఎప్పటికీ జీవించే ఉంటానన్నంతగా నేర్చుకో. కంటికి కన్నే పరిష్కారమైతే ఈ ప్రపంచమే గుడ్డిదవుతుంది. నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరచిపోవడమే. నీ ఆలోచనలే నువ్వు. -
ఆ నేడు 2 అక్టోబర్, 1869
మహాత్ముడు పుట్టిన దేశం... మనలోకి మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రయాణం నుంచి తిరిగొస్తూ కొన్ని ‘పాఠాలు’ వెంట తీసుకురావాలనుకున్నప్పుడు మహాత్ముడి చరిత్రను కళ్లకద్దుకొని చదవాలి. మనలో కొత్త వెలుగొకటి ప్రసరించినట్లు అనిపిస్తుంది. అది మహిమాన్వితమైన వెలుగు. జీవితంలో మనకు దారి చూపే వెలుగు. మనిషి మహాత్ముడుగా ఎలా మారతాడు అనడానికి గాంధీజీ జీవితం ఒక ఉత్తేజిత ఉదాహరణ. ‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అనే మాటకు అక్షరాలా సరిపోయే జీవితం ఆ మహాత్మునిది. గాంధీజీ తండ్రి కరమ్చంద్ గాంధీ పోర్బందర్ సంస్థానంలో ‘దివాన్’గా పని చేశాడు. ఆర్థికంగా సామాజికంగా అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా పేదవాడి గురించి ఆకలి గురించి నిరాడంబరతలోని ఔన్నత్యం గురించి ఆలోచించినవాడు గాంధీజీ. శత్రువును ఓడించడానికి కావాలసింది హింస కాదు అహింస అని ప్రకటించి ఆయన అందించిన ఆ ఆయుధం మరింత గట్టిగా మరింత దృఢంగా స్వీకరించాల్సిన అవసరం ఇవాళ ప్రపంచ మానవాళి అంతటికీ ఉందని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. హింస ఉన్న ప్రతి చోటా విరుగుడుగా గాంధీజీ మాట అవసరం ఉంది. విలువలు పతనమైన ప్రతి చోటా విరుగుడుగా ఆయన అనుసరించిన మార్గం అవసరం ఉంది. మానవత్వం మృగ్యమైన ప్రతి చోటా విరుగుడుగా ఆయన ప్రసరింపజేసిన అవసరం ఉంది. అక్టోబర్ 2 ఒక తేదీ మాత్రమే. వాస్తవానికి ఆయన నిత్య స్మరణీయుడు. -
గౌరవం కాపాడదాం
చరిత్రలో తొలిసారి క్రికెట్ సిరీస్కు జాతినేతల పేరు దూకుడు కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలి గాంధీ-మండేలా పేరు నిలబెట్టాలి క్రికెట్ ప్రపంచంతో వారిద్దరికీ ఏ సంబంధం లేదు. ఆటగాళ్లుగా గానీ ఆటలో పరిపాలకులుగా గానీ తమదైన ముద్ర వేసిన ఘనత కాదు. కానీ ఆ ఇద్దరు మహనీయులకు ఇప్పుడు జెంటిల్మెన్ గేమ్తో కొత్త అనుబంధం ఏర్పడిపోయింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగే సిరీస్లకు ఆయా దేశాల దిగ్గజ క్రికెటర్ల పేర్లే పెట్టారు. తొలి సారి జాతీయ నాయకుల పేర్లతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్గా దీనిని వ్యవహరించనున్నారు. మరి శాంతి కాముకులైన ఆ ఇద్దరి పేర్లతో జరిగే ఈ పోరు అదే తరహాలో సాగుతుందా... క్రికెటర్లు తమ ఆగ్రహావేశాలు నిగ్రహించుకొని కేవలంపై ఆటపైనే దృష్టి పెడతారా...తమ దేశ జాతిపితల పేర్లకు ఉన్న గౌరవం నిలబెడతారా! సాక్షి క్రీడా విభాగం దాదాపు 21 ఏళ్ల నిషేధం తర్వాత తొలి సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు కోల్కతాకు వచ్చింది. ఎయిర్పోర్ట్నుంచి హోటల్ రూమ్ వరకు వేలాది మంది ‘సౌతాఫ్రికా- ఇండియా ఫ్రెండ్షిప్ లాంగ్ లివ్’ అని రాసిన బ్యానర్లతో జట్టుకు స్వాగతం పలికారు. ఈ మర్యాదలపై జట్టు కెప్టెన్ క్లైవ్ రైస్ అయితే ‘నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టాక ఎలాంటి అనుభూతి పొందాడో ఇప్పుడు నాకర్థమైంది’ అని అమితానందం వ్యక్తం చేశాడు. అసలు దక్షిణాఫ్రికా మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టగలదా అనే స్థితి ఉన్న దశలో బీసీసీఐ చూపించిన చొరవ ఆ దేశాన్ని మళ్లీ ఆటలో అడుగు పెట్టేలా చేసింది. ఈ కృతజ్ఞత దక్షిణాఫ్రికా చాలా సార్లు ప్రదర్శించింది కూడా. నాటినుంచి ఇప్పటి వరకు కూడా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీసీఐ ఆగ్రహంతో... అయితే 2013లో మాత్రం దక్షిణాఫ్రికా బోర్డు బీసీసీఐ ఆగ్రహానికి గురైంది. తాము తుది నిర్ణయం తీసుకోకముందే సఫారీలు షెడ్యూల్ ప్రకటించుకోవడం భారత బోర్డుకు నచ్చలేదు. దాంతో ఉన్నపళంగా మ్యాచ్లను తగ్గించి సిరీస్ను సగానికి కుదించింది. దాంతో ఆ బోర్డు ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిణామంలో దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ ప్రధాన బాధితుడయ్యాడు. పదవిని పోగొట్టుకోగా, బీసీసీఐని ప్రసన్నం చేసుకునేందుకు అతను పడరాని పాట్లు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు బీసీసీఐని మెప్పించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటూ ప్రకటించాడు. చివరకు అంతా సర్దుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఇరు బోర్డుల మధ్య సఖ్యత నెలకొంది. రెండో ప్రయత్నంలో... యాషెస్, భారత్ పాల్గొనే కొన్ని సిరీస్లు మినహా ద్వైపాక్షిక సిరీస్లు జనాల్లో ఆసక్తి కలిగించడం లేదని... సరైన మార్కెటింగ్ లేక మిగతా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని కొన్నాళ్ల క్రితమే ఐసీసీ సీఈ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేవ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ దేశం బాధ కూడా అతని మాటల్లో కనిపించింది. దాంతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్కు మరి కాస్త పాపులార్టీ జోడిస్తే బాగుంటుందని వారు భావించారు. దాంతో 2013లోనే గాంధీ-మండేలా సిరీస్ ప్రతిపాదనను దక్షిణాఫ్రికా చేసింది. ఇందులో రెండు టెస్టులు భారత్లో ఆడి, తర్వాత మరో మూడు టెస్టులు తమ దేశంలో ఆడి సిరీస్ పూర్తి చేయాలని కోరింది. అయితే బీసీసీఐ దీనిని పూర్తిగా తిరస్కరించింది. నాటి సిరీస్ మధ్యలో మండేలా మృతి తర్వాతైనా పేరు పెడదామని భావిస్తే స్పాన్సర్ సన్ఫాయిల్ ఒప్పుకోలేదు. దాంతో అప్పుడు అది అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదనను తెస్తే ఈ సారి మన బోర్డు ఓకే అంది. శాంతి...శాంతి.. ఈ సిరీస్ గురించి ప్రకటన చేసిన సమయంలో ఇది తాము మహాత్మా గాంధీకి ఇస్తున్న నివాళి అని, ప్రతీ భారతీయుడు ఆయన మార్గాన్ని అనుసరించాలనే ఈ పేరు పెట్టామంటూ బీసీసీఐ ప్రకటించింది. అటు దక్షిణాఫ్రికా బోర్డు కూడా ఈ ఇద్దరు మహనీయుల స్ఫూర్తితో మైదానంలో గెలుపు కోసం ప్రయత్నించాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరింది. అయితే అసలు ఆట మొదలయ్యాకే క్రికెటర్లు ఏ మాత్రం దీనిని అమలు చేస్తారో తేలుతుంది. గత దక్షిణాఫ్రికా పర్యటనలో భంగపడిన భారత్, ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. జట్టులోని కుర్రాళ్ళంతా మంచి జోష్లో ఉన్నారు. శ్రీలంకపై విజయం తర్వాత ఢీ అంటే ఢీ అంటూ అన్నింటికి సిద్ధమైపోతున్నారు. ఆస్ట్రేలియా తరహాలో దక్షిణాఫ్రికా జట్టు స్లెడ్జింగ్లో మరీ ఘనాపాటి కాకపోయినా ప్లెసిస్, డి కాక్, డుమినిలాంటి ఆటగాళ్లు దూషణలో ఆరితేరినవాళ్లే. కేవలం సిరీస్కు పెట్టిన పేరు వీరిని ఎంత వరకు నియంత్రించగలదనేది చూడాలి. రెండు దేశాల ఆటగాళ్లు కూడా వివాదానికి అవకాశం ఉన్న చోట ఒక్కసారి తమ శాంతి దూతలను గుర్తు చేసుకుంటే అగ్గిని ఆర్పేందుకు అవకాశం ఉంటుందేమో! ఎలాంటి సమస్యా రాకపోతే మంచిదే కానీ ఈ సుదీర్ఘ పర్యటనలో ఏదైనా తప్పు జరిగితే అది గాంధీ-మండేలాల శాంతి మంత్రానికి విఘాతం కలిగించినట్లే. స్వాతంత్య్ర సేనానులు... బీసీసీఐకి ప్రతిపాదించక ముందే దక్షిణాఫ్రికా మండేలా పేరును వాడేందుకు కావాల్సిన అనుమతులన్నీ తమ ప్రభుత్వం వద్ద తీసుకుంది. గాంధీ గురించి కూడా అదే చేయాలంటూ సూచించింది కూడా. ఇక్కడా ఎలాంటి అభ్యంతరం ఎదురు కాలేదు. ఫలితంగా ఈ సిరీస్కు పేరు ఖరారైంది. అహింసా పోరాటం ద్వారా భారత్కు స్వాతంత్య్రం సాధించి పెట్టి మహాత్మా గాంధీ ప్రపంచ వ్యాప్తంగా శాంతికి సంకేతంలా నిలిచారు. ఆయన స్ఫూర్తితో, అదే బాటలో నడిచి నెల్సన్ మండేలా తమ జాతి విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. స్వాతంత్య్రం సాధించడంలో హింసకు తావు లేకుండా ఇద్దరూ అనుసరించిన మార్గాలు ఒకటే. టెస్టు సిరీస్కు మాత్రం ప్రత్యేకంగా ‘ఫ్రీడం ట్రోఫీ’గా నామకరణం చేయడం అంటే అందరిలోనూ ఆ రకమైన స్వాతంత్య్ర భావాలను గుర్తు చేసినట్లే. రెండు దేశాల్లోనూ తమ జాతి పితలపై ఉన్న అభిమానం, గౌరవం వల్ల ఈ క్రికెట్ సిరీస్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ఈ టూర్ ద్వారా ప్రకటనల రూపంలోనే దాదాపు రూ. 250 కోట్లు రానున్నట్లు సమాచారం. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక సిరీస్లన్నీ క్రికెటర్ల పేర్లతోనే ఉన్నాయి. తమ దేశానికి సంబంధించి అత్యుత్తమ ఆటగాడు లేదా ఇరు దేశాల మధ్య జరిగిన సిరీస్లలో అద్భుతంగా రాణించిన ఆటగాడి పేరును సిరీస్లకు పెట్టారు. వాటిని పరిశీలిస్తే... ► బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్, ఆస్ట్రేలియా మధ్య) ► పటౌడీ ట్రోఫీ (భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో) ► బేసిల్ డి ఒలీవరియా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య) ► చాపెల్-హ్యడ్లీ ట్రోఫీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య) ► విజ్డన్ ట్రోఫీ (ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య) ► వార్న్-మురళీధరన్ ట్రోఫీ (ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య) ► ఫ్రాంక్వరెల్ ట్రోఫీ (ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య) -
'ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించండి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్షకు ఆటంకాలు కల్పిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విజయవాడలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మహాత్ముడికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మాట్లాడే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం
-
కాంగ్రెస్ విధ్వంసక విపక్షం బీజేపీ మండిపాటు
న్యూఢిల్లీ: లోక్సభ నుంచి 25 మంది తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేయడాన్ని అధికార బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ను విధ్వంసక విపక్ష పార్టీగా అభివర్ణిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం తీర్మానం చేసింది. అభివృద్ధి నిరోధక విధానాలకు పాల్పడుతూ ఆటంకవాదిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించిన సోనియా... ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్ డే అని మండిపడటాన్ని బీజేపీ ఆక్షేపించింది. నిరాధార ఆరోపణలతో సుష్మ, రాజే, శివరాజ్సింగ్ చౌహాన్ల రాజీనామాకు డిమాండ్ చేయడం శోచనీయమని తీర్మానంలో పేర్కొంది. తమ పార్లమెంటరీ పార్టీ ఆ ముగ్గురికి అండగా ఉంటుందని పునరుద్ఘాటించింది. మంగళవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు మంత్రులు హాజరయ్యారు. -
కేటీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యేల నోటీసులు
హైదరాబాద్: సభా హక్కులు ఉల్లంఘించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీలు నోటీసులిచ్చారు. తెలంగాణ మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని వారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ మంత్రులు ప్రోటోకాల్ ను పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ తెలిపారు. -
కోర్టులో గాంధీ...
స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్వారు అసంఖ్యాకంగా కేసులు పెట్టేవారు. వారికి చాలాసార్లు జైలుశిక్షలు పడేవి. అయితే కొన్నిసార్లు న్యాయమూర్తులు శిక్షలు వేయకుండా ‘వదిలేస్తే బుద్ధిగా మసులుకుంటామనే’ హామీని తీసుకొని విడుదల చేసేసేవారు. ఒకసారి బొంబాయి హైకోర్టులో గాంధీ మీద ఇలాంటి కేసే వచ్చింది. ‘శిక్ష వేయను. బయటకు వెళ్లాక బుద్ధిగా నడుచుకుంటారా’ అని న్యాయమూర్తి అడిగారు. అందుకు గాంధీజీ జవాబు- ‘బయటకు వెళ్లాక నేను బుద్ధిగా నడుచుకోను. బ్రిటిష్వారిని తిడతాను. మళ్లీ జైల్లో పెట్టండి. మళ్లీ బయటకు వచ్చి తిడతాను. ఈ దేశం నుంచి బ్రిటిష్వారు వెళ్లిపోయేవరకు వారిని తిడుతూనే ఉంటాను’. అదీ గాంధీ సత్యమార్గం. -
‘సూపర్’ వైద్యసీట్లలో తెలంగాణకు అన్యాయం
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంల్లో జూడాల నిరసన సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూనియర్ డాక్టర్ల(జూడా) సంఘం మండిపడింది. రాష్ట్రంలోని నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్కే కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూడాలు ఉస్మానియా, గాంధీ, వరంగల్లోని ఎంజీఎంలలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సూపర్స్పెషాలిటీ సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కేలా నిబంధనలున్నాయని రాష్ట్ర జూడాల కన్వీనర్ శ్రీనివాస్ విమర్శించారు. ఉస్మానియాలో నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సూపర్ వైద్య సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణవారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ఒక మహాత్ముడూ... ఒక అంబేడ్కరూ...!
దేశంలో కెల్లా ఎక్కువ ప్రాచుర్యం గల నేత గాంధీనా లేక అంబేడ్కరా? వర్థంతికో, జయంతికో లాంఛనప్రాయంగా నివాళులు అందుకుంటున్న గాంధీతో పోలిస్తే లక్షలాదిమంది దళితులు అంబేడ్కర్ అనే తమ ఉద్ధారకుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. తల్చుకుంటున్నారు. తేడా అల్లా ఇదే. ముంబైలోని దాదర్ బీచ్ వద్ద ఉన్న చైత్యభూమి సమీపం లో, గతంలో పిండి మిల్లు ఉన్న చోట డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ భారీ స్మారక స్తూపం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఆమోదించింది. ఎన్డీయే ప్రభుత్వం పిండిమిల్లు భూ మిని కేటాయించింది. బహుశా, మహారాష్ట్రలో బీజేపీ-శివ సేన ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఒక రూపం దాల్చ వచ్చుకూడా. కాబట్టి ఈ కీర్తి ఎవరి ఖాతాలోకి వెళ్లాలి? భారీ స్తూపం అనే ఒక్క అంశాన్ని మినహాయిస్తే, ఏ ఒక్కరూ ఈ భారీతనం గురించి నిర్దిష్టమైన అవగాహనతో ఉన్నట్లులేదు. అక్కడ ఒక ఉద్యానవనం, ఆ నేతకు సంబంధించిన మ్యూజి యంతో కూడిన ఎత్తై నిర్మాణాన్ని నెలకొల్పాలా లేక అది దళితుల ఆకాంక్షలను నెరవేర్చే కేంద్రంగా అంటే ఒక హాస్టల్, కోచింగ్ కేంద్రం, గ్రంథాలయంలాగా ఉండాలా? స్తూపం కోసం కేటాయించిన విశాలప్రాంతంలో దళితుల కోసం ఒక పెద్ద సంస్థను ఏర్పర్చవచ్చు. అయితే ‘నాక్కూడా’ అనే రాజకీయ నేతల అవసరాలను ఇది నెరవేర్చకూడదు. ఒక ఆదర్శంలోని సారాంశం కంటే దాని చిహ్నాలే రాజ కీయ పార్టీల నేతలకు ముఖ్యం. వ్యక్తిగత పూజలు, నినా దాలు, చిహ్నాలు భారత రాజకీయాల్లో కలిసే కాపురం చేస్తుం టాయి. వాస్తవానికి ఇవే మన రాజకీయాల్లో కీలకమైనవి. ఇటీవలే మనం అంబేడ్కర్ 124వ జయంతిని జరుపు కున్నాం. దేశంలో ఎక్కువ ప్రాచుర్యంగల నేత గాంధీనా లేక అంబేడ్కరా? అంటూ చర్చ నడుస్తోంది. గాంధీ ప్రతి ఏడాది రెండుసార్లు అంటే అక్టోబర్ 2న, జనవరి 30న పునరుత్థానం చెందుతుంటారు. ఆయనకు హృదయంతో కాకుండా పెదవు లతో మాత్రమే నివాళి అర్పిస్తుంటారు. వీవీఐపీలు హాజరవు తుంటారు కనుక అధికారిక లాంఛనాలతోపాటు మీడియా కూడా కాస్త ఆసక్తి ప్రదర్శిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ, ప్రతి గుడిసె లోనూ దళితులు తమ మహానుభావుడికి వందనాలు పలుకు తున్న ఘటనతోనూ, దాదర్ బీచ్లో అంబేడ్కర్ని సమాధి చేసిన చోటికి ప్రతి ఏటా డిసెంబర్ 6న లక్షలాదిగా దళితులు హాజరవుతూ నివాళి పలుకుతున్న ఘటనతోనూ గాంధీ జయంతి, వర్ధంతిల తంతును పోల్చి చూడండి మరి. ఒక సార్వత్రిక కారణం కోసం పోరాడుతున్నప్పుడు అంబేద్కర్ దళిత ప్రతీకలాగే ఉండేవారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న తమ మహానుభావుడి విగ్రహానికి నివాళి పలికేందుకు ప్రతి ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద నమ్మశక్యం కానంత పెద్ద సంఖ్యలో దళితులు గుమికూడుతుంటారు. ఈ భారీ మేళాలో అంబేడ్కర్ రచించిన పుస్తకాలు, ఆయనపై ఇతరు లు రచించిన పుస్తకాలను ప్రదర్శిస్తుంటారు. ఇంకా ముఖ్యం గా, ఆయన విగ్రహాలు, చిత్రాలను చాలా మంది కొని తీసు కెళుతుంటారు. అంబేడ్కర్, గాంధీలు తమ జీవితకాలంలో జాతికి విశేష సేవ చేసి ఉండొచ్చుకానీ, గాంధేయవాదులం దరికంటే మిన్నగా దళితులు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొం టారని, అలాగే గాంధీ కంటే అంబేడ్కర్కే ఎక్కువ మంది తమ కృతజ్ఞతలను తెలియజేస్తుంటారని ఒక అం చనా. వారి దృష్టిలో ఆయన దైవ సమానుడు. అంబేడ్కర్ జీవించి ఉంటే, ఈ విగ్రహారాధనకు ముగింపు పలకమని చెప్పేవారు. అలాగే దాదాపుగా విస్మృతి గర్భంలో కలిపివేసిన తన భావాలను లాంఛనప్రాయంగా ప్రకటించడం మానుకో వలసిందిగా గాంధీ చెప్పి ఉండేవారు. మున్నాభాయ్ లాగే.. తనను ఆదర్శీకరించవద్దని, తన మార్గాన్ని అవలంబించమని మాత్రమే చెప్పి ఉండేవారు. భారత్లో రాజకీయాలు వ్యక్తిగత ఆరాధనలపై ఊగులా డుతుంటాయి. తొలుత గాంధీని, తర్వాత మరొక గాంధీగా మారిన అంబేడ్కర్ని వారి ఆదర్శాల ప్రాతిపదికపై కాకుం డా, ఆరాధన తోటే అనుసరిస్తున్నారు. మార్క్స్, లెనిన్ సైతం ఇలాంటి మన్ననలనే అందుకున్నారు. గతవైభవ దీప్తి కోసం వెదుకులాటలో భాగంగా నరేంద్ర మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ను పునరుత్థానం చేస్తున్నారు. అంతే తప్ప ప్రతి రోజూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలను వీరిలో ఎవరూ నివారించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దళిత నేతలు కూడా రాజకీయాల్లో తమ నడవడిక విష యంలో వెనుకబడిపోతున్నారు. తమ నియోజకవర్గాల సమ స్యల పరిష్కారంలో సృజనాత్మకతను ప్రదర్శించని వీరు, వ్యక్తిగత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. నిస్సహాయుల వెతలు పట్టించుకోకుండా తమ అధికారం కోసం తాపత్రయం చెందుతూ దళితుల ఉమ్మడి ప్రయోజ నాలను పక్కనబెడుతున్న తమ నేతల వ్యవహారం గురించి దళితులకు అవగాహన ఉంది. చీలిపోతూ, కలుస్తూ కాలం గడుపుతున్న రిపబ్లికన్ పార్టీలో మరింత ఐక్యతను వారు ఇష్ట పడుతున్నారు. అంబేద్కర్ ఉద్ధారకుడు కాబట్టే ఆయనను ప్రజారాసులు పూర్తిగా ఇష్టపడుతున్నాయి. అసమానతలకు ముగింపు పలకాలని కోరుకుంటున్న అంబేడ్కర్ అనుయా యులు, రాజకీయాల్లో తక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏ రాజకీయ నేత, ఆయన అనుయాయులు మనదేశంలో ఇంత సాన్నిహిత్యబంధంతో లేరు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com మహేష్ విజాపుర్కార్ -
దండి 6-4-1930
ఉప్పు నిప్పై మండుతోంది. స్వాతంత్య్ర నినాదమై జ్వలిస్తోంది. దండి యాత్రలో అణువణువు ఆత్మగౌరవతేజమై వెలుగుతోంది. గుజరాత్లోని నవసరి పట్టణానికి సమీపంలోని కోస్తా తీర గ్రామం దండి గాంధీజీ పవిత్ర అడుగుల సవ్వడితో మైమరిచిపోతోంది. ఉదయం 6.30... గాంధీజీ తన గుప్పెటతో ఉప్పు గళ్లు తీసుకొని ‘‘ఈ ఉప్పుగళ్లతో బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు కదిలేలా చేస్తాను’’ అన్నారు. మహాత్ముడి మాటను చరిత్ర నిజం చేసింది. -
పనే దైవం అనేవారు
గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకట్రావ్ కళ్యాణం బాపూజీ అంటే శాంతి కపోతం. ఆ స్వాతంత్య్రమూర్తికి ప్రత్యక్ష సేవలందించారు వెంకట్రావ్ కళ్యాణం. 1944 నుండి గాంధీజీ అమరుడైన 1948 వరకు ఆయనకు కళ్యాణం వ్యక్తిగత సహాయకుడు. నాలుగేళ్లపాటు గాంధీజీ జీవిత గమనానికి సాక్షిగా నిలిచిన కళ్యాణం ఆయన గురించి ఏమంటున్నారు? గాంధీమార్గానికి, ఆయన ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లకు ప్రత్యక్ష సాక్షి అయిన కళ్యాణం... నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. గాంధీజీ దగ్గరికి ఎలా చేరానంటే..? మహాత్మాగాంధీకి సేవలు అందించటం నా పూర్వజన్మసుకృతం. అటువంటి అపూర్వవ్యక్తిని సమీపాన్నుంచి చూశాననే తృప్తి నా మరణం వరకు ఉంటుంది. మహాత్ముడి వ్యక్తిగత సహాయకుడిగా చివరి నాలుగేళ్లూ ఆయన్ని అంటిపెట్టుకునే ఉన్నాను. మా తల్లితండ్రులు తంజావూరుకు చెందిన వెంకట్రావు అయ్యర్, మీనాంబాళ్లకు 22 ఆగస్టు 1920 సిమ్లాలో నేను జన్మించాను. 21 ఏళ్ల వయస్సులో గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో చేరాను. ఆశ్రమంలో చేరకముందు ఆంగ్లేయుల దగ్గర పనిచేసేవాడిని. ఓ ఇంగ్లీషు అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడు గాంధీ అనే వ్యక్తి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాడని తెలిసింది. నాకు అర్థంకాలేదు. ఎందుకు... ఎవరు పాలిస్తేనేముంది. మొఘల్స్, రాజులు, ఆంగ్లేయులు బాగానే ఉంది కదా అనిపించింది. ఎందుకంటే మేము సంతోషంగానే ఉన్నాం. స్వాతంత్య్రం వస్తే ఏమవుతుంది? మాకు తెలిసేదికాదు. అప్పుడు నేనింకా స్కూల్ పిల్లాడిని. అర్థమయ్యేదికాదు. పక్కనే ఉన్న అధికారిని అడిగాను. ఆయన ‘గాంధీ ఈజ్ రైట్’ అన్నాడు. ‘ఎందుకు?’ అన్నాను. ‘వీయార్ ఫారినర్స్, దిస్ ఈజ్ యువర్ కంట్రీ’ అన్నారు. అప్పటికీ నాకు అర్థంకాలేదు. ఆశ్రమంలో చేరిన రెండేళ్ల తర్వాత గాంధీ జైలు నుండి విడుదలవుతున్నారని తెలిసింది. ఎప్పుడూ నేరుగా చూడలేదు కాబట్టి మొదటిసారి ఆశ్రమం నుండి అందరితోపాటే నేనూ వెళ్లాను. అక్కడ ఓ గదిలో గాంధీజీ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు గాంధీ కోవలం (గోచీ, పంచె) కట్టుకుని ఉన్నారు. పక్కనే వ్యక్తి లాల్చీ పైజామాలో ఉన్నారు. అప్పుడు గాంధీజీని చూసి ఆయన పనిమనిషేమో అనుకున్నాను. ఆ వ్యక్తి వెళ్లిపోయాక ఆశ్రమం వారిని పిలిచారు. అప్పుడు ఆశ్రమం వాళ్లు నన్ను పరిచయం చేశారు - ‘ఇతను తమిళుడు. ఢిల్లీ నుండి వచ్చాడు. మీకు సహాయకుడిగా ఉండేందుకు’ అని! అప్పుడు అనుకున్నాను ఈయనే గాంధీజీ అని! గాంధీజీ తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేస్తారు. ప్రార్థన చేస్తారు. ఉదయం, అదేవిధంగా నిద్ర పోయేముందు మరోసారి ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు. నాకు ఉదయం ఐదుగంటలకు రోజువారి కార్యక్రమాల గురించి డిక్టేట్ చేసేవారు. ఎప్పుడైనా తప్పు టైపు చేసినా కోప్పడరు. సోమవారం నిశ్శబ్దం... ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఎవరితోనూ మాట్లాడరు. అప్పుడు నాకు డిక్టేషన్ రాసి ఇచ్చేవారు. ఆయన రాత ఎవరికీ అర్థమయ్యేదికాదు. మా సీనియర్లు భూతద్దంపెట్టి చూసేవారు. గాంధీజీ నుండి నేర్చుకున్నది క్రమశిక్షణ, శాంతి, సహనం, సుహృద్భావం, నిజాయితీ, స్వయంసేవ, దేశసేవ. తెల్లవారుజామున 3 నుండి మధ్యాహ్నం 12 వరకు ఆయనతో కలసి పనిలో గడిపేవాణ్ణి. కూరగాయలు కొన్న సందర్భమే లేదు. గార్డెనింగ్ గాంధీ నుండి నేర్చుకున్నదే. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. పనే దైవం అనేవారు గాంధీజీ. శుభ్రత మాత్రం ఆంగ్లేయుల నుండి నేర్చుకున్నా. రాజకీయాల గురించి గాంధీజీ ఏమనేవారు... సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వాదనలు గాంధీజీకి తలనొప్పులు తెచ్చేవి. పటేల్, నెహ్రూ ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉండేవి. నెహ్రూ ముస్లిం పక్షపాతి. పటేల్ హిందూ పక్షపాతి. ఇదే వారిద్దరి మధ్య విభేదాలకు కారణమయ్యేవి. కానీ గాంధీజీకి ఇద్దరూ సమానమే. ఈ విభేదాలతో ఇద్దరూ గాంధీజీకి రాజీనామా ఇచ్చారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. మీరిద్దరూ సీనియర్లు... టాప్ లీడర్లు ఇలా చేయకూడదు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని హితవు చెప్పేవారు. అలా వారు కొనసాగారు. గాంధీజీ హత్యకు కారణం... గాంధీజీపై పలుమార్లు గాడ్సే హత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హోంమంత్రిగా ఉన్న పటేల్ గాంధీజీ దగ్గరకు వచ్చేవారందరినీ తనిఖీచేసి పంపాలని భద్రత కల్పించారు. కానీ గాంధీజీ అందుకు నిరాకరించారు. తనిఖీలు లేకపోవటంతో గాడ్సే తుపాకీతో వచ్చాడు. జేబులో నుండి తుపాకి తీసి కాల్చాడు. నేను గాంధీజీ పక్కనే ఉన్నాను. తూటా తగలగానే గాంధీజీ కుప్పకూలిపోయారు. ప్రస్తుతం కళ్యాణం ఏం చేస్తున్నారు? గాంధీజీ మరణానంతరం నాకు పనిలేకుండా పోయింది. అందుకే గాంధీజీ నాకేమి నేర్పాడో అది ఆచరిస్తున్నా. మోడి స్వచ్ఛ భారత్ ప్రారంభించారు. మంచిదే. కానీ, నేను 1948 నుండి పాటిస్తున్నా. ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే గాంధీజీకి కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు. -
స్ఫూర్తిదాత మహాత్మాగాంధీ
న్యూఢిల్లీ: గాంధీజీపై తనకున్న అభిమానాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ఒబామా.. ఆదివారం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి అని కొనియాడారు. గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ముకుళిత హస్తాలతో కాసేపు మౌనం పాటించారు. ‘డాక్టర్ మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ అన్న మాటలు అక్షర సత్యాలై నిలుస్తున్నాయి. గాంధీ స్ఫూర్తి భారత్లో నేటికీ సజీవంగా ఉంది. ఆ స్ఫూర్తి ప్రపంచానికి అపురూప కానుక. దానితో దేశాలు, ప్రజల మధ్య ప్రేమ విరాజిల్లాలని ఆశిస్తున్నా’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. రాజ్ఘాట్ వద్ద బోధి మొక్కను నాటారు. అక్కడి అధికారులు ఒబామాకు చరఖాను బహూకరించారు. -
గ్రేటర్లో 52 స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు
వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్నగర్లో మరొకరికి .. సాక్షి, హైదరాబాద్/వరంగల్/ మహబూబ్నగర్: హైదరాబాద్లో చలితగ్గుముఖం పట్టినా స్వైన్ఫ్లూ కేసులు మాత్రం పెరుగుతుండటంతో గ్రేటర్ వాసు లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 336 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు. తాజాగా ఆదివారం 52 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో చాలామంది ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని స్వైన్ఫ్లూ నోడల్ కేంద్రాల్లో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్వైన్ఫ్లూ నోడల్ అధికారులు తెలిపారు. మరో పక్క జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్నగర్లో మరొకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట యువకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ మనోహర్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. మరో వ్యక్తి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వైన్ఫ్లూ అనుమానితులకు రవాణా సౌకర్యం రాష్ట్రంలో స్వైన్ఫ్లూ తీవ్రత తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందొద్దని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. స్వైన్ఫ్లూ అనుమానిత రోగులను ఆస్పత్రులకు చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 108కు ఫోన్ చే స్తే వారిని ఆస్పత్రులకు చేరుస్తాయని ఆయన వివరించారు. ఆదివారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. స్వైన్ఫ్లూ సోకినట్లు అనుమానం ఉన్న వారిని ప్రైవేటు ఆస్పత్రులు అడ్మి ట్ చేసుకోవాలని, లేదంటే ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. స్వైన్ఫ్లూ అనుమానితులు గాంధీ ఆసుపత్రికే రావాలని, ఎక్కడికి పం పాలో తామే నిర్ణయిస్తామని అన్నారు. శని, ఆది వారాల్లో 35 కేసులు పాజిటివ్గా తేలాయన్నారు. -
వెలుగు రేఖ భారత్
ప్రవాసీ భారతీయ దివస్లో ప్రధాని మోదీ ప్రపంచ దేశాలన్నీ భారత్వైపు చూస్తున్నాయి దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి ప్రవాస భారతీయులకు పిలుపు గాంధీనగర్: ‘దేశంలో నెలకొని ఉన్న దారుణమైన ప్రతికూల పరిస్థితుల్లో మన పూర్వీకులు మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ.. అత్యంత ధైర్య సాహసాలతో దేశాన్ని విడిచి కొత్త తీరాలకు తరలి వెళ్లారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారత్ అభివృద్ధి చెందింది. అద్భుతమైన కొత్త, కొత్త అవకాశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరింత ప్రగతిశీల భారత్ను రూపొందించేందుకు మీ సహకారం కావాలి’.. అంటూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రవాస భారతీయులను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. గాంధీనగర్లో 13వ ప్రవాస భారతీయ దివస్(పీబీడీ)’ను మోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహాత్మా మందిర్ వేదికపై నుంచి దాదాపు 4 వేల మంది ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ భారత్కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీజీ భావనలకు అనుగుణంగా పీబీడీ కార్యక్రమాలను రూపొందించారు. మోదీ కూడా తన ప్రసంగంలో గాంధీ దార్శనికతను, సమకాలీనతను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను గాంధీజీ నమ్మి, ఆచరించిన మానవతావాద విశ్వాసాలు పరిష్కరించగలవన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా, 2003 నుంచి దక్షిణాఫ్రికా నుంచి వందేళ్ల క్రితం గాంధీజీ భారత్ తిరిగొచ్చిన తేదీన ప్రవాస భారతీయ దివస్’ను నిర్వహించడం ప్రారంభించారు. మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు.. అంతర్జాతీయంగా చూస్తే ప్రవాస భారతీయులే మన దేశానికి విలువైన పెట్టుబడి. వారి అభివృద్ధికి ఎంత సహకరిస్తే.. అంతర్జాతీయంగా మన విలువ, ప్రాముఖ్యత అంత పెరుగుతుంది. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 50 దేశాల అధినేతలతో భేటీ అయ్యాను. మేం మనసువిప్పి మాట్లాడుకున్నాం. ప్రపంచంలోని అతిపేద దేశాలు, అత్యంత ధనిక దేశాలు కూడా భారత్ వైపు సానుకూల దృష్టితో చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలన్న తన ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీరు భారత్పై వారికున్న ప్రేమను ప్రతిఫలించింది. ఐరాసలోని 193 దేశాల్లో 177 దేశాలు ఆ తీర్మానానికి మద్దతిచ్చాయి. వాటిలో 40 ముస్లిం దేశాలు. సాధారణంగా అలాంటి తీర్మానాలు ఆమోదం పొందేందుకు కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఈ తీర్మానం కేవలం 100 రోజుల్లో ఆమోదం పొందింది. ప్రపంచ దేశాలు మనపై చూపే ప్రేమకు కారణం.. వారి దేశాల్లోని భారతీయుల సంపద కారణం కాదు. అక్కడి ప్రవాస భారతీయులు పాటిస్తున్న విలువలు, వారు నిలుపుకుంటున్న భారత సాంస్కృతిక వారసత్వం.. ఇవే ఆ ప్రేమకు కారణం. ప్రపంచ దేశాలు మనపై పెట్టుకున్న అంచనాలను నిలుపుకునే బాధ్యత ఇప్పుడు మనపై ఉంది. గంగానది ప్రక్షాళన మతపరంగా, పర్యావరణ పరంగా అత్యంత ముఖ్యమైన లక్ష్యం. అంతేకాదు, దాదాపు 40% జనాభా ఆర్థికాభివృద్ధికి అది కీలకం. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణమూ మెరుగవుతుంది. ఈ గంగ ప్రక్షాళన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలన్నది నా ఆకాంక్ష. నేను ప్రవాస భారతీయులను ఎక్కువగా కలుస్తున్నానని కొందరనుకుంటున్నారు. కానీ మనవాళ్లను కలిస్తే మన శక్తి మరింత పెరుగుతుంది. డాలర్లు, పౌండ్లు ఇస్తేనే దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడమని కాదు. ఆఫ్రికా దేశంలో పుట్టి, కెనడాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన ఒక ముస్లిం బాలిక 2001లో గుజరాత్లో తీవ్ర భూకంపం వచ్చినప్పుడు నెలల తరబడి ఇక్కడే ఉండి సహాయ చర్యల్లో పాలుపంచుకున్న విషయం నాకు గుర్తొస్తోంది. ఇప్పుడు గయానాలో భారతదేశ పండుగలైన హోళీ, దీపావళి జరుపుకుంటున్నారు. మారిషస్లో గంగాసాగర్ సరస్సును గంగానది జలంతో నింపారు. ఇవన్నీ ప్రాంతాలకతీతంగా భారతీయులందరినీ ఒక్కటి చేస్తాయి. న్యూయార్క్లోని మేడిసన్ స్క్వేర్లో నేనిచ్చిన హామీని నెరవేర్చుకున్నాను. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు వర్గాలను విలీనం చేస్తూ ఈ మంగళవారమే ఆర్డినెన్స్ను జారీ చేశాం. దీనివల్ల వారికి జీవితకాల వీసా, భారత్లో ఉన్నప్పుడు ప్రతీవారం పోలీస్స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.. లాంటి సౌకర్యాలు లభిస్తాయి. త్వరలో ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రం కూడా పనులు ప్రారంభించనుంది. పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యం: సుష్మాస్వరాజ్ దేశాభివృద్ధిలో భాగంగా.. పరస్పర ప్రయోజనకర సంబంధాలను ఏర్పర్చుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. పీబీడీలో గురువారం ఆమె మాట్లాడుతూ.. దృఢమైన, స్వయంసమృద్ధ భారతదేశం మీకెంత స్ఫూర్తిదాయకమో.. విజయవంతమైన, సుసంపన్నమైన, రాజకీయంగా ప్రభావశీలురైన మీరు భారతదేశానికి అంతే స్ఫూర్తిదాయకం’ అన్నారు. ‘భారతదేశ సుసంపన్న గతచరిత్ర పునరావృతమయ్యేలా.. భారతదేశం అభివృద్ధి చెందాలి. ఆ యజ్ఞంలో మీరంతా పాలుపంచుకోవాలి’ అని ఆమె అభ్యర్థించారు. శతాబ్దాలుగా మతమార్పిళ్లు: వెంకయ్య విదేశీ నిధులతో గత రెండొందల ఏళ్లుగా భారత్లో మతమార్పిళ్లు, పునఃమత మార్పిళ్లు జరుగుతున్నాయని, అది బహిరంగ రహస్యమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హిందూత్వ సంస్థలు చేపట్టిన ఘర్వాపసీ కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సమయంలో ప్రవాస భారతీయ దివస్ వేదికపై పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మతమార్పిళ్లతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అభివృద్ధి మాత్రమే తమ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. ‘భారత్లో అవకాశాలు’ అంశంపై మాట్లాడుతూ ఆధునిక పట్టణ భారత్ను రూపొందించేందుకు సహకరించాలని వెంకయ్య ప్రవాస భారతీయులను కోరారు. తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సహా ఘన సాంస్కృతిక వారసత్వం ఉన్న 12 పట్టణాలను సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేందుకు ‘హృదయ్’(హెరిటేజ్ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్యోజన) పథకాన్ని రూపొందిం చామన్నారు. సత్య నాదెళ్లకు ప్రవాసీ అవార్డు మైక్రోసాఫ్ట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి, తెలుగు తేజం సత్య నాదెళ్ల ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ అవార్డు అందుకోనున్నారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయనతోపాటు మరో 14 మందికి ఈ అవార్డును ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ రంగాల్లో సేవలందించిన ఎన్నారైలకు ఈ అవార్డును అందిస్తున్నారు. గాంధీనగర్లోని మహాత్మ మందిర్లో ఉపరాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దండి కుటీర్ 13వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో రూపొందించిన మ్యూజియం ‘దండి కుటీర్’ను మోదీ ప్రారంభించారు. మహాత్ముడిపై రూపొందించిన 3-డీ షార్ట్ ఫిల్మ్ను కూడా మోదీ వీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి యువత ప్రేరణ పొందేలా గాంధీ జీవితాన్ని మలచాలనే కల సాకారం కావడం హృద్యంగా ఉందన్నారు. ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ చేపట్టిన దండి మార్చ్కు గుర్తుగా 41 మీటర్ల ఎత్తయిన ఉప్పు గుట్టను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ బాల్యం, స్వాతంత్య్ర సమరంలో ఆయన పోషించిన పాత్ర, భారత్కు తిరిగి రావడం వంటి ఘటనలను శిల్పాలుగా రూపొందించారు. స్టాంపులు, నాణేలు! ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో మహాత్మాగాంధీ ముఖచిత్రం ఉన్న నాణేలు, స్టాంపులను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయినందుకు గుర్తుగా వీటిని రూపొందించారు. యువకుడిగా ఉన్నప్పటి మోహన్దాస్ కరంచంద్ గాంధీని.. మహాత్ముడిగా మరిన తరువాత గాంధీని ఒకే ఫ్రేములో చూపిస్తూ వాటిని రూపొందించారు. రూ. 100, రూ. 10 నాణేలను, రూ. 25, రూ. 5 విలువైన స్టాంపులను తయారు చేశారు. -
ఎమ్మెల్యే గాంధీకి హైకోర్టులో ఊరట
ఎక్స్పార్టీ ఉత్తర్వులు నిలుపుదల వాదనలు వినిపించేందుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పిటిషన్కు సంబంధించి నోటీసులు అందుకున్నా కోర్టు ముందు తను గానీ.. తన తరఫు న్యాయవాది గానీ హాజ రుకాకపోవడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీని ఎక్స్పార్టీగా ప్రకటిస్తూ అంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు శనివారం నిలుపుదల చేసింది. సెక్షన్కు సంబంధించి జరిగిన పొరపాటు వల్ల తాను దాఖలు చేసిన వకాలత్ రికార్డుల్లో చేరలేదని, కేసులో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ గాంధీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఎక్స్పార్టీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ, ఈ అనుబంధ పిటిషన్ను అనుమతించారు. ఇదిలా ఉండగా.. ఇదే విధంగా ఎక్స్పార్టీ అయిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద సైతం తనకూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి, దీనిపై అభ్యంతరాలు ఉంటే వాటిని కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచాలని టీఆర్ఎస్ అభ్యర్థి కె.హన్మంతరెడ్డిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. -
మారని తలరాత
సరి‘హద్దు’ మీరిన సమస్యలు నరకానికి నకళ్లు ఆ రహదారులు పడవలు, తెప్పలే ప్రయాణ సాధనాలుబడులూ లేవు, దవాఖానా లేదుతలాపునే నీళ్లు, దాహం తీరదు వానాకాలం వణుకుడు,ఎండాకాలం ఉడుకుడు అభివృద్ధి నిధుల మంజూరు శూన్యమే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు దాటింది. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతం మాత్రం ఆవిష్కృతం కాలేదు. ఇప్పటికీ చాలా వరకు పల్లెలు సమస్యల చక్రబంధంలో ఇరుక్కుని ఉన్నాయి. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటి మూటలేనని అవి నిరూపిస్తున్నాయి. నిజామా బాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఊళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రహదారులు లేవు. తాగడానికి నీళ్లు లేవు. చదువుకోవడానికి బడులు లేవు. రోగమొస్తే చూపించుకోవడానికి దవాఖాన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఎవ్వరికీ పట్టని జనావాసాలు. ఇక్కడి దీనస్థితిపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. - బాన్సువాడ పడేసినట్లున్న ఊళ్లు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గ్రామాలు. వీటికి కూతవేటు దూరంలో, మహారాష్ట్ర, కర్ణాటకలోని గ్రామాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలు, మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల గ్రామాలన్నీ సరిహద్దుకే ఆనుకొని ఉన్నాయి. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని బాబుల్ గాం, శక్తినగర్, చింతల్వాడి, చింతల్వాడి తాండ, హట్యానాయక్ తాండ, కంగ్టి మండలంలోని బోర్గి, చౌకన్పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బడా సమస్యల బాబుల్గాం బాబుల్గాం గ్రామం ద్వీపకల్పంలా ఉంది. ఈ గ్రామాన్ని మూడు వైపులా కౌలాస్నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆవరించి ఉంది. ఏడాదికి 12 నెలలూ ఇదే పరిస్థితి. బా బుల్గాం నుంచి విఠ ల్వాడికిగానీ, జుక్కల్కుగానీ వెళ్లాలంటే వానాకాలంలో 60 కిలోమీటర్లు, ఎండాకాంలో 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిందే. వాస్తవానికి బాబుల్గాం నుంచి జుక్కల్కు పది కిలోమీటర్ల దూరమే ఉన్నా, కౌలాస్నాలా బ్యాక్ వాటర్తోపాటు రోడ్డు సరిగా లేక ఆ గ్రామ ప్రజలు 50 కిలోమీటర్లు అధికంగా తిరగాల్సి వస్తోంది. వర్షాకాలంలో కౌలాస్నాలా ప్రాజెక్టు నిండితే బాబుల్గాం పూర్తిగా మునిగినట్టే. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు అక్కడి ప్రజలు. ఈ గ్రామానికి మండలస్థాయి అధికారులు ఎవరూ రారు. ఎప్పుడైనా వస్తే వారు రోజంతా ఇక్కడే గడపాలి. మరో రెండు రోజులు సెలవు పెట్టాలి. అయితేనే ఆ గ్రామానికి చేరుకొంటారు. గ్రామం చెంతనే కేఎన్పీ బ్యాక్వాటర్ ఉన్నా, బోర్లు మాత్రం పని చేయవు. రాళ్లతో కూడిన రహదారిపై కాలి నడకన వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. బడి ఉన్నా పేరుకే..ఉపాధ్యాయులు లేరు. దవాఖానా లేదు. రోగమొస్తే తెప్పలెక్కి పట్టణానికి పోవలసిందే. తండాల పరిస్థితీ అంతే! బాబుల్గాం సమీపంలో ఉండే హట్యానాయక్ తాండ, చింతల్వాడి తాండ, చౌకన్పల్ల తాండాలలో గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అవి క్షేత్ర స్థాయిలో అందడం లేదనడానికి ఈ తండాలే నిదర్శనం. తాగునీటి కోసం ఈ తండాల వా సులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా కంగ్టీ మండలం చౌకన్పల్లికి వెళ్తున్నారు.రాష్ట్రంలోనే వెనుకబడి ఉన్న జుక్కల్ సెగ్మెంట్లోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గోజెగాం గ్రామం మద్నూర్ మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, లెండి వాగు అడ్డంగా ఉండడంతో గ్రామస్తులు 30 కిలోమీటర్ల వరకు తిరిగి, మహారాష్ట్ర ద్వారా మద్నూర్కు వస్తున్నారు. గోజెగాం వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గం గారాం హయాంలో కోటి రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నిధులను లింబూర్-మద్నూర్ రోడ్డు నిర్మాణానికి మళ్లించారు. దీం తో గ్రామస్తుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతం పనులు మందకొడిగా సాగుతున్నాయి. జుక్కల్ మండలంలోని బాబుల్గాం, శక్తినగర్, చింతల్వాడి గ్రామాలు ప్రతీ వర్షాకాలంలో కౌలాస్నాలా బ్యాక్ వాటర్తో జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. -
నోబెల్ విశేషాలు వివాదాలు
డిసెంబరు 10 న నోబెల్ వర్ధంతి. 9న అస్లో సిటీలోని ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’లో నోబెల్ పురస్కార కార్యక్రమం జరుగుతుంది. 10న వారందరితో ఒక ఫోటోసెషన్ వుంటుంది. అమెరికా, జపాను, జర్మనీ, ఫ్రాన్సు, నార్వే, ఇండియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ఏడాది 13 మంది ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు! ప్రపంచంలో చాలా దేశాలలో అవార్డుల ప్రదాన సంప్రదాయం వుంది. అయినప్పటికీ నోబెల్ అవార్డుకు వున్న ప్రఖ్యాతి వేరు. దాని ద్వారా వచ్చే కీర్తీ ఎక్కువే. రివార్డూ ఎక్కువే. నోబెల్ ప్రారంభ సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే పారితోషికం కూడా చాలానే పెరిగింది. 2013లో అన్ని రంగాలకు కలిపి 343 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు అని కాదు. ప్రచారం కూడా అంతే. అదొక అంతర్జాతీయ ఖ్యాతి. అందుకే ఈ అవార్డులో నామినేషన్ల నుంచి ఎంపిక దాకా ప్రలోభాలు వుంటాయి. ప్రభావాలూ వుంటాయి. విశేషాలు, వివాదాలు ఉంటాయి. ఆ వివరాలే ఈవారం మన ‘వివరం’. ఆల్ఫ్రెడ్ నోబెల్ పుట్టింది స్వీడన్లో. పెరిగింది నార్వేలో. చనిపోయింది ఇటలీలో. నోబెల్ పుట్టే సమయానికి అంటే 1833 నాటికి నార్వే స్వీడన్ ఆక్రమణలో వుంది. అంతకు మునుపు అంటే 1380 నుంచి 1814 దాకా డెన్మార్కు ఆక్రమణలో వుంది. నార్వే కూడా తక్కువేమీ కాదు 13వ శతాబ్దం వరకూ తనదీ ఆక్రమణల చరిత్రే. ఐస్లాండ్, గ్రీన్లాండ్, షట్లాండ్లను తానూ ఆక్రమించుకుని పెత్తనం చేసింది. ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ చేతిలోకి వెళ్లిపోయింది. నార్వేకి ఉన్నది చాలా చిన్న చరిత్ర. ఉన్న ఆ చరిత్ర కూడా ఆక్రమణల చరిత్రే. చేపలకోసం, జంతువులకోసం వేటాడుతూ ఇక్కడకొచ్చి స్థిరపడి ఇనుము, ఇత్తడి యుగాల్లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలమీదా, పాలమీదా ఆధారపడి బ్రతికిన పదివేల ఏళ్లనాటి చరిత్రను పక్కన పెడితే క్రీ.శ.1030లో ‘క్రిష్టియానిటి రాజ్యం’ కింద బ్రతకడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ, నార్వేదంతా ఆక్రమణల చరిత్రే. అయితే 1350లో ప్లేగు వ్యాధి వ్యాపించి దేశంలో సగం మంది చనిపోయారు. ఇక అక్కడి (ఇతరులను ఆక్రమించే స్థితి నించి) ఇతరుల ఆక్రమణలోకి నార్వే వెళ్లిపోయింది. నోబెల్ విల్ 1905లో నార్వే స్వతంత్రతను ప్రకటించుకోవడానికి సరిగ్గా అయిదేళ్లకు ముందు అంటే 1900ల్లో ‘నోబెల్ ఫౌండేషన్’ ఏర్పడింది. దీనికి అయిదేళ్లకు ముందు 1895 నవంబరు 25న నోబెల్ తన వీలునామా రాశాడు. దాని పేరు ‘ఆఖరి వీలునామా’. దీన్ని పారిస్లోని ‘స్వీడిష్ నార్వీజియన్ క్లబ్’లో భద్రపరచి, తన తదనంతరం అమలు పరచమన్నాడు. మానవాళికి ప్రయోజనం కలిగించే పరిశోధనలకు తన పేరుతోవున్న అవార్డులను ఇవ్వమని, ఆ అవార్డులకయ్యే ఖర్చునంతటినీ తన సంపద ద్వారా వచ్చే వార్షిక ఆదాయం నించి వాడమని చెప్పాడు. సహజంగానే ఆస్తివున్న చోట వారసత్వం వుంటుంది. ఆ వారసత్వం దీనికి ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వీలునామా తన పని తాను చేసుకుపోతుంది. వారసులకు కోపమొచ్చింది. అపారమైన సంపద పరులపరం కావడం సహించలేక నోబెల్ మీద కోపంతో ఆ అవార్డుకు నోబెల్ పేరును తొలగించాలని చూశారు. సాధ్యపడలేదు. వీలునామా దానికి సహకరించలేదు. నోబెల్ గురించి కొంచెం నోబెల్ బాలమేధావి. పరిశోధనా పిపాసి. పదిహేడేళ్లకే రష్యా, ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లిషు భాషలు నేర్చుకున్నాడు. కెమికల్ ఇంజనీరు. అనేక రంగాల మీద అనేక పరిశోధనలు చేశాడు. అనేక పుస్తకాలు రాశాడు. తన పరిశోధనల మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అదీ ఇదీ అని లేకుండా అన్ని వ్యాపారాలూ చేశాడు. దీంట్లో తండ్రి ఇమ్మానియేలు అతనికి ఆదర్శం. ఆయన తిరగని దేశం లేదు. చేయని వ్యాపారమూ లేదు. సంతానం అంతా ఇదే పని. వీరికి ఇరవై దేశాలలో తొంభై వ్యాపారాలు వున్నాయి. నోబెల్ పేదల కోసం చేసింది ఏమీ లేదు. పేదరికం మీద ఆలోచించింది అంతకన్నా లేదు. అతనికి సైన్సు పట్ల, సాహిత్యం పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తి వుంది. ఆ ఆసక్తి నుంచి వచ్చిన ఆశయమే ‘నోబెల్ అవార్డు’. 1895 నాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ (ఫిజియాలజీ కూడా), సాహిత్యం, శాంతి, ఇవి మాత్రమే నోబెల్ అవార్డు పరిధిలో వుండేవి. 1968లో ఎకనామిక్స్ను చేర్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్లను ఎంపిక చేసే పనిని ‘రాయల్ ఎకాడమి ఆఫ్ సైన్సు’ చూస్తుంది. మెడిసిన్ ఫిజియాలజిని ‘నోబెల్ అసెంబ్లీ ఎట్ కరోలిన్స్కా’ చూస్తుంటుంది. అలాగే సాహిత్యాన్ని ‘స్వీడిష్ అకాడమీ’, శాంతి అవార్డును ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘నార్వే పార్లమెంటు’ చూస్తుంది. దీంట్లో నార్వే ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులతో పాటుగా న్యాయశాస్త్ర ఆచార్యుడొకరు వుంటారు. మలాలాకు ఎలా ఇస్తారు? నోబెల్ పేరుతో ఇచ్చే అవార్డుల్లో మిగతావన్నీ ఒక ఎత్తు కాగా, ‘శాంతి’ పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఒక్కటీ ఒక ఎత్తు. నోబెల్ ఏ స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పాడో దానికి పూర్తి విరుద్ధంగా అనేకమార్లు ఈ అవార్డు దుర్వినియోగం అయ్యింది. అవుతూనే వుంది. మలాలా, సత్యార్థుల విషయంలో అది మరొకసారి రుజువయ్యింది. ఈ ఇద్దరూ బాల బాలికల కోసం కృషి చేసి వుండవచ్చు. వారి కోసం తమ జీవితాల్ని అంకితం చేసి వుండవచ్చు. కాని అలాంటి కృషికి తన ‘శాంతి అవార్డు’ను ఇవ్వమని నోబెల్ ఎక్కడా చెప్పలేదు. ఇస్లామిక్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టటానికీ, అమెరికాను సంతృప్తి పరచడానికీ ఐక్యరాజ్య సమితి సలహా మేరకు ‘మలాలా’లకు ఈ అవార్డును ఇచ్చారు. మలాలాకు ఇవ్వాలి కాబట్టి సత్యార్థికీ ఇచ్చారు. ఒబామా శాంతి దూతా? ఇలాంటి దుర్వినియోగమే అమెరికా కోసం 2009లో ఒకసారి జరిగింది. ఒబామా అమెరికాకు ప్రెసిడెంటు అయిన 9 నెలలకే ‘ప్రపంచ ప్రజల మధ్య అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి చేసిన కృషికి గాను ఆయనను ఆ ఏడాది శాంతి పురస్కారంతో సత్కరించారు. తాలిబన్ల చేతిలో కూలిపోయిన ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ శకలాలను తొలగించడానికే అమెరికాకు ఆరు నెలలు పట్టింది. అలాంటిది తొమ్మిది నెలల్లో అంతర్జాతీయ సంబంధాలను ఒబామా మెరుగుపరచగలడా? ఇదే ప్రశ్నను అప్పట్లో ‘నోబెల్ కమిటీ’ని మీడియా అడిగింది. ‘‘ఇస్లామిక్ దేశాలలో ఉద్రిక్తతల్ని తగ్గించడానికీ, ఆయా దేశాలలో మోహరించిన సైన్యాన్ని కుదించడానికీ, అణ్వాయుధాల తయారీని తగ్గించడానికీ ఒబామా కృషి చేశారు. పదవిలోకి వచ్చిన మూడు మాసాలకే ఈ విషయం మీద రష్యాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘అందుకే ఆయన్ని ఈ ఏడాది శాంతి దూతగా గుర్తించామని’’ కమిటీ వైస్ ఛైర్మన్ తర్బోజన్ జంగ్లాండ్ జవాబిచ్చారు. నిజానికి ఈ జవాబుకి అమెరికా ప్రెస్సే నవ్వింది. ఛలోక్తులు విసిరింది. ఒబామా వచ్చిన తర్వాత అరబ్బు నేలపై ఉద్రిక్తతలు పెరిగాయి. సైన్యాన్ని పెంచారు. విస్తరించారు. ‘న్యూక్లియర్ వెపన్’ విషయంలో అమెరికాది ఎప్పుడూ గురివింద గింజ సామెతే. సరే. ఒబామా విషయంలో కమిటి చెప్పిందే నిజమనుకుందాం. కొద్దిసేపు ఆయన్ను శాంతి కపోతమనే అనుకుందాం. అయితే అధికారానికి వచ్చిన 12వ రోజుకే ఆ కపోతం శాంతికై పైకి ఎగిరిందా? ఈ అసలు రహస్యాన్ని ఎవ్వరూ పట్టుకోలేదు గానీ ఒబామా ప్రెసిడెంటు పదవిలోకి వచ్చిన 12వ రోజునే నామినేషను పత్రాలు ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’కి చేరాయి. అప్పుడే ఆ ఎంపిక జరిగిపోయింది. ఈ ప్రశ్న తర్బోజన్ని మీడియా అడిగి ఉంటే అప్పుడాయన ఏం చెప్పి వుండేవారో? చైనా దుష్టత్వం - అమెరికా కపటత్వం! 2010లో ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి దుర్వినియోగమే ఇంకోటి జరిగింది. దాంట్లో కూడా అమెరికా హస్తముందని చెప్పుకున్నారు. ‘లియోబియోబో’ అని చైనా హక్కుల కార్యకర్త. ‘అహింసా మార్గంలో మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి’గా ఆ సంవత్సరానికి అతనికిచ్చారు. చైనా ప్రభుత్వం అతణ్ణి చాలా కాలంపాటు జైల్లోనే వుంచింది. ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లనివ్వలేదు. చివరికి అతని తరపున అతని బంధువులని కూడా వెళ్లనివ్వకుండా చైనా ఆంక్షలు పెట్టింది. ఆ రకంగా చైనా తన ‘సోషలిస్టు దుష్టత్వాన్ని’ ప్రదర్శించుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ’ అని వాషింగ్టన్లో ఒక స్వచ్చంద సంస్థ వుంది. దానికి అమెరికా ప్రభుత్వంలోని హోమ్ శాఖ నుంచి నిధులు వస్తుంటాయి. అమెరికా తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న దేశాల్లోని అంతర్గత విషయాల్లోకి ఈ సంస్థను ప్రయోగిస్తుంటుంది. ఈ సంస్థ నుంచి ‘లియోబియాబో’కి ఫండ్సు వస్తుంటాయని, ఆ డబ్బుతోనే అతను చైనాలో పని చేస్తుంటాడనే విషయం బైటికొచ్చింది. అతనికి వచ్చిన ‘నోబెల్ అవార్డు’ వెనక అమెరికా వుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా మానవ హక్కులను మంటగలుపుతున్న అమెరికా ‘చైనా మానవ హక్కుల కోసం’ ఆరాటపడడం, అందుకోసం అతనికి అవార్డు ఇప్పించడం, నార్వే ఇవ్వడం రెండూ విడ్డూరంగా జరిగిపోయాయి. శాంతికి ఛాంపియనా? 2012లో శాంతి పురస్కారం ‘యూరోపియన్ యూనియన్’కి దక్కింది. ఈ యూనియన్లో మొత్తం 28 దేశాలుంటాయి. నోబెల్ అవార్డును వ్యక్తులకూ ఇవ్వవచ్చు. సంస్థలకూ ఇవ్వవచ్చు. అలా అని నోబెలే తన వీలునామాలో చెప్పాడు. ‘యూరప్లో మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, శాంతిని నెలకొల్పడం కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఈసారి శాంతి అవార్డును యూనియన్కి ఇచ్చామని కమిటీ చెప్పుకుంది. అరబ్బు నేలపై యుద్ధాన్ని చేసే ప్రతి సందర్భంలోనూ అమెరికా ఒక ‘సంకీర్ణ కూటమి’ని తయారు చేస్తుంది. ఆస్ట్రియా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, బ్రిటను ఈ కూటమిలో వుంటాయి. ‘యూరప్ యూనియన్’లో ఈ దేశాలదే ప్రముఖ పాత్ర. ఆ కృతజ్ఞతతోనే అమెరికా ఆ అవార్డును ఇప్పించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘శాంతికి యూరోపియన్ యూనియన్ ఏమైనా ఛాంపియనా?’ అనే హెడ్డింగులతో పత్రికలు విమర్శలు కూడా రాశాయి. శాంతే కాదు; సైన్సూ అంతే! శాంతి పురస్కారాలలోనే కాదు. శాస్త్ర, సాహిత్య పురస్కారాలలో కూడా ‘నోబెల్’ వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ‘గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్’ అనే సబ్జక్టు మీద రోజర్ వైసైన్, వసామూ షిమోమురా, మార్టిన్ చెలిఫ్ అనే ముగ్గురికి ‘కెమిస్ట్రీ అవార్డు’ను 2008లో ఇచ్చారు. నిజానికి ఈ ఫార్ములా వీరిది కాదు. డగ్లస్ ప్రెషర్ అనే అత నిది. అవార్డు వచ్చిన ముగ్గురిలో ఒకరైనా రోజర్ వైసైన్ ‘ప్రెషర్’కి స్నేహితుడూ, శిష్యుడు కూడా. ఇతను ప్రెషర్తో వుంటూనే, ‘నోబెల్ అవార్డు మీకు తప్పకుండా వస్తుంది. అందుకు నా వంతు కృషి నేను చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి, ఈ ఫార్ములా రూట్ని తెలుసుకుని, మిగతా ఇద్దరికీ చేరవేశాడు. వారు ముగ్గురూ దాన్ని తమదిగా బిల్డప్ చేసి ‘నోబెల్ కమిటి నామినేషన్’కు పంపారు. అవార్డు వారికి వచ్చింది. అప్పుడు తేరుకున్న ప్రెషర్ ‘ఈ ఫార్ములా నాది’ అని కమిటీకి తెలియజేసి కొన్ని ఋజువుల్ని పంపాడు. ఈ తప్పు సరిదిద్దవలసిన ‘రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సెన్సైస్’ వారు ‘‘నువ్విప్పుడు శాస్త్ర వృత్తిలో లేవు. డ్రైవింగ్ వృత్తిలో వున్నావు. కాబట్టి నీకీ అవార్డు రాదని’’ సమాధానం ఇచ్చారు. ఆ అవార్డు వచ్చే సమయానికి అతను బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మాట నిజమే. అతని ఆర్థిక పరిస్థితి అలాంటిది. అంత మాత్రాన అతను ఆ అవార్డుకు అర్హుడు కాకుండా పోతాడా? నిజానికి ప్రెషర్కి రోజర్ చేసిన ‘గురుద్రోహం’కన్నా, నోబెల్ కమిటి చేసిన ‘సాంకేతిక ద్రోహమే’ ఘోరమైనది. కెమిస్ట్రీ అవార్డు మీదే ఇంకో వివాదం వుంది. ‘కేటలిస్టిక్ ఎఫెక్ట్ ఆన్ మెటల్ సర్ఫేసెస్’ (లోహ ఉపరితలంపై ఉత్ప్రేరకాల ప్రభావం) అనే ప్రతిపాదనకు గాను గెర్హార్ట్ ఇర్టిల్ అనే అతనికి 2007లో అవార్డు ఇచ్చారు. నిజానికి ‘మోడరన్ సర్ఫేస్ సైన్స్ అండ్ కెటాలిసిస్’ (ఆధునిక ఉపరితల శాస్త్రమూ, ఉత్ప్రేరకాలూ) అని ఇర్టిల్ కన్నా ముందే గేబర్ సముర్జాయ్ అనే అతను ఒక ప్రతిపాదనను చేసి వున్నాడు. అతను చేసిన ప్రతిపాదనలో ఇర్టిల్ది ఒక పార్టు మాత్రమే. ఒక రకంగా దీనికి పితామహుడు గేబర్ సముర్జాయే. కాని నోబెల్ కమిటీ మాత్రం (2007లో) గెర్హార్ట్ ఇర్టిల్కి మాత్రమే అవార్డు ఇచ్చింది. దీనిపై అనేకమంది శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పించారు. పొలిటికల్ నోబెల్! నోబెల్ని ‘వివాదాల నోబెల్’గా అర్థం చేసుకున్నట్లుగానే ‘పొలిటికల్ నోబెల్’గా అర్థం చేసుకుంటే సముచితంగా వుంటుంది. చెప్పాలంటే ‘అమెరికా నోబెల్’గా అర్థం చేసుకోవడం ఇంకా అర్థవంతంగా వుంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ వుండకపోవచ్చు. 1901 నించి 2012 వరకు 856 మందికి నోబెల్ అవార్డులు ఇస్తే ఒక్క అమెరికాకు చెందిన వారికే 353 మందికిచ్చారు. అంటే దానర్థం మేధస్సూ, పరిశోధనా, సాహిత్య తపనా, శాంతి అమెరికా సొత్తు అనా? కాదు. అయిల్ పైన, ఆయుధాలపైనా అమెరికాకు ఎంత గుత్తాధిపత్యం వుందో ‘నోబెల్’ పైనా అంతే గుత్తాధిపత్యం వుందని దానర్థం. ఇదీ నోబెల్ కథ. నోబెల్ వివాదాల కథ. - నన్నూరి వేణుగోపాల్ హిట్లర్కి కోపమొచ్చింది! 1936లో కార్ట్ వన్ ఓసిటిజ్కి అనే అతనికి నోబెల్ అవార్డును వచ్చింది. ఇతను ప్రఖ్యాతిగాంచిన జర్మన్ రచయిత. నాజీ సిద్ధాంతాన్నీ, హిట్లర్నీ వ్యతిరేకిస్తూ సాహసోపేతమైన రచనల్ని రాశాడు. ఇతనికి అవార్డు రావడంతో హిట్లర్ సహించలేక పోయాడు. ‘జర్మన్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇకపై నోబెల్ ప్రైజ్ని తీసుకోవద్దని ఒక హుకుం జారీ చేశాడు. దాంతో 1938లో కెమిస్ట్రీకీ, 1939లో మెడిసిన్, కెమిస్ట్రీలకూ నోబెల్ అవార్డులు వచ్చినప్పటికీ హిట్లర్కి భయపడి ఆ అవార్డులను వారు తీసుకోలేకపోయారు. పురస్కార తిరస్కారం! 1964లో సాహిత్యానికిగాను జీన్పాల్ సర్ట్రి అనే అతనికి అవార్డు ఇస్తే అతను తిరస్కరించాడు. 1973లో ‘లిడ్యురాతో’ అనే అతనికి ‘ప్యారిస్లో శాంతిని నెలకొల్పాడు’ అంటూ అవార్డును ఇస్తే అతను ‘వియత్నాం ఒక ప్రక్కన అశాంతితో అల్లాడుతుండగా ఈ అవార్డును నేను తీసుకోను’ అని అవార్డును తిరస్కరించి తన నిరసనను ప్రకటించాడు. మొత్తం నోబెల్ అవార్డు ‘వందేళ్ల చరిత్ర’లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘శాంతి పురస్కారాన్ని’ సిద్ధాంతం కోసం తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఇతనే కావచ్చు. నోబెల్ ఆత్మహత్యలు! ఇప్పటిదాకా మనం నోబెల్ అవార్డు దుర్వినియోగాన్ని చూశాం. వివాదాల్ని చూశాం. తిరస్కరణల్నీ చూశాం. దీంట్లో ఇంకో కోణం వుంది. అది ఆత్మహత్యల కోణం. అయితే ఈ అవార్డుకి ఈ మరణాలకి సంబంధం లేదుగానీ ఆ స్థాయి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1968లో సాహిత్యానికిగాను ‘ఎసూనారి కవాబాట’కి అవార్డు ఇచ్చారు. అతను ‘జపాన్, ది బ్యూటిఫుల్ అండ్ మైసెల్ఫ్’ అని జపాను సంస్కృతి మీద ఒక థీసీస్ రాశాడు. ఈ అవార్డు అందుకున్న నాలుగేళ్లకు అంటే 1972లో బాత్రూమ్లో గ్యాస్ పైపు లీక్ అయ్యి చనిపోయాడు. దానంతట అది యాక్సిడెంటల్గా లీకు అయ్యికాదు; తానే లీక్ చేసుకుని చనిపోయాడు. కవాబాటకు ‘యుకియో మిషియా’ అనే ఒకామెతో వివాహేతర సంబంధం వుందని, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆ షాక్ వలనే ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడనే నిజం ఒకటి ఆ తర్వాత బైటకొచ్చింది. 1972లోనే ‘స్టాన్ఫోర్డ్మూరి’ అనే అతనికి కెమిస్ట్రీ క్రింద నోబెల్ అవార్డునిచ్చారు. అతను ‘ఎమియోట్రాపిక్ లేటరల్ సిరియోసిస్’ అనే కండరాల నరాల జబ్బు వలన ఆత్మహత్య చేసుకున్నాడు. కేన్సర్ మీద రీసెర్చి చేసినందుకు ‘క్రిష్టియన్ డి దువే’ అనే అతనికి 1974లో మెడిసిన్ విభాగంలో అవార్డునిచ్చారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న అతను ఆ వ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే యూరప్లో అప్పటికే రైట్ టు డై అనే చట్టం వుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి అప్పీలు చేసుకుని ప్రభుత్వ అనుమతితో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ మరణం మీద ఎటువంటి వివాదమూ లేదుగాని ‘అతని అప్పీలును ప్రభుత్వం శాస్త్ర బద్ధంగా పరిశీలించకుండానే అతనికి ఆ అవకాశం ఇచ్చిందనే విమర్శ మాత్రం వుంది. గాంధీకి ఎందుకివ్వలేదు? మొత్తం మీద ‘వివాదాల నోబెల్’ అనదగ్గ అవార్డు ఇది. బహుశా ప్రపంచంలో మరే ఇతర అవార్డుకీ లేనంత వివాదం ఈ అవార్డుకు వుంది. అన్నిటిలోకి పెద్ద వివాదాస్పదమైన విషయం ఏమిటంటే గాంధీకి ఈ అవార్డు ఇవ్వకపోవడం. ‘రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించి వాటి మధ్యన శాంతిని నెలకొల్పే విషయంలో విశేషంగా కృషి చేసిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన శాంతి పురస్కారాన్ని ఏనాడో దారి తప్పించారు. అహింసా మార్గంలో కృషి చేసేవారికీ, అంతర్జాతీయంగా ప్రజల మధ్య సంబంధాలు పెంచేవారికీ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ అర్థంలో గాంధీకి ఇవ్వాలి కదా? కాని ఇవ్వలేదు. ప్రపంచ వ్యాపితంగా ‘అహింసా వాది’గా పేరు పొందిన గాంధీకి ఈ అవార్డును ఇవ్వకపోవడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఒక మనిషి ఒక పరిశోధన చేసి ‘నా పరిశోధనను గుర్తించండి’ అంటూ అవార్డుకోసం అర్రులు చాచడంలో అర్థం వుంటుంది. శాంతి కోసమో, అహింస కోసమో నిలబడిన వారు ‘తమను గుర్తించండి’ అంటూ అప్లికేషన్లు పెట్టుకోవడమేమిటి? గాంధీ కోసం భారతదేశం నుంచి ఒకసారి కాదు; 1937 నించి 1948 వరకూ అయిదుసార్లు నామినేషన్ పత్రాలు నార్వేకి వెళ్ళాయి. వెళ్లిన ప్రతిసారీ వాటిని వారు తిప్పికొట్టారు. అయినా వీరు పంపిస్తూనే వున్నారు. చివరకు ‘ఆ పేరుతో వచ్చే నామినేషన్లు తీసుకోవద్దు’ అని తీర్మానం కూడా వారు చేశారు! నోబెల్ అవార్డు రాజకీయాలకు తలొగ్గి వుంటుందనేదానికి గాంధీది ఒక చక్కటి వుదాహరణ. గాంధీకి అవార్డుకోసం ప్రయత్నించిన ఆ కాలమంతా నార్వే జర్మనీ ఆక్రమణలో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కీ, జర్మనీకీ శతృత్వం వుంది. ఆ కాలమంతా మనది ఇండియా కాదు, బ్రిటీష్ ఇండియా. గాంధీ బ్రిటీష్ ఇండియాలో భాగం. బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడానికి ‘సుభాష్ చంద్రబోసు’ జర్మనీతో చేతులు కలపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి కారణాలు ఇంకా వున్నాయి. గాంధీ సినిమాకి అమెరికా ‘ఆస్కార్’ ఇచ్చినంత ఈజీగా గాంధీకి నోబెల్ ఇవ్వడానికి జర్మనీ ఆనాడు సిద్ధంగా లేదు. జర్మనీని కాదని అడుగువేయడానికి నార్వేకి స్వేచ్ఛ లేదు. ఆ రకంగా ఆ అవార్డును అందుకోకుండానే గాంధీ చనిపోయారు. గాంధీకి అవార్డును ఇవ్వకపోవడం నోబెల్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది. ఆ మచ్చనుండి బైట పడడానికి 1948లో ‘శాంతి అవార్డును అందుకోవడానికి ఈ ఏడాది ఎవ్వరూ లేర’ని కమిటీ ప్రకటించింది. ఎందుకంటే ఆ ఏడాదే గాంధీ మరణించాడు కాబట్టి. మరణించిన వారికి కూడా ‘భారత రత్న’ ఇచ్చే సంప్రదాయం మనకి వున్నట్లుగా మరణించిన వారికి ‘నోబెల్’ని ఇచ్చే సంప్రదాయం వారికి లేదు. -
ఇంక్స్పిరేషన్స్
జైల్లో ఉన్న గాంధీకి ఇందిరాగాంధీ ఉత్తరాలు రాస్తే.. ‘అందులో విషయాలు సరే ముందు దస్తూరి మార్చుకో. సరిగ్గాలేదని’ తిరిగి జాబు రాశారట గాంధీ! చేతిరాతకున్న ప్రాధాన్యం అలాంటిది. ఆ రాత రాసే వాళ్ల ఆసక్తిమీదే కాదు కాగజ్.. కలం.. దవాత్కున్న అనుబంధం మీదా ఆధారపడి ఉంటుంది అంటాడు కాలిగ్రఫీ ఎక్స్పర్ట్, నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డెరైక్టర్ వై.మల్లికార్జునరావు. అందులో పెన్ను పాత్ర అంతా ఇంతా కాదుట. ఆ విశిష్టతను చాటడానికి ‘ఇంక్స్పిరేషన్స్’ పేరిట బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శన ప్రారంభించాడు. దేశంలోనే ఇది తొలి ప్రదర్శన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.... చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక ఆసక్తి. ఎంతంటే... హ్యాండ్రైటింగ్లో రీసెర్చ్చేసేంత. ఆ క్రమంలోనే దస్తూరికి, పెన్నుకి మధ్య ఉన్న అనుబంధమూ అర్థమైంది. పెన్సిల్, ఫౌంటెన్ పెన్, బాల్పాయింట్ పెన్.. ఫైబర్ పెన్ ఇట్లా వీటన్నిటిలో కెల్లా పెన్సిల్తో రాసిన దస్తూరి అందంగా ఉంటుంది. మొదటి స్థానం ఫౌంటెన్ పెన్నుదే. కానీ పెరిగిన వేగం ఫౌంటెన్ పెన్నుని పక్కన పెట్టాయి. బాల్పాయింట్ పెన్నయితే చకాచకా రాయడానికి వీలుంటుందని అందరూ వాటినే ఇష్టపడతున్నారు. కానీ ప్రపంచంలో గొప్పవాళ్లందరూ ఇప్పటికీ ఇష్టపడేది, ఉపయోగించేది ఫౌంటెన్ పెన్నునే. పెన్నుల సేకరణ... ఎలక్ట్రానిక్ లెటర్ ఎవరి రాతనైనా ఒకే రకంగా చూపిస్తుంది. కానీ చేతిరాత ఏ ఇద్దరిదీ ఒకే రకంగా ఉండదు. అలాగే ఒక్కో పెన్ను ఒక్కో రకంగా అక్షరాలు పేరుస్తుంది. ఈ విషయం గమనించాక.. అసలు ప్రపంచంలో ఎన్ని పెన్నులున్నాయో వాటిన్నటినీ సేకరించడం మొదలుపెట్టాను. అలా ఇప్పటి వరకు దాదాపు రెండు వేల రకాల పెన్నుల్ని సేకరించా. ఇందులో అత్యంత ఖరీదైన మోంట్బ్లాక్ (మోబ్లా) పెన్నులూ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని వెయ్యిమంది ప్రముఖుల స్వదస్తూరీ ప్రతులనూ సేకరించా. ఇందులో అరిస్టాటిల్ మొదలు మహాత్మాగాంధీ, మదర్థెరిస్సా, లాంటి 350 మంది అత్యంత ప్రముఖులవీ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం... పెన్నుల ద్వారా చేతిరాత విశిష్టతను తెలపడమే. కంప్యూటర్లు వచ్చాక పెద్దవాళ్లెవరూ పెన్నుల్ని ఉపయోగించడంలేదు. రాసే అలవాటునూ మర్చిపోతున్నారు. పిల్లలు కూడా దస్తూరీపై శ్రద్ధ పెట్టడం లేదు. ఎప్పుడో సివిల్స్ రాయాల్సివచ్చినప్పుడు మాలాంటి వాళ్ల దగ్గరకొచ్చి ట్రైనింగ్తీసుకుంటున్నారు. అదేదో చిన్నప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవచ్చు కదా. అందుకే ఇలాంటి వారి కోసం చేతి రాతను చక్కదిద్దుకునే శిక్షణనిస్తున్నా. పదిహేడేళ్ల కిందట మొదలుపెట్టిన ఈ పని నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ పేరుతో కొనసాగిస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్లో.. ఓల్డ్ మోడల్ ఫౌంటెన్పెన్ నుంచి రాకెట్ పెన్, గన్ పెన్, స్క్రూడ్రైవర్పెన్, కార్పెన్, కర్రపెన్ను, కీ పెన్ను, కత్తెర పెన్నులాంటి రకరకాల పెన్నులున్నాయి. అలాగే లగ్జర్ కంపెనీ కొత్త ప్రొడక్ట్ (ఇంకా మార్కెట్లోకి విడుదల కాని) ఫౌంటెన్ పెన్ను కూడా ఉంది. మొత్తమ్మీద స్కూల్ పిల్లలను ఈ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటోంది. సరస్వతి రమ -
సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే!
కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అనుగుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీయ కోణాలు అర్థమవుతాయి. చరిత్రను సృష్టించేది సామాన్యులే. మనిషి భూ మ్మీదపడి ఎరుక మొదలైన దగ్గర నుంచి విలువలతో జీవించటం ఉన్నతమై నది. ఎలా జీవించాలనేది ఎవరికివాళ్లు స్వతంత్రంగా తయారు చేసుకునే జీవిత పాఠం. దీనికి సిలబస్ నివసించే ప్రదేశం, ప్రధానంగా ఇల్లే. ఇల్లు చూస్తే వ్యక్తిగతంగా కనిపిస్తుంది కానీ ఇల్లు సామాజికాం శంలో అత్యంత ముఖ్యమైనది. ఎదుటివాళ్లపై విమర్శలు చేసేటప్పుడు ఫలానా వ్యక్తి తన కుటుంబం తాను చూసుకున్నాడు కానీ సమాజాన్ని ఏం పట్టిం చుకున్నాడని ధ్వజమెత్తుతారు. దీన్ని విశ్లేషించేటప్పుడు అది పూర్తిగా వాళ్ల సొంత కుటుంబ వ్యవహా రంగానే చూస్తారు. కానీ సమాజంలో సహజీవనం చేస్తున్న కుటుంబం లేదా ఆ కుటుంబ సభ్యులు సమాజానికి ఏమీ చేయకపోయినా బాధలేదు. కానీ నష్టం చేసే పని చేయకూడదు. కుటుంబం తీర్చిది ద్దుకోవటానికి కావాల్సిన విలువలను మాత్రం సమాజం అందివ్వాలి. అప్పుడు కుటుంబాలలో నుం చి పొదుగుకొచ్చే విలువలు ఆ సమాజానికి రక్షగా ఉంటాయి. ఇందుకు పెద్ద తాత్త్విక చింతనలు, సిద్ధాంతాలు అక్కర్లేదు కానీ ఆ సమాజం తాలూకు మంచి విషయాలను మాత్రం జాగ్రత్తగా గమనించా లి. ఆ సమాజం అందించే విలువల తాలూకు మా ర్పులే సమాజ పరిణామక్రమాలుగా మారుతాయి. ఇటీవలే మా కవి మిత్రుడు బెల్లియాదయ్య తండ్రి సాయిలు పరమపదించిన సందర్భంగా నల్లగొండ జిల్లా నక్రేకల్ దగ్గర పాలెం గ్రామానికి వెళ్లాం. ఆయనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధిం చిన గుర్తింపూ లేదు. ఆస్తిపాస్తులు అంతగా లేవు. కోటానుకోట్ల పేదలలో ఆయనొక సాధారణ మనిషి. కానీ విలువలున్న మంచి మనిషని అక్కడి కొచ్చిన వాళ్లంతా ఆయన గురించి చెప్పుకున్నారు. ఆయన గడిపిన పూర్ణ జీవితం కుటుంబ విలువలలో సామాన్యుల జీవన తాత్వికతను అచ్చంగా ప్రతిఫ లించింది. సాయిలు ఏమీలేని తనం నుంచి రెక్కల కష్టం మీదనే ఆధారపడి జీవించాడు. గొర్రెలను మళ్లించిన వాళ్లంతా క్రీస్తులు కారు. సాయిలు మా త్రం కుటుంబ పోషణకు గొర్రెలు కాశాడు. భూమి కౌలుకు తీసుకున్నాడు. దుక్కిదున్నాడు. తన నలు గురు కొడుకుల్ని జీవితంలో నిలబెట్టాడు. తన బిడ్డలకు మానవీయ విలువలను నేర్పాడు. వాటిని కూడా బోధనల ద్వారా కాకుండా ఆచరణాత్మకంగా ఆచరించి మరీ చూపాడు. సాయిలు ఇల్లు గుడిసె కావచ్చును కానీ దాన్ని మానవీయ విలువలు పొది గిన నిలయంగా మార్చాడు. తన తండ్రి తన తల్లితో ఏనాడు అమర్యాదగా వ్యవహరించలేదని బెల్లి యాదయ్య గుర్తు చేసుకున్నాడు. అనురాగాలను పంచుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకుం టూ పోయిన చిలకాగోరింకల గూడు అది. తన తండ్రి తల్లిని గౌరవించటం, ఆమె మాటలకు విలువనిచ్చి అన్యోన్యంగా కలిసిమెలసి జీవించే జీవ న నిర్మాణ సూత్రాలను ఆ కుటుంబం పాటించింది. ఇతరులను గౌరవించటం తోటి వారిపై ప్రేమ కలిగి ఉండడం, పక్కవారికి ఇబ్బంది కలుగకుండా ఎలా జీవించాలి? తదితర సామాజిక విలువలను, మానవీయ ఆలోచనలను ఎక్కువ భాగం కుటుం బం నుంచి నేర్చుకునే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. బెల్లి యాదయ్య ఆయన సోదరులు తన తండ్రి నుంచి వీటిని నేర్చుకున్నారు. ఆ కుటుంబం లో ఇద్దరు కొడుకులు వూర్లోనే వ్యవసాయం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఇంకొక కొడుకు సైని కునిగా సైన్యంలో పని చేస్తున్నాడు. యాదయ్య తెలుగు ఆచార్యునిగా నిలిచాడు. ఆ కుటుంబాన్ని చూస్తే సామాజిక శాస్త్రంలోని ఒక అధ్యాయంను చదివినట్లయ్యింది. కుటుంబాన్ని తన చేతులతో పెంచి పెద్ద చేసిన మనిషి అంతర్థానం అయినప్పు డు దుఃఖమొక్కటే తోడుగా ఉంటుంది. అందు లోంచి అంతర్థానమైన మనిషి ఒక తలపోతగా జీవి స్తాడు. ఆ తలపోతలతో మళ్లీ జీవనయానం మొద లవుతుంది. ఇదే జీవన ప్రస్థానంగా కొనసాగు తుంది. సాయిలు లాంటి వ్యక్తుల జీవితాలే మానవీయ విలువలుగా విరబూస్తాయి. చర్రిత తన చుట్టూ తా ను తిరుగుతూ సామాన్యుల చుట్టూ తిరుగు తుంది. కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అను గుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్ మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీ య కోణాలు అర్థమవుతాయి. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన సామాజిక సం బంధాలు మానవీయ సంబంధాలను శక్తివంతంగా ప్రతిష్టించాయి. కుటుంబంలో నాటే సమానత్వపు ఆలోచనలు, విలువలే సమాజంలో ప్రతిఫలిస్తుం టాయి. ఉత్పత్తి కులం నుంచి వచ్చిన సాయిలు కుటుంబం చూస్తే అది మానవీయ విలువలను ప్రతిష్టించింది. కుటుంబంలోని సామూహిక ప్రజా స్వామ్యం కాలాన్ని బట్టి మార్పుకు గురవుతుంది. సమష్టి ఆలోచనలు, సమష్టి విలువలు సంఘర్షణకు గురవుతున్నాయి. సామాజిక సంబంధాలకు సంబం ధించిన మార్పులు కుటుంబం నుంచే జరగాలి. సామాజిక మార్పుతోనే రాజ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి. వ్యక్తి నుంచి కుటుంబం పరివర్తన చెందటం సామాజిక మూలాల నుంచే జరుగుతుంది. సమాజంలోని మూలాలే మానవీయ సంబంధాలను ప్రతిఫలిస్తాయి. మనం ఎంత కాద నుకున్నా ఇప్పుడు మార్కెట్ సమాజంలో ఉన్నాం. దాని ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది. ఇక్కడే ఉత్పత్తి కులాలకు చెందిన కుటుంబాలు సమాజానికి అందించిన విలువలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన సమాజ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనావేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. సమాజంతోపాటు మారే విలు వలు మానవీయ విలువలను కాపాడే విధంగా ఉ న్నాయోలేవో చూడాలి. సమున్నత వ్యవస్థల కోసం ప్రజాస్వామిక సమాజాలు ఎదురు చూస్తాయి. -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు జూలూరు గౌరీశంకర్ -
సమ్మె ఉధృతం
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు స్తంభించిన వైద్యసేవలు వెనుదిరుగుతున్న రోగులు సాక్షి, సిటీబ్యూరో: జూనియర్ డాక్టర్ల సమ్మెతో నగరంలో అత్యవసర వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులు, హృద్రోగులు, గర్భిణులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అత్యసర విభాగాల్లో నిపుణులు లేకపోవడంతో వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు తిప్పిపంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్ (48) ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత చాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స కోసం 108లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత వైద్యం అందక ఆయన మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. 107 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 15రోజులుగా సాధారణ విధులను బహిష్కరించిన జూడాలు తాజాగా అత్యవసర సేవలనూ నిలిపివేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి చికిత్స కోసం గురువారం ఉదయం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు కనీస వైద్యసేవలు అందక పోవడంతో వారు నిరాశతో వెనుతిరుగాల్సి వస్తోంది . ఓపీ సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో రోగులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ ఆచరణలో అవి కన్పించడం లేదు. అత్యవసర విభాగాల్లో యునానీ, ఆయుర్వేద వైద్యులతో పాటు 108 సిబ్బందే రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు ఉస్మానియా వైద్య కళాశాలలో... జూడాల సమస్యలు పరిష్కారించపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఉస్మానియా వైద్యకళాశాల ఆవరణలో 18వ రోజు జూడాలు తమ ఆందోళన కొనసాగించారు. రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే 107 జీవో ప్రతులను వారు హోమగుండంలో వేసి దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
గాంధీజీకి గవర్నర్, సీఎం నివాళులు
సాక్షి, హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీకి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లో బాపూ ఘాట్లోని సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత టూరిజం శాఖ గాంధీ మెమోరియుల్ హాల్లో మహాత్ముని డాక్యుమెం ట్లు, పుస్తకాలు, ప్రచురణలను సందర్శించారు. అనంతరం వివిధ మత గురువులతో కలసి సర్వమత ప్రార్థనలు చేశారు. మహాత్మునికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మండలిచైర్మన్ స్వామిగౌడ్, వుంత్రులు హరీ శ్వర్రావు, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్శర్మ, ఎంపీలు జితేందర్రెడ్డి, బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, విద్యాసాగర్రావు, కాం గ్రెస్ నేతలు నాగేందర్, హనువుంతరావు, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. శ్రీధర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఏజేసీ సంజీవయ్య ,చింతల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు. -
తడవకో మాట చెప్పొద్దు
ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి వెంటనే శ్వేతపత్రం ప్రకటించండి చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీల అమలుపై తడవకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించవద్దని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. వాగ్దానాలన్నిటినీ ఎప్పటికి నెరవేరుస్తారో తెలియజేస్తూ వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడారు. సత్యం, అహింస అనేవి గాంధీజీ నమ్మిన మూల సిద్ధాంతాలని, వాటి అమలుకు ఎంతవరకు కట్టుబడి ఉన్నామో గాంధీ జయంతి సందర్భంగానైనా బాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఆయన ఎన్నికలపుడు ప్రజలకు చేసిన 40 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సత్యానికి కట్టుబడి అమలు చేయడం లేదని విమర్శించారు. గాంధీ సిద్ధాంతాలు ఆచరణలో చేసి చూపించాలన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున చేసిన తొలి ఐదు సంతకాల అమలు విషయంలోనూ బాబు వాగ్దాన భంగానికి పాల్పడ్దారని దుయ్యబట్టారు. ‘స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వాతంత్య్రం, గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన అనేవి గాంధీ ప్రధాన సిద్ధాంతాలు. వీటిల్లో ఏవీ రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. రైతు రుణ మాఫీ, పింఛన్ల పంపిణీ, తాగునీటి సరఫరా, బెల్ట్ షాపుల రద్దు, పదవీ విరమణ వయో పరిమితి పెంపు, ఇంటికో ఉద్యోగం లేకుంటే రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీలపై తడవకో మాట చెబుతూ బాబు సత్య దూరంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేరుుంచడం, దాడులు చేయించడం వంటి చర్యలతో అహింసకు తిలోదకాలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన వారిని తమ వైపు తిప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. వీటన్నింటిపైనా బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని ఉమ్మారెడ్డి హితవు చెప్పారు. ఆ మాట బ్యాంకర్లను చెప్పమనండి ‘చంద్రబాబు సీఎం అయ్యే నాటికే రైతు రుణాల బకారుులు రూ.87,612 కోట్లు, డ్వాక్రా మహిళల రుణాలు రూ.15,000 కోట్లు ఉన్నట్లు ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు చెప్పారు. షరతుల్లేకుండా రుణాలు రద్దు చేస్తామని తొలుత చెప్పి ఆ తరువాత మాట మార్చి పలురకాల ఆంక్షలు విధించి వాటిని రూ.43,000 కోట్లకు తగ్గించారు.వాటినైనా ఎప్పటిలోగా మాఫీ చేస్తారో శ్వేతపత్రం ప్రకటించాలి. మాఫీ విషయంలో బాబు ఒక రకంగానూ, నిధుల సేకరణ కమిటీ నేత సుజనాచౌదరి మరో రకంగానూ మాట్లాడుతున్నారు. రుణంలో 20 శాతమే బ్యాంకులకు చెల్లించి, మిగతా మొత్తానికి 10 శాతం వడ్డీతో బాండ్లు ఇస్తామంటున్నారు. బాబు మాటలను నమ్మి రుణాలు చెల్లించని రైతులపై 14 శాతం వడ్డీ భారం పడింది. వరుసగా నాలుగేళ్లలో రుణ విముక్తి కలుగుతుందంటున్నారు. ఎన్నికలపుడు అలా చెప్పలేదే. పోనీ ప్రభుత్వం ఇచ్చే బాండ్లను అంగీకరిస్తామని, రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని బ్యాంకర్లను చెప్పమనండి. ఇదే విషయం విలేకరుల సమావేశం పెట్టి ఎందుకు చెప్పరు? మద్యం బెల్ట్ షాపులు తీసేశారో తెలియదు కానీ, డోర్ డెలివరీ సిస్టమ్ మాత్రం యధేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడుతున్నది ఒక్క మద్యం ద్వారా వచ్చే ఆదాయమేనని పాలకులు చెబుతున్నారు. ఇందుకు సిగ్గుపడాలి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయం పెంచుకుంటారా? గాంధీకి అర్పించే నివాళి ఇదేనా?’ అని ఉమ్మారెడ్డి నిలదీశారు. జాతిపితకు, లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి గాంధీజీ బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని, ఆ మహనీయుడి తత్వాలు, సిద్ధాంతాల బోధనకే తాము ప్రాధాన్యం ఇస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పార్టీ నేతలు పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో గాంధీ సిద్ధాంతాలు, ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. కొందరు మాత్రం పేదవాడికి సేవ చేస్తున్నామనే ముసుగులో ఆత్మవంచన చేసుకుంటున్నారని, అలాంటి వారికి తాము వ్యతిరేకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చేసిన ప్రసంగాలు ప్రశంసనీయమైనవని, భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. శాస్త్రి నిరాడంబరత్వాన్ని ఆయన కొనియాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ముఖ్యనేతలు గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్, చల్లా మధుసూదన్రెడ్డి, పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎస్.శేఖర్గౌడ్, గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, మహ్మద్లు పాల్గొన్నారు. -
గాంధీ సాక్షిగా.. గొడవ పడ్డారు!
-
మహాత్ముడికి వైసీపీ నేతల నివాళి
-
మహాత్మా గాంధీకి నేతల ఘన నివాళి
-
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మోడీ
-
గాంధీకి హైద్రాబాద్తో ఉన్న అనుబంధమిది!
-
మహాత్మా గాంధీకిదే మా నివాళి!
-
అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!
ఆర్జించిన ధనానికి కవచం దానమే... పదార్థాలను త్యాగం చేయడం ద్వారా నిన్ను నీవు రక్షించుకో... దానం... త్యాగం ప్రాధాన్యాలను తెలిపే ఈ సూక్తులను ఎవరు చెప్పారు? విధుల... మృదుల అనే అక్క చెల్లెళ్లు చెప్తున్నారు... నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమం వీరి నివాసం... తండ్రి గణపతి శాస్త్రి బోధించిన గాంధీ సూక్తులు వీరికి ఆదర్శం. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ సాధారణమైన పాతకాలం నాటి భవనం. ఎటు చూసినా ఫలిత కేశాలతో, వెన్ను వంగిపోయి, పండుటాకులను తలపిస్తున్న వృద్ధులే కనిపిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు తెల్లటి నూలు దుస్తులు ధరించి గాంధీజీ ఆశయాలకు ప్రతీకల్లా, సరస్వతీ మాత రూపాల్లా ఉన్నారు. వారిద్దరూ ఆశ్రమం అంతా కలియ తిరుగుతూ బాధ్యతగా అందరినీ పలకరిస్తున్నారు. ప్రాంగణం దగ్గరకు వెళ్తే ‘చర్ల సుశీల వృద్ధాశ్రమం, శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం’ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద గణపతి శాస్త్రి, సుశీల ఫొటో ఉంది. ఆ ఫొటోలో ఉన్న దంపతుల కూతుళ్లే విధుల, మృదుల. తల్లి సుశీల పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి తండ్రి ఆశయాలకు రూపమిస్తున్నారు. అభాగ్యులకు ఆశ్రయమిస్తున్నారు. అనాథలకు జీవితాన్నిస్తున్నారు. తండ్రి బాటలో సొదరీమణులు..: చర్ల గణపతి శాస్త్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా. జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రబోధాల ప్రభావంతో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు గణపతి శాస్త్రిని కొవ్వూరు జైలులో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన చాగల్లులో గాంధీ ఆశయాలతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. అది బాపూ హైస్కూల్గా కొనసాగుతోంది. గణపతి శాస్త్రి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించారు. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించారు. మహిళల కోసం నిడదవోలు పట్టణంలో 1950లో కస్తూరిబా మహిళా సమాజాన్ని స్ధాపించారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన, మద్యపాన నిషేధంపై ప్రచారం నిర్వహించారు. గణపతి శాస్త్రి ఏనాడూ ఎవరినీ స్తోత్రాలు వల్లించి దీవించలేదు. ‘మంచి చేయండి. మీ పిల్లలకు మంచి జరుగుతుంద’ని చెప్పేవారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిని వినోభాబావే భూదాన ఉద్యమం నిర్వహించిన సమయంలో విరాళంగా ఇచ్చారు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే పని చేసి 1996లో గుండెపోటుతో దూరమయ్యారు. గణపతి శాస్త్రి భార్య చర్ల సుశీలమ్మ అన్నదానాలు చేసేవారు. విధుల, మృదుల కుమారికి కూడా అదే సేవాగుణం అలవడింది. తండ్రి మార్గదర్శనం...: తండ్రి కోరుకున్న విధంగా మహిళా సమాజాన్ని నడిపిన ఈ అక్కాచెల్లెళ్లు ఆపన్నులకు ఆశ్రయం కూడా అక్కడే కల్పించాలనుకున్నారు. అలా 2000లో ఐదుగురితో వృద్ధాశ్రమం స్థాపించారు. వీరిలో పెద్దామె విధులకు 76 సంవత్సరాలు. ఎంఏ బిఈడీ చదివి హిందీలో డాక్టరేట్ పట్టా పొందారు. విశాఖపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్గా పనిచేసి రిటైరయ్యారు. గాంధేయవాది అయిన తండ్రిని గుర్తు చేసుకున్నారామె. ‘‘నా ఉద్యోగ జీవితంలో అధ్యాపకురాలుగానే కాకుండా భారత స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పని చేశాను. దేశభక్తి, అనాథల సేవలాంటి సద్గుణాలను చిన్నతనంలో మానాన్న గారి నుంచి నేర్చుకున్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవారు నాన్న. ఆయన సేవా నిరతి నాకిప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య అకాల మరణం తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది. పోయినవాళ్ళు అదృష్టవంతులు మీరు బాధపడకూడదని మా ఇద్దరికీ హితవు చెప్పారు నాన్న. అలాంటి తండ్రికి బిడ్డలుగా పుట్టడం ఎంతో అదృష్టం. ఇక మా అమ్మ...’’ అంటూ కొద్దిసేపు ఆగారామె. ‘‘అనాథలైన వృద్ధులకు సేవ చేయాలనేది అమ్మ కోరిక. ఆ ఆశయసాధన కోసమే అమ్మపేరున ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాం. నాకు ప్రతి నెలా వస్తున్న పెన్షన్, దాతల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నాం. కుటుంబ జీవిత చట్రంలో ఇరుక్కుపోతే వారి ఆశయాలను నిర్వహించలేమని అవివాహితులుగా ఉండిపోయాం’’ అన్నారు విధుల కుమారి. ఉన్నత విద్యావంతులు కావడంతో... ఈ సోదరీమణులిద్దరూ ఉన్నత విద్యావంతులు. విధుల చెల్లెలు మృదుల విశాఖపట్నంలోని వి.ఎం.సీ మహిళా విద్యాపీఠ్లో హిందీ లెక్చరర్గా పనిచేసి రిటైరయ్యారు. తండ్రి గణపతి శాస్త్రి ఎప్పుడూ... ‘దేశం మాకేం ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం’ అని ఆలోచించాలని ఉద్బోధించేవారని గుర్తు చేసుకున్నారామె. ‘‘సేవ, సకల జీవుల పట్ల దయతో ఉండటం, మానవసేవయే మాధవ సేవ ఇత్యాది సుగుణాలను నాన్న నేర్పించారు. భగవంతుడు దీనజనుల్లోనే ఉన్నాడు. వారికి సేవ చేస్తే దైవాన్ని సేవించినట్లేనని చెప్తుండేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అక్కతో కలిసి అభాగ్యుల సేవలో కొనసాగుతున్నాను. అనాథలు, వృద్ధులకు మాకు చేతనైనంత చేస్తున్నాం. అక్క, నేను ఇద్దరం చదువుకున్న వాళ్లం కావడంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు చదువు చెప్తున్నాం. వారు ప్రైవేట్గా డిగ్రీ చదువుకుంటున్నారు. అంధులు కూడా కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగిస్తున్నారు. మాకు మా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన, చింతా ఏ కోశానా లేవు ’’ అన్నారు. అందరి ఆకలి తీర్చడానికి...: చర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లు రెండు వందల వరకు ఉంటారు. అయితే భోజన సమయానికి వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే. వీరికే కాకుండా రోడ్ల మీద బిచ్చమెత్తుకునే వారి ఆకలీ తీరుస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, రోడ్డు కూడళ్లలో అడుక్కునే వారికి ఉదయం 11 గంటలకు ఆశ్రమం నుంచి భోజనం తీసుకెళ్లి పెడతారు. ఈ ఆశ్రమంలో ఏటా గాంధీ జయంతి రోజున గాంధీజీకి పుష్పాంజలి, సర్వమత ప్రార్థన నిర్వహిస్తారు. దాంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ ఉపాధ్యాయులు, గాంధేయ వాదుల వంటి విశిష్ఠ వ్యక్తులకు గాంధీజీ స్మారక పురస్కారాలిస్తారు. విద్యార్థులకు గాంధీజీ జీవితం అనే అంశం ఆధారంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. డెబ్భై ఏళ్లు నిండితే మందు వేసుకోవడానికి నీళ్లందించే వారి కోసం చూస్తారు ఎవరైనా. మంచం మీద నుంచి లేవాలనిపిస్తే మనవడో, మనవరాలో ఆసరాగా ఉంటే బావుణ్ణు అనిపించే వయసది. అలాంటప్పుడు ఎవరైనా పిల్లల అండలో జీవితం కడతేరాలని కోరుకోవడం సహజం. ఆ అండలేని వారికి కొండంత అండగా నిలుస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అందుకు వారికి తమ వార్ధక్యం అడ్డురావడం లేదు. వారి ఆశయమే ఆసరాగా ఉంది. - గాడి శేఖర్బాబు, సాక్షి, నిడదవోలు ఆత్మీయ సేవకు అందిన గుర్తింపు: 2007లో సహృదయ చారిటబుల్ సొసైటీ వారిచే ఉత్తమ సేవా అవార్డు. ఠి2010లో జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ సేవా సంస్ధ అవార్డు, ఠి 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా సంస్ధ నిర్వాహక పురస్కారం. ఠి స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి ఉత్తమ మహిళా సేవకురాలి అవార్డులు. -
గాంధీ గురించి తెలియని ఉపాధ్యాయులు
గాంధీ గురించి తెలియని ఉపాధ్యాయులు మహత్ముడి గురించి మంత్రి అడిగిన ప్రశ్నలకు బిక్కమొహాలు ఆప్షన్ ఇస్తూ వివేకానందుడి గురించి అడిగినా సమాధానం శూన్యం త్వరలో 16 వేల మంది టీచర్ల నియామకం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఏదో పని మీద అయ్యవార్లు మంత్రి వద్దకు వచ్చారు. పార్టీ ఆఫీసులోనే కనుక సులభంగా పనులైపోతాయని ఉత్సాహ పడ్డారు. తీరా మంత్రి నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురవడంతో సమాధానాలు చెప్పలేక బిక్కమొహాలేశారు. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ శుక్రవారం కేపీసీసీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకోగోరారు. ఇదే సందర్భంలో కొందరు ఉపాధ్యాయులు తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి వచ్చారు. వారు సీఎల్ పెట్టి వచ్చారా లేక స్కూళ్లకు డుమ్మా కొట్టారా...అని మంత్రి వాకబు చేశారు. సీఎల్ పెట్టి వచ్చామని చెప్పడంతో, పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నారంటూ ఆరా తీశారు. వెంటనే...గాంధీజీ గురించి ఏం పుస్తకాలు చదివారు, ఆయన ఎక్కడ, ఎప్పుడు పుట్టారు అని ప్రశ్నించారు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన ఉపాధ్యాయులు నీళ్లు నమిలారు. పోనీ..వివేకానందుడు ఎప్పుడు జన్మించారో చెప్పండంటూ ‘ఆప్షన్’ ఇచ్చారు. దానికీ సమాధానం లేదు. దీంతో అసహనానికి గురైన మంత్రి...మీరు పిల్లలకు ఏం పాఠాలు చెబుతారు, ఎవరిని ఆదర్శంగా తీసుకోమంటారు అంటూ నిష్టూరమాడుతూ, బయటకు నడవాల్సిందిగా ద్వారం వైపు చూపించారు. 16 వేల మంది టీచర్ల నియామకం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరతను నివారించడానికి వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది ఉపాధ్యాయులను నియమిస్తామని మంత్రి తెలిపారు. కేపీసీసీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 11,400 మంది ఉపాధ్యాయుల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి లభించిందని వెల్లడించారు. మిగిలిన పోస్టులకు కూడా త్వరంలోనే ఆమోదం లభిస్తుందన్నారు. కొరత ఎదురు కాకుండా ఏటా అయిదు వేల మంది ఉపాధ్యాయులను నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారని తెలిపారు. -
ఇది ఆమె జీవనచిత్రం
కొన్నేళ్ల కిందటి వరకు ఆమె సాధారణ గృహిణి. భర్త... కూతురితో అందంగా అల్లుకున్న పొదరిల్లు ఆమెది. ఓ రోజు... ఊహించని ప్రమాదం. బస్సు తాకిడికి కింద పడిపోయారామె. బస్సు చక్రం ఆమె చేతి మీద నుంచి వెళ్లిపోయింది. తాను కోల్పోయింది చేతినా... జీవితాన్నా? ఈ ప్రశ్నకు తనకు తానే సమాధానం చెప్పుకున్నారామె. ఇప్పుడామె... ఒక చేత్తోనే బొమ్మలు వేస్తున్నారు. చిన్న పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పిస్తున్నారు. గాంధీజీ ఆశయాలను బోధిస్తున్నారు. జీవితాన్ని జయించడం ఇలా... అంటున్నారు. తన జీవితాన్ని కొత్తగా చిత్రించుకున్నారు. గూడూరు లక్ష్మిది శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరులోని పొగతోటలో ఆమె నివాసం. లక్ష్మి తాత రావూరు జయరామిరెడ్డి సినీ నటుడు. విజయ వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆమె పుట్టే నాటికి చెన్నై నగరంలో ఉన్న వారి కుటుంబం తండ్రికి లైబ్రేరియన్గా ఉద్యోగం రావడంతో నెల్లూరు జిల్లా వాకాడుకు మారింది. పెద్దయిన తర్వాత లక్ష్మణ్కుమార్తో వివాహమైంది. ఇంత వరకు ఎటువంటి ప్రత్యేకతలూ లేకుండానే చాలా సాధారణంగా గడిచిపోయింది ఆమె జీవితం. పెళ్లయిన ఏడేళ్ల వరకు వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. ఓ రోజు బంధువుల పెళ్లికి భర్తతోపాటు బైక్ మీద వెళ్తున్నారామె. ఇంతలో... వెనుక నుంచి బస్సు వచ్చి ఢీకొట్టింది. తేరుకుని చూస్తే ఎడమ చెయ్యి రెండుగా తెగిపోయి దూరంగా పడి ఉంది. ఆ చేతిని అతికించడం అసాధ్యమన్నారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో భర్త, కుటుంబసభ్యులందరూ ఆమెకి ధైర్యం చెప్పారు. కానీ ఆమెని ఆవరించిన దిగులు మాత్రం వదల్లేదు. తాను కొలిచే దేవుడే పలికించినట్లు... ప్రమాదం గురించి తెలిసిన బంధువుల్లో ఒక్కొక్కరు ఒక్కోరోజు వచ్చి పలకరించి పోతున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు జీవితం పట్ల నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పి పోతున్నారు. అలాంటప్పుడు కూతురు లాస్య అన్న మాటలే తనకు మార్గదర్శనం చేశాయంటారు లక్ష్మి. బంధువుల్లో ఒకామె... ‘‘లాస్యా... మీ అమ్మకి చేయి లేదు కదా. తనేమీ చేసుకోలేదు. నువ్వు సాయం చేస్తుండాలి’’ అన్నారు. వెంటనే లాస్య... ఉక్రోషంతో ‘‘మా అమ్మ ఒక్క చేత్తోనే అన్ని పనులూ చక్కగా చేస్తోంది. ఒకచెయ్యి లేకపోతేనేం మరో చెయ్యి ఉందిగా. ఎవ్వరూ మా అమ్మకు చెయ్యి లేదనవద్దు’’ అన్నది. ఆరేళ్ల లాస్యకు ఏం తెలిసి అన్నదో కానీ ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయంటారు లక్ష్మి. ‘‘బహుశా నేను పూజించే దేవుడే పాప చేత ఆ మాటలు పలికించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఏ రోజూ నాకు చెయ్యి లేదనుకోలేదు. ఉన్న చేత్తోనే ఏమేం చేయవచ్చో అన్నీ చేస్తున్నాను. అప్పటికే నాకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. కుట్లు, అల్లికలు బాగా చేసేదాన్ని. ప్రమాదం తర్వాత చిత్రలేఖనంలో మళ్లీ శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్, పాట్ పెయింటింగ్... అనేక రకాల చిత్రలేఖనాలు వేస్తున్నాను. నాలో ఉన్న కళకు మెరుగులు దిద్దుకోకుండా ఇంటికే పరిమితమవుతున్నానని ఆ దేవుడే ఇలా చేశాడేమో అనుకుంటున్నాను’’ అని స్థితప్రజ్ఞతతో అన్నారామె. గాంధీజీ స్ఫూర్తితో... లక్ష్మి వేసిన బొమ్మలలో గాంధీజీ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఆమె ఆసక్తి ఉన్న చిన్న పిల్లలకు చిత్రలేఖనంలో ఉచితంగా శిక్షణనిస్తుంటారు. పిల్లలకు గాంధీజీ ఆశయాలను బోధిస్తుంటారు. గాంధీ ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్లో చురుగ్గా పాల్గొంటారు. అదే విషయాలను ప్రస్తావించినప్పుడు... ఆమె బాల్యంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు మా తాత దగ్గర పెరగడం ఇష్టం. ఆయనతో సినిమా షూటింగులకు వెళ్లడం ఇష్టం. అలా తరచూ మద్రాసు (చెన్నై)కు వెళ్లేదాన్ని. ఒకసారి... అవి ‘యమగోల’ షూటింగ్ జరుగుతున్న రోజులు. తాతతోపాటు స్టూడియోకి వెళ్లాను. నటుడు కైకాల సత్యనారాయణగారు కనిపించారు. దగ్గరకు వెళ్లి పలకరించాను. అప్పుడాయన ‘‘పరిచయం లేకపోయినా సరే చూడగానే గుర్తు పట్టి వచ్చి పలకరించావు. నీలో మంచి విల్పవర్, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నువ్వేమైనా సాధించగలవు’’ అని మెచ్చుకున్నారు. అప్పుడే ఆయన గాంధీజీ గురించి చాలా చెప్పారు. అలా గాంధీజీ గురించి చదవడం అలవాటైంది. ఆ తర్వాత బొమ్మలు వేయడం కూడా. ఒకసారి పల్లెపాడు గ్రామం (నెల్లూరు జిల్లా)లో ఉన్న గాంధీజీ ఆశ్రమం నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి సంతోషంగా అంగీకరించాను’’ అన్నారు. చేతిరాత బాగుంటే... గాంధీ ఆశ్రమంలోని పిల్లలకు చిత్రలేఖనం నేర్పించడానికి మరో కారణాన్ని చెప్తారు లక్ష్మి. గాంధీజీ తరచుగా ‘చేతిరాత బాగాలేకపోతే తల రాత బాగుండదనేవారు’ పిల్లల చేతిరాత బాగుపడాలంటే చిత్రలేఖనం మంచి మార్గం- అనుకున్నాననంటారు. రక్తదానం ఎన్నిసార్లు చేశారంటే ఆమె నుంచి ఇన్నిసార్లనే సమాధానం రాదు. ఎన్నిసార్లు చేశానో లెక్కపెట్టుకోలేదు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ‘ఉత్తమ సేవా ప్రతినిధి అవార్డు’ అందుకున్నారామె. గాంధీ ఆశ్రమ నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో ఆమె చేతి నుంచి డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. ఒకసారి లక్ష్మి అల్లుడు (లాస్య భర్త) లక్షన్నర రూపాయల వరకు సహాయం చేశారు. ‘‘ఆ సంఘటనతో నా కుటుంబం నాకే కాక, నా ఆశయానికి కూడా అండగా ఉందనిపించి చాలా సంతోషం కలిగింది’’ అన్నారామె. లక్ష్మి తన జీవితాన్ని పలువురికి స్ఫూర్తిదాయకంగా మలుచుకున్నారు. నెల్లూరు నగరంలో ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరుగుతుంది. ఆ రథం మీద శంకుచక్రాలు, హనుమంతుడు, గోవిందనామాలతోపాటు, ఇస్కాన్ మందిరంలో పరదాల మీద చిత్రాలు కూడా లక్ష్మి వేసినవే. ఎవరి జీవితంలోనైనా ప్రమాదం జరిగితే అది వారి జీవితాన్ని అనూహ్యమైన మలుపులు తిప్పుతుంది. చాలా మంది ప్రమాదం తర్వాత ఆ దిగులుతో ఇంటి నాలుగ్గోడలకే పరిమితమవుతుంటారు. కానీ లక్ష్మి మాత్రం ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని చక్కటి మలుపులు తిప్పుకున్నారు. - సాక్షి, నెల్లూరుఫొటోలు : ఆవుల కమలాకర్ నటులు సత్యనారాయణగారు మనందరం ఆ జాతిపిత అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆ మాటలు నాలో చాలా ప్రభావం చూపించాయి. నాన్న లైబ్రేరియన్ కావడంతో పుస్తకాలు చదివే అవకాశం ఉండేది. గాంధీజీ పుస్తకాలే ఎక్కువగా చదివేదాన్ని. చిత్రలేఖనంలోనూ ఎక్కువ గాంధీజీ బొమ్మలే వేస్తున్నాను. బాపూజీ బొమ్మ వేయడం నాకిష్టం. - లక్ష్మి, విధిని జయించిన మహిళ -
పవన్ 'జనసేన' పార్టీపై కేసు నమోదు
-
గాంధీ సినిమా దర్శకుడుతో పనిచేయడమే అద్భుతం
ముంబై: గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. ‘కస్తూరీ బా పాత్ర నాకు ఎలా వచ్చిందో లీలగా గుర్తుంది. మరాఠీ నాటకాల్లో నటిస్తున్న సమయంలో డాలీ ఠాకూర్ అనే ఏజెంట్ వచ్చి రిచర్డ్ సార్ను కలవాలని చెప్పింది. ఆయన ఢిల్లీ మీదుగా లండన్ వెళ్తూ ముంబైలో ఆగారు. నేను కూడా ఆ రోజు ముంబైలోనే ఉండడంతో గంటసేపు మాట్లాడగలిగాను. తెల్లవారి డాలీ ఫోన్ చేసి నాకు కస్తూరి పాత్ర దక్కిందని చెప్పింది. డాలీ సాయంతో ఎలాగొలా పాస్పోర్టు సంపాదించి లండన్ వెళ్లాను’ అని వివరించారు. రిచర్డ్ గాంధీ సినిమా నటులందరికీ స్క్రిప్టు ప్రతులు ఇచ్చి హోంవర్క్ చేయాలని సూచించేవారు. దీంతో రోహిణి కస్తూరీ బాపై వచ్చిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేశారు. యాస లేకుండా ఇంగ్లిష్ మాట్లాడాలని సూచించడంతో ఈమె ప్రత్యేకంగా వక్తృత్వ తరగతులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతేగాక చరఖా వడకడం నేర్చుకోవాలని గాంధీ పాత్రధారి బెన్ కింగ్స్లేతోపాటు తనకూ సూచించారని రోహిణి చెప్పారు. 1982లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులు అందుకుంది. ‘అప్పుడు నా వయసు చాలా చిన్నది కాబట్టి కస్తూరి పాత్ర ప్రాధాన్యం సరిగ్గా అర్థం కాలేదు. కేవలం పాత్రలాగే భావించి చేస్తూపోయాను. తదనంతరం ఈ సినిమా ప్రచారం కోసం ఎన్నో దేశాలు తిరిగి తరువాత ఈ పాత్ర గొప్పదనం ఏంటో అర్థమయింది. నటన విషయంలో రిచర్డ్ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు’ అని వివరించారు. -
ఐ లవ్ ఇండియా
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వెయ్యి మీటర్లతో రూపొందించిన జాతీయ పతాక ప్రదర్శన విశాఖవాసులను ఆకట్టుకుంది. 104 ఏరియాకు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు గురువారం మర్రిపాలెం నుంచి ఎన్ఏడీ కొత్తరోడ్ వరకూ పొడవైన పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. - సాక్షి, విశాఖపట్నం స్వాతంత్య్ర పోరాటం చరిత్ర పుటల్లో విశాఖ జిల్లాకు సముచిత స్థానముంది. దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో జిల్లావాసులు కూడా నడుం బిగించారు. అధిక సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా బరిలోకి దూకారు. టర్నర్ సత్రం, పూర్ణాథియేటర్, హిందూ రీడింగ్రూమ్, రెల్లివీథి రామాలయం సమావేశాలకు వేదికలుగా నిలిచాయి. ఉప్పుపై కప్పం విధించడంతో దేశవ్యాప్తంగా గాంధీజీ నాయకత్వంలో ఉప్పుసత్యాగ్రహం జరిగింది. ఇందులో భాగంగానే 1930 ఏప్రిల్ 13న విశాఖ సముద్రతీరంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన నారాయణశర్మ, తెన్నేటి విశ్వనాథం, దిగుమర్తి రామస్వామి, కొల్లూరి సూర్యనారాయణగుప్తలు అరెస్టయ్యారు. తరువాత మేలో గాజువాక బలచెరువు ఉప్పు గల్లీల వద్ద రెండో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. దీనితో జగన్నాధరావు, కందాళ సర్వేశ్వరశాస్త్రి, మల్లవరపు వెంకట కృష్ణారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో బృందంగా ఉద్యమం నిర్వహించిన జానకీబాయమ్మ, బిజెగుప్త, దేవులపల్లి గణపతిరావుతో సహా 20 మంది అరెస్టయ్యారు. మహాత్ముడు అడుగిడిన వేళ.. హరిజనోద్ధరణ లక్ష్యంతో గాంధీజీ దేశంలో యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన 1933 డిసెంబర్ 29న విశాఖ వచ్చారు. సముద్రతీరంలో జరిగిన సభకు ప్రజలు నీరాజనం పట్టారు. సభ తరువాత ఇప్పటి ఏవీఎన్ కళాశాల దరి రెల్లివీథిలోని రామాలయంలోకి గాంధీజీయే స్వయంగా హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించడానికిగాను 1930లో విశాఖలో తొలి రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశం పూర్ణా థియేటర్లో జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారికి టర్నర్ చౌల్ట్రీలో బస ఏర్పాటు చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా 1932 జనవరి 11న సముద్రతీరంలో విదేశీ వస్తువులను తగులబెట్టారు. - విశాఖపట్నం అనకాపల్లి మదిలో గాంధీజీ అనకాపల్లి: పట్టణంలో అడుగడుగునా మహాత్మ గాంధీ స్మృతులు కదలాడుతూ ఉంటాయి. ఒక వీధి పేరు గాంధీనగరం. పాత బెల్లం మార్కెట్కు గాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు బెల్లం మార్కెట్ రింగ్రోడ్కి తరలిపోవడంతో ఇప్పుడున్న కూరగాయల మార్కెట్ను గాంధీ పేరుతో పిలుస్తుంటారు. 75 ఏళ్ల నుంచి గాంధీ ఖద్దరు సొసైటీని అనకాపల్లిలో నిర్వహిస్తున్నారు. ఏఎమ్ఏఎల్ కళాశాలలో మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహం మకుటాయమానం. జాతిపితతో అనకాపల్లి వాసులకు ఎంతో అనుబంధం. గాంధీజీ ఈ పట్టణానికి నాలుగుసార్లు విచ్చేశారు. మొదటిసారి 1921 మార్చి 31వ తేదీన స్వరాజ్యయాత్రలో భాగంగా వచ్చారు. బెజవాడలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి గాంధీజీ హాజరైన సందర్భంగా అనకాపల్లి మీదుగా రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా అనకాపల్లి స్టేషన్కు చేరుకున్న గాంధీకి పట్టణ ప్రజలు తిలక్ స్వరాజ్య నిధికి 200 రూపాయలు వసూలు చేసి అందించారు. * 1929 మే 1న గాంధీజీ ఖద్దరు యాత్రను పురస్కరించుకొని అనకాపల్లికి విచ్చేసారు. ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం నుంచి అనకాపల్లికి చేరుకున్న గాంధీజీ రాత్రి వరకు ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. * 1933 డిసెంబర్ 29న గాంధీజీ విజయనగరం మహారాజావారి రోల్స్రాయిస్ కారులో ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. మార్కెట్ స్క్వేర్ గాంధీబజార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనగా వేలాదిమంది హాజరయ్యారు. * 1946 జనవరి 20వ తేదీన సాయంత్రం 3.45కి అనకాపల్లి రైల్వేస్టేషన్కు గాంధీజీ చేరుకున్నారు. గాంధీజీ హిందీ నిధికి ఎం.జి. కన్నయ్యపంతులు 1000 రూపాయలు విరాళం సమర్పించారు. అనకాపల్లిలో గాంధీజీ మౌనవ్రతం పాటించారు. మన్యం వీరుడు... మండే సూరీడు... దేశభక్తిని రగిల్చాడు.. వలస పాలనపై నిప్పు రాజేశాడు.. తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయాడు.. స్వాతంత్య్ర సాధనకు ప్రాణాలిచ్చాడు.. మన్యం వీరుడు.. మండే సూరీడు.. మన అల్లూరి సీతారామరాజు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమర దిక్కును చూపించిన విరోచిత యోధుడాయన. బ్రిటిష్ అధికారుల ఆగడాలపై తిరుగుబావుటా ఎగురవేశాడు. గిరిజనుల్లో విప్లవాగ్నిని రగిలించాడు. 1917లో గొలుగొండ తాలుకాలో భూపతి అగ్రహారం వద్ద కాలు మోపిన అల్లూరి బ్రిటిష్ అరాచకాలను తిప్పికొట్టాలని భావించాడు. అదే సమయంలో తహశీల్దారులుగా పనిచేస్తున్న బాస్టీన్ గిరిజనులను రోడ్డు పనుల పేరిట ఇబ్బందులకు గురిచేశాడు. 1922 ఆగస్టు 22-27 మధ్య రామరాజు గాం గంటన్నదొర, మల్లుదొరతో కలిసి ఐదు పోలీసు స్టేషన్లపై దండెత్తాడు. కేడీ పేట, రాజవొమ్మంగి, రంపచోడవరం, అడ్డతీగల స్టేషన్లపై దాడులు చేసి అక్కడ ఆయుధాలను పట్టుకుపోయాడు.1922 సెప్టెంబర్లో అల్లూరి దావాణాపల్లి ఘాట్ వద్ద బ్రిటిష్ అధికారులు హైటర్, విలియమ్లను హతమార్చాడు. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారులు పెద్దగెడ్డ లింగాపురం వద్ద 13 మంది గిరిజనులను చంపి వారి మృతదేహాలను ఊరేగించడం ద్వారా భయపెట్టాలని ప్రయత్నించారు. 1924 మేలో మేజర్ గూడాల్ చేతిలో అల్లూరి ప్రాణాలు విడిచాడు. - కొయ్యూరు -
స్వదేశీ కలం
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం స్వాతంత్య్రోద్యమ సమయంలో తనదైన పంథాలో పోరాటం చేసింది. శాంతి పోరాటం చేసే ఎందరో దేశభక్తుల చేతి ఆయుధంగా మారింది. కత్తితో కాదు కలంతోనే స్వాతంత్య్రం సాధించగలమనేవారికి అండగా నిలిచింది. పదునైన మాటలు, పాటలు ఉద్భవించడానికి తోడ్పడింది. అదే ‘రత్నం’ పెన్ను. రాజరాజనరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం (రాజమండ్రి) కోటగుమ్మం సెంటర్ దగ్గరకు అడుగుపెడుతుండగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. స్వదేశీ భావన కట్టలు తెంచుకుంటుంది. దేశభక్తి పరిమళాలు గుబాళిస్తాయి. అందుకు కారణం... స్వాతంత్య్ర సమర సమయంలో రూపుదిద్దుకున్న రత్నం పెన్నుల షాపు. స్వాతంత్య్రోద్యమం కదం తొక్కుతున్న సమయంలో 1921లో గాంధీజీ... ‘విదేశీ వస్తువులను నిషేధించి, స్వదేశీ వస్తువుల తయారీపై దృష్టి పెట్టండి’ అని ఇచ్చిన పిలుపును అందుకుని కోసూరి రత్నం అనే స్వర్ణకారుడు ఏదో ఒక స్వదేశీ వస్తువు తయారుచేయాలని భావించారు. ముందుగా గాంధీగారి లితోబ్లాక్ ను తయారుచేసి, నాటి మంత్రివర్యులైన కళావెంకట్రావుగారితో కలిసి వార్ధా వెళ్లి, బాపూజీకి స్వయంగా బహూకరించారు. ఆ సందర్భంలో గాంధీజీ... ‘అందరిలోనూ స్వదేశీ భావాలు నాటాలి’ అని సూచించారు. గాంధీజీ ఉపదేశం... తొలి స్వదేశీ కలం ఆవిర్భావానికి కారణమైంది. పాళీ తయారుచేసి... రాజమండ్రిలో 1931లో జస్టిస్ కృష్ణమాచారి సబ్జడ్జిగా పనిచేసేవారు. ఒకసారి ఆయన వాడే జర్మనీ పెన్ను పాళీ విరిగిపోయింది. ఆయన సన్నిహితులు పెన్నుల తయారీకి రత్నం చేస్తున్న కృషి వివరించి, అక్కడికి వెళ్లమని సూచించారు. రత్నం నివాసానికి కృష్ణమాచారి వెళ్లి పాళీ చూపించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపారు రత్నం. ఆ రోజంతా కష్టపడి... కొత్త పాళీలా తయారు చేసి, కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నంగారిని మెచ్చుకుని, తక్షణం పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి తెచ్చారు. అదే కాలంలో ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకులు సుబ్బారావు పంతులు షష్టిపూర్తికి పలువురు సీనియర్ పాత్రికేయులు, ఇతర పెద్దలు హాజరవుతున్న విషయం చెప్పి, ముఖ్యులకు బహుమతి ఇచ్చేందుకు రెండు పెన్నులు తయారు చేయమని కోరారు. దీంతో వెండి గొట్టాలతో, బంగారు పాళీలతో పెన్నులు తయారుచేసి వారికి అందించారు రత్నం సోదరులు. వీటిని చూసిన అక్కడి పెద్దలు, తమకూ పెన్నులు కావాలని ఒత్తిడి చేయడంతో 1932 లో రత్నం పెన్నుల కంపెనీ వ్యవస్థాపనకు తొలి అడుగు పడింది. అక్షరసేవ... కోసూరి రత్నం, ఆయన సోదరుడు సత్యంతో కలిసి 1932లో ‘రత్నం’ పేరుతో స్వదేశీ పెన్నుల కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ నుంచి వెలువడిన పెన్నుతో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ ఎందరో దేశనాయకులు లేఖాస్త్రాలు సంధించారు. ప్రజలను చైతన్యం చేస్తూ స్వాతంత్య్రోద్యమానికి పురికొల్పిన వేలాది వ్యాసాల రచనకు మాస్టర్ కాపీలను ఈ పెన్నులే అందించాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అక్షర సేవ చేసింది రత్నం సంస్థ. నాటి ప్రస్థానం నేటివరకూ కొనసాగుతూనే ఉంది. గాంధీగారు గుర్తించిన తర్వాతే... ఎందరో మహనీయుల ప్రోత్సాహంతో పెన్నుల తయారీ ప్రారంభించిన రత్నం... తాను తయారు చేసిన పెన్నును వార్ధాలో ఉన్న గాంధీజీకి పోస్టులో పంపారు. ఆ పెన్నును తిప్పి పంపుతూ, ‘‘బెంగుళూరు, కలకత్తాల్లో ఇలాగే విదేశీ పెన్నుల విడి భాగాలను అమర్చి విక్రయిస్తున్నా రు. ఇది కూడా అలాంటిదేనని భావిస్తున్నాను’’ అని లేఖ రాశారు. తమ పెన్నులను స్వదేశీ పెన్నుగా బాపూజీ గుర్తించలేదని రత్నం నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో 1935లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు జె.సి.కుమారప్ప రాజమండ్రి వచ్చి పెన్నుల తయారీకి ప్రభుత్వ సహకారం కావాలంటే తమ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అంతకంటే ముందుగా తనకు ఆ పెన్నులు తయారుచేసి చూపాలని కోరారు. రెండు రోజుల పాటు శ్రమించి రెండు పెన్నులు తయారుచేసి ఆయనకు ఇచ్చారు రత్నం సోదరులు. సుమారు రెండు నెలల తర్వాత 1935 జూలై 16న గాంధీజీ ఆంగ్లంలో స్వదస్తూరీతో రాసిన లేఖ వార్థా నుంచి వచ్చింది. అందులో... ‘‘డియర్ రత్నం, మీరు కుమారప్ప గారి ద్వారా పంపిన పెన్ను అందింది. అందుకు కృతజ్ఞతలు. ఇది నాకు చాలా అవసరం. ఇది విదేశీ పెన్నులకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది’’ అని రాశారు. గాంధీ గారు రత్నం పెన్ను వాడుతున్నారన్న వార్త దేశమంతా వ్యాపించింది. దాంతో, అనేకమంది నేతలు రత్నం పెన్నుల కోసం ఎగబడ్డారు. అలా రత్నం పెన్నులకు స్వదేశీ పెన్ను అనే ఖ్యాతి దక్కింది. ఇలా నడుస్తోంది... యూజ్ అండ్ త్రో పెన్నుల ధాటికి తట్టుకోలేక ఈ కంపెనీ మూత పడే స్థితికి చేరినా, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెట్టుబడిగా మలుచుకుని నేటికీ పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు, రత్నం కుమారుడు కె.వి.రమణమూర్తి. పదేళ్లపాటు వ్యాపారం ఒడిదుడుకుల పాలైనప్పటికీ రత్నం బ్రాండ్ను కొనసాగించాలనే నిర్ణయంతో పాతకాలం మెషినరీకి పదునుబెడుతూ ఇప్పటికీ పెన్నులు తయారుచేస్తున్నారు. ప్రపంచంలో అతి చిన్న పెన్ను తయారుచేసినందుకుగాను రికార్డులకెక్కారు. బంగారం పెన్నుపై గాంధీగారు, భారతమాత చిత్రాలను గీసిన ఖ్యాతి దక్కింది. స్వాతంత్య్ర ఉద్యమానికి అక్షరరూపం ఇచ్చిన రత్నంగారి కృషి కి నేటికీ ప్రభుత్వ గుర్తింపు లభించకపోవడం కాస్త బాధ కలిగించే విషయమే! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి ఆవిర్భావం... ‘పిన్ను నుంచి పెన్ను వరకు’ అన్న గాంధీజీ మాటల్లోని ‘పెన్ను’ నాన్నగారిని ఆకర్షించింది. 1922 నుంచి పెన్నుల తయారీ పై దృష్టిపెట్టారు. అప్పట్లో చలామణీలో ఉన్న విదేశీ పెన్నులను అయ్యంగారి శ్రీరామమూర్తి మచిలీపట్నంలోని ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ల్యాబ్లో పరీక్ష చేయించి, అందులో వాడే మూల పదార్థాలను నాన్నగారికి వివరించారు. ముందుగా 14 క్యారెట్ల బంగారంతో పాళీ తయారుచేశారు. 1930 నాటికి స్వదేశీ పెన్నుకు రూపు తెచ్చారు. - కె.వి.రమణమూర్తి, (రత్నం కుమారుడు) వీరంతా రత్నం పెన్నులు వాడారు... ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్గా, ముఖ్యమంత్రిగా పని చేసిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు, నెహ్రూ,పిఠాపురం మహారాజు ఎం.ఎస్.థామ్సన్, రిజర్వ్బ్యాంకు నాటి గవర్నర్ బి.వెంకటప్పయ్య, బెనారస్ మహారాజు విజయానంద గజపతి, నైజాం ప్రభుత్వ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు , భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన సమకాలీనులు రత్నం పెన్నులను విరివిగా వినియోగించారు. -
చండీ ప్రసాద్ భట్కు గాంధీ శాంతి బహుమతి