Indian Super League
-
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
గోవా ఘన విజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్గా మ్యాచ్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. జంషెడ్పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్పూర్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
గోవా ఘనవిజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. లీగ్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. శనివారం జరగనున్న మ్యాచ్ల్లో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్పూర్ ఎఫ్సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
మోహన్ బగాన్ ‘టాప్’ షో
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తాజా సీజన్లో 11 మ్యాచ్లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్, గోవా ఫుట్బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్తో ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
మోహన్ బగాన్ గెలుపు
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్పూర్ ఎఫ్సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 8 మ్యాచ్లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్లో ఓడింది. 2 మ్యాచ్ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు. -
జంషెడ్పూర్కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్పూర్కు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ ఆడనుంది. -
పంజాబ్ ఎఫ్సీ బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్ కావడం విశేషం. పంజాబ్ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్సెన్ పెనాల్టీ కిక్ను గోల్గా మలిచాడు.ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్ గోల్తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్ మిర్జాక్ గోల్తో పంజాబ్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్లో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టు తలపడుతుంది. -
చెన్నైయిన్ ఎఫ్సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా ఎఫ్సీ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. చెన్నైయిన్ తరఫున ఫారుఖ్ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్... డేనియల్ (69వ ని.లో) ఒక గోల్ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీ 1–0 గోల్తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును ఓడించింది. -
కష్టాలన్నీ తీరినట్టే.. బెంగళూరుతో తొలి మ్యాచ్.. ఈసారైనా!
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్కు ఐఎస్ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్ను తప్పించేందుకు రంగం సిద్ధం!ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్ఎల్లో ఆరో సీజన్కు ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్తో భర్తీ చేశాడు.తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్గా నిలిచింది.తర్వాతి ఏడాదీ రన్నరప్గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్లో నెగ్గి, 16 మ్యాచ్లలో ఓడి, 5 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది. అన్నీ సమస్యలే... బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.ఐఎస్ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది. కొత్త యాజమాన్యంతో... సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్లైన్గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్లను మినహాయించి ఇతర మ్యాచ్ల షెడ్యూల్ను ఐఎస్ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్లో ఒక టీమ్ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్మెంట్ అండతో హెచ్ఎఫ్సీ 2024–25 సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.హైదరాబాద్ ఎఫ్సీ జట్టు వివరాలు అర్ష్దీప్ సింగ్ సైనీ, లాల్బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్లన్చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్సవ్మా చాక్చువాక్, లాల్చన్హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్లాల్రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్కర్, జోసెఫ్ సన్నీ. కోచ్: తంగ్బోయ్ సింగ్తో. నేటి నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ 11వ సీజన్కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ కూడా చక్కటి ఫామ్తో సవాల్ విసురుతోంది.నేడు జరిగే మొదటి మ్యాచ్లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
విజయంతో ముగించిన హైదరాబాద్ ఎఫ్సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ దశను హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో కేరళ బ్లాస్టర్స్ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్తో బొర్జా హెరెరా హైదరాబాద్ను గెలిపించాడు. లీగ్ దశలో ఆడిన 20 మ్యాచ్లలో 13 గెలిచి 4 మ్యాచ్లు ఓడిన హైదరాబాద్ మరో 3 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్సీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 4న కోల్కతాలో మోహన్బగాన్, ఒడిషా ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో హైదరాబాద్ రెండో సెమీఫైనల్ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న హైదరాబాద్లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్ (రెండో అంచె) మ్యాచ్ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్సీతో శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్సీ జట్టుకు మూడో పరాజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఒడిశా ఎఫ్సీ 3–1 గోల్స్తో హైదరాబాద్ను బోల్తా కొట్టించింది. ఒడిశా తరఫున ఇసాక్ (33వ ని.లో), డీగో మౌరిసియో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ ప్లేయర్ నిమ్ డోర్జీ తమాంగ్ 72వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. హైదరాబాద్ నుంచి ఏకైక గోల్ను నిమ్ డోర్జీ (45వ ని.లో) సాధించాడు. 17 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 11 విజయాలు, 3 ‘డ్రా’లు, 3 ఓటములతో 36 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. చదవండి: Hyderabad E-Prix 2023 : రేసింగ్ @ హైదరాబాద్ Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ -
ISL 2022: హైదరాబాద్ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్పూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 1–0 గోల్తో జంషెడ్పూర్ ఎఫ్సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఐఎస్ఎల్లో హైదరాబాద్ ఎఫ్సీకి తొలి విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్సీ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జోరు ముందు నార్త్ఈస్ట్ జట్టు తేలిపోయింది. మ్యాచ్ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్ గోల్ చేయడంతో 1–0తో హైదరాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్పోస్ట్పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. హలిచరన్ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ను 3–3తో డ్రా చేసుకున్న హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఈ మ్యాచ్లో మరింత మెరుగైంది. -
‘గాడియమ్’తో చేతులు కలిపిన ఐఎస్ఎల్ విన్నర్ హైదరాబాద్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్ఎఫ్సీ ఒప్పందం చేసుకుంది. కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్బాల్ అకాడమీ’ని హెచ్ఎఫ్సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు. హెచ్ఎఫ్సీ టీమ్కు చెందిన కోచ్లు, ఇతర సాంకేతిక నిపుణులు దీనికి సహకరిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన కుర్రాళ్లకు మున్ముందు హెచ్ఎఫ్సీ తరఫున యూత్, లీగ్ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కూడా లభిస్తుంది. శిక్షణతో పాటు హెచ్ఎఫ్సీ ఆధ్వర్యంలో ఆటకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేని, ‘గాడియమ్’ డైరెక్టర్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్స్ షబ్బీర్ అలీ, విక్టర్ అమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
IPL 2022: ఇంటికి వస్తోంది.. ట్రోఫీ.. కంగ్రాట్స్: సన్రైజర్స్
ISL -IPL- Hyderabad: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) విజేతగా నిలిచింది. ఎనిమిదో సీజన్ చాంపియన్గా నిలిచింది. గోవాలో మార్చి 20న జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ‘షూటౌట్’ నిర్వహించగా కేరళను నిలువరించి విజయం సాధించింది. కాగా ఐఎస్ఎల్ ట్రోఫీని హైదరాబాద్ గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయంపై స్పందించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ ఐఎస్ఎల్ విజేతకు తమదైన శైలిలో విషెస్ తెలిపింది. మ్యాచ్కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఇంటికి వస్తోంది ట్రోఫీ.. కంగ్రాట్స్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందించింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు కేన్ మామ కూడా కప్ తీసుకువస్తాడు చూడండి అంటూ ఎస్ఆర్హెచ్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా సన్రైజర్స్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాత్రం ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈసారైనా సత్తా చాటి తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు Intiki vastondi. 🏆🧡💛 Congratulations, @HydFCOfficial 👏#ISLFinal pic.twitter.com/NyuH6z5z0t — SunRisers Hyderabad (@SunRisers) March 20, 2022 Thag Life, #Pushpa style. 😎🔥#TATAIPL #OrangeArmy #ReadyToRise@alluarjun @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/x8lAXZPrzB — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022 -
ISL: నరాలు తెగే ఉత్కంఠ.. ఎట్టకేలకు తొలి టైటిల్ గెలిచిన హైదరాబాద్
Indian Super League- Hyderabad FC Won Maiden Trophy- ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్లు కొట్టిన మూడు షాట్స్ను నిలువరించి తమ జట్టును విజేతగా నిలిపాడు. చాంపియన్ హైదరాబాద్ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్మనీగా లభించాయి. అంతకుముందు ఆట 68వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు రాహుల్ గోల్ అందించి 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే 88వ నిమిషంలో సాహిల్ గోల్తో హైదరాబాద్ 1–1తో సమం చేసింది. కేరళ జట్టు మూడోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది. మరోవైపు హైదరాబాద్ జట్టు మూడో ప్రయత్నం లో చాంపియన్గా నిలువడం విశేషం. 2019లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలువగా.. 2020– 2021 సీజన్లో ఐదో స్థానాన్ని పొందింది. ‘షూటౌట్’ సాగిందిలా... కేరళ బ్లాస్టర్స్- స్కోరు - హైదరాబాద్ లెస్కోవిచ్ - 01 -జావో విక్టర్ నిషూ కుమార్- 01 - సివెరియో ఆయుష్- 12 - కమారా జీక్సన్ సింగ్ - 13 - హాలీచరణ్ నోట్: ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్ను తీసుకోలేదు చదవండి: IND VS SL Pink Ball Test: పింక్బాల్ టెస్ట్పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు First Appearance in the Final ✅ First #HeroISL trophy ✅ A memorable night for @2014_manel & @HydFCOfficial as they end their campaign in style! 🏆🤩#HFCKBFC #HeroISLFinal #FinalForTheFans #HeroISL #LetsFootball pic.twitter.com/zauxXrqGga — Indian Super League (@IndSuperLeague) March 20, 2022 -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్గా మారిందని విశ్లేషించారు. లీగ్లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్కే వాస్తే’గా టీమ్లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్కీపర్గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
ISL 2021-2022: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గురువారం హైదరాబాద్ ఎఫ్సీ, చెన్నైయిన్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్ మొహమ్మద్ సాజిద్ ధోత్ గోల్ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్ ఫార్వర్డ్ ఆటగాడు జేవియర్ సివేరియో (45వ ని.) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చదవండి: అదే తీరు.. ఈసారి పంత్తో పెట్టుకున్నాడు -
హైదరాబాద్ ఎఫ్సీ భారీ విజయం; చెస్లో అదరగొట్టిన ఇమ్రోజ్, సరయు!
Indian Super League: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగంగా గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 5–1తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుపై నెగ్గింది. హైదరాబాద్ తరఫున సానా (12వ ని.లో), అనికేత్ (90వ ని.లో), సివెరియో (90వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఒగ్బెచె (27వ, 78వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చాంప్స్ ఇమ్రోజ్, సరయు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ చాంపియన్షిప్లో బాలుర విభాగంలో మొహమ్మద్ బాషిఖ్ ఇమ్రోజ్ (నల్లగొండ–6.5 పాయింట్లు), బాలికల విభాగంలో వేల్పుల సరయు (వరంగల్–5.5 పాయింట్లు) చాంపియన్స్గా నిలిచారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన శిబి శ్రీనివాస్ ఐన్స్టీన్ రెడ్డి (బద్రుకా కాలేజీ) 6 పాయింట్లతో తొలి రన్నరప్గా, సూరపనేని చిద్విలాస్ సాయి (హైదరాబాద్) రెండో రన్నరప్గా నిలిచారు. కర్రి శరత్చంద్ర (రంగారెడ్డి) నాలుగో స్థానాన్ని పొందాడు. టాప్–4లో నిలిచిన ఈ నలుగురూ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో సరయు, గంటా కీర్తి (మేడ్చల్), లేళ్లపల్లి దుర్గా కార్తీక, ఎ.సాయి మహతి (రంగారెడ్డి) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ నలుగురు కూడా జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. విజేతలకు టీఎస్సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విజేతగా నిలిపాడు. -
హైదరాబాద్ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’
వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్తో ఆదివారం జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. 16 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 23 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ క్లబ్ 2–1తో జంషెడ్పూర్ క్లబ్ను ఓడించి ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఈస్ట్ బెంగాల్ తరఫున స్టీన్మన్ (6వ ని.లో), పిలింగ్టన్ (68వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జంషెడ్పూర్ జట్టుకు హార్ట్లే (83వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరిగే మ్యాచ్లో ముంబై సిటీతో గోవా క్లబ్ ఆడుతుంది. -
ఒడిశా గెలిచిందోచ్...
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఇప్పటిదాకా బోణీ చేయని ఏకైక జట్టుగా ఉన్న ఒడిశా ఎఫ్సీ ఆ ముద్రను తాజా విజయంతో తొలగించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో ఒడిశా జట్టు 4–2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీపై విజయం సాధించింది. ఒడిశా స్ట్రయికర్ డీగో మౌరిసియో చెలరేగాడు. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒడిశా జట్టులో స్టీవెన్ టేలర్ (42వ ని.) మౌరిసియో (50వ, 60వ ని.) గోల్స్ సాధించారు. కాగా అంతకుముందే ప్రత్యర్థి ఆటగాడు జీక్సన్ సింగ్ (22వ ని.) సెల్ఫ్గోల్ చేయడంతో ఒడిశా స్కోరు 4కు చేరింది. కేరళ జట్టులో జోర్డాన్ ముర్రే (7వ ని.), గ్యారీ హూపర్ (79వ ని.) చెరో గోల్ చేశారు. 9 మ్యాచ్లాడిన ఒడిశా ఆరు పోటీల్లో ఓడిపోగా రెండు మ్యాచ్ల్ని డ్రా చేసుకుంది. శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్ ఎఫ్సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ తలపడుతుంది. -
హైదరాబాద్ ఎఫ్సీ మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను జావో విక్టర్ గోల్గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్ను డ్రా చేసుకుంది. లీగ్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన హైదరాబాద్ ఎఫ్సీ ఒక మ్యాచ్లో గెలుపొంది, 3 మ్యాచ్ల్లో డ్రా నమోదు చేసింది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం
వాస్కో (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్తో శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ జట్టు ఖాతా తెరిచింది. 90వ నిమిషంలో రోచర్జెలా చేసిన గోల్తో నార్త్ ఈస్ట్ విజయం ఖాయమైంది. నేడు జరిగే మ్యాచ్ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్ తలపడతాయి. -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
ఫ్రాంచైజీ ఫీజును తగ్గించండి
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ను కరోనా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లీగ్లోని ప్రతి జట్టు కూడా సీజన్కు రూ.30 కోట్ల మేర నష్టపోతున్న వేళ... కరోనా రూపంలో వారిపై మరింత ఆర్థిక భారం పడనుంది. దాంతో దీని నుంచి కాస్తలో కాస్త తప్పించుకోవడానికి లీగ్లో ఆడే అన్ని జట్లు కూడా ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ఈ ఏడాదికిగాను జట్లు చెల్లించే ఫ్రాంచైజీ ఫీజును తగ్గించాలంటూ లీగ్ నిర్వాహకులను, ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)ను అభ్యర్థించాయి. ప్రస్తుతం ప్రతి జట్టు కూడా సీజన్కు రూ. 13 నుంచి 16 కోట్లను ఫ్రాంచైజీ రుసుముగా చెల్లిస్తున్నట్లు సమాచారం. 2014లో ఎనిమిది జట్లతో ఘనంగా ఆరంభమైన ఐఎస్ఎల్... ప్రస్తుతం పది జట్లకు చేరింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఐపీఎల్ తర్వాతి స్థానంలో నిలిచినా... తాము ఇప్పటి వరకు లాభాలను కళ్ల చూడలేదని జట్ల యాజమానులు చెబుతున్నారు. కరోనా దెబ్బతో తమకు స్పాన్సర్లు కూడా దూరమయ్యే అవకాశం ఉందని ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఫీజుపై లీగ్ నిర్వాహకులు ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్పై వేటు
న్యూఢిల్లీ: కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019–20 ఐఎస్ఎల్ సీజన్లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెదర్లాండ్స్కు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్ఎల్లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునైటెడ్(2018–19)కు హెడ్ కోచ్గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
90 లక్షలు!
దుబాయ్: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ను భారత్లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. ఐఎస్ఎల్కు పెరిగిన వీక్షకులు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్ఎల్ (2019–20) సీజన్ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా ఈ సీజన్ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్స్టార్, జియో టీవీ డిజిటల్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్సీను కోల్కతా ఓడించింది. -
ఐఎస్ఎల్-ప్రీమియర్ లీగ్ల మధ్య కొత్త ఒప్పందం
ముంబై : ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్లో భాగంగా శుక్రవారం ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీ, ప్రీమియర్ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్బాల్ అభివృద్ధితోపాటు, కోచింగ్ సౌకర్యాలు, యువతలో ఫుట్బాల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్తో ఐఎస్ఎల్ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్లో ఫుట్బాల్ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిచర్డ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్లో ఫుట్బాల్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్ఎల్ భాగస్వామ్యంతో ఫుట్బాట్ కోచింగ్, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్బాల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్లో ఫుట్బాల్ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. -
హైదరాబాద్ ఎఫ్సీ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు
సాక్షి, హైదరాబాద్: తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ సీజన్లో వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు వేసింది. సీజన్లోని తదుపరి మ్యాచ్లకు ఆయనతో కలిసి పనిచేయడం లేదంటూ శనివారం ఒక ప్రకటన చేసింది. యాజమాన్యం, కోచ్ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హైదరాబాద్ కోచ్గా ఫిల్ అందించిన సేవలకు క్లబ్ తరఫున నుంచి అతడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఫిల్ జట్టును నడిపిన తీరు అభినందనీయం. అతని భవిష్యత్తు గొప్పగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ హైదరాబాద్ జట్టు సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆ ప్రకటనలో తెలిపారు. పుణే స్థానంలో ఐఎస్ఎల్ ఆరో సీజన్లో ఘనంగా అరంగేట్రం చేసిన హైదరాబాద్... ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం ఒక మ్యాచ్లో గెలిచి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకోగా... మిగిలిన 9 మ్యాచ్ల్లోనూ ఓడి టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
హైదరాబాద్ తొమ్మిదో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ పరాజయాలకు ఇప్పట్లో పుల్స్టాప్ పడేలా లేదు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 1–3 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్సీ చేతిలో ఓడింది. దీంతో సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. చెన్నై ఆటగాడు వాల్స్కీస్ (43వ, 65వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రాఫెల్ (40వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మార్సెలినో (87వ నిమిషంలో) చేశాడు. 12 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఐదు పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో ఒడిశా ఎఫ్సీ తలపడుతుంది. -
నార్త్ఈస్ట్పై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ గోవా 2–0తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీపై గెలుపొందింది. ఫలితంగా సీజన్లో ఏడో గెలుపును నమోదు చేసిన గోవా 24 పాయింట్లతో ‘టాప్’ స్థానంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో జాకీ చంద్ సింగ్ కొట్టిన పాస్ను అడ్డుకోబోయిన నార్త్ఈస్ట్ ప్లేయర్ కొమోస్కీ నేరుగా తమ గోల్పోస్టులోకే బంతిని పంపి సెల్ఫ్ గోల్తో ప్రత్యర్థి ఖాతాను తెరిచాడు. 82వ నిమిషంలో పెనాలీ్టని గోల్గా మలిచిన ఫెరాన్ కొరొమినాస్ గోవాకు 2–0తో విజయాన్ని ఖాయం చేశాడు. 80వ నిమిషంలో ప్రత్యరి్థని దురుసుగా అడ్డుకున్న నార్త్ఈస్ట్ ప్లేయర్ డేవిడ్ రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాడు. నేటి మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీతో జంషెడ్పూర్ ఎఫ్సీ తలపడుతుంది. -
బెంగళూరును గెలిపించిన సునీల్ చెత్రి
బెంగళూరు: ఎఫ్సీ గోవాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్ సాధించాడు. నేటి మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో అట్లెటికో డి కోల్కతా తలపడుతుంది. -
హైదరాబాద్ ఖాతాలో ఏడో పరాజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు ఓటములను ఖాతాలో వేసుకున్న హైదరాబాద్... ఆదివారం జరిగిన మ్యాచ్లో 1–2 గోల్స్ తేడాతో ముంబై చేతిలో ఓడింది. దీంతో టోరీ్నలో ఏడో పరాభవాన్ని మూట గట్టుకుంది. ముంబై ఆటగాడు సౌగౌ (6వ, 78వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధిం చాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్ను బోబో (81వ నిమిషంలో) చేశాడు. నాలుగు రోజుల విరామం తర్వాత జనవరి 3వ తేదీన బెంగళూరు ఎఫ్సీతో ఎఫ్సీ గోవా తలపడుతుంది. -
బెంగళూరుపై కోల్కతా గెలుపు
కోల్కతా: క్రిస్మస్ పర్వదినాన అట్లెటికో డి కోల్కతా జట్టు సంబరాల్లో మునిగి తేలింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో అట్లెటికో తొలిసారి బెంగళూరు ఎఫ్సీపై విజయం సాధించింది. ఐఎస్ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో రెండుసార్లు మాజీ చాంపియన్ అయిన అట్లెటికో జట్టు 1–0తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీపై గెలుపొందింది. మ్యాచ్ మొత్తం మీద అన్ని విభాగాల్లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు జట్టే ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. మ్యాచ్ 47వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ చేసిన గోల్తో అట్లెటికో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్లెటికో (18 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. -
గోల్కీపర్ నిర్లక్ష్యం...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆటగాళ్ల శ్రమను జట్టు గోల్ కీపర్ కమల్జీత్ సింగ్ వృథా చేశాడు. సొంత మైదానంలో గెలవాల్సిన చోట తన నిర్లక్ష్యంతో హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకునేలా చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో భాగంగా శనివారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్లెటికో డి కోల్కతాతో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 90వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడి నుంచి బంతి అందుకున్న కమల్జీత్... అవసరం లేకపోయినా బంతిని గాల్లోకి తన్నాడు. అయితే ఆ బంతి గతి తప్పి నేరుగా హైదరాబాద్ ‘డి’ బాక్స్ ముందే కాచుకొని ఉన్న ప్రత్యర్థి కోల్కతా ప్లేయర్ హెర్నాండెజ్ దగ్గరికి వెళ్లడం... అతను హెడర్తో కృష్ణ రాయ్కు పాస్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కృష్ణ ఎటువంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపి స్కోరును 2–2తో సమం చేశాడు. దీంతో మైదానంలోని హైదరాబాద్ అభిమానులు షాక్కు గురయ్యారు. మైదానంతా ఒక్కసారిగా మూగబోయింది. కమల్జీత్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జట్టు డిఫెండర్, భారత జట్టు సభ్యుడైన ఆదిల్ ఖాన్ ఆగ్రహంతో గోల్కీపర్ మీదకు దూసుకెళ్లగా... అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు అతనిని నిలువరించారు. అంతకుముందు 15వ నిమిషంలో కృష్ణ రాయ్ గోల్తో కోల్కతా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో బోబో గోల్తో హైదరాబాద్ స్కోరును సమం చేసింది. అనంతరం 85వ నిమిషంలో బోబో మళ్లీ గోల్ చేయడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివరి క్షణాల్లో గోల్కీపర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ గోల్ను సమరి్పంచుకుంది. -
గోవా చేతిలో కోల్కతాకు చుక్కెదురు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రస్తుత సీజన్లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 1–2తో ఎఫ్సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్... 66వ నిమిషంలో ఫెరాన్ కొరొమినాస్ ఒక్కో గోల్ చేశారు. 64వ నిమిషంలో కోల్కతాకు జాబీ జస్టిన్ ఏకైక గోల్ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది. -
నార్త్ఈస్ట్ యునైటెడ్ తొలి ఓటమి
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీకి తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 0–3 గోల్స్ తేడాతో అట్లెటికో డి కోల్కతా చేతిలో పరాజయం పాలైంది. రాయ్ కృష్ణ (35వ, 90+4వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డేవిడ్ విలియమ్స్ (11వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆట ఆరంభంలో నార్త్ఈస్ట్ ప్రధాన ఆటగాడు అసమో జ్యాన్ గాయం కారణంగా మైదానాన్ని వీడటం ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపింది. నేటి మ్యాచ్లో గోవా ఎఫ్సీతో హైదరాబాద్ ఎఫ్సీ తలపడుతుంది. -
ఒడిశాపై బెంగళూరు గెలుపు
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6లో బెంగళూరు ఎఫ్సీ తన జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 1–0తో ఒడిశా ఎఫ్సీపై విజయం సాధించింది. సీజన్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు కూడా దూకుడైన ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చాయి. అటాక్, కౌంటర్ అటాక్లతో ప్రత్యర్థి ‘డి’ బాక్సుల్లోకి చొచ్చు కొని వెళ్లాయి. అయితే గోల్ కీపర్లు అడ్డుగోడగా నిలవడంతో గోల్ చేయడంలో ఇరు జట్లు సఫలం కాలేదు. ఆట 37వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్ను గోల్గా మలిచిన జునాన్ బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో అర్ధభాగంలో గోల్ కోసం ఒడిశా చేసిన ప్రయత్నాలను బెంగళూరు గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెంగళూరు విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో కేరళ తలపడుతుంది. -
కేరళ బ్లాస్టర్స్ శుభారంభం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో కేరళ 2–1తో అట్లెటికో డి కోల్కతాపై గెలిచింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్ ఒగ్బెచ్ రెండు గోల్స్ సాధించగా... కోల్కతా తరఫున కార్ల్ మెక్హ్యూ గోల్ చేశాడు. ఆట 6వ నిమిషంలో కార్ల్ మెక్హ్యూ గోల్ చేసి కోల్కతాకు ఆధిక్యాన్నిచ్చాడు. అయితే 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను గోల్గా మలిచిన ఒగ్బెచె స్కోర్ను సమం చేశాడు. మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్ చేసిన ఒగ్బెచె కేరళకు 2–1తో ఆధిక్యాన్నిచ్చాడు. చివరిదాకా కేరళ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో మూడు పాయింట్లు వేసుకుంది. మ్యాచ్కు ముందు ప్రారంత్సవంలో బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరుతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు ఆడుతుంది. -
చార్మినార్ ... కోహినూర్
హైదరాబాద్: ఈ సీజన్ నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కాలిడనున్న ‘హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)’... శనివారం తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. నగరానికి తలమానికమైన చార్మినార్ నేపథ్యంగా, విఖ్యాత కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఈ లోగో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హైదరాబాద్ ఫుట్బాల్ ఖ్యాతిని పునరుద్ధరించడం’ అని శీర్షిక ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ... ‘ఫుట్బాల్లో హైదరాబాద్కు 1910 నుంచి మంచి గుర్తింపు ఉంది. 1920–1950 మధ్య అయితే భారత్ ఫుట్బాల్ను శాసించింది’ అని అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ విశేష ఆదరణ చూరగొంటుందని మాకు నమ్మకం ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం’ అని మరో సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. హైదరాబాద్ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్ చేశామని, హెచ్ఎఫ్సీతో ఈ ప్రాంతంలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎల్ ఆరో సీజన్ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతా (ఏటీకే)తో కోల్కతాలో తలపడతుంది -
ఐఎస్ఎల్ చాంప్ చెన్నైయిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్లో రెండోసారి టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3–2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్ను గెలిపించారు. డిఫెండర్ మెల్సన్ అల్వెస్ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. ఆట ఆరంభంలోనే భారత స్టార్ సునీల్ చెత్రి (9వ ని.) గోల్ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్ 90+2) చివరి నిమిషాల్లో గోల్ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్లో నాలుగు హెడర్ ద్వారానే వచ్చాయి. చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు. -
ఆటలకు అండగా నిలుస్తాం!
►కేరళ బ్లాస్టర్స్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ ►హైదరాబాద్ ఫుట్బాల్ అకాడమీతో ఒప్పందం హైదరాబాద్: క్రీడలను అభిమానించేవారి సహకారం లేకుండా ఏ క్రీడలు కూడా అభివృద్ధి చెందలేవని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ జట్టు కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. ఇదే కారణంతో గత కొంత కాలంగా తాము అన్ని రకాల క్రీడలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిభ గల చిన్నారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఏ)తో బ్లాస్టర్స్ జత కట్టింది. దీని ద్వారా హెచ్ఎఫ్ఏలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ట్రైనీలకు బ్లాస్టర్స్ యాజమాన్యం సాంకేతిక సహకారం అందిస్తుంది. ‘ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి ఆటగాళ్లు త్వరలో మా జట్టుతో పాటు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నాం. కేరళ టీమ్ కోచ్లు కూడా ఈ అకాడమీలో అవసరమైన ట్రైనింగ్ అందిస్తారు. గతంలో భారత ఫుట్బాల్లో అనేక మంది దిగ్గజాలు హైదరాబాద్కు చెందినవారే. నాటి వైభవం తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం’ అని ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్లో ఫుట్బాల్ ఆటకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తమ అకాడమీ కృషి చేస్తోందని హెచ్ఎఫ్ఏ ఫౌండర్ మొహమ్మద్ ఆతిఫ్ హైదర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఏ ప్రతినిధులు తేజో అనంత్ దాసరి, పవన్ కుమార్ దువ్వా, కోచ్ తంగ్బోయ్, బ్లాస్టర్స్ ఆటగాళ్లు రినో, ప్రశాంత్లతో పాటు చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు. -
‘బకాయిలు చెల్లించడం లేదు’
న్యూఢిల్లీ: తనకు రావాల్సిన బకాయిలపై న్యాయపోరాటానికి దిగేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాడు మార్సెలో పెరీరా సిద్ధమవుతున్నాడు. ఐఎస్ఎల్ మూడో సీజన్లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఈ ఆటగాడికి ఢిల్లీ ఫ్రాంచైజీ 2500 డాలర్లను చెల్లించాల్సి ఉంది. లీగ్ సందర్భంగా పెరీరా చేసే ఒక్కో గోల్కు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేందుకు ఢిల్లీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. తను మొత్తం పది గోల్స్ చేయడంతో పాటు గోల్డెన్ బూట్ గెలుచుకున్నందుకు 15వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంది. -
ఐఎస్ఎల్, ఐ–లీగ్ విలీనమైతే మంచిదే
భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్), దేశవాళీ ఫుట్బాల్ ‘ఐ–లీగ్’లను విలీనం చేసే ప్రతిపాదనకు భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి మద్దతిచ్చాడు. ఇదే జరిగితే జాతీయ జట్టుకు మరిన్ని ‘ఫిఫా’ స్నేహపూర్వక మ్యాచ్లు ఆడే అవకాశం దక్కుతుందని, ర్యాంకింగ్ కూడా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 జట్లతో కూడిన లీగ్ను ఆడిస్తే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు చోటు దక్కినట్టవుతుందన్నాడు. పది జట్లతో కూడిన ఐ–లీగ్ 2017 సీజన్ జనవరి 7న మొదలుకానుంది. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జట్ల కెప్టెన్లతో కలసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈసారి ఐ–లీగ్లో కొత్తగా చెన్నై సిటీ ఎఫ్సీ, మినర్వా పంజాబ్ జట్లకు చోటు కల్పించారు. మరోవైపు ఐఎస్ఎల్, ఐ–లీగ్ల విలీనంపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ‘జట్లు ఎక్కువగా ఉంటే లీగ్కు మంచిది. 20 టీమ్స్ ఉంటే మరీ మంచిది. మధ్యప్రదేశ్, లక్షద్వీప్ నుంచి కూడా టీమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. గుజరాత్లో ఓ పిల్లాడు ఫుట్బాల్లో స్టార్ కావాలనుకుంటే అందుకు తగిన పరిస్థితులను మనం కల్పించాలి. ఎందుకు మనకు కేరళ, బెంగాల్, నార్త్ ఈస్ట్ నుంచే ఆటగాళ్లు వస్తుంటారు? మధ్యప్రదేశ్ నుంచి ఎందుకు సూపర్స్టార్లు లేరు? అక్కడ కూడా కచ్చితంగా టాలెంట్ ఉంటుంది. అందుకే అన్ని చోట్ల నుంచి జట్లు ఉండాలని కోరుకుంటున్నాను. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఐఎస్ఎల్, ఐ–లీగ్లు విలీనమైతే సంతోషిస్తా. ఆటగాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ అది వాళ్ల చేతుల్లో లేదు’ అని చెత్రి అన్నాడు. తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఆటగాళ్లు విదేశీ క్లబ్బులకు ఆడడంలో తప్పేమీ లేదని అన్నాడు. భారత జట్టు ముందుగా ఆసియాలో టాప్–10లో నిలవాలని, ఆ తర్వాతే 2022 ప్రపంచకప్కు అర్హత సాధించడంపై ఆలోచించాలని సూచించాడు. -
కోల్కతాకే కిరీటం
రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ కైవసం ∙రూ. 8 కోట్ల ప్రైజ్మనీ సొంతం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆదివారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నువ్వా.. నేనా అనే రీతిలో జరిగిన ఫైనల్లో అట్లెటికో డి కోల్కతా రెండోసారి విజేతగా నిలిచింది. సొంతగడ్డపై తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీపై కోల్కతా 4–3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా నెగ్గింది. లీగ్ తొలి సీజన్ ఫైనల్లోనూ కోల్కతా జట్టు కేరళపైనే నెగ్గింది. అలాగే ఈ సీజన్లో సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన కేరళకు ఇదే తొలి పరాజయం. చాంపియన్గా నిలిచిన కోల్కతాకు రూ.8 కోట్లు దక్కగా.. రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు అందించారు. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు్ల 1–1తో సమంగా నిలిచాయి. కేరళ బ్లాస్టర్స్ నుంచి మొహమ్మద్ రఫీఖ్ (37), కోల్కతా నుంచి సెరెనో (44) గోల్స్ చేశారు. దీంతో ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించినా గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో మొదట కేరళ నుంచి ఆంటోనియో జర్మన్, బెల్ఫోర్ట్, రఫీఖ్ గోల్స్ సాధించగా డోయో, హెంగ్బర్ట్ విఫలమయ్యారు. ఇక కోల్కతా నుంచి డౌటీ, బోర్జా, లారా, జ్యువెల్ రాజా విజయవంతం కాగా హ్యూమే ఒక్కడు విఫలమయ్యాడు. అంతకుముందు మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీ ఆటతో తమ ఉద్దేశాన్ని చాటుకున్నాయి. తొలి భాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి. రెండో అర్ధభాగంలో రెండు జట్లు ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. ఫలితం కోసం మరో అరగంట అదనపు సమయం కేటాయించారు. గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు వెళ్లింది. -
ముంబైపై కోల్కతా పైచేయి
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ సెమీఫైనల్ అంచె తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా పైచేయి సాధించింది. ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్ తొలి అర్ధభాగంలోనే రావడం విశేషం. కోల్కతా తరఫున రాల్టె (3వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎడ్వర్డ్ హుమే (39వ, 45వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ముంబై జట్టుకు కోస్టా (10వ ని.లో), వియెరా (19వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. 13న ముంబై జట్టుతోనే జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కోల్కతా ‘డ్రా’ చేసుకుంటే ఫైనల్కు చేరుకుంటుంది. ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్తో ఢిల్లీ డైనమోస్ తలపడుతుంది. -
కేరళను సెమీస్కు చేర్చిన వినీత్
కీలకమ్యాచ్లో నార్త్ ఈస్ట్పై విజయం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ లీగ్ దశ ముగిసింది. కీలక మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుపై కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ 1-0తో నార్త్ ఈస్ట్ జట్టును ఓడించింది. ఆట 66వ నిమిషంలో వినీత్ చేసిన గోల్తో కేరళ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బ్లాస్టర్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ ఓటమిపాలై నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఈ విజయంతో కేరళ బ్లాస్టర్స్ మొత్తం 22 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్కతా సెమీస్కు చేరాయి. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సెమీఫైనల్స్లో ఢిల్లీ డైనమోస్తో కేరళ బ్లాస్టర్స్; కోల్కతాతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడతాయి. -
కోల్కతా, పుణే మ్యాచ్ డ్రా
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికో డి కోల్కతా, పుణే ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారుు. ప్రస్తుతం కోల్కతా 20 పారుుంట్లతో మూడో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. -
నార్త్ ఈస్ట్ సెమీస్ ఆశలు సజీవం
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఢిల్లీ డైనమోస్ జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ జట్టు 18 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ తరఫున సిత్యాసెన్ సింగ్ (60వ ని.లో), కోఫీ ఎన్డ్రి (71వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీ జట్టుకు పెరీరా (90వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. గురువారం జరిగే మ్యాచ్లో ఎఫ్సీ గోవాతో చెన్నైరుున్ ఎఫ్సీ తలపడుతుంది. -
కేరళ, కోల్కతా మ్యాచ్ డ్రా
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా అట్లెటికో డి కోల్కతా, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. కేరళ తరఫున వినీత్ (8వ ని.లో), కోల్కతా తరఫున పియర్సన్ (18వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
కేరళ రికార్డు విజయం
కొచ్చి: సొంత గడ్డపై కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శుక్రవారం ఎఫ్సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్లో 2-1తో ఘనవిజయం సాధించింది. స్థానిక నెహ్రూ స్టేడియంలో ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇది ఐఎస్ఎల్ రికార్డు. కేరళ తరఫున నజోన్ (7వ నిమిషంలో), హ్యూజెస్ (57) గోల్స్ చేశారు. రోడ్రిగెజ్ (90) పుణేకు ఏకైక గోల్ను అందించాడు. -
ఆరు మ్యాచ్ల తర్వాత...
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆరు మ్యాచ్ల తర్వాత నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. పుణే సిటీ ఎఫ్సీ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జట్టు 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 81వ నిమిషంలో కోఫీ క్రిస్టియన్ ఎండ్రీ గోల్ చేసి నార్త్ ఈస్ట్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో చెన్నైరుున్ జట్టు తలపడుతుంది. -
ఢిల్లీకి పుణే షాక్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఢిల్లీ డైనమోస్ జట్టుకు శుక్రవారం ఊహించని పరాజయం ఎదురైంది. పుణే ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ 3-4 గోల్స్ తేడాతో ఓడిపోరుుంది. ఈ లీగ్లో ఢిల్లీకిది కేవలం రెండో ఓటమి కావడం గమనార్హం. పుణే తరఫున అనిబల్ రోడ్రిగెజ్ రెండు గోల్స్ చేయగా.. సిస్సోకో, లెన్నీ రోడ్రిగెజ్ ఒక్కో గోల్ సాధించారు. ఢిల్లీ జట్టుకు కీన్ లూరుుస్, ఎంజువాలా ఒక్కో గోల్ చేశారు. పుణే ప్లేయర్ ఎడువార్డో పెరీరా సెల్ఫ్ గోల్తో ఢిల్లీ ఖాతాలో మూడో గోల్ చేరింది. -
కోల్కతా 1, నార్త్ ఈస్ట్ 1
కోల్కతా: నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసిన అట్లెటికో డి కోల్కతా డ్రాతో గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ ఐదో నిమిషంలోనే నార్త్ఈస్ట్ కు వెలెజ్ గోల్ అందించాడు. ఆ తర్వాత దాదాపు మ్యాచ్ చివరి వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈ జట్టుకు ఇయాన్ హ్యుమే షాకిచ్చాడు. ఇంజ్యూరీ (90+) టైమ్లో అత్యంత సమీపం నుంచి బంతిని గోల్పోస్టులోకి పంపి సొంత గడ్డపై అభిమానులను మురిపించాడు. -
గోవా, ముంబై మ్యాచ్ డ్రా
ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గోవా ఎఫ్సీ, ముంబై సిటీ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఈ ఫలితంతో ముంబై 16 పారుుంట్లతో రెండో స్థానంలో, గోవా 11 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉన్నారుు. గురువారం జరిగే మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతాతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తలపడుతుంది. -
ఢిల్లీ, కోల్కతా మ్యాచ్ డ్రా
ఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’గా ముగిసింది. కోల్కతా తరఫున హ్యూమ్ (17వ ని.లో), గ్రాండీ (71వ ని.లో)... ఢిల్లీ తరఫున మిలన్ సింగ్ (63వ ని.లో), మలూడా (74వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్
ఫటోర్డా (గోవా): సొంతగడ్డపై గోవా జట్టు సత్తా చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో గోవా జట్టు 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ప్రథమార్థం ముగిసేసరికి రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఆట 50వ నిమిషంలో సితెసిన్ సింగ్ గోల్తో నార్త్ ఈస్ట్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. 62వ నిమిషంలో రాబిన్ సింగ్ గోల్తో గోవా జట్టు స్కోరును 1-1తో సమం చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న తరుణంలో 90వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్ చేసి గోవా జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 10 మ్యాచ్లు పూర్తి చేసుకున్న గోవా పది పారుుంట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
ముంబైకి షాకిచ్చిన పుణే
ముంబై: ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్సీకి... ఎఫ్సీ పుణే సిటీ షాకిచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ పుణే 1-0తో నెగ్గింది. 89వ నిమిషంలో యుగెనెసన్ లింగ్డో చేసిన గోల్తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ చివరి వరకు కూడా ముంబై సిటీ ఆధిక్యం కనబరిచినా గోల్స్ చేయడంలో విఫలమైంది. అరుుతే పుణే మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. లెప్ట్ వింగ్ నుంచి నారాయణ్ దాస్ ఇచ్చిన క్రాస్ను లింగ్డో ఎలాంటి పొరపాటుకు తావీయకుండా నెట్లోకి పంపడంతో పుణేకు అద్భుత విజయం దక్కింది. -
ఢిల్లీకి భారీ విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ డైనమోస్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైయిన్ ఎఫ్సీతో బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 4-1 గోల్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీ తరఫున గాడ్జె (15వ ని.లో), లూయిస్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కెప్టెన్ ఫ్లోరెంట్ మలూడా (25వ, 85వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చెన్నైయిన్ జట్టుకు మెండీ (37వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ 16 పారుయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగే మ్యాచ్లో ముంబైతో పుణే తలపడుతుంది. -
పుణే నాకౌట్ ఆశలు సజీవం
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో పుణే ఎఫ్సీ జట్టు సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. తద్వారా నాకౌట్ దశకు చేరుకునే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. అట్లెటికో డి కోల్కతా జట్టుతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పుణే జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. పుణే తరఫున ఎడువార్డో పెరీరా (41వ నిమిషంలో), అనిబాల్ రోడ్రిగెజ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఇయాన్ హ్యుమె (69వ నిమిషంలో) కోల్కతా జట్టుకు ఏకై క గోల్ను అందించాడు. ఈ గెలుపుతో పుణే పారుుంట్ల పట్టికలో తొమ్మిది పారుుంట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్తో గోవా జట్టు తలపడుతుంది. -
అగ్రస్థానంలో ఢిల్లీ డైనమోస్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పారుుంట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు అగ్రస్థానానికి చేరింది. శుక్రవారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 2-0తో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నుంచి లూరుుస్ (56వ నిమిషంలో), పెరీరా (60) గోల్స్ చేశారు. ప్రథమార్ధంలో ఇరు జట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గోల్స్ నమోదు కాలేదు. అరుుతే ద్వితీయార్ధం మాత్రం స్థానిక అభిమానుల మద్దతుతో ఢిల్లీ చెలరేగింది. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. -
గోవాను గెలిపించిన లూయిజ్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలిసారిగా పుణే సిటీపై ఎఫ్సీ గోవా జట్టు విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ను ఎఫ్సీ గోవా 1-0తో గెలుచుకుంది. మ్యా చ్లో నమోదైన ఏకైక గోల్ను ఫ్రీకిక్ ద్వారా రాఫెల్ లూరుుజ్ (32వ నిమిషంలో) సాధించాడు. పుణే సిటీ ద్వితీయార్ధంలో తమ దాడులను ఉధృతం చేసినా ఫలితం లేకుండా పోరుుంది. -
ముంబైని ఆదుకున్న కోస్టా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ముంబై ఎఫ్సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది. చెన్నైరుున్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ను ముంబై జట్టు 1-1తో సమంగా ముగించింది. ఆట 51వ నిమిషంలో లాల్పెకులా గోల్తో చెన్నైరుున్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ముంబై జట్టు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇక చెన్నైరుున్ జట్టుదే విజయం అనుకుంటున్న తరుణంలో.. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ముంబై ఆటగాడు లియో కోస్టా అద్భుత గోల్ చేసి స్కో రును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్లో పుణేతో గోవా జట్టు తలపడుతుంది. -
చెన్నైయిన్, కేరళ మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శనివారం చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. లీగ్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై, 7 మ్యాచ్లు ఆడిన కేరళ తొమ్మిదేసి పారుుంట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారుు. -
కోల్కతాకు మరో గెలుపు
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్కతా మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 39వ నిమిషంలో అల్ఫారో చేసిన గోల్తో నార్త్ ఈస్ట్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే రెండో అర్ధభాగంలో కోల్కతా ఆటగాళ్లు సమన్వయంతో ఆడారు. 63వ నిమిషంలో పోస్టిగా గోల్తో కోల్కతా స్కోరును 1-1తో సమం చేసింది. 82వ నిమిషంలో బెలెన్కోసో గోల్తో కోల్కతా 2-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో కోల్కతా 12 పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగే మ్యాచ్లో చెన్నైరుున్తో కేరళ బ్లాస్టర్స్ తలపడుతుంది. -
ఐఎస్ఎల్తో భారత్లో ఫుట్బాల్ అభివృద్ధి
ప్రాన్స్ దిగ్గజం హెన్రీ అభిప్రాయం ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ వల్ల భారతదేశంలో ఫుట్బాల్ అభివృద్ధి చెందుతుందని ప్రాన్స్ దిగ్గజం థియరీ హెన్రీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెల్జియం జట్టుకు సహాయక కోచ్గా పని చేస్తున్న ఆయన రెండు రోజులుగాభారత్లో పర్యటిస్తున్నారు. ‘లీగ్లో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి ఆడటం వల్ల భారత్లోని యువ క్రీడాకారులు చాలా మెరుగుపడతారు. దీని ఫలితం మున్ముందు మరింత కనిపిస్తుంది’ అని హెన్రీ చెప్పారు. కోల్కతా కోచ్ సస్పెన్షన్ న్యూఢిల్లీ: పదే పదే రిఫరీల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు అట్లెటికో డి కోల్కతా జట్టు కోచ్ జోస్ మోలినాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. -
అగ్రస్థానానికి ముంబై ఎఫ్సీ
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ముంబై ఎఫ్సీ జట్టు 1-0తో అట్లెటికో డి కోల్కతా జట్టుపై విజయం సాధించింది. ముంబై తరఫున ఫోర్లాన్ (79వ ని.)గోల్ చేశాడు. ఈ విజయంతో ముంబై ఎఫ్సీ పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
కేరళ బ్లాస్టర్స్ గెలుపు
ఇండియన్ సూపర్ లీగ్ ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్లో గత మూడు మ్యాచ్లలో ఓటమి ఎరుగని కేరళ బ్లాస్టర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో కేరళ 2-1 గోల్స్ తేడాతో ఎఫ్సీ గోవాపై విజయం సాధించింది. కేరళ తరఫున 46వ నిమిషంలో మొహమ్మద్ రఫీ, 84వ నిమిషంలో కెర్వెన్స బెల్ఫోర్ట్ గోల్స్ సాధించాడు. గోవా జట్టు ఆటగాళ్లలో 24వ నిమిషంలో జూలియో సీజర్ ఏకై క గోల్ నమోదు చేశాడు. ఈ విజయంతో కేరళకు 3 పారుుంట్లు దక్కారుు. తాజా ఫలితం తర్వాత పారుుంట్ల పట్టికలో కేరళ ఐదో స్థానానికి చేరగా, గోవా ఆఖరి స్థానంలో ఉంది. -
ఢిల్లీపై కోల్కతా విజయం
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా రెండో స్థానానికి ఎగబాకింది. శనివారం ఢిల్లీ డైనమోస్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 1-0తో గెలిచింది. ఇయాన్ హ్యుమే 78వ నిమిషంలో స్పాట్ కిక్ ద్వారా జట్టుకు ఏకైక గోల్ను అందించాడు. -
గోవాకు తొలి గెలుపు
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఎఫ్సీ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా తొలి మూడు మ్యాచ్ల్లో ఓడి, నాలుగో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న గోవా ఐదో మ్యాచ్లో విజయాల బోణీ చేసింది. ముంబై సిటీ ఎఫ్సీ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో గోవా 1-0తో నెగ్గింది. 41వ నిమిషంలో ఫెలిస్బినో గోల్తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ముంబై స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా సఫలం కాలేకపోరుుంది. -
ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట 38వ నిమిషంలో లూరుుస్ గోల్తో ఢిల్లీ డైనమోస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 51వ నిమిషంలో అల్ఫారో గోల్తో నార్త్ ఈస్ట్ స్కోరును సమం చేసింది. ఈ లీగ్లో నార్త్ ఈస్ట్ జట్టుకిది తొలి ‘డ్రా’కాగా... ఢిల్లీకి వరుసగా రెండోది. ఆదివారం జరిగే మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతాతో ఎఫ్సీ గోవా తలపడుతుంది. -
అట్లెటికో డి కోల్కతా బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్కతా జట్టు విజయాల బోణీ చేసింది. కేరళ బ్లాస్టర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో అట్లెటికో జట్టు 1-0తో నెగ్గింది. 53వ నిమిషంలో జావీ లారా ఏకై క గోల్ చేసి అట్లెటికో జట్టును గెలిపించాడు. చెన్నైరుున్తో జరిగిన తొలి మ్యాచ్ను అట్లెటికో 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. -
వైభవంగా ఐఎస్ఎల్ ప్రారంభం
గువాహటి: బాలీవుడ్ నటుల హుషారెత్తించే నృత్య ప్రదర్శనలతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం సాయంత్రం లీగ్ ప్రారంభ వేడుకలు జరిగారుు. అర్ధగంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధావన్ 500 మంది నృత్యకారులతో కలిసి తమ డ్యాన్సను ప్రదర్శించారు. ముందుగా ధూమ్ సినిమా నేపథ్య గీతం వినిపిస్తుండగా నార్త్ఈస్ట్ యునెటైడ్ జట్టు సహ యజమాని, నటుడు జాన్ అబ్రహాం బైక్పై స్టేడియంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్సతో ఆకట్టుకోగా మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనిలతో పాటు ఏనుగు ఆకారంలోని ఆటోలో వచ్చిన సచిన్ నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. అలాగే జాన్ అబ్రహాం ఐఎస్ఎల్ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. అనంతరం అలియా భట్, వరుణ్ ధావన్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయక ఖోల్ తాల్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతదేశ పటం ఆకారంలో నిలబడిన కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. ప్రత్యేక అతిథిగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫుట్బాల్ను తెచ్చి అందించగా... పోటీలు ప్రారంభమవుతున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు. ఆ వెంటనే భారీ ఎత్తున స్టేడియం బాణసంచా వెలుగులతో నిండిపోరుుంది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ వీవీఐపీ స్టాండ్సలో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు. నార్త్ ఈస్ట్ శుభారంభం ఐఎస్ఎల్ తొలి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జట్టు శుభారంభం చేసింది. సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 1-0తో కేరళ బ్లాస్టర్స్పై గెలిచింది. యూసా 55వ నిమిషంలో చేసిన గోల్తో ఆతిథ్య జట్టు గెలిచి మూడు పారుుంట్లు సాధించింది. -
షారుక్ ఫుట్బాల్ జట్టు!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లోనూ ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్లో కోల్కతా నైట్రెడర్స్ యజమాని అయిన షారుక్ ఫుట్బాల్లోనూ కోల్కతాకు చెందిన ప్రాంచైజీనే కోరుకుంటున్నారు. ప్రస్తుతం 8 జట్లతో ఉన్న ఐఎస్ఎల్ వచ్చే ఏడాది 10 జట్లకు విస్తరించనుంది. -
చెన్నైయిన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎలానో అరెస్ట్
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ విజేత చెన్నైయిన్ కెప్టెన్ ఎలానో బ్లూమర్ను ఆదివారం అర్ధరాత్రి గోవా పోలీసులు అరెస్టు చేశారు. మ్యాచ్ అనంతరం జరుపుకొనే వేడుకల్లో గోవా ఫ్రాంచైజ్ సహ యజమాని దత్తరాజ్ సల్గవోన్సర్పై ఎలానో భౌతిక దాడికి పాల్పడ్డాడు. సల్గవోన్సర్ ఫిర్యాదు మేరకు ఎలానోను అరెస్టు చేసినట్లు మార్గావ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీఎల్ పాటిల్ తెలిపారు. -
చాంపియన్ చెన్నైయిన్
ఊహకందని మలుపులతో సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్కు అద్వితీయ ముగింపు లభించింది. గతేడాది సెమీస్లోనే నిష్ర్కమించిన చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఈసారి ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా అవతరించింది. లీగ్ దశలో టాపర్గా నిలిచిన గోవా ఎఫ్సీతో జరిగిన టైటిల్ పోరులో చెన్నైయిన్ చివరి నిమిషాల్లో అద్భుతం చేసి ఔరా అనిపించింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నైయిన్ జట్టు నిర్ణాయక గోల్ సాధించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివరి నిమిషాల్లో తడబడిన గోవా తుదకు తగిన మూల్యం చెల్లించి రన్నరప్తో సరిపెట్టుకుంది. * ఐఎస్ఎల్ ట్రోఫీ హస్తగతం * ఫైనల్లో గోవాపై 3-2తో విజయం * రూ. 8 కోట్ల ప్రైజ్మనీ సొంతం ఫటోర్డా (గోవా): పరిస్థితులు ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చెన్నైయిన్ జట్టు రుచి చూసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో చాంపియన్గా ఆవిర్భవించింది. గోవా ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 90వ నిమిషం వరకు 1-2తో వెనుకబడిన చెన్నైయిన్ జట్టుకు గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని ‘సెల్ఫ్ గోల్’తో ఊపిరి పోయగా... ఇంజ్యూరీ టైమ్లో (90+2వ నిమిషంలో) మెండోజా గోల్ సాధించి చెన్నైయిన్ జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా లేకపోతే దాని మూల్యం ఏస్థాయిలో ఉంటుందో గోవా జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది. మ్యాచ్ అంటే ఇదీ.. అనే తరహాలో సాగిన అంతిమ సమరంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా విజయంతో గోవాలో ఎప్పుడు ఆడినా తమదే గెలుపనే సెంటిమెంట్ను చెన్నైయిన్ మరోసారి నిజం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని సహ యజమానులుగా ఉన్న చెన్నైయిన్ జట్టుకు విజేత హోదాలో ట్రోఫీతోపాటు రూ. 8 కోట్ల నజరానా అందగా... రన్నరప్ గోవాకు రూ. 4 కోట్లు లభించాయి. సెమీస్లో ఓడిన కోల్కతా, ఢిల్లీ డైనమోస్ జట్లకు రూ. కోటీ 50 లక్షల చొప్పున ప్రైజ్మనీ ఇచ్చారు. మ్యాచ్ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు గోవా సహ యజమాని, క్రికెటర్ కోహ్లి తన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మతో హాజరయ్యారు. ఆద్యంతం హోరాహోరీ... భారీగా తరలివచ్చిన సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన గోవా ఆరంభం నుంచి తమ బలాన్నే నమ్ముకుంటూ దూకుడు కనబరిచింది. వేగంగా పాస్లు ఇచ్చుకుంటూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆరో నిమిషంలో ప్రత్యర్థి తలతో ఢీకొన్న గోవా స్ట్రయికర్ డుడు గాయపడడంతో మైదానం వీడాడు. తొలి 25 నిమిషాలు ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. 33వ నిమిషంలో గోవాకు ఫ్రీకిక్ చాన్స్ లభించింది. అయితే లియో మౌరా సంధించిన షాట్ గోల్ పోస్ట్ కుడివైపునుంచి బయటికి వెళ్లింది. ఐదు నిమిషాల వ్యవధిలో గోవాకు కొయెల్హో హెడర్ గోల్ ప్రయత్నం చేసినా తృటిలో తప్పింది. దీంతో తొలి అర్ధభాగం గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధంలో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. 53వ నిమిషంలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ మెండోజాను ఇన్సైడ్ బాక్స్లో ప్రణయ్ కిందపడేయడంతో పెనాల్టీ అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పెలిస్సారి జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా స్కోరును 1-1తో సమం చేసింది. రోమియో అందించిన క్రాస్ను సబ్స్టిట్యూట్గా వచ్చిన హవోకిప్ మెరుపు వేగంతో గోల్పోస్టులోకి పంపి సంతోషం నింపాడు. కానీ 59వ నిమిషంలో తమకు లభించిన రెండో పెనాల్టీని చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేపోయింది. మెండోజా షాట్ను గోవా కీపర్ లక్ష్మీకాంత్ సులువుగా అడ్డుకున్నాడు. 87వ నిమిషంలో గోవాకు లభించిన ఫ్రీకిక్ను జోఫ్రే గోల్తో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఆనందాన్ని స్వయం తప్పిదంతో గోవా కోల్పోయింది. 90వ నిమిషంలో బంతిని ఆపే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరిన కీపర్ లక్ష్మీకాంత్ చేతిని తాకుతూ గోల్ కావడంతో స్కో రు తిరిగి సమమైంది. అయితే అదనపు సమయం (90+2వ నిమిషం)లో మెండోజా సూపర్ గోల్తో చెన్నైయిన్ విజేతగా నిలిచింది. చెన్నైయిన్ జట్టుకు బ్రూనో పెలిస్సారి (54వ నిమిషంలో), మెండోజా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని 90వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. గోవా తరఫున హవోకిప్ (58వ నిమిషంలో), జోఫ్రే (87వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు.