Kings XI Punjab
-
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్కు కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
ఐపీఎల్ 2021: కింగ్స్ పంజాబ్కు ‘వేలం’ కష్టాలు
ముంబై: ఫిబ్రవరి 18న ఐపీఎల్-2021 వేలం పురస్కరించుకొని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు తలనొప్పిలా మారనుంది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో (ప్రతీ జట్టుకు రూ.85కోట్లు) 75 శాతం ఖర్చు చేయాలని.. అలా లేని పక్షంలో ఆ డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్ చేసింది. వీరిలో గత ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్వెల్ సహా షెల్డన్ కాట్రెల్, కె. గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జిమ్మి నీషమ్, హార్డస్ విల్జెన్లోపాటు కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ సింగ్ దిల్లాన్ తదితరులు ఉన్నారు. బీసీసీఐ వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు పంజాబ్ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలిఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుతోనే ఆటగాళ్లను వేలంలో పొందే అవకాశం కింగ్స్ పంజాబ్కు ఉండనుంది. ఆ లెక్కన చూసుకుంటే పంజాబ్ దగ్గరుండే దాదాపు రూ. 21.5 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లిపోనున్నాయి. ఇది కింగ్స్ పంజాబ్కు నష్టం కలిగించే అంశం అని చెప్పవచ్చు. పంజాబ్ తర్వాత రూ. 37.85 కోట్లతో రాజస్తాన్ ఉండగా, ఆర్సీబీ రూ. 35.40 కోట్లు, సీఎస్కే రూ. 19.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 13.4 కోట్లు, సన్రైజర్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు రూ. 10.75 కోట్లతో ఉన్నాయి. ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి రానున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్వెల్ ఉన్నారు. కాగా గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. రాహుల్ 14 మ్యాచ్ల్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా జట్టుగా విఫలమయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్వెల్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. చదవండి: 15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' -
అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్
మెల్బోర్న్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలపై ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్లో మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్లీడర్’’ అంటూ సెహ్వాగ్ మాక్స్వెల్ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్ ట్రిప్ను ఎంజాయ్ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’) ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్వెల్.. ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. -
‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా తొలిసారిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. తొలుత వరుస వైఫల్యాలతో డీలా పడిన జట్టును.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయేలా ముందుండి నడిపించాడు. అయితే చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలు కావడంతో పంజాబ్ లీగ్ దశలోనే వెనుదిరిగినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. సీజన్ మొదటి అర్ధభాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్ జట్టు.. ఊహించలేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్ .. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!) అదే విధంగా ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను గెల్చుకున్న ఈ కర్ణాటక బ్యాటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా అతడికి పదికి ఏడున్నర మార్కులు వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను. అలాగని మరీ అంత బాగాలేదని చెప్పలేను. 50-50గా ఉంది. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబరిచే జట్టు(పదకొండు మందిని)ను ఎంచుకోవడంలో అతడు తడబడ్డాడు. ఎంపికలో యాజమాన్య నిర్ణయం కూడా ఉంటుందని తెలుసు. అయితే రాహుల్ కూడా తన మార్కు చూపాల్సింది. ఏదేమైనా ఈ సీజన్లో రాహుల్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సారథిగా తను ఇంకొంత మెరుగవ్వాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అతడికి నేను 10కి 7.5 మార్కులు ఇస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.(కోహ్లిపై ట్రోలింగ్.. ఆర్సీబీ వివరణ) -
పంజాబ్ ఆశలు గల్లంతు
ఐపీఎల్ ప్లేఆఫ్స్ స్థానం ఊరిస్తున్న వేళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉసూరుమనిపించింది... గెలిస్తే మెరుగైన స్థితికి చేరి ముందంజ వేసే అవకాశం ఉన్నా, పేలవ ప్రదర్శనతో చేజేతులా ఓటమి తెచ్చి పెట్టుకుంది. ఐదు వరుస విజయాలతో ఒక్కసారిగా జూలు విదిల్చినట్లు కనిపించిన ఆ జట్టు, బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్ ఓడి నిష్క్రమించింది. లీగ్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్ల జాబితాలో ఉన్న ఈ టీమ్, మళ్లీ అదే నిరాశతో సీజన్ను ముగించింది. మరో వైపు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత గత రెండు మ్యాచ్లలో బెంగళూరు, కోల్కతా జట్ల లెక్కలు మార్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరో జట్టును దెబ్బ కొట్టి తమతో పాటు తీసుకెళ్లింది. ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించి కొంత సంతృప్తితో ధోని సేన తమ ఆటను ముగించింది. అబుబాది: ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మరో భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై 9 వికెట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు సాధించింది. దీపక్ హుడా (30 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లుంగి ఇన్గిడి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) హ్యాట్రిక్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (30; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హుడా మినహా... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో మయాంక్ జోరు కనబరచగా, ఆ తర్వాత సిక్సర్తో రాహుల్ అలరించాడు. మరో మూడు బౌండరీలు బాదిన మయాంక్ను అద్భుత బంతితో ఇన్గిడి పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. కాసేపటికే రాహుల్ కూడా ఇన్గిడికే దొరికిపోయాడు. భారీ హిట్టర్లు గేల్ (12), పూరన్ (2)ను చెన్నై బౌలర్లు సమర్థంగా నిలువరించారు. నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేసి చెన్నై బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించారు. అయితే మరో ఎండ్నుంచి దీపక్ హుడా ఎదురుదాడికి దిగాడు. మన్దీప్ (14)తో ఐదో వికెట్కు 36 పరుగులు జోడించి జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు. ఇన్గిడి ఓవర్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. తర్వాత మరో ఫోర్ బాదిన అతను 26 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అదే జోరులో 4, 6తో చివరి ఓవర్లో 14 పరుగులు రాబట్టాడు. అతని ధాటికి పంజాబ్ చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేసింది. ఆడుతూ పాడుతూ... సాధారణ లక్ష్యఛేదనను చెన్నై దూకుడుగా ప్రారంభించింది. డుప్లెసిస్, గైక్వాడ్ అంచనాలకు తగినట్లు ఆడటంతో పవర్ప్లేలో 57 పరుగులు సాధించింది. తర్వాత కూడా నింపాదిగా ఆడుతోన్న ఈ జోడీని డుప్లెసిస్ను అవుట్ చేయడం ద్వారా జోర్డాన్ విడదీశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 59 బంతుల్లో 82 పరుగుల్ని జోడించారు. తర్వాత రాయుడు సహకారంతో రుతురాజ్ తన ఫామ్ను కొనసాగించాడు. ఈ క్రమంలో బౌండరీతో 38 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. అదే జోరులో వీరిద్దరూ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ఇన్గిడి 29; మయాంక్ (బి) ఇన్గిడి 26; గేల్ (ఎల్బీ) (బి) తాహిర్ 12; పూరన్ (సి) ధోని (బి) శార్దుల్ 2; మన్దీప్ (బి) జడేజా 14; హుడా (నాటౌట్) 62; నీషమ్ (సి) రుతురాజ్ (బి) ఇన్గిడి 2; జోర్డాన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–48, 2–62, 3–68, 4–72, 5–108, 6–113. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–30–0, స్యామ్ కరన్ 2–0–15–0, శార్దుల్ ఠాకూర్ 4–0–27–1, ఇన్గిడి 4–0–39–3, తాహిర్ 4–0–24–1, జడేజా 3–0–17–1 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 62; డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) జోర్డాన్ 48; రాయుడు (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 154. వికెట్ల పతనం: 1–82. బౌలింగ్: నీషమ్ 3–0–26–0, షమీ 4–0–29–0, జోర్డాన్ 3–0–31–1, రవి బిష్ణోయ్ 4–0–39–0, మురుగన్ అశ్విన్ 4–0–17–0, గేల్ 0.5–0–5–0. -
రాయల్స్ రేసులోనే...
రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది. ‘యూనివర్సల్ బాస్’ గేల్ విధ్వంసాన్ని తట్టుకొని నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా ధనాధన్ ఇన్నింగ్స్తో స్టోక్స్ గెలుపునకు పునాది వేయగా... సంజూ సామ్సన్, స్మిత్, బట్లర్ జట్టును గమ్యానికి చేర్చారు. దీంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. కీలక సమయంలో బౌలర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి పాలై తమ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. అబుదాబి: అసలైన సమయంలో రాజస్తాన్ రాయల్స్ సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని ముంచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో... శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. ఆర్చర్, స్టోక్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు), బట్లర్ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) నాలుగో వికెట్కు అజేయంగా 19 బంతుల్లో 41 పరుగుల్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఓవర్లోనే వికెట్... ఆరంభంలోనే పంజాబ్కు షాక్ తగిలింది. ఆర్చర్ బౌలింగ్లో స్టోక్స్ చక్కటి క్యాచ్కు ఓపెనర్ మన్దీప్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్కు గేల్ జతకూడటంతో రాయల్స్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరాగ్, ఉతప్ప సమన్వయలేమితో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గేల్... కార్తీక్ త్యాగి ఓవర్లో వరుసగా 4, 6, 4 రెచ్చిపోయాడు. ఆరోన్ బౌలింగ్లో రాహుల్ కూడా 6, 4 బాదడంతో పవర్ ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. పటిష్ట భాగస్వామ్యం... తర్వాత కూడా వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడారు. ప్రతీ బంతిపై ఎదురుదాడి చేయకుండా ఆచితూచి బౌండరీలు బాదారు. మిడిల్ ఓవర్లలో రన్రేట్ 8కి తగ్గకుండా పరుగులు సాధించారు. రాహుల్ తేవటియా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన గేల్ 33 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో అతనికిది మూడో ఫిఫ్టీ. ఈ దశలో గేల్ మరోసారి బతికిపోయాడు. మరోవైపు అర్ధసెంచరీకి చేరువవుతోన్న రాహుల్ను స్టోక్స్ పెవిలియన్ పంపాడు. దీంతో రెండో వికెట్కు 82 బంతుల్లో 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిక్సర్ల హోరు... చివరి ఐదు ఓవర్లలో పూరన్, గేల్ ఆరు సిక్సర్లతో అలరించారు. ఆరోన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, త్యాగి బౌలింగ్లో మరొకటి కొట్టి పూరన్ ప్రమాదకరంగా కనిపించాడు. బౌండరీ వద్ద తేవటియా క్యాచ్కు అతను ఔటైనా... గేల్ 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి సమీపించిన గేల్ను ఆర్చర్ అద్భుత యార్కర్తో నిలువరించాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్ 62 పరుగులు రాబట్టింది. స్టోక్స్ విధ్వంసం... ఉతప్పతో కలిసి ఛేదనకు దిగిన స్టోక్స్ కసిగా ఆడాడు. తొలి 3 ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్లో వరుసగా 4, 6, 6తో 16 పరుగులు పిండుకున్నాడు. తర్వాత 4, 6 బాదిన స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతోన్న స్టోక్స్ను జోర్డాన్ పెవిలియన్ పంపాడు. అనంతరం సామ్సన్ బ్యాట్ ఝళిపించడంతో 10 ఓవర్లకు రాజస్తాన్ 103/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఔటైనా... స్మిత్తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ 21 బంతుల్లో 34 పరుగులు జోడించాక సామ్సన్ రనౌట్గా వెనుదిరిగాడు. అప్పటికే జట్టు ç146/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. బట్లర్, స్మిత్ జోరు భారీ విజయంపై కన్నేసిన స్మిత్, బట్లర్ చివర్లో చెలరేగారు. 30 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్తో బట్లర్ జోరు పెంచాడు. షమీ వేసిన 17వ ఓవర్లో స్మిత్ 3 ఫోర్లు, బట్లర్ మరో బౌండరీతో 19 పరుగులు రాబట్టారు. జోర్డాన్ ఓవర్లో మరో సిక్సర్ బాదిన బట్లర్ 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. వీరిద్దరూ చివరి 10 బంతుల్లో 30 పరుగులు చేశారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 46; మన్దీప్ సింగ్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 0; క్రిస్ గేల్ (బి) ఆర్చర్ 99; నికోలస్ పూరన్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 22; మ్యాక్స్వెల్ (నాటౌట్) 6; దీపక్ హుడా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–1, 2–121, 3–162, 4–184. బౌలింగ్: ఆర్చర్ 4–0–26–2; వరుణ్ ఆరోన్ 4–0–47–0; కార్తీక్ త్యాగి 4–0–47–0; శ్రేయస్ గోపాల్ 1–0–10–0; స్టోక్స్ 4–0–32–2; రాహుల్ తేవటియా 3–0–22–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రాబిన్ ఉతప్ప (సి) పూరన్ (బి) మురుగన్ అశ్విన్ 30; స్టోక్స్ (సి) దీపక్ హుడా (బి) జోర్డాన్ 50; సామ్సన్ (రనౌట్) 48; స్మిత్ (నాటౌట్) 31; బట్లర్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–60, 2–111, 3–145. బౌలింగ్: అర్ష్దీప్ సింగ్ 3–0–34–0, షమీ 3–0–36–0, మురుగన్ అశ్విన్ 4–0–43–1, క్రిస్ జోర్డాన్ 3.3–0–44–1, రవి బిష్ణోయ్ 4–0–27–0. -
ఏంటీ.. జింటా టీం గెలిచిందా..? అవును!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఆరంభంలో ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. తొలుత మ్యాచ్లన్నీ ఓడినా... ఆ తర్వాత గెలుపు బాటపట్టి సత్తా చాటింది. ఇక సోమవారం నాటి మ్యాచ్తో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న కేఎల్ సారథ్యంలోని కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు తీసి కేకేఆర్ను 149 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: ధోని ఫ్యాన్స్కు సీఎస్కే సీఈవో గుడ్న్యూస్! ) ఆ తర్వాత ఫోర్తో ఛేజింగ్ ప్రారంభించిన కింగ్స్.. హిట్టర్ క్రిస్గేల్, ఓపెనర్ మన్దీప్ సింగ్ల అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆరంభంలో ఒక్క మ్యాచ్ గెలవడానికే ఆపసోపాలు పడ్డ ఈ టీం.. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మీమ్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, 2014లో చేసిన ట్వీట్ను మరోసారి తెరమీదకు తెచ్చారు. ‘‘జింటా టీం గెలిచిందా?’’అన్న సల్మాన్ వ్యాఖ్యకు బదులుగా.. ‘‘హా అవును. అదే జరిగింది. మీరు చూడలేదా’’ అంటూ వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పంజాబ్ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తొలుత షేర్ చేసిన మీమ్కు అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. కాగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహయజమాని అన్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా ఆమె జట్టుతో ఉంటూ, ఆటగాళ్లను ఉత్సాహపరచడం సహా, ఓడిపోయిన సందర్భాల్లో విమర్శలకు ధీటుగా బదులిస్తూ కౌంటర్ వేస్తారన్న విషయం తెలిసిందే.(చదవండి: సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’) చదవండి: కేకేఆర్పై పంజాబ్ ప్రతాపం #KKRvKXIP https://t.co/QbQNUedxiN pic.twitter.com/KUQWWW4mSD — Wasim Jaffer (@WasimJaffer14) October 26, 2020 -
కేకేఆర్పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై గెలిచింది. మొదట కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్రైడర్స్ ఇన్నింగ్స్ను శుబ్మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్మెన్నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
పండగ పంజాబ్దే...
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో అనేక మ్యాచ్లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. దుబాయ్: ఐపీఎల్–2020లో మరో అనూహ్య ఫలితం... గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్రైజర్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17), అర్‡్షదీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరూ అందరే... తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్లో మన్దీప్ వెనుదిరగ్గా, పవర్ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్కు అసలు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గేల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ అవుట్ కావడంతో జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటిలాగే మ్యాక్స్వెల్ (12) విఫలం కాగా, దీపక్ హుడా (0) నిలబడలేకపోయాడు. మరో ఎండ్లో ఉన్న పూరన్ మాత్రం కాస్త పోరాడే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్లో కూడా ధాటి లోపించింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు చేసిన పంజాబ్, తర్వాతి పది ఓవర్లలో 60 పరుగులే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్లో మొత్తం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. 75 బంతులు... బౌండరీనే లేదు! పంజాబ్ పస లేని బ్యాటింగ్కు ఇదో ఉదాహరణ. 120 బంతుల ఇన్నింగ్స్లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి గేల్ ఫోర్ కొట్టగా... ఖలీల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి పూరన్ ఫోర్ కొట్టాడు. జట్టు ఇన్నింగ్స్లో ఒక్క పరుగు చేయని డాట్ బంతులు మొత్తం 48 ఉన్నాయి! నాన్న చనిపోయినా... పంజాబ్ ఓపెనర్ మన్దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్దీప్ జట్టులోకి వచ్చాడు. వార్నర్ జోరు... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్, బెయిర్స్టో (20 బంతుల్లో 19; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్తో ఆడిన గత 9 మ్యాచ్లలో వరుసగా ప్రతీసారి అర్ధ సెంచరీ చేసిన అద్భుత రికార్డు ఉన్న వార్నర్ ఇప్పుడు కూడా అదే జోరును ప్రదర్శించాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను, షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే బిష్ణోయ్ బౌలింగ్లో రివర్స్స్వీప్కు ప్రయత్నించి కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో అతను పదో హాఫ్ సెంచరీ అవకాశం కోల్పోయాడు. మరో రెండు పరుగులకే బెయిర్స్టో కూడా అవుట్ కాగా, సమద్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. మరీ నెమ్మదిగా ఆడి 33 పరుగులు జోడించేందుకు 44 బంతు లు తీసుకున్నారు. గత మ్యాచ్లో చెలరేగిన పాండే అయితే ఒక్కో పరుగు కోసం తంటాలు పడ్డాడు. చివరకు భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) రషీద్ 27; మన్దీప్ (సి) రషీద్ (బి) సందీప్ 17; గేల్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; పూరన్ (నాటౌట్) 32; మ్యాక్స్వెల్ (సి) వార్నర్ (బి) సందీప్ 12; దీపక్ హుడా (స్టంప్డ్) బెయిర్స్టో (బి) రషీద్ 0; జోర్డాన్ (సి) ఖలీల్ (బి) హోల్డర్ 7; మురుగన్ అశ్విన్ (రనౌట్) 4; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–29–2; ఖలీల్ 4–0–31–0; హోల్డర్ 4–0–27–2; రషీద్ ఖాన్ 4–0–14–2; నటరాజన్ 4–0–23–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 35; బెయిర్స్టో (బి) అశ్విన్ 19; పాండే (సి) (సబ్) సుచిత్ (బి) జోర్డాన్ 15; సమద్ (సి) జోర్డాన్ (బి) షమీ 7; శంకర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 26; హోల్డర్ (సి) మన్దీప్ (బి) జోర్డాన్ 5; గార్గ్ (సి) జోర్డాన్ (బి) అర్‡్షదీప్ 3; రషీద్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 0; సందీప్ (సి) అశ్విన్ (బి) అర్‡్షదీప్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఖలీల్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114. బౌలింగ్: షమీ 4–0–34–1; అర్‡్షదీప్ 3.5–0–23–3; అశ్విన్ 4–0–27–1; బిష్ణోయ్ 4–0–13–1; జోర్డాన్ 4–0–17–3. టర్నింగ్ పాయింట్... 17వ ఓవర్ తొలి బంతికి జోర్డాన్ బౌలింగ్లో పాండే అవుట్ కావడంతో రైజర్స్ పతనం మొదలైంది. సబ్స్టిట్యూట్ సుచిత్ బౌండరీ లైన్ వద్ద గాల్లో లేచి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది. జోర్డాన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పాండే క్యాచ్ పట్టిన సుచిత్ -
హ్యాట్రిక్ 'పంజా'...
ఐపీఎల్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట ఏడు మ్యాచ్లాడి ఆరింట ఓడింది. ఇక ప్లేఆఫ్స్కు కష్టమే అనుకున్న దశలో పంజా విసురుతోంది. దీంతో తర్వాత మూడు మ్యాచ్ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. పంజాబ్ గెలిచిన వరుస మూడు మ్యాచ్లు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ గెలుపుతో అట్టడుగున ఉన్న కింగ్స్ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. దుబాయ్: ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్ ధావన్ అజేయ శతకం... సుడి‘గేల్’, పూరన్ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. ఆడింది ఒక్కడే... ఢిల్లీ ఇన్నింగ్స్ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్ ఇన్నింగ్స్కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ధావన్ దంచుడు ఫోర్తో మొదలైంది. ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్ అయ్యర్ (14), పంత్ (14), స్టొయినిస్ (9), హెట్మైర్ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్కు తలవంచారు. మ్యాక్స్వెల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్వే! ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న ధావన్... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్ సిక్సర్తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్ బ్యాట్తోనే చేరింది. గేల్, పూరన్ ధనాధన్... కింగ్స్ లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెపె్టన్ రాహుల్ (15) వికెట్ను ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన గేల్ సుడిగాలి ఆట ఆడేశాడు. అతని హోరుతో 4 ఓవర్లలో 24/1 స్కోరు కాస్తా ఒక్క ఓవర్ పూర్తయ్యేసరికే గిర్రున తిరిగింది. తుషార్ వేసిన ఈ ఐదో ఓవర్ను అసాంతం ఆడిన గేల్ 4, 4, 6, 4, 6, వైడ్, 1లతో హోరెత్తించాడు. 26 పరుగులు ధనాధన్గా వచ్చేశాయంతే! కింగ్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. కానీ తర్వాతి ఓవర్లో అశి్వన్... గేల్ మెరుపులకు ఫుల్స్టాప్ పెట్టాడు. అదే ఓవర్లో మయాంక్ (5) రనౌటయ్యాడు. 7 ఓవర్లలో పంజాబ్ స్కోరు 57/3. ఢిల్లీ శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం. కానీ పూరన్ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించడంతో పరుగులు చకచకా వచ్చాయి. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో పూరన్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే రబడ అతన్ని ఔట్ చేశాడు. ఢిల్లీకి ఆశలు రేపినా... మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), నీషమ్ (8 బంతుల్లో 10 నాటౌట్; సిక్స్) జాగ్రత్త గా ఆడటంతో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ నెగ్గింది. టి20 క్రికెట్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో వార్నర్ (2011), ఉన్ముక్త్ చంద్ (2013), ల్యూక్ రైట్ (2014), మైకేల్ క్లింగర్ (2015), పీటర్సన్ (2015), మార్కో మరైస్ (2018), రీజా హెండ్రిక్స్ (2018), ఇషాన్ కిషన్ (2019) కూడా ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ ఒకే సీజన్లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో 2016లో కోహ్లి (బెంగళూరు) ఏకంగా 4 సెంచరీలు చేయగా... గేల్ (2011–బెంగళూరు), ఆమ్లా (2017–పంజాబ్), వాట్సన్ (2018–చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మ్యాక్స్వెల్ (బి) నీషమ్ 7; ధావన్ (నాటౌట్) 106, అయ్యర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 14, పంత్ (సి) మయాంక్ (బి) మ్యాక్స్వెల్ 14, స్టొయినిస్ (సి) మయాంక్ (బి) షమీ 9; హెట్మైర్ (బి) షమీ 10; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–25, 2–73, 3–106, 4–141, 5–164. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–31–1, షమీ 4–0–28–2, అర్‡్షదీప్ 3–0–30–0, నీషమ్ 2–0–17–1, మురుగన్ అశ్విన్ 4–0–33–1, రవి బిష్ణోయ్ 3–0–24–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సామ్స్ (బి) అక్షర్ 15; మయాంక్ (రనౌట్) 5; గేల్ (బి) అశ్విన్ 29; పూరన్ (సి) పంత్ (బి) రబడ 53; మ్యాక్స్వెల్ (సి) పంత్ (బి) రబడ 32; దీపక్ హుడా (నాటౌట్) 15; నీషమ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–17, 2–52, 3–56, 4–125, 5–147. బౌలింగ్: సామ్స్ 4–0–30–0, రబడ 4–0–27–2, అక్షర్ 4–0–27–1, తుషార్ 2–0–41–0, అశి్వన్ 4–0–27–1, స్టొయినిస్ 1–0–14–0. -
ముంబైతో మ్యాచ్లో కేఎల్ రాహుల్ రికార్డ్
దుబాయ్: ఐపీఎల్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై పంజాబ్ జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఆరో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేయడంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు (525) సాధించిన బ్యాట్స్మెన్గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే ముంబై జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్మన్గానూ గుర్తింపు పొందాడు. నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబైపై ఇప్పటిదాకా రాహుల్ 580 పరుగులు చేశాడు. (‘6 పరుగులు సేవ్ చేయడం మామూలు కాదు’) ఇదే మ్యాచ్ ద్వారా రాహుల్ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వరుసగా మూడు సీజన్లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్మన్గా అరుదైన రికార్డు సాధించాడు. తన టీమ్ సహచరుడైన క్రిస్ గేల్ కూడా వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు సాధించాడు. ఇక భారత క్రికెటర్లలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్మన్ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. -
ఉత్కం‘టై’లో... పంజాబ్ సూపర్ గెలుపు
దుబాయ్: సూపర్+సూపర్ ఆటకు తెరలేపిన ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. తొలి సూపర్ ‘ఆరు’ బంతులాటలో సింగిల్ డిజిటే నమోదైంది. పంజాబ్ ముందుగా పూరన్ (0), రాహుల్ (4) వికెట్లను కోల్పోయి 5 పరుగులే చేస్తే... ముంబై కూడా డికాక్ (3) వికెట్ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయ్యింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్ ఓవర్ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్ పాండ్యా (1) వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్... గేల్ (7) సిక్స్, మయాంక్ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా... పొలార్డ్ (12 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. రాహుల్ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్లు) విరోచిత పోరాటం చేశాడు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. ముంబై తడబాటు... ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9), సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7) పంజాబ్ పేస్కు తలవంచారు. ఈ దశలో డికాక్, కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు శ్రమించారు. అడపాదడపా డికాక్ సిక్సర్లతో, కృనాల్ ఫోర్లతో మురిపించారు. అయితే రన్రేట్ మాత్రం ఆశించినంతగా పెరగలేదు. దీంతో జట్టు ఎనిమిదో ఓవర్లో 50, 14వ ఓవర్లో 100 పరుగులు చేసింది. డికాక్ 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో కృనాల్, హార్దిక్ (8), డికాక్ అవుటయ్యారు. పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్... చప్పగా సాగే ఇన్నింగ్స్కు పొలార్డ్ మెరుపులద్దాడు. అర్శ్దీప్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. కూల్టర్ నీల్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. షమీ తర్వాతి ఓవర్లో కూల్టర్ నీల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక జోర్డాన్ ఆఖరి ఓవర్లోనూ పొలార్డ్ 2 సిక్స్లు, ఓ ఫోర్ బాదడంతో 20 పరుగులు స్కోరుబోర్డుకు జతయ్యాయి. ఈ చివరి 3 ఓవర్లలోనే 54 పరుగులు రావడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. కూల్టర్నీల్, పొలార్డ్ జోడీ అబేధ్యమైన ఏడో వికెట్కు కేవలం 21 బంతుల్లోనే 57 పరుగులు జోడించింది. రాహుల్ జిగేల్... పంజాబ్ ఇన్నింగ్స్లో ధాటిగా ఆడే ఓపెనర్ మయాంక్ అగర్వాల్లో ఈసారి ఆ దూకుడేమి కనిపించలేదు. మరో ఓపెనర్, కెప్టెన్ లోకేశ్ రాహుల్ మాత్రం మెరిపించినా... ధనాదంచేసినా... బాధ్యతగా ఆడాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగాడు. ఐదు బంతులాడిన రాహుల్ 4, 4, 0, 6, వైడ్, 4లతో 20 పరుగులు పిండుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే మయాంక్ (11)ను బుమ్రా క్లీన్బౌల్డ్ చేశాడు. గేల్, రాహుల్ కలిసి కాసేపు వేగంగా నడిపించారు. గేల్ (24) అవుట్ కావడంతో ఈ జోడికి పదో ఓవర్లో చుక్కెదురైంది. రాహుల్ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. పూరన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) భారీ షాట్లతో అలరించినా ఎంతోసేపు నిలువలేదు. మ్యాక్స్వెల్ (0) డకౌటయ్యాడు. దీంతో భారమంతా మోసిన రాహుల్ లక్ష్యానికి 23 పరుగుల దూరంలో బౌల్డయ్యాడు. హుడా (23 నాటౌట్), జోర్డాన్ (13) పోరాడటంతో గెలుపుదారిన పడ్డట్లే కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సివుండగా... మొదటి ఐదు బంతులకు వరుసగా 1, 4, 1, 0, 1తో 7 పరుగులొచ్చాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. జోర్డాన్ పరుగు చేసి రెండో పరుగు కోసం రనౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ‘టై’ అయ్యింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) అర్‡్షదీప్ సింగ్ 9; డికాక్ (సి) మయాంక్ (బి) జోర్డాన్ 53; సూర్యకుమార్ యాదవ్ (సి) మురుగన్ అశ్విన్ (బి) షమీ 0; ఇషాన్ కిషన్ (సి) మురుగన్ అశ్విన్ (బి) అర్‡్షదీప్ సింగ్ 7; కృనాల్ (సి) హుడా (బి) రవి బిష్ణోయ్ 34; హార్దిక్ (సి) పూరన్ (బి) షమీ 8; పొలార్డ్ (నాటౌట్) 34; కూల్టర్నీల్ (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–24, 3–38, 4–96, 5–116, 6–119. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–24–0, షమీ 4–0–30–2, అర్‡్షదీప్ సింగ్ 3–0–35–2, జోర్డాన్ 3–0–32–1, మురుగన్ అశ్విన్ 3–0–28–0, దీపక్ హుడా 1–0–9–0, రవి బిష్ణోయ్ 2–0–12–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) బుమ్రా 77; మయాంక్ (బి) బుమ్రా 11; గేల్ (సి) బౌల్ట్ (బి) రాహుల్ చహర్ 24; పూరన్ (సి) కూల్టర్నీల్ (బి) బుమ్రా 24; మ్యాక్స్వెల్ (సి) రోహిత్ శర్మ (బి) రాహుల్ చహర్ 0; దీపక్ హుడా (నాటౌట్) 23; జోర్డాన్ (రనౌట్) 13; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–33, 2–75, 3–108, 4–115, 5–153, 6–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, కృనాల్ 2–0–12–0, బుమ్రా 4–0–24–3, కూల్టర్నీల్ 4–0–33–0, పొలార్డ్ 2–0–26–0, రాహుల్ చహర్ 4–0–33–2. మయాంక్, గేల్ విజయానందం -
పంజాబ్ మళ్లీ గెలిచిందోచ్!
ఐపీఎల్లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్. గెలిచే మ్యాచ్ల్ని ఓడిన జట్టు కూడా పంజాబే! రెండొందల పైచిలుకు స్కోరు చేసినా పరాజయాన్ని పలకరించిన జట్టు కింగ్స్ ఎలెవనే. ఇలాంటి జట్టు ఈ మ్యాచ్కు ముందు వరకు ఏడింట ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అది బెంగళూరుపైనే! ఇప్పుడు కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత మళ్లీ బెంగళూరుపైనే గెలిచి హమ్మయ్య గెలిచామనిపించింది. కింగ్స్ ఎలెవన్ అభిమానుల్ని ఊరటనిచ్చింది. లీగ్లో ముందడుగు వేసే అవకాశాల్ని సజీవంగా నిలుపుకుంది. షార్జా: ఎట్టకేలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ గెలిచింది. మరుగున పడిన ఆశలకు ఊపిరి పోసింది. గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లి (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ (49 బంతుల్లో 61 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్ (45 బంతుల్లో 53; 1 ఫోర్ 5 సిక్స్లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. దూకుడుగా మొదలై... మ్యాక్స్వెల్ తొలి ఓవర్లో లాంగ్ లెగ్లో భారీ సిక్సర్ బాదిన ఫించ్, షమీ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. కాస్త ఆలస్యంగా బ్యాట్కు పనిచెప్పిన దేవ్దత్ పడిక్కల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన నాలుగో ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్లో అతను సిక్స్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 38/0 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే దేవ్దత్ చెత్త షాట్తో వికెట్ పారేసుకున్నాడు. కోహ్లి వస్తూనే రెండు వరుస బౌండరీలు కొట్టాడు. 5.2 ఓవర్లలో బెంగళూరు 50 పరుగులకు చేరింది. జట్టు కుదుటపడే సమయంలో ఫించ్కు (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మురుగన్ అశ్విన్ చెక్ పెట్టాడు. ఏబీని కాదని... ఈ దశలో లెగ్ స్పిన్ను ఏబీ డివిలియర్స్ సరిగా ఆడలేడనే ఆలోచనతో ఆర్సీబీ టీమ్ వాషింగ్టన్ సుందర్ను ముందుగా బ్యాటింగ్కు పంపింది. ఈ ఎత్తుగడ ఏ మాత్రం జట్టుకు లాభించలేదు. కోహ్లితో సుందర్ జోడీ కుదర్లేదు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లో సుందర్ (13)ను మురుగన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. మళ్లీ బెంగళూరు చేసిన తప్పే మళ్లీ చేసింది. ఈ సారీ కూడా ఏబీని కాదని శివమ్ దూబేను పంపింది. 11 నుంచి 14 ఓవర్లదాకా స్కోరు వేగం పూర్తిగా తగ్గింది. నాలుగు ఓవర్లలో బెంగళూరు 19 పరుగులే చేసింది. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదిన దూబే (19 బంతుల్లో 23; 2 సిక్స్లు)ను తర్వాతి ఓవర్లోనే జోర్డాన్ అవుట్ చేశాడు. 17వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన డివిలియర్స్ (2)ను షమీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. రెండు బంతుల వ్యవధిలో కోహ్లి కూడా అవుటవడంతో డివిలియర్స్ను ఆపి ఆఖర్లో దించిన ఆర్సీబీ అంచనా తలకిందులైంది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో మోరిస్ భారీషాట్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ఇన్నింగ్స్లోనే అత్యధికంగా 24 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల శుభారంభం మోరిస్ వేసిన తొలి ఓవర్లో ఒకే పరుగు చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలైంది. తర్వాత బౌండరీలతో పుంజుకుంది. ఆ వెంటే సిక్సర్లతో హోరెత్తింది. రాహుల్ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. ఈ రెండు ఓవర్లు ముగిసినా... మయాంక్ అగర్వాల్ ఖాతానే తెరవలేదు. మూడో ఓవర్లో మళ్లీ రాహులే సిక్సర్తో మెరిపించాడు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు 18/0. ఇక నాలుగో ఓవర్ను స్పిన్నర్ చహల్ బౌలింగ్ చేయగా... మయాంక్ బ్యాట్ ఝులిపించాడు. సిక్స్తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కూడా సిక్స్ లేదంటే ఫోర్తో ఓవర్లు సాగిపోయాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆరో ఓవర్లో 50 పరుగులకు చేరింది. రాహుల్ ఫిఫ్టీ పంజాబ్ ఓపెనర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం పెరిగింది. రాహుల్ కంటే ధాటిగా ఆడుతున్న మయాంక్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు)కు ఎట్టకేలకు చహల్ చెక్ పెట్టాడు. 8వ ఓవర్లో బౌలర్ తలమీదుగా సిక్స్కొట్టిన అగర్వాల్ ఆ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సిరాజ్ వేసిన 12వ ఓవర్లో రాహుల్ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పంజాబ్ వంద పరుగులను అధిగమించింది. రాహుల్ 37 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. గేల్ ధనాధన్ తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ తొలి 14 బంతుల్లో 6 పరుగులే చేసినా, సుందర్ ఓవర్లో భారీ సిక్సర్లతో టచ్లోకి వచ్చాడు. తర్వాత సిరాజ్ బౌలింగ్లో గేల్ 4, 6 కొడితే రాహుల్ మరో సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. 17వ ఓవర్లో గేల్ తనదైన శైలిలో లాంగాన్లో 2 సిక్సర్లను బాదేశాడు. దీంతోనే అతని అర్ధశతకం 36 బంతుల్లో పూర్తయ్యింది. 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వుండగా... మోరిస్ (18వ), ఉదాన (19వ) రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరం కాగా చహల్ కూడా పేసర్లలాగే వైవిధ్యమైన బంతులేశాడు. 4 బంతుల్లో పరుగు మాత్రమే ఇచ్చాడు. స్కోరు సమమైంది. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి పరుగు చేయాల్సిన సమయంలో ఉత్కంఠ రేగింది. కానీ పూరన్ భారీ సిక్సర్తో ఈ ఉత్కంఠను, లక్ష్యాన్ని ఛేదించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫించ్ (బి) మరుగున్ అశ్విన్ 20; పడిక్కల్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 18; కోహ్లి (సి) రాహుల్ (బి) షమీ 48; సుందర్ (సి) జోర్డాన్ (బి) అశ్విన్ 13; దూబే (సి) రాహుల్ (బి) జోర్డాన్ 23; డివిలియర్స్ (సి) హుడా (బి) షమీ 2; మోరిస్ (నాటౌట్) 25; ఉదాన (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–38, 2–62, 3–86, 4–127, 5–134, 6–136. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–28–0, షమీ 4–0–45–2, అర్‡్షదీప్ 2–0–20–1, రవి బిష్ణోయ్ 3–0–29–0, మురుగన్ అశ్విన్ 4–0–23–2, జోర్డాన్ 3–0–20–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 61; మయాంక్ (బి) చహల్ 45; గేల్ (రనౌట్) 53; పూరన్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–78, 2–171. బౌలింగ్: మోరిస్ 4–0–22–0, సైనీ 4–0–21–0, చహల్ 3–0–35–1, ఉదాన 2–0–14–0, సిరాజ్ 3–0–44–0, సుందర్ 4–0–38–0. కోహ్లి @ 200 మ్యాచ్ల్లో సెంచరీలు కొట్టే విరాట్... మ్యాచ్ల పరంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ పుట్టినప్పటినుంచి ఆర్సీబీని వీడని కెప్టెన్ కోహ్లి ఈ జట్టు తరఫున గురువారం 200వ మ్యాచ్ ఆడాడు. ఇందులో 185 ఐపీఎల్లోనే ఆడగా... మిగతా 15 మ్యాచ్లు చాంపియన్స్ లీగ్ (రద్దయింది)లో ఆడాడు. -
హై హై హైదరాబాద్...
సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్స్టో, వార్నర్ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్తో కుప్పకూలిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది. శతక భాగస్వామ్యం... సీజన్లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్ప్లేలో హైదరాబాద్ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్రేట్తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్స్టో... ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. 5 ఓవర్లలో 6 వికెట్లు... 15 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్ చక్కటి బౌలింగ్కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్స్టో అవుట్ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్ (20 నాటౌట్) చకచకా రన్స్ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ 41 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పూరన్ మెరుపులు.. పంజాబ్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ ఒక్కటే. తొలి బంతినే కవర్డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రివ్యూ నిర్ణయంపై రివ్యూ... పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్ వేసిన ఐదో బంతి ముజీబ్ బ్యాట్కు తాకుతూ కీపర్ చేతుల్లో పడటంతో అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఆపై రైజర్స్ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించడంతో ముజీబ్ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్కు తగిలిందంటూ మూడో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్మన్ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మ్యాక్స్వెల్ (బి) రవి బిష్ణోయ్ 52; బెయిర్స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 97; సమద్ (సి) అర్‡్షదీప్ (బి) బిష్ణోయ్ 8; పాండే (సి అండ్ బి) అర్‡్షదీప్ 1; విలియమ్సన్ (నాటౌట్) 20; ప్రియమ్ గార్గ్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) మ్యాక్స్వెల్ (బి) షమీ 12; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–33–0; ముజీబ్ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్వెల్ 2–0–26–0; బిష్ణోయ్ 3–0–29–3; అర్‡్షదీప్ 3–0–33–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) అభిషేక్ 11; మయాంక్ (రనౌట్) 9; సిమ్రన్ సింగ్ (సి) గార్గ్ (బి) ఖలీల్ 11; పూరన్ (సి) నటరాజన్ (బి) రషీద్ 77; మ్యాక్స్వెల్ (రనౌట్) 7; మన్దీప్ (బి) రషీద్ 6; ముజీబ్ (సి) బెయిర్స్టో (బి) ఖలీల్ 1; రవి బిష్ణోయ్ (నాటౌట్) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్ 0; కాట్రెల్ (బి) నటరాజన్ 0; అర్‡్షదీప్ (సి)వార్నర్ (బి)నటరాజన్ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–27–0; ఖలీల్ అహ్మద్ 3–0–24–2; నటరాజన్ 3.5–0–24–2; అభిషేక్ 1–0–15–1; రషీద్ ఖాన్ 4–1–12–3; సమద్ 1–0–28–0. -
చెన్నై చిందేసింది
చెన్నై సూపర్గా ఆడి కింగ్స్ ఎలెవన్ను ఓడించింది. పంజాబ్ లక్ష్యం ఓపెనర్ల పంజాకే కరిగిపోయింది. ఓవర్లు గడిచేకొద్దీ పరుగులు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్క వికెట్ కూడా పడకపోవడం కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. లీగ్లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లాడిన పంజాబ్కు ఇది నాలుగో ఓటమి కాగా... సూపర్కింగ్స్ తమ ‘హ్యాట్రిక్’ పరాజయాలకు ఫుల్స్టాప్ పెట్టింది. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్: చెన్నై దర్జాగా చిందేసింది. ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) వేసిన పరుగుల బాటతో సూపర్కింగ్స్ విజయబావుటా ఎగరేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోని బృందం 10 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) స్కోరుబోర్డును నడిపించగా... పూరన్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కింగ్స్ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్లను పక్కనబెట్టి మన్దీప్, హర్ప్రీత్ బ్రార్, జోర్డాన్లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. రాహుల్ ఫిఫ్టీ... రాహుల్, మయాంక్ జోరు లేని శుభారంభమైతే ఇచ్చారు. అయితే వేగం పెరిగే దశలో మయాంక్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఔటయ్యాడు. మన్దీప్ సింగ్... చావ్లా ఓవర్లో మిడ్వికెట్, డీప్ మికెట్ల మీదుగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే జడేజా అతని స్పీడ్కు కళ్లెం వేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ భారీ షాట్లే లక్ష్యమని బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదా డు. ఓపెనర్ రాహుల్ ఆలస్యంగా 15వ ఓవర్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో సిక్స్ సహా వరుసగా రెండు బౌండరీలు కూడా కొట్టాడు. మరోవైపు పూరన్ సిక్సర్లతో అలరించాడు. 9 పరుగుల రన్రేట్కు చేరిన ఈ దశలో 18వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో పూరన్, రాహుల్లను ఔట్ చేయడంతో డెత్ ఓవర్లలో రావల్సినన్ని పరుగులు రాలేదు. ఇద్దరే పూర్తి చేశారు... చెన్నై తరఫున పరుగుల వేట ప్రారంభించింది ఇద్దరే. పరుగులన్నీ చకచకా చేసింది ఇద్దరే! లక్ష్యం చేరేదాకా నిలబడింది కూడా ఆ ఇద్దరే! ఆ ఇద్దరు ఇంకెవరో కాదు... ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్. మొత్తం 18 ఓవర్లు వేయగా... ఇందులో రెండే రెండు ఓవర్లు (1, 13వ) బౌండరీకి దూరమయ్యాయి. కానీ 16 ఓవర్లు బౌండరీని చేరేందుకే ఇష్టపడినట్లుగా ఇద్దరి ఆట రమ్యంగా సాగిపోయింది. జట్టు 6వ ఓవర్లో 50, 10వ ఓవర్లో వంద పరుగుల్ని దాటింది. వాట్సన్ 31 బంతుల్లో (9 ఫోర్లు, 1 సిక్స్)... డుప్లెసిస్ 33 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఏదో భారీ షాట్కో లేదంటే లూజ్ షాట్కో పెవిలియన్ చేరతారనుకుంటే పొరపాటే! జట్టు గెలిచేదాకా ఒట్టు పెట్టుకుని ఆడినట్లే ఆడారు. ఓవర్కు 10 పరుగుల రన్రేట్తో చెన్నై దూసుకెళ్లింది. పది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2 ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్గా ఐపీఎల్లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) ధోని (బి) శార్దుల్ 63; మయాంక్ (సి) కరన్ (బి) పీయూశ్ 26; మన్దీప్ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్ (సి) జడేజా (బి) శార్దుల్ 33; మ్యాక్స్వెల్ (నాటౌట్) 11; సర్ఫరాజ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–61, 2–94, 3–152, 4–152. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–17–0, స్యామ్ కరన్ 3–0–31–0, శార్దుల్ 4–0–39–2, బ్రేవో 4–0–38–0, జడేజా 4–0–30–1, పీయూశ్ 2–0–22–1. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (నాటౌట్) 83; డుప్లెసిస్ (నాటౌట్) 87; ఎక్స్ట్రాలు 11; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181. బౌలింగ్: కాట్రెల్ 3–0–30–0, షమీ 3.4–0–35–0, హర్ప్రీత్ 4–0–41–0, జోర్డాన్ 3–0–42–0, రవి బిష్ణోయ్ 4–0–33–0. -
ముంబై మెరుపులు
ముంబై ఇండియన్స్ గర్జించింది. మెరుపులు ఆలస్యమైనా... ఆఖర్లో అనూహ్య విధ్వంసంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిన్నాభిన్నం చేసింది. సింహభాగం ఓవర్ల దాకా ఆధిపత్యం చలాయించిన కింగ్స్ బౌలింగ్ చివరకొచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్, పొలార్డ్, పాండ్యా చూపించిన చుక్కలకు, కొట్టిన బౌండరీలకు స్కోరు బోర్డు వాయు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్తో కింగ్స్పై పంజా విసరడంతో విజయం సులువుగానే దక్కింది. అబుదాబి: ముంబై ఆల్రౌండ్ సత్తాకు పంజాబ్ దాసోహమైంది. డెత్ ఓవర్లో అయితే బ్యాటింగ్ విశ్వరూపానికి ప్రత్యక్ష సాక్ష్యమైంది. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చేతులెత్తేసింది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా... పొలార్డ్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. డికాక్ డకౌట్ ముంబై ఇండియన్స్ పరుగు ప్రారంభించక ముందే డికాక్ డకౌటైతే... రెండో ఓవర్లో రోహిత్ ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. షమీ తొలి బంతిని బౌండరీకి తరలించడంతో హిట్మ్యాన్ ఈ మార్క్ చేరాడు. కానీ ముంబై స్కోరు మాత్రం జోరుగా సాగలేదు. పది ఓవర్లు గడిచినా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా ఒక్క సిక్సరైనా లేదు. అడపాదడపా ఫోర్ల రూపంలో పరుగులొచ్చినా మ్యాచ్ చప్పగా సాగింది. ఈ దశలో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్తో మురిపించాడు. కానీ పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు అతని ఆటలు ఎంతోసేపు సాగలేదు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్లకు 87 పరుగులే చేయగలిగింది. పూరన్ ఒక్కడే... పంజాబ్ ఆరంభం అదిరింది. తొలి ఓవర్లోనే మయాంక్, రాహుల్ చెరో బౌండరీ బాదారు. రెండో ఓవర్లో 12, మూడో ఓవర్లో 9 పరుగుల రావడంతో కింగ్స్ 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. అయితే మయాంక్ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు) జోరుకు బుమ్రా కళ్లెం వేశాడు. కాసేపటికే కరుణ్ నాయర్ (0), రాహుల్ (17) అవుట్ కావడంతో పంజాబ్ గెలుపు దారి మూసుకుపోయింది. ఈ దశలో నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. సిక్స్లు, ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ చేయాల్సిన రన్రేట్కు అతనొక్కడి ధనాధన్ ఏమాత్రం సరిపోలేదు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. అయితే ఆ మరుసటి బంతికే పూరన్ ఔట్ కావడం, హిట్టర్ మ్యాక్స్వెల్ (11) చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి 15వ ఓవర్లోనే ఖాయమైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆట 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు పనికొచ్చింది. సచిన్ మాట! ముంబై 18వ ఓవర్లో 18 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 19 పరుగులు చేసింది. హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యా క్రీజులో విధ్వంసరచన చేస్తుంటే పంజాబ్ కెప్టెన్ రాహుల్ 20వ ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్కు బంతినిచ్చాడు. ఈ పరిణామం బ్యాటింగ్ లెజెండ్ సచిన్ను సైతం విస్మయపరిచింది. అందుకేనేమో ట్విట్టర్లో ఆ దిగ్గజం తలబాదుకునే ఇమోజీతో వ్యాఖ్య జోడించి పోస్ట్ చేశాడు. ‘పొలార్డ్, పాండ్యా క్రీజ్లో ఉన్నప్పుడు 20వ ఓవర్ ఒక ఆఫ్ స్పిన్నర్ బౌల్ చేయడమా’ అని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే రాహుల్ వ్యూహం ఎంత తప్పో అర్థమవుతుంది. ఆరు... ఫోరు... ఆఖర్లో ముంబై జోరు.. ముంబై 14 ఓవర్లు ఆడింది. ఓపెనర్, హిట్మ్యాన్ రోహిత్ క్రీజులో ఉన్నాడు. అయినా జట్టు స్కోరు వంద పరుగులైనా చేయలేదు. మిగిలినవి 6 ఓవర్లు. పిచ్ స్వభావం, మ్యాచ్ జరిగిన విధానం బట్టి... కాస్త ధాటిగా ఆడినా ఈ 36 బంతుల్లో 60, 70 పరుగులు చేస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఈ ఆరు ఓవర్లే ముంబై దశను మార్చాయి. ఈ సమయంలో ఫోర్లు, సిక్సర్లు పోటీపడ్డాయి. బౌండరీ లైనును అదే పనిగా దాటాయి. బిష్ణోయ్ 15వ ఓవర్లో రోహిత్ రెండు సిక్సర్లతో స్కోరు వంద దాటింది. నీషమ్ 16 ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6 బాదడంతో అర్ధసెంచరీ దాటి ఏకంగా 70 పరుగులకు చేరింది. అదే స్కోరుపై రోహిత్ను మరుసటి ఓవర్ తొలి బంతికే షమీ ఔట్ చేయగా... 17వ ఓవర్లో ఐదే పరుగులొచ్చాయి. 18, 19, 20 ఓవర్లలలో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ల ధనాధన్తో దద్దరిల్లింది. ఈ 18 బంతుల్లో బంతి ఏకంగా 11 సార్లు బౌండరీని దాటింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై 104 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేవలం 23 బంతుల్లోనే పొలార్డ్, పాండ్యా అబేధ్యమైన ఐదో వికెట్కు 67 పరుగులు జోడించారు. 3 ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని దాటిన మూడో బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (5430), సురేశ్ రైనా (5368)లు రోహిత్ శర్మ (5068)కంటే ముందున్నారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) కాట్రెల్ 0; రోహిత్ (సి) నీషమ్ (బి) షమీ 70; సూర్య కుమార్ (రనౌట్) 10; ఇషాన్ కిషన్ (సి) కరుణ్ నాయర్ (బి) గౌతమ్ 28; పొలార్డ్ (నాటౌట్) 47; హార్దిక్ (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 191 వికెట్ల పతనం: 1–0, 2–21, 3–83, 4–124. బౌలింగ్: కాట్రెల్ 4–1–20–1, షమీ 4–0–36–1, రవి 4–0–37–0, గౌతమ్ 4–0–45–1, నీషమ్ 4–0–52–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చహర్ 17; మయాంక్ (బి) బుమ్రా 25; కరుణ్ నాయర్ (బి) కృనాల్ 0; పూరన్ (సి) డికాక్ (బి) ప్యాటిన్సన్ 44; మ్యాక్స్వెల్ (సి) బౌల్ట్ (బి) చహర్ 11; నీషమ్ (సి) సూర్య కుమార్ (బి) బుమ్రా 7; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్ 7; గౌతమ్ (నాటౌట్) 22; రవి (సి) సూర్య కుమార్ (బి) బౌల్ట్ 1; షమీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–38, 2–39, 3–60, 4–101, 5–107, 6–112, 7–121, 8–124. బౌలింగ్: బౌల్ట్ 4–0–42–1, ప్యాటిన్సన్ 4–0–28–2, కృనాల్ 4–0–27–1, బుమ్రా 4–0–18–2, చహర్ 4–0–26–2. -
'మ్యాక్స్వెల్ను ఇష్టపడింది నేను.. మీరు కాదు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్తో ఎంగేజ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్మెంట్ జరిపారు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు దుబాయ్ వెళ్లిన మ్యాక్స్వెల్ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే రామన్ షేర్ చేసిన ఫోటోలపై ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : 'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం') 'వినీ రామన్.. మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై వినీ రామన్ ఘాటుగానే స్పందించింది. 'వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను సాధారణంగా పట్టించుకోను. కానీ తాజాగా వచ్చిన కామెంట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం. నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. అది నాకు మ్యాక్స్వెల్లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినీ రామన్ కామెంట్స్ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.(చదవండి : వాటే స్పెల్ రషీద్..) కాగా గతేడాది అక్టోబర్లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని అందుకే క్రికెట్కు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు మ్యాక్స్వెల్ సంచలన ప్రకటన చేశాడు.అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన మ్యాక్స్ కాసేపటికే ఈ ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మ్యాక్స్వెల్ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు వినీ రామన్ అతనికి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. వినీ రామన్ సలహాలతో మ్యాక్స్ తన ఒత్తిడిని అధిగమించి 2019-20 బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్ తరపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఆడుతున్న మ్యాక్స్వెల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపునఆడుతున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్వెల్ను కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
పాంటింగ్ కామెంట్తో కసి పెరిగింది
గత ఏడాది ఐపీఎల్... ఆ ఘటనను రాహుల్ తేవటియా ఎప్పటికీ మరచిపోలేడు. అప్పుడతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్పై వాంఖడే స్టేడియంలో అద్భుత విజయం సాధించిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్లో ప్రసంగించాడు. మ్యాచ్లో విజయానికి కారణమైన పంత్, ఇంగ్రామ్, ధావన్, ఇషాంత్, బౌల్ట్, రబడ... ఇలా అందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ వారిని అభినందించాడు. అది ముగిసిన తర్వాత పాంటింగ్ వెళ్లిపోతుండగా... తేవటియా అడ్డుగా వచ్చాడు. ‘నేనూ నాలుగు క్యాచ్లు పట్టాను. కాస్త నా గురించి కూడా చెప్పవచ్చుగా’ అని అడిగాడు. దాంతో ‘ఇతను కూడా నాలుగు క్యాచ్లు పట్టాడుగా, ఇతడినీ అంతా అభినందించండి’... అంటూ పాంటింగ్ అలా గట్టిగా చెబుతూ వెళ్లిపోయాడు. ఇందులో ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించడంకంటే ఒక రకమైన వ్యంగ్యమే ఎక్కువగా కనిపించింది. సహచరులు కూడా అలాగే భావిస్తూ నవ్వారు. అక్షర్ పటేల్ అయితే ‘ఎవరైనా ఇలా అడిగి మరీ అభినందనలు చెప్పించుకుంటారా’ అని అనేశాడు. అయితే రాహుల్ తేవటియా మాత్రం తడబడలేదు. ‘మనకు దక్కాల్సిన గుర్తింపును హక్కుగా భావించి దాని కోసం పోరాడాల్సిందే’ అని జవాబిచ్చాడు. ఇది మాత్రం తేవటియా సరదాగా చెప్పలేదు. తననూ గుర్తించాలన్న కసి కనిపించింది. ఇప్పుడు కాలం గిర్రున తిరిగింది. ఏడాది తర్వాత రాహుల్ తేవటియాకు తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం అతని గురించే మాట్లాడుకుంటోంది. ఇది అతను సాధించిన పెద్ద విజయం. టి20 వ్యూహాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా అతని ఇన్నింగ్స్ను చూస్తే ఎంతటి కఠిన పరిస్థితుల్లోనూ పోరాటం ఆపరాదని, ఓటమిని అంగీకరించకుండా తనపై తాను నమ్మకం ఉంచాలనే లక్షణం 27 ఏళ్ల తేవటియాలో పుష్కలంగా ఉందని అర్థమవుతోంది. అటూ ఇటూ... రాహుల్ తేవటియా 2014 నుంచి ఐపీఎల్లో ఉన్నాడు. అప్పుడూ అతను రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ లీగ్ మధ్యలో అతడిని పంజాబ్ తీసుకుంది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ 2017లో ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. తర్వాతి సంవత్సరం మళ్లీ ఢిల్లీ డేర్డెవిల్స్కు వచ్చాడు. రెండు సీజన్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రాయల్స్తోనే అవకాశం. ఇంత కాలం ఎక్కడా ఆడినా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఐపీఎల్లోనైతే కేవలం 6.2 ఓవర్లు మాత్రమే వేసిన తేవటియా బ్యాటింగ్లో 22 బంతులు మాత్రమే ఆడగలిగాడు. ఏ రకంగా చూసినా ఇది అతను ఆశించింది కాదు. బ్యాటింగ్పై దృష్టి పెట్టి.. తేవటియాకు తన బలం, బలహీనతపై ఒక అంచనా వచ్చేసింది. తాను లెగ్స్పి న్నర్నే అయినా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే చహల్ లేదా అమిత్ మిశ్రా స్థాయి తనది కాదు. కేవలం బౌలర్గానే జట్టులో ఉండేంత గొప్ప బౌలింగ్ కాదు. అందువల్లే అతని రాష్ట్ర జట్టు హరియాణాలో కూడా రెగ్యులర్గా తేవటియాకు అవకాశాలు రాలేదు. అందుకే తన బ్యాటింగ్పై అతను బాగా దృష్టి పెట్టాడు. భారీ షాట్లు ఆడటంపై తీవ్రంగా సాధన చేశాడు. రాయల్స్కు కూడా ఇలాంటి ఆటగాడి అవసరం కనిపించడంతో అతనికి అవకాశం లభించింది. రాజస్తాన్ టీమ్లో ఉన్న భారత ఆటగాళ్లలో బంతిని బలంగా బాదగల ఏకైక లెఫ్ట్ హ్యాండర్ తేవటియా మాత్రమే. అదే అతనికి అర్హతగా పని చేసింది. సూపర్ బ్యాటింగ్... లీగ్ ఆరంభానికి ముందు రాజస్తాన్ ఆడిన అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్లలో తేవటియా బ్యాటింగ్ పవర్ను కోచింగ్ సిబ్బంది పరిశీలించారు. అతను ఆదివారం మ్యాచ్ తరహాలో భారీ షాట్లు కొట్టగలడని ఆ బృందానికి తప్ప ఎవరికీ కనీస అంచనా కూడా లేదు. అందుకే నాలుగో స్థానంలో అతడిని పంపిన వ్యూహంపై అంతా విరుచుకుపడ్డారు. ఇక పరుగులు తీయకుండా అతను తీవ్రంగా ఇబ్బంది పడటం చూసి కొందరు జాలి కూడా పడ్డారు. కానీ తేవటియా తనపై తాను విశ్వాసం కోల్పోలేదు. సిక్సర్లతో విరుచుకుపడి తనేమిటో నిరూపించాడు. చివరకు యువరాజ్ సైతం ‘ఆ ఒక్క బంతిని వదిలి పెట్టినందుకు సంతోషం’ అంటూ తన రికార్డు గురించి ప్రస్తావించాడంటే వాటి విలువేమిటో తెలుస్తుంది. ‘తేవటియా దూకుడు, బంతిని బలంగా బాదే శైలి గురించి నాకు బాగా తెలుసు. కెరీర్ తొలి మ్యాచ్లోనే అతను 90కి పైగా పరుగులు చేయడం నాకు గుర్తుంది. ఐపీఎల్తో అతడికి మంచి అవకాశం లభించింది. ఇకపై కూడా మరింత బాగా ఆడాలి’ అని తేవటియా తొలి కోచ్, భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ యాదవ్ వ్యాఖ్యానించాడు. (ఆ ఒక్క బంతి మిస్ చేసినందుకు థాంక్స్: యువీ) జోరు కొనసాగించగలడా.. ఒక్క ఇన్నింగ్స్ తేవటియా స్థాయిని పెంచింది. ఇక అతనిపై కచ్చితంగా అంచనాలు పెరిగిపోతాయి. అదే తరహాలో ప్రతీ మ్యాచ్లో రాజస్తాన్ అతడి నుంచి ఇలాంటి ఆటను ఆశిస్తుంది. జట్టు ట్విట్టర్ అకౌంట్లో బయోలో కూడా ‘2020 రాహుల్ తేవటియాలాగా సాగాలని కోరుకుందాం’ అని మార్చింది. అంటే ఆరంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలనే ఉద్దేశం కావచ్చు కానీ ఇది కూడా తేవటియాపై ఒత్తిడి పెంచుతుంది. అయితే అతను రెగ్యులర్ బ్యాట్స్మన్ కాకపోవడం కొంత మేలు చేసే అంశం. అద్భుత బౌలర్ కాకపోయినా చెన్నైతో మ్యాచ్ లో కూడా 3 కీలక వికెట్లతో అతను ఆకట్టుకు న్నాడు. ఐపీఎల్కు కావాల్సింది ఇలాంటి ఆట గాళ్లే. టి20ల్లో 155 స్ట్రయిక్ రేట్ ఉండగా... దేశవాళీ వన్డేల్లో కూడా 113 స్ట్రయిక్ రేట్ అంటే అతని దూకుడు ఈ ఒక్క ఇన్నింగ్స్కే పరిమితం కాదని అర్థం చేసుకోవచ్చు. – సాక్షి క్రీడా విభాగం -
ఆఖరి ఓవర్లలో... ఆరేశారు
ఈల... గోల... లేని మ్యాచ్లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. బంతి తీరాన్ని తాకిన అలల్లా పదే పదే బౌండరీ లైన్ను తాకింది. నోరులేకపోయినా... బంతి మాత్రం మైదానం మొత్తం గగ్గోలు పెట్టింది. కింగ్స్ ఓపెనర్లు మయాంక్, రాహుల్ వీరవిహారానికి తెరలేపితే... రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్మన్ స్మిత్, సామ్సన్, రాహుల్ తేవటియా విజృంభణతో తెర వేశారు. 224 పరుగుల లక్ష్యం కూడా సిక్సర్ల జాతరలో చిన్నబోయింది. విజయం అసాధ్యమనుకుంటే ఇంకో 3 బంతులు మిగిలుండగానే రాజస్తాన్కు సుసాధ్యమైంది. షార్జా: బ్యాట్ను బ్యాటే గెలిచింది. విధ్వంసాన్ని విధ్వంసమే జయించింది. కొండంత లక్ష్యం సిక్సర్ల పిడుగులతో కరిగిపోయింది. ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ జట్టులో మిల్లర్, యశస్వి జైస్వాల్ స్థానాల్లో బట్లర్, అంకిత్ రాజ్పుత్లను తుది జట్టులోకి తీసుకుంది. కింగ్స్ ధనాధన్ 100... రాజస్తాన్ బౌలర్ల పాలిట మయాంక్, లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ ‘కింగ్స్’ అయ్యారు. బంతి పడితే... మేం బాదితే... ఇక అంతే! అన్నట్లుగా ఓపెనర్ల విధ్వంసరచన సాగింది. జట్టు స్కోరు 50 పరుగులు చేరేందుకు 27 బంతులే (4.3 ఓవర్లు) అవసరమయ్యాయి. ఇవి వందగా మారేందుకు 53 బంతులే (8.4) సరిపోయాయి. మరో 60 బంతులు (18.5) పడేసరికి ఆ వంద కాస్తా 200 పరుగుల ప్రవాహమైంది. ఈ 20 ఓవర్లలో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌండరీలైను బతికిపోయింది. 16 ఓవర్ల పాటు 31 సార్లు బంతి సిక్స్ లేదంటే ఫోర్గా రేఖ దాటింది. రాయల్స్ చేజింగ్... యమ స్పీడ్గా ఆడిన స్మిత్ ఔటయ్యాడు. స్పీడ్ను కొనసాగించిన సామ్సన్ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. అంటే ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు సాగింది కాట్రెల్ బౌలింగ్... తేవటియా బ్యాటింగ్... 6, 6, 6, 6, 0, 6 లాంగ్లెగ్, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, మిడ్ వికెట్, బంతి గ్యాప్ తర్వాత మళ్లీ మిడ్ వికెట్ల మీదుగా మొత్తం 5 సిక్స్లు. అంతే సమీకరణం మారింది. రాజస్తాన్ రాయల్స్ విజయం ఫటాఫట్గా మారిపోయింది. స్మిత్ మెరుపులతో... ఏ రకంగా చూసినా... 224 పరుగులు అసాధ్యమైన లక్ష్యమే. ఓవర్కు 11 పరుగుల పైగా బాదితేనే రాజస్తాన్ గెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బట్లర్ (4) చేతులెత్తేయగా... స్మిత్, సామ్సన్తో కలిసి మెరుపు షాట్లతో ఆశలు రేపాడు. అతని జోరుతో రాయల్స్ అచ్చూ కింగ్స్లాగే దూకుడుగా సాగిపోయింది. మయాంక్లాగే స్మిత్ 26 బంతుల్లోనే (7ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ చేశాడు. కానీ జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అతని మెరుపులకు నిషమ్ అడ్డుకట్ట వేయడంతో జోరు తగ్గింది. తేవటియా బంతులు వృథా చేశాడు. మరోవైపు సామ్సన్ చెలరేగడం మొదలు పెట్టడంతో మళ్లీ ఆశలు చిగిరించాయి. కానీ ఇతన్ని షమీ ఔట్ చేయడంతో రాజస్తాన్కు లక్ష్యం భారంగా మారి విజయానికి దూరమైంది. ఈ దశలో తేవటియా తన ఆటతో మ్యాచ్తీరే మార్చేశాడు. దాంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ నెగ్గింది. మయాంక్ సూపర్ సెంచరీ అంతకుముందు రాహుల్తో పరుగులు మొదలుపెట్టిన మయాంక్ తానెదుర్కొన్న నాలుగో బంతి (1.3 ఓవర్)తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిడాఫ్లో భారీ సిక్సర్ బాదిన ఈ ఓపెనర్ ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూసుకోనేలేదు. ఏ బౌలర్ వచ్చిన విడిచి పెట్టలేదు. కుదిరితే ఫోర్, బాగా కుదిరితే సిక్సర్ ఇలా అతని బ్యాటింగ్ కొనసాగింది. మరోవైపు కెప్టెన్ రాహుల్ కూడా ధాటిగా ఆడటంతో ఈ మ్యాచ్ లైవ్ మ్యాచ్గా కాకుండా హైలైట్స్ను తలపించింది. 26 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) మయాంక్ ఫిఫ్టీ పూర్తయింది. కొంచెం ఆలస్యమైనా రాహుల్ 35 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ అధిగమించాడు. అరుపులు లేని చోట వీరిద్దరి మెరుపులు వాటిని భర్తీ చేశారు. ప్రేక్షకులెవరూ ఓవర్ బ్రేక్లోనూ చానల్ మార్చే సాహసం చేయలేనంతగా ఈ ఓపెనింగ్ జోడీ ప్రతాపం చూపింది. 45 బంతుల్లోనే (9 ఫోర్లు, 7 సిక్సర్లు) మయాంక్ శతక్కొట్టాడు. ఆ తర్వాతే టామ్ కరన్ అతన్ని ఔట్చేయగలిగాడు. దీంతో 183 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రాహుల్ ఆట ముగియగా... పూరన్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లతో) జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) గోపాల్ (బి) అంకిత్ రాజ్పుత్ 69; మయాంక్ అగర్వాల్ (సి) సంజూ సామ్సన్ (బి) టామ్ కరన్ 106; మ్యాక్స్వెల్ (నాటౌట్) 13; పూరన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–183, 2–194. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 3–0–30–0, అంకిత్ రాజ్పుత్ 4–0–39–1, ఆర్చర్ 4–0–46–0, శ్రేయస్ గోపాల్ 4–0–44–0, రాహుల్ తేవటియా 1–0–19–0, టామ్ కరన్ 4–0–44–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జోస్ బట్లర్ (సి) సర్ఫరాజ్ (బి) కాట్రెల్ 4; స్టీవ్ స్మిత్ (సి) షమీ (బి) నీషమ్ 50; సంజూ సామ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 85; రాహుల్ తేవటియా (సి) మయాంక్ అగర్వాల్ (బి) షమీ 53; ఉతప్ప (సి) పూరన్ (బి) షమీ 9; ఆర్చర్ (నాటౌట్) 13; రియాన్ పరాగ్ (బి) మురుగన్ అశ్విన్ 0; టామ్ కరన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–19, 2–100, 3–161, 4–203, 5–222, 6–222. బౌలింగ్: కాట్రెల్ 3–0–52–1, షమీ 4–0–53–3, రవి బిష్ణోయ్ 4–0–34–0, నీషమ్ 4–0–40–1, మురుగన్ అశ్విన్ 1.3–0–16–1, మ్యాక్స్వెల్ 3–0–29–0. -
రాహుల్ మైండ్బ్లాక్ ఇన్నింగ్స్
పంజాబ్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ మైండ్బ్లాక్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ అత్యధిక స్కోరును ఆవిష్కరించాడు. అతని జోరుకు సిక్స్లు, ఫోర్లు బౌండరీ లైను తాకేందుకు పదేపదే పోటీపడ్డాయి. అతని దెబ్బకు బెంగళూరు బౌలింగ్ విలవిల్లాడింది. తర్వాత కొండంత లక్ష్యఛేదనలో గోరంత స్కోరుకే ఆర్సీబీ టాప్ లేచింది. చివరకు కనీసం రాహుల్ స్కోరుకు చేరువగా కూడా రాలేక చేతులెత్తేసింది. దుబాయ్: తొలి మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో మ్యాచ్లో భారీ విజయంతో సత్తా చాటింది. గురువారం జరిగిన పోరులో పంజాబ్ 97 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (69 బంతుల్లో 132 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ప్రవాహంలా సాగి... ఇన్నింగ్స్లో సగానికి పైగా బంతులు (69) ఎదుర్కొన్న రాహుల్ చివరి వరకు నిలబడి పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్లో ఫైన్ లెగ్లో మొదలైన బౌండరీల ప్రవాహం అదే రీతిలో కొనసాగింది. ఉమేశ్ వేసిన పదో ఓవర్లో రాహుల్ డీప్ ఎక్స్ట్రా కవర్లో సిక్స్, ఫైన్లెగ్లో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో అతని అర్ధసెంచరీ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) పూర్తికాగా, జట్టు 100 పరుగులకు చేరింది. ఇక సిక్సర్లయితే అన్ని ‘తార’తీరం చేరినవే! పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ సరిగ్గా 50 పరుగులు చేసింది. ఓవర్కు సగటున 8 పరుగుల రన్రేట్తో పంజాబ్ దూసుకెళ్లింది. పేసర్లను పక్కనబెట్టిన బెంగళూరు సారథి కోహ్లి బంతిని స్పిన్నర్ చహల్కు అప్పగించగా... చహల్ గూగ్లీకి మయాంక్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) క్లీన్బౌల్డయ్యాడు. 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ దూబే వరుస ఓవర్లలో పూరన్ (17), మ్యాక్స్వెల్ (5)ను అవుట్ చేసినా...ఏ ఒక్కరు రాహుల్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. వెటరన్ పేసర్ స్టెయిన్, సీనియర్ పేసర్లను లెక్క చేయకుండా రాహుల్ విధ్వంసం అజేయంగా సాగింది. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కవర్, డీప్ మిడ్ వికెట్, లాంగాన్, లాంగాఫ్ ఇలా మైదానమంతా అతను విరుచుకుపడ్డాడు. స్టెయిన్ 19వ ఓవర్లో 6, 4, 0, 6, 6, 4లతో ఐదుసార్లు బంతిని ఫీల్డర్లకు అందకుండా బాదేసి 26 పరుగులు పిండుకున్నాడు. దూబే వేసిన ఆఖరి ఓవర్లోనూ రాహుల్ వరుసగా ఫోర్, రెండు సిక్స్లు (4, 6, 6) కొట్టాడు. దీంతో ఆఖరి 9 బంతుల్లోనే అతని విధ్వంసం 42 పరుగుల్ని తెచ్చిపెట్టాయి. 16 బంతులకే... భారీ లక్ష్యం ముందుంటే బెంగళూరు బాధ్యతే మరిచింది. మొదటి 16 బంతులకే పరాజయానికి బాటలు వేసుకుంది. తొలి ఓవర్లో పడిక్కల్ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్ (0), మూడో ఓవర్లో స్టార్ బ్యాట్స్మన్ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్ వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్ అద్భుతమైన డెలివరీకి ఫించ్ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్ కాగా, ఆపై డివిలియర్స్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) వల్లా కాలేదు. ఆ తర్వాత సుందర్ మినహా... అంతా విఫలం కావడంతో బౌలర్లకు 20 ఓవర్లు వేసే శ్రమ తప్పింది. అవతలివైపు రాహు ల్ ఒక్కడే 14 ఫోర్లు కొడితే ఇక్కడ మాత్రం అంతాకలిసి కొట్టిన ఫోర్లు (10), సిక్స్లు (3) కూడా ఆ సంఖ్యను చేరలేకపోయాయి. 1 ఐపీఎల్లో భారత ఆటగాడు నమోదు చేసిన అత్యధిక స్కోరు (132 నాటౌట్) ఇదే. గతంలో రిషభ్ పంత్ (128 నాటౌట్) పేరిట ఈ ఘనత ఉంది. లీగ్లో కెప్టెన్గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రాహుల్ నిలిచాడు. ఇంతకు ముందు వార్నర్ 126 పరుగులు చేశాడు. కోహ్లి మిస్సింగ్స్ మైదానంలో పాదరసంలా కదిలే ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మిస్ ఫీల్డింగ్ విస్మయపరిచింది. ఈ చురుకైన ఫీల్డర్ ... వరుస ఓవర్లలో రాహుల్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్లను నేలపాలు చేశాడు. స్టెయిన్ బౌలింగ్లో 83 పరుగుల వద్ద రాహుల్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన షాట్ను ఓ సారి, సైని బౌలింగ్లో 89 పరుగుల వద్ద లాంగాఫ్లో మరోసారి క్యాచ్ల్ని చేజార్చాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 132; మయాంక్ (బి) చహల్ 26; పూరన్ (సి) డివిలియర్స్ (బి) దూబే 17; మ్యాక్స్వెల్ (సి) ఫించ్ (బి) దూబే 5; కరుణ్ నాయర్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–57, 2–114, 3–128. బౌలింగ్: ఉమేశ్ 3–0–35–0, స్టెయిన్ 4–0–57–0, సైనీ 4–0–37–0, చహల్ 4–0–25–1, సుందర్ 2–0–13–0, దూబే 3–0–33–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (సి) రవి (బి) కాట్రెల్ 1; ఫించ్ (బి) రవి 20; ఫిలిప్ (ఎల్బీ) (బి) షమీ 0; కోహ్లి (సి) రవి (బి) కాట్రెల్ 1; డివిలియర్స్ (సి) సర్ఫరాజ్ (బి) మురుగన్ అశ్విన్ 28; సుందర్ (సి) మయాంక్ (బి) రవి 30; దూబే (బి) మ్యాక్స్వెల్ 12; ఉమేశ్ (బి) రవి 0; సైనీ (బి) మురుగన్ అశ్విన్ 6; స్టెయిన్ (నాటౌట్) 1; చహల్ (ఎల్బీ) (బి) మురుగన్ అశ్విన్ 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1–2, 2–3, 3–4, 4–53, 5–57, 6–83, 7–88, 8–101, 9–106, 10–109. బౌలింగ్: కాట్రెల్ 3–0–17–2, షమీ 3–0–14–1, బిష్ణోయ్ 4–0–32–3, మురుగన్ అశ్విన్ 3–0–21–3, నీషమ్ 2–0–13–0, మ్యాక్స్వెల్ 2–0–10–1. -
‘ఒక్క పరుగు’ విలువెంత...
దుబాయ్: ఐపీఎల్–2020లో రెండో రోజే వివాదానికి తెర లేచింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైరింగ్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్ ప్రకటించిన ‘షార్ట్ రన్’ను నిరసిస్తూ రిఫరీ జవగల్ శ్రీనాథ్కు తాము అధికారికంగా ఫిర్యాదు చేశామని పంజాబ్ జట్టు సీఈఓ సతీశ్ మీనన్ వెల్లడించారు. ఈ పొరపాటు ప్రభావం తమ ప్లే ఆఫ్ అవకాశాలపై కూడా పడవచ్చని కూడా ఇందులో పేర్కొంది. ఏం జరిగింది... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్లో రబడ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని మయాంక్ లాంగాన్ దిశగా ఆడగా ఇద్దరు బ్యాట్స్మెన్ రెండు పరుగులు తీశారు. అయితే తొలి పరుగును జోర్డాన్ సరిగా పూర్తి చేయకుండా, క్రీజ్లో బ్యాట్ ఉంచకుండానే వెనుదిరిగాడంటూ స్క్వేర్ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఒకటే పరుగు ఇచ్చాడు. మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లడంతో ఈ ఒక్క పరుగు విషయంలో వివాదం రాజుకుంది. టీవీ రీప్లే చూడగా అంపైర్దే తప్పని తేలింది. జోర్డాన్ సరైన రీతిలోనే తన బ్యాట్ను పూర్తిగా క్రీజ్లో ఉంచడం స్పష్టంగా కనిపించింది. దాంతో కింగ్స్ ఎలెవన్ తీవ్ర అసహనానికి గురైంది. ఈ పరుగు ఇచ్చి ఉంటే తాము ముందే గెలిచేవారమని పంజాబ్ భావించింది. నిజంగానే నితిన్కు సందేహం ఉంటే థర్డ్ అంపైర్కు నివేదించాల్సిందని ఆ జట్టు అభిప్రాయ పడింది. ‘కరోనా సమయంలో ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్లో ఉండి 5 కరోనా టెస్టులు చేయించుకున్నా. కానీ షార్ట్ రన్ నన్ను తీవ్రంగా బాధించింది. సాంకేతికత అందుబాటులో ఉండి కూడా ఉపయోగించుకోవడంలో అర్థమేముంది. బీసీసీఐ నిబంధనలు మార్చాలి’ అంటూ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి... టీవీ రీప్లే చూడగా జోర్డాన్ పరుగు పూర్తి చేసినట్లు కనిపించింది. దాంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో అంపైర్ సహాయం తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్లంతా వ్యాఖ్యానించారు. అయితే ఐసీసీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు అవుటైన సమయంలో లేదా బౌండరీ గురించి ఏదైనా సందేహం ఉంటే తప్ప ఇతర అంశాల్లో మూడో అంపైర్ను ఫీల్డ్ అంపైర్ సంప్రదించాల్సిన అవసరం లేదు. పైగా ఫీల్డ్ అంపైర్ అడగకుండా థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోరాదు. ఇలా చూస్తే మూడో అంపైర్ ద్వారా షార్ట్ రన్ తేల్చాలన్న మాటే ఉదయించదు. అంపైర్ను తప్పు పట్టవచ్చా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్టొయినిస్కు కాదు అంపైర్ నితిన్ మీనన్కు ఇవ్వాల్సింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్య వ్యాఖ్యతో అంపైర్పై విరుచుకు పడ్డాడు. నితిన్ తన అంపైరింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నానని అనిపించుకునే విధంగా కొంత అత్యుత్సాహం చూపిన మాట వాస్తవమే కానీ... అంపైర్లు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. మానవమాత్రులు కాబట్టి పొరపాట్లు చేయడం సహజం. ఎంత బాగా పని చేసినా వారు చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ కూడా అంపైర్తో వాదించడం కనిపించింది. గత కొన్నేళ్లుగా నితిన్ మీనన్ రికార్డు చాలా బాగుంది. అందుకే 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో కూడా అవకాశం దక్కింది. నిజానికి మీనన్ నిలబడిన కోణం నుంచి చూస్తే అది షార్ట్ రన్గా కనిపించింది. సాధారణంగా స్క్వేర్ లెగ్ అంపైర్లు లైన్ నుంచి నేరుగా నిలబడతారు. కానీ నోబాల్స్ను కూడా థర్డ్ అంపైర్లే చూస్తున్న నేపథ్యంలో టీవీ కెమెరాలకు అడ్డు రాకుండా ప్రసారకర్తలే అంపైర్ను కాస్త పక్కగా నిలబడమని చెప్పినట్లు సమాచారం. చివరగా... మ్యాచ్లో ఫలితం సూపర్ ఓవర్కు వరకు వెళ్లకుండా గెలుపు తేడా ఏ 30 పరుగులో, 5 వికెట్లో ఉంటే ఇంత రచ్చ జరగకపోయేదనేది వాస్తవం. ఈ ఘటనపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా 3 బంతుల్లో 1 పరుగు చేయడం ఎంతో సులభమని, అది చేయకుండా పంజాబ్ అనవసర విమర్శలకు దిగిందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. -
అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజా ఏంటో రుచి చూపించింది. సూపర్ ఓవర్దాకా వెళ్లిన మ్యాచ్లో రబాడా అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్(89) అసాధారణ ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది. (ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ) అయితే పంజాబ్ చేజింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్లో మూడవ బంతిని ఎక్స్ట్రా కవర్వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వాటిలో మొదటి పరుగు షార్ట్ రన్గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్ నిర్ణయంపై పంజాబ్ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్ అయ్యింది. (రైజింగ్కు వేళాయె...) ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్ చేసింది. -
'ఐపీఎల్ నా దూకుడును మరింత పెంచనుంది'
దుబాయ్ : షెల్డాన్ కాట్రెల్... ఈ వెస్టిండీస్ పేసర్ గురించి మాట్లాడితే ముందుగా అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. 2019 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ తరపున 12 వికెట్లు పడగొట్టిన కాట్రెల్ .. ఆ జట్టులోనే ఉన్న కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, ఓషోన్ థామస్లను మించి యువ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.ముఖ్యంగా భారత్లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కాట్రెల్ టీమిండియా ఆటగాడి వికెట్ తీసిన ప్రతీసారి సెల్యూట్ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు. అందుకేనేమో గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసి కాట్రెల్కు ఘనంగా సెల్యూట్ చేసింది. సాధారణంగానే విండీస్ బౌలర్లు ఏ చిన్న ఆనందాన్నైనా తమ హావభావాలతో అభిమానులను కొల్లగొడుతుంటారు. డ్వేన్ బ్రోవో, డారెన్ సామి ఈ కోవకు చెందినవారే. గతంలో ఐపీఎల్లో వీరు చేసిన హంగామా మూములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు కాట్రెల్ వంతు వచ్చింది.. ఇప్పటివరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్కు మాత్రమే ఆడిన కాట్రెల్ కింగ్స్ తరపున ఐపీఎల్లో ఎంత ఎంజాయ్మెంట్ ఇవ్వనున్నాడో చూడాలి. తాజాగా నిర్వహించిన ఇంటర్య్వూలో 31 ఏళ్ల షెల్డన్ కాట్రెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') ఇదే మీకు మొదటి ఐపీఎల్.. మరి దీన్ని ఎలా ఆస్వాధిస్తారు ? ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న.. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్తో కలిసి బౌలింగ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కరీబియన్ లీగ్కు.. ఐపీఎల్కు చాలా తేడా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. మనమేంటనేది నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. అని తెలిపాడు. కింగ్స్ జట్టులోనే ఉన్న గేల్, నికోలస్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది.. వారి నుంచి ఏమైనా సలహాలు పొందారా? నా సహచరులైన క్రిస్ గేల్, నికోలస్ పూరన్లు కింగ్స్లో ఉండడం కొంచెం ధైర్యమే అని చెప్పొచ్చు. అయితే గేల్తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదుగానీ.. అతను చాలా కూల్గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నికోలస్ పూరన్తో మాత్రం పలు క్రికెట్ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకుంటాం. ఈసారి ఐపీఎల్లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం మీకు కలిసి వస్తుందనుకుంటున్నారా? ఆ విషయం గురించి నేను చెప్పలేను.. ఎందుకంటే క్రికెట్లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో వివిధ రకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్ మాన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్మెన్కు నా బౌలింగ్ ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నా. టీ20లో విజయవంతమైన బౌలర్గా పేరున్న క్రిస్ జోర్డాన్ వల్ల మీకు అవకాశాలు వస్తాయనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. క్రిస్ జోర్డాన్ అద్భుతమైన బౌలర్.. అలాగే మహ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు.ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా. ఐపీఎల్లో మీ సెల్యూట్స్ చూసే అవకాశం ఉంటుందా? నేను ఫేమస్ అయ్యందే సెల్యూట్ ద్వారా.. ఈ ఐపీఎల్లో కూడా నా సెల్యూట్స్ ఉంటాయి. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే సెల్యూట్ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని వదులుకోనూ. అంతేగాక క్రికెట్ అంటే సీరియస్నెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు తప్పనిసరిగా నా సెల్యూట్ చూసే అవకాశం ఉంటుంది. -
'చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా'
దుబాయ్ : టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ తన గారాల పట్టి ఐరాను చాలా మిస్సవుతన్నా అంటూ ఎమోషనల్గా పేర్కొన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు ప్రస్తుతం షమీ దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే. మహ్మద్ షమీ ప్రస్తుతం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం ప్రాక్టీస్ అనంతరం పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో షమీ తన కూతురు ఐరాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : వచ్చీ రాగానే.. 'క్లీన్ బౌల్ట్') షమీ మాట్లాడుతూ.. ' చిట్టితల్లి చాలా మిస్సవుతున్నా.. లాక్డౌన్ సమయం నుంచే నా కూతురును ఒక్కసారి కూడా చూడలేకపోయా.. నా కళ్ల ముందే ఎదుగుతున్న ఐరాను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్కు రావడంతో మరో రెండునెలల పాటు ఐరాను చూసే అవకాశం లేదు. నా భార్య హసీన్ జహాన్ కూతురుతో వేరుగా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఎక్కువగా ఇంట్లోనే గడిపాను.. రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీలైనప్పుడల్లా ఐరాతో ఫోన్లో మాట్లాడేవాడిని. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే నాలుగు నెలల విరామం తర్వాత గ్రౌండ్లోకి అడుగుపెట్టి ప్రాక్టీస్ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది.జట్టులో ఇప్పుడిప్పుడే ఆటగాళ్లంతా మ్యాచ్లు ఆడేందుకు ప్రాక్టీస్లో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ఇంట్లోనేమూడు గంటలపాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి ఐపీఎల్లో మా జట్టు కచ్చితంగా కప్ కొడుతుంది. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. తమ చప్పట్లతో మమ్మల్ని ఎంకరేజ్ చేసే అభిమానుల్ని మిస్ అవుతున్నాం. కానీ ఈసారి టీవీల ద్వారా వీక్షించే అభిమానులకు మా ఆటతో ఉత్సాహపరుస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ‘ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’) ఇక ఐపీఎల్ కెరీర్లో 51 మ్యాచ్లాడి 40 వికెట్లు తీశాడు. కాగా షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది. -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై నమ్మకం ఉంది
దుబాయ్ : ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్కు కెప్టెన్గా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను సమర్థంగా నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2019లో పంజాబ్ జట్టును నడిపించిన రవిచంద్రన్ అశ్విన్ గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో కింగ్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. సెస్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్కు ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ తన ప్రాక్టీస్ను కూడా ఆరంభించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తనకు అపారమైన నమ్మకముందని..టీమిండియాకు ఆడిన అనుభవం అతన్ని కెప్టెన్ అయ్యేలా చేసిందని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. కుంబ్లే వీడియోను కింగ్స్ పంజాబ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'కేఎల్ రాహుల్ ప్రశాంతంగా ఉంటాడు.. ఆటలో ఎంతో నేర్పును ప్రదర్శిస్తాడు. చాలా రోజుల నుంచే రాహుల్ అతి దగ్గరినుంచి గమనిస్తూ వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు కొన్ని సంవత్సరాలుగా అతను కింగ్స్ జట్టుతో పాటే కొనసాగుతున్నాడు. కెప్టెన్గా అతనికి ఇది ఎంతో లాభదాయకం. కింగ్స్ జట్టుకు సంబంధించి బలాలు, బలహీనతలు రాహుల్కు ఈ పాటికే అర్థమయిఉంటాయి. అందుకే కెప్టెన్గా, బ్యాట్స్మన్గా, వికెట్ కీపర్గా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. ఈసారి లీగ్ దుబాయ్లో జరుగుతుండడం కొంత ఇబ్బందే అయినా.. జట్టుగా మాత్రం బ్యాలెన్సింగ్తో ఉంది. సీనియర్లు, జూనియర్లతో కలిసి జట్టు సమతూకంగా ఉంది. ఈసారి మా జట్టుపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఒక కోచ్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాననే నమ్మకం నాకు ఉంది.' అంటూ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా కుంబ్లే గతేడాది అక్టోబర్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ప్రధాన కోచ్గా ఎంపిక అయ్యాడు. చదవండి : మంజ్రేకర్కు బీసీసీఐ షాక్ చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా -
కుంబ్లేతో మా పని సులువవుతుంది
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్గా భారత దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటం తమ అదృష్టమని కెప్టెన్ లోకేశ్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఆయన వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయగలిగితే చాలని అతను అన్నాడు. ‘ఈ సీజన్లో అనిల్ భాయ్ మాతో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఒకే నగరం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి మైదానంలోనూ, మైదానం బయటా ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనిల్ భాయ్ కోచ్గా ఉండటం వల్ల కెప్టెన్గా నా పని సులువవుతుంది. జట్టు ప్రణాళికలు ఆయనే రూపొందిస్తారు. వాటిని అమలు చేయడమే మా బాధ్యత’ అని రాహుల్ వివరించాడు. వారిద్దరు చెలరేగితే... పంజాబ్ జట్టులో గేల్, మ్యాక్స్వెల్ రూపంలో ఇద్దరు విధ్వంసక బ్యాట్స్మెన్ ఉన్నారు. గత రెండు ఐపీఎల్లలో రాహుల్ కూడా అద్భుతంగా రాణించాడు. వీరందరి కాంబినేషన్తో కింగ్స్ ఎలెవన్ చెలరేగగలదని కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మ్యాక్స్వెల్ గతంలోనూ పంజాబ్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అందుకే వేలంలో కూడా అతను కావాలని గట్టిగా కోరుకున్నాం. తనదైన రోజున అతను ఏ బౌలింగ్నైనా తుత్తునియలు చేయగలడు. గత రెండు సీజన్లలో మా జట్టు మిడిలార్డర్లో అలాంటి బ్యాట్స్మన్ లేని లోటు కనిపించింది. గేల్తో కూడా చాలా ఏళ్లు కలిసి ఆడాను. మా జట్టులో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. అతను మా ప్రధాన బృందంలో కీలక భాగం. అతని అనుభవంతో మా కోసం మ్యాచ్లు గెలిపించగలడు. ఈ ఐపీఎల్ సీజన్ ఎన్నో విధాలా ప్రత్యేకమైంది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ విశ్లేషించాడు. -
యూఏఈలో అడుగు పడింది
దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు మూడు ఫ్రాంచైజీ జట్లు యూఏఈ చేరుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గురువారం చార్టెడ్ ఫ్లయిట్లలో దుబాయ్ చేరుకోగా... కోల్కతా నైట్రైడర్స్ అబుదాబీలో అడుగుపెట్టింది. యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్కి బయల్దేరతాయి. ఇక మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది. ఐపీఎల్–13 పోటీలు వచ్చే నెల 19 నుంచి జరగనున్నాయి. మొత్తం 60 మ్యాచ్లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు. హర్భజన్ ఆలస్యంగా... ఐపీఎల్ మూడు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పయనానికి సిద్ధమైంది. శుక్రవారం యూఏఈకి బయల్దేరనుంది. అయితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం జట్టు సభ్యులతో పాటే అక్కడికి వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వెళ్తాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ రెండో వారాల్లో జట్టుతో కలుస్తాడని సీఎస్కే అధికారి ఒకరు చెప్పారు. నిజానికి భజ్జీ సీఎస్కే శిబిరంలోనూ పాల్గొనలేదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ శార్దుల్ ఠాకూర్లు కూడా శిబిరంలో పాల్గొనలేకపోయినా జట్టుతో కలిసారు. ఆటగాళ్లందరికీ మంగళవారం రెండో దశ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలే వచ్చాయని సీఎస్కే అధికారులు తెలిపారు. బుడగలో ఉన్నవారికి క్వారంటైన్ ఎందుకు? ఐపీఎల్లో ఆడే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యూఏఈలో క్వారంటైన్ కావాల్సిన అవసరం లేదని రాయల్ చాలెంజర్ బెంగళూరు చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లు జీవ రక్షణ వలయంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లు ఆడతారని... బుడగలో ఉన్న క్రికెటర్లకు మళ్లీ క్వారంటైన్ అవసరం ఏముంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ జట్టులో ఆసీస్ స్టార్ అరోన్ ఫించ్, ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మొయిన్ అలీ ప్రధాన ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో వాళ్లను వచ్చి రాగానే మ్యాచ్ల్లో ఆడించాలని ఆలోచనలో ఆర్సీబీ ఉంది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే అయ్యింది. అయితే టైటిల్ లేని లోటు జట్టును వేధిస్తుందని సహజంగానే ఈ ఒత్తిడి తమ ఆటగాళ్లపై ఉంటుందని సంజీవ్ అన్నారు. తనతో పాటు టెడ్డీకి మాస్క్ పెట్టి రియాన్ పరాగ్ -
క్రికెటర్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి
న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్లో లీగ్ను నిర్వహించాలని భారత బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ‘ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు. కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలు’ అని నెస్ వాడియా వివరించారు. టీవీలో సూపర్ హిట్టవుతుంది... కరోనా కష్టకాలంలో ఐపీఎల్కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అన్నారు. ‘గతంలో ఏ ఐపీఎల్కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం’ అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
హిందీ మాస్టర్గా మారిన షమీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్న మహ్మద్ షమీ, నికోలస్ పూరన్ ఉన్న ఒక ఫన్నీ వీడియోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ, నికోలస్ పూరన్కు హిందీ నేర్పిస్తున్నాడు. ఇందులో మహమ్మద్ షమీ ‘ఆప్ కహాన్ జా రహే హో’(మీరు ఎక్కడికి వెళుతున్నారు) అనే పదాన్ని చెబితే, దాన్ని నికోలస్ తిరిగి చెపుతున్నాడు. చాలా సేపటి తరువాత నికోలస్ దాన్ని సరిగ్గా ఉచ్చరించాడు. ఈ ట్వీట్ శీర్షికలో "హిందీ పాఠాలకు అడుగులు. నిక్కీ ప్రా!" అని రాశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు లైక్ కొడుతూ, షేర్ చేస్తున్నారు. చదవండి: సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్కప్లో నికోలస్ పూరన్ను 2018 ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ .4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో నికోలస్ పూరన్ ఫ్రాంచైజ్ కోసం 7 ఆటలను ఆడి, 28.00 సగటుతో మరియు 157.00 స్ట్రైక్ రేట్తో 168 పరుగులు చేయగలిగాడు. మహమ్మద్ షమీని కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018 లో రూ .4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో మహమ్మద్ షమీ 14 మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. చదవండి: ‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’ Hindi lessons ft. Nicky Praa! 🤓 #SaddaPunjab @nicholas_47 @MdShami11 pic.twitter.com/UHzNLgSF2T — Kings XI Punjab (@lionsdenkxip) July 15, 2020 -
ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఉండాల్సిందే: నెస్ వాడియా
న్యూఢిల్లీ: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించడంలో అర్థమే లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో బీసీసీఐ... లీగ్ నిర్వహణపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు. ‘ప్రపంచంలో ఐపీఎల్ ఉన్నతమైన క్రికెట్ ఈవెంట్. దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇందులో కచ్చితంగా అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఆడాలి. కానీ ప్రయాణ ఆంక్షల కారణంగా టోర్నీ జరిగే నాటికి ఎంతమంది విదేశీ ఆటగాళ్లు భారత్కు రాగలరనేది చూడాలి. ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి టోర్నీ ఎప్పుడు జరుగుతుందో చెప్పడం బీసీసీఐకి కూడా కష్టమే’ అని వాడియా పేర్కొన్నాడు. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై ఫ్రాంచైజీలన్నీ భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నాయి. ఈ ఏడాది కేవలం భారత ఆటగాళ్లతో లీగ్ను నిర్వహించాలని రాజస్తాన్ రాయల్స్ పేర్కొనగా... చెన్నై సూపర్ కింగ్స్ ఈ ప్రతిపాదనను ఖండించింది. -
పంజాబ్ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు
హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఇప్పుడు హాట్టాపిక్గా మారాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా పెర్త్ స్కాచర్స్ తరుపున ఆడుతున్న ఈ పేసర్ ఓ స్టన్నింగ్ క్యాచ్తో అందరినీ షాక్కు గురిచేశాడు. బీబీఎల్లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు ఆల్రౌండర్ క్రిస్టియాన్ లాంగాన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్కు గురైన క్రిస్టియాన్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్కు జోర్డాన్ రూపంలో బౌలర్తో పాటు మంచి ఫీల్డర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘పంజాబ్ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మెల్బోర్న్ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్ ఈసారి పంజాబ్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని నయా పంజాబ్ జట్టు వచ్చే సీజన్లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq — ICC (@ICC) December 21, 2019 -
అశ్విన్కు బదులుగా సుచిత్, రూ.1.5 కోట్లు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను కెప్టెన్గా నడిపించిన రవిచంద్రన్ అశ్విన్... తదుపరి సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ‘ఐపీఎల్ ట్రాన్స్ఫర్ విండో’ పద్ధతి ప్రకారం ఇరు జట్ల మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అశ్విన్ను వదులుకున్నందుకు పంజాబ్ జట్టుకు ఢిల్లీ యాజమాన్యం రూ. 1.5 కోట్ల నగదుతో పాటు స్పిన్నర్ జగదీశ సుచిత్ను బదిలీ చేయనుంది. తమతో చేరిన అశ్విన్కు రూ. 7.6 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీ సహయజమాని నెస్ వాడియా వెల్లడించారు. నిజానికి సుచిత్తో పాటు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్నూ పంజాబ్ కోరినప్పటికీ చివరకు అది సాధ్యం కాలేదు. -
డీల్ కుదిరింది.. రేపో మాపో ప్రకటన?
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 కోసం ప్రాంచైజీలు, ఆటగాళ్లు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. కోచ్, ఆటగాళ్ల మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దికోవాలని ఆటగాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంచైజీలు తమను పక్కకు పెట్టక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్. గత సీజన్లో అశ్విన్ సారథ్యంలో పంజాబ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఆటగాడిగా కూడా అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేయలేదు. దీంతో అశ్విన్తో పనేంటి అని పంజాబ్ భావిస్తున్నట్లు, అంతేకాకుండా అతడిని జట్టు నుంచి సాగనంపేందుకే రంగం సిద్దమైనట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అశ్విన్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒప్పందం జరిగిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని విశ్వసనీయ సమాచారం. అనుభవలేమితో గత సీజన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అశ్విన్తో ఆ లోటను భర్తీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అశ్విన్కు భారీ మొత్తంలో ఆఫర్ చేసి అతడితో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అయితే అశ్విన్ను సారథిగా కాకుండా కేవలం అనుభవజ్ఞుడైన ఆటగాడినే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కింగ్స్ పంజాబ్ కూడా అశ్విన్ను పరిగణలోకి తీసుకోకుండా జట్టు కూర్పుపై అధ్యయనం చేస్తోందని సమాచారం. కేఎల్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం అనుకుంటోందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కింగ్స్ పంజాబ్తో అశ్విన్ ప్రయాణం దాదాపుగా ముగిసినట్టేనని తెలుస్తోంది. అనిల్ కుంబ్లే పంజాబ్ హెడ్ కోచ్గా నియామకం అయ్యాక అశ్విన్ భవిత్యంపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే అశ్విన్పై కుంబ్లే సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రాంచైజీ మాత్రం ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. దీంతో కుంబ్లే కూడా పంజాబ్ తరుపున అశ్విన్ ఆడతాడా లేడనేదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు. దీంతో అశ్విన్ తనదారి తను చూసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు చెన్నై సూపర్కింగ్స్, రైజింగ్ పుణే, కింగ్స్ పంజాబ్ జట్ల తరుపున ఆడిన అశ్విన్ అన్ని కుదిరితే వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది. -
కింగ్స్ ఎలెవన్ కోచ్గా కుంబ్లే
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహరించనున్నాడు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని నియమించారు. విండీస్ దిగ్గజ మాజీ బౌలర్ కొట్నీ వాల్‡్షకు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురే కాకుండా ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మేటి జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్గా జార్జి బెయిలీ (ఆ్రస్టేలియా)లను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైంది. 2016, 2017లలో భారత జట్టు కోచ్గా వ్యవహరించిన 48 ఏళ్ల కుంబ్లే వచ్చే ఐపీఎల్లో ఏకైక స్వదేశీ హెడ్ కోచ్గా ఉండబోతున్నాడు. మిగతా ఫ్రాంచైజీ జట్లకు విదేశీ క్రికెటర్లే కోచ్లుగా ఉన్నారు. -
అనిల్ కుంబ్లే మళ్లీ కోచ్ అవతారం
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మళ్లీ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్గా నియమించినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్కు కింగ్స్ పంజాబ్కు ప్రధాన కోచ్గా కుంబ్లే వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటివరకు కోచ్గా ఉన్న మైక్ హెసన్ కాంట్రాక్ట్ ముగిసింది. అయితే అతని కోచింగ్లో జట్టు విజయాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో అతడికి ఉద్వాసన పలికింది. అయితే ఇప్పటివరకు కేవలం ప్రధాన కోచ్ను మాత్రమే ఎంపిక చేశామని ఇతర సహాయక సిబ్బంది గురించి ఆలోచించలేదని తెలిపింది. త్వరలో కుంబ్లేతో సమావేశమయ్యాక అతడి సూచనలతో ఇతర సహాయక సిబ్బందిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రస్తుత సారథి రవిచంద్రన్ అశ్విన్ను కూడా సాగనంపాలనే ఉద్దేశంలో కింగ్స్ పంజాబ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్ భవిత్యం ఉండబోతోంది. గత కొన్ని రోజులుగా కుంబ్లే ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్కు హెడ్ కోచ్గా వ్యవహరించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత సారథి రవిచంద్రన్ అశ్విన్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 2016-2017లో టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కోచ్గా విజయవంతమైనా.. సారథితో పాటు ఆటగాళ్లతో పొసగకపోవడంతో కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్గా కుంబ్లే వ్యవహరించాడు. ఇప్పుడు ఐపీఎల్లో తొలి సారిగా కోచ్ అవతారం ఎత్తుతున్న కుంబ్లే కింగ్స్ పంజాబ్ రాత మారుస్తాడో లేదో చూడాలి. -
పంజాబ్ ఆఖరి గెలుపు
మొహాలి: ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయిన తర్వాత పంజాబ్ ఆట గెలుపుతో ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55 బంతుల్లో 96; 10 ఫోర్లు, 4 సిక్స్లు) శతకానికి 4 పరుగులతో దూరమయ్యాడు. స్యామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. మెరుపులు మెరిపించిన లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్భజన్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. డు ప్లెసిస్ జోరు చెన్నై ఇన్నింగ్స్ను ఆరంభించిన ఓపెనర్లలో వాట్సన్ (7) విఫలమయ్యాడు. కానీ డు ప్లెసిస్ వేగం, నిలకడ కలగలిపిన ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కితే బౌండరీ లేదంటే ఒకట్రెండు పరుగులతో జట్టును నడిపించాడు. ఇతనికి జతయిన రైనా దూకుడు కనబరచడంతో చెన్నై స్కోరు పరుగెత్తింది. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. వీళ్లిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆడారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ 37 బంతుల్లో, రైనా 34 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ వేగం పెంచింది. మురుగన్ అశ్విన్ 15వ ఓవర్లో రైనా ఒక ఫోర్ కొడితే డుప్లెసిస్ 4, 6 బాదాడు. టై 16వ ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్తో 18 పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద కరన్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు)ను ఔట్ చేయడంతో 120 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్లో సిక్స్తో సెంచరీకి చేరువైన డు ప్లెసిస్ను కరనే ఔట్ చేశాడు. ధోని (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. పంజాబ్ 57/0...రాహుల్ 52 పంజాబ్ లక్ష్యఛేదనను రాహుల్ సిక్స్తో, క్రిస్ గేల్ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫోర్తో ఆరంభించారు. ముఖ్యంగా రాహుల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. అతడు తొలి 8 బంతుల్లో చేసిన 18 పరుగులు సిక్స్ల రూపంలోనే వచ్చాయి. హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో ఐదు సార్లు బంతి బౌండరీ లైనును దాటింది. రాహుల్ వరుసగా 4, 4, 4, 6, 0, 6లతో ఏకంగా 24 పరుగులు సాధించాడు. అంతే 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరగా... 19 బంతుల్లోనే రాహుల్ అర్ధశతకం పూర్తయింది. ఇమ్రాన్ తాహిర్ ఏడో ఓవర్ను గేల్ ఆడుకున్నాడు. 4, 6, 6తో 17 పరుగులు చేశాడు. అడ్డుఅదుపులేని బౌండరీలతో జట్టు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఇక మిగిలింది 11 ఓవర్లలో 71 పరుగులే. అయితే 11వ ఓవర్ వేసిన హర్భజన్ వీళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 108 స్కోరు వద్ద 2 వికెట్లను కోల్పోయింది. భజ్జీ మరుసటి ఓవర్లో మయాంక్ అగర్వాల్ (7) ఆటను ముగించాడు. కానీ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపుల బాధ్యతను తీసుకోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. 164 పరుగుల వద్ద అతను ఔటైనా... మిగతా లాంఛనాన్ని మన్దీప్ సింగ్ (11 నాటౌట్), స్యామ్ కరన్ (6 నాటౌట్) పూర్తి చేశారు. -
బాల్ మాయం.. ఆటగాళ్ల అయోమయం!
బెంగళూరు : మ్యాచ్ మధ్యలో బాల్ మాయమైంది. చుట్టూ కెమెరాలు.. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు.. వేలకొద్ది అభిమానులు.. అంత మంది ఉండి కూడా బాల్ ఎక్కడికిపోతుంది? అంటారా? అవును బాల్ కొద్దిసేపు కనబడకుండా పోయి ఆటగాళ్లను, అంపైర్లను అయోమయానికి గురిచేసింది. పోని బ్యాట్స్మెన్ బంతిని గ్రౌండ్ అవతలికి కొట్టాడా? అంటే అది లేదు. స్ట్రాటజిక్ టైమ్ఔట్ ముందు వరకు ఉన్న బంతి.. అనంతరం కనిపించకుండా పోయింది. బౌలింగ్ వేయడానికి బౌలర్ సిద్దంగా ఉన్నాడు.. క్రీజులో బ్యాట్స్మన్ రెడీ అయ్యాడు. కానీ బంతి లేదు. ఏమైంది..? బంతి ఎక్కడా? అవును ఎక్కడా అందరూ ఇదే.! క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ.. కనివిని ఎరుగని ఈ వింత హాస్యాస్పదక ఘటన కింగ్స్పంజాబ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చోటు చేసుకుంది. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లిసేన 17 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న బాల్ మిస్సింగ్ ఎపిసోడ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ బంతి ఏమైందో తెలుసా! ఇక ఆటగాళ్లు, అభిమానులను టెన్షన్ పెట్టిన ఆ బంతి ఎక్కడికిపోయిందో చెబితే నవ్వకుండా ఉండలేరు. ‘ఓరి నీ మతిమరుపో’ అని అనకుండా ఉండలేరు. అవును బంతి ఎక్కడికి పోయిందా..? అని టీవీ కెమెరాల సాయంతో ప్రయత్నించగా.. అది అంపైర్ జేబులోనే ఉందని తెలిసింది. దీంతో కామెంటేటర్స్తో సహా మైదానంలో ఆటగాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అనంతరం అంపైర్ ఆక్సెన్ఫోర్డ్ స్ట్రాటజిక్ టైమ్ఔట్ అంటూ సిగ్నల్ ఇస్తూ బంతిని లెగ్ అంపైర్ శామ్సుద్దిన్కు ఇచ్చాడు. అతను ఆ బంతిని తన జేబులో వేసుకున్నాడు. విరామం అనంతరం 14వ ఓవర్ బౌలింగ్ చేయడానికి అంకిత్ రాజ్పూత్ సిద్దం కాగా.. బంతి కనిపించకుండా పోయింది. జేబులో ఉన్న బంతిని అంపైర్ శామ్సుద్దిన్ మరిచిపోయాడు. దీంతో బంతి ఎక్కడా అంటే ఎక్కడా? నీకిచ్చినా నీకిచ్చినా అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో మ్యాచ్ 2 నిమిషాలు ఆగిపోయింది. మరోవైపు ఈ వ్యవహారంతో అంపైర్లపై కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంటేటర్సేమో.. హే బంతిని ఎవరైన తిన్నారా? అని చలోక్తులు విసిరారు. ఇక ఈ వ్యవహారం తేలట్టులేదని గ్రహించిన టీవీ అంపైర్ కెమెరాల సాయంతో బంతిని ట్రేస్ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
పంజాబ్పై కోహ్లి జట్టు గెలుపు
-
డాన్స్ ఇరగదీసిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్
-
అశ్విన్ అదరగొట్టాడు చూడండి
మొహాలి: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ డాన్స్ ఇరగతీశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో పంజాబ్ ఆటగాళ్లు మైదానంలో నటుడు సోనూ సూద్తో కలిసి సందడి చేశారు. డ్రమ్స్ వాయిస్తూ డాన్స్లు చేశారు. వీరితో పాటు అశ్విన్ కూడా పాదం కలిపాడు. ఈ వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఆటతోనే కాదు డాన్స్తోనూ అభిమానులను అశ్విన్ అలరిస్తున్నాడు. (చదవండి: పంజాబ్ ప్రతాపం) View this post on Instagram Bhangra ta sajda jado nachche sadda skipper!🕺 . . . #SaddaPunjab #KXIPvRR #VIVOIPL @rashwin99 A post shared by Kings XI Punjab (@kxipofficial) on Apr 16, 2019 at 12:18pm PDT -
రాజస్తాన్ రాయల్స్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపు
-
డ్యాన్సింగ్ అంకుల్ను మించిపోయాడుగా!
ముంబై : ఉత్కంఠకర సమయంలో మమ్మల్ని ఉల్లాసరపరిచాడంటూ కింగ్స్ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతీ జింటా చేసిన ఓ ట్విట్ తెగహల్చల్ చేస్తోంది. ‘ ముంబైతో మ్యాచ్ ఉత్కంఠకరంగా సాగుతున్నసమయంలో ఓ అభిమాని వన్మ్యాన్ ఆర్మీలా మా అందరిని ఎంటర్టైన్ చేశాడు’ అని క్యాఫ్షన్గా ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో ఓ మధ్యవయసు గల వ్యక్తి చిందేస్తూ మ్యాచ్ను అస్వాదించాడు. అయితే ఆ వ్యక్తి డ్యాన్స్ చూస్తే మాత్రం ఎవ్వరికి నవ్వాగదు. అంతలా అదరగొట్టాడు. అయితే ఆ అంకుల్ డ్యాన్స్కు ముగ్ధులైన నెటిజన్లు ఫన్నీ క్యాప్షన్తో కామెంట్ చేస్తున్నారు. డ్యాన్సింగ్ అంకుల్ మించిపోయాడుగా! అని ఒకరంటే.. అంకుల్ సూపర్ అంటూ మరొకరు కితాబిచ్చారు. బుధవారం ముంబై-కింగ్స్పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ పంజాబ్ అభిమాని చిందేస్తూ ఇలా మ్యాచ్ను అస్వాదించాడు. కానీ పోలార్డ్ దెబ్బకు చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ముంబై వశమైంది. आजा नच ले 👏 This #funnyfriday is devoted to this fan & one man army who entertained us in Mumbai during a very tense and thrilling game. #ting #vivoipl2019 #MIvsKXIP @lionsdenkxip pic.twitter.com/QSghgZT4cs — Preity G Zinta (@realpreityzinta) April 12, 2019 -
నా భార్యకు అంకితం
ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై వీర విజృంభణతో ముంబై గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించిన తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్... తమ గెలుపును భార్యకు అంకితమిస్తున్నానని చెప్పాడు. బుధవారం పొలార్డ్ భార్య జెనా అలీ పుట్టిన రోజు కావడం విశేషం. రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్కు సారథ్యం వహించిన పొలార్డ్ క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును విజయం వైపు నడిపించాడు. జట్టు గెలుపు అనంతరం అతని కుమారుడు కైడెన్ పొలార్డ్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తనకు బలంగా బాదగలిగే శక్తి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేను భగవంతునితో పాటు నా భార్యకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నా. ఆమె పుట్టిన రోజు నాడే నేను కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాను. చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. వాంఖెడేలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతానన్న పొలార్డ్ ఎక్కువ బంతులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లానని తెలిపాడు. ‘మేం బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలర్ల సహకరించకపోవడం మాకు మేలు చేసింది. దీంతో మా పని సులువైంది. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది’ అని పొలార్డ్ వివరించాడు. తదుపరి గేమ్కు తమ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. -
ముంబైని గెలిపించిన పొలార్డ్
భారీ స్కోర్ల మ్యాచ్లో బ్యాట్లు శివాలెత్తాయి. బౌలర్లు విలవిల్లాడారు. ప్రేక్షకులేమో పరుగుల విలయానికి కళ్లప్పగించారు. మొదట గేల్ చితగ్గొడితే, రాహుల్ శతక్కొట్టాడు. పంజాబ్కు భారీస్కోరు అందించారు. తర్వాత ముంబైని కెప్టెన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్తో విజయం దిశగా నడిపించాడు. చివర్లో ఉత్కంఠ రేకెత్తినా... ముంబై లక్ష్యాన్ని పూర్తిచేసింది. ముంబై: ప్రత్యర్థి జట్టులో ఇద్దరి మెరుపులపై ఒకే ఒక్కడి (పొలార్డ్) విధ్వంసం పైచేయి సాధించింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 100; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిస్ గేల్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసి గెలిచింది. పొలార్డ్ (31 బంతుల్లో 83; 3 ఫోర్లు, 10 సిక్స్లు) రాణించాడు. షమీకి 3 వికెట్లు దక్కాయి. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో సిద్ధేశ్ లాడ్ తుది జట్టులోకి రాగా, పంజాబ్ కూడా ఒక మార్పు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో కరుణ్ నాయర్కు అవకాశమిచ్చింది. నాయర్కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. గేల్ సుడిగాలి ఫిఫ్టీ పంజాబ్ ఆట నెమ్మదిగా మొదలైంది. ఓపెనర్లు గేల్, రాహుల్ బ్యాట్ ఝళిపించేందుకు 4 ఓవర్ల సమయం పట్టింది. బెహ్రెన్డార్ఫ్ తొలి ఓవర్లో ఒకటే పరుగొచ్చింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో 3, బెహ్రెన్డార్ఫ్ మరుసటి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్లో అల్లాడించిన అల్జారి జోసెఫ్ బౌలింగ్కు దిగాడు. 4 బంతులు బాగానే వేసినా ఐదో బంతిని రాహుల్ సిక్సర్గా మలచడంతో అత్యధికంగా 9 పరుగులు రాగా... నాలుగు ఓవర్లలో పంజాబ్ మొత్తం 20 పరుగులు చేసింది. ఇక ఐదో ఓవరైతే గేల్ శివతాండవంతో నాలుగుసార్లు బంతి బౌండరీని దాటింది. బెహ్రెన్డార్ఫ్ బౌలింగ్లో మొదట రాహుల్ ఓ పరుగుతీశాడు. తర్వాత గేల్ 6, 6, 0, 4, 6తో ఏకంగా 23 పరుగులొచ్చాయి. జట్టు స్కోరు ఆరుబంతుల వ్యవధిలోనే 43/0కు చేరుకుంది. అల్జారి బౌలింగ్నూ రాహుల్ తేలిగ్గా ఎదుర్కొన్నాడు. 6, 4తో జోరుపెంచాడు. ఓపెనింగ్ ఊపుమీదున్న ఈ దశలో లెగ్స్పిన్నర్ రాహుల్ చహర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సుడి‘గేల్’ 6, 4, 4 తాకిడితో పరుగుల హోరు పెరిగింది. తొలి సగం (10) ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోని కింగ్స్ 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో భారీ సిక్సర్తో గేల్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తయ్యింది. జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే రాహుల్ కూడా 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌండరీలకు తెగబడుతున్న గేల్ విధ్వంసానికి బెహ్రెన్డార్ఫ్ చెక్ పెట్టడంతో 116 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ తొలి శతకం గేల్ నిష్క్రమణ తర్వాత పంజాబ్ స్కోరు వేగం తగ్గింది. స్వల్ప వ్యవధిలో మిల్లర్ (7), కరుణ్ నాయర్ (5)లను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 14 నుంచి 17వరకు నాలుగు ఓవర్లలో పంజాబ్ కేవలం 26 పరుగులే చేసింది. మళ్లీ 18వ ఓవర్ నుంచి పంజాబ్ మెరుపులు మొదలయ్యాయి. బుమ్రా వేసిన ఈ ఓవర్లో కరన్ రెండు వరుస ఫోర్లు కొట్టి ఔట్కాగా... రాహుల్ మరో ఔండరీ బాదాడు. 16 పరుగులు లభించడంతో జట్టు స్కోరు 150 దాటింది. ఇక మిగిలింది రెండే ఓవర్లు. రాహుల్ 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ ఆశలైతే లేవు. కానీ హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో రాహుల్ ఒక్కసారిగా చెలరేగాడు. 6, 4, 6, 6, సింగిల్తో 23 పరుగులు పిండుకున్నాడు. 92 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్ తొలి బంతికే రాహుల్ సిక్సర్ బాదాడు. బుమ్రా రెండు బంతుల్ని డాట్గా వేశాడు. తర్వాత బంతికి 2 పరుగులు తీసి 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ముంబై తడబాటు తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు మెరుపు అరంభాన్నిచ్చే ప్రయత్నం చేశాడు సిద్ధేశ్ లాడ్. డికాక్తో కలిసి పరుగులవేటకు దిగిన అతను తొలి ఓవర్లో సిక్స్, ఫోర్తో 10 పరుగులు చేశాడు. తర్వాత ఓవర్ వేసిన షమీ కేవలం మూడే పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ను షమీ మరింత కట్టుదిట్టంగా వేశాడు. పరుగు మాత్రమే ఇచ్చి సిద్ధేశ్ (15) ఆట ముగించాడు. దీంతో సూర్యకుమార్ జతయ్యాడు. ఇద్దరు పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా సరిగ్గా జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. భారీ లక్ష్యం ముందుండగా... మెరుపుల్లేకుండా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్ను వరుస ఓవర్లలో కరన్, అశ్విన్ దెబ్బతీశారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సూర్యకుమార్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను కరన్ ఔట్ చేయగా, మరుసటి ఓవర్లో డికాక్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను అశ్విన్ బోల్తాకొట్టించాడు. పొలార్డ్ విధ్వంసం ముంబై తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 65 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో ఇంకా 133 పరుగులు చేయాలి. అంటే ఓవర్కు 13 పరుగులకు మించి చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పొలార్డ్ బ్యాట్కు పనిచెప్పాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కరన్ బౌలింగ్లో 6, 4, 6తో 18 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి పొలార్డ్ షాట్కు ప్రయత్నించాడు. కానీ బంతి బౌలర్కు సమీపంలో ఉన్నా... లేని పరుగుకు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) రనౌటయ్యాడు. కెప్టెన్కు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. ఈ జోడి 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 135/5. ఇక ఆఖరి 30 బంతుల్లో ముంబై విజయానికి 63 పరుగులు కావాలి. ఈ దశలో 16వ ఓవర్ల్లో పాండ్యా బ్రదర్స్ను షమీ పెవిలియన్ చేర్చాడు. షమీ తొలి బంతికి హార్దిక్ (19; 2 ఫోర్లు), నాలుగో బంతికి కృనాల్ (1) వెనుతిరిగారు. ఇక ముంబై ఆశలు పొలార్డ్పైనే పెట్టుకుంది. అల్జారి జోసెఫ్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతుల్లోనే (1 ఫోర్, 7 సిక్స్లు) అర్ధసెంచరీని పూర్తి చేసుకున్న పొలార్డ్... కరన్ వేసిన 19వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి వుండగా... ఈ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లతో 17 పరుగులు సాధించాడు. ఇక ఆఖరి 6 బంతులకు 15 పరుగులు కావాలి. అంకిత్ రాజ్పుత్ బౌలింగ్కు దిగాడు. తొలి బంతి నోబాల్ కాగా పొలార్డ్ సిక్సర్గా మలిచాడు. మరుసటి బంతి బౌండరీకి వెళ్లింది. దీంతో ఐదు బంతులకు 4 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ దశలో పొలార్డ్ ఔట్ కాగా... ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సివుండగా అల్జారి మిడాన్లో షాట్ కొట్టి చకచకా 2 పరుగులు పూర్తి చేయడంతో ముంబై గెలిచింది. రోహిత్ శర్మకు గాయం పంజాబ్తో మ్యాచ్కు ముందు రోజు మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ కుడి కాలి కండరాలు పట్టేశాయి. అతను కోలుకున్నా... ముందు జాగ్రత్తగా ముంబై ఇండియన్స్ అతడికి విశ్రాంతినిస్తూ పంజాబ్తో మ్యాచ్లో పక్కన పెట్టింది. ఐపీఎల్లో రోహిత్ మ్యాచ్కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్ ఆడలేదు. రోహిత్ స్థానంలో ఈ మ్యాచ్ లో సిద్ధేశ్ లాడ్కు అవకాశం దక్కింది. సిద్ధేశ్ తండ్రి దినేశ్ లాడ్...రోహిత్కు చిన్ననాటి కోచ్ కావడం విశేషం. 2015 ఐపీఎల్లోనే సిద్ధేశ్ను తీసుకున్న ముంబై ఇండియన్స్ నాలుగేళ్ల పాటు జట్టుతో ఉంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అతనికి ఐపీఎల్లో ఇదే మొదటి మ్యాచ్. -
సన్రైజర్స్ పై పంజాబ్ విజయం
-
ధోని గురి అదిరింది కానీ.. కేఎల్ రాహుల్ అదృష్టం బాగుంది..
-
వైరల్: ధోని గురి అదిరింది కానీ..
చెన్నై: కింగ్స్ఎలెవన్ పంజాబ్తో శనివారం చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆ జట్టు బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అదృష్టంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్లో జడేజా వేసిన బంతిని సింగిల్ తీయడానికి రాహుల్ ప్రయత్నించగా.. ధోని తనదైన మార్క్ కీపింగ్తో వేగంగా బంతిని వికెట్లకు కొట్టాడు. రాహుల్ వెనక్కి వచ్చినా బంతి వికెట్లను తాకే సమయానికి క్రీజును చేరలేదు. కానీ ధోని దురదృష్టమో.. రాహుల్ అదృష్టమో కానీ బెల్స్ కిందపడలేదు. బంతి ఒక్కసారి వికెట్లను తాకి లైట్స్ వెలగడంతో చెన్నై ఆటగాళ్లు రాహుల్ ఔటయ్యాడని ఫిక్సయ్యి సంబరాలు చేసుకున్నారు. స్లిప్లో ఫీల్డింగ్ ఉన్న అంబటి రాయుడైతే ఏకంగా బంతిని వదిలేసి ధోని దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. చివరకు బెల్స్ కిందపడలేదని తెలుసుకొన్న చెన్నై ఆటగాళ్లంతా షాక్కు గురయ్యారు. ఇంతలో రాహుల్ తన పరుగును పూర్తి చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాహుల్ 12వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్భజన్, కుగ్లీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
చెన్నై అలవోకగా...
చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ విజయ లక్ష్యం 161 పరుగులు. ఒక దశలో జట్టు విజయానికి 49 బంతుల్లో 71 పరుగులు అవసరం. ఈ స్థితిలో పంజాబ్ గెలిచేస్తుందనే అనుకున్నారంతా... కానీ చెన్నై స్పిన్నర్లు జడేజా, హర్భజన్, తాహిర్ చెలరేగారు. దాదాపు 6 ఓవర్ల పాటు పంజాబ్ను ఒక్క బౌండరీ కూడా బాదకుండా అడ్డుకున్నారు. దీంతో విజయ సమీకరణం 16 బంతుల్లో 44గా మారగా, ఛేదన పంజాబ్ వల్ల కాలేదు. రాహుల్, సర్ఫరాజ్ నెమ్మదైన అర్ధసెంచరీలతో జట్టు మూల్యం చెల్లించుకోగా, ధోని వ్యూహాలతో చెన్నైకి మరో విజయం దక్కింది. చెన్నై: సొంతగడ్డపై సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సూపర్కింగ్స్ 22 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్భజన్, కుగ్లీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సాదాసీదాగా... డు ప్లెసిస్, వాట్సన్ తొలి వికెట్కు 56 పరుగులు జోడించి చెన్నైకి శుభారం భం అందించారు. టై బౌలింగ్లో వరుసగా 4, 6 బాదిన వాట్సన్ పవర్ ప్లే చివరి బంతికి మరో బౌండరీతో జోరు కనబరిచాడు. తర్వాత మరో భారీ షాట్ ఆడే క్రమంలో అశ్విన్కు దొరికిపోయాడు. రైనా (17) సింగిల్స్కే ప్రా ధాన్యతనిచ్చాడు. మరోవైపు మురుగన్, అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. సగం ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 71/1తో నిలిచింది. వరుస బంతుల్లో డు ప్లెసిస్, రైనాలను ఔట్ చేసి అశ్విన్ స్కోరును కట్టడి చేశాడు. అనంతరం రాయుడు (15 బంతుల్లో 21 నాటౌ ట్; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో ధోని బ్యాట్ ఝళిపించారు. కరన్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 4తో ధోని 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్లో రాయు డు సిక్స్, ధోని బౌండరీ బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది. డుప్లెసిస్ జోరు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఫాఫ్ డు ప్లెసిస్.... షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతిని ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్గా మలిచాడు. టై ఓవర్లోనూ లాంగాన్ మీదుగా మరో సిక్సర్తో అలరించాడు. ఆరంభంలో స్పిన్ ఎదుర్కొనేందుకు కాస్త తడబడిన అతను... అశ్విన్, మురుగన్ వేసిన వరుస ఓవర్లలో రెండు సిక్సర్లతో జోరు కనబరిచాడు. ఇదే క్రమంలో 33 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. తర్వాత అశ్విన్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతి జాగ్రత్తకు పోయి.. ఒకే ఓవర్లో విధ్వంసక ఆటగాడు గేల్ (5), మయాంక్ అగర్వాల్ (0)లను ఔట్ చేసి హర్భజన్ పంజాబ్కు షాకిచ్చాడు. అయితే రాహుల్, సర్ఫరాజ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ రెండో వికెట్కు 110 పరుగులు జోడించారు. చహర్ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ 4, 6, 4తో అలరించాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతోన్న కుగ్లీన్ తన మొదటి బంతినే సర్ఫరాజ్కు సిక్స్గా సమర్పించుకున్నాడు. దీంతో పవర్ప్లేలో పంజాబ్ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది. మరోసారి కుగ్లీన్ బౌలింగ్ (12వ ఓవర్)లోనే సర్ఫరాజ్ 4, 6తో అలరించాడు. అప్పటివరకు సాఫీగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ బ్యాట్స్మెన్ అతి జాగ్రత్తతో డీలా పడింది. -
ముంబైపై పంజా
పంజాబ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో చిత్తుగా ఓడిన పంజాబ్.. ఈసారి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సమష్టి ప్రదర్శనతో ముంబైని చిత్తు చేసింది. కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్మెన్ మయాంక్, గేల్, రాహుల్ సమష్టిగా రాణించడంతో రోహిత్సేన వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. అంతకు ముందు బ్యాటింగ్లో డికాక్ అర్ధసెంచరీ చేసినా పంజాబ్ బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతో ముంబై సాధారణ స్కోరుకు పరిమితమైంది. మొహాలి: ముందుగా బౌలర్లు, అనంతరం బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (57 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా... గేల్ (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించారు. డికాక్ దూకుడు పంజాబ్ కెప్టెన్ అశ్విన్ వేసిన తొలి ఓవర్లోనే బౌండరీతో డికాక్ ఖాతా తెరిచాడు. అతను వేసిన మరో రెండు ఓవర్లలోనూ ఒక్కో బౌండరీ సాధించి జోరు కనబరిచాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్లో ఓవరాల్గా మూడు బౌండరీలు బాదిన డికాక్... షమీ బౌలింగ్లో రెండు సిక్స్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ స్టంప్పై పడిన బంతిని ముందుకొచ్చి స్క్వేర్లెగ్ మీదుగా కొట్టిన భారీ సిక్స్ అతని ఇన్నింగ్స్లో హైలైట్. దీని తర్వాత మరుసటి బంతికే అతను వికెట్ల ముందు షమీకి దొరికిపోయాడు. రాణించిన రోహిత్ తొలి రెండు మ్యాచ్ల్లోలాగే రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. షమీ బౌలింగ్లో రెండు ఫోర్లు, టై బౌలింగ్లో మరో 3 బౌండరీలు సాధించి అతను జోరు కనబరిచాడు. క్రీజులో పాతుకుపోతున్న రోహిత్ను విలోన్ ఎల్బీ చేశాడు. కానీ రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. హార్దిక్ జోరు తొలి పది ఓవర్లలో 91 పరుగులు చేసిన ముంబై... మంచి హిట్టర్లున్నప్పటికీ రెండో అర్ధభాగంలో ధాటిగా ఆడలేకపోయింది. వికెట్ స్లోగా మారడంతో 85 పరుగులే జతచేయగలిగింది. హార్దిక్ ధాటిగా ఆడటంతో ఆమాత్రమైన స్కోరు సాధించగలిగింది. విలోన్ ఓవర్లలో రెండు ఫోర్లు బాదిన హార్దిక్... ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్స్గా మలిచాడు. అదే జోరులో మరో బౌండరీ సాధించబోయి డీప్ మిడ్వికెట్లో మన్దీప్కు క్యాచ్ ఇచ్చాడు. గేల్ దుమారం ... తొలి ఓవర్లోనే ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న గేల్... మెక్లీనగన్ బౌలింగ్లో రెండు వరుస సిక్సర్లతో తన ఉనికిని చాటుకున్నాడు. అనంతరం మలింగ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గేల్... హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మరో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కృనాల్ వేసిన మరుసటి ఓవర్లోనే లాంగాన్లో హార్దిక్ క్యాచ్ అందుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మయాంక్ విజృంభణ బంతిని బాదటమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగిన మయాంక్ తాను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించాడు. మార్కండే ఓవర్లో మరో రెండు ఫోర్లతో చెలరేగాడు. కృనాల్ ఓవర్లలో మరో రెండు సిక్స్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే చివరికి అతని చేతికే చిక్కి నిష్క్రమించాడు. రాహుల్ సూపర్ కూల్ ఇన్నింగ్స్ గేల్, మయాంక్ ధాటిగా ఆడుతున్న సమయంలో సింగిల్స్కే పరిమితమైన రాహుల్... హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. తర్వాత మరో రెండు ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు. ఈ ఓవరే మ్యాచ్ గమనాన్ని మార్చింది. అంతకుముందు వరకు 36 బంతుల్లో 56 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం రాహుల్ దెబ్బకు 30 బంతుల్లో 37గా మారింది. మలింగ బౌలింగ్లో మరో ఫోర్ బాదిన రాహుల్ 46 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత మరో 3 బౌండరీలతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ‘మయాన్కడింగ్‘ జరగలేదు! ఐపీఎల్లో మరో ‘మన్కడింగ్’ త్రుటిలో తప్పిపోయింది. అయితే ఈసారి వివాదం కాకుండా నిజంగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన బౌలర్నే మనం ప్రశంసించాలి. ఎందుకంటే పంజాబ్ బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ను మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా... ముంబై బౌలర్ కృనాల్ పాండ్యా ఆ పని చేయలేదు. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఘటన జరిగింది ‘నువ్వు చాలా ముందుకెళ్లావు, వెనక్కి వచ్చేయ్’ అంటూ కేవలం హెచ్చరికతో కృనాల్ వదిలి పెట్టాడు! మయాంక్ ఇలా చేయడం కొత్త కాదు. కోల్కతాలో మ్యాచ్లోనూ బంతి బౌలర్ చేతినుంచి దాటక ముందే అతను పదే పదే ముందుకెళ్లటం కనిపించింది. ‘మన్కడింగ్’తో చర్చకు దారి తీసిన అశ్విన్ జట్టు సహచరుడే ఈసారి దాని నుంచి తప్పించుకోవడం విశేషం. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా కోటలో నైట్రైడర్స్ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్ తనకే సాధ్యమైన రీతిలో భీకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలిపించింది. బౌలర్ల సమష్టి వైఫల్యంతో ముందే మ్యాచ్పై కింగ్స్ ఎలెవన్ ఆశలు కోల్పోగా... మయాంక్, మిల్లర్ మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 28 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేయగా...చివర్లో ఆండ్రీ రసెల్ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (40 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించేందుకు అవి సరిపోలేదు. రసెల్ విధ్వంసం... కోల్కతా ఇన్నింగ్స్లో మరో 5.3 ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో రసెల్ బ్యాటింగ్కు వచ్చాడు. తాను ఆడిన తొలి 7 బంతుల్లో అతను చేసింది 5 పరుగులే! అయితే ఆ తర్వాత అతని వీర విధ్వంసం మొదలైంది. టై వేసిన ఓవర్లో వరుసగా నాలుగు బంతులను 6, 4, 4, 6లుగా మలచి రసెల్ చెలరేగిపోయాడు. తర్వాతి ఓవర్లో షమీ బాధితుడయ్యాడు. అతని ఓవర్లో కూడా వరుసగా 6, 6, 6, 4 బాదాడు. సరిగ్గా చెప్పాలంటే తాను ఆడిన వరుస ఎనిమిది బంతుల్లో రసెల్ 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు రాబట్టాడు. టై బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించగా... బౌండరీ వద్ద మయాంక్ పట్టిన చక్కటి క్యాచ్తో రసెల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. నోబాల్తో బతికిపోయి... రసెల్ స్కోరు 3 వద్ద ఉండగా షమీ అద్భుత యార్కర్తో అతడిని క్లీన్బౌల్డ్ చేశాడు. అయితే తన తప్పేమీ లేకపోయినా షమీని దురదృష్టం వెంటాడింది. నిబంధనల ప్రకారం ఆ సమయంలో 30 గజాల సర్కిల్లో కనీసం నాలుగు ఫీల్డర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. దాంతో అంపైర్ ‘నోబాల్’గా ప్రకటించడంతో రసెల్ బతికిపోయాడు. షమీ తర్వాతి ఓవర్లో కోల్కతా ఏకంగా 25 పరుగులు కొల్లగొట్టింది. రాణా సిక్సర్ల జోరు... నితీశ్ రాణా కూడా దూకుడైన ఆటతో చెలరేగి నైట్రైడర్స్కు భారీ స్కోరు అందించాడు. అశ్విన్ బౌలింగ్ను అతను చితక్కొట్టాడు. అశ్విన్ రెండో, మూడో ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాదిన అతను... చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్లు కొట్టాడు. తర్వాతి ఓవర్ వేసిన పార్ట్టైమర్ మన్దీప్ సింగ్ను వదలకుండా 2 సిక్సర్లు కొట్టాడు. విలోన్ వేసిన మరుసటి ఓవర్లో కూడా రాణా అదే ధాటిని కొనసాగించాడు. వరుస బంతుల్లో 4, 6, 4 కొట్టాడు. 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. కోల్కతా టీమ్ వెటరన్ ఉతప్ప కూడా చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ చేశాడు. పాపం వరుణ్... ‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ కనీస ధరకు 42 రెట్లు ఎక్కువ మొత్తానికి (రూ. 8.4 కోట్లు) వరుణ్ చక్రవర్తిని పంజాబ్ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్తో గుర్తింపు తెచ్చుకున్న అతనికి తొలి టి20/ఐపీఎల్ మ్యాచ్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు (25) ఇచ్చిన బౌలర్గా అతను నిలిచాడు. వరుణ్ మొదటి ఓవర్లో సునీల్ నరైన్ వరుసగా 6, 2, 4, 6, 6తో చెలరేగాడు. అతని రెండో ఓవర్లో ఉతప్ప రెండు ఫోర్లు బాదగా, మూడో ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి రాణా వికెట్ తీయడం ఊరట! మయాంక్, మిల్లర్ మాత్రమే... భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ (1) మళ్లీ విఫలం కాగా... క్రీజ్లో ఉన్న కొద్ది సేపు గేల్ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరితో పాటు సర్ఫరాజ్ (13) కూడా వెనుదిరిగాక గెలిపించే భారం మయాంక్, మిల్లర్లపై పడింది. నరైన్ ఓవర్లో మిల్లర్ వరుసగా 6, 4 కొట్టగా...మయాంక్ వరుసగా మరో రెండో ఫోర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మయాంక్ను చావ్లా బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (47 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్ చివరి వరకు నిలిచినా పంజాబ్కు పరాజయం తప్పలేదు. -
అశ్విన్ ఏందీ తొండాట..!
జైపూర్ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్పై యావత్ క్రికెట్లోకం మండిపడుతోంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు.. ఏందీ తొండాట.. అని సోషల్ మీడియావేదికగా ఆగ్రహం చేస్తున్నారు. సోమవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాజస్తాన్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి బట్లర్ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్లో ‘జెంటిల్మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది. అయితే కొందరు మాత్రం అశ్విన్ తెలివిని ప్రశంసిస్తుండగా.. ఎక్కువ శాతం తొండాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్విన్ తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో నేను ఏం చూశానో దాన్ని అస్సలు నమ్మలేకపోతున్నా.. క్రీడా స్పూర్తి విషయంలో కుర్రాళ్లకు ఇదో ఉదాహరణ. ఈ విషయంలో అశ్విన్ పశ్చాతాపపడుతాడు’ అని మోర్గాన్ ట్వీట్ చేశాడు. జోస్బట్లర్కు వార్నింగ్ ఇస్తే సరిపోయేది.. కానీ అశ్విన్ కీడ్రా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మరో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ‘అశ్విన్.. నువ్వు ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు.. ఎందుకీ తొండాట, నీ తీరుతో సిగ్గుపడుతున్నాం’ అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. చదవండి : రాజసం బొక్కబోర్లా This is disgraceful. It is the spirit with which it is played that makes Cricket a gentleman's game. Ashwin knew that buttler can single handedly take match far away from KXIP. So he showed such a terrible act.#RRvKXIP #Buttler #Mankad #Ashwin #AshwinShameful #JosButtler #IPL pic.twitter.com/ens2KngcYU — Abhishek Yadav 🌻 (@niallabhishek) March 26, 2019 ఇక అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’ పేర్కొన్నాడు. is not #Ashwin shame it's your shame whole world shame😎 — S U N N Y The Rowdy (@sunny_sanvi) March 26, 2019 I can’t believe what I’m seeing!! @IPL Terrible example to set for young kids coming through. In time I think Ashwin will regret that. — Eoin Morgan (@Eoin16) March 25, 2019 If @josbuttler had been warned well that’s fine ... if he hasn’t and it’s the first time I think @ashwinravi99 is completely out of order ... watch how often this happens from now on !!!!!!! #IPL — Michael Vaughan (@MichaelVaughan) March 25, 2019 -
అశ్విన్ తప్పు చేశాడా!
రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్లో బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. బట్లర్ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్లో ‘జెంటిల్మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది. ‘‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’’ –అశ్విన్, పంజాబ్ కెప్టెన్ -
రాజసం బొక్కబోర్లా
పంజాబ్తో మ్యాచ్లో రాజస్తాన్ విజయ లక్ష్యం 185 పరుగులు... బట్లర్ మెరుపు బ్యాటింగ్తో ఒక దశలో స్కోరు 108/1... సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్లో రాయల్స్కు కుదుపు... వివాదాస్పద రీతిలో బట్లర్ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడంతో జట్టు లయ దెబ్బ తింది. ఆ తర్వాత రహానే బృందం కోలుకోలేకపోయింది. 21 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్ కుప్పకూలింది. 16 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి రాయల్స్ ఓటమి పాలైంది. అంతకుముందు క్రిస్ గేల్ మెరుపు బ్యాటింగ్కు తోడు సర్ఫరాజ్ కూడా చెలరేగడంతో పంజాబ్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. జైపూర్: సొంతగడ్డపై తొలి మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్ ఓటమితో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో రాజస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (47 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... సర్ఫరాజ్ ఖాన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. జోస్ బట్లర్ (43 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడగా... సంజు శామ్సన్ (25 బంతుల్లో 30; 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. గేల్ దూకుడు... విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మరో ఐపీఎల్ సీజన్ను దూకుడుగా ప్రారంభించాడు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత అతను దూసుకుపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి 27 బంతుల్లో 29 పరుగులు చేసిన గేల్... తర్వాతి 20 బంతుల్లో 50 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా ఉనాద్కట్ ఓవర్లో చెలరేగిపోయిన గేల్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదాడు. స్టోక్స్ ఓవర్లో కూడా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన అనంతరం అదే ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో తక్కువ ఇన్నింగ్స్ (112)లలో ఐపీఎల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గేల్ నిలిచాడు. మరోవైపు లోకేశ్ రాహుల్ (4) తొలి ఓవర్లోనే ఔట్ కాగా... కొన్ని చక్కటి షాట్లు ఆడిన మయాంక్ అగర్వాల్ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) బౌండరీ వద్ద ధావల్ చక్కటి క్యాచ్కు వెనుదిరిగాడు. ఆకట్టుకున్న సర్ఫరాజ్... 2018 ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆడిన సర్ఫరాజ్ 6 ఇన్నింగ్స్లలో కలిపి 51 పరుగులే చేశాడు. ఆ తర్వాత అతను ఏడాది కాలంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదృష్టవశాత్తూ వేలంలో పంజాబ్ సొంతం చేసుకోగా... తొలి మ్యాచ్లో చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. స్టోక్స్ వేసిన ఓవర్లో స్కూప్ షాట్తో సర్ఫరాజ్ కొట్టిన ఫోర్ హైలైట్గా నిలవగా, ఆఖరి బంతికి సిక్సర్ కూడా బాదాడు. పాపం ఉనాద్కట్... వరుసగా రెండో ఏడాది వేలంలో భారీ మొత్తానికి (రూ.8.4 కోట్లు) రాజస్తాన్ సొంతం చేసుకున్న పేసర్ జైదేవ్ ఉనాద్కట్ లీగ్ను పేలవంగా ఆరంభించాడు. ఏ మాత్రం నియంత్రణ లేని బౌలింగ్తో తన మూడు ఓవర్లలో 13, 19, 12 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆర్చర్ సూపర్... రాయల్స్ మరో బౌలర్ జోఫ్రా ఆర్చర్ వల్లే పంజాబ్ స్కోరుకు కొంత కళ్లెం పడింది. వైవిధ్యభరిత బంతులతో అతను బ్యాట్స్మెన్ను కట్టి పడేశాడు. ఆర్చర్ తన నాలుగు ఓవర్లలో 1, 1, 10, 5 చొప్పున మాత్రమే పరుగులిచ్చాడు. అతని బౌలింగ్లో వచ్చిన ఒకే ఒక సిక్సర్ను గేల్ కొట్టాడు. బట్లర్ బాదుడు... గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరఫున ఓపెనింగ్కు దిగిన తర్వాత ఆరు ఇన్నింగ్స్లలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన బట్లర్ కొత్త సీజన్లో మళ్లీ తన ప్రతాపం చూపించాడు. షమీ ఓవర్లో రెండు ఫోర్లతో జోరు మొదలు పెట్టిన అతను, ముజీబ్ వేసిన తర్వాతి ఓవర్లో 4, 6 కొట్టాడు. ఇంగ్లండ్ సహచరుడు కరన్ ఓవర్లో అతను 3 ఫోర్లు, భారీ సిక్సర్తో పండగ చేసుకున్నాడు. 29 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తొలి వికెట్కు 49 బంతుల్లోనే 78 పరుగులు జోడించిన అనంతరం రహానే (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) బౌల్డ్ కాగా... కొద్ది సేపటికి బట్లర్ రనౌట్గా వెనుదిరిగాడు. ఐపీఎల్లో పునరాగమనం తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో స్టీవ్ స్మిత్ (20) ఆకట్టుకోకపోగా...చివరి వరుస బ్యాట్స్మెన్ వైఫల్యంతో రాజస్తాన్కు ఓటమి తప్పలేదు. స్యామ్ కరన్పై దాడి... సొంతగడ్డపై టెస్టు సిరీస్లో భారత్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన స్యామ్ కరన్కు తొలి ఐపీఎల్ మ్యాచ్లో శుభారంభం లభించలేదు. అతను వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే మూడు ఫోర్లు కొట్టాడు. తన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 36 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తన చివరి ఓవర్లో 4 పరుగులే ఇచ్చిన అతను, 2 కీలక వికెట్లు తీసి పంజాబ్కు గెలుపు అవకాశం సృష్టించాడు. -
నైట్రైడర్స్ దూకుడు
రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ కెప్టెన్సీలో కొత్త జట్టుతో అద్భుత ప్రదర్శన కనబర్చి తొలిసారి విజేతగా నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ 2014లో కూడా దానిని పునరావృతం చేసింది. రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని చెన్నై తర్వాత ఈ ఘనత సాధించిన మరో జట్టుగా నిలిచింది. ఈ టీమ్లో 2012లో విజేతగా నిలిచిన జట్టులోని వారే ఎక్కువ మంది ఉండి కీలక పాత్ర పోషించారు. అనూహ్యమైన ఆటతీరుతో లీగ్ దశలో ఏకంగా 11 మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరకు ఫైనల్లో చతికిల పడింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బోర్డుతో విభేదాల కారణంగా పుణే వారియర్స్ తప్పుకోవడంతో లీగ్ మొదలైన కొత్తలో ఉన్నట్లుగా మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్ జరగడం విశేషం. యూఏఈలో.... ఐపీఎల్ మొదలైన తర్వాత రెండోసారి 2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2009లాగే మళ్లీ దక్షిణాఫ్రికాలో నిర్వహించాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు తెచ్చింది. అయితే ఈసారి ఫ్రాంచైజీలు దానిని వ్యతిరేకించాయి. ఆర్థికపరంగా, నిర్వ హణాపరంగా 2009లో తమకు చాలా సమస్యలు తలెత్తాయని చెప్పడంతో చివరకు రెండు దశలుగా లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తొలి 20 మ్యాచ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, తర్వాతి 40 మ్యాచ్లు భారత్లో జరిగాయి. ఫైనల్ ఫలితం... క్వాలిఫయర్–1లో పంజాబ్ను ఓడించి కోల్కతా... క్వాలిఫయర్ 2లో చెన్నైని ఓడించి పంజాబ్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. వృద్ధిమాన్ సాహా (115 నాటౌట్) అద్భుత సెంచరీ, మనన్ వోహ్రా (67) అర్ధ సెంచరీ సహాయంతో ముందుగా పంజాబ్ 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత కోల్కతా మరో 3 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లకు 200 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. ‘మ్యా¯Œ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (94) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు శతకాలు... టోర్నీలో మూడు సెంచరీలు నమోదయ్యాయి. సెహ్వాగ్ (122), సాహా (115), లెండిల్ సిమ¯Œ ్స (100) ఈ ఘనత సాధించగా... 4 అర్ధ సెంచరీలు చేసిన మ్యాక్స్వెల్ 95, 95, 90, 89 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. లీగ్లో అత్యధికంగా మ్యాక్స్వెల్ 36 సిక్సర్లు బాదడం మరో విశేషం. వేలం విశేషాలు... 2014 సీజన్లో మళ్లీ కొత్తగా వేలం జరిగితే... మొదటిసారి ఆటగాళ్లకు డాలర్లు రూపంలో కాకుండా రూపాయలుగా చెల్లించారు. అన్నింటికంటే ప్రధాన మార్పు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్స్ విషయంలో జరిగింది. అప్పటి వరకు వారిని వేలంలో ఉంచకుండా నిర్ణీత మొత్తం అందజేసిన గవర్నింగ్ కౌన్సిల్ వారికీ వేలంలో చేరే అవకాశం ఇచ్చింది. దీని వల్ల భారత జట్టుకు ఆడకపోయినా ప్రత్యేక ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు భారీ మొత్తం అందుకునే అవకాశం దక్కింది. వీరిలో అత్యధికంగా కరణ్ శర్మ (రూ. 3.75 కోట్లు)కు దక్కాయి. ఇద్దరు మినహా... లీగ్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి కోల్కతా విజయంలో భాగంగా నిలిచిన 17 మంది ఆటగాళ్లలో మన్వీందర్ బిస్లా, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతావారంతా అంతర్జాతీయ క్రికెటర్లు కావడం విశేషం. -
ఐపీఎల్ వేలం: వారెవ్వా వరుణ్ చక్రవర్తి
జైపూర్: తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ సీజన్ 12 కోసం జరగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనం నమోదు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఏకంగా రూ.8.40 కోట్ల రికార్డు ధరకు కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. లిస్ట్ ఏ క్రికెట్లో 9 మ్యాచ్లు ఆడిన ఈ యువ సంచలనం ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ లీగ్లోనూ తన దైన రీతిలో అదరగొట్టడంతో ప్రాంచైజీలు దృష్టిలో పడ్డాడు. ఇక ఇప్పటివరకూ జరిగిన వేలంలో జయదేవ్ ఉనాద్కత్(రూ. 8.40 కోట్లు-రాజస్థాన్), శివం దుబే(రూ. 5కోట్లు-ఆర్సీబీ), వరుణ్ చక్రవర్తి(రూ. 8.40 కోట్లు- కింగ్స్ పంజాబ్)లు జాక్పాట్ కొట్టారు. హనుమ విహారి కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్వైట్ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్ తీసుకోగా, హెట్మెయిర్ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
అక్షర్ అ‘ధర’హో
జైపూర్: ఐపీఎల్ సీజన్ 12 కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జాక్పాట్ కొట్టేశాడు. కోటి కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన అక్షర్ పటేల్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు ఈ ఆల్రౌండర్ను కొనుగోలు చేసుకోవడానికి పోటీపడ్డాయి. కానీ చివరకు అక్షర్ను ఢిల్లీ సొంత చేసుకుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్పాట్ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్వైట్ రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్ తీసుకోగా, హెట్మెయిర్ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
సెహ్వాగే కాదు.. వెంకీ కూడా వద్దు!
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ను ఒక్కసారి కూడా సాధించలేని కింగ్స్ పంజాబ్ జట్టు... ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే ఆ ఫ్రాంచైజీ తమ ప్రక్షాళనను ముమ్మరం చేసింది. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను మెంటార్ పదవి నుంచి తొలగించిన ఫ్రాంచైజీ యాజమాన్యం.. తాజాగా బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్కు ఉద్వాసన పలికింది. కేవలం 2018 సీజన్కు మాత్రమే కింగ్స్ పంజాబ్ బౌలింగ్ కోచ్గా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ను తీసుకొంది. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్కు బౌలింగ్ కోచ్గా పనిచేఇన శ్రీరామ్ను ఎంపిక చేసుకుంది కింగ్స్ పంజాబ్. ఆస్ట్రేలియా జట్టుకు శ్రీరామ్ కన్సల్టెంట్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ బ్రాడ్ హడ్జ్ స్థానంలో మైక్ హెసన్ను నియమించుకుంది. ఆయన ప్రస్తుతం న్యూజిలాండ్ కోచ్గా ఉన్నారు. ఇక కింగ్స్ హై పర్ఫామెన్స్ కోచ్గా క్రికెట్ ఆస్ట్రేలియాకు సాంకేతిక వ్యూహ విశ్లేషకుడిగా పనిచేస్తున్నప్రసన్న ఆగోరమ్ను తీసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు సెహ్వాగ్ గుడ్బై -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు సెహ్వాగ్ గుడ్బై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో తాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్కుమెంటార్గా వ్యవహరించడం లేదని వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించాడు. కింగ్స్ ఎలెవన్ జట్టుతో తెగదెంపులు చేసుకున్నట్లు శనివారం తెలిపాడు. 2014, 2015లలో కింగ్స్ ఎలెవన్ జట్టుతరఫున ఆడిన సెహ్వాగ్ ఆ తర్వాత మూడు సీజన్లుగా మెంటార్ పాత్ర పోషించాడు. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ న్యూజిలాండ్ జాతీయ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్ను హెడ్ కోచ్గా నియమించింది. -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్గా హెసన్
మొహాలి: వచ్చే ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త కోచ్తో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు హెడ్ కోచ్గా ఉన్న బ్రాడ్ హాడ్జ్ (ఆస్ట్రేలియా)ను తప్పించి అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్ను నియమించింది. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీఈఓ సతీశ్ మీనన్ తెలిపారు. 2015 వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ జట్టును ఫైనల్కు చేర్చిన హెసన్ ఈ ఏడాది జూన్లో తన పదవికి రాజీనామా చేశారు. -
ఇష్టమొచ్చినట్లు రాయకండి: ప్రీతి జింటా
పుణె: వివాదాస్పద వీడియో.. మీడియా కథనాలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మళ్లీ స్పందించారు. ముంబై ఓడిపోయినందుకు తానేం సంతోషపడలేదని, తమ జట్టు అవకాశం కోసమే అలా స్పందించానని మరోసారి స్పష్టం చేశారు. అనవసరంగా మీడియా ఆ విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తోందని ప్రీతి మండిపడ్డారు. లీగ్ మ్యాచ్ల్లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి చెంది ఇంటి ముఖం పట్టింది. దీంతో ప్రీతి ఆనందం వ్యక్తం చేసినట్లు ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. (వీడియో కోసం..) తమ జట్టు(పంజాబ్) ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, అందుకే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. సంచలనాల కోసం మీడియా అత్యుత్సాహంతో వార్తలు రాస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘మా జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎవరి జట్ల కోసం వాళ్లు ఆలోచించటంలో తప్పులేదు. వేరే జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తే నేను సంబరపడలేను కదా..! ముంబై ఓడి పోయినందుకు నేను ఆనంద పడలేదు.. మా జట్టు పరిస్థితిపై మాత్రమే ఆందోళన చెందాను పంజాబ్ నాకౌట్కి చేరుకోలేక పోవడం బాధాకరం’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘మా జట్టు ప్లేఆఫ్కు చేరుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. కానీ విజయమే వరించలేదు. ఫైనల్స్లో ఏ జట్టు గెలిచినా ఫర్వాలేదు. కానీ, ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’ని ఆమె పేర్కొన్నారు. Dear Media I will appreciate it if you dont create unnecessary controversy of me being happy that another team got knocked out so my team had a real chance. It could be any other team & the word “Finals” never featured in any conversation so stop misreporting as always 🙏 #fedup — Preity zinta (@realpreityzinta) May 22, 2018 -
అందుకే సంబరాలు: ప్రీతి జింటా క్లారిటీ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి చెందిన తర్వాత ఆనందం ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చిందో కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా వివరణ ఇచ్చారు. తమ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, దానిలో భాగంగానే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్పంజాబ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ప్రీతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమే కాకుండా వరుస పరాజయాలు తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని దెబ్బ తీశాయని ఆమె పేర్కొన్నారు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్కు వెళ్లకుండా లీగ్ దశతోనే సరిపెట్టుకోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించిన జట్టు ప్లేఆఫ్కు చేరకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇది తనను చాలా బాధించిందని తెలిపిన ప్రీతి.. కింగ్స్ పంజాబ్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. వచ్చే ఏడాది ఈ తరహా పరిస్థితి రాదని అనుకుంటున్నానని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై ఓటమిపై ప్రీతి సంబరం.. వైరల్!! -
చిన్న పిల్లాడిలా ధోని ఆటలు.. వైరల్
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని మైదానంలో చిన్న పిల్లాడిలా మారిపోయారు. గతంలో పలుమార్లు కూతురు జీవాతో కలిసి సందడి చేసిన ధోని.. ఆదివారం కింగ్స్ఎలెవన్ పంజాబ్పై గెలుపొందిన అనంతరం మోకాళ్లపై కూర్చుని చిన్నారి జీవాతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై జట్టు ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ధోని టోపీతో జీవా ఆడుకోవడం చూడవచ్చు. మ్యాచ్ ఓడినా, నెగ్గినా మహీ చాలా కూల్గా ఉంటాడని.. అదే అతడి ప్రత్యేకత అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్లే ఆఫ్ బెర్త్ను ఇదివరకే కన్ఫామ్ చేసుకున్న చెన్నై జట్టు లీగ్లో భాగంగా నిన్న జరిగిన చివరి మ్యాచ్లో పంజాబ్పై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 18 పాయింట్లే ఉన్నప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్రేట్తో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. -
ముంబై ఓడింది.. నాకు చాలా ఆనందంగా ఉంది!
అదే ఆనందమో తెలియదు కానీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిందని తెలియగానే ఆమె తెగ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్లో వైరల్ అయింది. కానీ, ఆ తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్లో ప్రితీ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే చెన్నైని కనీసం 53 పరుగుల తేడాతో ఓడించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన పంజాబ్ చివరకు పరాభవంతో ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ముంబై ఓడిపోగానే ప్రితీ సంబరపడటంపై నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేం ఆనందమోగానీ.. తన జట్టు గెలువకపోయినా పర్వాలేదు.. ముంబై మాత్రం ఓడిపోవడం ఆమెకు ఆనందంగా ఉన్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ.. తమకు ఏమీకాని ఫలితంతో ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. Did anyone else read those lips? @realpreityzinta just said "I'm still very happy #MumbaiIndians are out, very happy!" Just shows the spirit. Sigh! #PreityZinta #CSKvsKXIP #KXIPvCSK #MIvDD #DDvMI #IPL2018 #CSKvKXIP #Yellove #WhistlePodu #CSKvKXIP #Dhoni #IPL18 — Bhat (@ibhat26) 20 May 2018 -
ముంబై ఓటమితో ప్రీతి జింటా ఆనందం
-
బౌలర్లలో గందరగోళం.. అందుకే అలా: ధోనీ
పుణె: చెన్నై సూపర్కింగ్స్ జట్టు మరోసారి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోవడం ఇది తొమ్మిదోసారి. ఆడిన తొమ్మిది సీజన్లలోనూ అద్భుతంగా రాణించి చెన్నై ప్లేఆఫ్స్కు చేరుకోవడం గమనార్హం. తాజాగా ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విలేకరులతో మాట్లాడారు. ప్రతి సీజన్లో బాగా రాణించాలంటే జట్టును సరిగ్గా అంచనా వేసి వినియోగించుకోవాల్సి ఉంటుందని ధోనీ అన్నారు. ‘ఆటగాళ్లకు ఎంతో సన్నిహితమైన వ్యక్తులు జట్టుకు సిబ్బందిగా ఉన్నారు. దీంతో కెప్టెన్గా నా పని సులువైపోయింది. మాకు నిజంగా మంచి జట్టు ఉంది. ప్రతి సీజన్లోనూ కొత్త ఆటగాళ్లు జట్టులో చేరారు. అశ్విన్, బొలింగర్, మోహిత్ లాంటివాళ్లు జట్టు తరఫున ఆడారు. రెండేళ్లు మేం ఆడకపోవడంతో పలువురు ఆటగాళ్లు మారారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న జట్టును చక్కగా బేరీజు వేసి.. ఫలితాలు ఇచ్చేదిశగా ఉపయోగించుకున్నాం’ అని తెలిపారు. గతంలో ఐపీఎల్ ఫైనల్లో పొరపాట్లు చేసిన సంగతి తనకు గుర్తు ఉందని, రాబోయే మ్యాచ్ల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటున్నామని, ప్లేఆఫ్స్లో తమ జట్టు ఉత్తమంగా ఉండాలని అనుకుంటున్నట్టు ధోనీ అన్నారు. పంజాబ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి రెండు వికెట్లు పడిన తర్వాత ధోనీ వరుసగా హర్భజన్ సింగ్, దీపక్ చాహర్లను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించారు. ఇలా ప్రధాన బ్యాట్స్మెన్ కాకుండా బౌలర్లు ముందుకు రావడంతో పంజాబ్ బౌలర్లు కంగుతిన్నారు. ఈ విషయంపై ధోనీ స్పందిస్తూ.. పంజాబ్ బౌలర్లను డిస్టర్బ్ చేయడానికి అలా చేశానని తెలిపారు. ‘బౌలింగ్ లైనప్ చూసుకుంటే.. కొంచెం స్వింగ్ వస్తోంది. స్వింగ్ సాధ్యపడితే ఎక్కువ వికెట్లు తీసుకోవాలని బౌలర్లు భావిస్తారు. అందుకే భజ్జీ, చాహర్ను పంపి.. బౌలర్లలో కొంత గందరగోళం సృష్టించాలని భావించాం. సరైన బ్యాట్స్మెన్ వస్తే బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తారు. అదే లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు వస్తే.. బౌన్సర్లు, ఆఫ్కటర్లు వేయడానికి ప్రయత్నిస్తారు. కొంత నిలకడ తప్పుతుంది’ అని ధోనీ తెలిపారు. -
‘పంజా’బ్ బలం సరిపోలేదు
ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు నిరాశ తప్పలేదు. లీగ్ ఆరంభంలో వరుస విజయాలతో టాప్గా దూసుకుపోయినా... తర్వాతి దశలో ఓటములను ఆహ్వానించిన ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ముందుకు వెళ్లాలంటే చెన్నైని కనీసం 53 పరుగుల తేడాతో ఓడించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన పంజాబ్ చివరకు ఓటమితోనే సరిపెట్టుకుంది. ఇన్గిడి అద్భుత బౌలింగ్తో తక్కువ స్కోరుకే పరిమితమైన టీమ్... చెన్నై బ్యాటింగ్ను 100 పరుగులలోపు నిలువరించడంలో విఫలమైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్లోకి అడుగు పెట్టి జైపూర్లో రాజస్తాన్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్–11లో టాప్–4లో నిలిచిన నాలుగు జట్లూ మాజీ చాంపియన్లే కావడం విశేషం. పుణే: ఐపీఎల్–2018 లీగ్ దశకు ఏకపక్ష విజయంతో ముగింపు లభించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో చెన్నై 5 వికెట్లతో పంజాబ్ను చిత్తు చేసింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (26 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, తివారి (30 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అత్యుత్తమ బౌలింగ్తో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇన్గిడి (4/10) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. రైనా (48 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనూహ్యంగా బ్యాటింగ్ అవకాశం లభించిన దీపక్ చహర్ (20 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. నాయర్ మెరుపులు... నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 16/3... ఈ సీజన్లో రాహుల్ (7) తొలిసారి ‘సింగిల్ డిజిట్’కే పరిమితమయ్యాడు. ఇన్గిడి బంతి కి అతను చేతులెత్తేసి వెనుదిరిగాడు. అంతకుముందే ఇన్గిడి బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి గేల్ (0) డకౌటయ్యాడు. రైనా అద్భుత క్యాచ్కు ఫించ్ (4) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ స్థితిలో తివారి, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జడేజా తన తొలి బంతికే తివారిని ఔట్ చేయగా, చక్కటి యార్కర్తో మిల్లర్ను బ్రేవో పడగొట్టాడు. ఆ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ భారం మొత్తం కరుణ్ నాయర్ మోశాడు. శార్దుల్ ఓవర్లో వరుస బంతుల్లో నాయర్ 4, 6, 4 బాదాడు. ఆ తర్వాత బ్రేవో ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టి 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్... మరుసటి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి డగౌట్ చేరాడు. మరో ఎండ్లో ఇతర బ్యాట్స్మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఆడుతూ పాడుతూ... సాధారణ లక్ష్య ఛేదనలో చెన్నై కూడా ఆరంభంలోనే రాయుడు (1) వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో అతను ఒక అంకె స్కోరుకే పరిమితం కావడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత రాజ్పుత్ వరుస బంతుల్లో డు ప్లెసిస్ (14), బిల్లింగ్స్ (0)లను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు పెంచాడు. ఈ దశలో ఒక వైపు రైనా ప్రశాంతంగా ఆడుతుండగా, మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్లో చెన్నై తమ నిర్ణయాలతో ఆశ్చర్యపరచింది. హర్భజన్, దీపక్ చహర్లను ధోని, బ్రేవోలకంటే ముందు పంపించింది. వీరిద్దరు ఔటయ్యాక రైనా, ధోని (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడి చెన్నై విజయాన్ని ఖాయం చేశారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ఇన్గిడి 7; గేల్ (సి) ధోని (బి) ఇన్గిడి 0; ఫించ్ (సి) రైనా (బి) చహర్ 4; తివారి (సి) ధోని (బి) జడేజా 35; మిల్లర్ (బి) బ్రేవో 24; కరుణ్ నాయర్ (సి) చహర్ (బి) బ్రేవో 54; అక్షర్ (సి) బిల్లింగ్స్ (బి) శార్దుల్ 14; అశ్విన్ (సి) ధోని (బి) ఇన్గిడి 0; టై (సి) రైనా (బి) ఇన్గిడి 0; మోహిత్ శర్మ నాటౌట్ 2; రాజ్పుత్ (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–7, 2–14, 3–16, 4–76, 5–80, 6–116, 7–132, 8–132, 9–150, 10–153. బౌలింగ్: చహర్ 4–0–30–1, ఇన్గిడి 4–1–10–4, హర్భజన్ 1–0–13–0, శార్దుల్ 3.4–0–33–2, బ్రేవో 4–0–39–2, జడేజా 3–0–23–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రాయుడు (సి) రాహుల్ (బి) మోహిత్ 1; డు ప్లెసిస్ (సి) గేల్ (బి) రాజ్పుత్ 14; రైనా నాటౌట్ 61; బిల్లింగ్స్ (బి) రాజ్పుత్ 0; హర్భజన్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 19; చహర్ (సి) మోహిత్ (బి) అశ్విన్ 39; ధోని నాటౌట్ 16; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–3, 2–27, 3–27, 4–58, 5–114. బౌలింగ్: అంకిత్ 4–1–19–2, మోహిత్ 3.1–0–28–1, టై 4–0–47–0, అక్షర్ 4–0–28–0, అశ్విన్ 4–0–36–2. -
జెర్సీలు మార్చుకున్న క్రికెటర్లు!
-
ముంబైకి మోదం.. రాహుల్కు ఖేదం!
సాక్షి, ముంబై : ఐపీఎల్-11లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓవైపు ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు పంజాబ్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రేక్షకులను సైతం రాహుల్ కన్నీళ్లు కదిలించాయి. ఎందుకంటే జట్టు కోసం శక్తివంచన లేకుండా ఈ సీజన్లో రాణిస్తున్న కొందరు క్రికెటర్లలో రాహుల్ ఒకడు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ రాహుల్ (94: 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో సెంచరీ చేజార్చుకున్నాడు. కాగా, చేజారింది రాహుల్ సెంచరీ కాదు. మ్యాచ్ అని పంజాబ్కు కొంత సేపటికే తెలిసొచ్చింది. 19వ ఓవర్లో బుమ్రా వేసిన తెలివైన స్లో డెలివరికి రాహుల్ ఇన్నింగ్స్ ముగియగా.. పంజాబ్ విజయానికి 9 బంతుల్లో 16 పరుగులు కావాలి. కానీ ప్రత్యర్థిని కట్టడి చేసి 3 పరుగుల తేడాతో ముంబై నెగ్గింది. పంజాబ్ ఓటమిని తట్టుకోలేక కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ డగౌట్లో ఏడ్చేశాడు. అదే సమయంలో విజయం సాధించిన ముంబై ఆటగాళ్లు మెక్లీనగన్ హార్ధిక్ పాండ్యాలు మైదానంలో పుష్ అప్స్ చేసి సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిశాక పాండ్యాతో ముంబై జెర్సీ తీసుకుని ధరించి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. పాండ్యా సైతం పంజాబ్ జెర్సీ ధరించాడు. మ్యాచ్ అనంతరం ఇరుజట్లు 12 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ముంబై 4వ స్థానంలో ఉండగా, పంజాబ్ 6వ స్థానంలో నిలిచింది. -
ఫ్యాన్స్ను కదిలించిన క్రికెటర్ కన్నీళ్లు!
-
రాహుల్ ముంబై.. పాండ్యా పంజాబ్..!!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ 19వ ఓవర్లో ఔట్ కావడంతో కింగ్స ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. దీంతో రాహుల్ కంటతడి పెట్టుకున్నారు కూడా. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్ధిక్ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్కు ఇచ్చి స్పోర్ట్స్మ్యాన్ స్పిరిట్ను చాటుకున్నారు. అందుకు ప్రతిగా రాహుల్ కూడా పంజాబ్ జెర్సీని హర్ధిక్కు అందజేశారు. 94 పరుగుల వద్ద రాహుల్ను బుమ్రా అద్భుతమైన బాల్తో ఔట్ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. -
ఫస్ట్ ఆఫ్లో హిట్..సెకండాఫ్లో అట్టర్ఫ్లాప్
-
పంజాబ్పై బెంగళూరు విజయం
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
-
కోల్కతా తడాఖా
బ్యాట్స్మెన్ స్ట్రయిక్ రేట్... బౌలర్ల ఎకానమీ పోటీపడ్డాయి...బౌండరీలు, సిక్సర్లతో హోల్కర్ మైదానం హోరెత్తింది.ఇరు జట్ల రన్ రేట్ తారాజువ్వలా దూసుకెళ్లింది...భారీ స్కోర్ల మ్యాచ్ అంతే స్థాయిలో అలరించింది...కోల్కతా తడాఖా ముందు పంజా(బ్) జావగారిపోయింది... ఇండోర్: బ్యాట్స్మెన్ పరుగుల పండుగ చేసుకున్న మ్యాచ్లో కోల్కతాను పంజాబ్ అందుకోలేక పోయింది. రెండు ఓటముల అనంతరం ఈ మ్యాచ్లోకి దిగిన నైట్రైడర్స్ సీజన్లో అత్యధిక స్కోరు నమోదు చేసి... కింగ్స్ ఎలెవన్కు వరుసగా రెండో పరాజయం మిగిల్చింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో 31 పరుగులతో ఆ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా... సునీల్ నరైన్ (36 బంతుల్లో 75; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్కు తోడు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆండ్రూ టై (4/41)కు నాలుగు వికెట్లు దక్కాయి. రాహుల్ (29 బంతుల్లో 66; 2 ఫోర్లు, 7 సిక్స్లు), కెప్టెన్ అశ్విన్ (22 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఫించ్ (20 బంతుల్లో 34; 3 సిక్స్లు)ల పోరాటంతో ఛేదనలో పంజాబ్ కొంత దీటుగానే ఆడింది. కీలక బ్యాట్స్మెన్ విఫలమవడంతో ఆ జట్టు 8 వికెట్లకు 214 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్తో కాంటిల్బరీ సియర్ల్స్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. బాబోయ్ నరైన్... తొలి ఓవర్లో్ల క్రిస్ లిన్ (27) రెండు ఫోర్లు మినహా 3 ఓవర్ల వరకు కోల్కతా ఇన్నింగ్స్ మామూలుగానే సాగింది. నాలుగో ఓవర్లో రెండు బంతులేసిన ముజీబుర్ రెహ్మాన్... నరైన్ రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో చేతికి దెబ్బ తగిలించుకున్నాడు. మిగతా ఓవర్ను పూర్తిచేసే బాధ్యత తీసుకున్న అశ్విన్కు సిక్స్, ఫోర్తో నరైన్ స్వాగతం పలికాడు. అప్పటి నుంచి మొదలైంది అతడి జోరు. ఈ మధ్యలో రెండు సిక్స్లు కొట్టిన లిన్ అవుటైనా... నరైన్ తగ్గలేదు. 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఉతప్ప (24) కూడా బ్యాట్ ఝళిపించడంతో రన్రేట్ 10కి చేరింది. శరణ్ బౌలింగ్లో రెండు సిక్స్లు, ఫోర్... టై బౌలింగ్లో ఫోర్ కొట్టిన నరైన్ వెంటనే అవుటయ్యాడు. మరో రెండు బంతుల తర్వాత ఉతప్ప వెనుదిరిగాడు. 12 ఓవర్లకు కోల్కతా స్కోరు 130/3. తర్వాత కార్తీక్ బౌండరీలతో, రసెల్ సిక్స్లతో చెలరేగారు. 19 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. వీరి ధాటికి ముజీబుర్ 16వ ఓవర్లో 21 పరుగులిచ్చాడు. 16.3 ఓవర్కే స్కోరు 200కి చేరింది. పరిస్థితి చూస్తే మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా రసెల్ను అవుట్ చేసిన టై... 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి జట్టుకు ఉపశమనం కలిగించాడు. నితీశ్ రాణా (11) తోడుగా కార్తీక్ (22 బంతుల్లో) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. శుబ్మన్ గిల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) కొన్ని మంచి షాట్లు కొట్టగా... చివరి బంతికి సిక్స్తో సియర్ల్స్ ఘనంగా ముగించాడు. పంజాబ్ బౌలర్లందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులివ్వడం గమనార్హం. రాహుల్ మెరుపులు సరిపోలేదు... మొదటి ఓవర్లోనే రెండు అద్భుత సిక్స్లు బాది రాహుల్ ఛేదనను ఘనంగా ప్రారంభించాడు. అయితే క్రిస్ గేల్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) తడబడటంతో లక్ష్యానికి తగినట్లు పరుగులు రాలేదు. గేల్, మయాంక్ (0)లను వరుస బంతుల్లో, మరుసటి ఓవర్లో కరుణ్ నాయర్ (3)ను అవుట్ చేసి రసెల్ ఆ జట్టును దెబ్బ కొట్టాడు. అర్ధ శతకం (22 బంతుల్లో) అనంతరం తన బౌలింగ్లో రెండు సిక్స్లు కొట్టిన రాహుల్ను నరైన్ బౌల్డ్ చేశాడు. దీంతో పంజాబ్ గెలుపు ఆశలు అడుగంటాయి. అక్షర్ పటేల్ (19) అవుటయ్యాక ఫించ్, అశ్విన్ కొంతసేపు నడిపించారు. ఫించ్ను సియర్ల్స్ వెనక్కుపంపినా అశ్విన్ చకచకా పరుగులు సాధించాడు. కానీ లక్ష్యం మరీ పెద్దదిగా ఉండటంతో తన జోరు సరిపోలేదు. చివరి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ... అశ్విన్, టై (14)లను పెవిలియన్ చేర్చాడు. కోల్కతా బౌలర్లలోనూ ప్రసిద్ధ్, చావ్లా మినహా మిగతావారు 10పైగా ఎకానమీతో పరుగులివ్వడం గమనార్హం. -
బుజ్జి ఫ్యాన్తో యువీ
-
బుజ్జి ఫ్యాన్తో యువీ
ఇండోర్ : క్యాన్సర్ బారిన పడి మృత్యువు అంచుల దాకా వెళ్లిన యువీ(యువరాజ్ సింగ్), ఆ మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్లోకి పునరాగమనం చేసిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం భారతీయులు మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం యువరాజ్ సింగ్ను ఇష్టపడతారు. ఇటీవల క్యాన్సర్తో బాధపడుతున్న ఓ యువ అభిమానిని యువీ కలుసుకుని, తన ఔదార్యాన్ని చాటుకున్నారు. యువరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ 2018 సిరీస్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుఫున ఆడుతున్నారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు యువీ, క్యాన్సర్తో బాధపడుతున్న ఓ బాలుడిని కలుసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్చేసింది. ‘క్యాన్సర్తో బాధపడుతున్న 11 ఏళ్ల రాకీ, తన ఆదర్శంగా తీసుకునే వ్యక్తి@యువ్స్ట్రాంగ్12ను కలుకున్నాడు. యువ్తో రాకీ కొంత సమయం పాటు గడిపాడు. రాకీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం’ అనే క్యాప్షన్తో ఆ ఫోటోను షేర్ చేసింది. రాకీ అసలు పేరు దైనిక్ భాస్కర్. గత 10 ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో రాకీ బాధపడుతున్నాడు. తనకు క్యాన్సర్ చికిత్స ప్రారంభం కావడానికి కాస్త ముందు యువీని కలుసుకోవాలని ఆ పిల్లాడు భావించాడు. ఇలా యువరాజ్, రాకీని కలుసుకున్నారు. పిల్లాడి చేతులు పట్టుకున్న యువీ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రాకీతో సరదాగా మాట్లాడుతూ పిల్లాడిని ఉత్సాహపరిచాడు. స్కూల్ బ్యాగ్, క్యాప్, టీ-షర్ట్ను రాకీకి గిఫ్ట్గా ఇచ్చారు. రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి జయిస్తాడని యువీ అన్నారు. రాకీ తండ్రికి కూడా యువీ ధైర్యమిచ్చారు. గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని రాకీ తండ్రికి సూచించారు. యువరాజ్ సైతం 2011 తర్వాత క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. క్యాన్సర్ జయించుకుని వచ్చిన యువీ, క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేశారు. ఆ బాలుడితో కలిసి యువీ దిగిన ఫోటోలు, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. రాకీ త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. చికిత్స కోసం రాకీ ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.కొడుకును బతికించుకోవడం కోసం రాకీ తండ్రి తన బోన్ మారోను దానం చేశాడు. -
బౌలర్లను వేటాడుతున్న కేఎల్ రాహుల్
-
తెలుసు.. అందుకే ముందుకొచ్చా: అశ్విన్
జైపూర్: ఇంతపెద్ద టోర్నీలో ఒకటో రెండో మ్యాచ్లు ఓడిపోవడం పెద్ద విషయం కాదంటున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2018లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్(70 బంతుల్లో 95 నాటౌట్) ఒంటరి పోరాటం వృధాఅయిపోయింది. కాగా, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేసి తాను 3వ స్థానంలో బరిలోకి దిగడాన్ని కెప్టెన్ అశ్విన్ సమర్థించుకున్నాడు. పవర్ చూపెడదామనుకున్నా: ‘‘మేము పర్ఫెక్ట్ టీమ్ కాదన్న సంగతి మాకు తెలుసు. ప్రయోగాలు చేయకతప్పడంలేదు. వికెట్ టఫ్గా ఉంది. పోనుపోను బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. కాబట్టి పవర్ ప్లేలో ప్రత్యర్థిని అటాక్ చేద్దామనుకున్నాం. అందుకే నేను 3వ స్థానంలో బ్యాటింగ్కు దిగాను. వాస్తవానికి మేం బౌలింగ్, ఫీల్డింగ్ సరిగా చెయ్యలేదు. కీలకమైన క్యాచ్లు పట్టిఉంటే రాజస్తాన్ స్కోరు ఓ 20 పరుగులు తగ్గిఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. అఫ్కోర్స్, ఈ ఓటమి ఈ రోజుకు మాత్రమే పరిమితం. మున్ముందు కూడా ప్రయోగాలు చేస్తాం..’’ అని అశ్విన్ వివరించాడు. ట్రోలింగ్: కాగా, అశ్విన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ‘పిచ్ హిట్టర్ కాకపోయినా ఫస్ట్డౌన్లో ఎందుకొచ్చావ్?’ తరహా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడోస్థానంలో వచ్చి రెండు బంతులు ఆడిన అశ్విన్.. గౌతం బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఐపీఎల్లో అశ్విన్ బ్యాటింగ్ గణాకాంలూ ఏమంత గొప్పగాలేవు. ఇప్పటివరకు 121 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 100.34 స్ట్రైక్ రేట్తో కేవలం 288 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా 206 టీ20ల్లో 542 రన్స్ మాత్రమే సాధించాడు. 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న కింగ్స్ పంజాబ్.. తన తర్వాతి మ్యాచ్ మే 12న కోల్కతాతో ఆడనుంది. -
పంజాబ్పై రాజస్థాన్ గెలుపు
-
రాహుల్ నిలిచినా... రాయల్స్ నెగ్గింది
తలపడింది రెండు జట్లు. కానీ... పోరాడింది మాత్రం ఓపెనర్లే! దీంతో ఇరు జట్ల ఓపెనింగ్ సమరంలో బట్లర్ ఇన్నింగ్స్దే పైచేయి అయింది. రాహుల్ ఆఖరిదాకా నిలిచినా పంజాబ్ను గట్టెక్కించలేకపోయాడు. అతనొక్కడే 95 పరుగులు చేస్తే... మిగతావారు 41 పరుగులే చేశారు. జైపూర్: రాజస్తాన్ రాయల్స్ దెబ్బకుదెబ్బ తీసింది. పంజాబ్ చేతిలో వారి సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి తమ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల తర్వాత మళ్లీ రాయల్స్ గెలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రహానే బృందం 15 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై విజయం సాధించింది. తొలుత రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (58 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాయల్స్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కింగ్స్ బౌలర్లలో ఆండ్రూ టై 4 వికెట్లు తీశాడు. తర్వాత పంజాబ్ 7 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కడదాకా పోరాడాడు. బట్లర్ ఆదుకున్నాడు.... రాయల్స్ ఇన్నింగ్స్కు మళ్లీ బట్లరే పెద్దదిక్కయ్యాడు. పంజాబ్ బౌలర్లు అతనొక్కడి పోరాటాన్ని ఆడ్డుకోలేకపోయారు. ఓపెనర్గా దిగిన బట్లర్... రహానే (9; 1 ఫోర్)తో కలిసి తొలి వికెట్కు 37 పరుగులు, గౌతమ్ (8; 1 సిక్స్)తో కలిసి 27 పరుగులు జోడించాడు. తర్వాత శామ్సన్ జతయ్యాడు. ఈ క్రమంలో బట్లర్ 27 బంతుల్లో అర్ధసెంచరీ (7 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు క్రీజులో కుదురుకున్నప్పటికీ స్కోరులో మాత్రం వేగం పెరగలేదు. చేతిలో వికెట్లున్నప్పటికీ జట్టు వంద పరుగులు చేసేందుకు 13 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఇక ధనాధన్ మెరిపించాల్సిన సమయంలో ముజీబ్ తన వరుస ఓవర్లలో వీళ్లిద్దరిని పెవిలియన్ చేర్చాడు. జట్టు స్కోరు 117 వద్ద శామ్సన్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్)ను, తర్వాత కాసేపటికి జోరుమీదున్న బట్లర్ను ఔట్ చేశాడు కింగ్స్ కూలింది టపటపా... ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేశామన్న ఆనందంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఆరంభంలోనే అష్టకష్టాలు ఎదురయ్యాయి. గేల్తో మొదలైన పతనం అక్షర్ వికెట్ దాకా క్రమం తప్పకుండా సాగింది. పంజాబ్ ఇన్నింగ్స్కు లోకేశ్ రాహుల్ వెన్నెముకగా నిలిచినప్పటికీ... రాయల్స్ బౌలర్లు తెలివిగా అవతలి ఎండ్లో వికెట్లు పడగొట్టడంతో ఓటమి తప్పలేదు. -
రాహుల్ గెలిపించాడు..
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ విసిరిన 153 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ 18.4 ఓవర్లలో ఛేదించింది. దాంతో వరుసగా రెండు ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్ విజయాన్ని అందుకుంది. కింగ్స్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (84 నాటౌట్;54 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి జతగా కరుణ్ నాయర్(31), స్టోనిస్(23 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. అంతకుముందు రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రాజస్తాన్ ఆటగాళ్లలో జాస్ బట్లర్(51;39 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్(28;23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్), శ్రేయస్ గోపాల్(24)లు ఫర్వాలేదనిపించారు. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్(2) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్ బట్లర్కు కెప్టెన్ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్ 35 పరుగులకే రెండో వికెట్ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్-శాంసన్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రహ్మాన్ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్, అంకిత్ రాజ్పుత్, అక్షర్ పటేల్లకు తలో వికెట్ లభించింది. -
కింగ్స్ పంజాబ్ లక్ష్యం 153
ఇండోర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ హోల్కర్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్తాన్ ఆటగాళ్లలో జాస్ బట్లర్(51;39 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్(28;23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్), శ్రేయస్ గోపాల్(24)లు ఫర్వాలేదనిపించారు. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్(2) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్ బట్లర్కు కెప్టెన్ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్ 35 పరుగులకే రెండో వికెట్ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్-శాంసన్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రహ్మాన్ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్, అంకిత్ రాజ్పుత్, అక్షర్ పటేల్లకు తలో వికెట్ లభించింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్
ఇండోర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్.. ముందుగా రాజస్తాన్ రాయల్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఐదు విజయాలతో నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, రాజస్తాన్ రాయల్స్ ఎనిమిది మ్యాచ్లకు గాను మూడు విజయాల్ని మాత్రమే సాధించి చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్ ప్లే ఆఫ్ ఆశల్ని నిలుపుకోవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సి ఉంది. ఈ తరుణంలో కింగ్స్ పంజాబ్పై విజయం సాధించాలనే పట్టుదలతో రాజస్తాన్ బరిలోకి దిగుతోంది. మరొకవైపు కింగ్స్ పంజాబ్ గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలు కావడంతో విజయంతో గాడిలో పడాలని యోచిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. తుదిజట్లు కింగ్స్ పంజాబ్ రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్గేల్, లోకేశ్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, మార్కస్ స్టోయినిస్, మనోజ్ తివారీ, అక్షర్ పటేల్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అంకిత్ రాజ్పుత్, అండ్రూ టై రాజస్తాన్ రాయల్స్ అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, డీ ఆర్సీ షార్ట్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా అర్చర్, శ్రేయాస్ గోపాల్, అనురిత్ సింగ్ , జయదేవ్ ఉనద్కత్ -
పంజాబ్పై ముంబై ఘనవిజయం
-
ముంబైకి మూడోది
బౌలర్ల ప్రతిభతో రెండు జట్ల ఇన్నింగ్స్ 8 పరుగుల రన్రేట్తోనే సాగింది. అటు, ఇటు మొదటి, చివరి స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన ఆటగాళ్లే కీలక ఇన్నింగ్స్ ఆడారు. విజయానికి సమఉజ్జీలుగా ఉన్న దశలో పేలవ బౌలింగ్ పంజాబ్ కొంపముంచగా... మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కృనాల్ పాండ్యా ముంబైకి విజయం అందించి సంతోషంలో ముంచెత్తాడు. ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఆ జట్టు పోరాడింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో రోహిత్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ మొదట్లో క్రిస్ గేల్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకం, చివర్లో మార్కస్ స్టాయినిస్ (15 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ప్రతిఘటనతో పోటీనిచ్చిన ముంబై... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్లు) విజృంభణతో గెలుపొందింది. 30 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో కృనాల్, కెప్టెన్ రోహిత్శర్మ (15 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)లు చెలరేగారు. వీరిద్దరు 21 బంతుల్లోనే అభేద్యంగా 56 పరుగులు జోడించడంతో ఫలితం మారిపోయింది. ముందుగా గేల్... చివర్లో స్టొయినిస్ పంజాబ్ ఇన్నింగ్స్ పెద్దగా మెరుపుల్లేకుండానే సాగింది. ముంబై బౌలర్లు బుమ్రా, మెక్లీనగన్ కట్టడి చేయడంతో గేల్, కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) స్వేచ్ఛగా ఆడలేకపోయారు. హార్దిక్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి గేల్ టచ్లోకి వచ్చాడు. మెక్లీనగన్ బౌలింగ్లో అతి భారీ సిక్స్ బాదాడు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించాక రాహుల్ను మార్కండే వెనక్కు పంపాడు. వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూ గేల్ అర్ధ శతకం (38 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. ఈ ఐపీఎల్లో అయిదు మ్యాచ్ల్లో తనకిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, కటింగ్ వెంటనే అతడి జోరుకు కత్తెరేశాడు. బంతులను వృథా చేసిన యువరాజ్ సింగ్ (14) మరుసటి ఓవర్లోనే రనౌటయ్యాడు. కరుణ్ నాయర్ (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) కొన్ని మంచి షాట్లు ఆడగా, అక్షర్ పటేల్ (13) ఆకట్టుకోలేకపోయాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్లో చెలరేగిన స్టొయినిస్ 2 ఫోర్లు, 2 సిక్స్లు సహా 22 పరుగులు సాధించి జట్టుకు ఫర్వాలేదనిపించే స్కోరు అందించాడు. తొలుత సూర్య... ముగింపులో కృనాల్ ఊహించిన దాని కంటే తక్కువ పరుగులు చేశామని భావించాడో ఏమో పంజాబ్ బౌలింగ్ దాడిని కెప్టెన్ అశ్వినే ప్రారంభించాడు. దీనికి తగ్గట్లే అతడు బ్యాట్స్మెన్ను నిరోధించాడు. అయితే అంకిత్ రాజ్పుత్ను లక్ష్యంగా చేసుకుని సూర్యకుమార్ మూడు సిక్స్లు బాదాడు. 34 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. మిగతా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో ముంబై ఛేదన నత్తనడకన సాగింది. సూర్యతో పాటు ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 25; 3 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక సమయంలో వెనుదిరిగారు. రోహిత్, కృనాల్లు స్టొయినిస్, ముజీబ్ల ఓవర్లలో భారీగా పరుగులు సాధించి మ్యాచ్ను లాగేసుకున్నారు. టై బౌలింగ్లో ఫోర్, సిక్స్తో కృనాల్ లక్ష్యాన్ని మరింత కరిగించాడు. రెండు ప్లే ఆఫ్లు ఈడెన్లో కోల్కతా: ఐపీఎల్–11లో రెండు మ్యాచ్ల వేదిక మారింది. ఈ నెల 23, 25 తేదీల్లో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లను పుణే నుంచి కోల్కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్కు తరలిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. కావేరి జల వివాదం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లకు పుణే ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్, క్వాలిఫయర్లను కోల్కతాకు తరలించారు. మే 22న మొదటి క్వాలిఫయర్, 27న ఫైనల్లకు ముంబైలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. -
అదంతా విధి రాత : క్రిస్ గేల్
మొహాలీ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఆడాలని రాసిపెట్టుండటంతోనే చివర్లో ఆ జట్టు తనను తీసుకుందని విధ్వంసకర బ్యాట్స్మన్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గేల్ పలు ఆసక్తికరవిషయాలను పంచుకున్నాడు. గేల్ నిరూపంచుకున్నాడనే వ్యాఖ్యలను ఈ విండీస్ క్రికెటర్ తప్పుబట్టాడు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన రికార్డులే తనేంటో తెలియజేస్తాయన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో చివరి రౌండ్లో ఎంపికయ్యాని, తనపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదని తెలిసిన తరువాత కూడా తానేమి బాధపడలేదన్నాడు. జీవితమంటే ఒక క్రికెట్ మాత్రమే కాదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఒక కొత్త ఫ్రాంచైజీకి ఎంపికవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకంతో కొనగోలు చేసిన జట్టకు సేవలందించడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని తెలిపాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా, ఆ జట్టు గెలవాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. మిగతా ఫ్రాంచైజీలు వేలంలో ఆసక్తి కనబర్చకపోవడంపై స్పందిస్తూ, తానేమీ తప్పుగా ప్రవర్తించలేదని, ప్రతి మ్యాచ్ లోనూ రాణించడం ఎవరి వల్లా కాదని, కెరీర్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమేనని గేల్ అభిప్రాయపడ్డాడు. 38 ఏళ్ల వయసులో ఫిట్నెస్ గురించి స్పందిస్తూ.. ‘‘ నా శరీరాకృతి మారకుండా కొనసాగిస్తున్నాను. నేను స్ప్రింగ్ చికెన్లా ఉండనని నాకు తెలుసు. కానీ శరీరాకృతి కోసం ఎలాంటి కసరత్తులు చేయను. నాది సహజసిద్దమైన శరీరాకృతి. 38 ఏళ్ల వయసులో కూడా నా శరీర ఆకృతి బానే ఉంది’’ అని తెలిపాడు. ఆ రెండే నా లక్ష్యం.. ‘‘ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్, 2019 ప్రపంచకప్ గెలవడమే నా లక్ష్యం. ప్రపంచకప్ గెలిచే అవకాశం వెస్టిండీస్కు ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నా. మా జట్టు క్వాలిఫైయర్స్లో ఇబ్బంది పడ్డ విషయం నాకు తెలుసు. కానీ మేం టైటిల్ సాధించేలా సిద్దమయ్యాం. ప్రస్తుతం ఖచ్చితంగా ఐపీఎల్ టైటిల్ గెలువాలి. కింగ్స్ పంజాబ్ ఇప్పటివరకు గెలవలేదు. మా యజమాని ప్రితీజింతా అద్భుతం. ఆమె ఆటగాళ్లికిచ్చె మద్దతు అత్యద్భుతం. ఈ ఏడాది టైటిల్ను ఆమె అందుకోవడం ఎంతో అవసరమని నేను భావిస్తున్నా.’’ అని చెప్పాడు. ఇక గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినప్పటికీ, 252 పరుగులు చేసి, పొట్టి క్రికెట్ లో తానెంత ముఖ్యమో నిరుపించుకున్నాడు. తనను వదిలేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు, తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని మిగతా ఫ్రాంచైజీలకు తన విధ్వంసక బ్యాటింగ్తో సమాధానం చెబుతున్న విషయం తెలిసిందే. ఇక గేల్ ఆడిన మ్యాచ్ ఓ శతకం, రెండు అర్థ సెంచరీలు సాధించి పంజాబ్కు సునాయస విజయాలందించాడు. -
'సన్'చలనం: అశ్విన్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: చెత్త ఫీల్డింగ్ కొంపముంచిందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ... తమ బ్యాట్స్మన్లు అనవసర రిస్క్ షాట్లకు ప్రయత్నించి ఓటమిని కొనితెచ్చుకున్నారని మండిపడ్డాడు. బౌలర్ల కారణంగానే సన్రైజర్స్ గెలిచిందన్నాడు. ‘చెత్త బ్యాటింగ్, సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా మేము ఓడిపోయాం. మిడిల్ ఆర్డర్లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అతీగా ఎదురుదాడికి పోయి కొన్ని వికెట్లు చేజార్చుకున్నాం. మా జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నప్పటికీ ఈరోజు రాణించలేకపోయారు. అయితే సరైన సమయంలో రాణిస్తారన్న నమ్మకం మాకుంది. మా టీమ్లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అస్సలు బాలేదు 20 ఓవర్లలో మ్యాచ్లో ఎక్కువ క్యాచ్లు వదలేయడంతో చివరికి మూల్యం చెల్లించుకున్నాం. ఈ క్యాచ్లు పట్టివుంటే 20 నుంచి 30 పరుగులు తక్కువగా ఇచ్చేవాళ్లం. తర్వాత మ్యాచ్లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడతామ’ని అశ్విన్ చెప్పాడు. తమ బౌలర్ అంకిత్ రాజ్పుత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. అంకిత్ రాజ్పుత్ 14 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే తమ జట్టు ఓడిపోయినప్పటికీ అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. -
సన్"రైజ్" బౌలింగ్
-
ఢిల్లీ వల్ల కాలేదు
ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ ఓడింది. ముజీబ్ వేసిన ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఢిల్లీ 12 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన స్థితిలో శ్రేయస్ అయ్యర్ను ఔట్ చేసి ముజీబ్ తమ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు ఐదో పరాజయం... సోమవారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న ప్లంకెట్ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం ఢిల్లీ డేర్డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించినా అప్పటికే ఆలస్యమైపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంకిత్ రాజ్పుత్, ముజీబ్, ఆండ్రూ టై తలా 2 వికెట్లు పడగొట్టారు. ప్లంకెట్ జోరు: వరుసగా మూడు మ్యాచ్లలో జట్టును గెలిపించిన క్రిస్ గేల్ గాయంతో దూరం కావడంతో పంజాబ్ ఓపెనింగ్ జోడి మారింది. ఈ సీజన్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అవేశ్ ఖాన్ 149 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని ఆడలేక ఫించ్ (2) వెనుదిరగడంతో ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడారు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. పేసర్ ప్లంకెట్ తన వరుస ఓవర్లలో రాహుల్, మయాంక్లను ఔట్ చేయడంతో పంజాబ్ కష్టాలు పెరిగాయి. యువరాజ్ సింగ్ (17 బంతుల్లో 14; 1 ఫోర్) వైఫల్యం ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. అయితే మరో ఎండ్లో మెరుగ్గా ఆడుతున్న నాయర్ ఆటను ప్లంకెట్ ముగించగా... మరుసటి ఓవర్లోనే ప్లంకెట్ చక్కటి క్యాచ్కు మిల్లర్ (19 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. తొలి 10 ఓవర్లలో 68 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్... తర్వాతి 10 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ప్లేను మినహాయిస్తే మిగిలిన 14 ఓవర్లలో ఆ జట్టు కేవలం 5 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే కొట్టడం పరిస్థితిని సూచిస్తోంది. అయ్యర్ మినహా: ఐపీఎల్లో తొలిసారి ఆడే అవకాశం దక్కించుకున్న భారత అండర్–19 కెప్టెన్ పృథ్వీ షా (10 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నంత సేపు చక్కటి షాట్లు ఆడాడు. అయితే శరణ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత అదే జోరులో రాజ్పుత్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (12), గంభీర్ (4)లను ఔట్ చేసి పంజాబ్ పట్టు బిగించే ప్రయత్నం చేసింది. ముజీబ్ తన తొలి బంతికే పంత్ (4)ను క్లీన్ బౌల్డ్ చేయగా, రెండో పరుగు కోసం ప్రయత్నించి క్రిస్టియాన్ (6) రనౌట్ కావడంతో ఢిల్లీ పరిస్థితి దిగజారింది. -
పొట్టి ఫార్మాట్లో అతడితో డేంజరే!: యువీ
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్ క్రికెట్ టీ20ల్లో తన సహచరుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యంత ప్రమాదకారి అని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడని, అతడు రాణించడంతో ఐపీఎల్ 11 సీజన్లో పంజాబ్ విజయాల బాట పట్టిందన్నాడు. తొలుత ప్లే ఆఫ్స్కు వెళ్లాలని చూస్తున్నాం, ఒకవేళ ఫ్లే ఆఫ్స్ చేరితే కప్పు నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని యువరాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పటిష్ట జట్లు అని ఆ జట్టకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు యువీ. రిటైర్మెంట్పై నోరు విప్పిన యువీ 2019 ప్రపంచ కప్ తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటిస్తానని యువరాజ్ తెలిపాడు. గతేడాది వెస్టిండీస్తో జరిగిన వన్డేలో యువీ చివరగా భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇంగ్లండ్, వేల్స్లో 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకూ కెరీర్ కొనసాగించనున్నట్లు వెల్లడించాడు. ప్రతి క్రికెటర్కు ఇలాంటి సమయం కచ్చితంగా వస్తుందని, నిర్ణయం తీసుకోక తప్పదన్నాడు. '2000లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించా. దాదాపు 17-18 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడుతూ క్రికెట్ను ఆస్వాదించాను. ఎన్నేళ్లు క్రికెట్ ఆడినా ఏదో ఓ రోజు రిటైర్ కావాల్సి ఉంటుంది. వచ్చే వన్డే ప్రపంచ కప్లో ఆడాలని భావిస్తున్నాను. అవకాశం వచ్చినా.. రాకున్నా అప్పటివరకూ దేశవాలీ క్రికెట్ ఆడతాను. 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని' యువీ వివరించాడు. కాగా, టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ యువీకి 2015 వరల్డ్ కప్లో ఆడే అవకాశం దక్కలేదు. 90.50 బ్యాటింగ్ సగటుతో ఆ మెగా టోర్నీలో 362 పరుగులు చేసిన యువీ 15 వికెట్లు తీసి ఆల్ రౌండ్ నైపుణ్యంతో రాణించాడు. మ్యాన్ ఆఫ్ టోర్నీ అందుకున్నాడు. కానీ, క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువీ పూర్వపు ఫామ్తో కెరీర్ కొనసాగడం లేదు. -
ఈసారి పంజా(బ్) కోల్కతాపై...
కరీబియన్ గేల్ భీకర ఫామ్లో ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నబోతుంది. అతడి హిట్టింగ్కు కేఎల్ రాహుల్ కళాత్మక షాట్లు తోడైతే ఇక అడ్డేముంది. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్లో ఇదే జరిగింది. ఛేదన ఇంత సులువా అన్నట్లు సాగిన వీరిద్దరి భాగస్వామ్యం ముంగిట పైచేయి సాధించడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకపోయింది. కోల్కతా: క్రిస్ గేల్ పంజాబ్కు జాంపండులా దొరికినట్లున్నాడు. పెద్దగా ఆశల్లేకుండానే ఈ సీజన్ బరిలోకి దిగిన జట్టును తన ఆటతో ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాడు. అతడికి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా తోడవడంతో శనివారం కోల్కతాను దాని సొంతగడ్డపైనే పంజాబ్ 9 వికెట్లతో అలవోకగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నైట్రైడర్స్... ఓపెనర్ క్రిస్ లిన్ (41 బంతుల్లో 74; 6 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు), రాబిన్ ఉతప్ప (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు గేల్ (38 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (27 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. 8.2 ఓవర్లలో కింగ్స్ ఎలెవెన్ స్కోరు 96/0 వద్ద వర్షం అంతరాయం కలిగించింది. గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని సవరించి 13 ఓవర్లలో 125గా నిర్ణయించారు. దాంతో పంజాబ్ విజయానికి 28 బంతుల్లో 29 పరుగులు అవసరమయ్యాయి. దీనిని ఆ జట్టు రాహుల్ వికెట్ కోల్పోయి 11.1వ ఓవర్లోనే అందుకుంది. పంజాబ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆ ముగ్గురి మెరుపులతో... మెరుపు షాట్లు కొట్టే నరైన్ (1) తొందరగానే నిష్క్రమించడంతో కోల్కతాకు శుభారంభం దక్కలేదు. అయితే, లిన్, ఉతప్ప దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. రెండో వికెట్కు 40 బంతుల్లోనే 72 పరుగులు జోడించారు. శరణ్ వేసిన 8వ ఓవర్లో విరుచుకుపడి 23 పరుగులు సాధించారు. అశ్విన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఉతప్ప, మరుసటి ఓవర్లోనే సమ్వనయ లోపంతో నితీశ్ రాణా (3) రనౌట్ కావడంతో రెండు ఓవర్ల పాటు స్కోరు మందగించింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ వస్తూనే బ్యాట్ ఝళిపించాడు. లిన్ కూడా తగ్గక పోవడంతో 34 బంతుల్లోనే 62 పరుగులు వచ్చాయి. వీరి జోరు చూస్తే స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ, లిన్, రస్సెల్ (10) వెంటవెంటనే అవుట్ కావడం, కార్తీక్ కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది. పంజాబ్ బౌలర్లు చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చారు. శుభ్మన్ గిల్ (8 బంతుల్లో 14 నాటౌట్) దూకుడు చూపలేకపోవడంతో స్కోరు 191కే పరిమితమైంది. ఈ ఇద్దరి జోరుతో... లక్ష్యం భారీగా ఉన్నా పంజాబ్ ఓపెనర్లు గేల్, రాహుల్ బెదరకుండా ఆడారు. కోల్కతా తమ తురుపుముక్క నరైన్ను కాకుండా శివమ్ మావి, రస్సెల్తో ప్రారంభ ఓవర్లు వేయించడంతో వీరికి ఇబ్బంది ఎదురవలేదు. ఇద్దరిలో రాహులే స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. మావి వేసిన కొన్ని బంతులను ఆడలేకున్నా, రాణా బౌలింగ్లో రెండు సిక్స్లు, ఫోర్తో గేల్ ప్రతాపం చూపాడు. నాలుగో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక సవరించిన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో గేల్ తొలి బంతినే స్టాండ్స్లోకి పంపి అర్ధ శతకం (28 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో సిక్స్తో ఫిఫ్టీ (24 బంతుల్లో) అందుకున్న రాహుల్ మరో రెండు ఫోర్లు కొట్టి అవుటయ్యాడు. కరన్ బంతిని సిక్స్ కొట్టిన గేల్ మరో 11 బంతులు ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. -
నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్
మొహాలి : క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్- 2018 లో మొదటి సెంచరీని గేల్ సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరిగిన మ్యాచ్లో గేల్ విధ్వంసం సృష్టించాడు. గేల్ 1 ఫోర్, 11 సిక్స్లతో 63బంతుల్లో 104 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్లో సెంచరీ అనంతరం తనదైన రీతిలో గేల్ బ్యాట్తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రోజు(శుక్రవారం) గేల్ కుమార్తె క్రిసాలినా పుట్టిన రోజు. నిన్న మ్యాచ్లో సాధించిన సెంచరీని గేల్ తన కుమార్తె క్రిసాలినాకు పుటినరోజు గిఫ్ట్గా ఇచ్చాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గేల్ను వరించింది. అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘నా సెంచరీని నా కుమార్తె క్రిసాలినాకు అంకితం ఇస్తున్నాను. శుక్రవారం(ఏఫ్రిల్ 20న) మా రెండో పాట పుట్టినరోజును జరుపుకుంటోంది. క్రిసాలినా ఇండియాకు రావడం రెండోసారి. పంజాబ్ టీమ్ హోమ్గ్రౌండ్లో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంద’ని గేల్ అన్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ 15 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించిన విషయం విదితమే. టి20లో గేల్ మొత్తం 21 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మెకల్లమ్, క్రింగర్, ల్యూక్ రైట్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు ఈ విండీస్ వీరుడు. -
సెహ్వాగ్ మాటను నిజం చేసిన గేల్..!
మొహాలీ: ఐపీఎల్-2018లో సంచలనాల నమోదుకు సమయం ఆసన్నమైంది. సిక్స్లు, పోర్ల వేడుకకు వేళయింది. పరుగుల పండగకు తెర లేచింది. సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం మొహాలిలో జరిగిన మ్యాచ్లో గేల్ తన అద్భుత సెంచరీతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. పటిష్టమైన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను చీల్చిచెండాడాడు. 63 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు. ఐపీఎల్ వేలంలో గేల్ కొనుగోలుపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించక పోవడంతో నామమాత్రపు ధరకు పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే 11 సిక్స్లు, ఒక ఫోర్తో గేల్ సాగించిన పరుగుల వరద తాను ఎంత విలువైన ఆటగాడినో అని మిగతా ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లయింది. గేల్ ధనాధన్ సిక్స్లతో ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియం చిన్నపాటి క్లబ్ గ్రౌండ్లా మారిపోయింది. నేనే రక్షించా.. సెహ్వాగ్ ట్వీట్ మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లోనూ రెచ్చిపోయిన గేల్ 33 బంతుల్లో 4 సిక్స్లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేసి పంజాబ్కు విజయాన్నందించాడు. ఐపీఎల్ వేలంలో చివరగా.. గేల్ను నామమాత్రపు ధరకు ప్రీతి జింటా సహ యజమానిగా గల పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన అనంతరం ఒక సందర్భంలో ఆ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ ‘గేల్ పంజాబ్కు రెండు విజయాలు అందించినా చాలు.. అతనిపై పెట్టిన పెట్టుబడికి న్యాయం జరిగినట్లే’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం ఎస్ఆర్హెచ్పై విజయానంతరం గేల్ను వెళ్లిపోకుండా చేసి ఐపీఎల్ను తానే రక్షించినట్లు సెహ్వాగ్ ఓ సరదా ట్వీట్ చేయగా.. అవునంటూ గేల్ బదులిచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగుల రికార్డూ గేల్ పేరునే ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున బరిలోకి దిగిన గేల్ పూణె వారియర్స్పై జరిగిన మ్యాచ్లో 175 పరుగుల సునామీని సృష్టించాడు. I saved the IPL by picking - @henrygayle 🤣🤣. — Virender Sehwag (@virendersehwag) 19 April 2018 Yes! https://t.co/avqfCTHfEY — Chris Gayle (@henrygayle) 19 April 2018 -
అభిమానికి సెహ్వాగ్ పాదాభివందనం
చండీఘడ్ : ఇంత వరకు అభిమానులు వారి అభిమాన తారల, క్రీడాకారుల కాళ్లకు దండం పెట్టడం చూశాం. కానీ మన వీర బాదుడు వీరేంద్రుడు మాత్రం అందుకు భిన్నంగా తన అభిమాని పాదాలకు వందనం చేశాడు. 93 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే తాత సెహ్వాగ్కు వీరాభిమాని. పటియాలకు చెందిన ఆయన మంగళవారం చండీఘడ్లో తన అభిమాన క్రికెటర్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఓం ప్రకాశ్ కాళ్లు మొక్కి ఆయన దీవెనలు పొందారు సెహ్వాగ్. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో ఫోస్ట్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సెహ్వాగ్ కూడా తన 93 ఏళ్ల సీనియర్ అభిమానితో దిగిన సెల్ఫీని ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘దాదా కో ప్రణామ్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Felt extremely touched on meeting Om Prakash ji, who is 93 years old and came from Patiala to meet me in Chandigarh and expressed his love for me. Dada ko Pranam. pic.twitter.com/8AHHqNl753 — Virender Sehwag (@virendersehwag) 17 April 2018 It was a special moment for @virendersehwag as he met Mr. Om Prakash, one of his oldest fans at 93 years old. Both had a big smile on their faces all along 😄#LivePunjabiPlayPunjabi #KXIP #KingsXIPunjab #VIVOIPL pic.twitter.com/rsPjqdxPKq — Kings XI Punjab (@lionsdenkxip) 18 April 2018 -
గేల్ సునామీ జాగ్రత్త.. సన్రైజర్స్
మొహాలీ : రాక రాక వచ్చిన అవకాశం అనుకున్నాడో ఏమో కానీ తన విశ్వరూపాన్నీ చూపించాడు.. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జి‘గేల్’మన్నాడు. ప్రతి బంతిని బౌండరికి తరలించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో పంజాబ్ బలమైన చెన్నై జట్టుపై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో మూడు మ్యాచ్లాడిన పంజాబ్ బెంగళూరు చేతిలో ఓడి ఢిల్లీ, చెన్నైలపై గెలిచింది. అయితే తదుపరి మ్యాచ్ లీగ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్తో ఏప్రిల్19న (గురువారం) తలపడనుంది. సొంతమైదానంలో మ్యాచ్ జరగడం పంజాబ్ కలిసొచ్చె అంశం కాగా.. విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఫామ్లోకి రావడం ఆజట్టుకు మరింత బలాన్నిచ్చింది. ఈనేపథ్యంలో సన్రైజర్స్ జట్టుకు పంజాబ్ తమ అధికార ట్విటర్ వేదికగా సవాల్ విసిరింది. ‘సన్రైజర్స్ హైదరాబాద్ గేల్సునామీ జాగ్రత్త..’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై హైదరాబాద్ అభిమానులు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘సన్రైజర్స్లో వరల్డ్క్లాస్ బౌలర్స్ రషీద్ఖాన్, భువనేశ్వర్లున్నారు.. వారితో జాగ్రత్త..’ పంజాబ్ అంటూ ఒకరు బుదులివ్వగా.. హాహాహా.. పెద్ద జోక్ అంటూ తేలికగా మరొకరు కొట్టిపారేశారు. గేల్కు సన్రైజర్స్తో అంత సీన్లేదని, డకౌట్ పక్కా అని ఇంకొకరు కామెంట్ చేశారు. Sunrisers Hyderabad, beware of the Gaylestorm 😎#LivePunjabiPlayPunjabi #KXIPvCSK pic.twitter.com/AKlnR9yu8Q — Kings XI Punjab (@lionsdenkxip) 15 April 2018 There is world class bowlers rashid Khan and bhuvaneswar beware of them — Srikanth318 (@Srikanth3184) 15 April 2018 -
సొంతగడ్డపై పంజాబ్కు మరో గెలుపు
-
‘బెంగ’ళూరుకు గేల్ బెంగ!
-
‘బెంగ’ళూరుకు గేల్ గుబులు!
సాక్షి, బెంగళూరు : పొట్టి ఫార్మాట్ టీ20 పేరు చెబితే గుర్తుకొచ్చే క్రికెటర్లలో వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ఒకరు. అయితే ఐపీఎల్ 11 సీజన్లో మాత్రం అతడికి చేదు అనుభవం ఎదురైంది. రెండుసార్లు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన గేల్ను చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకుంది. అయినా ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో అతడికి అవకాశం ఇవ్వలేదు. కానీ నేడు (శుక్రవారం) తమతో జరిగే మ్యాచ్లో పంజాబ్ తమ ఆయుధంగా గేల్ను తీసుకొస్తుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో గుబులు మొదలైంది. గేల్ రూపంలో ప్రమాదం వస్తే రెండో మ్యాచ్లోనూ ఓటమి దూరం అవుతుందా అన్న అనుమానం బెంగళూరుకు లేకపోలేదు. అసలే తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసిన బెంగళూరు రెండో మ్యాచ్లో పంజాబ్పై నెగ్గి విజయాల ఖాతా తెరవాలని భావిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నేటి మ్యాచ్లో గేల్ ఆడే అవకాశాలున్నాయని, అతడిని కట్టడి చేసేందుకు కోహ్లీ సేన వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితులు గేల్కు బాగా తెలుసు. 2011 నుంచి బెంగళూరుకు ఆడిన గేల్ను ఈ సీజన్లో ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. అయితే 2013 సీజన్లో గేల్ ఇక్కడి మైదానంలో వ్యక్తిగత అత్యధిక పరుగులు (175) సాధించాడు. క్రిస్ గేల్ను పంజాబ్ ఈ మ్యాచ్లోనూ తీసుకోదని బెంగళూరు కోచ్ డానియల్ వెటోరి అభిప్రాయపడ్డాడు. అయితే చిన్నస్వామి స్టేడియంలో గేల్ నిరూపించుకోవాల్సిందేమీ లేదన్నాడు. ఒకవేళ గేల్ను పంజాబ్ ఆడించినా.. అతడిని కట్టడి చేసేందుకు తమ వద్ద గేమ్ ప్లాన్ ఉందన్నాడు వెటోరి. దీంతో పంజాబ్ జట్టు ఆడిస్తుందో.. లేదో తెలియని గేల్ విషయంలో బెంగళూరు ఆందోళన చెందుతుందనడంలో ఈ విధ్వంసక ఆటగాడి పేరు ప్రస్తావించడమే నిదర్శనంగా భావించవచ్చు. వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిందని, అందుకే క్రిస్ గేల్ను బెంగళూరు యాజమాన్యం తీసుకోలేదని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో బెంగళూరుకు 85 మ్యాచ్లాడిన క్రిస్ గేల్ 3000కు పైగా పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 151.20 గా ఉంది. -
ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా..
సాక్షి, స్పోర్ట్స్ (మొహాలీ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఐపీఎల్లో ఆడుతున్న తొలి క్రికెటర్గా రహ్మాన్ నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు రహ్మాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ ఆఫ్బ్రేక్ బౌలర్ అఫ్గానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరఫున అతిపిన్న వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడన్న విషయం తెలిసిందే. అతి తక్కువ వయసులో ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్గానూ ముజీబ్ ఉర్ రహ్మాన్ రికార్డు నమోదుచేశాడు. ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ తరఫున అరంగ్రేటం చేశాడు. 17 ఏళ్ల 11 రోజుల వయసులో తొలి ఐపీఎల్ ఆడుతున్న బౌలర్ రహ్మాన్ .. బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ రికార్డును చెరిపేశాడు. ఇప్పటివరకూ 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. పిన్న వయసులో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన టాప్-5 ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రహ్మాన్ 17 ఏళ్ల 11 రోజులు సర్ఫరాజ్ ఖాన్ 17 ఏళ్ల 177 రోజులు ప్రదీప్ సంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజులు వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల 199 రోజులు రాహుల్ చహర్ 17 ఏళ్ల 247 రోజులు -
మ్యాచ్కు వెళుతూ కింగ్స్ పంజాబ్ ఇలా.. వైరల్
మొహాలీ: జట్టు పేరుకు తగ్గట్టే స్థానిక సంస్కృతుల్ని ప్రదర్శించడంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ యాజమాన్యం మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సొంత గడ్డపై తొలి మ్యాచ్ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం సాయంత్రం కింగ్స్ పంజాబ్-ఢిల్లీ డేర్డెవిల్స జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ఆడేందుకుగానూ హోటల్ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్కు అనుగుణంగా స్టెప్స్ వేశారు. తొలుత యువరాజ్, ఆ తర్వాత మిల్లర్, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఈ ‘బల్లే బల్లే’ వీడియోలను కింగ్స్ అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. -
డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఆటగాళ్లు
-
ఐపీఎల్ 11 విజేత ఎవరంటే..!
ముంబై: ఇంకా ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం అవకముందే విజేత ఎవరో ఎలా తెలుస్తుందంటారా.. ప్రతి టోర్నీ, ఈవెంట్ల ప్రారంభంలో జట్ల బలబలాలు, విజయావకాశాలపై కొన్ని అంచనాలు ఉండటం సహజం. ఈ క్రమంలో ఈ సీజన్లో విజేత అయ్యేందుకు జట్లకు ఉన్న అవకాశాలపై ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్స్టోన్ లోబో జోస్యం చెప్పాడు. 1981లో పుట్టిన కెప్టెన్లు గౌతం గంభీర్, ఎంఎస్ ధోనిలు మరోసారి ట్రోఫీ నెగ్గే అవకాశం లేదన్నాడు. అంటే ఢిల్లీ డేర్డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నెగ్గవని చెప్పినట్లు. అనుభవం ఉన్న కెప్టెన్లను ఈ సీజన్లో దూరం చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ట్రోఫీ నెగ్గేలా కనిపించడం లేదు. గ్రీన్స్టోన్ లోబో లెక్క ప్రకారం ఐపీఎల్ 11 రేసులో ఇక మిగిలిన నాలుగు జట్లు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్. ఈ నాలుగు జట్ల పోటీ ఎక్కువగా ఉన్నా ఇందులో రెండు జట్లను మాత్రం అదృష్టం వరిస్తుందన్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలో వరుసగా రెండోసారి ముంబై ట్రోఫీ నెగ్గదని, గంభీర్ స్థానంలో కోల్కతా కెప్టెన్గా వచ్చిన దినేశ్ కార్తీక్ వీక్ కెప్టెన్గా కనిపించడం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక రేసులో మిగిలింది పంజాబ్, బెంగళూరు జట్లు. జ్యోతిష్యం ప్రకారం చూసినా, అనుభవం పరంగా, ఆటపట్ల అంకిత భావం చూసినా విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వీరి ఆటకు గ్రహబలం తోడవుతుందని.. దీంతో బెంగళూరు లేక పంజాబ్ జట్లలో ఓ జట్లు ఐపీఎల్ 11వ సీజన్ను కైవసం చేసుకుంటుందని జ్యోతిష్కుడు గ్రీన్స్టోన్ లోబో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నాడు. అయితే విజేతగా నిలిచి ఏ జట్టు ట్రోఫీ నెగ్గుతుందో తెలియాలంటే 27 మే వరకు వేచిచూడాల్సిందే. గ్రీన్స్టోన్ లోబో (ఫైల్ ఫొటో) -
అశ్విన్ ‘బల్లే బల్లే’ చేయిస్తాడా!
గేల్, ఫించ్, మిల్లర్, యువరాజ్, లోకేశ్ రాహుల్... బ్యాటింగ్ భారాన్ని మోసేందుకు ఈ స్టార్లు సరిపోతారా? అశ్విన్, అక్షర్, ఆండ్రూ టై బౌలింగ్తో ప్రత్యర్థిని నిలవరించగలరా? సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్ల మార్గనిర్దేశం జట్టును టైటిల్ దిశగా తీసుకుపోగలదా? ఐపీఎల్ పదేళ్ల ప్రస్థానంలో పడుతూ లేస్తూ సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. లీగ్లో ఇప్పటి వరకు ముద్దూ ముచ్చట్లకే పరిమితమైన ప్రీతి జింటా మోముపై సంతోషం విరబూయాలంటే స్టార్లంతా చెలరేగాల్సిందే. సాక్షి క్రీడా విభాగం: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్లాగే పక్కనే ఉన్న మరో ఉత్తరాది జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ది కూడా దాదాపు అదే పరిస్థితి. యువరాజ్ సింగ్ నాయకత్వంలో తొలి ఐపీఎల్లో సెమీస్ చేరిన ఆ జట్టు బెయిలీ కెప్టెన్సీలో 2014లో అత్యుత్తమంగా ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఆ తర్వాత రెండేళ్లు చివరి స్థానానికే పరిమితమై గత ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో ఫలితం మారాలంటే జట్టు మారాల్సిందేనంటూ ఒక్క అక్షర్ పటేల్ మినహా అందరినీ వదిలేసింది. ఆ తర్వాత వేలంలో కొందరిని మళ్లీ తీసుకున్నా... మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ భాగం కొత్తవారు కనిపిస్తోంది పంజాబ్ టీమ్లోనే. అనుకూలం... కెప్టెన్గా గతంలో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా అశ్విన్ ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాడు. సౌతిండియా ‘తలైవా’గా ఇప్పటివరకు గుర్తింపు ఉన్న అతను, ‘పాజీ’గా ఇప్పుడు పంజాబీ అభిమానుల ఆశలను నిలబెట్టాల్సి ఉంది. అయితే గతంలో కెప్టెన్గా ఉండటంతో పాటు సీనియర్ అయిన యువరాజ్ సింగ్ సలహాలు, మెంటార్గా సెహ్వాగ్ వ్యూహాలు అశ్విన్ పనిని సులువు చేస్తాయి. గేల్, మిల్లర్, ఫించ్ రూపంలో భారీ హిట్టర్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. దేశవాళీలో పరుగుల వరద పారించిన మయాంక్ అగర్వాల్తో పాటు టీమిండియా రెగ్యులర్ ఆటగాడు రాహుల్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. ప్రతికూలం: యువరాజ్ మెరుపులు ప్రదర్శించి చాలా కాలమైంది. అతను ఎంత వరకు జట్టుకు ఉపయోగపడగలడో చెప్పలేం. స్వయంగా అశ్విన్ భారత పరిమిత ఓవర్ల జట్టుకు దూరమైపోయాడు. అతని బౌలింగ్లో పదును తగ్గిందనేది వాస్తవం. మిల్లర్ సీజన్లో ఒక మ్యాచ్ మినహా ప్రతీ సారి పంజాబ్ను ఇబ్బంది పెట్టినవాడే. ఫించ్కు ప్రత్యామ్నాయంగా గేల్ అందుబాటులో ఉన్నా... అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. జట్టు వివరాలు: అశ్విన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, మనోజ్ తివారి, మయాంక్, అంకిత్, శరణ్, మయాంక్ డగర్, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, మంజూర్ దార్, పర్దీప్, యువరాజ్, ఆకాశ్దీప్ నాథ్, రాహుల్ (భారత ఆటగాళ్లు), ఫించ్, మిల్లర్, టై, డ్వార్షుస్, జద్రాన్, గేల్, స్టొయినిస్ (విదేశీ ఆటగాళ్లు). -
అతనో వినూత్నమైన కెప్టెన్: నాయర్
సాక్షి, స్పోర్ట్స్ : ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్పై ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్ చాలా మంచి వ్యక్తి. వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్గా ఉన్న తనకు ఐపీఎల్లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో పంజాబ్ జట్టు.. కరుణ్ నాయర్తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్ను ఈ సీజన్లోని పంజాబ్ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
యువీ, గేల్.. చెరో రెండు విజయాలు చాలు!
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ ఇద్దరూ కలిసి చెరో రెండు మ్యాచ్లను గెలిపించినా ఫ్రాంచైజీకి న్యాయం చేసినట్టేనని ఆ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను రెండోసారి జరిగిన వేలంలోనూ ఏ ఫాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. వీరిని రూ.2 కోట్ల చొప్పున పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఓపెనర్గా యువీ సేవలు.. ‘దిగ్గజ ఆటగాళ్లు గేల్, యువరాజ్లు తక్కువ ధరకే మా సొంతం అయ్యారు. వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు. వాళ్లు చెరో రెండు మ్యాచ్లు గెలిపించినా.. వాళ్లపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసినట్టే’నని సెహ్వాగ్ అన్నారు. ‘ఓపెనర్గా యువీని కొన్ని మ్యాచుల్లో వినియోగించుకుంటాం. అయితే ఆరోన్ ఫించ్, మయాంక్ అగర్వాల్ తరహాలో క్రిస్ గేల్ ప్రారంభంలో ఆటలోకి దిగి ఎక్కువ సేపు వికెట్ కాపాడుకోలేడు. ఆరోన్ ఫించ్ వివాహం సందర్భంగా తొలి మ్యాచ్లో అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో గేల్ ఓపెనింగ్కు పంపిస్తాం. అయితే, అతను నిలకడ ఆడాల్సిన అవసరముంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించి నాణ్యమైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నామనీ.. వారంతా మంచి ప్రతిభతో ఆడితే ఈ సారి ఐపీఎల్ విజేతగా పంజాబ్ జట్టు నిలుస్తుందని ఈ మాజీ ఓపెనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే వాళ్ల ప్రదర్శన కీలకం.. గత సీజన్లలో పంజాబ్ జట్టులో భారత్ ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండేదనీ, కానీ ఈసారి రవించంద్రన్ అశ్విన్ నేతృత్వంలో యువ తరంగాలు.. అక్షర్ పటేల్, కరణ్ నాయర్, కేఎల్ రాహుల్, బరీందర్ శరన్, మోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్పుత్ ఉన్నారని సెహ్వాగ్ వెల్లడించారు.‘గత కొన్నేళ్లుగా వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ మినహా మిగతా భారత ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే భారత ఆటగాళ్ల ప్రదర్శన కీలకం. ఈ సారి మా తుది జట్టులో 4 నుంచి 5 మంది భారత ఆటగాళ్లుంటార’ని ఆయన తెలిపారు. జట్టుకు కెప్టెన్గా బౌలర్ ఉండడం అదనపు బలమని అన్నారు. అశ్విన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అతను జట్టును ముందుండి నడిపిస్తాడని ఆకాక్షించారు. చివరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు 10, 15 పరుగులు అవసరమైనప్పుడు బౌలర్ కెప్టెన్గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఎక్కువని జోస్యం చెప్పారు. -
నా వ్యూహాలను అంచనా వేయలేరు!
న్యూఢిల్లీ: ‘కెప్టెన్సీ నాకో కొత్త సవాల్. నాయకుడిగా తర్వాతి అడుగు ఎలా వేస్తానో మీరెవరూ ఊహించలేరు. ఓపెనర్లు మిడిలార్డర్లో ఆడొచ్చు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్కు దిగొచ్చు. అంచనాలకు అందకుండా వ్యూహాలు రూపొందిస్తా’ అని ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొత్త కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మంగళవారం జెర్సీ ఆవిష్కరణలో పంజాబ్ టీమ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి పాల్గొన్న అశ్విన్ మాట్లాడుతూ... ‘నేను సెహ్వాగ్, యువీల కెప్టెన్సీలో ఆడాను. వారి అనుభవం, సలహాలను ఉపయోగించుకోవడంలో వెనక్కి తగ్గను’ అని పేర్కొన్నాడు. భారత పరిమిత ఓవర్ల జట్టులో పునరాగమనానికి ఐపీఎల్ను వేదికగా భావించడం లేదని చెప్పాడు. -
ప్రీతి జింతా.. ‘పేరు’ సమస్య
న్యూఢిల్లీ : ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్’ ఫ్రాంచైజీ పేరు మారబోతుందా?. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 10 సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడానికి జట్టు పేరే కారణమని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సహ యజమాని ప్రీతి జింతా ఫ్రాంచైజీ పేరు మార్పుకు బీసీసీఐను అభ్యర్థించినట్లు తెలిసింది. అమెరికాలో ఏటా జరిగే ఎన్బీఏ, బేస్బాల్ లీగ్లను ఇందుకు ఆమె ఉదాహరణగా పేర్కొన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఎన్బీఏ, బేస్బాల్ లీగ్లలో సీజన్ సీజన్కు పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరును మార్చేందుకు అవకాశం ఇవ్వాలని ప్రీతీ కోరినట్లు వెల్లడించారు. అయితే, ఫ్రాంచైజీ పేరు మార్పుపై బీసీసీఐ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వనట్లు సమాచారం. కాగా, ఈ సీజన్లో పలువురు స్టార్ ఆటగాళ్లను పంజాబ్ జట్టు వేలంలో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో కేఎల్ రాహుల్(రూ.11 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6 కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు), క్రిస్గేల్ (రూ.2 కోట్లు) పంజాబ్ కొనుగోలు చేసింది. మరి స్టార్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీ పేరు మార్పు పంజాబ్ దశను తిప్పుతాయేమో వేచి చూద్దాం. -
సెహ్వాగ్ పరువు తీసిన 'లంబూ'!
మొహాలీ: గతంలో టీమిండియా పేస్ దళాన్ని నడిపించిన బౌలర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకుని మేనేజ్మెంట్ తప్పిదం చేసింది. ఎందుకంటే ఏ జట్టు అతడిపై నమ్మకం ఉంచలేదు. వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని తీసుకుంది. పంజాబ్ టీమ్ మెంటర్, డైరెక్టర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒత్తిడి తేవడంతోనే ఇషాంత్కు చాన్స్ వచ్చింది. లేనిపక్షంలో ఐపీఎల్-10 సీజన్లో ఇషాంత్ (టీమిండియా క్రికెటర్లు పిలిచేపేరు 'లంబూ')ను చూసేవాళ్లం కాదు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ లాంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ పంజాబ్ పేస్ ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్ శర్మను సెహ్వాగ్ జట్టులోకి తీసుకున్నాడు. ఇషాంత్ను ఎవరైనా కొంటారా అంటూ చిరకాల మిత్రుడు గంభీర్ కామెంట్ చేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇషాంత్ను వెనకేసుకొచ్చాడు. అయితే సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన బౌలర్లలో ఇషాంత్ ముందు వరసలో ఉంటాడు. సెహ్వాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీశాడు. ఒక్క మ్యాచ్లోనూ రాణించకపోగా.. వరుస మ్యాచ్ల్లో విఫలమవుతూ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్లో అత్యధిక బంతులు (108) వేసి ఒక్క వికెట్ తీయలేని బౌలర్గా అపవాదు మూటకట్టుకున్నాడు. తానాడిన 6 మ్యాచ్లలో 18 ఓవర్లు వేసిన ఇషాంత్ ఒక్క వికెట్ పడగొట్టలేదు. కనీసం ఒక రనౌట్లోనైనా భాగస్వామి కాలేదు, కనీసం ఒక్క క్యాచైనా పట్టి ఒక బ్యాట్స్మెన్ ఔట్ కావడంలోనూ అతడు పాలుపంచుకోలేదు. ప్రస్తుత సీజన్లో తమ చివరి మ్యాచ్లో పుణే చేతిలో దారుణ ఓటమితో ఆ జట్టు కథ ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్ కథ ముగిశాక ఇషాంత్ బౌలింగ్పై సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వారివల్లే ఓడాం: సెహ్వాగ్
పుణె: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లపై ఆజట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్, ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని విమర్శించాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్ ఆటతీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి పిచ్లపైనైనా ఆడగల సత్తా ఉండాలి. పిచ్ మందకొడిగా ఉందని చెప్పడం సమంజసం కాదు. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? జట్టులో ప్రధాన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన మాక్స్వెల్, షాన్ మార్ష్, మోర్గాన్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. వారి ఆటతీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పరిస్థితులకు అనుగుణంగా 10-12 ఓవర్లు ఆడి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత మార్ష్ది. కెప్టెన్గా మాక్స్వెల్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్లో రాణించిన ఆమ్లా జట్టుకు దూరం కావడంతో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. -
చిత్తయిన రాజులు
-
చిత్తయిన రాజులు
►పుణే అలవోకగా ప్లే–ఆఫ్కు... ►చిత్తుగా ఓడిన పంజాబ్ ►సమష్టిగా రాణించిన పుణే బౌలర్లు పుణే: హోరాహోరి తప్పదనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. తుదికంటా పోరాడాల్సిన మ్యాచ్లో పంజాబ్ అరంభం నుంచే తడబడింది. కనీస బాధ్యతే లేకుండా బ్యాట్లేత్తేసింది. దీంతో రైజింగ్ పుణే చెమటోడ్చకుండానే ప్లే–ఆఫ్ చేరింది. ఆదివారం జరిగిన పోరులో బౌలర్లు సమష్టిగా రాణించడంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగుల వద్ద ఆలౌటైంది. అక్షర్ పటేల్ (22)దే అత్యధిక స్కోరు. శార్దుల్ ఠాకూర్ 3, ఉనాద్కట్, జంపా, క్రిస్టియాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత పుణే 12 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. రహానే (34 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (20 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉనాద్కట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 73 పరుగులకే ఆలౌట్ టాస్ నెగ్గిన పుణే సారథి స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బౌలర్లు తమ బౌలర్ నిర్ణయం సరైందని తొలి బంతినుంచే నిరూపించారు. వృద్ధిమాన్ సాహా (13)తో పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గప్టిల్ (0) ఉనాద్కట్ తొలిబంతికే డకౌట్ అయ్యాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ తలా ఒక దెబ్బతీయడంతో పవర్ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ (32/5) సగం వికెట్లను కోల్పోయింది. మార్‡్ష (10), మోర్గాన్ (4), రాహుల్ తెవాటియా (4), మ్యాక్స్వెల్ (0) ఇలా అందరూ ఆడేందుకు కాకుండా... వికెట్లు సమర్పించుకునేందుకే వరుస కట్టారు. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (22) కాస్త మెరుగనిపించినా... క్రిస్టియాన్ అతన్ని బోల్తాకొట్టించాడు. టెయిలెండర్లు మోహిత్ శర్మ (6), ఇషాంత్ శర్మ (1) జంపా ఔట్ చేయడంతో 73 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన రహానే సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడారు. తర్వాత స్పీడ్ పెంచిన త్రిపాఠి... ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, రాహుల్ తెవాటియా మరుసటి ఓవర్లో భారీ సిక్సర్తో అలరించాడు. ఇదే జోరులో అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీషాట్కు యత్నించి క్లీన్బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ స్మిత్ (18 బంతుల్లో 15 నాటౌట్), రహానేకు జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో 18 పాయింట్లు పొందిన పుణే రెండో స్థానంలో నిలిచింది. 16న ముంబైతో జరిగే తొలి క్వాలిఫయర్లో తలపడనుంది. అందులో ఓడిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశం రెండో క్వాలిఫయర్ రూపంలో సజీవంగా ఉంటుంది. -
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
-
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
ముంబై: ఐపీఎల్10లో భాగంగా వాంఖెడే మైదానంలో నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ అద్బుతంగా క్యాచ్ పట్టి ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాచ్ పట్టినతీరు చూస్తే ఆహా అనాల్సిందే. మ్యాక్స్వెల్ బౌలింగ్ లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడగా ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గప్టిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు. తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గప్టిల్ అది అసాధ్యమని.. ఆ తర్వాత క్షణాల్లో కేవలం ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆపై బౌండరీ లైన్ ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకోవడంపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ముంబై స్కోరు 106 పరుగుల వద్ద సిమ్మన్స్ (32 బంతుల్లో 59: 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. గప్టిల్ పట్టిన క్యాచ్కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్దులయ్యారు. ఈ క్యాచ్తో గప్టిల్కు ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ లభించింది. ఈ మ్యాచ్లో గప్టిల్ చిరుతలా మైదానంలో వేగంగా కదిలి మరో రెండు క్యాచులు పట్టి నితీశ్ రాణా, రోహిత్ శర్మలు ఔట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. మెరుగైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా ఉత్కంఠపోరులో ముంబైపై 7 పరుగుల తేడాతో పంజాబ్ నెగ్గిన విషయం తెలిసిందే. What a beautiful catch... Amazingly done by #Guptill — Abhinav Joshi (@ABHlNAV) 11 May 2017 Woah....! Martin Guptill superman catch✈✈ Catch of the season.😎#MIvKXIP pic.twitter.com/XQ3bByi51v — Sourav Rawat (@SouravRawat_17) 11 May 2017 -
పంజాబ్కు చావోరేవో
► నేడు ముంబైతో తలపడనున్న కింగ్స్ ►ఓడితే నాకౌట్ రేసు నుంచి పంజాబ్ ఔట్ ►ఇప్పటికే ప్లే ఆఫ్కు చేరిన ముంబై ముంబై: ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గురువారం ముంబై ఇండియన్స్జట్టుతో తలపడనుంది. చివరిమ్యాచ్లో కోల్కతాపై విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న పంజాబ్ అదేజోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో కంగుతున్న ముంబై తిరిగి విజయాల బాట పట్టాలని కృత నిశ్చయంతో ఉంది. పంజాబ్కు డూ ఆర్ డై... ప్లే ఆఫ్ బెర్త్ సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉంది. నిజానికి తాము ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లో పంజాబ్ రెండింటిలో అద్భుత విజయం సాధించింది. అది కూడా తీవ్ర ఒత్తిడిలో కావడం విశేషం. ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన పంజాబ్ ఆరు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో 12 పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం పంజాబ్లో ఆత్మవిశ్వాసం పెంచింది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్లో మెరుగ్గా రాణించిన పంజాబ్ కీలకమైన గెలుపును కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రాహుల్ తెవాటియా లాంటి ప్రతిభావంతమైన స్పిన్నర్ జట్టుకు లభించాడు. ఒకే ఓవర్లో కోల్కతా కెప్టెన్ గౌతం గంభీర్తోపాటు ఫామ్లో ఉన్న రాబిన్ ఉతప్పను పెవిలియన్కు పంపి పంజాబ్ను మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. మరోవైపు ఓ మాదిరి లక్ష్యాన్ని తమ బౌలర్లు కాపాడుకోవడం జట్టును అనందపరిచి ఉంటుంది. ఇక జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా సూపర్ ఫామ్లో ఉన్నాడు. 10 మ్యాచ్ల్లో 60 సగటుతో 420 పరుగులు చేశాడు. అయితే తను చాంపియన్స్ట్రోఫీ కోసం జట్టు నుంచి దూరమ య్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ (263 పరుగులు) కోల్కతాపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మనన్ వోహ్రా (229 పరుగులు), షాన్ మార్‡్ష (229) ఆకట్టుకుంటున్నారు. అక్షర్ పటేల్ (186), వృద్ధిమాన్ సాహా (128) సత్తా చాటాల్సి ఉంది. మార్టన్ గప్టిల్ తొలిమ్యాచ్లో ఆకట్టుకున్న మిగతా మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. వీలైనంత త్వరగా తను గాడిలో పడాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యా చ్ల్లో 16 వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్గా నిలి చాడు. అక్షర్ పటేల్ తన స్పిన్ మ్యాజిక్ను చూపించాల్సి ఉంది. కోల్కతాపై మోహిత్ శర్మ అదరగొట్టాడు. కీలకమైన వికెట్లు తీయడంతో అతనికే ఆ మ్యాచ్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇదే తీరులో తను రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన మ్యాట్ హెన్రీ ఫర్వాలేదనిపించాడు. ఇరుజట్ల మధ్య ఈ సీజన్లో ఓ మ్యాచ్ జరుగగా 8 వికెట్లతో ముంబై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో 199 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ లో నెగ్గి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు నాకౌట్ ఆశల ను సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్ జట్టు యోచిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోతే మిగతా మ్యాచ్లతో సంబంధం లేకుండా ముంబై, కోల్కతా, పుణే, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని విజయమే లక్ష్యంగా పంజాబ్ బరిలోకి దిగుతోంది. ముంబై దూకుడు... ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్లు అంచానాలకు మించి రాణించింది. ఈ సీజన్లో రైజింగ్ పుణే సూపర్జెయింట్తో జరిగిన తొలిమ్యాచ్లో ఓడిన తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించింది. మళ్లీ పుణే చేతిలోనే ముంబై ఓటమిపాలైంది. అనంతరం మరో మూడు మ్యాచ్ల్లో నెగ్గి హ్యాట్రిక్ సాధించింది. దీంతో 18 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. అయితే చివరిమ్యాచ్లో ముంబై జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ కళ్లెం వేసింది. ఓవరాల్గా 12 మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలు, మూడు పరాజయాలు నమోదు చేసింది. మొత్తం మీద 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే కుర్ర బ్యాట్స్మన్ నితీశ్ రాణా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన నితీశ్ 321 పరుగలు చేసి జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. కీరన్ పోలార్డ్ (299 పరుగులు), పార్థివ్ పటేల్ (287), జోస్ బట్లర్ (272 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సన్రైజర్స్తో మ్యాచ్లో రోహిత్ శర్మ రాణించాడు. సహచరులంతా విఫలమైన వేళ తను పోరాడడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. హార్దిక్, కృనాల్ పాండ్య సోదరులు తమ ఆల్రౌండ్ ప్రతిభను చాటుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే కివీస్ పేసర్ మిషెల్ మెక్లీనగన్ బంతితో రాణిస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసిన మిషెల్.. జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా (14 వికెట్లు), కృనాల్ (10), లసిత్ మలింగ (9)లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. హర్భజన్ (9) ఎక్కువగా వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రిస్తున్నాడు. మొత్తం మీద మిగతా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ సీజన్లో పంజాబ్ సాధించిన భారీ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. -
కోల్కతాపై కింగ్స్ ఎలెవన్ గెలుపు
-
పంజాబ్ రేసులోనే...
-
పంజాబ్ రేసులోనే...
∙ కోల్కతాపై కింగ్స్ ఎలెవన్ గెలుపు ∙ లిన్ పోరాటం వృథా ∙ రసవత్తరంగా ప్లే–ఆఫ్ రేస్ మొహాలి: ఐపీఎల్ లీగ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్కతా నైట్రైడర్స్ను ఓడించిన పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. కీలకమైన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ బౌలర్లు పంజా విసిరారు. లిన్ ధాటికి ఎదురొడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (25 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేయగల్గింది. క్రిస్ లిన్ ( 52 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. నరైన్, యూసుఫ్ పఠాన్ రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బౌలర్ మోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మ్యాక్స్వెల్... తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ 3 ఓవర్లదాకా చప్పగానే సాగింది. ఓపెనర్లు గప్టిల్ (12), మనన్ వోహ్రా (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) వేగం పెంచిన వెంటనే కోల్కతా బౌలర్లు పెవిలియన్ చేర్చారు. నరైన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వోహ్రా అదే జోరులో ఉమేశ్ యాదవ్ మరుసటి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాదాడు. కానీ అదే ఓవర్లో వోహ్రా, తర్వాతి నరైన్ ఓవర్లో గప్టిల్ ఔటయ్యారు. కాసేపటికి మార్‡్ష (11)ను వోక్స్ బౌల్డ్ చేశాడు. 56 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన దశలో వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్వెల్ మొదట జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. గ్రాండ్హోమ్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు. కుల్దీప్ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు బాదినప్పటికీ మరో షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రాహుల్ తేవటియా (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. లిన్ మళ్లీ ఫిఫ్టీ... కోల్కతా ఓపెనర్ క్రిస్ లిన్ తన సూపర్ ఫామ్ చాటాడు. నరైన్ (10 బంతుల్లో 18; 4 ఫోర్లు)తో కలిసి లిన్ కోల్కతా ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించాడు. వీళ్లిద్దరు సగటున ఓవర్కు 10 పరుగులు చేశారు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద నరైన్ను మోహిత్ శర్మ బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ సహకారంతో లిన్ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లాడిన లిన్కు ఇది మూడో అర్ధసెంచరీ కావడం విశేషం. అయితే పరుగు తేడాతో గంభీర్ (8), రాబిన్ ఉతప్ప (0) నిష్క్రమించారు. ఒకే ఓవర్లో రాహుల్ తెవటియా వీళ్లిద్దరిని పెవిలియన్కు పంపడం కోల్కతాను కోలుకోలేని దెబ్బతీసింది. తర్వాత క్రీజ్లోకి మనీశ్ పాండే (23 బంతుల్లో 18; 1 ఫోర్) అండతో లిన్ తన ధాటిని కొనసాగించాడు. కీలక తరుణంలో పాండేను హెన్రీ ఔట్ చేయగా, కీలకదశలో లిన్ రనౌట్ కావడంతో కోల్కతా విజయంపై ఆశలు వదులుకుంది. -
పంజాబ్ పుంజుకునేనా..?
►నేడు కోల్కతాతో తలపడనున్న కింగ్స్ ►ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా పంజాబ్ పోరాటం ►జోరుమీదున్న నైట్రైడర్స్ మొహాలీ: ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో పోరాడనుంది. నాకౌట్కు చేరాలంటే మిగతా మ్యాచ్లన్నీ తప్పక నెగ్గాల్సిన ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాక్స్వెల్సేన ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖారారు చేసుకున్న కోల్కతా.. ఈ మ్యాచ్లో విజయం సాధించి పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తోంది. పంజాబ్కు చావోరేవో.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్లను ఖారారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాల కోసం రైజింగ్ పుణే సూపర్జెయింట్, సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పుణే, హైదరాబాద్కు మంచి అవకాశాలుండగా.. పంజాబ్ పరిస్థితి మాత్రం చావోరేవోలాగా మారింది. ఓవరాల్గా ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన మ్యాక్స్వెల్సేన ఐదు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్కు చేరుకోవాలంటే పంజాబ్ మిగతా అన్ని మ్యాచ్ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఈక్రమంలో మంగళవారం కోల్కతాతో మ్యాచ్ పంజాబ్కు కీలకంగా మారింది. నిజానికి ఆదివారం గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించి ఉంటే మ్యాక్స్వెల్సేనకు నాకౌట్కు సులభంగా అర్హత సాధించడానికి అవకాశం ఉండేది. అయితే పేలవమైన ఫీల్డింగ్తోపాటు పసలేని బౌలింగ్తో ఆ మ్యాచ్లో పంజాబ్ పరాజయం పాలైంది. అంతకుముందు బ్యాటింగ్లో హషీమ్ ఆమ్లా సొగసైన సెంచరీతో ఆకట్టుకున్నా అది వృథాగా మారింది. ఈ సీజన్లో ఆమ్లాకిది రెండోసెంచరీ కావడం విశేషం. అతనితోపాటు షాన్మార్‡్ష, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ సత్తచాటడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. అయితే బౌలర్ల వైఫల్యంతో సదరు మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా పది మ్యాచ్లాడిన ఆమ్లా 60 సగటుతో 420 పరుగులు చేశాడు. వీటిలో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్పై చేసిన రెండు సెంచరీలు ఉన్నాయి. మ్యాక్స్వెల్ (219 పరుగులు) స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. షాన్ మార్‡్ష అకట్టుకుంటున్నాడు. మనన్ వోహ్రా, అక్షర్పటేల్, వృద్ధిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, డేవిడ్ మిల్లర్ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. పది మ్యాచ్ల్లో 16 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అక్షర్ పటేల్ (13 వికెట్లు), మోహిత్ శర్మ (9), వరుణ్ అరోన్ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. పంజాబ్ బౌలింగ్ మరింత పదును తేలాల్సి ఉంది. ఇరుజట్లు ఈ సీజన్లో పరస్పరం ఓసారి తలపడగా ఎనిమిది వికెట్లతో కోల్కతా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్లో ఆజట్టుపై నెగ్గడంతో ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్ వైపు అడుగులు వేయాలని పంజాబ్ కృతనిశ్చయంతో ఉంది. కోల్కతా కుమ్ముడు... ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ మంచి జోరుమీదుంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో 16 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్కు చేరిన కోల్కతా.. పంజాబ్పై విజయం సాధించి 18 పాయింట్లతో అధికారికంగా నాకౌట్ దశకు చేరుకోవాలనుకుంటుంది. మరోవైపు వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్కతా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు సునీల్ నరైన్, క్రిస్ లిన్ విధ్వంసక అర్ధసెంచరీలతో జోరు చూపించడంతో బెంగళూరు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా ఉఫ్మని ఊదేసింది. వీరి దూకుడుకు ఐపీఎల్ టోర్నీలో కొన్ని రికార్డులు గల్లంతవడం విశేషం. మరోవైపు కోల్కతా కెప్టెన్ గౌతం గంభీర్ తమ ఓపెనర్లపై ప్రశంసలు జల్లు కురిపించాడు. కెరీర్ మొత్తంలో తాను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదేనని పేర్కొన్నాడు. ఇదే జోరును మిగతా మ్యాచ్ల్లోనూ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే గౌతం గంభీర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 12 మ్యాచ్ల్లో 425 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మనీశ్ పాండే ఆకట్టుకుంటున్నాడు. ఇక ఓపెనర్ అవతారం ఎత్తిన సునీల్ నరైన్ 196 పరుగులతో విజయవంతమయ్యాడు. క్రిస్ లిన్ చేరికతో కోల్కతా బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. గాయంతో దూరమైన రాబిన్ ఉతప్ప తిరిగి జట్టుతో చేరనున్నాడు. యూసుఫ్ పఠాన్, కొలిన్ గ్రాండ్హోమ్, సూర్యకుమార్ యాదవ్ గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో క్రిస్ వోక్స్ సత్తా చాటుతున్నాడు. 12 మ్యాచ్ల్లో 15 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ (13 వికెట్లు), నాథన్ కూల్టర్నీల్ (11), సునీల్ నరైన్ (9), కుల్దీప్ యాదవ్ (9) ఆకట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబల్ హసన్కు ఈ మ్యాచ్లో చోటు దక్కవచ్చు. మరోవైపు జట్టు రిజర్వ్బెంచ్ సత్తాను కూడా పరిశీలించేందుకు గంభీర్సేన ప్రయత్నిస్తోంది. అలాగే ఈ సీజన్ పంజాబ్తో ఆడిన మ్యాచ్లో ఘనవిజయం సాధించిన కోల్కతా.. తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. -
సందీప్ శర్మపై జరిమానా
మొహాలీ: అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ సందీప్ శర్మ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. ఆదివారం గుజరాత్ లయన్స్తో మ్యాచ్ సందర్భంగా ఇన్నింగ్స్ ఐదోఓవర్లో సందీప్ శర్మ వేరే ఎండ్ నుంచి అంటే రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేశాడు. ఈ మార్పును తనకు తెలియపర్చలేదని భావించిన అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించాడు. దీనిపై సందీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం జట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా సందీప్కు మద్దతు పలికాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని సందీప్ అతిక్రమించాడని నిర్ధారించిన మ్యాచ్రిఫరీ ఈ మేరకు జరిమానా విధించాడు. -
ఎంతమంది బ్యాట్స్ మెన్ ఇలా చేస్తున్నారు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా నిజాయితీని మెచ్చుకున్నాడు. ఈ కాలంలో కూడా అతనిలా ఎవరైనా నిజాయితీగా ఉంటూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించగలరా అని ప్రశ్నించాడు. అసలు విషయం ఇది.. నిన్న (శుక్రవారం) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్లోనే హషీం ఆమ్లా ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతిని ఆమ్లా ఆడగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది. బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేసేలోగానే ఆమ్లా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. వాస్తవానికి ఆ బంతి బ్యాట్ కు తాకిందా లేదా అన్నదానిపై కీపర్ జాదవ్, బౌలర్ చౌదరికి స్పష్టతలేకున్నా.. ఆమ్లా మాత్రం నిజాయితీగా ఔట్ ను ఒప్పుకున్నాడు. దీనిపై గుజరాత్ లయన్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో ప్రశంసించాడు. ‘ఎంత మంది బ్యాట్స్ మెన్.. బౌలర్లు అప్పీలు చేయకుండానే క్రీజు వదిలి వెళ్లిపోతున్నారు. ఆమ్లా నిజాయితీని చూసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి’ అంటూ పఠాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో పట్టుదలతో ఆడిన పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. How many batsmen would walk without bowler appealing but that's how this guy plays his cricket @amlahash @IPL #honestman — Irfan Pathan (@IrfanPathan) 5 May 2017 -
మళ్లీ చిత్తుగా ఓడిన కోహ్లి జట్
-
బెంగళూరు బేలగా...
-
బెంగళూరు బేలగా...
►మళ్లీ చిత్తుగా ఓడిన కోహ్లి జట్టు ► 19 పరుగులతో పంజాబ్ విజయం ►గెలిపించిన సందీప్, అక్షర్ ఒకప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించి బ్యాటింగ్లో రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆ జట్టుకు ఇప్పుడు పరుగులు తీయడమే గగనంగా మారింది. స్టార్ ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడి విఫలమవుతున్న వేళ బెంగళూరు మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. 139 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక కోహ్లి సేన చతికిలపడింది. అక్షర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు సందీప్ శర్మ సూపర్ బౌలింగ్ పంజాబ్కు కీలక విజయాన్ని అందించింది. బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మన్దీప్ సింగ్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు టాప్ స్కోరర్గా నిలవగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సందీప్ శర్మ (3/22), అక్షర్ పటేల్ (3/11) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. ఐదో విజయంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అక్షర్ ఒక్కడే... ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ మినహా పంజాబ్ ఇన్నింగ్స్ అతి సాధారణంగా సాగింది. పిచ్ నెమ్మదిగా ఉండటంతో బ్యాట్స్మెన్ ప్రతీ పరుగు కోసం శ్రమించాల్సి వచ్చింది. తొలి ఓవర్లోనే ఆమ్లా (1) అవుట్ కాగా, కొద్దిసేపటికే గప్టిల్ (9) కూడా వెనుదిరిగాడు. ఫలితంగా పవర్ప్లే ముగిసేసరికి జట్టు 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాన్ మార్‡్ష (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోహ్రా (28 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), సాహా (25 బంతుల్లో 21; 1 ఫోర్) కొద్ది సేపు క్రీజ్లో నిలిచినా... ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. మ్యాక్స్వెల్ (6) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ మెల్లగా సాగింది. ఈ దశలో అక్షర్ జట్టుకు ఆపద్భాంధవుడిగా మారాడు. ముందుగా చహల్ ఓవర్లో ఫోర్, సిక్స్తో అతను జోరును ప్రదర్శించాడు. కీలకమైన 19వ ఓవర్ను అనికేత్ మెయిడిన్గా వేయడం విశేషం. అయితే వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్లో అక్షర్ చెలరేగడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్తో పటేల్ 19 పరుగులు రాబట్టాడు. బెంగళూరు బౌలర్లలో అనికేత్ (2/17), చహల్ (2/21) రాణించారు. సందీప్ హవా... సొంత మైదానంలో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే! సందీప్ శర్మ చక్కటి బంతులకు తోడు నిర్లక్ష్యపూరిత బ్యాటింగ్ బెంగళూరును ఇబ్బందుల్లో పడేసింది. గేల్ (0), కోహ్లి (6), డివిలియర్స్ (10) ముగ్గురూ దాదాపు ఒకే తరహాలో సందీప్ పేస్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు దూసుకొచ్చి అవుటయ్యారు. వరుసగా తన తొలి మూడు ఓవర్లలో ఈ వికెట్లు తీసిన సందీప్... ఒకే ఇన్నింగ్స్లో గేల్, కోహ్లి, డివిలియర్స్లను అవుట్ చేసిన తొలి బౌలర్గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. మరో ఎండ్ నుంచి మన్దీప్ కొంత పోరాడే ప్రయత్నం చేసినా, జాదవ్ (6), వాట్సన్ (3) విఫలం కావడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. మ్యాక్స్వెల్ తన తొలి ఓవర్లోనే మన్దీప్ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. పవన్ నేగి (23 బంతుల్లో 21; 2 ఫోర్లు) చివర్లో పోరాడినా లాభం లేకపోయింది. -
పంజాబ్ దూకుడు కొనసాగిస్తుందా..?
►నేడు బెంగళూరుతో కింగ్స్ ఢీ ►క్వాలిఫై కోసం పంజాబ్ పోరు ►పరువు కోసం కోహ్లిసేన ఆరాటం బెంగళూరు: ప్లే ఆఫ్స్కు చేరుకోవాలనే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చివరి మ్యాచ్ల్లో ఢిల్లీపై పది వికెట్లతో గెలుపొందిన మ్యాక్స్వెల్సేన.. ఈ మ్యాచ్లో నెగ్గి నాకౌట్ సమరానికి మరింత చేరువ కావాలని యోచిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్కు దూరమైన బెంగళూరు పరువు కోసం ఈ మ్యాచ్లో నెగ్గాలని కృతి నిశ్చయంతో ఉంది. పంజాబ్ దూకుడు.. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. అనంతరం తేరుకున్న పంజాబ్ తను ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆడిన మ్యాచ్లో సమష్టి విజయం సాధించింది. తొలుత పేసర్లు చెలరేగడంతో ఢిల్లీని కేవలం 67 పరుగులకు కుప్పకూల్చారు. పంజాబ్ జోరుకు టోర్నీ చరిత్రలోనే ఢిల్లీ తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్లో రెచ్చిపోయిన మ్యాక్స్వెల్సేన కేవలం 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసక ప్లేయర్ మార్టన్ గప్టిల్ కేవలం 27 బంతుల్లోనే అర్ధసెంచరీ నమెదుచేయడం విశేషం. ఓవరాల్గా తొమ్మిది మ్యాచ్లాడిన పంజాబ్ నాలుగు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్ల్లో 63 సగటుతో 315 పరుగులు నమోదు చేశాడు. అయితే కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ 193 పరుగులతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మనన్ వోహ్రా సన్రైజర్స్ హైదరాబాద్తో మాత్రమే సత్తాచాటాడు. వీరు త్వరలో గాడిలో పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మార్టిన్ గప్టిల్ రెండు మ్యాచ్ల్లో 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. షాన్ మార్‡్ష, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఎనిమిది మ్యాచ్ల్లో 11 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను సందీప్ కుప్పకూల్చాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 10 వికెట్లతో రాణిస్తున్నాడు. వరుణ్ ఆరోన్, మోహిత్ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం ఓ సారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆరు వికెట్లతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. పంజాబ్కు మిగిలిన ఐదు మ్యాచ్ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ల్లో విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మార్గదర్శకత్వంలో ఈసారి ఎలాగైనా నాకౌట్కు చేరాలని భావిస్తోంది. దీంతో గతేడాది నమోదు చేసిన చెత్త ప్రదర్శనను మరిపించాలని ఆశిస్తోంది. ‘బెంగ’ తీరేనా...? గతేడాది అద్భుత ఆటతీరుతో రన్నరప్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి మాత్రం చెత్త ప్రదర్శననను నమెదు చేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది ఓటములు నమోదు చేసిన బెంగళూరు అధికారికంగానే ప్లే ఆఫ్స్కు దూరమైన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఓవరాల్గా 11 మ్యాచ్లాడిన బెంగళూరు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా బెంగళూరు చివరగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఒక్క పాయింట్ను సాధించింది. దీంతో ఓవరాల్గా ఐదు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన కోహ్లి, డివిలియర్స్, గేల్లాంటి ఆటగాళ్లున్నా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కేవలం 49 పరగులకు కుప్పకూలింది. మరోవైపు రైజింగ్ పుణే సూపర్జెయింట్పై 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు కనీసం 100 పరుగుల మార్కును సైతం దాటలేకపోయింది. ఏదీ ఏమైనా నాకౌట్ దశకు అర్హత పొందకపోయినా ఇతర జట్ల అవకాశాలపై ఇప్పుడు బెంగళూరు ప్రభావం చూపనుంది. కోహ్లిసేనకు మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఎలాగైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. దీంతో బెంగళూరుతో తలపడాల్సిన పంజాబ్, ఢిల్లీ, కోల్కతా కొంచెం కంగారుపడుతున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కేదార్ జాదవ్ 10 మ్యాచ్ల్లో 241 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి విధ్వంసక ఆటగాళ్లు ఈ సీజన్లో అనుకన్నంత మేరకు రాణించలేకపోయారు. మిగతా మ్యాచ్ల్లోనైన వీరు తమ బ్యాట్కు పదును పెట్టాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే యజ్వేంద్ర చహల్ 11 వికెట్లతో సత్తా చాటాడు. పవన్ నేగి 10 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, శ్రీనాథ్ అరవింద్ తదీతరులు బంతితో రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో పంజాబ్ చేతులో ఎదురైన ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశం బెంగళూరుకు చిక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోహ్లిసేన కృతనిశ్చయంతో ఉంది. -
ఢిల్లీ బెంబేలు..
►67 పరుగులకే డేర్డెవిల్స్ ఆలౌట్ ►నిప్పులు చెరిగిన సందీప్ ►పంజాబ్ చేతిలో పది వికెట్లతో ఢిల్లీ పరాజయం ►గప్టిల్ మెరుపులు మొహాలీ: 67 పరుగులు... అత్యధిక వ్యక్తిగత స్కోరు కాదు! ఢిల్లీ డేర్డెవిల్స్ అందరి స్కోరు!! ఫలితం చెప్పనక్కర్లేదు... పంజాబ్ చేతిలో పరాభవం. లీగ్లో వరుసగా ఐదో పరాజయం. ప్లే–ఆఫ్ ఆశలకు దూరమయ్యేందుకు... బెంగళూరు పంచన చేరేందుకు దగ్గరవుతోంది ఢిల్లీ డేర్డెవిల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో నిర్లక్ష్యాన్ని నిండుగా చూపించింది. 10 వికెట్ల పరాజయాన్ని చక్కగా చవిచూసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. తన టి20 కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ (4/20)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇలా టపాకట్టేశారు... ఢిల్లీ పతనం ఆరో బంతితోనే మొదలైంది. పిచ్ పరిస్థితుల్ని చక్కగా ఆకళింపు చేసుకున్న కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్తోనే ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మొదట బిల్లింగ్స్ (0)ను, ఆ తర్వాత తన రెండో ఓవర్లో సామ్సన్ (5), మూడో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ పంపాడు. మరోవైపు అక్షర్ పటేల్ (2/22) కూడా ఓ చేయివేయడంతో ఢిల్లీ 33 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. కరుణ్ నాయర్ (11), మోరిస్ (2) అక్షర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వికెట్ల ఉత్పాతంలో వరుణ్ ఆరోన్ (2/3) కూడా జతకలవడంతో ఢిల్లీకి పరుగులు రావడమే గగనమైంది. ఏ ఒక్కరూ 20 పరుగులు చేయలేకపోయారు. కోరె అండర్సన్ (18)దే అత్యధిక స్కోరు... వెరసి ఢిల్లీ 67 ఆలౌట్. గప్టిల్ ముగించాడు... అలవోక లక్ష్యాన్ని ఛేదించేదుకు బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, హషీమ్ ఆమ్లా అజేయంగా ముగించారు. జట్టుకు 10 వికెట్ల ఘనవిజయాన్ని అందించారు. ముఖ్యంగా గప్టిల్ (27 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇతనికి అండగా హషీమ్ ఆమ్లా (20 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) సహాయపాత్ర పోషించాడు. దీంతో కేవలం 7.5 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సీజన్లో కింగ్స్కిది నాలుగో విజయం. -
సన్రైజర్స్ ఘన విజయం
-
‘రచ్చ’ గెలిచారు
-
‘రచ్చ’ గెలిచారు
►ప్రత్యర్థి వేదికపై సన్రైజర్స్ తొలి విజయం ►26 పరుగులతో పంజాబ్ చిత్తు ►ధావన్, విలియమ్సన్, వార్నర్ అర్ధ సెంచరీలు బ్యాటింగ్లో టాప్–3 ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడుతూ అర్ధ సెంచరీలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేస్తే... బౌలింగ్లో సమష్టి ప్రదర్శన సన్రైజర్స్కు మరో కీలక విజయాన్ని అందించింది. ఈ సీజన్లో సొంతగడ్డపై సంపూర్ణ ఆధిక్యంతో వరుసగా గెలిచినా, ప్రత్యర్థి వేదికపై బోణీ చేయలేకపోయిన హైదరాబాద్... ఇప్పుడు పంజాబ్ గడ్డపై ఆ లోటును పూరించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వార్నర్ సేన, కింగ్స్ ఎలెవన్పై ‘రివర్స్’ మ్యాచ్లోనూ సత్తా చాటింది. బౌలింగ్ వైఫల్యంతో ముందే చేతులెత్తేసిన పంజాబ్ను భారీ ఛేదనలో మార్‡్ష ఇన్నింగ్స్ ఆదుకోలేకపోయింది. మొహాలీ: భారీ స్కోరు చేసి కూడా పుణేతో గత మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 26 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (48 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (27 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఒక ఇన్నింగ్స్లో టాప్–3 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఐపీఎల్లో ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేయగలిగింది. షాన్ మార్ష్(50 బంతుల్లో 84; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా అతనికి మరో వైపునుంచి సహకారం అందలేదు. పొదుపుగా బౌలింగ్ చేసిన రషీద్ఖాన్ (1/16)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఒకరిని మించి మరొకరు... తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో శుభారంభం చేసినట్లుగా పంజాబ్ భావించింది! అయితే అది అక్కడితో సరి... రెండో ఓవర్ నుంచి సన్రైజర్స్ బ్యాట్స్మెన్ చెలరేగి పరుగుల వరద పారించారు. తర్వాతి ఎనిమిది ఓవర్ల పాటు ఆ విధ్వంసం సాగింది. 2–9 ఓవర్ల మధ్య రైజర్స్ 12 రన్రేట్తో ఏకంగా 96 పరుగులు స్కోరు చేసింది. అనురీత్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో ధావన్ ధాటిని ప్రదర్శించగా, అక్షర్ తొలి ఓవర్లో వార్నర్ వరుస బంతుల్లో 4, 6, 4 బాదాడు. అయితే తర్వాతి బంతికి కీపర్ సాహా క్యాచ్ వదిలేయడంతో హైదరాబాద్ కెప్టెన్కు మరో అవకాశం దక్కింది. అనురీత్ మరో ఓవర్లో మూడు ఫోర్లు సహా రైజర్స్ 16 పరుగులు రాబట్టింది. పదో ఓవర్లో తొలి రెండు బంతులకు వార్నర్, ధావన్లు తమ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. పంజాబ్ జట్టుపై వార్నర్కు ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఎట్టకేలకు వార్నర్ను బౌల్డ్ చేసి మ్యాక్స్వెల్ ఈ జోడీని విడదీయగా... తర్వాతి 17 బంతుల్లో సన్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరగ్గా... యువరాజ్ (12 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే విలియమ్సన్ మరోసారి మెరుపు బ్యాటింగ్తో కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇషాంత్ వేసిన 19వ ఓవర్లో అతను దూకుడు ప్రదర్శించాడు. రెండు ఫోర్లు, సిక్స్ సహా ఒక్కడే 20 పరుగులు సాధించాడు. ‘షాన్’దార్ ఆట... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న గప్టిల్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) పంజాబ్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. అయితే చక్కటి బంతితో భువనేశ్వర్ అతని జోరుకు బ్రేక్ వేయగా, వోహ్రా (3) విఫలమయ్యాడు. కౌల్ తన తొలి ఓవర్లోనే మ్యాక్స్వెల్ (0)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో మార్‡్ష ధాటిగా ఆడి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. నెహ్రా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత హుడా ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ సాహా 17 పరుగులు రాబట్టాడు. పవర్ప్లేలో పంజాబ్ 59 పరుగులు చేయగలిగింది. అయితే రషీద్ తన తొలి 2 ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి పంజాబ్ను పూర్తిగా కట్టిపడేశాడు. అయితే మార్‡్ష, మోర్గాన్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి మళ్లీ పంజాబ్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. హెన్రిక్స్ వేసిన ఓవర్లో వీరిద్దరు మూడు ఫోర్లు, 1 సిక్స్తో 19 పరుగులు కొల్లగొట్టారు. కౌల్ ఓవర్లో కూడా వరుసగా 4, 6, 4 కొట్టి దూకుడు పెంచిన మార్‡్షను భువీ అవుట్ చేయడంతో విజయంపై కింగ్స్ ఆశలు వదిలేసుకుంది. ఐపీఎల్లో నేడు రైజింగ్ పుణే & బెంగళూరు వేదిక: పుణే; సా. గం. 4.00 నుంచి గుజరాత్& ముంబై వేదిక: రాజ్కోట్; రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
వార్నర్ ఖాతాలో మరో అరుదైన ఫీట్
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసిన వార్నర్, మ్యాక్స్వెల్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన విధ్వంసకర ఓపెనర్ వార్నర్ ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ జట్టుపై వరుసగా ఆరో మ్యాచ్లోనూ అర్ధశతకాన్ని నమోదుచేసి.. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో మరే ఇతర ఆటగాడు ఓ జట్టుపై ఆరు వరుస ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించలేదు. నేటి మ్యాచ్లో 51 పరుగులు చేసిన వార్నర్.. గత ఐదు ఇన్నింగ్స్లలో వరుసగా 58, 81, 59, 52, 70 (నాటౌట్) అర్ధ శతకాలు చేశాడు. తన చివరి ఏడో ఇన్నింగ్స్లోనూ వార్నర్ విఫల కాలేదు. ఆ మ్యాచ్లో 44 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించడం విశేషం. చివరగా ఈ నెల 17న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 70 పరుగులతో నాటౌట్గా నిలవడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ (4-0-19-5) అద్భుత ప్రదర్శనతో రాణించడంతో ఆ మ్యాచ్లో పంజాబ్పై 5 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. -
విజయమే లక్ష్యంగా..
⇒నేడు పంజాబ్తో తలపడనున్న సన్రైజర్స్ ⇒ఉత్సాహంలో హైదరాబాద్ ⇒పుంజుకోవాలని కింగ్స్ తపన మొహాలీ: డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ పరాయి గడ్డపై గెలుపే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో శుక్రవారం తలపడనుంది. సన్రైజర్స్ సాధించిన నాలుగు విజయాలు సొంతగడ్డ హైదరాబాద్లో లభించనివే కావడం విశేషం. ఈక్రమంలో పంజాబ్ గడ్డపై విజయం సాధించాలని వార్నర్సేన యోచిస్తోంది. మరోవైపు తాము ఆడిన చివరిమ్యాచ్లో గెలుపుబాట పట్టిన పంజాబ్.. ఇదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. హైదరాబాద్ దూకుడు.. ఈ సీజన్లో సన్రైజర్స్ ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లాడిన వార్నర్సేన నాలుగు విజయాలు నమోదు చేయగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో తొమ్మిది పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు మూడు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. సన్రైజర్స్ ఓడిన మూడు మ్యాచ్లు పరాయిగడ్డపై జరిగినవే కావడం విశేషం. దీంతో ఈ సీజన్లో సొంతగడ్డపై పులిలా విరుచుక పడుతోన్న సన్రైజర్స్ వేరే వేదికలపై మాత్రం తడబడుతోందనే అపప్రథను మూటగట్టుకుంది. దీంతో పంజాబ్తో జరిగే మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి అన్ని వేదికలపై రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని వార్నర్సేన యోచిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూల స్తంభంలా నిలిచాడు. ఏడు మ్యాచ్ల్లో 282 పరుగులు చేసిన వార్నర్ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (235 పరుగులు), ఆల్రౌండర్ మోజెస్ హెన్రిక్స్ (193 పరుగులు) రాణిస్తున్నారు. అయితే డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడిన యువీ.. కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలిమ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై మాత్రం 62 పరుగులు చేసిన యువీ.. మిగతా మ్యాచ్ల్లో ప్రభావం చూపలేకపోయాడు. వీలైనంత త్వరగా యూవీ గాడిన పడాలని జట్టు ఆశిస్తోంది. ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన కేన్ విలియమ్సన్ 110 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా, నమన్ ఓజా తమ బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగానికొస్తే టోర్నీలో అత్యుత్తమ బౌలర్లు సన్రైజర్స్ సొంతం. ఏడు మ్యాచ్లాడిన భువనేశ్వర్ కుమార్ 16 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ పదివికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. బిపుల్ శర్మ, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ్ కౌల్ ఫర్వాలేదనిపిస్తున్నారు. వీరిలో ఒకరి స్థానంలో వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా బరిలోకి దిగవచ్చు. మరోవైపు యువరాజ్ సింగ్, సిద్ధార్థ్ పంజాంబ్కు చెందినవారే కావడం విశేషం. ఈ మైదానంలో చాలా మ్యాచ్లు ఆడి ఉండడంతో వారి అనుభవం వార్నర్సేకు ఉపకరించగలదు. ఈ సీజన్లో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఇరుజట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఐదు పరుగుల స్వల్పతేడాతో సన్రైజర్స్ నెగ్గింది. మరోవైపు టోర్నీలో ఇరుజట్ల ముఖాముఖిపోరులో ఎనిమిదిసార్లు తలపడగా.. సన్రైజర్స్ ఆరుసార్లు విజయం సాధించగా.. పంజాబ్ రెండుమ్యాచ్ల్లో గెలుపొందింది. 2014 తర్వాత సన్రైజర్స్పై లీగ్ దశలో పంజాబ్ నెగ్గలేకపోవడం విశేషం. దీంతో ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. పంజాబ్కు చావోరేవో.. మరోవైపు ఈ సీజన్లో పంజాబ్ ప్రస్థానం ఎగుడుదిగుడుగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో రెండు వరుస విజయాలు సాధించిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. అయితే గుజరాత్తో జరిగిన చివరి మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న పంజాబ్.. పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం విజయం సాధిస్తే పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకుతుంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా టాప్ ఫామ్లో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లోనే 104 పరుగులు చేసి విధ్వంసక సెంచరీని నమోదు చేశాడు. ఆమ్లా దూకుడుతో పంజాబ్ భారీ స్కోరు సాధించినా.. బౌలర్ల వైఫల్యంతో మ్యాక్స్వెల్సేనకు ఓటమి తప్పలేదు. ఓవరాల్గా ఏడు మ్యాచ్ల నుంచి 299 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్మన్గా ఆమ్లా నిలిచాడు. కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ (193 పరుగులు), మనన్ వోహ్రా (176 పరగులు), అక్షర్ పటేల్ (122 పరుగులు) ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు విదేశీ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, షాన్ మార్‡్ష, ఇయాన్ మోర్గాన్ స్థాయికితగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతున్నారు. ఈక్రమంలో జట్టు కూర్పులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ సీజన్లో పంజాబ్ బౌలర్లు సాదాసీదాగా ఉన్నారు. స్పిన్నర్ అక్షర్పటేల్ ఎనిమిది వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ వికెట్లు తీస్తున్నా ప్రత్యర్థులకు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భారత బౌలర్ ఇషాంత్ శర్మ మూడు మ్యాచ్లాడిన ఒక్క వికెట్ కూడా తీయడంలో విఫలమయ్యాడు. సాధ్యమైనంత త్వరగా తమ బౌలింగ్ విభాగం గాడిలో పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గుజరాత్తో ఆడిన చివరిమ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్.. 26 పరుగులతో విజయం సాధించింది. ఇదే జోరును కొనసాగించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. నాకౌట్ దశకు చేరాలంటే రాబోయే మ్యాచ్లు తమకు కీలకమని జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. మిగిలిన ఏడు మ్యాచ్ల్లో నాలుగైదింటిలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించవచ్చని పేర్కొన్నాడు. -
పీకే, డీకే అవుట్
రాజ్కోట్: ఐపీఎల్-10లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా బౌలింగ్ తీసుకున్నాడు. తమ జట్టు కూర్పులో నాలుగు మార్పులు జరిగాయని రైనా వెల్లడించాడు. ఫాల్కనర్ స్థానంలో ఆండ్రూ టైయిని తీసుకున్నట్టు చెప్పాడు. ఇషాన్ కిషాన్ అనారోగ్యం కారణంగా ఆడడం లేదని.. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ శుభమ్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. పీకే, డీకే (ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి) ప్లేస్ లో నాథు సింగ్, అఖదీప్ నాథ్ల ను తీసుకున్నట్టు రైనా చెప్పాడు. పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. మనన్ వోహ్రా టీమ్ లోకి వచ్చాడు. స్వప్నిల్ స్థానంలో కేసీ కరియప్పా, ఇషాంత్ శర్మ ప్లేస్ లో టి. నటరాజన్ ను తీసుకున్నట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వెల్లడించాడు. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు రెండేసి మ్యాచుల్లో నెగ్గి నాలుగేసి పాయింట్లు సాధించాయి. -
ఆమ్లా సెంచరీ వృథా.. ముంబై ఘన విజయం
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరోసారి పరుగుల మోత మోగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై పరుగుల పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఐపీఎల్ -10లో సంజూ శాంసన్ తర్వాత పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా శతకాన్ని బాదాడు. హషీమ్ ఆమ్లా అజేయ శతకం (104 నాటౌట్; 60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు), మ్యాక్స్ వెల్(40;18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్ష్(26) పరవాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ కు రెండు వికెట్లు లభించగా, కృణాల్ పాండ్యా, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది. 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. పార్థీవ్ పటేల్(37; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ తొలి వికెట్కు 5.5 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. స్టోయినిస్ బౌలింగ్లో పార్థీవ్ పటేల్ తొలి వికెట్గా ఔటయ్యాడు. ఆపై నితీశ్ రాణా(62 నాటౌట్; 34 బంతుల్లో 7 సిక్సర్లు) తో కలిసి ఓపెనర్ బట్లర్ (77; 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వీరి ధాటికి పంజాబ్ బౌలర్ ఇషాంత్ శర్మ 4 ఓవర్లలో 58 పరుగులు సమర్పించుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(15; 4 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో ముంబై మరో 27 బంతులు మిగిలుండగానే 199 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి పంజాబ్కు షాకిచ్చింది. తద్వారా 10 పాయింట్లతో పట్టికలో రోహిత్ సేన తొలి స్థానాన్ని ఆక్రమించింది. -
పంజాబ్పై సన్రైజర్స్ విజయం
-
మనన్ కాదు... మనం నెగ్గాం
-
మనన్ కాదు... మనం నెగ్గాం
►సన్రైజర్స్ని గెలిపించిన భువనేశ్వర్ ►5 పరుగులతో ఓడిన పంజాబ్ ►మనన్ వోహ్రా విధ్వంసకర ప్రదర్శన వృథా ►రాణించిన వార్నర్ విజయానికి 6 ఓవర్లలో పంజాబ్ చేయాల్సిన పరుగులు 76... ఈ దశలో హైదరాబాద్ గెలుపు దాదాపు ఖాయమైంది. కానీ క్రీజ్లో ఉన్న మనన్ వోహ్రా మరోలా ఆలోచించాడు. మెరుపు బ్యాటింగ్తో ఒక్కసారిగా సీన్ మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టాడు. చివర్లో 10 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్ అద్భుత బంతితో వోహ్రాను అవుట్ చేసి పంజాబ్ ఆశలను కూల్చాడు. భువీ బౌలింగ్తో ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్ చివరకు ఐదు పరుగులతో గట్టెక్కింది. హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మన్ మనన్ వోహ్రా (50 బంతుల్లో 95; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆ జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. సహచరుల అండ లేకపోయినా అంతా తానే అయి జట్టును విజయానికి చేరువగా తెచ్చినా... వోహ్రా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ 5 పరుగుల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్నర్ (54 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత అర్ధసెంచరీ సాధించగా, నమన్ ఓజా (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మనన్ మినహా అంతా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాణించిన ఓజా... టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ ఆడిన జట్టులో హైదరాబాద్ మూడు మార్పులు చేసింది. నెహ్రా, బిపుల్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్, బరీందర్ శరణ్లను తీసుకోగా... కటింగ్ స్థానంలో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నబీకి తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. రైజర్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. 14వ బంతికి గానీ జట్టు తొలి బౌండరీ సాధించలేకపోయింది. ఇబ్బందిగా ఆడిన శిఖర్ ధావన్ (15 బంతుల్లో 15; 1 ఫోర్)ను మోహిత్ అవుట్ చేసి పంజాబ్కు తొలి వికెట్ అందించగా... పవర్ప్లేలో హైదరాబాద్ స్కోరు 29 పరుగులు మాత్రమే. ఆ తర్వాత అక్షర్ తొలి ఓవర్లోనే సన్ను దెబ్బ తీశాడు. హెన్రిక్స్ (9) స్టంపౌంట్ కాగా, యువరాజ్ (0) ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఐపీఎల్లో యువీకి ఇదే తొలి ‘గోల్డెన్ డక్’ కావడం విశేషం. ఈ దశలో వార్నర్కు ఓజా అండగా నిలిచాడు. గత సీజన్ నుంచి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకుండా విఫలమవుతూ వచ్చిన నమన్ ఎట్టకేలకు తన చోటు ప్రమాదంలో పడిన సమయంలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వార్నర్, ఓజా నాలుగో వికెట్కు 37 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. ఓజా అవుటయ్యాక హుడా (12), నబీ (2) విఫలమైనా మరో ఎండ్లో వార్నర్ పట్టుదలగా ఆడాడు. వార్నర్ మరోసారి... బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించని పిచ్పై వార్నర్ చక్కటి ఆటతో సన్ ఇన్నింగ్స్లో మరోసారి కీలకపాత్ర పోషించాడు. తాను ఆడిన 18వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయిన అతను, నిలదొక్కుకున్న తర్వాత ధాటిగా ఆడాడు. కరియప్ప బౌలింగ్లో రివర్స్లో ర్యాంప్ షాట్ ఆడి కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది. ఐపీఎల్లో అతి నెమ్మదిగా 45 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్పై అతనికి ఇది వరుసగా ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మోహిత్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, చివరి ఓవర్లో మోర్గాన్ క్యాచ్ వదిలేయడంతో మరో సిక్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వార్నర్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఛేదనలో తొలి బంతికే భువనేశ్వర్, ఆమ్లా (0)ను అవుట్ చేసి పంజాబ్కు షాక్ ఇచ్చాడు. భువీ తన తర్వాతి ఓవర్లో ప్రధాన బ్యాట్స్మన్మ్యాక్స్వెల్ (10)ను కూడా అవుట్ చేసి రైజర్స్ జట్టులో ఉత్సాహం పెంచాడు. అయితే మరో ఎండ్లో వోహ్రా దూకుడు ప్రదర్శించాడు. రషీద్ తొలి ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్కు 32 బంతుల్లో 41 పరుగులు జోడించిన దశలో అప్ఘాన్ ద్వయం కింగ్స్ను దెబ్బ తీసింది. ముందుగా మోర్గాన్ (13)ను నబీ బౌల్డ్ చేయగా...తర్వాతి ఓవర్లోనే మిల్లర్ (1), సాహా (0)ల స్టంప్స్ను రషీద్ పడగొట్టాడు. అక్షర్ (7) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కానీ చివర్లో వోహ్రా అదరగొట్టే బ్యాటింగ్ పంజాబ్ జట్టులో ఆశలు రేపినా... ఓటమి మాత్రం తప్పలేదు. -
ఢిల్లీ ఘనవిజయం
-
ఢిల్లీ ధమాకా...
-
ఢిల్లీ ధమాకా...
♦ కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘనవిజయం ♦ రాణించిన బిల్లింగ్స్, మోరిస్ మ్యాక్స్వెల్, మిల్లర్, మోర్గాన్ ఇలా మ్యాచ్ను మలుపుతిప్పే సూపర్ బ్యాట్స్మెన్ ఉన్న కింగ్స్ ఎలెవన్... ఢిల్లీ బౌలర్ల ధాటికి తల్లడిల్లింది. అతి పేలవమైన ప్రదర్శనతో పరాభవాన్ని మూటగట్టుకుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్–10లో ఢిల్లీ డేర్డెవిల్స్మళ్లీ ఫామ్లోకి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై గెలుపొందింది. ఫిరోజ్షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు) ధాటిగా ఆడగా... చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోరె అండర్సన్ (22 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ అరోన్కు 2 వికెట్లు దక్కగా, సందీప్, మోహిత్, అక్షర్ పటేల్లు తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (29 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మిల్లర్ (24), మోర్గాన్ (22) ఢిల్లీ బౌలర్లకు తలవంచారు. మోరిస్ 3, నదీమ్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ సామ్సన్ (సి) మోర్గాన్ (బి) కరియప్ప 19; బిల్లింగ్స్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 55; కరుణ్ (సి) సాహా (బి) అరోన్ 0; శ్రేయస్ (సి) మోర్గాన్ (బి) మోహిత్ 22; రిషభ్ పంత్ (సి) మోర్గాన్ (బి) ఆరోన్ 15; అండర్సన్ నాటౌట్ 39; మోరిస్ (సి) మోహిత్ (బి) సందీప్ 16; కమిన్స్ నాటౌట్ 12; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–53, 2–55, 3–96, 4–103, 5–120, 6–151. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–41–1, మోహిత్ శర్మ 4–0–37–1, అక్షర్ 4–0–33–1, వరుణ్ ఆరోన్ 4–0–45–2, కరియప్ప 3–0–23–1, మ్యాక్స్వెల్ 1–0–7–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా (ఎల్బీడబ్ల్యూ) నదీమ్ 3; ఆమ్లా (సి) బిల్లింగ్స్ (బి) మోరిస్ 19; సాహా (సి) జహీర్ (బి) నదీమ్ 7; మోర్గాన్ (సి) నాయర్ (బి) కమిన్స్ 22; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్ 24; మ్యాక్స్వెల్ (సి) బిల్లింగ్స్ (బి) అమిత్ మిశ్రా 0; అక్షర్ పటేల్ (బి) మోరిస్ 44; మోహిత్ శర్మ (బి) కమిన్స్ 13; కేసీ కరియప్ప (బి) మోరిస్ 1; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–31, 4–64, 5–65, 6–88, 7–133, 8–134, 9–137. బౌలింగ్: జహీర్ 4–0–38–0, నదీమ్ 2–0–13–2, మోరిస్ 4–0–23–3, కమిన్స్ 4–0–23–2, అమిత్ మిశ్రా 3–0–16–1, అండర్సన్ 3–0–23–1. -
హిస్టరీ రిపీట్ అవుతుందా?
-
జాంటీ రోడ్స్లా.. సాహా సూపర్ క్యాచ్
ఇండోర్: టీమిండియా కీపర్గా వృద్ధిమాన్ సాహా అద్భుతమైన క్యాచ్లు ఒడిసి పట్టుకున్నాడు. సాహా గాల్లోకి డైవ్ చేసి అసాధారణ రీతిలో క్యాచ్లు పట్టుకుని తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న సందర్భాలున్నాయి. తాజాగా ఐపీఎల్-2017 సీజన్లో సాహా ఇలాంటి అరుదైన ఫీట్ను రిపీట్ చేసి దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్ను తలపించాడు. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించిన గతి తెలిసిందే. సాహా కింగ్స్ లెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ వరుణ్ అరోన్ వేసిన షార్ట్ డెలివరీని బెంగళూరు ఆటగాడు మణ్దీప్ సింగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన సాహా పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేసి సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ స్టన్ అయ్యారు. సాహా ఫీల్డింగ్ను ప్రశంసించారు. మణ్దీప్ క్యాచవుట్గా పెవిలియన్ చేరాడు. -
వరుస విజయాలు.. కింగ్స్ వెనుక ఉన్నదెవరు?
గత ఏడాది అత్యంత చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు.. ఈసారి సరికొత్త ఉత్సాహంతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నది. తాజా టోర్నమెంటులో వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదుంది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్పై ఆరు వికెట్లతో విజయం సాధించిన పంజాబ్ తాజాగా పటిష్టమైన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎనిమిది వికెట్లతో సునాయసంగా మట్టికరిపించింది. మరీ, పంజాబ్ జట్టు వరుస విజయాలు వెనుక ఉన్నదెవరంటే.. ఈ క్రెడిట్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్దేనంటున్నాడు ఆ జట్టు బ్యాట్స్మన్ హషీం ఆమ్లా. ‘ఒక శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అయిన సెహ్వాగ్ ఆటగాళ్ల విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేశారు’ అని ఆమ్లా చెప్పాడు. ఒకప్పుడు వీరోచిత ఓపెనర్ అయిన సెహ్వాగ్ కింగ్స్ ఆటగాళ్ల విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. తమ ఆటశైలిని మార్చాలని ఆయన ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని పేర్కొన్నాడు. ’భారత్ ఆల్టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్లో వీరూ ఒకరన్న విషయం మా అందరికీ తెలుసు. ఒక ప్రత్యేకశైలికి అలవాటుపడాలని చెప్పే వ్యక్తి ఆయన కాదు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యంమేరకు ఉత్తమంగా రాణించాలని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు. జట్టుకు ఉపయోగపడేరీతిలో ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించేవారు’ అని ఆమ్లా తెలిపారు. ఇక జట్టు కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని, సీనియర్ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలు పట్టించుకుంటారని ఆమ్లా కొనియాడాడు. -
నాదే తప్పు.. అందుకే ఓడిపోయాం: కెప్టెన్
ఇండోర్: కింగ్స్ పంజాబ్ ఎలెవన్ చేతిలో ఎదురైన అవమానకరమైన పరాభవానికి తానే కారణమని బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి నిందను తనపై వేసుకున్నాడు. ఇండోర్లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక దశలో 22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరును డివీలియర్స్ ఆదుకున్నాడు. సుడిగాలి ఇన్నింగ్స్తో 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కానీ అతను అంత మోత మోగించినా బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. 149 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు హషీమ్ ఆమ్లా (58), గ్లెన్ మాక్స్వెల్ (43) రాణించడంతో 14.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంగళూరు సారథి.. ఓటమికి తనదే బాధ్యత అంటూ తనను తాను నిందించుకున్నాడు. ‘నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. మొదటి ఓవర్లోనే నేను ఔటయ్యాను. కాబట్టి నన్ను నేను నిందించుకోక తప్పదు’ అని వాట్సన్ అన్నాడు. తమ జట్టు కనీసం 170-180 పరుగులు చేసి ఉంటే విజయాన్ని అందుకొని ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్ మాట్లాడుతూ తమ విజయం క్రెడిట్ బౌలర్లదేనని ప్రశంసించారు. -
పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి
-
డివిలియర్స్ మోత సరిపోలేదు
46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 89 నాటౌట్ ► పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి ► రాణించిన ఆమ్లా, మ్యాక్స్వెల్ ఇండోర్: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ జోరును మరింత పెంచింది. ఐపీఎల్ పదో సీజన్లో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (38 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ మ్యాక్స్వెల్ (22 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి చెలరేగగా... సోమవారం హోల్కర్ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. క్రిస్ గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన డివిలియర్స్ (46 బంతుల్లో 89 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ బెంగళూరు జట్టుకు ఉపయోగపడలేకపోయింది. పొదుపుగా బౌలింగ్ చేసిన పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిక్సర్ల వర్షం... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. ప్రారంభం నుంచే ఈ జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. తొలి ఓవర్లో వాట్సన్ అవుటయ్యాక డివిలియర్స్ క్రీజ్లోకి రాగా... మరోవైపు విష్ణు వినోద్, కేదార్ జాదవ్ వెంటవెంటనే అవుటవ్వడంతో బెంగళూరు పవర్ప్లేలో 23 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మన్దీప్ సింగ్ (34 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. 14వ ఓవర్లో మన్దీప్ అవుట్ కావడంతో డివిలియర్స్తో నాలుగో వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్ నుంచి బెంగళూరు ఆటలో వేగం పెరిగింది. డివిలియర్స్ ఓ భారీ సిక్సర్తో 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ సిక్స్, ఫోర్ కొట్టగా డివిలియర్స్ ఓ సిక్స్ జత చేయడంతో 19 పరుగులు వచ్చాయి. ఇక 19వ ఓవర్లో డివిలియర్స్ తన ట్రేడ్మార్క్ షాట్లతో రెచ్చిపోయి వరుసగా 4,6,6 బాదడంతో మరో 19 పరుగులు వచ్చాయి. అయితే మోహిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చినా ఆఖర్లో డివిలియర్స్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆమ్లా నిలకడ 149 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. లక్ష్యం తక్కువగానే ఉన్నా తమ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. మూడో ఓవర్లో సిక్స్ కొట్టిన మనన్ వోహ్రా ఆ తర్వాత ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. అయితే ఆరో ఓవర్లో మిల్స్ ఓపెనింగ్ జోడిని విడదీయడంతో తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్షర్ (9) అవుటయ్యాక... ఆమ్లా, మ్యాక్స్వెల్ జోడి బెంగళూరు బౌలర్లను ఆటాడుకుంది. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలతో విరుచుకుపడటం తో పరుగులు ధారాళంగా వచ్చా యి. 32 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ చేశాడు. 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మ్యాక్సీ ఆ తర్వాత ఓవర్లో భారీ సిక్స్తో జట్టుకు విజయాన్ని అందించా డు. ఆమ్లా, మ్యాక్స్వెల్ మూడో వికెట్కు అజేయంగా 72 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (బి) అక్షర్ 1; వినోద్ (సి) మ్యాక్స్వెల్ (బి) సందీప్ 7; డివిలియర్స్ నాటౌట్ 89; కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ ఆరోన్ 1; మన్దీప్ (సి) సాహా (బి) వరుణ్ ఆరోన్ 28; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 18; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–2, 2–18, 3–22, 4–68. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–12–1, సందీప్ శర్మ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–47–0, వరుణ్ ఆరోన్ 4–0–21–2, నటరాజన్ 1–0–13–0, స్టోయినిస్ 3–0–28–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా ఎల్బీడబ్ల్యూ (బి) మిల్స్ 34; ఆమ్లా నాటౌట్ 58; అక్షర్ (బి) చహల్ 9; మ్యాక్స్వెల్ నాటౌట్ 43; ఎక్స్ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–62, 2–78. బౌలింగ్: స్టాన్లేక్ 4–0–41–0, ఇక్బాల్ అబ్దుల్లా 2–0–19–0, వాట్సన్ 2–0–28–0, మిల్స్ 2–0–22–1, చహల్ 3.3–0–29–1, పవన్ నేగి 1–0–7–0. -
పంజాబ్ కింగ్స్ బోణీ
-
పంజాబ్ కింగ్స్ బోణీ
► రైజింగ్ పుణే సూపర్ జెయింట్పై విజయం ► రాణించిన మ్యాక్స్వెల్, మిల్లర్ ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్ మ్యాక్స్వెల్ (20 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు. దాంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్పై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. లీగ్లో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్కు దిగిన పుణే అన్నింటిలోనూ పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పుణే 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, మనోజ్ తివారి (23 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆమ్లా (27 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మ్యాక్స్వెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదుకున్న స్టోక్స్, తివారి: పిచ్ బ్యాటింగ్కు అనుకూలించకపోవడంతో పుణే బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడారు. తొలి ఓవర్లోనే మయాంక్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో రహానే (15 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్ను వోహ్రా వదిలేయగా... అదే ఓవర్లో అతను వరుసగా 6,4 బాది స్కోరులో వేగం తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కెప్టెన్ స్మిత్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ తన తొలి ఓవర్లోనే రహానే వికెట్ తీసి పంజాబ్ జట్టులో సంతోషం నింపాడు. మరో ఓవర్ వ్యవధిలో స్మిత్ వికెట్ను స్టొయినిస్ తీయడంతో పుణే 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు ధోని (5) కూడా విఫలం కావడంతో భారమంతా స్టోక్స్, తివారిలపై పడింది. వీరిద్దరి జోరుకు తోడు చివర్లో క్రిస్టియాన్ 4,4,6 బాదడంతో జట్టు మంచి స్కోరు సాధించగలిగింది. మ్యాక్స్వెల్ బాదుడు: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది. క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన వోహ్రా (9 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో జోరు చూపించిన సాహా (14; 3 ఫోర్లు)ను తాహిర్ తన తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో పంజాబ్ 56 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా పుణే బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో ఒత్తిడికి లోనైన అక్షర్, ఆమ్లా వరుస ఓవర్లలో వికెట్లను చేజార్చుకున్నారు. అయితే మ్యాక్స్వెల్, మిల్లర్ ధాటిగా ఆడి పంజాబ్కు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) స్టొయినిస్ (బి) నటరాజన్ 19; మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ 0; స్మిత్ (సి) వోహ్రా (బి) స్టొయినిస్ 26; స్టోక్స్ (సి అండ్ బి) అక్షర్ 50; ధోని (సి అండ్ బి) స్వప్నిల్ సింగ్ 5; మనోజ్ తివారి నాటౌట్ 40; క్రిస్టియాన్ (సి) మ్యాక్స్వెల్ (బి) సందీప్ శర్మ 17; రజత్ భాటియా నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–1, 2–36, 3–49, 4–71, 5–132, 6–162. బౌలింగ్: సందీప్ 4–0–33–2; మోహిత్ 4–0–34–0; అక్షర్ 4–0–27–1; నటరాజన్ 3–0–26–1; స్టొయినిస్ 3–0–28–1; స్వప్నిల్ సింగ్ 2–0–14–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చహర్ 28; వోహ్రా (సి) తివారి (బి) దిండా 14; సాహా (బి) తాహిర్ 14; అక్షర్ (సి అండ్ బి) తాహిర్ 24; మ్యాక్స్వెల్ నాటౌట్ 44; మిల్లర్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–27, 2–49, 3–83, 4–85. బౌలింగ్: దిండా 3–0–26–1; క్రిస్టియాన్ 2–0–24–0; స్టోక్స్ 4–0–32–0; తాహిర్ 4–0–29–2; చహర్ 4–0–32–1; భాటియా 2–0–20–0. -
మయాంక్ అగర్వాల్ డకౌట్
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. పుణె ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ లో నాలుగు బంతుల్ని ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగుకే పుణె వికెట్ ను నష్టపోయింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది పంజాబ్ కు తొలి మ్యాచ్ కాగా, పుణెకు రెండో మ్యాచ్. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పుణె ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఇషాంత్ ఇక పంజాబ్ కింగ్
మొహాలి: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు మరో అవకాశం దక్కింది. ఐపీఎల్–10 కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇషాంత్ను తమ జట్టులోకి తీసుకుంది. పంజాబ్ జట్టులో యువ బౌలర్లే ఎక్కువ మంది ఉండటంతో అనుభవజ్ఞుడైన బౌలర్ కోసం అన్వేషిస్తూ ఇషాంత్కు అవకాశం కల్పించింది. జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా చొరవ తీసుకొని ఇషాంత్ను ఎంచుకునేలా చేశారు. రెండు రోజుల క్రితం వీరూ తనతో మాట్లాడారని, ఆ తర్వాతే పంజాబ్ జట్టు తనను తీసుకుందని ఇషాంత్ వెల్లడించాడు. 77 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ గతంలో కోల్కతా, హైదరాబాద్, పుణే జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు. మరో వైపు చికెన్ పాక్స్ కారణంగా ఢిల్లీ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. -
కింగ్స్ ఎలెవన్ కెప్టెన్గా మ్యాక్స్వెల్
రాబోయే సీజన్ ఐపీఎల్–10లోనైనా జట్టు తలరాతని మార్చాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా జట్టు సారథ్య బాధ్యతల నుంచి భారత ఓపెనర్ మురళీ విజయ్ని తప్పించి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు కెప్టెన్సీని కట్టబెట్టింది. ఐపీఎల్–9 సీజన్ మధ్యలో డేవిడ్ మిల్లర్ నుంచి మురళీ విజయ్ జట్టు పగ్గాలు స్వీకరించినప్పటికీ జట్టు ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. మొత్తం 14 మ్యాచ్ల్లో నాలుగు మాత్రమే గెలిచి పంజాబ్ వరుసగా రెండోసారి చివరి స్థానంలో నిలిచింది. -
వీరేంద్ర సెహ్వాగ్కు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్కు మెంటర్గా ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ టీమ్కు సెహ్వాగ్ మెంటర్గా ఉంటూనే, జట్టు క్రికెట్ ఆపరేషన్స్, స్ట్రాటజీ విభాగం చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాగే జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తాడు. పంజాబ్ జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. వీరూ అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకముందని, కొత్త పాత్రలో అతను రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు కింగ్స్ లెవెన్ ప్రమోటర్లు చెప్పారు. జట్టుకు మెంటర్గా, ఇతర బాధ్యతలను వీరూ చేపట్టడం గొప్ప విషయంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తనకు అదనపు, కీలక బాధ్యతలు అప్పగించడంపై సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులైన యువకులకు మెంటర్గా వ్యవహరిస్తూ, జట్టును నడిపించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. పంజాబ్ జట్టు తన అభిప్రాయాలకు తగినట్టుగా ఉందని, ఈ సీజన్లో జట్టును విజయపథంలో నడిపించడంపై దృష్టిసారిస్తున్నానని అన్నాడు.