new variant
-
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (mpox) వైరస్లోని కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. గురువారం మంకీపాక్స్ కొత్త వేరియంట్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా (china) ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్ క్లేడ్ ఐబి అనే కొత్త వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకిందని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు,బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించింది. మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సైతం తాజాగా, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక చైనా గుర్తించిన మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్రూఫ్తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్ను ఎలక్ట్రిక్ సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్బ్యాగ్లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్లో కొత్త వాంటేజ్ను విడుదల చేసింది. ఎక్స్షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్ను అధిగమించడానికి కంపెనీ నెట్వర్క్ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్తో పాటు కైగర్, ట్రైబర్లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు. -
India: టెన్షన్ పెడుతున్న జేఎన్-1 వేరియంట్.. భారీగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది. A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources — ANI (@ANI) January 9, 2024 కర్ణాటక గవర్నర్కు కరోనా ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్భవన్లోనే క్వారంటైన్లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
India: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది. తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440 — ANI (@ANI) January 3, 2024 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్కు సంబంధించినవిగా గుర్తించారు. -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల కలకలం
-
భారత్లో కరోనా: 4,170 యాక్టివ్ కేసులు
ఢిల్లీ/బెంగళూరు, సాక్షి: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికే 4 వేలు దాటేసింది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 మూలంగానే అధిక కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కర్ణాటకలో కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఈ వేరియెంట్ ధాటికి.. కర్ణాటక వ్యాప్తంగా ముగ్గురు మరణించారు. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. అయితే వాళ్ల వయసులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మరణాలకు కారణమా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కొత్త కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో.. కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ►వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం.. కేవలం జేఎన్.1 కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. ►తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా సోమవారం మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. ►తెలంగాణలో సోమవారంనాటికి 10 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకరు వైరస్ బారిన నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. మరోవైపు ఏపీలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 24కి చేరింది. కొత్త వేరియంట్గా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 ఉపరకం కేసుల భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. ఇప్పటికే నమోదు అయిన కేసుల శాంపిల్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు.. ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. ►జేఎన్.1 అంత ప్రమాదకరమైందేం కాదని మొదటి నుంచి వైద్య నిపుణులు, ఆఖరికి డబ్ల్యూహెచ్వో కూడా చెప్పింది. అయితే వైరస్ తేలికపాటిదే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు చెబుతూ వస్తోంది. తాజాగా కొత్త వేరియెంట్ కేసుల విజృంభణ నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
భారత్లో కరోనా: 17 రాష్ట్రాల్లో కేసులు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా.. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక..రాజస్థాన్లో ఒకరి చొప్పున వైరస్ బారినపడి మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్.. అదే జరిగితే తట్టుకోగలమా? -
‘జేఎన్ 1’పై జాగ్రత్త
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘జేఎన్ – 1’ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అత్యంత బలమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ను అప్రమత్తం చేయాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులకు రాకుండానే రికవరీ జేఎన్–1 వేరియంట్పై ప్రస్తుతానికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. దీని బారిన పడ్డవారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆస్పత్రుల వరకూ రాకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. దీనికి డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తెలిపారు. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తుల శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్కు తరలించి వేరియంట్లను విశ్లేషిస్తున్నామన్నారు. సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్సకు అవసరమైన మందులన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ సదుపాయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. పీఎస్ఏ ప్లాంట్లు సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు ఇందులో పాల్గొన్నారు. సన్నద్ధత ఇలా.. ♦ రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్లలోని 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను యాక్టివేట్ చేసిన వైద్య శాఖ. రోజుకు కనీసం వెయ్యి పరీక్షల నిర్వహణ. ♦ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణ. ♦ వైరస్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేలా గ్రామ/వార్డు సచివాలయాల్లో ఐదు చొప్పున ర్యాపిడ్ కిట్లు అందుబాటులో. ♦ శబరిమల, కేరళ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు స్క్రీనింగ్. వీరిపై ప్రత్యేకంగా ఫోకస్. ♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 జనరల్, 34,763 ఆక్సీజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకల చొప్పున మొత్తం 56,741 పడకలు అందుబాటులో. -
కరోనా నిరోధకానికి హోమియో మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా జెఎన్1 వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా రెండు హోమియో ఔషధాలు వాడి ఎవరికి వారు రక్షించుకోవచ్చని ప్రముఖ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు ‘సాక్షి’కి తెలిపారు. అర్సెనిక్ ఆల్బం 30 (Arsenic Album 30)ను వరుసగా 3 రోజులు, ఇన్ఫ్లుయెంజినమ్ 30 (Influenzinum 30)ను వరుసగా 3 రోజులు వాడాలి. ఉదయం 7 గంటలకు పరగడుపున నాలుకపై ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే చాలు. ఇలా ఒకొక్క మందును వరుసగా 3 రోజులు, రోజుకు ఒకసారి మాత్రమే.. మొత్తం వరుసగా 6 రోజులు వాడాలి. ప్రామాణిక జర్మనీ కంపెనీ మదర్ టింక్చర్లు వాడితే ఫలితం బాగుంటుందని డా. సురేంద్ర రాజు వివరించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందులు ఒక విడత వాడితే రోగనిరోధక శక్తి ఇనుమడించి సురక్షితంగా జీవించ వచ్చన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలు.. అశ్రద్ధ వద్దు
ఏడాదిన్నర కిందట కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. విపరీతమైంగా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కోవిడ్తో ఆస్పత్రుల్లో చేరారు చాలామంది. వైరస్ ఉధృతిని తట్టుకోలేక.. అదే సమయంలో వాళ్లకున్న ఆరోగ్య సమస్యలతో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. జనాలు కరోనాను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. కరోనాతో మమేకమై బతికేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అయితే.. ఆ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 ఇప్పుడు భారత్లో మళ్లీ కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ జేఎన్.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్లో ఇది అక్కడ విజృంభించింది. తాజాగా.. డిసెంబర్ మొదటివారంలో చైనాలోనూ కేసులు వెలుగుచూశాయి. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. జేఎన్.1 వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏం కాదు.. ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. ఇది ఇప్పుడు వైద్యనిపుణులు చెబుతున్నమాట. ఈ మాటనే.. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ఆధారంగా సమర్థించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ.. పెరుగుతున్న కేసులు చలికాలం.. ఫ్లూ సీజన్. ఇదంతా కామన్ అని అనుకుంటారంతా. కానీ, ఏడు నెలల తర్వాత కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల. కొత్త వేరియెంట్ కేసుల గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫిగర్ దాటే దిశగా కరోనా మరణాలు. ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి?. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్లే కేసుల్లో రోజూవారీ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. లక్షణాలివే.. జ్వరం, ఒళ్లు నొప్పులు జలుబు.. ముక్కు కారడం, గొంతు నొప్పి, వాసన-రుచి శక్తిని కోల్పోవడం, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, గ్యాట్రిక్ సమస్య వాంతులు, విరేచనాలు మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్ష్యం వద్దు. దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్గా తేలితే.. ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండేవాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరస్సే సోకకుండా జాగ్రత్త పడొచ్చు. సామాజిక వ్యాప్తికి ఎంట్రీ దశలో.. నవంబర్కు ముందు దాకా.. భారత్లో ఇన్ఫ్లూయెంజా కేసుల్లో 1 శాతం మాత్రమే కోవిడ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. నవంబర్ తర్వాత నుంచి 9 శాతంగా బయటపడ్డాయి. ఇప్పుడది.. 30 శాతంకి చేరింది. అందుకు ఉదాహరణగా.. కొచ్చిలో ఒక్కరోజు వ్యవధిలో జ్వరాలు, జలుబులతో కొందరికి టెస్టులు చేశారు. వాళ్లలో 30% మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ పేషెంట్ల ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు పరీక్షలు చేయించగా.. వాళ్లలో కూడా కొందరికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కేరళలోనే కాదు.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.. ఇలా పలు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియెంట్ కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. అక్కడా టెస్టులు చేస్తే అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు నిపుణులు. అధ్యయనాల సంగతి గుర్తు చేస్తూ.. కోవిడ్ అంటే లైట్.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని అనుకునేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. కానీ, కోవిడ్ను సాధారణ జలుబు జ్వరం ఎంతమాత్రం అనుకోవద్దని.. తీసి పారయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారామె. శరీరంపై సుదీర్ఘకాలం ప్రతికూల ప్రభావం చూపెడుతుందని.. గుండెజబ్బులతో పాటు మానసిక సమస్యలకు కారణమవుతుందని పలు అధ్యయనాల నివేదికల్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ద్వారా ప్రకటించిన ఆరోగ్య-అత్యవసర పరిస్థితి ముగిసినా.. మానవాళి ఆరోగ్యం మీద అది చూపించే ప్రతికూలత తగ్గలేదనే అంటున్నారామె. తట్టుకోగలమా? కరోనా తొలినాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. ప్రాణాంతక డెల్టా వేవ్ను ఎదుర్కొన్న అనుభవమూ ఉండొచ్చు. వ్యాక్సినేషన్ అందించే ధైర్యం మరో కారణం కావొచ్చు. కానీ, ఇప్పుడు గనుక కేసులు పెరిగితే?.. ఒమిక్రాన్ ఉపరకం అయినా జేఎన్.1.. మాతృక వేరియెంట్లాగే చెలరేగిపోతే!. వైరస్ బారినపడి వాళ్లకు దానిని తట్టుకోగలిగే శక్తి లేకపోతే. ఆ భారం ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై కచ్చితంగా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంచెం జాగ్రత్త ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైరస్ సోకుండా జాగ్రత్తలు పాటించడం కష్టమేమీ కాదు. వయసు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, పిల్లలు, మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మాస్క్లు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’.. తాజా సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచన ఇది. -
HYD: కరోనా కొత్త వేరియంట్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారత్లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్-1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది. -
ఏపీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
సాక్షి,విజయవాడ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందునే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ‘ఏపీ నుంచి ఈ సీజన్లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారు. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు. ‘ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్ వచ్చిన వారిలో కోవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో పరీక్షలు చేస్తాం’ అని చెప్పారు. జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జెఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్లకు, కోవిడ్ మందులకి కొరత లేదు’అని కృష్ణబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలి. విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలి. గ్లౌజ్లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా ఉంచాలి. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు ఐసోలేషన్లో ఉండాలి. దీనితో పాటు రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజల్ని కోరారాయన. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు. ఇదీచదవండి..జమ్ములో ఆంధ్రప్రదేశ్ జవాను మృతి -
జేఎన్.1పై WHO కీలక ప్రకటన
జెనీవా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. జేఎన్.1 వేరియెంట్ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది. వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: భారత్లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
తెలంగాణలో కొత్త వేరియెంట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది. కొత్త వేరియెంట్ విజృంభించే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా కేసుల్లో స్వాబ్ నమునాలను పరీక్షలకు పంపగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చలికాలం కావడంతో ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్ జేఎన్.1 కలకలం రేగింది. దీంతో చాలామంది కరోనా పరీక్షలకు వెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇందులో నాలుగు పాజిటివ్గా తేలాయి. వాళ్లకు సోకిన వేరియెంట్ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. మరోవైపు కేంద్రం సూచనతో రాష్ట్ర వైద్య విభాగం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్పై దృష్టిసారించింది. కేరళ, శబరిమల నుంచి వచ్చిన వాళ్లను ట్రేస్ చేసి.. పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో యాభై బెడ్లతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. వెంటిఏటర్లు, ఆక్సిజన్ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులో ఉంచారు. -
కరోనా వేరియంట్ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్లో బెడ్స్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్. ఇది కూడా చదవండి: భారత్లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
భారత్లో కరోనా.. JN.1 ప్రమాదకారా?
దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజా కేసులపై మంగళవారం అప్డేట్ ఇచ్చింది. 142 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 వేరియెంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళలో కరోనా కొత్త వేరియెంట్ జేఎన్.1 వేరియెంట్ వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ వేరియెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమై.. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు మాస్క్ తప్పనిసరి చేసింది. కర్ణాటక, కేరళ సరిహద్దులో బందోబస్తును పెంచినట్లు ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. కేరళలో పాజిటివ్ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపి వేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్ చేస్తామని చెప్పారు. జేఎన్.1 అమెరికాలో.. కరోనా ఇప్పుడు అత్యవసర పరిస్థితికి దారి తీయకపోయినా.. అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియెంట్లు వెలుగు చూస్తున్నాయి. జేఎన్.1 వేరియెంట్ కేసులు అమెరికా, చైనా తర్వాత భారత్లో బయటపడుతున్నాయి. ఒమిక్రాన్లోని పిరోలా వేరియెంట్(బీఏ.2.86)కి జేఎన్.1 ఉపరకం. జేఎన్.1 వేరియెంట్ తొలి కేసు అమెరికాలో సెప్టెంబర్లో వెలుగు చూసింది. ఇప్పటివరకు 11 దేశాల్లో ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. డిసెంబర్లో చైనాలో 7 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా వైద్య విభాగం సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ హెచ్చరించింది. భారత్లో ఎలాగంటే.. దేశంలో తొలిసారి.. కేరళ తిరువనంతపురం కారకుళంలో జేఎన్-1 స్ట్రెయిన్ కేసు వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలికి జరిగిన ఆర్టీ పీసీఆర్ పరీక్షలోనే ఇది బయటపడింది. అయితే పెషెంట్ మరణంతో జేఎన్-1 వేరియెంట్పై ఆందోళన వ్యక్తం కాగా.. సదరు పేషెంట్ వైరస్ వల్లే మరణించలేదని, కిడ్నీ ఇతరత్ర సమస్యల కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత వేరియెంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ అంత వేగంగా జేఎన్.1 వ్యాప్తి చెందట్లేదని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే.. వ్యాప్తి మాత్రం ఉంటుందని, చలికాలం సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టతరంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. జేఎన్.1 కరోనా వైరస్ గతంలో వైరస్ నుంచి కోలుకున్నవాళ్లకు, అలాగే ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ సోకుతుందని.. అయితే ఈ వేరియెంట్ వ్యాక్సిన్లకు లొంగే రకమని గురుగ్రామ్ సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన వైద్యుడు తుషార్ తయాల్ తెలిపారు. లక్షణాలు.. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. గత వేరియెంట్లతో పోలిస్తే జేఎన్.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆస్పత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. ఇన్ఫెక్షన్ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. సింగపూర్లో ఉధృతం.. ఆసియా దేశం సింగపూర్లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56 వేల కేసులు.. అదీ వారం వ్యవధిలోనే నమోదు కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను తప్పనిసరి చేసింది ఆ దేశం. కేసుల్లో పెరుగుదల కనిపిస్తే లాక్డౌన్ విధించే ఆలోచన చేస్తామని అక్కడి ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తికి జేఎన్.1 కారణమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
కేరళలో కోవిడ్ వేరియంట్
పత్తనంతిట్ట: కేరళలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు బయటపడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం ప్రకటించారు. అయితే, దీనితో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని నెలల క్రితం సింగపూర్ ఎయిర్పోర్టులో భారతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ సందర్భంగా ఈ సబ్ వేరియంట్ను గుర్తించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వేరియెంట్లను గుర్తించారు. తాజాగా, జేఎన్.1 ఉప వేరియెంట్ తిరువనంతపురం కరకుళంలో బయటపడింది. దీనితో కంగారు పడాల్సిన పనిలేదు’అని మంత్రి అన్నారు. అయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్ )సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక శాంపిల్లో ఈ వేరియంట్ను నవంబర్ 18న గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి పేర్కొంది. 79 ఏళ్ల బాధిత మహిళ ఇన్ప్లూయెంజా వంటి తేలికపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారని వివరించింది. -
ప్యూర్ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్ బైక్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ తమ కొత్త మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని ఆవిష్కరించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే 171 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ప్రతి రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది. దీనితో నెలవారీగా రూ. 7,000 పైచిలుకు ఆదా కాగలదని వివరించింది. దీని ధర రూ. 1,29,999గా ఉంటుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వదేరా తెలిపారు. సులభతరమైన ఈఎంఐ సదుపాయం రూ. 4,000 నుంచి ఉంటుందని పేర్కొన్నారు. 110 సీసీ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోటార్సైకిల్స్తో దీటుగా పోటీపడగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇందులో రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 75 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
కియా సెల్టోస్ కొత్త వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా సెల్టోస్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవెల్–2 సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-లైన్ (ఎస్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఇవి తయారయ్యాయి. ఎక్స్షోరూలో ధర రూ. 19.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా వెల్లడించింది. -
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా ఉధృతితో పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారారు. ఊహించని ముప్పుతో ప్రాణాలు విడిచారు. అంతలా ప్రజలను భయాందోళనకు గురిచేసిన మహమ్మారి పీడ ప్రస్తుతం విరిగిపోయినట్లే కనిపిస్తుంది. భారత్లో గత కొన్ని నెలలుగా వైరస్ కేసులు పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు హమ్మయ్యా అనుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 (EG.5) అనే వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్బీబీ 1.9.2 స్ట్రెయిన్తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్లో అదనంగా ఒక మ్యూటేషన్ (జన్యుమార్పు) కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్.. అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందని వెల్లడించారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డా. డేవిడ్ హో ఈ వైరస్పై పరిశోధన చేస్తున్నారు. కరోనా టీకాలతో శరీరంలో ప్రేరేపితమైన యాంటీబాడీల నుంచి ఈ వైరస్ ఏమేరకు తప్పించుకుంటోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి ఈ రెండు కొత్త వేరియంట్లు కొంత మేర తప్పించుకోగలుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. XBB సిరీస్లోని ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్స్తో వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈజీ.5 వేరియంట్ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. మరోవైపు ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి.. ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. -
మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్..
ముంబయి: కరోనా పేరు విని చాలాా రోజులు అయి ఉంటుంది! ఎక్కడా పెద్దగా కేసులు నమోదుకాకపోవడంతో ఇక అయిపోయిందని అనుకున్నాం. కానీ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ వచ్చి.. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కరోనా మొదటి, రెండవ దశలో ఎక్కువగా నష్టపోయిన మహారాష్ట్రలోనే మళ్లీ కొత్త రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త రకం కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ రకానికి చెందిన కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా ముంబై లో 43 కేసులు నమోదయ్యాయి. పూణేలో 34 కేసులు వెలుగులోకి రాగా.. థానేలో 25 చొప్పున యాక్టీవ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య రంగాన్ని అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కొత్త రకం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కులు తరహా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్ -
బాబోయ్ ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్బోర్డ్లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది. రెనాల్ట్ కైగర్ ఎక్స్టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్బ్యాగ్లు, ప్రీ-టెన్షనర్లతో కూడిన సీట్బెల్ట్లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్స్క్రీన్, ఎన్ఈడీ హెడ్ల్యాంప్లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్పై డిస్కౌంట్ కొత్త వేరియంట్ లాంచ్తో పాటు, Renault RXZ ట్రిమ్పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్లను కూడా ప్రకటించింది ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ! -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్లోగా ఒక ఎస్యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ వస్తుందా?
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్బీబీ.1.16 వైరస్ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది. ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది. -
అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?
చైనాలోని ఊహాన్లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్లంటూ వస్తూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆల్ఫా, డెల్టా అంటూ తీవ్రమైన వేరియెంట్ల రూపంలో అనేక మంది ఉసురు తీశాయి. మూడో వేవ్గా వచ్చిన ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదుగానీ ఇంతలోనే ఒమిక్రాన్ తాలూకు మరో సబ్–వేరియెంట్ అయిన ఎక్స్బీబీ 1.5 వచ్చి అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. భారత్లోని ఇంటికొకరు చొప్పున అమెరికాలో నివాసముంటూ... రోజూ కొన్ని లక్షల మంది యూఎస్ నుంచి ఇండియాకీ, ఇక్కణ్ణుంచి మళ్లీ యూఎస్కు వెళ్తూ వస్తూ, పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఈ సబ్ వేరియెంట్ ప్రమేయం (రెలవెన్స్) ఏమిటీ, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి జీవీ తన మనుగడ కోసం కొత్త మ్యూటేషన్స్తో ముందుకంటే మరింత సమర్థమైన జీవిగా పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఒమిక్రాన్ సబ్–వేరియెంట్ కూడా జన్యుపరమైన మార్పులను చేసుకుంటూ 500 కంటే ఎక్కువ రూపాలను సంతరించుకుంది. ఈ ఎక్స్బీబీ 1.5 కూడా ఇలాంటి ఓ కొత్త సబ్–వేరియెంటే! ఎక్స్బీబీ 1.5 అనే ఈ తాజా సబ్–వేరియెంట్... రెండు రకాల వేరియంట్స్ కలిసినందువల్ల, మరో కొత్త వేరియంట్ గా మారింది. అంటే... బీజే–1 (బీఏ.2.10.1.1) అనే ఒక వేరియంటూ, అలాగే బీఏ.2.75 (బీఏ.2.75.3.1.1.1) మరో వేరియెంట్ల కలయిక వల్ల ‘ఎక్స్బీబీ’ అనే ఈ సబ్–వేరియంట్ పుట్టుకొచ్చింది. అది మరొక మ్యుటేషన్కి గురికావడంతో తాజాగా తన ప్రభావం చూపిస్తున్న ఈ ‘ఎక్స్బీబీ – 1.5’ తయారయింది. ఈ సబ్–వేరియెంట్ పుట్టుకకు కారణమైన మ్యుటేషన్ని ‘ఎఫ్486పీ’ అని పిలుస్తున్నారు. దీనికి ఓ ముద్దుపేరూ ఉంది... ఎక్స్బీబీ 1.5కి ఓ ముద్దు పేరూ ఉంది. ‘క్రాకాన్’ అన్నది దీని పెట్నేమ్. అంటే ‘సముద్ర భూతం’ అని అర్థం. అయితే... ఈ నిక్–నేమ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇవ్వలేదు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనికా పేరు పెట్టారు. ఇందుకో కారణం కూడా ఉంది. అదేమిటంటే... ఒమిక్రాన్కు ఉన్న అనేక వేరియంట్ల కంటే కూడా... ఈ ‘ఎక్స్బీబీ–1.5’ అన్నది మానవ వ్యాధినిరోధక వ్యవస్థను (ఇమ్యూనిటీని) తప్పించుకోవడంలో దిట్ట అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఎక్స్బీబీ 1.5’ సబ్–వేరియెంట్... మునుపటి వేరియంట్ల కంటే మరింత తేలిగ్గా, మరింత బలంగా ‘ఏసీఈ2 రిసెప్టార్’లతో అనుసంధానితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే వారు ఈ సబ్–వేరియంట్కు ‘క్రాకన్’ అనే నిక్–నేమ్ ఇచ్చారు. మనదేశంలో ఎక్స్బిబి 1.5 వ్యాప్తికి అవకాశమెంత? ఇప్పుడు ప్రపంచంలోని ఓ మూల నుంచి మరో మూల వరకు రాకపోకలు మామూలైపోయాయి. ప్రపంచమో పల్లెటూరుగా మారినందుకే ఇప్పుడు భూగోళాన్ని ‘గ్లోబల్ విలేజ్’ అంటూ అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ కొత్త వేరియంట్ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలకూ, ఆ మాటకొస్తే మన దేశానికి సైతం పాకే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఒకసారి భారత్కు వచ్చాక మన దేశవాసులు ఈ ఎక్స్బిబి 1.5 తో ఎలాంటి ఇబ్బందులకు లోనవుతారనే విషయాన్ని అంచనా వేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఒమిక్రాన్ కారణంగా మన దేశవాసుల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా వచ్చింది. అందువల్ల వేగంగా విస్తరించినప్పటికీ ఈ ‘ఎక్స్ బి బి 1.5’ మన దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు. అందుకే ఈ వేరియంట్ వల్ల మనదేశవాసులంతా భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ వ్యాధినిరోధక శక్తి కాస్తంత తక్కువగా ఉన్నవారు, ఇతరత్రా వ్యాధులతో ఇప్పటికీ బాధడుతున్నవారు మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? అమెరికాలోని వ్యాధుల నిపుణురాలు (ఎపిడిమియాలజిస్టు) అయిన మేరియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా వైరస్ల కన్నా ఈ ఎక్స్బీబీ 1.5 చాలా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు ప్రస్తుతం దీని ప్రభావం అమెరికాతో పాటు మరో 29 దేశాలలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘అందువల్ల అమెరికా మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజలతో పాటు అమెరికా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్లాంటి దేశాల ప్రజలూ, విమాన ప్రయాణీకులందరూ మునపటిలాగే మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు చేపట్టడం అవసరం’’ అంటూ ఆమె (మేరియా) పేర్కొన్నారు. ఇక గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం బూస్టరు డోసులు తీసుకోవాలంటూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచిస్తోంది. నిర్ధారణ పరీక్షలు గతంలో మాదిరిగానే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గాని రాపిడ్ టెస్టుల్లో గాని ఈ వేరియంట్ కూడా తక్కిన ఒమిక్రాన్ వేరియంట్లలా బయటపడుతుంది. ఈ వేరియంట్ లక్షణాలేమిటి? మిగతా కరోనా వేరియెంట్లు, ఒమిక్రాన్ మాదిరిగానే ఎక్స్బిబి 1.5 కూడా... జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు కలగజేస్తుంది. వృద్ధుల్లోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి (ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్)లోనూ, ఇప్పటికే ఇతరత్రా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న(కో–మార్బిడిటీ)వారిలో ఈ వేరియెంట్ కాస్తంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండవచ్చు. అంతే తప్ప మిగతా వారందరిలో ఇదో చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తగ్గిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. మందులేమిటీ/ నివారణ ఏమిటి? ఈ వేరియెంట్కు ‘మోనోక్లోనల్ యాంటీ బాడీ’ ఇంజక్షన్లు పనిచేయవు. ఇప్పటికే భారతదేశంలో అనుమతి పొందిన ‘పాక్స్ లోవిడ్’ ట్యాబ్లెట్లు ఈ సబ్–వేరియంట్కి కాస్తంత సమర్థంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బై వాలెంట్ కరోనా వ్యాక్సిన్లు దీని నుంచి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గతంలో మాదిరిగానే మాస్కులు ధరించడం, సబ్బుతోగానీ, శ్యానిటైజర్లతోగానీ చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఇంటినీ, పరిసరాలను డిస్–ఇన్ఫెక్టెంట్లతో తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాల్లోకి, గుంపుల్లోకి (క్రౌడ్స్లోకి) వేళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలను పాటిస్తే చాలు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా?
వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ ఎక్స్బీబీ.1.5(సూపర్ వేరియంట్) ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ సూపర్ వేరియంట్ కారణమవుతున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్7తో పాటు ఎక్స్బీబీ.1.5 సూపర్ వేరియంట్పై ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం ఎక్స్బీబీ వేరియంట్గా పేర్కొన్నారు మిన్నేసోటా వర్సిటీ నిపుణులు డాక్టర్ మిచెల్ ఓస్టెర్హోమ్. అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలోని 7 రాష్ట్రాల్లో ఎక్స్బీబీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో బీఏ.2, ఎక్స్బీబీ, ఎక్స్బీబీ1.5ల కారణంగా 44.1 శాతం కేసులు నమోదయ్యాయి. తొలికేసు భారత్లోనే.. ఎక్స్బీబీ వేరియంట్ను తొలుత భారత్లోనే ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. కొద్ది రోజుల్లోనే భారత్తో పాటు సింగపూర్లో ఈ వేరియంట్ వేగంగా విస్తరించింది. ఇది ఎక్స్బీబీ.1, ఎక్స్బీబీ1.5 వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు వేరుగా ఉన్నాయని, దీంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు జాన్ హోప్కిన్స్ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఎక్స్బీబీ.1.5 వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? ఎక్స్బీబీ1తో పోలిస్తే ఎక్స్బీబీ1.5 శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకోవటమే కాదు, రోగనిరోధక శక్తిని దాటుకుని కణాల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలాగే కీలక గ్రాహకాల ద్వారా కణాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుని హెచ్చరించారు. ఎక్స్బీబీ ఉప రకాలు పుట్టుకస్తున్న కొలది ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గిపోతుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో పాటు ఒకసారి సోకినవారికి సైతం మళ్లీ సులభంగా అంటుకుంటుందని వెల్లడించారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 ఇదీ చదవండి: భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్ -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ కొత్త వేరియంట్ల తయారీ కేంద్రంగా చైనా!
బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం! -
కొత్త వేరియంట్ ప్రభావం భారత్పై తక్కువే
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు. గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్కు తరలిస్తారు. ఆక్సిజన్పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. లోక్సభలో మంత్రి కీలక ప్రకటన
ఢిల్లీ: కరోనా పరిస్థితిపై లోక్ సభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా కీలక ప్రకటన చేశారు. పొరుగు దేశం చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియెంట్, మరణాలపైనా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గురువారం ఆయన లోక్సభలో ప్రసంగించారు. పొరుగు దేశం చైనాలో కేసుల పెరుగుదల.. ప్రపంచానికి ఒక హెచ్చరికలాంటిది. అక్కడి కేసుల పెరుగుదల, మరణాలను చూస్తున్నాం. పరిస్థితి ముందు ముందు మరింత ఘోరంగా అక్కడ మారే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే మన దగ్గర రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆయన కోరారు. ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని, కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆయన పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ప్రపంచంలో చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, భారత్లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. కాబట్టి, ఈ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చైనాలో కరోనా కేసులు, మరణాలు పెరగుతుండడం చూస్తున్నట్లు తెలిపారు. మహమ్మరి పరిస్థితిని అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉందని, గతంలో రాష్ట్రాలకు ఆర్థికంగానూ సహకరించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 220 కోట్ల వ్యాక్సిన్ షాట్స్ అందించినట్లు ఆయన ప్రకటించారు. పండుగలు, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో.. కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ప్రికాషనరీ డోసులు విషయంలో తగిన సూచనలు పాటించాలని కోరారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులలో RT-PCR టెస్టులు ప్రారంభించినట్లు, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మాన్షుక్ మాండవియా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్కు సంబంధించిన పరిణామాలను భారత్ గమనిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
కరోనా కొత్త వేరియంట్పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు) -
ఏపీ: కరోనాపై అప్రమత్తంగానే ఉన్నాం
సాక్షి, విజయవాడ: కోవిడ్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ నడుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ బుధవారం వెల్లడించారు. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయి. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి అని ఆయన వెల్లడించారు. దేశంలో చైనా నుంచి వచ్చిన కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. -
భారత్లోకి చైనా వేరియంట్ ఎంట్రీ.. అప్పుడే మూడు కేసులు..
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్కూ వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేరియంట్పై వివరాలు వెల్లడించారు నిపుణులు. బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవటం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి ఉప రకం. దీనికి ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ బీఎఫ్7 వేరియంట్ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు. విమానాశ్రయాల్లో హైఅలర్ట్.. చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే వారికి రాండమ్గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన -
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ‘జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్ నెట్వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.’ - కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి. ఇదీ చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు.. లక్షల్లో మరణాలు! -
జాగ్రత్తలు పాటించాల్సిందే!
రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దెబ్బకు బతుకులు దయనీయంగా మారిన తీరు అందరికీ జ్ఞాపకం ఉంది. కొన్నాళ్లపాటు లాక్డౌన్ పేరున అందరూ తలుపులు పెట్టుకుని ఇళ్లలోనే బందీలు అయిన సంగతి వెంటాడుతూనే ఉన్నది. అయినా చాలా మంది మూతికి మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతి మరచిపోయారు. గుంపులు గుంపులుగా చేరడం గురించి ఎవరూ భయపడడం లేదు. చేతులు, పరిసరాలను శానిటైజ్ చేసుకోవడమూ తగ్గిపోయింది. బహుశా కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడం వల్లనే చాలామంది ఇలా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నట్టున్నారు. అయితే కోవిడ్ పీడ ఇంతటితో విరగడైందని భావించరాదు. మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘సైన్స్’ పత్రికలో గ్రెచెన్ ఫోగెల్ అనే పరిశోధకుడు ఈ మధ్యనే ఒక పరిశోధన పత్రం వెలువరించాడు. మరొక పెద్ద కోవిడ్ వేవ్ రానున్నదని ఆ పత్రంలో ఆయన ప్రకటించాడు. కోవిడ్ గురించి బాగా పట్టించుకున్న వాళ్లకు ఒమిక్రాన్ అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. సార్స్ కోవ్ 2 అనే వైరస్ వల్ల కోవిడ్ వచ్చిందని తెలుసు. ఆ వైరస్లో జన్యు మార్పులు జరిగి కొత్త రకాలు వచ్చినట్టు కూడా తెలుసు. అందులో చివరిది ఒమిక్రాన్. అది కూడా మళ్లీ ఒకసారి మార్పులకు గురైందట. ఫలితంగా వచ్చిన మరో కొత్త రకానికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తట్టుకునే బలం ఎక్కువగా ఉందట. అటువంటి రకాలు ఒకటి కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు. చలికాలం ముంచుకు వస్తున్నది. అప్పటికల్లా ఈ కొత్త రకాలు తలెత్తవచ్చు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కొత్త కోవిడ్ కేసులు బాగా తరిగిన మాట వాస్తవమే. కానీ చైనా, యూరప్లలో అవి మళ్లీ తలెత్తుతున్నాయి. యూరప్లో వచ్చిన కేసులను బాగా పరిశీలించారు. అక్కడ రెండు రకాల వైరస్లు కనిపించాయి. అవి రెండూ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే బలం గలవని కూడా తెలిసింది. టీకా వేయించుకున్న వారికీ, అంతకుముందు వ్యాధి వచ్చి తగ్గిన వారికి కూడా ఈ కొత్త వైరస్ రకాల వల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ వైరస్ రకాల మీద పనిచేయగల వ్యాక్సిన్లను ఇచ్చారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఎక్కడ వచ్చినా ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘సైన్స్’ వ్యాసంలో వ్యాధి ముందుగా అమె రికా, యూరప్లలో కని పిస్తుంది అని వివరించారు. కరోనా వైరస్ కనిపించకుండా పోయింది, ఇక వచ్చే అవకాశం లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఈ కొత్తరకం వైరస్లు త్వరలోనే ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించ నున్నాయని మరికొన్ని పత్రికలు కూడా రాశాయి. కొత్త వేవ్ను తట్టుకునేందుకు ఏం చేయాలనే సంగతులపైనా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రస్తుతం బీఏ 2.75.2, బీక్యూ 2.1 అనే స్ట్రెయిన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. మనిషిలోని రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే బలం ఈ రెంటిలోనూ ఇంతకు ముందు వచ్చిన అన్నిరకాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇందులో బీక్యూ 2.1 రకం త్వరగా వ్యాపిస్తుంది కూడా! త్వరలోనే ఇది ప్రపంచమంతటా ఉత్పాతం కలిగిం చనుందనేది పరిశోధకుల అభి ప్రాయం. ఈ చలి కాలంలో వైరస్ గనుక వచ్చిందంటే దానితో పోరాడ డానికి అన్ని రకాలా మనం సిద్ధంగా ఉండాలి అని వారు హెచ్చ రిస్తున్నారు. వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ఏదో చేయాలని టీకాలు వేశారు తప్పిస్తే, ఎక్కువ కాలం ఆ వ్యాక్సిన్లు పనిచేసే తీరును గురించి పరిశీలించడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ దిశలోనూ శోధన జరగాలి. శాస్త్రవేత్తలు జనాన్ని భయపెట్టడం కోసం ఇటువంటి హెచ్చ రికలు చేయడం లేదు. రానున్న ముప్పు గురించి ముందుగానే జాగరూకులను చేయడం వారి విధి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. మన అజాగ్రత్త మరో మృత్యుహేలను సృష్టిస్తుందనేది అందరూ గుర్తించాలి. కేబీ గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
సేల్స్లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్పుట్, 170 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఒమిక్రాన్ కొత్త సబ్వేరియెంట్ గుర్తింపు.. కలకలం
ఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో కలకలం మొదలైంది. భారత్లోకి ప్రవేశించిన.. కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త సబ్వేరియెంట్ దేశరాజధానిలో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్లో ఈ సబ్వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75.. చాలా శాంపిల్స్లో గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు పెరిగిపోతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యా పెరుగుతోందని డాక్టర్ సురేష్ వెల్లడించారు. ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్వేరియెంట్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక 90 శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధ్యయనాలు చేస్తున్నారు. యాంటీ బాడీలు ఉన్నవాళ్లతో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవాళ్లపైనా ఇది ప్రభావితం చూపిస్తోందని వైద్యులు తెలిపారు. అయితే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వయసుపైబడిన వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేలకు పైనే కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 15.41 శాతంగా ఉంది. ఏడుగురు కరోనాతో మరణించగా.. ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో కేంద్రం.. అప్రమత్తం అయ్యింది. ఇదీ చదవండి: చైనాలో కొత్త వైరస్.. ఆందోళన -
టాటా టియోగో కొత్త వెర్షన్ కమింగ్ సూన్, అందుబాటు ధరలో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్ఆర్జీ మోడల్లో త్వరలోనే కొత్త వేరియంట్ను లాంచ్చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్టి ట్రిమ్’’ టీజర్ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్టీ వేరియంట్గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్లతో డిస్ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు. అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్జెడ్ హ్యాచ్బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. Do you chase the XTraordinary? Get ready for a dose of XTra eNeRGy coming your way! Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf — Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022 -
కరోనా సరికొత్త వేరియెంట్.. సెంటారస్!.. మనదేశంలోనూ ఉందా?
ఒకప్పుడు బాగా సైన్స్ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్. అయితే ఇది ఒమిక్రాన్ తాలూకు ఒక సబ్ వేరియెంట్గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక వైరస్ తాలూకు వేరియెంట్కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్ కలిసిపోయి... డెల్మిక్రాన్ వంటివీ, ఒమిక్రాన్ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్ వంటి మరికొన్ని సబ్వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్–వేరియెంట్ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్’. ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్ ఆస్టేల్’ అనే కోవిడ్ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు. తొలిసారిగా ‘నెదర్లాండ్’లో అవును ఉంది. సెంటారస్ (బీఏ 2.75) సబ్–వేరియెంట్ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత తీవ్రమైనదేమీ కాదు... ఈ సెంటరాస్ వేరియెంట్ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్ తర్వాత వచ్చిన సబ్–వేరియెంట్ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం. జెనీవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆంటోనీ ఫ్లాహాల్ట్ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్–సీవోవీ–2’ జీనోమిక్ కన్సార్షియమ్ కో–ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్లో ఒమిక్రాన్ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు... తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన. -
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ వేరియంట్ తొలిసారిగా భారత్లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని ఆయన వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్లో 18,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,17,893కు పెరిగాయి. చదవండి: (10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే) -
వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్కు సంకేతమా?
పారిస్: కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసిరేలా ఉంది. పలు దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్లో కోవిడ్ తీవ్ర రూపు దాల్చేలా ఉందని ఫ్రెంచ్ వ్యాక్సినేషన్ చీఫ్ అలేన్ ఫిష్చర్ అన్నారు. ఫ్రాన్స్-2 టెలివిజన్తో బుధవారం ఆయన మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇది మరో వేవ్కు సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఇదేమాదిరిగా అధిక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లతో కూడిన తాజా వేవ్ తీవ్రత ఎలా ఉంటుందన్నదే అసలైన సవాల్ అని వ్యాఖ్యానించారు. ఐసీయూలో వెంటిలేటర్పై పాక్ దిగ్గజ క్రికెటర్ భౌతిక దూరం పాటించడం, జనం గుంపులోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇతర యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పోర్చుగల్లో రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వెలుగుచూశాయని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు తెలిపారు. అయితే, వ్యాప్తిలో వేగం ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. కాగా, మంగళవారం ఒక్కరోజే ఫ్రాన్స్లో 90 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు -
గుజరాత్లో కొత్తవేరియెంట్ ఎక్స్ఈ కేసు గుర్తింపు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్లో అత్యంత వేగవంతంగా వ్యాపించే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియెంట్ కేసు గుజరాత్లో నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. గుజరాత్లో మార్చి 13న కరోనా బారిన పడ్డ సదరు పేషెంట్.. వారం తర్వాత కోలుకున్నాడు. అయితే శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్లో సదరు పేషెంట్ ఎక్స్ఈ సబ్ వేరియెంట్ బారినపడినట్లు తెలుస్తోంది. అతని వివరాలు, ట్రావెల్ హిస్టరీ తదితర వివరాలను వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో ముంబైలో తొలి ఎక్స్ఈ కేసు నమోదు అయ్యిందని అధికారుల ప్రకటన హడలెత్తించింది. అయితే కేంద్రం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. ఒమిక్రాన్లో బీఏ-2 అత్యంత వేగంగా వ్యాపించే వేరియెంట్గా గుర్తింపు ఉండేది. ఈ జనవరిలో యూకేలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్ఈను.. ఒమిక్రాన్ బీఏ-2 కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించే వేరియెంట్గా గుర్తించారు. ఇది అంత ప్రమాదకరమైంది ఏం కాదని, కాకపోతే వేగంగా వ్యాపించే గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో 18 ఏళ్లు పైబడినవాళ్లకు మూడో డోసు(ప్రికాషన్) వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. -
కొత్త వేరియెంట్ XE కేసుపై సందిగ్ధం!
Mumbai XE Variant Case: ముంబై(మహారాష్ట్ర)లో ఒమిక్రాన్ మ్యూటేషన్ కొత్త వేరియెంట్ ఎక్స్ఈ(XE) కేసు వెలుగు చూసిందంటూ వార్తలు హోరెత్తిన విషయం తెలిసిందే. నెల కిందట సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్(50)కు చెందిన శాంపిల్స్లో వేరియెంట్ ఆనవాలు గుర్తించినట్లు బీఎంసీ(బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) బుధవారం ప్రకటించుకుంది. అయితే.. ఈ విషయంలో ముంబై అధికారులు తొందరపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. కరోనా వైరస్లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియెంట్ను వేగంగా వ్యాపించేదిగా గుర్తించారు వైద్యులు. ఒమిక్రాన్లో బీఏ.2 ఉపవేరియెంట్ వ్యాప్తి ఇంకా వేగంగా ఉండేదని అనుకున్నారు. అయితే ఇంతకంటే పది రెట్లు ఎక్స్ఈ వేరియెంట్ వ్యాపించే గుణం ఉందని, అయినా అంతప్రమాదకరమైంది కాదని, కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా మాత్రం ఉండాలంటూ.. వైద్య నిపుణులు దానిని గుర్తించినప్పుడే హెచ్చరించారు. తాజాగా దేశంలోనే తొలి ఎక్స్ఈ కేసుగా బీఎంసీ ప్రకటించుకుంది. గ్లోబల్ జెనోమిక్ డాటా ప్రకారం.. అది ఎక్స్ఈ అని తేల్చేసింది కూడా. కానీ.. కేంద్ర ఆరోగ్య సంస్థ ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్ మాత్రం అది ఎక్స్ఈ కేసు కాదని కొట్టిపారేసింది. బీఎంసీ అభ్యర్థన నేపథ్యంలో.. మరో దఫా ఆ శాంపిల్స్ను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్కు శాంపిల్స్ను పంపించింది. ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈలోపే ముంబైలో తొలి ‘ఎక్స్ఈ’ కేసు నమోదు అయ్యిందని ప్రకటించడాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు తప్పుబడుతున్నాయి. అది ఎక్స్ఈ కేసుగా ఇంకా ధృవీకరణ కాలేదని కేంద్ర ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సూచనల మేరకు.. బీఎంసీ అధికారులు సైతం నివేదికలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత మేం ఆ శాంపిల్ను ఎక్స్ఈ కేసుగానే భావించాం. కానీ, జీనోమిక్ పిక్చర్తో అది సరిపోలకపోవడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్టులకు పంపించాం’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ పాటికే దాని ప్రభావం చూపాల్సి ఉందని, ప్రస్తుతానికి భారత్లో ఎక్స్ఈ కేసులు నమోదు అయినట్లు తాము భావించడం లేదని ఆయన అంటున్నారు. యాభై ఏళ్ల వయసున్న సౌతాఫ్రికన్ మహిళ.. ఫిబ్రవరి 10వ తేదీన భారత్కు వచ్చారు. ఫిబ్రవరి 27న ఆమెకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ఓ హోటల్ గదిలో క్వారంటైన్లో ఉంచారు. ఆపై శాంపిల్ను కస్తూర్బా ఆస్పత్రి లాబోరేటరీకి జీనోమ్సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అందులో ఎక్స్ఈ వేరియెంట్గా నివేదిక రావడంతో ముంబై అధికారులు ప్రకటన చేశారు. విశేషం ఏంటంటే.. ఆమెకు స్వల్పలక్షణాలే ఉండగా.. మరోసారి టెస్ట్ నిర్వహించినప్పుడు నెగెటివ్గా తేలిందంట. ఆ తర్వాత మరోసారి టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఎక్స్ఈ వేరియెంట్.. ఒమిక్రాన్ స్ట్రెయిన్లు బీఏ.1, బీఏ.2ల మ్యూటెంట్ వేరియెంట్. జనవరి 19న ఈ ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియెంట్ తొలి కేసును యూకేలో గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభణకు కారణం.. ఇదే. సంబంధిత వార్త: కొత్త వేరియంట్ ఎక్స్ఈ.. లక్షణాలివే! -
కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల్లో కోవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది ఒమిక్రాన్ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. వైరస్ స్థిమితంగా ఉండటం లేదు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్వేవ్కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు ఏ వేరియెంట్పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. వారికి బూస్టర్ డోస్లు మంచిది 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్లు ఇవ్వడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్డోస్లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
ఇజ్రాయెల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష చేయగా కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ రెండు స్ట్రెయిన్లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉన్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడు డోసులు పొందినట్లు సల్మాన్ జర్కా వెల్లడించారు. -
మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు
పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్ డోస్ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్లు, 7.68 మిలియన్లు రెండవ డోస్లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్లు వేశారు. (చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక ప్రకటన) -
బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ కార్లకు భారీ ఆదరణ నెలకొంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా సరికొత్తగా రెనాల్ట్ క్విడ్ MY22 ఆర్ఎక్స్(ఓ)కారును లాంచ్ చేసింది. రెనాల్ట్ క్విడ్ను కంపెనీ 2015లో ప్రారంభించగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా క్విడ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్విడ్ అమ్మకాలను మరింత పెంచేందుగాను రెనాల్ట్ ఇండియా సరికొత్త MY22 రెనాల్ట్ క్విడ్ను RXL(O) వేరియంట్ను తీసుకొచ్చింది. ఈ కారు 1.0L MT, 0.8L రెండు ఎంపికలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. డిజైన్లో సరికొత్తగా..! క్విడ్ క్లైంబర్ ఎడిషన్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కలర్తో స్పోర్టీ వైట్ యాక్సెంట్లను కలిగి ఉంది. 8 అంగుళాల టచ్స్క్రీన్ MediaNAV ఎవల్యూషన్తో ఇన్ఫోటైన్మెంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్కు సపోర్ట్ చేయనుంది. ఈ కారుకు సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో మరింత ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటుగా రివర్స్ పార్కింగ్ కెమెరా , ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎమ్ ఉన్నాయి. ధర ఎంతంటే..! 2022 రెనాల్ట్ క్విడ్ లాంచ్ ధర రూ. 4.49 లక్షలుగా(ఎక్స్షోరూమ్) ఉంది. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్తో మెటల్ మస్టర్డ్ , ఐస్ కూల్ వైట్, మోనోటోన్ మూన్లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ కలర్ ఆప్షన్లలో 2022 MY22 రెనాల్ట్ క్విడ్ అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! కొత్త క్విడ్లో ఎలాంటి మెకానికల్గా ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికతో అందుబాటులో ఉండనుంది. 0.8-లీటర్ ఇంజన్ క్విడ్ 53 బిహెచ్పి, 72 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది. మరొక వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్67 బీహెచ్పీ, 91 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో స్టాండర్డ్గా వస్తుంది. చదవండి: మహీంద్రా థార్కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..! -
కొత్త వేరియంట్ కలకలం.. చైనాలో లాక్డౌన్.. టెన్షన్లో ప్రపంచ దేశాలు..!
బీజింగ్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంతోషంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్గా పిలువబడే షెన్జెన్లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్జెన్లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్జెన్లోనే ఉన్నాయి. షెన్జెన్ నగరం హంకాంగ్తో సరిహద్దును కలిగి ఉంది. ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్లో శుక్రవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్ డాంగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. -
Coronavirus: జూన్లో నాలుగో వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులు 8,013 దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది. -
Corona Latest Updates: కరోనాపై గుడ్ న్యూస్
-
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
మాస్కులు త్వరలో పోతాయి
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. యువతపై ప్రభావం యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. -
మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
Wuhan Scientists Warn, New Corona NeoCov Found in South Africa: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్లతో సతమతమై ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా మరో బాంబ్ పేల్చింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలే ఈ కొత్త మహమ్మారి గురించి వార్నింగ్ బెల్స్ మోగించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాలు రేటు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టుల వార్నింగ్ ఇచ్చారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2012-15 పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్కు నియోకోవ్కు సంబంధం ఉందని వెల్లడించారు. నియోకోవ్ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. సార్స్కో-2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్తో కలిసి వ్యూహాన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయో ఆర్షయోలో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు. చదవండి: (తరోన్ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ) -
పారాసెటమాల్ 650 ఎంజీ చాలు.. అనవసర మందులు వాడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసెటమాల్ 650 ఎంజీ వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ప్రేమ్కుమార్ తెలిపారు. అనేక దేశాలు, డబ్ల్యూహెచ్వో దీనినే నిర్ధారించాయని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర అంశాలపై డాక్టర్ ప్రేమ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఒమిక్రాన్ బారిన పడిన వారు పారాసెటమాల్ మూడు పూటలా మూడు నుంచి ఐదు రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవాలి. కొందరిలో ఐదు రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడే వారు బుడెసోనైడ్ ఇన్హేలర్ను 800 మైక్రో గ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా పనిచేయదు. హోమ్ ఐసోలేషన్ ప్రధానం సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది. వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే ఇరువురు ఎన్–95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు మూడు రోజులు దాటి తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్లు తిరిగిపడటం, మగత వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. ఒకే ప్రభావం ఉండదు ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైనా ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే. యువత, ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో, చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. -
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐఏఎస్ అధికారులు, వారి బాధ్యతలు ► ఎం.టి.కృష్ణబాబు: కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు ► ఎం.రవిచంద్ర: జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్లలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, కోవిడ్ కేసుల రోజువారీ సమాచారం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, సహాయ చర్యల్లో జాయింట్ కలెక్టర్లు, ఎన్జీవోలు, యునిసెఫ్తో సమన్వయం ► ఎ.బాబు: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు సమర్ధంగా పనిచేసేలా చూడటం, హెల్ప్ డెస్క్, సీసీ టీవీ వ్యవస్థల పర్యవేక్షణ ► వి.వినయ్చంద్: ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్స్ల పర్యవేక్షణ ► మురళీధర్ రెడ్డి: కోవిడ్ మందులు, పరికరాల కొనుగోలు, ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం, శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడం ► జె.సుబ్రహ్మణ్యం: కోవిడ్ కేసుల వివరాల సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడం, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం ► ఐఏఎస్లు జి.సృజన, షాన్మోహన్, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి: మెడికల్ ఆక్సిజన్ సరఫ రా,పరిశ్రమల యూనిట్లు, రైల్వేతో సమన్వ యం, ఎల్ఎంఓ కేటాయింపు, ఉత్పత్తి బాధ్యత ► వి.వినోద్కుమార్: క్లినికల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్, వెంటిలేటర్ల సరఫరా, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచడం ► రవి శంకర్: అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, మందుల ధరల నియంత్రణ ► జి.ఎస్. నవీన్కుమార్: ఫీవర్ సర్వే పర్యవేక్షణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
ఆకర్షణీయమైన లుక్స్తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షనీయమైన లుక్స్తో సరికొత్త మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ 2022 ఎడిషన్ కారును త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారును వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలెనోతోపాటుగా మారుతి సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్ను కూడా లాంచ్ చేయనుంది. న్యూ లుక్స్తో..! మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ ఎడిషన్లో మెకానికల్ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. అయితే డిజైన్, ఇంటిరీయర్స్ విషయంలో సరికొత్త మార్పులను జతచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ 2022 ఎడిషన్లో భాగంగా ... భారీ గ్రిల్, న్యూ రాప్అరౌండ్ హెడ్ల్యాంప్స్, న్యూ ఎల్ ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్స్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్, రియర్ సైడ్ రీడిజైన్ట్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్, రివైజ్డ్ డిజైన్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లతో రానుంది. న్యూ బాలెనో 2022 ఫేస్లిఫ్ట్ మోడల్ ఇంజిన్లో ఎలాంటి మార్పులు ఉండవు. 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో రానుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో రానుంది. చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..! -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
కరోనా కొత్త వేరియంట్ కలకలం
-
ఫ్రాన్స్లో కొత్త వేరియంట్!
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఒమిక్రాన్ వేగానికి భయపడుతున్న తరుణంలో కరోనా మరో వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ కన్నా అధిక మ్యుటేషన్లతో కూడిన కొత్త వేరియంట్ను ఫ్రాన్స్లో కనుగొన్నారు. ఈ నూతన వేరియంట్తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్స్టిట్యూట్ ఐహెచ్యూ మెడిటరేరియన్ ఇన్ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు. ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల కొత్త వేరియంట్ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్ఆర్ఎక్స్ఐవీలో ప్రచురించారు. ఈ వేరియంట్లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఈ వేరియంట్లో కొత్తగా 30 అమీనో ఆమ్లాల మార్పులు జరగగా, 12 అమీనో ఆమ్లాల డిలీషన్ జరిగిందని తెలిపింది. అమీనో ఆమ్లాల మార్పుల్లో 14, డిలీషన్లలో తొమ్మిది స్పైక్ ప్రొటీన్లో జరగడం గమనార్హం. మానవ కణాల్లోకి కరోనా చొచ్చుకుపోవడంలో ఈ స్పైక్ ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో జరిగే మ్యుటేషన్లుతో వేరియంట్ వేగంగా వ్యాపించే వీలు కలుగుతుంది. కరోనా టీకాలు ఈ స్పైక్ ప్రొటీన్పై పనిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. వ్యాప్తి ఆరంభం కాలేదు ఐహెచ్యూ వేరియంట్ను ఇంకా ఇతర దేశాల్లో గుర్తించలేదు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూహెచ్ఓ) ఇంతవరకు దీన్ని వీయూఐ (పరిశీలనలో ఉన్న వేరియంట్– వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్)గా ప్రకటించలేదు. వేరియంట్ తీవ్రతను గుర్తించి ప్రకటించడం, దానికి పేరు పెట్టడం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది. గతేడాది నవంబర్లో జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఒకదానిలో ఈ వేరియంట్ను తొలిసారి గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అప్పటి నుంచి దీనిపై పరిశీలనలు జరిపి నూతన వేరియంట్గా నిర్ధారించామన్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకువస్తూనే ఉంటాయని, అలా వచ్చే అన్ని వేరియంట్లూ ప్రమాదకరమైనవని చెప్పలేమని ప్రముఖ వైద్యనిపుణులు ఎరిక్ ఫిగ్డింగ్ అభిప్రాయపడ్డారు. ఒక వేరియంట్ ఎత ప్రమాదకరమనే విషయాన్ని, అది ఎంత ఎక్కువ బలంగా వ్యాపించగలదనే అంశమే నిర్ణయిస్తుందన్నారు. ఒక వేరియంట్ వేగంగా, భారీగా వ్యాపిస్తుంటే అప్పుడే దాన్ని వీఓసీ(వేరియంట్ ఆఫ్ కన్సెర్న్– ఆందోళన కలిగించే వేరియంట్)గా నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుత వేరియంట్ ఏ కేటగిరీలోకి వస్తుందో వేచిచూడాల్సిఉందన్నారు. అదేవిధంగా టీకాలు ఈ వేరియంట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయమై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని నిపుణులు తెలిపారు. ఒకపక్క ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కొనసాగుతున్న వేళ మరో వేరియంట్ బయటపడడంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భయపెట్టే ఆ రెండు మ్యుటేషన్లు ఐహెచ్యూ వేరియంట్లో దాదాపు 46 మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) గుర్తించారు. ఒమిక్రాన్లో 37 మ్యుటేషన్లే ఉన్నాయి. ఐహెచ్యూ స్పైక్ ప్రొటీన్లో గమనించిన మ్యుటేషన్లలో రెండు మ్యుటేషన్లు పరిశోధకులను భయపెడుతున్నాయి. కొత్త వేరియంట్ టీకాలను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉ484 ఓ మ్యుటేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా తొందరగా వ్యాపించేందుకు N501 ్గ మ్యుటేషన్ దోహదం చేస్తుంది. ఈ రెండు మ్యుటేషన్లు గత వేరియంట్లలో ఉన్నాయి. ఇవి ప్రస్తుత ఐహెచ్యూ వేరియంట్లో ఉన్నట్లు పరిశోధన వెల్లడిస్తోంది. ఈ వేరియంట్పై డబ్ల్యూహెచ్ఓ స్పందించాల్సిఉంది. చదవండి: కరోనా కల్లోలం: భారత్లో పెరుగుతున్న కేసులు -
సరికొత్త లుక్స్తో యమహా నయా బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ భారత మార్కెట్లలోకి అప్డేట్డ్ వెర్షన్ ఎఫ్జెడ్ మోడల్ బైక్ను లాంచ్ చేసింది. యమహా FZS-Fi Dlx అనే కొత్త వేరియంట్తో పాటుగా FZS-Fi మోడల్ శ్రేణిని విడుదల చేస్తున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. ఈ సిరీస్ బైక్స్ ఈ నెల రెండో వారం నుంచి అన్నీ యమహా డీలర్షిప్ సెంటర్లలో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధర ఎంతంటే..? యమహా FZS-Fi ధర రూ. 1, 15,900 కాగా, యమహా FZS-Fi Dlx ట్రిమ్ ధర రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' చొరవలో భాగంగా కొత్త FZS-Fi శ్రేణి బైక్ను ప్రవేశపెట్టినట్లు యమహా పేర్కొంది. స్టైలింగ్ విషయానికి వస్తే..! కొత్త యమహా ఎఫ్జెడ్ఎస్ శ్రేణిలో ఈ బైక్స్ క్రేజీ లుక్స్తో బైక్ లవర్స్ను ఇట్టే కట్టిపడేస్తోంది. కొత్త FZS-Fi మోడల్ రిఫ్రెష్ స్టైలింగ్తో పాటుగా అప్డేట్ ఫీచర్స్తో రానుంది. రెండు కొత్త యమహా FZS-Fi మోడల్స్లో బ్లూటూత్ ఫీచర్ కానెక్ట్ ఎక్స్ యాప్తో పనిచేయనుంది FZS-Fi Dlx వేరియంట్లో ఎల్ఈడీ ఫ్లాషర్స్ జోడింపుతో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇతర ఫీచర్స్ హైలైట్గా నిలుస్తున్నాయి. ఈ బైక్స్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ డీప్ రెడ్, సాలిడ్ గ్రే అనే మూడు రంగుల ఎంపికలలో రానుంది. కలర్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్తో రెండో-స్థాయి సింగిల్ సీటును కూడా పొందుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే కొత్త యమహా FZS-Fi బైక్ అదే బ్లూ కోర్ టెక్నాలజీ 149సీసీ ఇంజిన్తో రానుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్పీఎమ్ వద్ద 12.4 పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 5500 ఆర్పీఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తోంది. చదవండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు -
తెలంగాణ పై పడగవిప్పిన ఓమిక్రాన్
-
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి
-
కోవిడ్ బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి: అరవింద్ కేజ్రీవాల్