radhika apte
-
డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా..రాధికా ఆప్టే ప్యాడ్మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. -
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే
నవమాసాలు మోయడం పిల్లల్ని కనడం అంత ఈజీ కాదంటోంది నటి రాధికా ఆప్టే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. మేమప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయలేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తెలుసుకుని షాకయ్యాను. డెలివరీకి వారం ముందు ఒక ఫోటోషూట్ చేశాను. నేనేంటి? ఇలా కనిపిస్తున్నాను అని చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. .సడన్గా ఉబ్బిపోయా..ఎందుకంటే అంతకుముందెప్పుడూ అంత బరువు పెరగలేదు. సడన్గా ఉబ్బిపోయాను. సరిగా నిద్రుండకపోయేది, ఉన్నట్లుండి నొప్పులు వచ్చేవి. అవన్నీ అనుభవిస్తున్నకొద్దీ నా ఆలోచనా విధానం మారిపోయింది. డెలివరీ అయి రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే నా శరీరం మళ్లీ వేరేలా కనిపిస్తోంది. బేబీ బంప్తో ఉన్న ఫోటోలు చూస్తుంటే అప్పుడెందుకు నాపై నేను అంత చికాకుగా ఉన్నాననిపిస్తోంది. అప్పుడు చిరాకుగా, ఇప్పుడు అందంగా!నా శరీరంలోని మార్పులు ఇప్పుడు నాకు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను ఎప్పటికీ జ్ఞాపకంగా దాచుకుంటాను. ఒకరికి జన్మనివ్వడం గొప్ప విషయమే! కానీ ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎవరూ బయటకు చెప్పుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే డిసెంబర్ మొదటివారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో ఈమె హీరోయిన్గా నటించింది.చదవండి: బిగ్బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా? -
బేబీ బంప్తో రాధిక.. ఇంకా పెళ్లి మూడ్లోనే శోభిత
జిమ్లో జుత్తుతో ఆటాడేస్తున్న మెగా కోడలు లావణ్యపెళ్లి మూడ్లో శోభిత.. వైజాగ్లో పార్టీ & సెలబ్రేషన్స్బేబీ బంప్ ఫొటోల్ని బయటపెట్టిన హీరోయిన్ రాధికా ఆప్టేపట్టుచీరలో పెళ్లి కూతురిలా కనిపిస్తున్న మాళవిక మోహనన్ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ డోస్.. చూస్తే అంతేభర్తతో క్యూట్ అండ్ స్వీట్గా బర్త్ డే విషెస్ చెప్పిన వరలక్ష్మిసంప్రదాయబద్ధమై లుక్లో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Ashish Shah (@ashishisshah) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Alaya F (@alayaf) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) View this post on Instagram A post shared by Lijomol Jose (@lijomol) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పెళ్లైన 12 ఏళ్లకు గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (39) బేబీ బంప్ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా 'సిస్టర్ మిడ్నైట్' లండన్లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్నైట్ కేన్స్లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది.రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్తో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. నవంబర్ నెలలో పండంటి బిడ్డకు ఈ బ్యూటీ జన్మనివ్వనుంది. కెరీర్ పీక్స్టేజ్లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో ఆభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇటీవల కాలంలో న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో ఆమె నటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్ సినిమా.
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రంతో హాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 'స్లమ్డాగ్ మిలియనీర్' సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్తో ఈ చిత్రంలో మెప్పించింది. బ్రిటీష్-అమెరికన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. చివరకు ఓటీటీలో కూడా భారత్ యూజర్స్కు అందుబాటులో లేదు.మైఖేల్ వింటర్బాటమ్ దర్శకత్వం వహించిన 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తాజాగా నెట్ప్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో విడుదలైంది. సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది.ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న సీన్ విడుదలకు ముందే లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై నటి రాధికా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా టాపిక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సినిమాలో రాధికా ఆప్టే పూర్తిగా దుస్తులు తొలిగించిన సీన్స్ ఉండటంతో 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రం బాగా వైరల్ అయింది.ఆ సీన్పై రాధికా ఆప్టే ఏమన్నారంటేబోల్డ్ సీన్స్లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా విడుదల సమయంలో రాధికా తెలిపింది. ఈ సినిమా కోసం ఆమె దుస్తులు లేకుండా కనిపించింది. ఆ విషయం గురించి ఓపెన్గానే మాట్లాడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగడం. ఆపై విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
టాలీవుడ్లో పరిస్థితి మరీ దారుణం.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
రాధికా ఆప్టే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ సినిమాలు చేసింది. మొదట వాహ్, లైఫ్ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లో రాంగోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్రతో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, లయన్ సినిమాలతో మెప్పించింది. ఇటీవల విజయ్సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాధికా ఆప్టే టాలీవుడ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాధికా ఆప్టే మాట్లాడుతూ..'తెలుగు పరిశ్రమలో నేను చాలా కష్టపడ్డా. కానీ తెలుగు సినిమాల్లో హీరోయిన్లను చూసే విధానం చాలా దారుణం. టాలీవుడ్ సినిమాల్లో మహిళల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సెట్లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగులో పురుష ఆధిపత్యం ఎక్కువ. అంతేకాదు.. ఇతర నటీనటులను అడగకుండానే వారికి ఇష్టమొచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు షూట్ను రద్దు చేస్తారు. అలా నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను కూడా. కానీ దానికి అక్కడే ఎండ్ కార్డ్ పడింది. అక్కడ నా అవసరం అంతవరకే అని గ్రహించా.' అంటూ విమర్శలు చేసింది. దీంతో రాధికా ఆప్టే చేసిన కామెంట్స్పై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #RadhikaApte about TELUGU Industry 😳😳😳😳 pic.twitter.com/YFLRroAvHX — GetsCinema (@GetsCinema) February 16, 2024 -
నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బద్లాపూర్ వంటి థ్రిల్లర్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్లోనే మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.30 రోజుల్లో నెట్ఫ్లిక్స్లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదల అవుతుందని టాక్. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. -
తాగడానికి నీళ్లు కూడా లేవు, బంధించేశారు: నటి
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె ఇటీవల విజయ్సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. కాగా రాధికా ఆప్టే ఇటీవల విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. బంధించారు ఉదయం 8.30 గంటలకు విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ 10.15 అవుతున్నా విమానం ఇంకా బయలుదేరలేదు. కానీ విమానం బయలుదేరుతోందంటూ సిబ్బంది ప్రయాణికులందరినీ ఏరో బ్రిడ్జ్ ఎక్కించి దానిని మూసివేశారు. ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరినీ గంటకు పైగా ఏరో బ్రిడ్జ్లోనే ఉంచారు. అందులో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. సెక్యూరిటీ ఏరో బ్రిడ్జ్ డోర్ కూడా తెరవలేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు అసలు అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలా మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాగడానికి మంచి నీరు లేదు, వాష్రూమ్కు వెళ్లడానికి కూడా వీల్లేదు. ఇదో వింత అనుభవం అని పేర్కొంది రాధికా ఆప్టే. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) చదవండి: హారర్ హిట్ 'అరుంధతి'కి 15 ఏళ్లు.. ఆ సంగతి మీకు తెలుసా? -
దూకుడు పెంచిన కీర్తిసురేష్
నటి కీర్తిసురేష్ దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ కేరళ బ్యూటీ ఇటీవల బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య వరుస ఫ్లాప్లతో సతమతం అయిన కీర్తిసురేష్కు తెలుగులో నాని సరసన నటించిన దసరా చిత్రం మళ్లీ విజయపథం వైపు మళ్లించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో జతకట్టిన మామన్నన్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందించింది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటిలో జయంరవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కాకుండా రఘుదాదా, రెయిన్బో చిత్రాల్లో నటిస్తోంది. కాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ హిందీలో నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మరో హిందీ వెబ్ సీరీస్లో కూడా ఈ బ్యూటీ నటించడం విశేషం. ఈమె నటిస్తున్న తొలి వెబ్ సీరీస్ ఇదే అన్నది గమనార్హం. 'అక్కా' అనే పేరు నిర్ణయించిన ఈ వెబ్ సీరీస్లో బోల్డ్ నటి రాధికాఆప్టే కూడా నటించడం విశేషం. కాగా వెబ్సీరీస్కు సెన్సార్ సమస్య లేకపోవడంతో గ్లామర్ సన్నివేశాలు అధికంగా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇంతకుముందు కథానాయి కలు తమన్నా, సమంత వెబ్సీరీస్లో చాలా బోల్డ్గా నటించి ఉచిత ప్రచారం పొందిన విషయం తెలిసిందే. దీంతో కీర్తిసురేష్, రాధికాఆప్టే కలిసి నటిస్తున్న 'అక్కా' వెబ్ సీరీస్లో కూడా గ్లామరస్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే భావన వీరి అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్గా ‘అక్క’ వెబ్సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
ప్రత్యేక అతిథిగా...
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ల వెండితెర క్రిస్మస్ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్’, ‘అంథాధూన్’లో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఆడవాళ్లు మాత్రమే ఇంటిపనులు ఎందుకు చేయాలి: హీరోయిన్
సెన్సేషన్ బ్యూటీగా రాధికా ఆప్టేకు పేరుంది. ధోని చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు తన సత్తా చాటుకుంటోంది. ఈమె నటనే కాదు భావాలు సంచలనంగా ఉంటాయి. తాను అనుకున్నది నిర్భయంగా వ్యక్తం చేసే నటి ఈమె. అదే విధంగా హీరోలతో సమానంగా హీరోయిన్కు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: హీరోయిన్తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి ఇలా తరచూ వార్తల్లో నిలిచే ఆమె తాజాగా సమానత్వం గురించి ఒక భేటీలో మాట్లాడింది. ఆడ, మగ వారి వారి వృత్తిలో సమానంగా సంపాదిస్తున్న రోజులివి. అయినప్పటికీ ఉద్యోగం ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులకు అవసరం అయిన అన్నింటినీ సమకూర్చుతుంది.. ఇదేం సమానత్వం? నా తండ్రికి ఆసుపత్రి ఉంది, అందులో తన తల్లి సేవలు అందించేవారు. అయితే ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించేది. ఇలా ఆడవారే ఇంటి పనులు చేయాలని వారి బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. మహిళలు అంతగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా తలా ఒక పనిచేస్తే సరిపోతుంది అంటూ రాధిక ఆప్టే పేర్కొంది. చదవండి: ఏజెంట్కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత -
నీ ముక్కు సరిగా లేదని విమర్శించారు: హీరోయిన్
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్ రాధికా ఆప్టే ఒకరు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ పలు సినిమాలు చేసిన ఆమె కెరీర్ తొలినాళ్లలో తిరస్కరణకు గురైంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది. రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'మొదట్లో నన్ను అంతా పల్లెటూరి అమ్మాయిలాగే భావించారు. కానీ బద్లాపూర్ సినిమాతో వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేశాను. కానీ ఈ సినిమాతో నేను హాట్ డోస్ కామెడీ సినిమాలు మాత్రమే చేస్తానని భావించారు. దీంతో అలాంటి కథలకు ఓకే చెప్పడం మానేశా. కేవలం మూడు, నాలుగు కిలోల ఎక్కువ బరువున్నానని నన్ను ఓ సినిమా నుంచి తీసేశారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఇలా చాలా జరుగుతాయి. నీ ముక్కు సరిగా లేదు, బ్రెస్ట్ సైజు పెద్దగా లేదు. ముందు వాటిని సరిచేసుకోవచ్చు కదా? అనేవారు. ఇలా చాలానే ఫేస్ చేశాను' అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే.. వాహ్, లైఫ్ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. రక్త చరిత్రతో తెలుగులో, ధోని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ సరసన కబాలి సినిమాలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ చిత్రాల్లో అనేక భాషలు చేసింది నటి. ప్రస్తుతం ఆమె నటించిన మిసెస్ అండర్ కవర్ ఏప్రిల్ 14 నుంచి జీ5లో ప్రసారం కానుంది. -
హీరోలకు సమానంగా రెమ్యునరేషన్, గౌరవం ఇవ్వాలి: రాధికా ఆప్టే
సంచలన నటీమణుల్లో రాధిక ఆప్టే ఒకరు. నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్తే కోలీవుడ్కు పరిచయం అయ్యింది. ఆ తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కబాలి, కార్తీ సరసన ఆల్ ఇన్ ఆల్ అళగురాజా వంటి చిత్రాలతో పాటు చిత్తిరం పేసుదడి –2, వెట్రిసెల్వన్ తదితర చిత్రాలలో నటించి తమిళ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే విధంగా కొన్ని చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని రాధికా ఆప్టే తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ సినిమా రంగంలో నటిస్తున్న హీరోయిన్లకు, ఇతర మహిళలకు పారితోషికం, పేరు, ఖ్యాతి ఇవన్నీ విషయాల్లోనూ హీరోలకు సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఈ రంగంలో మహిళలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాలూ వస్తున్నాయని అన్నారు. ఇది సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలోనూ ఆడ, మగ అనే భేదం లేదు అనే పరిస్థితి నెలకొందని, మహిళలు సమానత్వం కోసం పోరాడుతున్నారని రాధిక స్పష్టం చేశారు. -
నటనకు గుడ్బై? దర్శకురాలిగా మారనున్న రాధికా ఆప్టే?
తమిళసినిమా: నటి రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని మించిన వారు ఉండరేమో. తమిళంలో ధోని చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు తదితర భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీ అయ్యారు. అయితే తాను నటించిన కథానాయకులపైనే విమర్శలు చేస్తూ వివాదాస్పద నటి అనే ముద్ర వేసుకుంది. అలాంటి ఈ నటి దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఇప్పటి వరకు ఇతరుల డైరక్షన్లో నటించిన ఈ బ్యూటీ త్వరలో హీరోలని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. దీని గురించి ఒక భేటీలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదట భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా హీరోయిన్ అయ్యానని తెలిపింది. తాను దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు చెప్పింది. అది నటనకు ఉపయోగపడిందని పేర్కొంది. అయితే ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. అయితే స్క్రీన్ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని, అందుకు ప్రముఖ దర్శకుల వద్ద పని చేయ్యాలనుకుంటున్నట్లు చెప్పింది. అదే సమయంలో కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పింది. అలాగని నటనకు స్వస్తి చెబుతున్నానని భావించరాదని, తన తొలి ప్రాధాన్యత నటనకేనని పేర్కొంది. అయితే ఈ అమ్మడు ఏ భాషలో దర్శకత్వం వహించేది మాత్రం చెప్పలేదు. -
ఆ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోయాను : రాధికా ఆప్టే
నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే యంగ్ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపింది. లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'హీరోయిన్స్కి ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ప్రధానమైన అంశం. అందుకే కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా టాలెంట్ని కాకుండా లుక్స్ని బట్టి అవకాశాలివ్వడం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. నేను మాత్రం అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదు. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఏనాడు అడ్డదారులు తొక్కలేదు. కానీ సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది. -
ప్రేమికులైనా, దంపతులైనా ఆ పని మాత్రం చేయకండి
కొందరు ఉచిత సలహాలు బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టేలాంటి వాళ్లను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన నటీమణుల్లో ఈమె ఒకరు. తమిళంలో ధోని, కబాలి తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న రాధిక ఆప్టే ఎక్కువగా వెబ్ సిరీసుల్లోనే నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో మాట్లాడుతూ ‘ప్రేమికులు గానీ, దంపతులు కానీ తమ మధ్య తగవులు వస్తే ఇతరుల మాటలు వినకండి. ఎందుకంటే వాళ్లు మీ మధ్యకు వస్తే మీ మధ్య గొడవలు మరింత జటిలం అవుతాయి. ఇద్దరి మధ్య అగాథం పెరిగే ప్రమాదం ఉంది. మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది మనకు మాత్రమే తెలుసు’ అని ఉచిత సలహాలు ఇచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు చెప్పే సూక్తులు స్వానుభవమా? లేక ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసిన అనుభవమా? ఎందుకంటే ఎదుటివాళ్లకు చెప్పడానికే నీతులు అన్న సామెత ఉండనే ఉంది కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్లకు, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్ను ఆ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్లో హృతిక్ రోషన్ తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. హృతిక్రోషన్ హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. గణేశ్ హెగ్డే కొరియోగ్రాఫి అందించారు. కాగా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన విక్రమ్వేద చిత్రాన్ని వైనాట్ స్టుడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. -
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్
Radhika Apte Wedding Photos With Benedict Taylor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రైనా చేయడానికి వెనుకాడదు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హిందీలో ‘‘ప్యాడ్మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం 'విక్రమ్ వేదా' చిత్రంలో నటిస్తోంది. సినిమాల వరకు ఓకే కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది రాధిక. అయితే తాజాగా ఆమె భర్తతో దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.. ఎందుకు ?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాధిక ఆప్టే 'నేను ఇక్కడ.. బెన్ (భర్త బెనెడిక్ట్) అక్కడ. ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు ఇష్టముండదు. ఇక ఫొటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై అంతగా అభిరుచి లేదు. ఇక నాకన్న బెన్ ఇంకా వేస్ట్. ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మేము ఫ్రెండ్స్ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే. అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! బేబీ బంప్తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. -
అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే
Radhika Apte Shocking Comments On Heroines Cosmetic Surgerie: నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ‘‘ప్యాడ్మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్వేదా చిత్రాల్లో నటిస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందిని చూశాను. చాలామంది సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం అలాంటి వారిని చూసి నేను విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్స్పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అలాగే తనకు బి-టౌన్ పార్టీస్, కల్చర్ పడదని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తా’ అని తెలిపింది. -
లాయర్ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?
నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్ఫుల్గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం. ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’ వంటి బయోపిక్ కావొచ్చు, ‘గుడ్లక్ సఖి’ వంటి స్పోర్ట్స్ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్బాబు సరసన చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్ని విడుదల చేశారు. ఇక కీర్తీ సురేష్ అన్నయ్యకు ఓ లాయర్గా హెల్ప్ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్ స్క్రీన్ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. లాయర్ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్’ చిత్రం తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్గా నటించిన శ్రుతీహాసన్ లాయర్ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్’లో తమన్నా లాయర్గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్’ కోసం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ గడప తొక్కారు హీరోయిన్ విమలా రామన్. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్ కెరీర్ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్గా నటిస్తున్నారు. తన లాయర్ లుక్ను విమలా షేర్ చేశారు. అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్ హిట్ మూవీ ‘విక్రమ్వేదా’ హిందీ రీమేక్లో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేయనున్నారని టాక్. తమిళంలో ఇన్స్పెక్టర్ విక్రమ్గా మాధవన్, గ్యాంగ్స్టర్ వేదగా విజయ్ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్. తమిళంలో తీసిన పుష్కర్ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్లో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్ భార్య అంటే లాయర్గా హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు. -
రాధికా ఆప్టే బర్త్డే స్పెషల్
-
న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లు.. బోల్డ్ నటిపై గరం గరం
Boycott Radhika Apte Trend: బాయ్కాట్ రాధికా ఆప్టే.. హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ హాష్ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్ను ట్రెండింగ్ ద్వారా కుదిపేస్తోంది. వెల్లువలా వేల కొద్దీ ట్వీట్లు ఆమెకి వ్యతిరేకంగా పోస్ట్ అవుతున్నాయి. భారత సంప్రదాయాలను కించపరిచేలా 35 ఏళ్ల రాధిక నటిస్తోందన్నది ఆ ట్వీట్లు చేసేవాళ్ల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు ఇంతలా దిగజారుతున్న వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్పైన గరం అవుతున్నారు ట్విటర్ యూజర్లు. రాధికా ఆప్టే బాలీవుడ్లో బోల్డ్ నటిగా పేరు సంపాదించుకుంది. హిందీ చిత్రం ‘వహ్! లైఫ్ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధిక.. తెలుగులో రక్త చరిత్ర రెండు పార్ట్లు, ధోనీ, లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఇక బాలీవుడ్లో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రాధిక. మరోపక్క మీటూ ఉద్యమానికి మద్ధతు తెలిపే క్రమంలో ఎన్నో సంచలన స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే కేవలం డబ్బు కోసమే రాధికా ఆప్టే నటిస్తోందని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని విమర్శలకు దిగారు కొందరు. ఇక అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని బాలీవుడ్ను మరికొందరు కోరుతుండగా.. వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు మరికొందరు. చదవండి: కుప్పలుగా షూటింగ్కు జనం.. సినిమా యూనిట్కు ఫైన్ బాలీవుడ్లో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు కొందరు బాలీవుడ్ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకు రావడం తెలిసిందే. అయితే వ్యాపారవేత్త, బాలీవుడ్ ప్రముఖ ఫైనాన్షియర్ రాజ్కుంద్రా ‘పోర్న్ రాకెట్’ విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. దీంతో కొందరు నెటిజన్స్.. రాధికతో పాటు మరికొందరు తారలను తెర మీదకు తెచ్చి విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల ప్రస్తావన లేవనెత్తి ఈ #BoycottRadhikaApte ట్రెండ్ను నడిపిస్తున్నారు. When it comes to Kathua entire #Bollywood gang was with Placard Why these people silent on #RajKundra ? Habit of bollywood to defame degrad our culture #BoycottRadhikaApte pic.twitter.com/icQ3Kp1TIi#BoycottRadhikaApte — Rahul Jaiswal (@Rahul22578409) August 13, 2021 It's Time To Boycott All Actors , Who Are Against Indian Culture . #BoycottRadhikaApte — Arun Yadav (@beingarun28) August 13, 2021 -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
న్యూడ్ వీడియో లీక్.. 4 రోజులు బయటకు రాలేదు: నటి
కుంబ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉంటారు నది రాధికా ఆప్టే. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాధిక ఆప్టే. గతంలో ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలోనే ఈ వీడియోపై రియాక్ట్ అయిన రాధిక.. మరోసారి ఈ ఇష్యూపై స్పందిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. సెక్స్ వర్కర్గా రాధిక ఆప్టే నటించిన 'పార్చ్డ్' చిత్రం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే ఆమెకు సంబంధించి ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో షాకైన రాధికా ఆప్టే.. తన ఫేస్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని 2016లోనే క్లారిటీ ఇచ్చారు.. అయితే తాజాగా మరోసారి అదే అంశంపై మాట్లాడి వార్తల్లో నిలిచారు రాధిక ఆప్టే. ఆ న్యూడ్ వీడియో బయటికి వచ్చిన సమయంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారని, ట్రోల్ చేశారని చెబుతూ రాధిక ఆవేదన చెందారు. ఊహించని విధంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయాను. ఎంతో మానసిక వేదన అనుభవించాను. అయితే పార్చడ్ చిత్రంలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు’’ రాధిక. 2015లో ఈ చిత్రాన్ని దర్శకుడు లీనా యాదవ్ తెరకెక్కించగా.. అజయ్ దేవ్గన్ నిర్మించారు. ఇది రాజస్తాన్లోని ఒక గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు మహిళల సాధికారిత కథ. ఇక రాధిక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ''ప్యాడ్మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్'' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చదవండి: వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే -
వర్మ సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది..
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రక్తచరిత్ర సినిమా సమయంలో తన సమయాన్ని బాగా వాడుకున్నారని, తన పనికి తగ్గ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని చెప్పింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాలో రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె డీ గ్లామరస్ రోల్లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె రక్తచరిత్ర షూటింగ్ సమయంలో తాను ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని తెలిపింది. 'నేను మూవీ ఒప్పుకునేటప్పుడు కేవలం తెలుగు వెర్షన్ అని చెప్పారు. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. తీరా సెట్స్లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టే. ఇందుకు తగ్గట్లు గానే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్స్ నటించడంతో షూటింగ్ కూడా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. ఈ మూవీ కోసం నేను చాలా సమయాన్ని కేటాయించాను. అయితే నా టాలెంట్కి, నా సమయానికి విలువ లేదనిపించింది. నిజానికి వర్మ రూపొందించిన రంగీలా, సత్య చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలతో వర్మకు ఫ్యాన్ అయ్యా. అందుకే ఆయనతో పనిచేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత మాత్రం రక్త చరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఆర్జీవీపై రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. చదవండి : అలా ఆమిర్ ఖాన్తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె -
ఆ కథలో నటించాలి అనుకోలేదు!
రాధికా ఆప్టేలో రెండు కోణాలున్నాయి. ఎంత సంప్రదాయబద్ధంగా కనిపించగలుగుతారో అంత మోడ్రన్గానూ కనిపించగలరు. అందుకే చీర కట్టుకుని నిండుగా కనిపించే పాత్రలనూ చేస్తారు. చిట్టిపొట్టి దుస్తులు డిమాండ్ చేసే పాత్రలూ చేస్తారు. నటిగా భేష్ అనిపించుకున్న ఈ బ్యూటీ దర్శకురాలిగా మారి, ‘ది స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఈ సినిమా గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ – ‘‘నిజానికి నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. అయితే రాయడం అంటే ఇష్టం. అది కూడా ఎందుకంటే... ఒక నటిగా నేను వేరేవారి కథల్లో నటిస్తాను. నా ఊహల్లో కొన్ని చాలెంజింగ్ కథలు ఉంటాయి. ఆ కథలు రాయాలనుకున్నాను. ‘ది స్లీప్ వాకర్స్’ కథ మొత్తం రెడీ అయ్యాక అందులో నటించాలని నాకు అనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించింది. అంతే... పది రోజుల్లో ప్రిపేర్ అయి, షూటింగ్ మొదలుపెట్టాం. దర్శకురాలిగా ఈ ప్రయాణం నాకు మంచి అనుభూతినిచ్చింది’’ అన్నారు. సహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ‘పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితమైంది. ఇక నటిగా రాధికా ఆప్టే ప్రస్తుతం ‘మిసెస్ అండర్కవర్’ అనే సినిమా చేస్తున్నారు -
పాత రోజులు గుర్తొచ్చాయి!
షూటింగ్ కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు బ్రేక్ దొరికితే చాలు.. ఆ ప్రదేశాలను చుట్టొస్తారు తారలు. ‘మిసెస్ అండర్కవర్’ షూటింగ్ కోసం కోల్కతా వెళుతున్నప్పుడు బ్రేక్ దొరికితే కోల్కతాను రౌండప్ చేద్దామనుకున్నారు రాధికా ఆప్టే. కానీ అందరి ప్లానులూ తారుమారు చేయడానికే కరోనా ఉంది కదా! కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ‘మిసెస్ అండర్కవర్’ యూనిట్ తాము బస చేస్తున్న హోటల్కి, షూటింగ్ లొకేషన్కి తప్ప ఎక్కడికీ వెళ్లకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారట. దాంతో కోల్కతాలో 35 రోజులు వరుసగా షూటింగ్ చేసినా లొకేషన్కి, హోటల్ రూమ్కి తప్ప రాధికా ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ఓ పదేళ్ల తర్వాత కోల్కతాలో ఆమె ఎక్కువ రోజులు షూటింగ్లో పాల్గొన్న సినిమా ఇదేనట! గతంలో ‘అంతహీన్’ (2009) అనే బెంగాలీ సినిమా షూటింగ్ని అక్కడ చేశారు. ఇప్పుడు ఈ హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంటే, పాత రోజులన్నీ ఈ బ్యూటీకి గుర్తొచ్చాయట. ఇక ‘మిసెస్ అండర్ కవర్’ విషయానికొస్తే.. ఇందులో గృహిణి నుంచి అండర్ కవర్ ఏజెంట్గా మారే పాత్రను చేస్తున్నారు రాధికా ఆప్టే. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ స్పై ఎంటర్టైనర్కి నూతన దర్శకురాలు అనుశ్రీ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. -
కేంద్ర నిర్ణయంపై రాధికా ఆప్టే ఫైర్
ఈ మధ్యకాలంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు మొదలుకొని స్టార్ నటీనటులు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే సినిమాల్లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్ఫామ్స్పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనావళిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్లైన్స్పై నటి రాధికా ఆప్టే అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీ వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు లభించాయి. గత కొన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదా చాలా అద్భుతమైన ప్లాట్పామ్. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు భయానకంగా ఉన్నాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది. కాగా అందాల ఆరబోతకు వెనకాడని రాధికా ఆప్టే ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే బాత్రూం సీన్లలో కనిపించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. చదవండి : ఓటీటీలపై నిఘా పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోసమే చేసుకున్నా -
వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే
కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు నటి రాధికా ఆప్టే. ఇక తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బోల్డ్ పాత్రలు, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే విధానంతో సంచలన నటిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో దక్షిణాదిన హీరోయిన్లకు అస్సలు విలువ ఇవ్వరంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో వివాదాలకు మారుపేరుగా మారిపోయారు. కాగా 2012లో మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్ను రాధికా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నుంచి రాధికా తన భర్త బెనెడిక్ట్తో లండన్లో ఉంటున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. రాధికా తాజాగా పెళ్లి విషయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె ఈ విషయం వెల్లడించారు. అయితే తనకు పెళ్లంటే పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించారు. వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదని, కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకుంటే విసా త్వరగా వస్తుందని చేసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినీ కెరీర్పైనే ఉందని వెల్లడించారు. అయితే రాధికా మాటలు విన్న అభిమానులు మాత్రం షాక్కు గురవుతున్నారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్ -
సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..
(వెబ్ స్పెషల్): ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం తమకు మాత్రమే సొంతమైన, ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్లతో మాత్రమే తమ మనసులోని భావాలను నిర్భయంగా, నిక్కచ్చిగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా ఏదైనా ముందుగా వాళ్లతో పంచుకోవడానికే ఇష్టపడతారు. కేవలం వాళ్ల మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇవన్నీ చేస్తారు. ఇక ఇలా అన్ని విషయాలను అర్థం చేసుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. మనసుకు నచ్చిన వాళ్లు ‘‘మనవాళ్లా’’లేదా ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే.. మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా వారిని చేరుకుంటారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధం బలపరచుకుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో విదేశీయులను పెళ్లాడిన కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం.. ప్రీతి జింటా క్రిమినల్ సైకాలజీ చదివిన సొట్టల బుగ్గల సుందరి ప్రీతి జింటా(45)‘దిల్ సే’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసింది. చోరీ చోరీ చుప్కే చుప్కే, క్యా కహ్నా, దిల్ చాహ్తా హై, కల్ హో నహో వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం గాకుండా సోషల్ ఆక్టివిస్టుగా, టీవీ ప్రజెంటర్గా, కాలమిస్టుగా తనలోని భిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతేగాక కొత్త నటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా మొదలుపెట్టిందీ భామ. అదే విధంగా క్యాష్ రిచ్లీగ్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా, ఎంటర్ప్రెన్యూర్గా సత్తా చాటుతోంది. ఇక కెరీర్ పరంగా ఎత్తుపల్లాలను చవిచూసిన ప్రీతి జింటా.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. నాలుగు పదుల వయస్సులో.. తన చిరకాల స్నేహితుడు, అమెరికాకు చెందిన జీన్ గుడ్ఎనఫ్ను ప్రేమించి, పెళ్లాడింది. లాస్ ఏంజెల్స్లో అత్యంత సన్నిహితుల మధ్య 2016లో ఫిబ్రవరి 29న వీరి వివాహం జరిగింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటుందీ షిమ్లా భామ. అన్నట్టు.. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో ప్రీతి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. (చదవండి:వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) రాధికా ఆప్టే బోల్డ్ నటి రాధికా ఆప్టే(35) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్ ఆరిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ హాట్భామ, లస్ట్స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి బోల్డ్ వెబ్సిరీస్లతో సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధిక.. కెరీర్ పీక్స్టేజ్లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భౌతికదూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకరినొకరం కలిసే వీలుంటుందని చెప్పుకొచ్చింది.(చదవండి: రియల్గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు ) శ్రియా సరన్ ‘ఇష్టం’ సినిమాతో వెండితెరపై అడుగపెట్టి నేటికీ తన అందచందాలు, నటనా కౌశలంతో అభిమానులను కట్టి పడేస్తోంది డెహ్రాడూన్ సుందరి శ్రియా సరన్(38). స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. దక్షిణాదిన యువ హీరోలు మొదలు సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్తో పాటు ఒకటీ రెండూ ఇంగ్లిష్ సినిమాల్లోనూ తళుక్కుమన్న శ్రియ, రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఈ జంట ఉదయ్పూర్లో ఇండస్ట్రీల ప్రముఖులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చి తమ పెళ్లి గురించి మీడియాకు వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రియా.. లాక్డౌన్లో భర్తతో కలిసి అనేక వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు చారిటీ షోలు కూడా చేసి కష్టాల్లో ఉన్న వారికి తన వంతు చేసి మంచి మనసు చాటుకుంది.(చదవండి: మంచి తరుణం మించిన దొరకదు ప్రియతమా!) ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పరిణయం కూడా ఒకటి. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ను ప్రేమించిన పిగ్గీచాప్స్ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో అతడిని పెళ్లాడారు. జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సన్నిహితుల కోసం పలు రిసెప్షన్ పార్టీలు చేసింది. కేవలం నటిగానే గాకుండా సామాజిక కార్యకర్తగా, మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, తనను బాగా అర్థం చేసుకోగలడనే నమ్మకంతోనే నిక్ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన షిమ్లా భామ సెలీనా జైట్లీ(38) 2001లో మిస్ ఇండియాగా అందాల రాణి కిరీటం దక్కించుకుంది. అంతేకాదు మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్గా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ క్వీన్. మోడల్గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. అయితే వారిలో ఒకరు గుండెలోపంతో మృతి చెందారు. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నట్లు సెలీనా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లి ఆఫ్గానిస్తాన్కు చెందినవారు. సుచిత్రా పిళ్లై దిల్ చాహ్తా హై గర్ల్గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర(50).. ‘బేతాళ్’అనే వెబ్సిరీస్తో ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫాంలో అడుగుపెట్టింది. కెరీర్లో ఎత్తుపల్లాలు చవిచూసిన సుచిత్ర.. వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న ఆమె.. 2005లో లార్స్ జేల్డ్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఓ కూతురు ఉంది. శ్వేతా కేశ్వాని డాన్సర్గా, మోడల్గా రాణించిన శ్వేతా కేశ్వాని(40) హిందీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2012లో, న్యూయార్క్కు చెందిన కెన్ ఆండినోను పెళ్లాడింది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. కాగా శ్వేతాకిది రెండో వివాహం. ఇక వీళ్లతో పాటు కల్కి కొచ్లిన్, తాప్సీ వంటి నటీమణులు విదేశీయులతో ప్రేమలో ఉండగా, ఇలియానా, శృతి హాసన్ ప్రేమలో విఫలమై ప్రస్తుతం కెరీర్పై దృష్టి సారించారు. -
ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, హీరోయిన్ రాధిక ఆప్టే కలిసి నటించిన చిత్రం ‘రాత్ అకేలి హై’. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రాత్ అకేలి హై’లో నవాజుద్దీన్ ఓ పవర్ఫుల్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ పాత్రలో కనిపించగా, రాధిక నిందితురాలిగా కనిపిస్తారు. ఓ సంపన్న రాజకీయ నాయుడి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంతో ఈ సినిమా కొనసాగుతుంది. ‘రాత్ అకేలి హై’కి కాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహన్ దర్శకత్వం వహించారు. అతనికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రంలో నవాజుద్దీన్, రాధిక ఆప్టేతో పాటు ఆదిత్య శ్రీవాస్తవ, శ్వేతా త్రిపాఠి, ఇలా అరుణ్, ఖలీద్ త్యాబ్జీ, శివాని రఘువంశి, టిగ్మాన్షు ధులియా నటించారు. ఈ చిత్రం జూలై 31న నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన) ‘అత్యంత శక్తివంతమైనవారు సాధారణంగా చీకటి రహస్యాలను దాచిపెడతారు. చాలా పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకుడి కేసును విచారించడానికి ఒక చిన్న పట్టణ పోలీసుకు అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది. అతను కేసును విచారించటంలో ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాడు. సత్యం కోసం వెతకడానికి చీకటిలోకి వెళ్లాలి. కుటుంబానికి చెందిన వారే అనుమానితులుగా ఉన్న ఈ రహస్య హత్యలో ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ కేసును ఏలా చేధిస్తారనేది సినిమాలో చూడాలని చిత్ర నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు. -
కథలు రాస్తున్నా
‘‘రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ సమయాన్ని అసంతృప్తిగా గడపవద్దు. నేనలా చేయను. జీవితంలో నేను సంతోషంగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం’’ అంటున్నారు రాధికా ఆప్టే. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నను రాధికా ఆప్టే ముందుంచితే – ‘‘ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాను. ఈ లాక్డౌన్ వల్ల కాస్త రిలాక్స్ కావడానికి సమయం దొరికినట్లయింది. కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాశాను. ఇంకొన్ని రాయాలనుకుంటున్నాను. కానీ సమయం గడిచే కొద్దీ ఈ లాక్డౌన్తో నాలో కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమా కెరీర్ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చింది (నవ్వుతూ)’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇటీవల ఓ షార్ట్ఫిల్మ్ను డైరెక్ట్ చేశారట రాధిక. అది ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు కూడా ఎంపికయిందట. ఈ సినిమా వివరాలను త్వరలోనే చెబుతా అన్నారు రాధికా ఆప్టే. -
‘స్లీప్వాకర్స్’ టీజర్!
-
నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!
ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. స్టార్ట్.. కెమెరా... యాక్షన్ అంటూ ‘స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిలిం కోసం దర్శకురాలి అవతారం ఎత్తారు. షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమా టీజర్ను శనివారం విడుదల చేశారు. ‘‘ఇదిగో మా టీజర్ ట్రైలర్’’అంటూ రాధిక ఇన్స్టాలో వీడియోను షేర్ చేశారు. గర్భవతి అయిన భార్య, భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ.. రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం.. ఆమెతో కలిసి షహానా బీచ్కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక టీజర్ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ‘‘ఐ యామ్ సారీ’’ అంటూ గుల్షన్ ఆమెను చిత్రహింసలకు గురిచేసే విజువల్ ఒకింత భయానకంగా ఉంది. కాగా టీజర్పై స్పందించిన నెటిజన్లు.. ‘‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం’’ అంటూ రాధికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
హీరోయిన్ రాధికా ఆప్టే ఫోటోలు
-
అంతా బాగానే ఉంది
‘జాగ్రత్త మేడమ్. జాగ్రత్తలు పాటించండి’ అంటూ రాధికా ఆప్టే అభిమానులు ట్వీటర్ ద్వారా ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. అసలు విషయం ఏంటంటే... తన తాజా సినిమా చిత్రీకరణ నిలిచిపోవడంతో లండన్లో ఉంటున్న భర్త బెనెడిక్ట్తో టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్లారామె. ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో చర్చకు దారి తీసింది. ముఖానికి మాస్క్ ధరించి ఆస్పత్రిలో వేచి చూస్తున్న తన ఫొటోని పోస్ట్ చేసి, ‘‘ఆస్పత్రికి వచ్చాను.. అయితే భయపడాల్సిందేమీ లేదు. కోవిడ్ 19 గురించి కాదులెండి. అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు. కరోనా గురించి కాకపోయినా ఆస్పత్రికి వెళ్లారు కాబట్టి వేరే ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి ఉంటుందని ఫాలోయర్స్ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. -
రాధిక ఆప్టేకు కరోనా కష్టం..
దేశంలో కరోనా విసిరిన పంజా విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి రోజురోజుకీ అధికమతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటికే దేశంలో 887 కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. దీని ప్రభావం పెరుగుతుండటంతో అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కాగా సెలబ్రిటీలకు కరోనా వల్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టేకు కరోనా కష్టం మొదలైంది. (కరోనా విరాళం) View this post on Instagram Hospital visit! #notforcovid19 #nothingtoworry #alliswell #safeandquarantined 😷 A post shared by Radhika (@radhikaofficial) on Mar 27, 2020 at 3:39am PDT బోల్డ్ మూవీస్, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలిచే ఈ భామ ఇటీవల ముఖానికి మాస్క్ ధరించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేశారు. దీంతో రాధికకు కరోనా సోకిందేమోనని అభిమానులు భయానికి గురవుతున్నారు. దీనిపై అనేకమంది అభిమానులు ప్రశ్నలు లేవనెత్తడంతో తాజాగా లెజెండ్ భామ తన పోస్ట్పై స్పందించారు. అ ఫోటో కేవలం హస్పిటల్కు వెళ్లినప్పుడు తీసిందని స్పష్టం చేశారు. అలాగే తాను కోవిడ్ 19 పరిక్షల కోసం వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే పోస్ట్ కాస్తా వైరల్ అవ్వడంతో గల్లీ భాయ్ నటుడు విజయ్ వర్మ.. రాధిక ఫోటోపై కామెంట్ చేశారు. ఓ గాడ్! జాగ్రత్త ప్రియతమా.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటూ కామెంట్ చేశాడు.కాగా తెలుగు, తమిళ్, హాలీవుడ్, బాలీవుడ్లో నటించారు. గతంతో పలు సౌత్ సినిమాల్లోని నటించిన రాధిక దక్షిణాది హీరోలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. (అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?) -
నేను సేఫ్గా చేరుకున్నా: హీరోయిన్
భారత్లో కరోనా తీవ్రత అధికమవుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తారల సంగతి సరేసరి... షూటింగ్స్కు నో చెప్పి ఇంట్లో నుంచి బయట కాలు మోపడం లేదు. ఇక దక్షిణాది కన్నా బాలీవుడ్లో, హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్లోని హీత్రో ఎయిర్పోర్టులో దిగింది.. అసలే కరోనా భయంతో ఎయిర్పోర్టులో భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రకరకాల పరీక్షల పేరిట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాధికాకు విమానాశ్రయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో, ఎంత అసౌకర్యానికి లోనైందోనని ఆమె అభిమానులు, బంధువులు కాస్త కలవరపాటుకు లోనయ్యారు. దీనిపై రాధికా స్పందిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. (బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!) ‘స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. నిజానికి లండన్ నుంచి భారత్కు వెళ్లే ఫ్లైట్లో అసలు జనాలే లేరని, కానీ అక్కడి నుంచి లండన్కు తిరిగొచ్చే విమానం మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందని తెలిపిందీ మరాఠీ భామ. కరోనా ఎఫెక్ట్తో తన బిజీ షెడ్యూల్కు విరామం ఇచ్చి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధమైనట్లు తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. (నా సక్సెస్ భిన్నం బాస్) View this post on Instagram #Golden #lastdayofwork #socialdistancingstartstomorrow A post shared by Radhika (@radhikaofficial) on Mar 17, 2020 at 8:05am PDT -
అవార్డు నిల్... ఆకర్షణ ఫుల్
‘ఎమ్మీ అవార్డులకు నామినేషన్ దక్కించుకున్నానోచ్’ అంటూ ఇటీవల రాధికా ఆప్టే ప్రకటించారు. నామినేషన్ పత్రాన్ని అందుకుని, రాధిక న్యూయార్క్ వెళ్లారు. అక్కడే 47వ ‘ఎమ్మీ’ అవార్డుల వేడుక జరిగింది. టీవీ షోలు, సీరియల్స్కి అవార్డుల ప్రదానం చేస్తుంటుంది ‘ఎమ్మీ’. ‘లస్ట్ స్టోరీస్’కి గాను ఉత్తమ నటన విభాగంలో రాధికా ఆప్టేని నామినేట్ చేశారు అవార్డు సంస్థ ప్రతినిధులు. ఇంకా మన దేశం నుంచి సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’, మరో సిరీస్ ‘ది రీమిక్స్’ నామినేషన్ దక్కించుకున్నాయి. ‘లస్ట్ స్టోరీస్’ దర్శకులు కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్, నటి రాధికా ఆప్టే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అలాగే ‘సేక్రెడ్ గేమ్’ నుంచి, ‘ది రీమిక్స్’ నుంచి కొందరు అవార్డు వేడుకకు వెళ్లారు. మొత్తం 21 దేశాల నుంచి 11 విభాగాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నామినేట్ అయ్యారు. మనదేశం నుంచి నామినేట్ అయినవాటికి అవార్డులు నిల్ కానీ అవార్డు వేడుకలో రాధికా ఆప్టే అట్రాక్షన్ మాత్రం ఫుల్ అని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే నవాజుద్దీన్ నటించిన ‘మెక్ మాఫియా’ అనే ఇంగ్లిష్ టీవీ సిరీస్కి అవార్డు దక్కింది. -
హాలీవుడ్ ఆహ్వానం
గూడఛారి అనగానే మనకు గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం. అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్ వార్స్’ ఆఫర్ కూడా రావడం విశేషం. ‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని ఈ సందర్భంగా రాధికా ఆప్టే అన్నారు. మరి.. రాధికా ఇచ్చిన ఆడిషన్ నచ్చితే బాండ్ సినిమాలోనూ, స్టార్ వార్స్ మూవీలోనూ మన దేశీ భామ కనిపిస్తారు. అయితే రాధికాని హాలీవుడ్ సంస్థ తిరస్కరించే అవకాశమే లేదు. ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్స్ని హోమ్లీగా, గ్లామర్ క్యారెక్టర్స్లో హాట్గా... ఇలా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు రాధికా. అందుకు ఉదాహరణ ‘లెజెండ్, కబాలీ’ తదితర చిత్రాలు. వీటిలో రాధికా హోమ్లీగా కనిపించారు. ఇక హిందీ చిత్రాలు ‘బద్లాపూర్’, ‘పర్చెడ్’ వంటివాటిలో హాట్గా కనిపించి, ‘రాధికాయేనా ఇలా?’ అనుకునేలా చేశారు. -
నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...
పీఆర్ ప్రొషెషనల్గా వయ్యారాలు పోయినా, ఫోబియా బాధితురాలిగా ఒకింత భయపెట్టినా... రాధికా ఆప్టే శైలే వేరు. కళ్లతో స్పష్టమైన భావాలను పలికించడం రాధిక సొంతం. రక్తచరిత్ర, లెజెండ్... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆప్టే డైరెక్టర్ సీట్లో కూర్చోనున్నారు. ఆమె అంతరంగాలు... రంగస్థలం ఎన్ని సినిమాల్లో నటించినా స్టేజీ మీద నటించడం అంటేనే ఇష్టం. స్టేజీకి దూరంగా ఉండలేను. ఆ మధ్య గిరీశ్ కర్నాడ్ నాటకం ఒకటి మరాఠీలోకి తీసుకొస్తే అందులో నటించాను. మంచి పేరు వచ్చింది. నాటకాల్లో నటిస్తున్నప్పుడు సినిమా పనులకు దూరంగా ఉంటాను. రిహర్సల్స్కు ఎక్కువ సమయం కేటాయిస్తాను. డైరెక్టర్ ఆర్జీవీ, ప్రకాశ్ రాజ్, అమోల్ పాలేకర్... మొదలైన డైరెక్టర్లతో కలిసి పనిచేశాను. ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అంటే ఒక్కరి పేరు చెప్పలేను. ఒక్కొక్కరికీ తమదైన శైలి ఉంది. వారి పని విధానాన్ని ఆకళింపు చేసుకుంటాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రయోగాలు చేయడంలో రాము స్వేచ్ఛను ఇచ్చేవారు. ఆయనతో పనిచేస్తే నిశబ్దంలో నుంచి అబ్జర్వేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ప్రకాశ్ రాజ్ సీన్ గురించి చర్చించి నటన నాకే వదిలేసేవారు. ఆయన అందరూ మెచ్చే నటుడు. నటనలో లోతులు తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ డైరెక్టర్గా నటనకు సంబంధించి తన భావాలను ఇతరులపై రుద్దరు. ‘నేను ఇలా అనుకుంటున్నా. నీ అభిప్రాయం ఏమిటి?’ అడిగే వారు అమోల్ పాలేకర్, కేతన్ మెహతాకు స్పాంటేనియస్ రియాక్షన్ అంటే ఇష్టం. ఇమేజ్ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. నాకు నచ్చనిది చేయను. ఇమేజ్ను లెక్కలోకి తీసుకోను. నటుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఉండవచ్చుగాక... అయినప్పటికీ దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని అర్థం చేసుకుంటే సమస్యే లేదు. నర్తకి హిందీ, సౌత్ చిత్రాలు అనే తేడా లేదు. రెండిటినీ ఆస్వాదిస్తాను. భిన్న భాషలలో నటించడం వల్ల అక్కడి ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదీ ఎక్కువ, ఏదీ తక్కువ కాదు. దక్షిణాదిలో అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. ‘కబాలి’లో రజని సర్తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.నాకు డ్యాన్స్ వచ్చు. ఒక నర్తకి పాత్ర చేయాలని కోరిక ఉంది. ‘టాలెంట్తో అన్నీ జరుగుతాయి’ అనే దాంట్లో నాకు నమ్మకంగా లేదు.‘బ్రహ్మాండంగా నటించావు’లాంటి ప్రశంసలు వచ్చిన రోజుల్లో కూడా అవకాశాలు రాకపోవచ్చు. ఏ ప్రశంసలూ లేని రోజుల్లో కూడా అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టవచ్చు. -
ఓ చిన్న ప్రయత్నం
స్టార్ట్... కెమెరా.. యాక్షన్ అని దర్శకుడు చెప్పగానే పాత్రలో లీనమైపోయి హీరోయిన్గా ఇన్ని రోజులు డైలాగ్లు చెప్పారు రాధికా ఆప్టే. కానీ తొలిసారి యాక్టర్స్ చేత డైలాగ్స్ చెప్పించారామె. అదేనండీ.. ఆమె ఓ 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసం దర్శకురాలిగా మారారు అని చెబుతున్నాం. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్ వాకర్స్’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించారు రాధికా ఆప్టే. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో చిన్నగా ఏదో ప్రయత్నించాను. ఇది నిర్మాతలు లలిత, హనీ, అభిషేక్లకు నచ్చడంతో నిర్మిస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్లీప్ వాక ర్స్’ విడుదలైన తర్వాత వీక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్కి దర్శకత్వం వహించిన రాధికా భవిష్యత్లో ఏదైనా సినిమాను డైరెక్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. -
అవార్డు వస్తుందా?
‘ది వెడ్డింగ్ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్ టు స్పై’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో నటించి అంతర్జాతీయ స్టార్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్ ‘ఎమ్మీ’ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్ దక్కించుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ఫస్ట్ సిరీస్లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్లో ఆమెకు నామినేషన్ దక్కేలా చేసింది. అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్కు మరింత బూస్ట్ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్ నమోదయ్యాయని బాలీవుడ్ సమాచారం. బెస్ట్ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్ గేమ్స్’, నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ‘ది రీమిక్స్’ నామినేషన్స్ దక్కించుకున్నాయట. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
స్త్రీలోకం
►ఇండోనేషియాలో భర్త నిర్బంధంలో ఉన్న హీనా బేగమ్ అనే హైదరాబాద్ యువతికి (23) ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం విముక్తిని ప్రసాదించి ఇండియా తీసుకువస్తోంది. తన అల్లుడు తన కూతుర్ని ఇల్లు కదలకుండా చేసి హింసిస్తున్నాడని, అతడి చెర నుంచి విడిపించి ఆమెకు ప్రాణభిక్ష ప్రసాదించాలని హీనా తల్లి చేసిన విజ్ఞప్తిపై తక్షణం స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. ఇండోనేషియా సహకారంతో హీనాను (ఆమె రెండున్నరేళ్ల వయసున్న కొడుకుతో పాటు) భర్త నుంచి కాపాడి ఇండియా విమానం ఎక్కించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ►ఆస్ట్రేలియాలో ఉంటున్న బాలీవుడ్ నటి ఈషా షర్వాణీ (34)తో ఆదాయం పన్ను అధికారులం అంటూ మోసపూరితమైన ఫోన్ సంభాషణలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె అకౌంట్ నుంచి మూడు లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు! అరెస్టు నుంచి తప్పించుకోడానికి పెనాల్టీ కట్టాలని వారు చెప్పడంతో ఈషా తన మేనేజర్తో చేత ఆన్లైన్లో అంత మొత్తాన్నీ వారికి బట్వాడా చేయించారు. ఆ తర్వాత కొద్దిగంటలకే మోసం బయటపడి, పోలీసులకు చిక్కిన ఆ ముగ్గురూ భారతీయులే కావడం విశేషం. ►నెట్ఫ్లిక్స్లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’లో కథానాయికగా నటించిన రాధికా అప్టే ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్ట్రెస్’ కేటగిరీ కింద ‘ఎమ్మీ’ అవార్డుకు నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ 23న లాస్ ఏంజిల్స్లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో విజేతలను ప్రకటిస్తారు. టీవీ కార్యక్రమాలకు, టీవీ నటీనటులు, సాంకేతికనిపుణులకు గత 70 ఏళ్లుగా ఎమ్మీ అవార్డులు ఇస్తున్నారు ►పాకిస్తాన్లో మానవ హక్కుల కార్యకర్త గులాలై ఇస్మాయిల్ ప్రాణాపాయంలో పడ్డారు. దేశంలో మహిళలపై హింస ఎక్కువైందని, బలవంతపు పెళ్లిళ్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసి ‘దేశంలో హింసను ప్రేరేపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకి’గా ముద్ర పడిన గులాలై తాజాగా పాక్ సైన్యం దురాగతాలపై నోరు విప్పడంతో ఆమెకు, ఆమె కుటుంబానికి వేధింపులు, బెదరింపులు మొదలయ్యాయి. దాంతో గులాలై దేశం విడిచి యు.ఎస్. పారిపోయారు. ►జయలలిత జీవిత చరిత్రపై వస్తోన్న ‘తలైవి’ చిత్రం కోసం జయలలితగా నటిస్తోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు లాస్ ఏంజిల్స్లోని జేసన్ కాలిన్స్ స్టుడియోలో ఆ చిత్ర సాంకేతిక నిపుణులు ‘ప్రోస్థెటిక్ మెజర్మెంట్స్’ (కృత్రిమ ఆకృతి కొలతలు) తీసుకుంటున్నారు. కంగనాను అచ్చు జయలలితలా మలిచేందుకు ఈ కొలతలు ఉపయోగపడతాయి. తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్. -
అంత పిచ్చి లేదు
‘అంధాధున్’, ‘ప్యాడ్మ్యాన్’.. రెండు చిత్రాల్లోనూ నటించారు రాధికా ఆప్టే. ఈ రెండు చిత్రాలకు ఈ ఏడాది నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘ఎలా ఫీలవుతున్నారు?’ అని ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు. ‘‘సంతోషమే కానీ, ఎదురు చూసేంత సంతోషం కాదు’’ అన్నారు రాధిక. దానర్థం అవార్డులను ఆమె పట్టించుకోరని. ‘‘ఆడియెన్స్కి నచ్చితే చాలు. అంతకు మించి నేనేం ఆశించను. అవార్డు వచ్చినా, రాకున్నా నాకు ఒకటే. ఐయామ్ నాట్ అవార్డ్ – క్రేజీ పర్సన్’’ అన్నారు రాధిక. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
నా పేరే ఎందుకు?
రిలీజ్ కాని సినిమాలకు చెందిన క్లిప్పింగ్లు, స్టిల్స్ అప్పుడప్పుడు నెట్లో వైరల్ కావడం ఈ టెక్నాలజీ యుగంలో సాధారణ విషయమై పోయింది. హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమా రొమాంటిక్ సీన్ ఒకటి నెట్లో వైరల్గా మారింది. అది దేవ్ పటేల్, రాధికా ఆప్టే మధ్య సాగే శృంగార సన్నివేశం. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోలు ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని ఎక్కువగా నెట్లో తిరుగుతోంది. ఈ విషయంపై రాధికా ఆప్టే స్పందించారు. ‘‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో బోలెడన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అందుకో హైలీ రొమాంటిక్ సీన్ ఒకటి లీకైంది. కానీ ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని నా పేరుతోనే ఎందుకు? ఇది ప్రచారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందులో దేవ్ పటేల్ కూడా ఉన్నారు కదా. హీరో పేరుతో కాకుండా హీరోయిన్ పేరుతో ఎందుకు వైరల్ చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సైకో మెంటాలిటీస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయనిపిస్తోంది’’ అన్నారు రాధిక. మూడేళ్ల క్రితం ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు రాధికా ఆప్టే. అప్పుడు లీకైన వీడియోలో నటుడు రాధికా ఆప్టేతో నటుడు ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. అప్పుడు కూడా రాధికా ఇలానే స్పందించారు. -
ఆ సీన్ లీక్: సైకో మెంటాలిటీయే కారణం
ప్రముఖ నటి రాధికా ఆప్తే, దేవ్ పటేల్ జంటగా నటించిన తాజా హాలీవుడ్ చిత్రం ‘ద వెడ్డింగ్ గెస్ట్’ . త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ ఒకటి లీకై.. ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. రాధికా ఆప్తే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న ఈ సీన్ లీక్ కావడంపై నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజంలో సైకో మెంటాలిటీకి ఈ సీన్ లీకే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈ సీన్ మేల్ యాక్టర్ దేవ్ పటేల్ పేరిట స్ప్రెడ్ చేయకుండా.. తన ఒక్కరి పేరు మీదనే ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘బాలీవుడ్ లైఫ్’ వెబ్సైట్తో ముచ్చటించిన రాధిక.. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ శృంగారానికి సంబంధించిన సీన్ను మాత్రమే లీక్ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే’ అని అన్నారు. ‘లీకైన ఆ సీన్లో రాధికా ఆప్తే, దేవ్ పటేల్ ఇద్దరూ ఉన్నారు. కానీ, నా పేరు మీదనే ఆ సీన్లను స్ప్రెడ్ చేస్తున్నారు. మేల్ నటుడు దేవ్ పటేల్ పేరు మీద వాటిని స్ప్రెడ్ చేయవచ్చు కదా’ అని ఆమె ప్రశ్నించారు. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో రాధికా ఆప్తే పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నేను చిన్నప్పటి నుంచి ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. నా పట్ల నేను కంఫర్టబుల్గానే ఉన్నాను. భారత్లో, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం నేను చూశాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక అభినేత్రిగా నా శరీరం కూడా ఒక సాధనమే నాకు. బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు’ అని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్తే పేర్కొన్నారు. -
సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్
సమాజం ఓ సైకో అంటూ బాలీవుడ్ వివాదస్పద నటి రాధిక ఆప్టే ఫైర్ అయ్యారు. ఆమె నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే హాలీవుడ్ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని, కానీ అవన్నీ వదిలేసి కేవలం ఈ ఒక్క సెక్స్ సీన్ మాత్రమే లీక్ చేసారన్నారు. సమాజపు మానసిక పరిస్థితికి అద్దం పట్టే దృశ్యం ఇదేనని మండిపడ్డారు. సొసైటీ నిజంగానే ఓ సైకోలా మారిపోయిందన్నారు. ఆ లీకైన సీన్లో తనతో పాటు దేవ్పటేల్ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్ సీన్ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు దేవ్ పటేల్ సన్నివేశమని ప్రమోట్ చేయరని నిలదీశారు. ఇక రాధిక ఆప్టేకు సంబంధించిన బోల్డ్ సీన్లు లీకవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016, ఆగస్టులో అదిల్ హుస్సెన్తో సాన్నిహిత్యంగా ఉన్న సన్నివేశాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ తరహా సన్నివేశాలపై రాధిక ఆప్టే కూడా బోల్డ్గానే స్పందించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా సన్నివేశాల్లో నటించడానికి తనకేం ఇబ్బందిలేదన్నారు. ‘ బోల్డ్ సీన్స్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రపంచ సినిమాలు చూస్తూనే పెరిగాను.. అలాగే ఎంతో దూరం ప్రయాణించాను. నా శరీరంతో నేను సౌకర్యంగానే ఉన్నాను. భారత్, ఇతర దేశాల్లో న్యూడ్గా నటించడం నేను చూశాను. బోల్డ్ సీన్స్లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ది వెడ్డింగ్ చిత్రాన్ని మైఖెల్ వింటర్ బాటమ్ తెరకెక్కిస్తుండగా.. జిమ్ సర్బ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. -
బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!
సినిమాలోనే కాదు సినిమా పూర్తయి బయటకు రావడం వెనుక కూడా ఓ పెద్ద కథే ఉంటుంది. స్క్రిప్ట్ స్టేజ్లో అనుకున్న వాళ్లు స్క్రీన్ మీదకు వచ్చే సమయానికి ఉండకపోవచ్చు. అస్సలు అనుకోని వాళ్లు కూడా అనుకోకుండా ప్రాజెక్ట్లో భాగమవచ్చు. ఇదంతా ఎందుకంటే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘విక్కీ డోనర్’ సినిమాలో విచిత్రంగా అవకాశం కోల్పోయారట రాధికా ఆప్టే. ఈ విచిత్రమేంటో రాధికా ఆప్టే వివరిస్తూ – ‘‘విక్కీ డోనార్’ సినిమాలో హీరోయిన్గా ముందు నా పేరే అనుకున్నారు. ఆ సినిమా స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు ఫారిన్కు హాలిడేకు వెళ్లాను. ఆ ట్రిప్లో నచ్చిన ఫుడ్ను కొంచెం ఇష్టాంగా తిన్నాను. దాంతో కాస్త బొద్దుగా అయ్యాను. లావయ్యానని మా టీమ్ కొంచెం అప్సెట్ అయ్యారు. తిరిగి వచ్చాక తగ్గిపోతాను అని చెప్పినా కూడా రిస్క్ చేయదలుచుకోలేదు. అలా ఆ సినిమా ఛాన్స్ మిస్ అయింది’’ అని చెప్పారు ఆప్టే. ఈ సినిమాలో హీరోయిన్గా యామీ గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. -
ఏజెంట్ నూర్
ఫ్రాన్స్లో గూఢచర్యం చేశారు రాధికాఆప్టే. మరి.. ఆమె సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగిందో వెండితెరపై చూడాల్సిందే. ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ లిడియా డీన్ పిల్చర్ దర్శకత్వంలో ‘లిబర్టే: ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సారా మేఘన్ థామస్, స్టానా కాటిక్, రాధికా ఆప్టే, లైనస్ రోచె, రోసిఫ్ సదర్లాండ్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ఇండియన్ ముస్లిమ్ స్పై ఏజెంట్ నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే నటించారు. ఇటీవల యూకేలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమా టీమ్ కలుసుకున్నారు. ఈ సమయంలో ఈ సినిమాలోని తన లుక్ను రాధికా ఆప్టే షేర్ చేశారు. ఇక.. బాలీవుడ్లో ‘రాత్ అఖేలి హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరో. -
నా సక్సెస్ భిన్నం బాస్
తన సక్సెస్ కాస్త భిన్నం అంటోంది నటి రాధికాఆప్తే. అవును ఈ అమ్మడు సహ నటీమణులకే భిన్నం అంటారు. ఇక భావాలు వేరేగా ఉండడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికి సిద్ధం అనే ఈ సంచలన భామ నటిగానూ ఎల్లలు దాటేసిందన్నది వాస్తవం. ధోనీ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన రాధికాఆప్తే, ఆ తరువాత కార్తీతో ఆల్ ఇన్ ఆల్ అళగురాజా, రజనీకాంత్ సరసన కబాలి వంటి చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులోనూ బాలకృష్ట స్టార్ హీరోలతో నటించిన రాధికాఆప్తే దక్షిణాదిలో పెద్దగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను పొందక పోయినా, బాలీవుడ్, హాలీవుడ్లలో నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది. ఇటీవల బ్రిటీష్, అమెరికా చిత్రంగా రూపొందిన ది వెడ్డింగ్ గెస్ట్లో నటించింది. ప్రస్తుతం మరో హాలీవుడ్ చిత్రం వరల్డ్వార్–2లో నటిస్తోంది. కాగా ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లను దాటి హాలీవుడ్లోనూ నటిస్తున్నా ఇంకా తాను అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని రాధికాఆప్తేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించి ఈ మరాఠి అమ్మడు చెబుతూ తాను నటించిన హాలీవుడ్ చిత్రం ది వెడ్డింగ్ గెస్ట్ ఇటీవలే అమెరికాలో విడుదలైందని చెప్పింది. ఆ చిత్రం తరువాత ఇప్పుడు పలు హాలీవుడ్ చిత్రాల అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. వాటి స్క్రిప్ట్లను చదువుతున్నానని, కొత్త చిత్రంలో నటించే విషయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. తాను అన్ని భాషల్లోనూ ప్రముఖ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది. ఇతరులు దేన్ని విజయం అనుకుంటున్నారో, తాను భావించే విజయం దానికి భిన్నంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఇప్పటి వరకూ తనను తాను సక్సెస్ఫుల్ హీరోయిన్గా భావించడం లేదని అంది. దాన్ని తానింకా సాధించలేదని, అందుకు సమయం వచ్చినప్పుడు తాను సక్సెస్ఫుల్ హీరోయిన్గా భావిస్తానని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడికి దక్షిణాదిలో ప్రస్తుతం ఒక్క అవకాశం కూడా లేదన్నది వాస్తవం. వాటి కోసమే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. -
లెక్కలు చెప్పేదాన్ని!
సౌత్లోనే కాకుండా నార్త్లోనూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు కథానాయిక రాధికా ఆప్టే. వెబ్ సిరీస్లతో డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. రాధికా సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పుడు హాలీవుడ్ వరకూ వెళ్లింది. అక్కడ ఆమె ఒక సినిమా సైన్ చేశారు. కథానాయికగా ఈ రేంజ్లో సక్సెస్ అయిన మీరు ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అనే ప్రశ్న రాధికా ముందు ఉంచితే – ‘‘మ్యాథమేటిక్స్ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్ని చాలా స్పెషల్గా చదివేదాన్ని. అలాగే వైల్డ్లైఫ్ అన్నా ఇష్టమే. ఒకవేళ నేను యాక్టర్ కాకపోయి ఉంటే బహుశా మ్యాథ్స్ టీచర్గా లెక్కలు చెబుతూ ఉండేదాన్నేమో. ఒకవేళ అది కూడా కుదరకపోతే వైల్డ్లైఫ్ రంగంలో ఉద్యోగం చేసేదాన్నేమో. ఎవరికి తెలుసు? ప్రస్తుతం అయితే నటిగా సినిమా పరిశ్రమలో మంచిస్పేస్లోనే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
చిన్న సినిమా చైనాలో దుమ్ముదులుపుతోంది
భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి. అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్ని ఇస్తుందో చూడాలి. -
మస్త్ బిజీ
రెండేళ్ల క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘హిందీ మీడియం’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ను సాధించింది. సాకేత్ దర్శకత్వంలో ఇర్ఫాన్ఖాన్, సాబా క్వామర్, దీపక్ దోబ్రియాల్, షాయన్న పటేల్ ముఖ్య పాత్రలు చేశారు. దినేష్ విజన్ నిర్మించారు. ‘హిందీ మీడియం’ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు అప్పట్లోనే స్ట్రాంగ్గా వార్తలు వచ్చాయి. అయితే.. ఇర్ఫాన్ఖాన్ అనారోగ్య పరిస్థితుల కారణంగా సెట్స్పైకి వెళ్లలేదు. ఇటీవల ఇర్ఫాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితులు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి రావడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే...ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఇంతకుముందు రాధిక ఆప్టే పేరు తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత ‘వీరేది వెడ్డింగ్’వంటి వందకోట్ల సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన కరీనా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘గుడ్న్యూస్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ పీరియాడికల్ మూవీ ‘తక్త్’లో నటించనున్నారు. ఇప్పుడు‘హిందీ మీడియం’ సీక్వెల్లో సెట్ అయితే.. కరీనా మళ్లీ బిజీ ట్రాక్లో పడ్డట్లే లెక్క. ‘‘ఇర్ఫాన్ఖాన్ తిరిగి వచ్చారు. స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నాం. మరో రెండు నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని నిర్మాత దినేష్ విజన్ పేర్కొన్నారు. ఈ సీక్వెల్కు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
త్వరలో ఇంగ్లీష్ క్లాసులు
వేసవిలో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ఖాన్ కెమెరా ముందు ‘ఇంగ్లీష్ మీడియం’ క్లాసులను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇర్ఫాన్ఖాన్, సాబా క్వామర్, దీపక్ డోబ్రియల్, షాయన్న పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘హిందీ మీడియం’ చిత్రం గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయింది. సాకేత్ చక్రవర్తి దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనున్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. అయితే ఇర్ఫాన్ఖాన్ క్యాన్సర్ చికిత్స కోసం లండన్ వెళ్లడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆయన ముంబైకి తిరిగిరావడంతో సీక్వెల్పై మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఇర్ఫాన్ నటించేందుకు ఓకే చెప్పారని, సమ్మర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహిస్తారట. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాధికా ఆప్టేను సంప్రదించగా ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వినికిడి. ఇందులో ఇర్ఫాన్ కూతురిగా ‘పటఖా’ ఫేమ్ రాధిక మాదన్ కనిపిస్తారని సమాచారం. -
ప్రమోషన్స్ ఎంజాయ్ చేయలేను
సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. బాలీవుడ్ స్టార్స్ అయితే సినిమా ప్రమోషన్స్ కోసం నెలకుపైనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ప్రమోషన్ చేయడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేను అంటున్నారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘బొంబేరియా’. ఈ సినిమాలో రాధికా ఆప్టే పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ఏజెంట్గా పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా రోజూ చాలా మంది పీఆర్లతో జర్నీ చేస్తుంటాం. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమాలో చేసిన పాత్ర తర్వాత తెలుసుకున్నాను. ఏదైనా పని చేయించుకోవడానికి వాళ్లు చాలా మంది ఈగోని సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఎంతో మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్స్లో కీలక భాగమై ఉంటారు. ప్రమోషన్స్ చేసే విషయానికి వస్తే.. నేను ఎంజాయ్ చేయలేని పని ఏదైనా ఉందంటే అది సినిమా ప్రమోషన్సే. నటిగా నా సినిమాలను నేను ప్రమోట్ చేయాలి.. అది నా బాధ్యత. కానీ ఆ పనిని ఎంజాయ్ చేయలేను. సినిమా షూటింగ్ చేయడమో, చేయబోయే క్యారెక్టర్ని ఇంకా బాగా స్టడీ చేయడమో లాంటి పనులను బాగా ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. -
‘సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’
ఘూల్... అంటే అరబిక్లో ఆత్మ అని అర్థం!అబు ఘ్రైబ్.. అంటే కోవర్ట్ డిటెన్షన్ సెంటర్. బ్రిటిషర్స్ కాలంలోని కాలాపాని లాంటిది.. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ లాంటిది. అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంటారు ఆర్మీ అధికారులు. ఈ రెండిటి కథే.. ఘూల్. నెట్ఫ్లిక్స్ సెకండ్ ఒరిజినల్. మూడు ఎపిసోడ్ల మినీ సిరీస్. నిదా రహీమ్ (రాధికా ఆప్టే).. నేషనల్ ప్రొటెక్షన్ స్క్వాడ్ ట్రైనీ. ఆమె తండ్రి ప్రొఫెసర్. యాక్టివిస్ట్ కూడా. ప్రభుత్వం నిషేధించిన సిలబస్ను పిల్లలకు బోధిస్తున్నాడని తండ్రి గురించి పోలీసులకు ఉప్పందించి అతనిని అరెస్ట్ చేయిస్తుంది. ప్రొఫెసర్ను కోవర్ట్ డిటెన్షన్ సెంటర్కు తరలిస్తారు. ఇంటరాగేషన్ ద్వారా తండ్రి తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తిగా బయటకు వస్తాడని నిదా నమ్మకం. ఆమె ఇంటరాగేషన్ స్కిల్స్ పట్ల ఆర్మీలో మంచి పేరుంటుంది. సొంత తండ్రినే పట్టించిందన్న కీర్తీ కూడి డిటెన్షన్ సెంటర్లో ఇంటరాగేషన్ ఆఫీసర్గా అవకాశం వస్తుంది నిదాకు. దానికి హెడ్ డకున్హా (మానవ్ కౌల్) అనే మిలటరీ ఆఫీసర్. అనుమానం.. అసహనం ఆ సెంటర్ ఒక చీకటి గుహ. అందులో పనిచేసే వాళ్లకు కనీసం పగలు, రాత్రి తేడా తెలిసేలా ఉండాలని డిమ్ లైట్లు పెడ్తారు. ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడమని నిదాకు హుకుం జారీ చేస్తాడు ఆఫీసర్ డకున్హా. అక్కడే ఉన్న మరో లేడీ ఆఫీసర్ మేజర్ దాస్ (రత్నాబాలి భట్టఛార్జి). దేశభక్తిని నరనరాన నింపుకున్న ఆమెకు నిదా నచ్చదు. ముస్లిం అని, ఆమెను నమ్మడానికి వీల్లేదని డకున్హాకు చెప్తుంది. నిత్యం నిదాను అనుమానిస్తూ, మాటలతో వేధిస్తూంటుంది. అప్పుడే అక్కడికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలి సయీద్ను తీసుకొస్తారు. ‘‘అలి సయీద్ నోట నిజాలు కక్కించి నీ ఇంటరాగేషన్ స్కిల్స్ నిరూపించుకో’’ అని సవాలు విసురుతాడు డకున్హా. ఆ ప్రయత్నంలోనే అలి సయీద్ నిదాను ‘‘నిదూ’’ అని పిలుస్తాడు. షాక్ అవుతుంది ఆమె. ‘‘నువ్వెవరు?’’అని రెట్టిస్తుంది సయీద్ని. మొహం, నోటి నుంచి రక్తమోడుతున్న అతడు వికృతంగా నవ్వుతాడు. భీతిల్లి వెనక్కి తగ్గుతుంది నిదా. ‘‘భయపడొద్దు.. బయట ఇంటరాగేషన్కు, ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. నేర్చుకోవాలి’’ అని చెప్పి వెళ్లిపోతాడు డకున్హా. అసహనంగా నసుగుతూ నిదాను క్యాంటీన్కి తీసుకెళ్తుంది మేజర్ దాస్. ‘‘ఏమైందీ భయపడ్డావా?’’ అంటూ అనునయం నటిస్తుంది ‘‘నన్ను నిదూ అని మా నాన్న మాత్రమే పిలుస్తారు. ఆ పేరు సయీద్కెలా తెలిసింది?’’ అదే షాక్లో అడుగుతుంది నిదా. ‘‘వేషాలు వేయకు. నీకన్నీ తెలుసు. మీరంతా ఒకటే’’ స్థిరమైన గొంతుతో బెదిరిస్తుంది మేజర్ దాస్. అవాక్కవుతుంది నిదా. తండ్రి గుర్తొస్తాడు. ‘‘నాన్న ఏమైనట్టు?’’ ఆలోచన మొదలవుతుంది. ఆ రాత్రి ఆమెకు పీడకలొకటి వస్తుంది. తండ్రి పిశాచమై తనను పీక్కు తింటున్నట్టు. దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ రాత్రంతా నిద్రపోదు. ఏదో తెలియని గిల్ట్ వెంటాడుతుంటుంది. తెల్లవారి.. తన తండ్రి గురించి డకున్హాను అడుగుతుంది నిదా. అక్కడి నుంచి పంపేశామని చెప్పి.. అలి సయీద్ ఇంటరాగేషన్ కంటిన్యూ చేయమంటాడు. ఆరోజు.. నిదాతో పాటు చౌదరి, గుప్తా ఇద్దరూ ఇంటరాగేషన్ సెల్లోకి వెళ్తారు. సయీద్ను ఇంటరాగేట్ చేయడానికి సన్నద్ధమవుతుంటే.. ఆ సెంటర్లో జరిగిన కొన్ని నేరాల గురించి మాట్లాడ్తాడు సయీద్. విస్మయానికి లోనవుతారు చౌదరి, గుప్త. నిదాకు అంతా అయోమయంగా ఉంటుంది. చౌదరీకి తెలియకుండా, గుప్తా, గుప్తాకు తెలియకుండా చౌదరి చేసినవీ చెప్పి వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడ్తాడు. సయీద్ ఇంటరాగేషన్ను మరిచిపోయి ఆ ఇద్దరూ గొడవపడ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది నిదా. గుప్తాను కత్తితో పొడిచేస్తాడు చౌదరి. ఈ గొడవకు పరిగెత్తుకొచ్చిన డకున్హా, నిదా అంతా హతాశులవుతారు. అప్పుడూ నింద నిదా మీద తోసెయ్యడానికే చూస్తుంది మేజర్ దాస్. వాళ్లందరినీ బయటకు పంపేసి సయీద్కు కరెంట్ షాక్ ఇస్తాడు డకున్హా. ‘‘ఘూల్ ఘూల్’’ అని సణుగుతూ నోట్లోంచి నురగలు కక్కి తలవాల్చేస్తాడు సయీద్. అతను చనిపోయాడనుకుంటాడు డకున్హా. ఇదంతా రికార్డ్ రూమ్లోంచి గమనిస్తున్న నిదా.. సయీద్ సణిగిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. టెర్రరిస్ట్ ముద్రతో సెల్లో ఉన్న ఒక మౌల్వీని పిలిచి ఆ రికార్డింగ్ వినిపించి అర్థం అడుగుతుంది. బిత్తరపోతాడు మౌల్వీ. చెప్పమని గద్దిస్తుంది నిదా. ‘‘ఘూల్ అంటే అరబిక్లో ఆత్మ. సయీద్ మనిషి కాడు. వాడు ఆత్మ’’ అని చెప్పి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మౌల్వీ. డకున్హా ఇంటరాగేషన్ గదిలోంచి బయటకు రాగానే నిదా వెళ్లి చూస్తుంది. అక్కడ సయీద్ శరీరం ఉండదు. మళ్లీ ఎప్పటిలాగే గొలుసులతో బంధించి ఉంటుంది. అతను వికటాట్టహాసం చేస్తుంటాడు. చంపాలని ప్రయత్నిస్తుంది కాని కుదరదు. అప్పుడు నిదాకూ నిర్ధారణవుతుంది సయీద్ మనిషి కాదు అని. ఆ విషయమే డకున్హా, మేజర్ దాస్లతో చెప్తుంది. ఎవరూ నమ్మరు. మేజర్ దాసైతే నిదానూ టెర్రరిస్ట్గా ముద్ర వేసేస్తుంది. ఇంకో రోజు.. ఇంటరాగేషన్ స్పెషలిస్ట్ ఫౌలాద్ సింగ్ వస్తాడు సయీద్ను హింసించడానికి. ఆ టైమ్లోనే నిదా మౌల్వీ సెల్లోకి వెళ్తుంది ఘూల్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం. అపరాధభావంతో బాధపడేవాళ్ల శరీరాన్ని ఘూల్ కోరుకుంటుందని, అలా వాళ్ల శరీరంలోకి జొరబడి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తాడు మౌల్వీ. తన తండ్రి గురించీ ఆరా తీస్తుంది. ఏమీ చెప్పడు మౌల్వీ. ఈ లోపు స్పెషల్ ఇంటరాగేషన్ సెల్ నుంచి పెద్ద కేక వినిపిస్తుంది. అటుగా పరిగెత్తుతుంది నిదా. అప్పుడే డకున్హాకు ఫోన్ వస్తుంది. ‘‘సర్.. సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’’ అనే సమాచారంతో. డకున్హాకు నోట మాటరాదు. మరిక్కడ ఉంది ఎవరు? స్పెషల్ ఇంటరాగేషన్ సెల్లో ఫౌలాద్ సింగ్ బాడీ కనిపిస్తుంది నిదాకు. సయీద్ అనుకుంటున్న వాడు ఏమైనట్టు? అనే డౌట్ వచ్చేలోపే ఫౌలాద్ సింగ్ శరీరంలో ఉన్న ఆత్మ గబగబా సెల్ నుంచి బయటకు వచ్చి ఇతర సెల్స్ తలుపులు తెరిచి అందులోని ఖైదీలందరినీ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే నిదాను చూస్తుంది. ఆమె భయపడి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. సరైన సమయంలో డకున్హా అండ్ టీమ్ వచ్చి ఆమెను రక్షిస్తారు. అప్పడు జరిగిందంతా చెప్తుంది. వెళ్లి చూసి నిజమనే నమ్ముతారు. కాని మేజర్ దాస్ నమ్మదు. ఆ ఖైదీలను విడిపించడానికి నిదా ఆడుతున్న నాటకం అని, ఆమె వచ్చాకే ఆ సెంటర్ అంతా గందరగోళంగా తయారైందని, తమలో తామే తన్నుకు చస్తున్నారని మిగిలిన వాళ్లను రెచ్చగొడ్తుంది. వాళ్లూ నమ్ముతారు. మేజర్ దాస్ ఆజ్ఞ మేరకు నిదాను సెల్లో వేస్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మిగిలిన ఖైదీలు కనిపిస్తారు. ఆ గదిలో హత్యలు జరిగినట్టు గోడకు తుపాకీ తూటాల ఛిద్రాలు, రక్తం మరకలు కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నిదాకు. అది ఇంటరాగేట్ చేసి మనుషులను మార్చే సెంటర్ కాదు.. ఫక్తు హత్యలు చేసే సెంటర్ అని. అప్పుడు అక్కడే ఉన్న మౌల్వీని అడుగుతుంది మళ్లీ తన తండ్రి గురించి. చనిపోయి ఉంటాడని చెప్తాడు. అక్కడున్న ఖైదీల్లోనే ఎవరో ఘూల్ అన్న విషయమూ బోధపడ్తుంది నిదాకు. ‘అహ్మద్’ అనే వ్యక్తిని చూపిస్తూ నువ్వేనా అని అడుగుతుంది. ‘‘వాడు మూగవాడు.. ఆత్మ మూగవాడి శరీరంలోకి ప్రవేశించదు’’ అంటాడు మౌల్వీ. ‘‘ఒక టీ అమ్ముకునే వాడిని టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చారు. వీడి నుంచి విషయాలు ఏమీ రాబట్టలేకపోయే సరికి వీడి భార్య, కొడుకును పట్టుకొచ్చి వీడి కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి వీడికి మాట పడిపోయింది’’ అని జరిగింది చెప్తాడు మౌల్వీ. దిమ్మ తిరుగుతుంది నిదాకు. చిమ్నీ చూపించి దాన్నుంచి బయటకు పొమ్మని అహ్మద్కు చెప్పి తనూ అహ్మద్ వెనక వెళ్తుంది. అహ్మద్ బయటపడి.. నిదాకూడా బయటపడే టైమ్కి ఘూల్ ఆమెను లోపలికి లాగి కాలి పిక్కను కొరుకుతుంది. అయినా తప్పించుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ కలిసి డకున్హా చాంబర్కు వెళ్తారు. అక్కడ జరిగిన పెనుగులాటలో నిదా రూపంలో ఉంది ఆత్మ అని అర్థమవుతుంది అహ్మద్ కు. లోపల అసలు నిదా ఉంటుంది. మేజర్ దాస్.. నిదాను చంపబోతుంటే డకున్హా మేజర్ దాస్ను చంపేస్తాడు. మిగిలిన వాళ్లలో ఒకొక్కరిలోకే ఆత్మ చేరి ఒకొక్కరినీ చంపేస్తుంటుంది. ఈలోపు తన తండ్రిని చంపమని ఆర్డర్ ఇచ్చింది డకున్హానే అని తెలుస్తుంది నిదాకు. పశ్చాత్తాపంతో కుమిలి పోతుంది. అహ్మద్తో కలిసి ఆ సెంటర్ నుంచి బయటకు వస్తుంది. బాంబు వేసి ఆ సెంటర్ను పేల్చేసి తనూ బయట పడ్తాడు డకున్హా. సెంటర్ బయట ఆర్మీ ఉంటుంది. డకున్హాను చూసి ‘‘వీడు మనిషి కాదు.. ఘూల్ ’’ అంటూ ఆర్మీ వారిస్తున్నా వినకుండా డకున్హాను చంపేస్తుంది నిదా. ఆర్మీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు చెప్తుంది నిదా.. ‘‘అది కోవర్ట్ డిటెన్షన్ సెంటర్ కాదు.. హత్యలు చేసే సెంటర్. అందరూ కరప్ట్ అయ్యారు’’అంటూ. నిదా కూడా టెర్రరిస్టే అని ముద్ర వేసి ఆమెనూ కోవర్ట్ డిటెన్షన్ సెంటర్కు పంపిస్తారు. అక్కడ.. బ్లేడ్తో అర చేతిని కోసుకొని రక్త తర్పణ చేసి తన శరీరంలోకి ఘూల్ని ఆహ్వానించేందుకు సిద్ధపడ్తుంది నిదా!ఇక్కడితో ‘ఘూల్’ సీజన్ వన్ ఎండ్ అవుతుంది. హైపర్ నేషనలిజం, ఇస్లామోఫోబియా వల్ల తలెత్తిన ఘర్షణకు దృశ్యరూపం ‘‘ఘూల్’’. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంది. దర్శకుడు పాట్రిక్ గ్రాహమ్. – సరస్వతి రమ -
స్క్రీన్ టెస్ట్
రైతులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో, సినిమా పరిశ్రమకు కూడా అంతే పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి మూడ్లోనే ఉన్నారు. అందుకే సంక్రాంతి సినిమాల గురించి, సినిమా వాళ్ల సంక్రాంతి గురించి ఈ వారం క్విజ్... 1. 2012, 2013, 2014 వరుసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసిన టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) మహేశ్బాబు సి) చిరంజీవి డి) అల్లు అర్జున్ 2. తెలుగు నిర్మాతల్లో ఏ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అన్నారో తెలుసా? ఎ) జీవీజీ రాజు బి) ‘దిల్’ రాజు సి) అర్జున్ రాజు డి) యం.యస్. రాజు 3. ఈ సంక్రాంతికి (2019) విడుదలైన సినిమాల్లో ఏ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమయ్యారో చెప్పుకోండి? ఎ) విద్యాబాలన్ బి) కియరా అద్వానీ సి) శ్రద్ధాకపూర్ డి) కంగనా రనౌత్ 4. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ 2017 సంక్రాంతికి వచ్చారు నాగార్జున. ఆ చిత్రంలో బంగార్రాజు సరసన నటించిన నటి గుర్తున్నారా? ఎ) లావణ్యా త్రిపాఠి బి) రమ్యకృష్ణ సి) అనసూయ డి) అనుష్క 5. తెలుగు వారి పెద్ద పండగ ‘సంక్రాంతి’. ఆ పేరుతో విడుదలైన సినిమాలో తెలుగులో పేరున్న నలుగురు హీరోలు నటించారు. వెంకటేశ్, శ్రీకాం త్, శివబాలాజీలతో పాటు మరో తమ్ముడుగా నటించిన ఆ నటుడెవరో చెప్పండి? (ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాల్లో ఓ ప్రముఖ హీరో) ఎ) శర్వానంద్ బి) తరుణ్ సి) రోహిత్ డి) ఆకాశ్ 6. ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...’ అనే పాట ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) మోహన్బాబు బి) హరనాథ్ సి) చంద్రమోహన్ డి) శ్రీధర్ 7. మహేశ్బాబు, వెంకటేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) సుకుమార్ సి) కృష్ణవంశీ డి) త్రివిక్రమ్ 8. ‘శతమానం భవతి ’ చిత్రంలోని సంక్రాంతి పాటలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ సందడి చేశారు. ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లు....’ అంటూ సాగే ఆ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 9. ఎన్టీ రామారావును ‘మనదేశం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. వారిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ 1955లో వచ్చిన ఓ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరేంటి? ఎ) మనదేశం బి) షావుకారు సి) సంసారం డి) మిస్సమ్మ 10. 2017 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజైంది. అది ఆయన నటించిన 100వ చిత్రం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమిగా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) రవీనా టాండన్ బి) టబు సి) హేమమాలిని డి) సుస్మితా సేన్ 11. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరు ఈ సినిమా చేశారో తెలుసా ? (ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది) ఎ) 7 ఏళ్లు బి) 8 ఏళ్లు సి) 10 ఏళ్లు డి) 6 ఏళ్లు 12. 2010 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన జూనియర్ యన్టీఆర్ సినిమా పేరేంటో తెలుసా? ( చిన్న క్లూ: ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు) ఎ) అదుర్స్ బి) ఆం్ర«ధావాలా సి) యమదొంగ డి) నరసింహుడు 13. ఈ ప్రముఖ దర్శకుని సినిమా ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలోకి రాలేదు. ఎవరా దర్శకుడు. కొంచెం మెదడుకి పదును పెట్టండి? ఎ) పూరి జగన్నాథ్ బి) వీవీ వినాయక్ సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) సుకుమార్ 14. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు రెండు చిత్రాలు మాత్రమే సంక్రాంతి పందెంలో నిలిచాయి. అందులో ఒకటి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘యోగి’. మరో చిత్రం ఏంటో కనుక్కుందామా? ఎ) వర్షం బి) పౌర్ణమి సి) బిల్లా డి) మున్నా 15. ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’, ‘దీపావళి’ మూడు పండగల పేర్లతో ఉన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కుందామా? ఎ) స్నేహా బి) ఆర్తి అగర్వాల్ సి) సౌందర్య డి) కల్యాణి 16. ‘ఊరంతా సంక్రాంతి’ చిత్రంలో ఇద్దరు పాపులర్ హీరోలు నటించారు. అందులో ఒకరు ఏయన్నార్. మరో హీరో ఎవరు? ఎ) కృష్ణ బి) శోభన్బాబు సి) కృష్ణంరాజు డి) నాగార్జున 17. కమల్హాసన్ నటించిన ‘మహానది’ చిత్రంలో ‘సంక్రాంతి..సంక్రాంతి...’ అనే హిట్ పాట ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) దేవా సి) ఎస్.ఎ. రాజ్కుమార్ డి) కేవీ మహదేవన్ 18. తన మొదటి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలిచిన దర్శకుడెవరో తెలుసా? ఆయన దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) శ్రీను వైట్ల బి) బోయపాటి శ్రీను సి) క్రిష్ డి) శేఖర్ కమ్ముల 19. 2019 సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్ సినిమా విడుదలైంది. ఆ చిత్రం ‘పేట’. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్రిష. మరో హీరోయిన్? ఎ) నయనతార బి) రాధికా ఆప్టే సి) సిమ్రాన్ డి) మీనా 20. సంక్రాంతి అనగానే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు రిలీజవుతాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు మాటల ర^è యిత ఒక్కరే. ఆయనెవరు? ఎ) వక్కంతం వంశీ బి) అబ్బూరి రవి సి) బుర్రా సాయిమాధవ్ డి) యం.రత్నం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (డి) 3) (ఎ) 4) (బి) 5) (ఎ) 6) (ఎ) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (సి) 11) (సి) 12) (ఎ)13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (సి) 19) (సి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
రీమేక్ ? చేయాలా? వద్దా?
2018 బాలీవుడ్లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్హిట్ చిత్రం సౌత్లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ను సిద్ధార్థ్తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి. -
లావుగా ఉన్నానని వద్దన్నారు!
ఒక సినిమాలో భాగమయ్యే విధానంలో నటీనటులకు విభిన్నమైన అనుభవాలు కలుగుతుంటాయి. అన్నీ మంచి అనుభవాలే అయ్యుండాల్సిన అవసరం లేదు. కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇలా తనకు ఎదురైన ఓ షాకింగ్ ఎక్స్పీరియన్స్ని పంచుకున్నారు రాధికా ఆప్టే. ‘‘మనం కథ విన్న అన్ని ప్రాజెక్ట్స్కు ఓకే చెప్పాలనేం లేదు. ఎగై్జటింగ్ రోల్ అనిపిస్తేనే నేను గ్రీన్సిగ్నల్ ఇస్తాను. ఒక ప్రొడ్యూసర్స్ నాకు ఓ కథ చెప్పారు. అందులో కథానాయిక పాత్ర నాకోసమే రాశాం అన్నారు. ఆ పాత్ర నాకు ఎగై్జటింగ్గా అనిపించింది. ఓకే అన్నాను. కానీ ఓ స్మాల్ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత వాళ్లను అప్రోచ్ అయితే ‘నువ్వు చాలా లావుగా కనిపిస్తున్నావ్.. మా సినిమాలో తీసుకోం’ అనేశారు. షాకయ్యాను. షూటింగ్కు రెండు నెలలు టైమ్ ఉంది. నేను తగ్గుతాను అన్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం కొత్తగా అనిపించింది’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ (ది వెడ్డింగ్ గెస్ట్, రెండో ప్రపంచయుద్ధం ఆధారంగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్)లతో పాటు వరుస బాలీవుడ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అవకాశాలతో ఫుల్ఫామ్లో ఉన్నారు రాధికా ఆప్టే. -
మీటూకు ఆధారాలు అడక్కూడదు
సినిమా: మీటూ ఆరోపణలకు ఆధారాలు అడక్కూడదని నటి రాధికాఆప్తే అంటోంది. ఒక్క దక్షిణాదిలోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమలోనే సంచలన నటిగా మారింది రాధికాఆప్తే. కాగా మహిళల వేధింపులకు వ్యతిరేకంగా ఇప్పుడు మీటూ బహుళ పాచుర్యం పొందింది. అయితే ఈ మీటూ తెరపైకి రాక ముందే సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పడకగదికి పిలిచే సంస్కృతి ఉందనే విషయాన్ని బట్డబయలు చేసిన నటి రాధికాఆప్తే. అలా ఈ అమ్మడు దక్షిణాది, ఉత్తరాది సినీ వర్గాలకు చెందిన పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు తన శృంగార భరిత ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే. అదేమంటే నా శరీరం నా ఇష్టం అంటుంది. తాజాగా ఒక భేటీలో ఈ భామ పేర్కొంటూ తాను మీటూకు నూరు శాతం మద్దతిస్తానని చెప్పింది. లైంగిక వేధింపు చర్యలను సహించేది లేదని పేర్కొంది. ఇప్పుడు మీటూ అనేది చాలా అవసరం అని చెప్పింది. అత్యాచార వేధింపులకు గురైన వారు ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోగలుగుతున్నారని, ఇది స్వాగతించదగ్గ విషయం అని అంది. అలాంటి వారికి సమాజం అండగా నిలవడం ఆరోగ్యకరమైన అంశం అని అంది. అయితే మీటూ వ్యవహారంలో ఫిర్యాదు చేసే మహిళలను అందుకు ఆధారాలు అడగడం సబబు కాదని అంది. ఇలాంటి విషయాల్లో ఆధారాలు సేకరించి ఆరోపణలు చేయడం కుదరదని చెప్పింది. ఇకపోతే మహిళలు మగవారి అత్యాచార వేధింపు చర్యలకు వ్యతిరేకించకపోతే వారు తప్పులు చేసుకుంటూనే పోతారని అంది. ఒకసారి తన వెంట పడిన వ్యక్తిని అడ్డగించి బుద్ధి చెప్పానని, అయితే ఆ విషయాన్ని అంతటితోనే మరచిపోయానని చెప్పింది. కానీ చుట్టూ ఉన్న వారు ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నారని, ఇలాంటి వ్యవస్థ మారాలని రాధికాఆప్తే పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు దక్షిణాదికి పూర్తిగా దూరమై బాలీవుడ్నే నమ్ముకుందన్నది గమనార్హం. -
ధైర్యం కావాలి
ఈ ఏడాది ఫుల్ రైజింగ్లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు హాలీవుడ్ చాన్స్లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్ఫామ్లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్కుమార్ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్లిన్ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక. ‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్ సూన్’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్కుమార్ రావు పేర్కొన్నారు. -
మనిషి గుణ రాగం అంధాధున్
ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు.. మన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది... అంధాధున్ సినిమా ఫిలాసఫీ ఇదే! ఎవరి కోసం ఎవరూ ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. మనుషుల్లోని ఈ కోణానికే 24 క్రాఫ్ట్స్ను అద్ది తెరమీద ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘బదలాపూర్’ (ఆయన తీసినదే) సినిమా బిగినింగ్లాగే ‘అంధాధున్’ బిగినింగ్ కూడా మిస్ కాకూడదు. ఈ బిగిని తగిన వ్యవధి వరకూ లాగాడు కాని సినిమా ప్రారంభంలో వేసిన టైటిల్స్లో ‘‘లైఫ్.. డిపెండ్స్ ఆన్ ఇట్స్ లివర్’’ ముక్కకే సాగదీస్తే కానీ కనెక్టివిటీ దొరకలేదు. అయినా ఉత్కంఠ తగ్గదు. అంత టైట్గా ఉంది స్క్రీన్ప్లే. కథ.. సంగీత కళాకారులకు జ్ఞానేంద్రియ లోపం శాపం కాదు.. ఏకాగ్రతను కుదిర్చే వరం! అందుకే బెథోవెన్ సంగీతబ్రహ్మ అయ్యాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తన ప్రయాణాన్నీ మొదలుపెడ్తాడు ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా). అయితే గుడ్డివాడిగా! అతను పియానో వాద్యకారుడు. అద్భుతమైన ట్యూన్తో టాలెంట్ను ప్రూవ్ చేసుకొని .. తర్వాత లండన్ వెళ్లిపోయి స్వరప్రయోగాలతో కాలక్షేపం చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ ఆశను నెరవేర్చుకునే దిశలో అనూహ్య మలుపుల్లో చిక్కుకుంటాడు. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త ఆపదలను ఎదర్కొంటుంటాడు. అన్నిటినీ జయించుకుంటూ అనుకున్నది సాధిస్తాడా? గుడ్డివాడిగానే మిగిలిపోయి అంధాధున్ (గుడ్డి రాగం) పాడుకుంటాడా? ఎండ్ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే! ఈలోపు కొన్ని సీన్స్ గురించి తెలుసుకుందాం. కథా ప్రదేశం.. పుణె. మధ్య తరగతివాళ్లుండే ప్రభాత్ నగర్లో ఉంటుంటాడు హీరో. సంగీతం మీద కాన్సంట్రేషన్ కుదరడానికి గుడ్డితనాన్ని టూల్గా వాడుకుంటాడు. ఒకరోజు యాక్సిండెటల్గా.. లిటరల్లీ యాక్సిడెంటల్గానే కలుస్తుంది సోఫీ (రాధికా ఆప్టే). ఆమె ఓ క్లబ్ ఓనర్ కూతురు. ఆ యాక్సిడెంట్లోనే ఆకాశ్ పియానో ప్లేయర్ అని తెలుస్తుంది. తమ క్లబ్కి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆ క్లబ్లో పియానో వాయించే ఉద్యోగం ఇస్తాడు ఆమె తండ్రి. ఆ రోజు సాయంకాలం సోఫీ .. ఆకాశ్ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తుంటే.. నల్ల కళ్లజోడు తీసి సోఫీని చూస్తాడు ఆకాశ్. ఆ విషయాన్ని ఆ ఇంటి కింద ఉన్న ఓ పిల్లాడు గ్రహిస్తాడు. సహజంగా ఆ పిల్లాడు ఆకాశ్ను ఏడిపిస్తుంటాడు గుడ్డివాడని. సంగీతం.. సాగనంపడం అలా సోఫీ వాళ్ల క్లబ్లో ఆకాశ్ పాత పాటలకు ఫిదా అవుతాడు రియల్టర్గా మారిన మాజీ హీరో ప్రమోద్ సిన్హా (ఆనంద్ ధవన్). తెల్లవారి వాళ్ల మ్యారేజ్ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు. తన భార్యకు ఇష్టమైన రాజేశ్ ఖన్నా పాటలు వినిపించాలని అడుగుతాడు. సరేనని తెల్లవారి ప్రమోద్ సిన్హా చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు ఆకాశ్. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమీ సిన్హా (టబు). గుమ్మంలోనే చాలా సేపు మాట్లాడుతుంటుంటే.. ఎదురింటి ఫ్లాట్ ఆవిడ తలుపు తెరిచి చూస్తుంది. ఇబ్బందిగా ఫీలయ్యి ఆకాశ్ను లోపలికి రమ్ముంటుంది సిమీ. ఇంట్లోకొచ్చిన ఆకాశ్కు హాల్లో ఉన్న పియానో చూపిస్తుంది సిమీ. కచేరీ మొదలుపెడ్తాడు ఆకాశ్. పియానో మెట్ల మీద వేళ్లను పరిగెత్తిస్తుంటే రక్తం, లిక్కర్ కలిసిన మడుగు.. ఓ మనిషి కాళ్లూ అతని కంటబడ్తాయ్. ఆ ఇంటి యజమాని ప్రమోద్సిన్హా హత్య జరిగిందని తెలుస్తుంది. అయినా గుడ్డిగా ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి సెలవు తీసుకొని సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు ఆకాశ్. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్స్పెక్టర్ సిమీ సిన్హా బాయ్ఫ్రెండే అని తేలుతుంది. గతుక్కుమంటాడు. ఆ ఇన్స్పెక్టరూ సిమీ వాళ్లింట్లో ఆకాశ్ను చూస్తాడు. అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు. ఆ విషయం సిమీకి చెప్పి వాకబు చేయమంటాడు. ఈలోపు పోలీస్ ఎంక్వయిరీలో ప్రమోద్ సిన్హా హత్య వెనక సిమీ సిన్హా హస్తం ఉందనే డౌట్ను పోలీసుల ముందు క్రియేట్ చేస్తుంది ఎదురింటి ఆవిడ. ఈ విషయం సిమీకి తెలిసి ఆ ముసలావిడను బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తుంది. యాదృచ్చికంగా దీనికీ సాక్షిగా నిలుస్తాడు ఆకాశ్. ఈ సంఘటనతో ఆకాశ్ కంటి చూపు మీద సిమీకీ సందేహం వస్తుంది. నివృత్తి చేసుకోవడానికి ఆకాశ్ వాళ్లింటికి వెళ్తుంది. గుడ్డివాడు కాదని రుజువవుతుంది. స్వీట్తో విషప్రయోగం చేసి ఆకాశ్ చూపు నిజంగానే పోయేలా చేస్తుంది. ఈలోపు సోఫీ ఆకాశ్ వాళ్లింటికి వస్తుంది. ఆకాశ్ అంధుడు కాదు అని అందరికన్నా ముందు అనుమాన పడ్డ ఆకాశ్ ఇంటి దగ్గరి కుర్రాడు.. ఆకాశ్ వీడియో తీస్తాడు అతనికి చూపు ఉంది అని నిరూపించడానికి. సోఫీ వచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాడు. ఆకాశ్ తనను మోసం చేశాడనే కోపం, ఉక్రోషంతో గదికి వెళ్తుంది. అక్కడ సిమీ కనపడుతుంది. అవాక్కవుతుంది సోఫీ. ఆకాశ్ పడుకొని ఉంటాడు. ఆ గది వాతావరణం, సిమీ ప్రవర్తనను బట్టి వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకొని ‘‘ఆకాశ్కి ఇన్ఫామ్ చేయండి .. మా నాన్న పియానో అమ్మేశాడు. క్లబ్లో అతనికిక ఉద్యోగం లేదని’’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సోఫీ. ఇక్కడ ఆ పాత్ర పాజ్ తీసుకుంటుంది. తర్వాత... ఆకాశ్కి చూపు పోయినంత మాత్రాన నోరుంది కాబట్టి తమ నేరాన్ని బయటకు చెప్పే ప్రమాదం ఉందని భయపడ్డ ఇన్స్పెక్టర్ ఆకాశ్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకుని ఓ డాక్టర్ చేతిలో పడ్తాడు ఆకాశ్. ఆ డాక్టర్.. ఆర్గాన్స్ అమ్ముకునే వ్యాపారి. అంధుడిగా ఆకాశ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనిని డ్రాప్ అండ్ పికప్ చేసే ఆటోవాలా, ల్యాటరీ టిక్కెట్లు అమ్ముకునే మహిళ.. ఈ ఇద్దరి బ్రోకర్ల సహాయంతో ఆకాశ్ కిడ్నీలను అమ్మేయాలని చూస్తాడు డాక్టర్. తెలుసుకున్న ఆకాశ్.. సిమీ విషయం చెప్పి ఆమెను కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలు సంపాదించొచ్చని ఆశ చూపించి ఆపదలోంచి తప్పించుకోవాలనుకుంటాడు. కిడ్నాప్కు ప్లాన్ చేస్తారు వాళ్లందరూ కలిసి. పోలీస్ భార్యకు ఫోన్ చేసి ప్రమోద్ సిన్హాను హత్య చేసింది మీ భర్తే అని చెప్తారు. సాక్ష్యాలూ ఉన్నాయని, కోటి రూపాయలు ఇవ్వకపోతే మీడియాకు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. భర్తతో కోటి రూపాయలు పంపిస్తానని ఒప్పుకుంటుంది. ఆకాశ్ను కూడా తప్పిస్తే ఆ కోటి రూపాయాలు తామే కొట్టేయొచ్చని పథకం పన్ని ఆకాశ్నూ బంధిస్తారు ఆటోవాలా, లాటరీ టిక్కెట్ల మహిళ. కాని పోలీస్ చేతిలో మోసపోయి ఆటోవాలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక్కడ మళ్లీ సిమీ.. ఆకాశ్ను మోసం చేయాలనుకుంటుంది. ఆర్గాన్స్ అమ్మే ప్రాసెస్లో సేకరించిన బ్లడ్ శాంపుల్స్లో సిమీది రేర్ బ్లడ్ గ్రూప్ అని, ఆ గ్రూప్తో ఉన్న ఓ దుబాయ్ షేక్ కూతురికి సిమీ లివర్ ఇస్తే కోటి ఏంటి ఆరు కోట్లు సంపాదించొచ్చనే ఆలోచనలో పడ్తాడు డాక్టర్. ఆకాశ్తోనూ చెప్పి.. లివర్ అమ్మేయగా వచ్చిన డబ్బులోంచి కోటి ఇస్తానని, ఆమె కార్నియాతో కళ్లూ తెచ్చుకోవచ్చని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సిమీకి మత్తు మందు ఇచ్చి కారు డిక్కీలో పడేసి, ఆకాశ్ను తీసుకొని ముంబై ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు డాక్టర్. ఆకాశ్ వద్దని వారిస్తున్నా వినడు. సిమీకి మళ్లీ మత్తు ఇవ్వడానికి దార్లో కారు ఆపి డిక్కీ దగ్గరకు వెళ్తాడు. కట్చేస్తే.. కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది. ‘‘సిమీ లివర్ అమ్మడం పాపం. జరిగినవేవీ ఎక్కడా చెప్పను. సిమీని, నన్ను వదిలేయండి’’ అని చెప్తుంటాడు ఆకాశ్. ఆ మాటలన్నీ వింటూ మౌనంగా ఏడుస్తూ.. హఠాత్తుగా కారులోంచి ఆకాశ్ను దిగిపొమ్మని ఆజ్ఞాపిస్తుంది ఓ స్వరం. ఖంగు తింటాడు ఆకాశ్. డాక్టర్ ఏమయ్యాడు అని అడుగుతాడు సిమీని. ముందు నువ్వు వెళ్లిపో అంటుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న సిమీ. దిగిపోతాడు. సిమీ వెళ్లిపోతుంది. కాస్త ముందుకెళ్లాక నోరుంది కదా.. నమ్మడానికి లేదు అని అనుకొని మళ్లీ వెనక్కు తిప్పుతుంది కారును.. ఆకాశ్ను ఢీ కొట్టడానికి. ఇంతలోకే ఆ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో ముంగీస బెడద ఎక్కువవడంతో దాన్ని చంపడానికి గురిపెడ్తాడు చేను కాపలాదారుడు.. అది తప్పించుకుని రోడ్డుకి ఆవలవైపు పరిగెడ్తుంది.. కాపలాదారుడి తుపాకి గురి తప్పి సిమీ కారుకు తగులుతుంది. టైర్ బరస్ట్ అయి, పల్టీ కొట్టి సిమీ పడిపోతుంది.. కారు పేలిపోతుంది. రెండేళ్ల తర్వాత.. యూరప్లోని ఓ దేశంలోని ఓ క్లబ్లో ఆకాశ్ పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ రాగాలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అటుగా వెళ్తున్న సోఫీకి .. ఆమె మళ్లీ అప్పియర్ అయ్యేది ఇక్కడే. బయట నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న ఆకాశ్ ఫోటో, అతని పేరు ఉన్న పోస్టర్ చూసి కించిత్ ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుంది. పాట అయిపోయాక అందరూ వచ్చి అతని చేతిని స్పృశిస్తూ అభినందనలు చెప్తుంటారు. అతనూ దానికి స్పందిస్తూ వాళ్ల చేతిని తడుముతూ కృతజ్ఞతలు చెప్తుంటారు. సోఫీ కూడా వచ్చి షేక్హ్యాండ్ ఇస్తుంది.. ఏమీ మాట్లాడకుండా. ఆ స్పర్శను గుర్తించి ‘‘సోఫీ’’ అంటాడు ఆకాశ్. ‘‘కంగ్రాట్స్.. ఇక్కడి వాళ్లనూ ఫూల్స్ని చేస్తున్నావన్నమాట’’ అంటుంది. ‘‘అదో పెద్ద కథ.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?’’ అని అడుగుతాడు. సరేనని కాఫీ షాప్కు వెళ్తారు. జరిగిందంతా చెప్తాడు. నిట్టూర్చి.. ‘‘ఎంతమంది జీవితాలతోనో ఆడుకుంది సిమీ? డాక్టర్ అన్నట్టు ఆమె కార్నియా తీసుకోవాల్సింది నువ్వు’’ అంటుంది సోఫీ. ‘‘అలా తీసుకుని ఉంటే అపరాధ భావంతో సంగీతానికి దూరమయ్యేవాడిని. బై దవే.. రేపు నా కన్సర్ట్ ఉంది.. వస్తావా?’’ అడుగుతాడు. ‘‘రేపు వెళ్లిపోతున్నా. అయినా ట్రై చేస్తా’’ అంటుంది. సరేనని సెలవు తీసుకుంటుండగా.. లోపలి నుంచి వెయిట్రెస్ ముంగీస తలను చెక్కిన చేతికర్రను తెచ్చి ‘‘ఇది మీదే కదా.. ’’ అంటూ ఆకాశ్ చేతికి అందిస్తుంది. ముంగీస బొమ్మ చెవులను తడుముతూ ‘‘అవును నాదే.. థ్యాంక్స్’’ అంటూ ఆ కర్ర సహాయంతో క్లబ్ బయటకు వస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాళ్లకు అడ్డంగా ఉన్న ఖాళీ కోక్ టిన్నును కర్రతో బలంగా కొడ్తాడు. అదెళ్లి ఆ చివరన పడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆ అంధుడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ది ఎండ్.. అనుకోని ట్విస్ట్లు.. కథలో కనిపించే ప్రతి పాత్రకూ ఔచిత్యమైన కంటిన్యూటీ.. ప్రేక్షకుల కళ్లు తిప్పుకోనివ్వదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకో నేరం.. దాని నుంచి బయటపడడానికి ఇంకో నేరానికి పాల్పడం.. ఒక పరిస్థితిని ఎవరి స్వార్థానికి వాళ్లు ఉపయోగించుకోవడం.. అవతలి వాడి కష్టాన్ని తమకు లాభంగా మలచుకోవడం.. మనుషుల సామాన్య స్వభావం. అదే అసలు నైజం. ఇదే ఈ సినిమా పల్స్! అంధాధున్ సారాంశం. – శరాది -
అందరికీ ఆ చాన్స్ రాదు
కేవలం వెండితెరపై మాత్రమే కాదు డిజిటల్ సెక్టార్లోనూ ఆఫర్లను కొల్లగొడుతూ కెరీర్లో మంచి హైప్లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ‘లస్ట్స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్, ఘోల్’ వంటి వెబ్ బేస్డ్ మరియు టీవీ షోస్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారామె. ఈ అనుభవం ఎలా ఉంది? అన్న ప్రశ్నను రాధిక ముందుంచితే...‘‘డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో నేనింకా సంతృప్తిగా లేను. ఎందుకంటే ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్లో ఒక పార్ట్లో మాత్రమే ఉన్నాను. ఇక ‘సాక్రెడ్ గేమ్స్’లో చిన్న పాత్ర చేశా. ‘ఘోల్’లో మాత్రమే మెయిన్ లీడ్గా చేశాను. కానీ వీటన్నింటిలో నటించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. ముందు ముందు ఇంకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను అన్నారు’’. ఈ భామ హాలీవుడ్లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మైఖేల్ వింటర్ బోటమ్ దర్శకత్వంలో ఓ సినిమా (‘ది వెడ్డింగ్ గెస్ట్’ పరిశీలనలో ఉన్న టైటిల్) చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ– ‘‘ఆసియాలోని కొందరి హీరోయిన్స్కు మాత్రమే నాన్–ఇండియన్ సినిమాల్లో నటించే చాన్స్ వస్తుంది. ఆ చాన్స్ నాకొచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు రాధికా ఆప్టే. ‘రక్తచరిత్ర, లెజెండ్, లయన్’ వంటి తెలుగు సినిమాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘అంథా ధూన్, బజార్’ ఈనెల 5, 26 తేదీల్లో విడుదల కానున్నాయి. -
డ్రైవర్కీ తెలుసు.. దాచాల్సిందేముంది?
సినిమా: ఇంకా దాచాల్సిందేముంది? అంటోంది సంచలన నటి రాధికా ఆప్తే. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తారల్లో దక్షిణాదిలో ముందున్న నటి ఈ అమ్మడే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు తనను పడక గదికి రమ్మని చిత్రహింసలకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన రాధికా ఆప్తే ఇకపై తెలుగు చిత్రాల్లో నటించేది లేదని ప్రకటించారు. ఆ మధ్య కబాలి చిత్రంలో రజనీకాంత్ సరసన నటించినా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ ఉత్తరాది భామ 2015లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన మెట్లీ అనే లఘు చిత్రంలో నగ్నంగా నటించి వివాదాలకు తావిచ్చారు. ఈ అమ్మడిని నెటిజన్లు ఏకి పారేశారు. ఆ తరువాత 2016లో పార్చ్డ్ అనే అనే చిత్రంలోనూ అదే విధంగా అర్ధ నగ్న దృశ్యాల్లో కనిపించి మరోసారి కలకలం సృష్టించారు. అయినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇక దక్షిణాదిలో అయితే రాధికాఆప్తేను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆంగ్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. కాగా, తన అర్ధనగ్న ఫొటోలను ఇంటర్నెట్లో ప్రచారం చేయడం గురించి ఇటీవల ఆమె ప్రస్తావిస్తూ ఆ సంఘటన తనను బాగా కలచివేసిందని పేర్కొంది. ఆ ఫొటోలు చాలా బాధించాయని, ఈ విషయాన్ని తొలుత తన తల్లి చెప్పిందని, ఆ తరువాత తన కారు డ్రైవర్ కూడా ఇదే మాట అన్నాడని రాధిక తెలిపారు. అయితే అందుకు తాను ఏం చేయను అని ఎదురు ప్రశ్న వేశారు. తన నగ్నదృశ్యాల ఫొటోలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేశారని, ఇకపై తాను దాచడానికి ఏమీ లేదనీ పేర్కొన్నారు. తాను ఇక ఏమైనా చేయవచ్చునని, తన గురించి కొత్తగా ఎవరూ ప్రచారం చేసే అవకాశం ఉండదని అన్నారు. అయితే, ఏమీ లేనప్పుడు పాత విషయాలను కెలకడం ఎందుకు? మరచిపోయిన తన ఉనికిని చాటుకోవడానికా అంటున్నారు సినీ వర్గాలు. -
అంధాధున్ ట్రైలర్ రిలీజ్
-
మిస్టరీ థ్రిల్లర్ ‘అంధాధున్’
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ అంధాధున్. ఈ సినిమాలో ఆయుష్మాన్ అంధుడైన పియానో ప్లేయర్గా కనిపించనున్నాడు. సీనియర్ నటి టబు మరో ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏజెంట్ వినోద్, బద్లాపూర్ లాంటి థ్రిల్లర్లను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
'మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు'
రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘గూల్’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్సిరీస్కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పాట్రిక్ మీడియాతో పంచుకున్నారు. ప్రశ్న: గూల్ తీయాలని మీకు ఎలా అనిపించింది. తొలి ప్రాజెక్టుకే ఇలాంటి స్టోరి ఎందుకు తీసుకున్నారు ? జవాబు: నేను మంచి కాన్సెప్ట్తో కూడిన కథను తెరకెక్కిద్దామని అనుకున్నాను. ఇలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. అలాంటి థ్రిల్లర్ను చేయాలని నేను భావించాను. ఒక రచయితగా, దర్శకుడిగా ఇలాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ స్టోరిని తెరకెక్కించడానికి ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్హౌస్, నెట్ఫ్లిక్స్ సంస్థలు సహకరించాయి. ప్ర: ఈ వెబ్ సిరీస్లో పాత్రల, లోకేషన్ల ఎంపిక ఎలా జరిగింది? జ: ప్రశాంత్ సింగ్ నేతృత్వంలో అద్భుతమైన నటులు దొరికారు. ఇందులో ముఖ్యంగా కండలు గల సైనికుల పాత్రల ఎంపిక చాలా కీలకమైంది. కానీ మాకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. మహేశ్కు చాలాసార్లు స్క్రీన్ టెస్టు నిర్వహించిన తర్వాత అలీ సయీద్ పాత్రకు అతడే కరెక్ట్ అనే నిర్ధారణకు వచ్చాం. రాధిక, మానవ్లు ఇద్దరు గొప్పగా నటించారు. వారికి ఈ తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి ఉండటం అదృష్టంగా భావిసున్నాను. ఈ సినిమా లోకేషన్(తులిప్ స్టార్ బేస్మెంట్) కూడా చాలా బాగా కుదిరింది. ప్ర: అలాంటి చీకటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇబ్బంది కలుగలేదా ? జ: కలిగింది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేంది. గాలి కూడా సరిగా ఆడేది కాదు. కొన్ని సార్లు దుర్వాసన భరించలేనంతగా ఉండేది(ముఖ్యంగా భోజనం చేసే సమయంలో). ఈ చిత్రీకరణ సమయంలో ఏ దెయ్యాలు మాకు ఎటువంటి హానీ చెయ్యలేదు(నవ్వుతూ..) ప్ర: మీరు దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నెట్ఫ్లిక్స్ను ఎందుకు ఎంచుకున్నారు ? జ: ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చేరాలంటే నెట్ఫ్లిక్స్ కన్నా బెటర్ ఆఫ్షన్ కనిపించలేదు. వారు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్గా నిలిచారు. ప్ర: మీరు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఎందుకు డబ్ చేశారు ? జ: మేము గూల్ ఎంతవరకు సాధ్యమైతే అంత ఎక్కువ మందికి చేరాలని భావించాం. హిందీతోపాటు, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్లో డబ్ చేసిన వర్షన్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఎక్కువ మంది ఈ వెబ్ సిరీస్ను చూడటానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో ఎవరికైతే సబ్ టైటిల్స్ చదువుతూ సినిమా చూడటం నచ్చదో వారికి కూడా డబ్ చేయడం వల్ల దీనిని చూడటానికి ఇష్టపడతారు. ప్ర: ఈ సిరీస్కు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జ: ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వెబ్ సిరీస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. కొత్త రకమైన కథలు తెరకెక్కిద్దామనుకునే వారికి ఈ విజయం మంచి ఉత్సాహన్ని ఇస్తుందన్ని భావిస్తున్నాను. స్కేర్డ్ గేమ్స్కు ఇండియన్ అన్లైన్ ఫ్లాట్ఫామ్లో ఇంత మంచి ఆదరణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నెగిటివ్ రివ్యూలను చదవను. -
‘ఈ గోడల మధ్య నుంచి.. మీరు తప్పించుకోలేరు’
వివాదాస్పద నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ గూల్. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను యూట్యూబ్లో విడుదల చేశారు. ప్రస్తుతం స్కేర్డ్ గేమ్స్కు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో గూల్ కూడా విజయం సాధిస్తున్న నమ్మకంతో ఉన్నారు నెట్ఫ్లిక్స్ టీం. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్సిరీస్కు పాట్రిక్ గ్రాహం దర్శకుడు. ఈ సిరీస్లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే కనిపిస్తున్నారు. -
అందుకోసం అడ్డమైన సినిమాలు చేశా.!
సాక్షి, సినిమా: వివాదాస్పద నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రాధికా ఆప్టే ఒకరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి సంచలనానికి తెరలేపారు. ఇటీవల ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపణలతో కలకలం సృష్టించింది. ఇక రాధిక తరచూ గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతూ వారి విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే హిందీ చిత్రాల్లో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోసి నటించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో నా శరీరం నా ఇష్టం అని ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన రాధిక ఇప్పుడు తాను గ్లామరస్గా నటించిన మాట నిజమేనని అంగీకరించింది. అందుకు కారణం కూడా చెప్పింది. ఇంతకీ రాధికా ఏం చెప్పారో చూద్దాం.. ‘సినిమా రంగంలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి అవకాశాలు సులభంగా లభిస్తాయి. అలా సినీ నేపథ్యం లేని వారు చాలా కష్టపడాల్సిందే. నాకు సినిమారంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. జీవనాధారం కోసం అలాంటి అడ్డమైన చిత్రాలను నిరాకరించలేకపోయాను. అయితే ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా’ అని చెప్పుకొచ్చారు. -
సల్మాన్తో పోటీనా..? : కరణ్ జోహర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. సల్మాన్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. రేస్ 3 జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే అదే రోజున లస్ట్ స్టోరిస్ అంటూ ఓ వెబ్ సిరీస్ విడుదలవుతోంది. ఈ వెబ్ సిరీస్కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో కరణ్ జోహర్ ఒకరు. ఈ వెబ్సిరీస్ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సల్మానతో పోటీ పడదామనుకుంటున్నారా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు... ‘సల్మాన్తో పోటీపడేంతా మాకు లేదు. మా వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్కు సల్మాన్ రేస్3కు సంబంధమే లేదు. సల్మాన్ రేంజ్ వేరు. నేను కూడా జూన్ 15న సల్మాన్ రేస్3 మూవీనే చూస్తాను’ అంటూ కరణ్ చెప్పుకొచ్చారు. లస్ట్ స్టోరిస్లో నలుగురు వ్యక్తులకు సంబంధించిన కథలను చూపించనున్నారు. రాధికా ఆప్టే, కియారా అద్వాణీ, మనీషా కొయిరాలా, భూమీ ఫెడ్నేకర్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను కరణ్ జోహర్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్లు డైరెక్ట్ చేయనున్నారు. -
బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్: షాకింగ్ సీక్రెట్స్
ముంబై: ప్రస్తుతం టాలీవుడ్ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపారు. ఇండస్ట్రీ మహిళను రేప్ చేసి, రోడ్డున పడేయదని, అందుకు బదులు ఆమెకు జీవనోపాధిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బీబీసీ ఒక సంచలన డాంక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. రాధికా ఆప్తే, ఉషా జాధవ్ వంటి ప్రముఖులతో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. ‘బాలీవుడ్ డార్క్ సీక్రెట్’ పేరిట ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయనుంది. ‘హాలీవుడ్ తరహాలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం లేదు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ కూడా లైంగిక వేధింపులు, దూషణలకు అతీతం కాదని పలువురు నటీనటుల అనుభవాన్ని రజనీ వైద్యనాథన్ మన ముందుకు తెస్తున్నారు’ అంటూ దీనిని ప్రసారం చేయనుంది. ఈ డాంక్యుమెంటరీలో రాధికా ఆప్తే మాట్లాడుతూ.. ‘కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు శక్తివంతుల. మేం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అనే భావనలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్ నాశనమైనట్టేనని భావిస్తారు. మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఇది ఆగిపోతోంది. అలాంటిది ఇక్కడ రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం దొరకాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని తనకు చెప్పారని నటి ఉషా జాధవ్ తన అనుభవాలను వివరించారు. ఈ డాక్యుమెంటరీలో ఓ వర్ధమాన నటి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఒక వ్యక్తి నిత్యం లైంగికంగా వేధించాడని ఆమె తెలిపారు. ‘ఇండస్ట్రీలో పని దొరకాలంటే.. ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం ఆనందంగా భావించు. నీ సెక్సువాలిటీని ఒప్పుకో’ అని అతను సూచించాడని చెప్పారు. ‘ అతను కావాలనుకున్నప్పుడల్లా నన్ను తాకేవాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ముద్దు పెట్టుకునేవాడు. అతని ప్రవర్తన నన్ను షాక్కు గురిచేసింది’ అని ఆమె తెలిపారు. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. రిచా చద్దా, స్వర భాస్కర్ వంటి వారు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని వెల్లడించారు. అయితే, తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను వారు వెల్లడించలేదు. -
హాలీవుడ్కు మరో ఇండియన్ హీరోయిన్
భారతీయ వెండితెర మీద సత్తా చాటిన చాలామంది తారలు హాలీవుడ్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒక్క ప్రియాంక చోప్రా తప్ప హాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు లేరనే చెప్పాలి. దీపికా పదుకొనే, ఐశ్వర్యా రాయ్ లాంటి వారు హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. బాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో భారతీయ నటి చేరేందుకు రెడీ అవుతోంది. సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే రాధికా ఆప్టే త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించనుంది. స్టానా కాటిక్, సారా మేగాన్ లాంటి హాలీవుడ్ తారాలు నటిస్తున్న ఈ సినిమాలో రాధిక బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. -
కబురు వచ్చింది
ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు రాధికా ఆప్టే. పరిసర ప్రాంతాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. ఓ సినిమా కోసం. అందులో ఆమె గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఒక యుద్ధ రహస్యాలను సేకరించే పని చేయనున్నారు. ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారామె. హాలీవుడ్లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్ పిల్చెర్ దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఉమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా ఉంటాయట. ఇందులో స్టానా కాటిక్, సారా మేగాన్ థామస్లతో పాటు రాధికా ఆప్టే నటించనున్నారు. లైనస్ రోచే, రోసిఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు అమ్మాయిలను స్పైలుగా ఫ్రాన్స్ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు వార్ సీక్రెట్స్ను ఎలా సేకరించారు? ఈ మిషన్లో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? అన్నదే సినిమా కథనంగా ఉంటుందట. వైర్లెస్ ఆపరేటర్ను యూజ్ చేయడంలో మంచి ప్రతిభ ఉండి, ఇండియన్ యాక్సెంట్ ఉన్న నూర్ ఇనయాత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే కనిపించనున్నారు. హిందీ, తమిళ, తెలుగులోనూ నటించిన రాధికాకు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కబురొచ్చిందన్నమాట. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు రాధికా ఆప్టే. ముందు ముందు ఇంకెంతమందో? -
కాలు రుద్దడంతో.. ఆ హీరో చెంప పగలగొట్టా
బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్ చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో వోగ్ బీఎఫ్ఎఫ్కు రాధిక అతిథిగా వెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా సెట్కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది. -
బీచ్లో చీర కట్టుకొని తిరగాలా?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాధికా ఆప్తే తెలుగువారికీ సుపరిచితురాలే. బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతోపాటు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’సినిమాతో ఆమె దక్షిణాదివారికి చేరువైంది. బాలీవుడ్లోనూ మంచి నటిగా పేరొందిన రాధికా ఆప్తే ఇటీవల అక్షయ్కుమార్ సరసన ‘ప్యాడ్మ్యాన్’ సినిమాలో అలరించింది. ఇటీవల ఈ భామ తన స్నేహితుడితో కలిసి బీచ్లో సేదదీరుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. బికినీ ధరించి గోవా బీచ్లో దిగిన ఈ ఫొటో పెట్టగానే.. ఆమెను కించపరుస్తూ పలువురు కామెంట్లు చేశారు. బాడీషేమింగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. ఈ విషయమై మీడియా ప్రస్తావించగా.. ‘నన్ను ట్రోల్ (కించపరుస్తూ) చేసేవారి కామెంట్లు పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఆ విషయం చెప్తే తప్ప నాకు వాటి గురించి తెలియదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూర్ఖత్వం. బీచ్లో నేను చీర కట్టుకొని తిరగాలని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ట్రోలర్స్ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. నాకు వాళ్లు ఎవరో తెలియదు.. వాళ్ల గురించి అసలే పట్టించుకోను అని ఆమె తాపీగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో హీరోయిన్లను కించపరుస్తూ ట్రోలర్స్ చెలరేగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంకచోప్రా, తాప్సీ పన్ను, ఈషా గుప్తా, దీపికా పదుకోన్, పరిణీత చోప్రా తదితరుల ఫొటోలపై కూడా కొందరు కించపరిచేరీతిలో అసభ్య కామెంట్లు పెట్టారు. ఇలా ట్రోల్ చేసేవారికి కొందరు ఘాటు రిప్లే ఇవ్వగా.. మరికొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారు. #holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim A post shared by Radhika (@radhikaofficial) on Feb 24, 2018 at 5:55am PST -
ఇదేమి సెల్ఫీ!
తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంతో తమిళ తంబీలను అమితంగా ఆకట్టుకున్న బ్యూటీ రాధికా ఆప్టే. ఎంతటి స్థాయికైనా అందాలను ఆరబోయడానికి వెనుకాడని ఈ గుమ్మ డాన్స్కు మాత్రమే కాకుండా కథా పాత్రలో ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తుంది. అసలు విషయానికి వస్తే ఆ మధ్య రాధికా ఆప్టే స్నానం చేస్తూ తీసుకున్న సెల్ఫీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అమ్మడు అందాలను చూసిన కుర్రకారుకు దిమ్మతిరిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ సెల్ఫీల్లో ఉన్నది తాను కాదని సింపుల్గా చెప్పేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాధికా ఆప్టే మరో సెల్ఫీ విడుదలైంది. ఇందులో ఒక బల్లిని చెంపపై పెట్టుకున్న బ్యూటీ దాన్ని నాలుకతో తాకడానికి ట్రై చేస్తున్నట్టుంది. ఈ జుగుప్సాకరమైన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ బల్లి నిజమైందా? కాదా అనే విషయం తెలియడం లేదు. -
అలాంటి విషయాలు బయటకు చెప్పుకోలేరు!
సాక్షి, సినిమా: లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని నటి రాధికాఆప్టే అంటోంది. అర్ధనగ్న దృశ్యాల ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ తరచూ వార్తల్లో ఉండే ఈ ఉత్తరాది భామ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తుంటుంది. కోలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటించిన రాధికాఆప్టే టాలీవుడ్లోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు లేవు. బాలీవుడ్పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. అయితే తాజాగా తన హిందీ చిత్ర ప్రచారంలో భాగంగా మరోసారి హీరోయిన్ల లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించి మరోసారి వార్తల్లోకెక్కింది. రాధిక మాట్లాడుతూ హీరోయిన్లకు లైంగిక వేధింపులు అన్నవి నిజమేనని చెప్పింది. అయితే అలాంటి సంఘటనలను అందరూ బయటకు చెప్పుకోలేరని అంది. అలా చెబితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, కలలు కల్లలై పోతాయనే భయం అని అన్నది. అయితే హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని కోరింది. లేకుంటే అలాంటి సంఘటనలు పెరిగిపోతాయని అన్నది. సమాజంలో మార్పు రావాలని, మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని చెప్పింది. అప్పుడు దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పింది. తనకు అలాంటి సంఘటనలు పెద్దగా ఎదురవ్వలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇంతకు ముందే వెల్లడించానని చెప్పింది. అయితే ఇతరుల లైంగిక వేధింపుల గురించి తాను మాట్లాడనని చెప్పింది. -
పాడ్మాన్ ట్రైలర్.. అక్కీ గట్స్కి హాట్సాఫ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో మాములు వైవిధ్యం ప్రదర్శించటం లేదు. యాక్షన్ కిలాడీగా పేరున్న ఆయన గత కొంత కాలంగా ఆ ట్యాగ్ లైన్కు దూరంగా ఉంటూ విమర్శకుల చేత శభాష్ అనిపించుకునే కథలను ఎంచుకుంటున్నారు. ఎయిర్లిఫ్ట్, రుస్తుం, టాయ్లెట్-ఏక్ ప్రేమ్కథా ఇలా వరుసపెట్టి చేసిన చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు కొత్త చిత్రం పాడ్మాన్ కూడా ఆ కోవలోనిదే. ఆ చిత్ర ట్రైలర్ కాసేపటి క్రితం వచ్చేసింది. అమెరికాకు స్పైడర్ మాన్ ఉన్నాడు.. బ్యాట్ మాన్ ఉన్నాడు. సూపర్ మాన్ ఉన్నాడు. ఇక ఇండియాకు పాడ్ మాన్ ఉన్నాడు అంటూ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయింది. దేశానికి కావాల్సింది శక్తివంతమైన మహిళలే అని హీరో ట్రైలర్ డైలాగ్ చెప్పటం చూడొచ్చు. అతని వ్యవహారం నచ్చక భార్య, కుటుంబం దూరమైన క్రమంలో అతనికి సాయం అందించే పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇక అక్షయ్ భార్య పాత్రలో రాధికా ఆప్టే కనిపించింది. కాస్త వైవిధ్యం, కొన్ని పాయింట్లు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కథలో కంటెంట్ మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మహిళల సమస్యపై ఇంత బోల్డ్గా నటించే ధైర్యం బహుశా అక్కీ తప్ప మరెవరూ చేయరేమో. ఇక 'పాడ్మాన్' కథ విషయానికొస్తే... అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్కిన్స్ని అందజేయ్యొచ్చునని నిరూపించిన వ్యక్తి.. అంతర్జాతీయ సత్కారాలు కూడా అందుకున్న అతని బయోపిక్ ని దర్శకుడు ఆర్ బాల్కీ దృశ్యరూపకంగా పాడ్మాన్ పేరుతో మలిచారు. రిపబ్లిక్ డే కానుకగా పాడ్మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Presenting the much awaited #PadManTrailer, this one's for the mad ones, the ones who are crazy enough to change the world https://t.co/o2NiC2q1SU@PadManTheFilm @sonamakapoor @radhika_apte @mrsfunnybones @SonyPicsIndia @kriarj #RBalki — Akshay Kumar (@akshaykumar) December 15, 2017 -
ముగ్గురిలో విక్టరీ ఎవరికి?
అనుష్క, కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో విక్టరీ ఎవరిది? అదేనండి.. గెలుపు ఎవరిది? ఇక్కడ విక్టరీ వెంకటేశ్ ఫొటో ఉంది కాబట్టి... ఆయన మనసుని గెలుచుకునేది ఎవరు? ఇంతకీ వెంకీ మనసుని వీళ్లు గెలవడం ఏంటి? అంటే.. ఓ సినిమాలో జత కట్టేందుకు. అది తేజ సినిమా. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ఆరంభమవుతుంది. ఇప్పుడు డిస్కషన్ అంతా ఈ సినిమాలో వెంకీ సరసన నటించనున్నది ఎవరు? అని. ముగ్గురు పేర్లను తేజ పరిశీలిస్తున్నారట. వెంకీ కాంబినేషన్లో ఆల్రెడీ ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించిన అనుష్క, వెంకీతో ఇప్పటివరకూ నటించని కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్ని కథానాయికగా తీసుకోవాలని తేజ అనుకుంటున్నారట.మరి.. ముగ్గురిలో ఎవరికి చాన్స్ దక్కుతుందో ఈ ఇయర్ ఎండింగ్లో తెలిసిపోతుంది. ఎందుకంటే జనవరిలో ఈ చిత్రం షూటింగ్ని ప్రారంభించాలనుకుంటున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో యాంగ్రీ మేన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. వెంకీ బావగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయనున్నారట. అది నిజమా? కాదా? అనే క్లారిటీ కూడా ఇయర్ ఎండింగ్లో వచ్చేస్తుంది. -
మగవాళ్లకూ ఆ వేధింపులు: నటి
ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు, చిన్నారులకు ఆ టార్చర్ ఉందంటోంది నటి రాధికా ఆప్తే. కబాలి, ధోని, అళగురాజా వంటి తమిళ చిత్రాల్లో, టాలీవుడ్లో రక్తచరిత్ర, లయన్ మూవీల్లో నటించింది. బాలీవుడ్, హాలీవుడ్ మూవీల్లో నటిస్తోన్న ఈ అమ్మడికి ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవనే చెప్పాలి. ఆ మధ్య పడక గదికి రమ్మన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అర్ద నగ్న ఫొటోలను ఇంటర్నెట్లను పోస్ట్ చేసి వార్తలోకెక్కింది. తాజాగా సెక్స్ టార్చర్ ఆడవారికే కాదు మగవారికి, చిన్నారులకు ఉంటోందని మరో వివాదానికి తెరలేపింది. అసలు రాధికా ఆప్తే ఏమందో చూద్దాం. ‘లైంగిక వేధింపులు సినిమారంగంలోనే కాదు బయట కూడ జరుగుతోంది. స్త్రీలపైనే కాకుండా పురుషులపైనా, పిల్లలపైనా హింసాత్మక సంఘటనలు, సెక్స్ టార్చర్లు జరుగుతున్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యే. అధికార మదాంధులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్ని ఏ ఒక్క బాధితురాలో, బాధితుడో ఖండిస్తే చాలదు. పదిమంది ఒక్కసారిగా గొంతెత్తితే ప్రజల దృష్టిలో పడుతుంది. కాస్టింగ్ కౌచ్ కారణంగానే టార్చర్ సమస్య ఎదురవుతోందంటే అందుకు పాల్పడిన వారి పేరు ఎందుకు బయట పెట్టకూడదు అని అడుగుతున్నారని, అధికారం ఉన్న వాళ్లపై ఫిర్యాదు చేస్తే అలాంటి వారి భవిష్యత్ ఏమవుతుందో అందరికీ తెలుసునంటూ’ రాధికా ఆప్తే పేర్కొన్నారు. -
అది చాలా సున్నితమైన సబ్జెక్ట్
సాక్షి,ముంబయి: సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథమ్ స్టోరీ ఆధారంగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో రూపొందుతున్న ప్యాడ్మన్ మూవీ గురించి బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే శానిటరీ నాప్కిన్స్ను అందిస్తూ గ్రామీణ భారతానికి సేవలు అందించిన అరుణాచలం కథను దర్శకుడు ఆర్ బాల్కి వెండితెరపై హృద్యంగా ఆవిష్కరిస్తున్నారని మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న రాధికా ఆప్టే చెప్పారు. ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్ అని, మూవీ మేకర్లు కథకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని ఆప్టే చెప్పుకొచ్చారు. బిగ్ స్ర్కీన్పై ఈ మూవీని చూడాలని తాను ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానన్నారు.దర్శకుడు ఆర్ బాల్కీ, నటులు అక్షయ్ కుమార్, సోనమ్లతో పనిచేయడం గొప్ప అనుభవమని అన్నారు. ఏప్రిల్ 2018లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేనందుకు అంగీకరించలేదు!
సద్దుమణిగిన విషయాన్ని పదే పదే ప్రస్థావిస్తూ తద్వారా ప్రచారం పొందాలని ఆశిస్తున్నట్లుంది నటి రాధిక ఆప్టే. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కే ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్గా అనేస్తుంది. ఈ జాణ దక్షిణాదిలో నటించింది చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో ధోని, తమిళ్సెల్వన్, కబాలి చిత్రాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్కు భార్యగా నటించడంతో గుర్తింపు బాగానే వచ్చింది. తెలుగులోనూ బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై నిందలు వేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందేప్రయత్నం చేస్తోంది. అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్కుమార్ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మన్ని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది. అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది. -
టాప్లెస్గా నటించడానికి సై
సినీ పరిశ్రమలో అద్భుత నటన ప్రదర్శించినప్పటికీ మార్కెట్ డల్ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్ను తిరిగి పొందగలిగారు. వారిలో ముఖ్యంగా రాధికా ఆప్టే ‘పార్సెట్’ వంటి కొన్ని చిత్రాలలో టాప్లెస్గా నటించి కలకలం రేపుతోంది. ఈ విధంగా నటించడానికి కోలీవుడ్ నటీమణుల్లో ఎవరికైనా ధైర్యం ఉందా అని పరిశీలిస్తే నేనున్నానంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్లెస్గా నటించడానికి సై అంటూ ముందుకు వచ్చింది. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల్లో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్సే అధికం. దీంతో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్ సాంగ్స్కు చిందులు వేయబోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ విషయం గురించి అమ్మడు మాట్లాడుతూ.. తన కోసం వచ్చే దర్శకుల వద్ద ఓపెన్ హార్ట్గా కథలు వింటానన్నారు. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తానని తెలిపారు. అధికంగా రెమ్యునరేషన్ ఇస్తానని తెలిపినప్పటికీ ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించనని చెప్పారు. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్ ఓరియంటెట్ చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. కథ ప్రాముఖ్యతను బట్టి టాప్లెస్గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉందని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉందని తెలిపింది. ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది. -
దక్షిణాదిలో చేదు అనుభవాలు
సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాజా నటి రాధికాఆప్తే అని పేర్కొనవచ్చు. బాలీవుడ్లో అర్ధనగ్నం దాటి నగ్నంగానూ నటించి పెద్ద సంచలనానికి దారి తీసిన ఈ ఉత్తరాది నటి ఆ మధ్య ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి రమ్మన్నాడని చెప్పి పెద్ద దుమారాన్నే రేపారు. ఇలా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించి మరోసారి తన వాటం ప్రదర్శించారు. ఇంతకీ ఈ అమ్మడేమందో చూద్దాం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నేను చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఈ భాషల్లో తాను ఎక్కువ చిత్రాలు చేయలేదు. అందువల్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం గురించి నేను మాట్లాడను. నేను నటించిన చిత్రాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మాత్రమే చెబుతాను. తమిళం, తెలుగు చిత్రాల ఔట్ డోర్ షూటింగ్ల సమయంలో హీరోయిన్ల కంటే హీరోలకే హోటళ్లలో బసకు మంచి వసతులను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా హీరోలను షూటింగ్కు తొమ్మిది గంటలకు వస్తే చాలు అంటారు. ఇక హీరోయిన్లను అంతకు రెండు గంటలు ముందే రావాలని ఆర్డర్ వేస్తారు. ఇలా చాలా విషయాలు నన్ను బాధించాయి. అయితే కబాలి చిత్రానికి ఆ చిత్ర హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఇతర చిత్రాల్లో ఆ పరిస్థితి లేదు అని రాధికాఆప్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
బోల్డ్ ఈజ్ గోల్డ్
బోల్డ్ ఈజ్ గోల్డ్. ఏమిటీ కొత్త నిర్వచనం అనుకుంటున్నారా? ఇది నటి రాధికాఆప్తే అంటున్న మాట. నిజమే ఈ పదానికి నప్పే నటే ఈమె.అందాలారబోతకు హద్దులు తుడిచేసే రాధికాఆప్తే దక్షిణాదిలోనే కాస్త సంసార పక్ష పాత్రల్లో కనిపించారు. ఉత్తరాదిలో ఈ అమ్మడి నటన అందర్నీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. అర్ధనగ్నంగానే కాదు నగ్నంగా నటించడానికీ ఏమాత్రం వెనుకాడని నటి రాధికాఆప్తే. పూణేకు చెందిన ఈ బోల్డ్ నటి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినీ ఆర్టిస్ట్గా ప్రమోట్ అయ్యింది. మొదట హిందీ, ఆ తరువాత బెంగాలీ, మరాఠి చిత్రాల్లో నటించి ఆపై దక్షిణాదికి దిగుమతి అయిన ఉత్తరాది భామ రాధికాఆప్తే. ఇటీవల కబాలి చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్కు భార్యగా నటించి మంచి ప్రాచుర్యం పొందిన ఈ జాణ ఆ ఇమేజ్ను తుడిచేసే విధంగా పర్చడ్ అనే హిందీ చిత్రంలో అర్ధనగ్నంగానూ, అహల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో నగ్నంగా నటించి పెద్ద చర్చకే దారి తీసింది. ఎలా అంత ధైర్యంగా నటించగలుగుతున్నారు? నగ్నంగా నటించడానికి మీ భర్త అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలకు రాధికాఆప్తే చాలా బోల్డ్గా బదులిచ్చారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. కథకు అవసరం లేకుండా అర్ధనగ్నంగా నటించడం నాకూ సమర్థనీయం కాదు. అదే కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా నాకు ఆక్షేపణ లేదు. ఎందుకంటే బోల్డ్ ఈజ్ గోల్డ్. వివాహమైన స్త్రీని మీ భర్త అభ్యంతరం చెప్పరా? అని అడుగుతున్నారు. గ్లామరస్గా నటించడానికి.. ముఖ్యంగా నగ్నంగా నటించడానికి నా భర్త బెనెడిక్ట్ టె యిలర్ అభ్యంతరం చెప్పరు కదా, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ సన్నివేశాల్లో తను కథా పాత్రల్నే చూస్తారు కానీ నన్ను చూడరు అని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. చూశారా ఎంత బోల్డ్గా బదులిచ్చిందో. -
నాకో లెక్కుంది!
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్సింగ్’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. కథానాయిక రాధికా ఆప్టే ఇలా అనడంలేదు కానీ, ఇటీవల ఆమె లెక్కల గురించి మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్ట్ కావాలనుకోవడానికి ఓ లెక్కుంది’’ అన్నారు. రాధిక లెక్కల వెనక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం. ► నాకు చిన్నప్పట్నుంచీ ఆర్టిస్ట్ కావాలన్నదే ఆశయం. అందుకని ఎప్పుడూ నన్ను నేను ఓ హీరోయిన్గానే ఊహించుకునేదాన్ని. నా గ్రాండ్ మదర్ లెక్కల టీచర్. ఆవిడ 32 ఏళ్ల పాటు లెక్కల టీచర్గా చేశారు. మా ఫ్యామిలీలో విదేశాలు వెళ్లి చదువుకున్న మొదటి మహిళ ఆవిడే. ఇంట్లో ఒక జీనియస్ ఉంటే... వాళ్లంటే ఇష్టం ఏర్పడుతుంది. నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం నన్ను లెక్కలు ఇష్టపడేలా చేసింది. నేను కూడా లెక్కల్లో ఫస్ట్. పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నప్పుడే ఓ లెక్క వేసుకున్నా. ఆ లెక్క ప్రకారం హీరోయిన్ అయ్యాను. లేకపోతే లెక్కల టీచర్ని అయ్యుండేదాన్నేమో. ► నేను పెరిగింది పుణేలో. ఒకవైపు చదువుకోవడంతో పాటు మరోవైపు కథక్ క్లాసులకి వెళ్లేదాన్ని. ఎనిమిదేళ్ల పాటు ఆ డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత లండన్లో ఓ ఏడాది పాటు పాటలు–డ్యాన్స్ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అంటే.. కాలేజీకి వెళ్లినా క్లాసులకు హాజరయ్యేదాన్ని కాదు. ఎప్పుడూ ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. రాత్రంతా నిద్రపోయేదాన్ని కాదు. మా లెక్కల టీచర్.. అదేనండి నా గ్రాండ్ మదర్ కూడా సరిగ్గా నిద్రపోయేవారు కాదు. రాత్రంతా నాకు లెక్కలు నేర్పించేవారు. క్లాసులో అందరి స్టూడెంట్స్కన్నా నేను లెక్కల్లో సూపర్. ఎందుకంటే, ఆవిడ సిలబస్లో లేనివి కూడా నేర్పించేవారు. దాంతో నాకు లెక్కల్లో అన్ని ఫార్ములాలు వచ్చేసేవి. ► లెక్కలు బాగా చేసేవాళ్లను మేధావులంటారు. నేను కూడా ఆ టైపేనండి. నా మైండ్ చాలా షార్ప్. ఏ విషయంలో అయినా దాదాపు నేను అనుకున్న లెక్క తప్పదు. అందుకు ఓ ఉదాహరణ.. ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పుడు లెక్కేసుకున్నా. పెద్దయ్యాక నెరవేర్చేసుకున్నా. ► నటిగా నేనేం లెక్కేసుకున్నానంటే... ‘ఎలాంటి పాత్ర అయినా చేయాలి. కథ బాగుంటే గ్లామర్ అయినా డీ–గ్లామర్ క్యారెక్టర్ అయినా చేయాలి’ అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే పాత్రలను సెలక్ట్ చేసుకుంటున్నా. నా సినిమాలు చూసినవాళ్లకు ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది. ► నా గ్లామర్ క్యారెక్టర్స్ చూసి ‘రాధికా చాలా హాట్’ అని కొంతమంది నాకు బిరుదు ఇచ్చారు. నో ప్రాబ్లమ్. మన దేశంలో ఏ కథానాయికను అయినా ఇలానే అంటారు. కొంచెం గ్లామరస్గా నటించినా చాలు ఈ బిరుదు ఇచ్చేస్తారు. ► జీవితంపట్ల నా లెక్క ఏంటంటే.. మనం ఏం అనుకున్నామో అది పూర్తిగా చేయాలి. ఒకవేళ నేను ఆర్టిస్ట్ కాకుండా మా అమ్మానాన్నలా డాక్టర్ అయ్యుంటే ఆ వృత్తికి కూడా న్యాయం చేసేదాన్ని. ఏ ప్రొఫెషన్లో ఉంటే దానికి ఫుల్ న్యాయం చేయాలనేది నా ఫిలాసఫీ. -
మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న..
మహిళా సమస్యల కోసం పోరాడడానికి సిద్ధమవుతోంది నటి రాధికాఆప్టే. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో రాధికాఆప్టే ఒకరని చెప్పవచ్చు. నటుడు ప్రకాశ్రాజ్ నటించి, నిర్మించిన ధోని చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన నటి రాధికాఆప్టే.తొలి చిత్రంలోనే ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తెగా నటించి గుర్తింపుపొందారు. అరుుతే ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు.అలాంటి రాధికాఆప్టేకు ఏకంగా సూపర్స్టార్తో జతకట్టే అవకాశం వరించడం ఎవరూ ఊహించనిదే. అలా కబాలి చిత్రంతో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న సన్నివేశాల్లో నటించడం, అవి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వంటి అంశాలతో సంచలన నటిగా మారారు. అరుుతే కబాలి చిత్రం తరువాత నటిగా తన స్థారుు మారిపోతుందని ఆశించిన రాధికాఆప్టేకు అలా జరగలేదు. కారణం ఆమె అశ్లీల చిత్రాల ప్రదర్శన కూడా ఒక కారణం కావొచ్చు. హిందీలో ఒకటి, రెండు చిత్రాలు చేస్తున్న రాధికాఆప్టేకు తాజాగా ఒక అవకాశం వచ్చింది. దర్శకుడు మిష్కిన్ శిష్యుడు ఆదిత్య దృష్టిలో పడ్డారు. ఆయన సవరకట్టి అనే చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సవరకట్టి చిత్రంలో సెలూన్ షాపుల నిర్వాహకులు సమస్యలను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ఈ సారి మహిళల సమస్యలను తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.ఇందులో రాధికాఆప్తే మహిళల కోసం పోరాడే విప్లవ భావాలు కలిగిన యువతిగా నటించనున్నారట.అలాంటి పాత్రల్లో రాధికాఆప్టేను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
సిగ్గు పడటంలేదు!
కళ్లు ఎరుపెక్కాయి.. కోపంతో పెదాలు అదిరాయి.. మాటల్లో కారాలు-మిరియాలు నూరినంత ఘాటు.. ఆగ్రహంతో రగిలిన రాధికా ఆప్టే ముంబైలో ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ‘పార్ష్డ్’ సినిమాలో నుంచి లీకైన నగ్న దృశ్యాల గురించి ప్రశ్నించినందుకు కోపంతో రగిలిపోయారు. ‘‘మై ఫ్రెండ్... సారీ! మీలాంటి వ్యక్తులే ఈ వివాదాలను సృష్టిస్తారు. మీరు ఆ క్లిప్ (లీకైన న్యూడ్ సీన్) చూశారు. ఫ్రెండ్కి షేర్ చేశారు. కాంట్రవర్సీకి కారణమయ్యారు’’ అని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్ష్డ్’లో ఆదిల్ హుస్సేన్, రాధికా ఆప్టే నటించిన న్యూడ్ సీన్ ఇండియాలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. న్యూడ్ సీన్లో నటించడం నటనలో ఓ భాగమన్న రాధిక.. ‘‘నేను దేనికీ సిగ్గు పడడం లేదు. నా క్లిప్ చూడడం కంటే అద్దంలో మీరు మీ నగ్నదేహాన్ని చూసుకోండి. ఎవరైతే వాళ్ల దేహాన్ని భరించలేరో వాళ్లే ఇతరుల దేహంపై దృష్టి పెడతారు’’ అన్నారు. -
ఆ ప్రశ్న అడిగినందుకు హీరోయిన్ ఆగ్రహం!
తన అభినయంతో బాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ రాధికా ఆప్తే. 'కబాలి' సినిమాతో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తాజాగా 'పర్చెడ్' సినిమాలో బోల్డ్ నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాలో రాధికా ఆప్తే నటించిన నగ్న శృంగార దృశ్యాలు ఆన్లైన్లో లీకై దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నగ్న దృశ్యాల లీక్ గురించి ప్రశ్నించిన ఓ విలేకరిపై రాధికా ఆప్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సారీ, మీ ప్రశ్న చాలా మూర్ఖంగా ఉంది. మీలాంటి వ్యక్తుల వల్లే వివాదాలు పుడుతాయి. మీరు ఆ దృశ్యాన్ని చూశారు. దానిని ఇతరులతో పంచుకున్నారు. కాబట్టి మీరే ఆ వివాదాన్ని సృష్టించారు' అంటూ ఆ విలేకరికి ఆమె షాకిచ్చారు. 'పర్చెడ్' సినిమాలో రాధికా ఆప్తే, అదిల్ హుస్సేన్ మధ్య ఉన్న రొమాంటిక్ దృశ్యాలు ఆన్లైన్లో లీక్ కావడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఆ ఒక్క దృశ్యం కన్నా ఎంతో కీలకమైన కథాంశం ఉందని, స్త్రీల దృక్కోణంలో సినిమా తెరకెక్కిందని చిత్ర రూపకర్తలు తెలిపారు. ఏమాత్రం బెదరకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాధికా ఆప్తే ఈ వివాదంపై గతంలో స్పందించారు. ఆ ఒక్క దృశ్యం గురించి వివాదం చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. తానొక నటిని అని, తాను ఎలాంటి పాత్ర వచ్చినా దానిని చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ సినిమాలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుందని ఆమె పేర్కొంది. -
ఆ కళాకారులపై నిషేధం తగదు..
ముంబైః సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ సినిమాలో మెరిసిన రాధికా ఆప్టే.. ముంబైలో జరిగిన స్వాచ్ వాచెస్ కార్యక్రమంలో పాల్తొన్నారు. ఈ సందర్శంగా మాట్లాడిన ఆమె.. ముందుగా తీవ్రవాదాన్ని ఖండిస్తూ, భారత సైనికులకు తన సంఘీభావం తెలిపారు. మరోవైపు పాకిస్థానీ కళాకారులపై బ్యాన్ విధించడం తగదంటూ తన మనసులో మాటను వెల్లడించారు. ఉడీ, బారాముల్లాల్లో ఉగ్రదాడులు దేశంలో బీభత్సాన్ని సృష్టించి, తీవ్రమైన విషాదాన్ని, విచారాన్ని మిగిల్చాయని రాధికా ఆప్టే అన్నారు. దాడుల్లో సైనికులు మరణించడంపై ఆమె.. తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో పాకిస్థానీ కళాకారులకు భారత్ లో బ్యాన్ విధించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఉగ్రదాడులకు కళాకారులకు ముడి పెట్టడం సరికాదన్న ఆమె... ఒకవేళ స్వాచ్ వాచెస్ ను ఇండియాలో అనుమతిస్తే.. పాకిస్థానీ కళాకారులను కూడా అనుమతించాల్సి ఉంటుందని ఆప్టే తన అభిప్రాన్ని తెలియజేశారు. ఉడీ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులు ఫవాద్, మహీరా ఖాన్ వంటివారు దేశం విడిచి వెళ్ళిపోవాలని, వారు నటించిన సినిమాలను అడ్డుకోవాలని మహరాష్ట్ర నవ నిర్మాణ్ సేస నుంచి డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఓం పురి, సోనాలీ బింద్రే తదితర ప్రముఖ తారలెందరో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థానీ కళాకారులకు అనుకూలంగా మాట్టాడారు. కళాకారులపై నిషేధం విధించినంత మాత్రాన తీవ్రవాదాన్ని అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు. కళాకారులంతా ప్రభుత్వం ఇచ్చిన వీసాల ద్వారానే ఇక్కడకు వచ్చారని, వారు తీవ్రవాదులు కాదని అన్నారు. ఇదే మార్గంలో రాధికా అప్టే కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రముఖ వెటరన్ యాక్టర్ నానా పటేకర్ మాత్రం.. దేశంముందు కళాకారులు నల్లుల్లాంటి వారని, దేశ భద్రతను కాపాడే సైనికుల తర్వాతే ఎవరైనా అని కళాకారులనుద్దేశించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన అన్నింటికన్నా దేశమే నాకు ముందన్న ఆయన.. పాకిస్థానీ కళాకారులకు అనుకూలంగా మాట్లాడిన సల్మాన్ వంటి వారి వ్యాఖ్యలను కూడా పరోక్షంగా విమర్శించారు. -
దక్షిణాదిపై ఆరోపణల పర్వం
నటి తాప్సీ ఆరోపణల స్వరం పెంచింది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై ధ్వజమెత్తుతోంది. హిందీలో ఒక విజయం లభించడంతో ఇక దక్షిణాది చిత్రాల అవకాశాలతో పనిలేదని భావిస్తోందో? ఏమో? గానీ చాలా ఘాటుగానే విమర్శలు గుప్పిస్తోంది. తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెడుతోంది కూడా. ఈ మధ్య కొందరు హీరోయిన్లు కోలీవుడ్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇలియానా, తాప్సీ లాంటి బాలీవుడ్ భామలకు తొలిరోజుల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమనే ఆదుకుంది. అప్పుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలను సహించారు. అలాంటిది ఎప్పుడైతే సొంత గడ్డపై అవకాశాలను అందుకున్నారో అప్పటి నుంచి దక్షిణాదిపై దండెత్తడానికి రెడీ అవుతున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల కబాలి ఫేమ్ రాధిక ఆప్తే దక్షిణాది నటుడొకరు తాను బస చేసిన హోటల్ గదికి ఫోన్ చేసి తన గదికి రమ్మని వత్తిడి చేశాడని ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. అదే విధంగా విద్యాబాలన్ ఆరంభంలో ఒకరు తనను అవమాన పరచినట్లు వెల్లడించి వార్తల్లోకెక్కింది. ఇక తాజాగా పింక్ చిత్రం విజయంతో బాలీవుడ్లో ప్రచారాన్ని వెతుక్కుంటున్న తాప్సీ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణల దాడి చేస్తోంది. ఆరంభంలో ఆదుకున్న వారని కూడా ఆలోచించకుండా దక్షిణాది చిత్రపరిశ్రమలో తోలి రోజుల్లో తగిన మర్యాదను పొందకుండా అవమానాలకు గురయ్యానని, తన సంభాషణల వాచకం సరిగా లేదని కొందరు నటులు కించపరచారని ఆరోపణలు చేసింది. అంతే కాదు పారితోషికం విషయంలోనూ చాలా మోసమైన సంఘటనలను ఎదుర్కొన్నానని వాపోయింది. తనకు ఇచ్చిన చాలా చెక్కులు బౌన్సు అయ్యాయని తెలి పింది. నటులు మాత్రం తమ పారి తోషికాలను కరెక్ట్గా తీసుకునే వారని సహ నటులను వదల కుండా దులిపేసింది. -
అవకాశాలంటూ లైంగిక వేధింపులు : నటి
సినిమా అవకాశాలంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ నటి రాధికాఆప్తే మరోసారి వివాదానికి తె ర లేపారు. ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటి రాధికాఆప్తే. ధోని చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయిన ఈ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా కబాలి చిత్రంలో రజనీకాంత్తో నటించి మరింత పాపులర్ అయ్యారు. అంతకంటే కూడా ఇప్పుడు శ్రుతిమించిన శృంగార సన్నివేశాల్లో నటించడం, టాప్ లెస్ దుస్తులు ధరించడం, నగ్నంగా నటించడం వంటి చర్యలతో ఈ ఉత్తరాది భామ కలకలం సృష్టిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అవకాశాల ఆశతో లైంగిక వేధింపులకు గురైన వారు చాలా మంది ఉంటారు. వారిలో ఎవరూ బయట పడలేదు. నటి రాధికాఆప్తే మాత్రం ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి సినీ వర్గాల్లో సెగలు పుట్టించారు. రాధికాఆప్తే ఇటీవల ఒక ఆంగ్ల చిత్రం కోసం నటించిన అశ్లీల దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఒక ద క్షిణాదికి చెందిన నటుడు తాను బస చేసిన హోటల్కు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. ఆయన మాటలు చాలా తప్పుగా ఉండడంతో తాను గట్టిగానే హెచ్చరించానని, అప్పటి నుంచి తనను దుర్బాషలతో గొడవ చేస్తున్నాడని తెలిపారు. అదే విధంగా ఒక హిందీ చిత్రంలో నటించడానికి అవకాశం కల్పిస్తానని చెప్పిన నిర్మాత తనను మరొకరి బెడ్ రూమ్లో గడపాలని అడిగారన్నారు. ఇది చాలా అనాగరికం అని తనను బెడ్ రూమ్కు రమ్మన్న వాడు నరకానికి పోతాడని చెప్పానని అన్నారు. ఇంతకీ తనను వేధింపులకు గురి చేసిన ఆ దక్షిణాది నటుడు ఎవరన్నది మాత్రం రాధికాఆప్తే బయట పెట్టలేదు.ఏదేమైనా చిత్ర పరిశ్రమలో నటి రాధికాఆప్తే హాట్ టాపిక్గా మారారు. -
రాధిక ఆప్తేకి షాక్ !
నటి రాధిక ఆప్తే షాక్కు గురయ్యారు. అంతగా తను ఎదుర్కొన్న సంఘటన ఏమిటనేగా మీ ఉత్సుకత. కోలీవుడ్కు ధోని చిత్రం ద్వారా పరిచయమైన రాధిక ఆప్తే ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా రజనీకాంత్ చిత్రం కబాలితో చాలా పాపులర్ అయ్యారు. అయితే అంతకు ముందే హిందీ, బెంగాలీ, మరాఠి తదితర భాషల్లో నటించారు. ఇక ధోని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు. అలా దశాబ్ధంపైగానే నటిగా కొనసాగుతున్న ఈ ఉత్తరాది భామ ఇటీవల హాలీవుడ్లోని రంగప్రవేశం చేశారు. అయితే గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న ఈ భామకు చెందిన శృంగారభరిత సన్నివేశాల దృశ్యాలు ఇంటర్నెట్, యూట్యూబ్లలో హల్చల్ చేసి కలకలం పుట్టించాయి. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోని రాధికఆప్తే ఇప్పుడు తొలిసారిగా షాక్కు గురైయ్యారట.అందుకు కారణం ఆమె నటించిన ఆంగ్ల చిత్రం పర్చెడ్నే. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్దేవగన్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్తే నటుడు అదిల్ హుస్సేన్తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో, ముఖ్యంగా టాప్లెస్ దుస్తుల్లో నటించి దుమ్మురేపారు. ఆ సన్నివేశాలు ఇప్పటకే ఇంటర్నెట్, వాట్స్యాప్, యుట్యూబ్లలో హల్చల్ చేస్తున్నాయి.ఈ విషయం రాధిక ఆప్తేకు తెలిసినా చలించలేదు.అయితే 20 నిమిషాల నిడివి గల ఈ శృంగార భరిత సన్నివేశాలిప్పుడు నటి రాధిక ఆప్తే శృంగార సన్నివేశాలు అంటూ డీవీడీల రూపంలో మార్కెట్లో 90 రూపాయల ధరకు విక్రయణ జరుగుతున్నాయట.ఈ సంఘటన రాధిక ఆప్తేను కలవరపరుస్తోందట. నిజానికి పర్చెడ్ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేసే ముందు అందులోని శృంగార భరిత సన్నివేశాలను తొలగిస్తామని దర్శక నిర్మాతలు ఆమెకు చెప్పారట.ఇప్పుడా సన్నివేశాలు అనధికారికంగా బయటకు రావడంతో రాధిక ఆప్తే షాక్కు గురైయ్యారు. దీంతో ఆమె తన పేరుతో నకిలీ శృంగార సన్నివేశాలతో కూడిన సీడీలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం గురించి సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం.మరో విషయం ఏమిటంటే రాధిక ఆప్తే నటించిన పర్చెడ్ చిత్రం 24 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడి 18 అవార్డులను అందుకుందని తెలిసింది. -
లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్' సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఈ లీక్ విషయంలో 'కబాలి' హీరోయిన్ రాధికకు సహ నటుడు ఆదిల్ హుస్సేన్ అండగా నిలిచారు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' పేరిట దృశ్యాలను ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ దృశ్యంలో తామిద్దరం నటించినా.. రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందట ఇంటర్నెట్లో లీకైన ఈ ఘాటైన దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను ఎవరూ లీక్ చేశారనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో 'ఇండియన్ ఎక్స్ప్రెస్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'లీకైన వీడియోలకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని అనకుండా 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే పురుషుడు శృంగారంలో పాల్గొనడం ఈ దేశంలో పెద్ద విషయం కాదు. కానీ మహిళల విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తారు. మన నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచన ధోరణిని ఇది చాటుతోంది. పాశ్చాత్య దృశ్యాల్లో అలాంటి సీన్లు సినిమాలో ఉండటం మాములు విషయమే' అని పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నా కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన సమాజ వైఖరిని అద్దం పడుతోందని పేర్కొన్నారు. లీనా యాదవ్ తెరకెక్కించిన 'పర్చెడ్' సినిమా 2015 టొరంటో చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఓ భార్య, ఓ తల్లి, ఓ కూతురు, ఓ వేశ్య.. ఇలా నలుగురు మహిళల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. -
వెరీ బోల్డ్!
రాధికా ఆప్టే దక్షిణాది ప్రేక్షకులకు పక్కా హోమ్లీ హీరోయిన్గానే తెలుసు. కానీ, ఉత్తరాది ప్రేక్షకులకు ఆమెలో మరో కోణం కూడా తెలుసు. షార్ట్ ఫిల్మ్ ‘అహల్య’ కోసం హాట్గా నటించడం, ఆ మధ్య విడుదలైన ‘బద్లాపూర్’లోనూ మొహమాటపడకుండా గ్లామరస్గా నటించడం ద్వారా హాట్ టాపిక్గా మారారు. ఇప్పుడు ‘పార్ష్డ్’ అనే హిందీ చిత్రంలో ఓ అడుగు ముందుకేశారు. లీనా యాదవ్ దర్శకత్వంలో హీరో అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రం ఇంకా మన దేశంలో విడుదల కాలేదు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అందరి మన్ననలు అందుకుంది. యూఎస్, ఫ్రాన్స్లో చిత్రం విడుదలైంది. ఇందులో ఆదిల్ హుస్సేన్, రాధికా ఆప్టేలకు సంబంధించిన రొమాంటిక్ సీన్ తాలూకు ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫొటోలో రాధిక టాప్లెస్గా కనిపించడం చర్చనీయాంశమైంది. ‘‘ఈ ఫొటో ఎలా బయటికొచ్చిందో అర్థం కావడంలేదు. యూఎస్, ఫ్రాన్స్లో విడుదలైంది కాబట్టి, అక్కడి వాళ్లెవరైనా బయటపెట్టి ఉంటారనుకుంటున్నా. ఇంటర్నెట్లో ఫొటోలు వేగంగా దూసుకెళుతున్నాయి. వాటిని తీయించేయమని సైబర్ సెల్ని కోరాను’’ అని చిత్రనిర్మాతల్లో ఒకరైన అసీమ్ బజాజ్ అన్నారు. ఏదేమైనా కథను నమ్మితే రాధిక వెనకాడకుండా బోల్డ్ సీన్స్లో నటిస్తారని స్పష్టమవుతోంది. ఆమె నటన అభ్యంతరకరంగా ఏమీ లేదనీ, చాలా అద్భుతంగా చేసిందని విదేశాల్లో సినిమా చూసినవాళ్లు కితాబులిస్తున్నారు. ఇందులో రాధిక మద్యానికి బానిస అయిన భర్త పెట్టే చిత్రహింసలకు గురయ్యే అమ్మాయిగా నటించారు. ‘పార్ష్డ్’ అంటే.. దాహం అని ఓ అర్థం. ఆత్మీయ స్పర్శ కోసం ఆరాటపడే అమ్మాయి పాత్రను రాధిక చేశారు. -
సారీ చెప్పిన కబాలి హీరోయిన్..
బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న కబాలిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననందుకు విచారం వ్యక్తం చేసింది. ఇందుకు క్షమాపణలు చెప్పింది. కబాలి ప్రమోషన్కు దూరమవడం దురదృష్టకరమని, మరో సినిమా షూటింగ్లో పాల్గొనాల్సిరావడమే దీనికి కారణమని చెప్పింది. కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నానని రాధిక తెలిపింది. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొడుతోందని, రజనీకాంత్తో నటించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. తాను నటించిన మంచి పాత్రల్లో ఈ సినిమాలోనిది ఒకటంటూ, సినిమా గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా వ్యక్తం చేసింది. కబాలి సినిమాలో రజనీకాంత్ భార్యగా రాధికా, కూతురుగా మరో కీలకపాత్రలో ధన్సిక నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. -
ఆ ఫొటోషూట్ అందుకేనా!
గతేడాది హిందీలో ‘హంటర్’ అనే సినిమా విడుదలైంది. ఆరు కోట్లతో తీసిన ఈ అడల్ట్ కామెడీ మూవీ పది రోజుల్లో 11 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో బోల్డ్ కంటెంట్ ఏ స్థాయిలో సేల్ అవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగు వెర్షన్ని నిర్మిస్తోంది. దర్శక-నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇప్పటివరకూ రెజీనా గ్లామరస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఇది వాటిని తలదన్నే పాత్రలా ఉంటుంది. వాస్తవానికి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో కనిపించిన రాధికా ఆప్టే ‘హంటర్’లో బోల్డ్గా కనిపించడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్ హీరోయిన్లను తలపించేలా బోల్డ్ సన్నివేశాల్లో బ్యూటిఫుల్గా నటించి, రాధిక అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా ఆ స్థాయిలో నటించాలనే పట్టుదలతో రెజీనా ఉన్నారని సమాచారం. అందుకే ఇటీవల ఆమె స్పెషల్ ఫొటోషూట్ చేయించుకున్నారని వినికిడి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో హాట్ హాట్గా కనిపిస్తున్నారు రెజీనా. ఆ ఫొటోలను చూసినవాళ్లు ‘హంటర్’ రీమేక్లోని పాత్రకు రెజీనా పూర్తి న్యాయం చేయగలదని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హీరో చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు నుంచి అవసరాల శ్రీనివాస్ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో సెక్స్కి అడిక్ట్ అయిన క్యారెక్టర్లో నటిస్తున్న అవసరాల మాట్లాడుతూ - ‘‘అడల్ట్ కామెడీ సినిమా ఇది. హిందీ చిత్రంలానే తెలుగు రీమేక్ బోల్డ్గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది’’ అన్నారు. హిందీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో ఎన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో? అసలు రెజీనా నటిస్తారో? లేదో? -
కబాలి కొత్త పోస్టర్ అదిరింది
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది. ఇప్పటికే నిర్మాత అఫీషియల్ గా సినిమా డేట్ ఎనౌన్స్ చేయగా.. సెన్సార్ సభ్యులనుంచి కూడా సినిమా సూపర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలను మరింత పెంచే స్థాయిలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రిలీజ్ డేట్ తో పాటు ఉన్న ఈ పోస్టర్ లో రజనీ గాయలతో కనిపిస్తున్నాడు. సాధారణంగా రజనీ సినిమా అంటే వన్ మేన్ షోలా సాగుతుంది. హీరోయిన్ తో పాటు ఇతర పాత్రధారులెవరికి పెద్దగా గుర్తింపు రాదు కానీ కబాలి విషయంలో మాత్రం హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లోనూ రజనీ హృదయంలో రాధికా ఆప్టే ఉన్నట్టుగా చూపించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ, రాధికల మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కబాలి రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కబాలి రికార్డ్ స్థాయిలో 3500 థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. -
కబాలి రిలీజ్ డేట్ వచ్చేసింది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి విడుదలపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు నమోదు చేసిన కబాలి రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్ లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా సూచించకపోవటం విశేషం. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, హిందీలలోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న కబాలి మలయ్ లాంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. #Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU — Kalaippuli S Thanu (@theVcreations) 11 July 2016 -
రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్కు చేదువార్త!
మళ్లీ వాయిదాపడిన సినిమా విడుదల భారీ అంచనాలు, రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతున్న ‘కబాలి’ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. వచ్చే నెల 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. అయితే 15న ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలను వచ్చేనెల 15 నుంచి 22కు వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటీ సినిమా విడుదలను వారంపాటు వాయిదా వేశారు. ఈ సినిమా ఇక జూలై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ పూర్తికాగానే చిత్ర రూపకర్తలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘విక్రమసింహా’, ‘లింగ’ వంటి ఫ్లాపుల తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘కబాలి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో వయస్సు మళ్లిన డాన్గా రజనీ కనిపిస్తుండగా.. ఆయనతోపాటు రాధికా ఆప్టే, దినేశ్, రిత్వికా, ధన్సిక తదితరులు నటిస్తున్నారు. -
నా ఫిలింను కాపీ కొట్టారు
బాలీవుడ్ తారలు మనోజ్ వాజ్పేయి, రాధికా ఆప్టే, నేహా శర్మలో దర్శకుడు శిరీష్ కుందర్ తీసిన షార్ట్ ఫిలిం కృతి ఓ వివాదంలో చిక్కుకుంది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ షార్ట్ ఫిలింను.. తన షార్ట్ ఫిలిం బాబ్ను కాపీ కొట్టి తీశారని నేపాల్కు చెందిన దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపిస్తున్నాడు. బాబ్ ఏడు నెలల క్రితం విడుదలైనట్టు అనీల్ తెలిపాడు. ఇందులోని పాత్రలు, కథాంశంతోనే కృతిని తీసినట్టు చెప్పాడు. అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని అన్నాడు. తన షార్ట్ ఫిలింకు, దీనికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, కృతి షార్ట్ ఫిలింను చూసి షాకయ్యానని చెప్పాడు. -
లాయర్గా రాధికా ఆప్టే
‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఆ తర్వాత ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్ హీరోయిన్ ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారు. తాజాగా ‘టుడే’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. ‘మనం’, ‘24’ చిత్రాల దర్శకుడు విక్రమ్కుమార్ వద్ద అసోసియేట్గా పని చేసిన రుద్రన్ దర్శకత్వం వహించారు. 5కలర్స్ మల్టీ మీడియా పతాకంపై దామెర శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మానసిక రోగులపై ఓ ముఠా చేస్తున్న అరాచకాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేశారు. జులైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
రజనీ ఫ్యాన్స్కు నిరాశే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జులై 1న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన కబాలి టీజర్ ఆన్లైన్లో సంచలనాలు సృష్టిస్తుండగా.. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 12న కబాలి ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా, కబాలి ఆడియోను ఎలాంటి ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయానలని భావిస్తున్నారట. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కబాలి చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అభిమానుల అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు భారీ ఫ్లాప్ల తరువాత రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ధన్సికతో పాటు పలువురు మలేషియన్ నటులు కూడా విలన్ రోల్స్లో కనిపించనున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డ్లు సృష్టిస్తున్న కబాలి, రిలీజ్ తరువాత మరిన్ని రికార్డ్లు బద్దలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది. -
అదీ.. సూపర్ స్టార్ స్టామినా..!
రెండు సినిమాలు భారీ డిజాస్టర్లు అయిన తరువాత ఎంతటి స్టార్ హీరోకయినా వెనకడుగు తప్పదు. ఆ తరువాత చేయబోయే సినిమాల రికార్డ్లు, బిజినెస్ విషయంలో ఆ ఫ్లాప్ సినిమాల ప్రభావం బాగానే కనిపిస్తోంది. కానీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇలాంటి వాటికి అతీతుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రజనీ హీరోగా తెరకెక్కిన కొచ్చాడయాన్, లింగా సినిమాలు భారీ డిజాస్టర్లు అయినా, కొత్త సినిమా కబాలీ సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. రజనీ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన కబాలీ టీజర్ హాలీవుడ్ సినిమాలకు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్తో రికార్డ్ సృష్టించిన కబాలీ ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్గా రికార్డ్ సృష్టించింది. అవేంజర్స్ లాంటి హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి రజనీ సాధించిన రికార్డ్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక బిజినెస్ విషయంలో కూడా రజనీ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. డిజాస్టర్ టాక్తో కూడా రజనీ లింగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఇప్పుడు కబాలీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా రిలీజ్కు ముందే కబాలీ 200 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇండియాతో పాటు రజనీకి బాగా పట్టున్న జపాన్, తొలిసారిగా మలేషియాలో కూడా భారీగా కబాలీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ బ్యూటి ధన్సిక లేడీ డాన్గా కనిపిస్తుండగా, మరికొంత మంది హాలీవుడ్ స్టార్లు విలన్లుగా నటించారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 11న, సినిమాను జులై 1న రిలీజ్ చేయనున్నారు. -
రికార్డుల మోత మోగిస్తున్నాడు
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆన్లైన్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రజనీ లేటెస్ట్ సినిమా కబాలి టీజర్.. ఊహకందని లెక్కలతో బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది. యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన టీజర్గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది కబాలి. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక లైక్స్ విషయంలో అయితే అంతర్జాతీయ సినిమాలతో పోటి పడుతోంది కబాలి. 4 లక్షలకు పైగా లైక్స్ సాధించిన కబాలి టీజర్, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమా ఏవెంజర్స్ 5.12 లక్షల లైక్స్తో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా జూన్ 9ల కబాలి తొలి థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. టీజర్తోనే సంచలనాలు నమోదు చేసిన కబాలి.., ట్రైలర్తో ఇంకెన్ని రికార్డ్లు సృష్టిస్తాడో చూడాలి. రజనీకాంత్ వయసుమల్లిన డాన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడిగా రాధికా ఆప్టే నటిస్తుంది. యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కలైపులి యస్ థాను భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్కు రెడీ అవుతోంది. -
అనుక్షణం భయపడుతూనే ఉంటా..
ముంబై: 'కబాలీ' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే గొప్ప అవకాశాన్ని రాధికా ఆప్టే దక్కించుకుంది. 'బదలాపూర్' తో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. సెలబ్రిటీగా ఉండటం చాలా కష్టమంటోంది ఈ హీరోయిన్. సెలబ్రిటీలు, అందులో ముఖ్యంగా నటీనటులకు ప్రతిరోజూ ఏదో విషయంలో కొత్త భయాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. అనుకోని ఆపదలు(వదంతులు) తారలకు నిత్యం ఎదురవుతునే ఉంటాయని అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది. ఇంతకు ఈ భయం గోల ఏంటనుకుంటున్నారు కదూ... రాధిక ఆప్టే కీలక పాత్రలో కనిపించిన మూవీ 'ఫోబియా' (భయం) రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కృపలానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ గురించి రాధికా మాట్లాడుతూ.. భయాలు సాధారణ వ్యక్తుల కంటే ఓ మోస్తరు గుర్తింపు ఉన్న వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ప్రతి సమస్యను ఎదుర్కొంటూ పోతేనే ముందుకెళ్లడం సాధ్యమవుతుందని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని అంటోంది. -
అభిమానులకు కిక్కే కిక్కు
నోట్లో కాస్ట్లీ సిగార్ పైప్... సాల్ట్ పెప్పర్ లుక్తో రాజసంగా కుర్చీలో కూర్చున్న రజనీకాంత్.. ఇదీ ‘కబాలి’ చిత్రం ఫస్ట్ లుక్. దానికి ఎంతటి స్పందన వచ్చిందో, ఇటీవల విడుదల చేసిన టీజర్కు అంతకు రెట్టింపు స్పందన వచ్చింది. రజనీకాంత్, రాధికా ఆప్టే జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి యస్.థాను తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రజనీకాంత్తో సినిమా తీయడం నా లైఫ్టైమ్ అచీవ్మెంట్గా భావిస్తున్నా. టీజర్లో రజనీగారి డైలాగులకు అనూహ్య స్పందన వస్తోంది. అంతకంటే గొప్పవి, అభిమానులను కిక్కెక్కించే డైలాగులెన్నో సినిమాలో ఉంటాయి. రజనీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని రంజిత్ కథ సిద్ధం చేశారు. సంతోష్ నారాయణ్ మంచి పాటలిచ్చారు. జూన్ మొదటివారంలో పాటలను, జులై 1న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. థన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మురళి, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవి-శ్రీదేవి. -
'కబాలి' ఫ్యాన్స్కు తీపికబురు.. రిలీజ్ డేట్ ఇదే!
రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న 'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జూన్లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే, తాజాగా తేదీని జూలై 1గా ఖరారు చేశారు. జూలై 7కు విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలించినప్పటికీ, అదే తేదీన సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్రం వస్తుండటంతో దానితో పోటీ లేకుండా జూలై 1కి ఫిక్స్ అయ్యారని చిత్రవర్గాలు మీడియాకు తెలిపాయి. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కబాలి' సినిమాలో రజనీ వృద్ధ డాన్గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన తైవానీ నటుడు విన్స్టన్ చావో కూడా తాజాగా చెన్నైలోని డబ్బింగ్ టీమ్తో చేరాడు. రజనీతోపాటు రాధికా ఆప్టే, ధన్సికా, రిత్విక తదితరులు నటిస్తున్న ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
తెలుగు 'కబాలి' గర్జిస్తే..
హైదరాబాద్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి'. ఈ సినిమా తమిళ వెర్షన్ టీజర్ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. టీజర్ వచ్చిన కొన్ని గంటల్లోనే 1.8 మిలియన్ కిపైగా వ్యూస్ దీనికి వచ్చాయి. ఇదీ రజనీ స్టామినా అని టీజర్ చాటుతోంది.. ఇక తెలుగు వెర్షన్ 'కబాలి' టీజర్ కూడా ఇప్పుడే ఆన్లైన్లో రిలీజైంది. 'పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్ ఏయ్! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్ బాస్ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ రజనీ ఈ టీజర్లో తన విశ్వరూపం చూపెట్టాడు. రజనీ స్టైల్కి, స్టామినాకి తగ్గట్టు రూపొందిన 'కబాలి' టీజర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దర్శక బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు రజనీ స్టైల్కు నీరాజనాలు పడుతున్నారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. -
రోరింగ్ 'కబాలి'! ఈ కొత్త లుక్ చూశారా?
'కబాలి' సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమా టీజర్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా.. అంతకుముందు రజనీ కాంత్ అభిమానులకు చిన్నకానుక తరహాలో 'కబాలి' కొత్త లూక్ను విడుదల చేశారు. వయస్సు పెరుగుతున్నా తన నటనలో స్టామినా తగ్గలేదని, తన స్టైల్లో ఏమాత్రం మార్పులేదని చాటుతూ ఈ కొత్త పోస్టర్లో రజనీ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. చేతిలో తుపాకీ పట్టుకొని పవర్ఫుల్ ఎమోషన్స్తో రజనీ ఈ పోస్టర్లో అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. Magizchi!!! pic.twitter.com/w1oqjFzaD6 — pa.ranjith (@beemji) April 30, 2016 -
'తలైవా'లా ఎవరూ ఉండరు!
'ప్రపంచంలో ఆయనలా ఎవరూ ఉండరు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి.. ఎంతో స్ఫూర్తినిచ్చారు' అంటూ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది రాధికా ఆప్టే. రజనీ తాజా సినిమా 'కబాలి'లో హీరోయిన్గా నటిస్తోంది. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ డాన్లాగా కనిపిస్తుండగా, ఆయన భార్యగా రాధిక కనిపించనుంది. మరీ అంత గొప్ప లివింగ్ లెజండ్తో కలిసి నటించడం ఎలా ఉంది అని అడిగితే.. 'రజనీకాంత్తో కలిసి పనిచేయడం ఎవరూ ఎంజాయ్ చేయరు. నేను చాలా ఎంజాయ్ చేశాను. నా జీవితంలోనే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రజనీ సర్లా ఎవరూ ఉండరు. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని రాధిక తెలిపింది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు మలేషియాలోనే జరిగింది. రాధిక తాజా హిందీ చిత్రం 'ఫొబియా' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె విలేకరులతో పిచ్చాపాటిగా ముచ్చటించింది. పవన్ క్రిపాల్నీ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమా సైకాలజికల్ థ్రిల్లర్ అని ఆమె తెలిపింది. -
ఆయనకు ఆయనే సాటి: రాధికా ఆప్టే
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లు ఎవరూ ఉండరని, ఆయనకు ఆయనే సాటి అని హీరోయిన్ రాధికా ఆప్టే విపరీతంగా పొగిడేసింది. కబాలి సినిమాలో రజనీ సరసన నటించిన ఈ బోల్డ్ నటి.. షూటింగ్ టైమ్లో తాను రజనీతో చాలా అద్భుతంగా గడిపినట్లు చెప్పింది. అది తన జీవితంలోనే అత్యుత్తమ అనుభవమని, అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపింది. ఆయన ఓ వండర్ఫుల్ మనిషని, ఆయనలా ఎవరూ ఉండనే ఉండరని రాధిక చెప్పింది. తాను నటించిన మరో సినిమా ఫోబియా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్ పాత్ర పోషిస్తుండగా, రాధికా ఆప్టే అతడి భార్య పాత్ర పోషిస్తోంది. రజనీ సరసన ఏవైనా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారా అని అడగ్గా, బహుశా చేస్తానేమో.. చూడాలని తెలిపింది. మలేషియాలో కబాలి షూటింగ్ చాలా బాగా జరిగిందని, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పింది. -
లేటైనా లేటెస్ట్గా...
సూపర్స్టార్ రజనీకాంత్ ‘కబాలి’గా రానున్న సంగతి తెలిసిందే. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ, విడుదల హడావిడి కనిపించక పోవడంతో వాయిదా పడిందని అందరికీ అర్థమైంది. దాంతో ఎప్పుడు విడుదలవుతుంది? అనే చర్చ మొదలైంది. ఆ విషయం గురించి రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాక ఓ టీవీ చానల్ రజనీని ‘కబాలి’ విడుదల గురించి అడిగింది. అప్పుడాయన ‘‘మే నెలాఖరున లేక జూన్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ‘రెగ్యులర్గా మీరు విసిరే పంచ్ డైలాగులు ఇందులోనూ ఉంటాయా?’ అనే ప్రశ్నకు... ‘‘సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని తనదైన శైలిలో నవ్వుతూ సూపర్ స్టార్ అన్నారు. మామూలుగా రజనీ సినిమా అంటే ఆరంభం నుంచీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలానే జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచీ భారీగా అంచనాలు పెంచుకున్నారు రజనీ అభిమానులు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అభిమాన జనమంతా ఈ నెలలో సినిమా రాదని ఒకింత నిరుత్సాహానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. అయినా... మా నాయకుడు ‘లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా’డు అంటూ, రజనీ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ని గుర్తు చేస్తూ, సర్ది చెప్పుకుంటున్నారు. -
చాక్లెట్ రజనీతో సెల్ఫీ
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్, కబాలీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే తమిళనాట ఎన్నికల జరుగుతుండటంతో ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది. దీంతో తమిళనాట కబాలీ ఫీవర్ తగ్గకుండా ఉండేందుకు చిత్రయూనిట్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఓ రజనీ విగ్రహం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కబాలీ ప్రమోషన్లో భాగంగా పాండిచ్చేరికి చెందిన ఓ చాక్లెట్ తయారీ కంపెనీ వినూత్న ప్రయోగం చేసింది. తమ సంస్థ నుంచి తయారయ్యే చాక్లెట్తో ఆరడుగుల రజనీ విగ్రహాన్ని కబాలీ గెటప్లో తయారు చేయించి ప్రదర్శనకు ఉంచారు. ఈ విగ్రహాన్ని తమ సంస్థ నిర్వహిస్తున్న అన్ని రెస్టారెంట్లలోనూ ప్రదర్శనకు ఉంచటమే కాకుండా, ఆ విగ్రహంతో సెల్పీ దిగే అవకాశం కూడా కల్పిస్తున్నారు. చాలా కాలం తరువాత రజనీ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా తమిళ హీరోయిన్ ధన్సిక లేడీ డాన్గా అలరించనుంది. బ్యాంక్, హాంకాంగ్లలో భారీగా తెరకెక్కిన ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సమ్మర్లో సై!
శత్రువులపై కన్నెర చేసే సింహం.. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్గా మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ‘కబాలి’ ఫస్ట్ లుక్కి భారీ ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘కలైపులి’ ఎస్. థాను మాట్లాడుతూ - ‘‘రజనీకాంత్తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్. -
రీమేక్ కోసం అలియా,రాధిక కావాలట..!
చాలా రోజులు సోలో హీరోగా సక్సెస్ కొట్టాలని ఎదురుచూస్తున్న యంగ్ హీరో అడవి శేష్ 'క్షణం' సినిమాతో ఆ కోరిక తీర్చేసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు, కథా రచయితగా, స్క్రీన్ప్లే రైటర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోష్లో ఇప్పుడు బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు శేష్. బాహుబలి సినిమాతో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన శేష్, ఇప్పుడు హీరోగా తన మార్క్ చూపించాలనుకుంటున్నాడు. ప్రస్తుతం క్షణం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న అడవి శేష్, ఈ సినిమా బాలీవుడ్ రీమేక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పిన శేష్, మరోసారి రిషి పాత్రలో తానే నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాతో అదాశర్మ చేసిన శ్వేత పాత్రకు అలియాభట్, అనుసూయ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు రాధిక ఆప్టేలు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారని చెబుతున్నాడు. మరి నిర్మాతలు అడవి శేష్ కోసం ఈ కాస్టింగ్ను సెట్ చేస్తారేమో చూడాలి. -
షార్ట్ఫిలింలో నటిస్తున్న సూపర్ స్టార్లు!
ముంబై: ఒకప్పుడు షార్ట్ఫిలింలంటే చులకన భావం ఉండేది. సినిమాల కంటే నిడివి తక్కువగా ఉండే వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. షార్ట్ ఫిలింలు అంటే డాక్యుమెంటరీలు అన్న భావన ఉండేది. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఇది పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన రాధికా ఆఫ్టే ఇటీవల షార్ట్ ఫిలిం 'అహల్య'తో సంచలనం సృష్టించింది. ఈ ష్టార్ఫిలిం ఇటు వీక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా డైరెక్టర్ శిరీష్ కుందర్ కూడా ఇలాంటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాడు. మనోజ్ బాజ్పేయి, రాధికా ఆఫ్టే వంటి బాలీవుడ్ స్టార్లతో 'క్రితి' అనే చిన్న సినిమాను ఆయన నిర్మిస్తాడు. 15 నిమిషాల నిడిమి మాత్రమే ఉండే ఈ సినిమా ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ఇందులో హీరోయిన్ నేహా శర్మ కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. 2006లో జానేమన్ సినిమా తీసిన శీరిష్.. ఈ పొట్టి చిత్రంతో షార్ట్ఫిలిం రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా షార్ట్ఫిలింలోనే సబ్జెక్ట్ను నేరుగా చెప్పే స్కోప్ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు. ఉత్కంఠ కలిగించే ఎక్సైటింగ్ స్టోరీలను చెప్పడానికి షార్ట్ఫిలింలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఇందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ స్పేస్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని ఆయన అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నిర్మించేందుకు, వాటిని విడుదలచేసేందుకు ఎంతగానో సమయం పడుతుందని, ఇబ్బందులూ ఎదురవుతాయని, షార్ట్ఫిలింలకు ఆ చిక్కులు లేవని ఆయన చెప్పారు. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ షార్ట్ ఫిలిం సెట్పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 22న విడదల కానుంది. -
'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'
వయసు, పెళ్లి అనే విషయాలు హీరోలకు పెద్దగా అడ్డు రాకపోయినా హీరోయిన్ల కెరీర్కు ఈ అంశాలు చాలా కీలకం. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న భామలను హీరోయిన్ క్యారెక్టర్స్కు తీసుకోవటం చాలా అరుదు. అయితే అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ బ్యూటీ తన పెళ్లి తరువాత ఇండస్ట్రీ వర్గాల నుంచి తనకు వచ్చిన సలహాలను మీడియాతో పంచుకుంది. సౌత్తో పాటు నార్త్లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రాధిక ఆప్టే. ఎక్కువగా హోమ్ లీ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ భామ బద్లాపూర్ సినిమాతో పాటు, అహల్య షార్ట్ ఫిలింతో బోల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తరువాత తను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులను వివరించింది. తను పెళ్లి చేసుకున్న విషయం దర్శక నిర్మాతలకు తెలిసి, వారు ఆ విషయాన్ని దాచిపెట్టామన్నారని తెలిపింది. అయితే తన భర్త లండన్లో ఉంటున్న కారణంగా తాను కొద్ది రోజులు షూటింగ్లో ఉంటే, మరికొద్ది రోజులు భర్త దగ్గరకు వెళ్లాల్సి ఉంటుదని, కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టడం కష్టం అని వారికి తేల్చి చెప్పేసిందట. అంతేకాదు పెళ్లి తరువాత కూడా తను గతంలో చేసినట్టుగా అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ అంటుంది. -
రజనీ సినిమాలో మళ్లీ ఐశ్వర్య!
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ సినిమా కపాలి. చాలా ఏళ్లుగా స్టార్ డైరెక్టర్లతో తప్ప పనిచేయని రజనీకాంత్ రెండు ఫ్లాప్ సినిమాల తరువాత, కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న కొత్త దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాడు. బాషా సినిమా తరువాత రజనీ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాక ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకి జంటగా రాధికా ఆప్టే నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కూడా ఉండటంతో ఆ పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయాలని చాలా రోజులుగా ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. అయితే కథను మలుపుతిప్పే కీలకమైన పాత్ర కావటంతో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని, మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని ప్లాన్ చేశారు. ఇటీవల జెజ్బా సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుండటంతో, తనతోనే ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ సభ్యులు అడిగితే ఐష్ కాదంటుందేమో అన్న ఆలోచనతో స్వయంగా రజనీతోనే ఐశ్వర్యకు ఫోన్ చేయించారని సమాచారం. రోబో సినిమాలో రజనీకి జోడిగా నటించిన ఈ బ్యూటీ మరోసారి సూపర్ స్టార్ తో తెరను పంచుకోడానికి ఓకే చెప్పేసిందని సమాచారం. త్వరలోనే రజనీ సినిమాలో ఐశ్వర్య చేయబోయే పాత్రపై అధికారిక ప్రకటన రానుంది. -
సెప్టెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు జ్వాలా గుత్తా (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) మమ్ముట్టి (నటుడు), రాధికా ఆప్టే (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య. పుట్టిన తేదీ 7. ఇది కేతుసంఖ్య. వీరిపై వచ్చే బర్త్డే వరకు శుక్ర, కేతు గ్రహాల ప్రభావం ఉంటుంది. వీరికి మంచి వాక్చాతుర్యం ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. విదేశాలలో చదువు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, రచయితలకు, బోధన రంగంలో ఉన్న వారికి, విలాస వస్తువుల విక్రయ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక తీరుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి జీతాలలో వృద్ధి, ఉద్యోగరీత్యా ఫారిన్ ఛాన్స్ ఉంటుంది. పిల్లల విద్యా వివాహాల సందర్భంగా ఆడంబరాలకు పోయి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు పరిమితి పాటించడం అవ సరం. కుటుంబ బాధ్యతలు మీదపడతాయి. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, బ్లూ, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మానసా దేవిని ఆరాధించడం, శక్తి ఉన్న వారు భృగు పాశుపత హోమం చేయించుకోవడం, అనాథ బాలికలకు ఆర్థిక సహాయం చేయటం, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఆ విమర్శలు చాలవు
సాధారణంగా నటీమణులపై విమర్శలు చేస్తే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అయితే నటి రాధిక ఆప్తే అందుకు విరుద్ధం అని చెప్పక తప్పదు. ఈ త్తరాది భామ ఏమంటుందో చూడండి. నాపై విమర్శలు చాలానే వస్తున్నాయి. ఇవి చాలవు ఇంకా ఘాటైన విమర్శలు ఆశిస్తున్నాను. నా చిత్రాల ఎంపికను, గ్లామర్ నటనను పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.తా జాగా కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటున్నావేంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి చిత్రాలే నటీనటుల స్థాయిని పెంచుతాయి. అదే విధంగా గ్లామర్గా నటించకుంటే నటిగా నిలబడడం కష్టం. కమర్షియల్ చిత్రాలు చెయ్యడానికి ఇదే లెక్క. కమర్షియల్ చిత్రాలు అంటే చాలదు అందుకు తగిన మషాలా జోడించాలి. కోట్ల రూపాయల పెట్టుబడులతో చిత్రం తయారవుతోంది. అంత డబ్బు ఆషామాషీగా ఖర్చు పెట్టలేరు. అన్నింటికీ లెక్కలు ఉంటాయి. నాపై వస్తున్న విమర్శల గురించి అడుగుతున్నారు. సద్విమర్శలు మనోబలాన్ని పెంచుతున్నాయి. అలాగే ఘాటైన విమర్శలను ఎదుర్కొంటున్నాను. వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి మిశ్రమ విమర్శలను మరిన్ని ఆశిస్తున్నాను అని ఈ సంచలన నటి అంటోంది. ఈ అందాల భామ త్వరలో సూపర్స్టార్ రజనీకాంత్తో జతకట్టడానికి సిద్ధం అవుతోంది. -
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే
-
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ప్రాబల్యం పెంచుకున్న వాటిలో గూగుల్ ఒకటి. ఇవాళ ఏ కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళైయినా గూగుల్ను టచ్ చెయ్యకుండా ఉండలేరు. అంతగా ప్రాముఖ్యతను గూగుల్ సంతరించుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గూగుల్ అన్వేషణలో రెండవ స్థానంలో నిలిచిన నటిగా నటి రాధికా ఆప్తే పేరు నమోదవ్వడం విశేషం. ఇంకా చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇటీవల కన్ను మూసిన అబ్దుల్ కలామ్ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానాన్ని నటి రాధిక ఆప్తే పొందారు. ఇందుకు కారణాలేమిటన్న విషయం గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఆమె సంచలన ప్రచారాలకు కేంద్ర బిందువు కావడమే నని భావించాల్సి ఉంటుంది. హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన రాధికా ఆప్తే మరాఠీలో నటించిన ధోని చిత్ర తమిళ రీమేక్ ద్వారా ఆమెను నటుడు ప్రకాష్రాజ్ కోలీవుడ్కు పరిచయం చేశారు. ఆ తరువాత తమిళ్ సెల్వన్ లాంటి రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి ప్రచారమే పొందారు. తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇవన్నీ పక్కన పెడితే రాధికా ఆప్తే హిందీలో సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో అహల్య అనే 13 నిమిషాల లఘు చిత్రంలో పిచ్చపిచ్చగా అందాలారబోశారు. ఆ చిత్రాన్ని సమీపకాలంలో యూట్యూబ్లలో పెట్టారు. రాధికా ఆప్తే శృంగారాన్ని ఒలకబోశారనగానే అవకాశం ఉన్న వారందరూ ఆ లఘు చిత్రాన్ని చూడడానికి గూగుల్ను టచ్ చేశారు.అంతకంటే ముందు మరో షార్టు ఫిలింలో రాధికాఆప్తే నగ్నంగా నటించారనే ప్రచారం జరగడంతో అది చూడడానికి గూగుల్ వీక్షకులు విరగపడ్డారు. ఇత్యాది సంఘటనలతో జూలై 22 వరకూ గణాంకాల ప్రకారం గూగుల్ అన్వేషణలో రాధికా ఆప్తే రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే త్వరలో సూపర్స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నారు. ఆ తరువాత రాధికా ఆప్తే హల్చల్ ఏ లెవల్ల్లో ఉంటుందో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
రాధిక ఆప్తే.. ఆగదు!
రాధిక ఆపితే ఆగదు. నడిచిన బాట మరోసారి తొక్కాలనుకోదు. ఎక్కిన మెట్టు మళ్లీ ఎక్కాలనుకోదు. కనిన కలను మళ్లీ చూడాలనుకోదు. రాతి మీద గీతలు శాసనం అనుకోదు. ఈ అహల్య బెల్లం కొట్టిన రాయిలా... మిగలాలనుకోలేదు. నథింగ్ సర్ప్రైజెస్ హర్. నథింగ్ స్టాప్స్ హర్. రజనీకాంత్తో నెక్స్ట్సినిమా. అయినా బుల్లితెరపై ప్రయోగాలు ఆగలేదు. క్రాస్ ఓవర్ సినిమాకు సంకెళ్లు వేయలేదు. ఔను..! రాధిక ఆప్తే ఆగదు. చిన్నప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ ‘ద రోడ్ లెస్ ట్రావెల్డ్’ ఒంటబట్టిందేమో. రాధిక ఈజ్ ర్యాడికల్. పంజరమనుకున్న సినిమాను ఆకాశమంత రంగస్థలంగా... మలచుకున్న రెక్కల కళ. ట్రింగ్... ట్రింగ్... కాలింగ్ బెల్ అసహనంగా మోగింది. తలుపు తీసిన అందమైన అమ్మాయిని చూసి, ఇన్స్పెక్టర్ ఇంద్రసేన్ (తోతా రాయ్ చౌధురి) ఆశ్చర్యపోయాడు. పొట్టి దుస్తుల్లో ఆ అమ్మాయి అందం... అతనికి పిచ్చెక్కిస్తోంది. ఏడుపదులు పైబడిన చిత్రకారుడు గౌతమ్ సాధు (సౌమిత్ర ఛటర్జీ)కి ఆమె కూతురనుకున్నాడు. తీరా... ఆమె తన భార్యన్నాడు గౌతమ్. మిస్సింగ్ కేస్ మిస్టరీని ఛేదించడానికొచ్చిన ఇన్స్పెక్టర్ను కెపైక్కించే చూపుల్తో మాటల్తో పడగొట్టిందా అమ్మాయి అహల్య. ఆ తర్వాత? షార్ట్ఫిల్మ్ ‘అహల్య’ చూసి తెలుసుకోవాల్సిన సస్పెన్స్. పదిహేను రోజుల్లో ‘యూ’ట్యూబ్లో ఇప్పటిదాకా 44 లక్షలమంది పైనే చూసిన థ్రిల్లర్ ‘అహల్య’. రామాయణంలోని అహల్య పాత్రను కొత్త కోణంలో చూపెడుతూ అనురాగ్ కశ్యప్ తీసిన 14 నిమిషాల బెంగాలీ షార్ట్ఫిల్మ్. ఇప్పుడీ ఫిల్మే కాదు, అహల్య... రాధికా ఆప్తే కూడా ఫేమస్. తార కాదు... నటి! రాధికా ఆప్తే... బడా స్టార్ కాదు. బడా బడా ఖాన్దాన్ల నుంచి వారసత్వమూ లేదు. రికార్డు వసూల్ చిత్రాలతో బాక్సాఫీస్కు జాన్జిగిరీ అంత కన్నా కాదు. చేసిన సినిమాలూ కొన్నే. అయినా సరే ఇటు జనం, అటు సినీ జనం ఆమె గురించి చెప్పుకుంటున్నారు. ‘అహల్య’ పుణ్యం కొంత... నెట్లోకొచ్చిన న్యూడ్ ఫొటోలు, దృశ్యాల ప్రభావం ఇంకొంత... తాజాగా రజనీకాంత్ సరసన ఛాన్స్ మరికొంత... రాధిక ఇప్పుడు వీస్తున్న గాలి. ఎవరూ నడవని దారుల్లో నడవడం ఆమె స్పెషాలిటీ. ‘అహల్య’తో ఇంత పేరొచ్చిన ఆమె, ‘‘నైతికంగా స్పష్టత లేని పాత్రలు పోషించడం నాకు ఈజీ’’ అంటారు. ఉంటే పూర్తిగా మంచిగానో, కాకుంటే పూర్తిగా విలనీతోనో ఒకే కోణంలో సాగిపోయే, కీలుబొమ్మ పాత్రలు చేయడం ఆమెకసలు ఇష్టం లేని పని. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలంటే పారిపోతారు. అదే - రియలిస్టిక్ పాత్రలు... లేయర్లు, లేయర్లుగా సాగే క్యారెక్టరైజేషన్... ఛాలెంజింగ్ సీన్లు అంటే నల్లేరు మీద బండి నడకలా నటించేస్తారు! ఆరు భాషల అభినేత్రి బాలీవుడ్ ఆడియన్స్కు ఇప్పుడిప్పుడే సుపరిచితమవుతున్న రాధిక ఫిల్మ్మేకర్స్కు మాత్రం చాలాకాలంగా తెలుసు. సన్నివేశాన్ని పండించే టాలెంట్ ఆమె సొంతమనీ తెలుసు. నిజానికి, సినిమాల్లోకి రాధిక వచ్చి పదేళ్ళయింది. రంగస్థలంపై ప్రయోగాత్మక నాటకాలు వేస్తూ, సినిమాల్లోకి వచ్చిన అనుభవం ఆమెది. పుణేలోని అగ్రశ్రేణి న్యూరోసర్జన్ కుమార్తె. చదివింది పేరున్న ఫెర్గూసన్ కాలేజ్లో ఎకనామిక్స్. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పట్ల ప్రేమతో ‘ఆసక్త’ అనే థియేటర్ గ్రూప్తో కలిశారు. అక్కడ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ. ‘వాహ్ లైఫ్ హోతో ఐసీ’ (2005) ఆమె తొలి చిత్రం. అయితే, రాధిక హిందీకే పరిమితం కాలేదు. హిందీతో పాటు బెంగాలీ (‘అంతహీన్’), మరాఠీ (అమోల్ పాలేకర్ ‘సమాంతర్’), తమిళం (ప్రకాశ్రాజ్ ‘ధోనీ’), తెలుగు (‘రక్తచరిత్ర’, బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’), మలయాళం (‘హరమ్’) - ఇలా ఆరు భాషల్లో నటిస్తున్నారు. ఇవి కాక విభిన్న తరహా సినిమాలు. చాలామంది తటపటాయించే ‘బోల్డ్’ సన్నివేశాలంటే ఇవాళ ఠక్కున గుర్తొచ్చే పేరు రాధికా ఆప్తే. కలిసొచ్చిన ఏడాది రాధికకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. హిందీ ‘బద్లాపూర్’లో చేసింది చిన్న పాత్రే. కానీ, బోలెడన్ని ప్రశంసలు వచ్చాయి. ఆ వెంటనే ‘పెద్దలకు మాత్రమే’ తరహా కామెడీ అనిపించే ‘హంటర్’్రలో పక్కింటి అమ్మాయిలా అనిపించే పాత్ర. అదీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు దేశమంతటినీ తన అందంతో వలలో వేసుకున్న ‘అహల్య’ షార్ట్ఫిల్మ్. ఈ నెలలోనే రానున్న కేతన్ మెహతా సినిమా ‘మాంఝీ - ది మౌంటెన్ మ్యాన్’. ఆ వెంటనే రజనీకాంత్ సినిమా షూటింగ్. వెరసి, రాధికకిది డ్రీమ్న్.్ర ఏ తెర అయినా... ఏ ఛాలెంజ్ అయినా... సినిమాల్లో ఇలాంటి క్రేజీ చాన్స్లున్నప్పుడు టీవీలో ఎవరైనా చేస్తారా? ఎవరి సంగతి ఏమో కానీ, రాధిక చేశారు. రవీంద్రనాథ్ టాగోర్ కథల ఆధారంగా అనురాగ్ బసు రూపొందిస్తున్న ‘స్టోరీస్ బై రవీంద్రనాథ్ టాగోర్’ టెలీసిరీస్లో ఆమె భాగమయ్యారు. బెంగాలీ సాహిత్యంలో ప్రసిద్ధమైన ‘చోఖెర్ బాలీ’లో వితంతువు వినోదిని పాత్ర ధరించారు. రాధిక పవర్ఫుల్ పెర్ఫార్మరని అనురాగ్ బసుకు తెలుసు. అందుకే, ప్రిపరేషనేమీ లేకుండా, రాధిక అప్పటికప్పుడు స్క్రిప్ట్ చూసుకొని నటిస్తుంటే, కెమెరాలో బంధించాలని అనురాగ్ అనుకున్నారు. అంతే! షూటింగ్కు ముందు రాధిక మొత్తం కథ కూడా చదువుకోలేదు. షూటింగ్ రోజున ఆమెకు సీన్ పేపర్లిచ్చారు. అప్పటికప్పుడు ఆమె నటించేశారు. అనురాగ్కు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చింది. చూసినవాళ్ళకి రాధిక నటన నచ్చింది. డిఫరెంట్ సినిమాలకు డార్లింగ్ వెండితెర మీదా ప్రయోగాలకు రాధిక సదా సిద్ధం. గుజరాత్లోని నలుగురు సామాన్య మహిళల చుట్టూ నడిచే ఇంగ్లీష్ సినిమా ‘పార్చ్డ్’లో ఆమెదీ ఓ ముఖ్యపాత్ర. ఈ ‘భారత- అమెరికా’ ప్రొడక్షన్ రానున్న టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకోనుంది. అలాగే, రానున్న హిందీ సినిమా ‘కౌన్ కిత్నే పానీ మే’ కూడా డిఫరెంట్ ఫిల్మే! రాజస్థాన్లోని గ్రామ ప్రజలు నీటికొరతతో ఎదుర్కొనే కష్టాల చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది. ఇక, ఇండో -బ్రిటీష్ కోప్రొడక్షన్ ‘బొంబయిరియా’లో రాధికది సినిమా పబ్లిసిటీ ఆఫీసర్ పాత్ర. ‘‘పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ సినిమాల్లో ఎక్కువగా నటించాల’’ని ఆమె భావన. మరి మాస్ సినిమాలెందుకు చేస్తున్నారంటే, ‘‘వాటి వల్ల నటిగా కమర్షియల్ వ్యాల్యూ వస్తుంది. దాంతో, మనం ప్రత్యామ్నాయ సినిమాల్లో నటించిప్పుడు అవి ఎక్కువ మందికి చేరతాయి’’ అని లాజిక్ చెబుతారు. ఎక్కడైనా, ఎప్పుడైనా... బ్రేక్ ది రూల్స్! అందుకే, రాధికా ఆప్తే డిఫరెంట్. ప్రేమ, పెళ్ళి సంగతులు దాచేసే సగటు సినిమా హీరోయిన్స్ కన్నా చాలా డిఫరెంట్. ఇరవై ఏడేళ్ళు నిండీ నిండకుండానే, బెనెడిక్ట్ టేలర్ అనే బ్రిటిష్ సంగీత కళాకారుణ్ణి ఆమె పెళ్ళి చేసుకున్నారు. చాలాకాలం సహజీవనం చేసి, ఆనక పెళ్ళిగా పరిణమించిన వాళ్ళ ప్రేమకథ ఒక పన్నెండు రీళ్ళ, అదేనండీ పన్నెండునెలల సిన్మా. సమకాలీన నృత్యం నేర్చుకోవడం కోసం నటనకు కామా పెట్టి, లండన్లో గడిపిన ఏడాది కాలంలోనే రాధికకూ, టేలర్కూ పరిచయం. ఆ పరిచయం స్నేహంగా... స్నేహం ప్రేమగా... ప్రేమ పెళ్ళిగా చకచకా మారింది. టేలర్ తన మ్యూజికల్ ఎసైన్మెంట్స్ పని మీద దేశదేశాలు తిరుగుతుంటారు. రంగస్థలంతో పాటు ఆరు భాషల సినిమాల్లో నటిస్తూ రాధిక దేశమంతటా తిరుగుతుంటారు. ఎవరికి కాస్తంత ఖాళీ దొరికినా, రెండోవాళ్ళ దగ్గరకు వెళతారు. కలసి జీవితం కలబోసుకుంటారు. పెళ్ళి తరువాత రాధిక మునుపటి కన్నా బిజీ బిజీ. కెరీర్పై మరింత ఉత్సాహంగా దృష్టి పెడుతున్నారు. ఫోకస్ పెరిగింది. దూకుడు పెంచారు. సినిమాలూ పెరిగాయి. హీరోయిన్లు అంటే... పెళ్ళి కాని నటీమణులే అయ్యుండాలన్న ఫిల్మ్ ఇండస్ట్రీలోని ‘అన్రిటెన్ రూల్’ను బ్రేక్ చేశారు. ఇప్పుడు సాక్షాత్తూ రజనీకాంత్తో జోడీ కడుతున్నారు. ఆమె ఒక పక్క సినిమాలు చేస్తారు... మరోపక్క నాటకాలు వేస్తారు... ఇంకోపక్క మనసుకు నచ్చితే షార్ట్ ఫిల్మ్స్లోనూ చేస్తారు. వెరసి ఆమె తన మనసుకు నచ్చింది చేస్తారు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. జీవితంలోనూ, కెరీర్లోనూ ర్యాడికల్ రాధిక అనిపించుకున్నారు. అందుకే, మరో నెలరోజుల్లో 30 ఏళ్ళు నిండనున్న రాధికా ఆప్తే ఇండియన్ స్క్రీన్పై మరో బ్యూటీ విత్ బ్రెయిన్స్. దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నట్లు, ‘‘మనకున్న నటీమణుల్లో ఆమె అత్యంత ధైర్యవంతురాలు. ఫార్వర్డ్ థింకింగ్!’’ దటీజ్ వై పీపుల్ లుక్ ఫార్వర్డ్ టు రాధికా ఆప్టే అండ్ హర్ యాక్టింగ్!! బ్రేవో రాధిక... బ్రేవో!! - రెంటాల జయదేవ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కొద్ది నెలలుగా రాధికా ఆప్తే మీద వచ్చినన్ని వార్తలు, వివాదాలు మరొకరి మీద రాలేదేమో! మొన్న ఫిబ్రవరిలో రాధికా ఆప్టే బొమ్మలంటూ ఆన్లైన్లో కొన్ని నగ్నచిత్రాలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. అది సద్దుమణగక ముందే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో భాగంగా అనురాగ్ కశ్యప్ తీసిన ఫిల్మ్ నుంచి ఆమె నగ్నదృశ్యాలు లీకయ్యాయి. వాట్సప్లో, నెట్లో అవి వైరల్. ఆ సంగతి మర్చిపోక ముందే ‘కహానీ’ (శేఖర్ కమ్ముల ‘అనామిక’కు మాతృక) చిత్రఫేమ్ సుజయ్ ఘోష్ షార్ట్ఫిల్మ్ ‘అహల్య’ నెటిజన్లకు మరో హాట్ హాట్ విజువల్ ఫీస్ట్! సాక్షాత్తూ అమితాబ్ కూడా బాగుందన్నారు. బాగుందన్నా, బాగా లేదన్నా రాధిక దారి రాధికదే! దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. ‘ఎవరి ఫొటోలో పట్టుకొచ్చి, అవి నా ఫోటోలంటే ఎలా?’ అని నెట్లో న్యూడ్ఫొటోల గురించి అంటారు. లీకైన అర్ధనగ్న సన్నివేశాల మాటేమిటంటే, ఫిల్మ్ రిలీజయ్యాక చూస్తే ఆ సీన్స సందర్భం అర్థమవుతుందంటారు. రిలీజ్ కాగానే, తానే మాట్లాడతానంటారు. మాట్లాడాల్సిందీ చాలా ఉందంటారు. సినీ పరిశ్రమలో ఆడవాళ్ళను సరిగ్గా ట్రీట్ చేయరనీ, తెలుగు నిర్మాతలు ప్రొఫెషనల్ కారనీ రాధిక ఈ మధ్యే చేసిన వ్యాఖ్య అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్. -
రజనీతో రాధికా ఆప్టే ...కన్ఫర్మ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమాలో కథానాయిక ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. ముందుగా బాలీవుడ్ కథానాయికలు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, విద్యాబాలన్లు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రాధికా ఆప్టే పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. అలాంటిదేమీ లేదని ఆమె వివరణ కూడా ఇచ్చారు. కానీ, తీరా ఇప్పుడు రాధికా ఆప్టే పేరే కన్ఫర్మ్ అయింది. ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ చిత్రాలను తెరకెక్కించిన రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇందులో గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్స్టర్ పక్కన ఆడిపాడే చిన్నది రాధికా ఆప్టే అని చిత్రబృందం నుంచి అధికారికంగా కబురు వచ్చింది. రజనీ కాంత్ లాంటి స్టార్ సరసన న టించే అవకాశం రావడంతో రాధిక ఆనందానికి అవధుల్లేవు. ‘‘ఈ ఎగ్జయిట్మెంట్ను కంట్రోల్ చేసుకోవాలంటే కొంత సమయం కావాల్సిందే. నా దృష్టిలో ఆయన కన్నా పెద్ద స్టార్ ఎవరూ ఉండరు. రంజిత్ చెప్పిన కథ నచ్చింది. కథతో పాటు నా పాత్ర చిత్రణ కూడా కీలకం. అంతా బాగానే ఉంది గానీ తమిళం నేర్చుకోవడం, మాట్లాడటం నాకు పెద్ద సవాల్. కేవలం డాన్స్లు, పాటలకే పరిమితం కాకుండా దర్శకుడు విభిన్నంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నా’’ అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. ‘కాళీ’ అనే టైటిల్తో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 21న చెన్నైలో జరగనుంది. -
షార్ట్ ఫిల్మ్లో తాప్సీ!
కథానాయికలు లఘు చిత్రాల్లోనటించడం అనేది ఇప్పుడో ట్రెండ్ అయిపోయేటట్టు కనిపిస్తోంది. ఇటీవలే రాధికా ఆప్టే ‘అహల్య’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ లఘు చిత్రం యూ ట్యూబ్లో భారీ హిట్లు సాధించి, సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ జాబితాలో తాప్సీ కూడా చేరనున్నారు. ఆమె ఓ హిందీ లఘు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ‘పాన్సింగ్ తోమర్’, ‘బుల్లెట్ రాజా’ చిత్రాల దర్శకుడు తిగ్మాంషు దూలియా ఇటీవల ఆమెను కలిసి, ఓ లఘు ప్రేమకథా చిత్రంలో నటించమని అడిగారు. ఈ కథ నచ్చి. తాప్సీ నటించడానికి అంగీకరించారు. దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘తిగ్మాంషుతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అందుకే ఆయన ఈ లఘు చిత్రకథ గురించి చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. కథ కూడా చాలా బాగుంది’’ అని తెలిపారు. ముంబయ్ పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ లఘు చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరపనున్నారు. -
అహల్య పాత్రలో రాధికా ఆప్తే
నటి రాధికా ఆప్తే ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సమీప కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పించి ఆ పరిశ్రమ ఆగ్రహానికి గురైన ఈ అమ్మడి బాత్రూమ్ దృశ్యాలు ఇటీవల ఇంటర్నెట్లో హల్చల్ చేయడం ద్వారా కలకలం పుట్టించాయి. ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో హీరోయిన్ ఈ గడసరినేననే ప్రచారం జరుగుతోంది. ఇలా తరచూ వార్తల్లో ఎక్కుతున్న రాధికా ఆప్తే ఇప్పుడు హిందీలో కహాని దర్శకుడు సుజయ్ ఘోష్ తాజా చిత్రంలో నటిస్తోంది. ఇది రామాయణ కథను సోషలైజ్ చేసి రూపొంది స్తున్న చిత్రం అని సమాచారం. ఇందులో రాధికా ఆప్తే, గౌతమ్ మహర్షి పత్ని అహల్య పాత్రలో నటిస్తున్నారట. యుక్త వయసులో ఉన్న అహల్యను ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు మోహించడం, ఆమెను పొందాలని ప్రయత్నించడం అది గ్రహించిన గౌతమ్ మహర్సి అహల్యను శపించడం వంటి సన్నివేశాలను సోషలైజ్ చేసి చిత్రీకరించడంతో అహల్య పాత్రలో నటి రాధిక ఆప్తే అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారట. ఆ సన్నివేశాలను దర్శకుడు ఇటీవల యూ ట్యూబ్లో విడుదల చేసి పెద్ద వివాదానికి తెర లేపారు. కమర్షియల్ టచ్తో శృంగార భరితంగా నటించిన రాధికాఆప్తే విమ అందరి విమర్శలను ఎదుర్కొంటున్నారు. చిత్రం విడుదల తరువాత ఈ భామ మరెన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో వేచి చూడాల్సిందే. -
బాలీవుడ్పై భగ్గుమన్న రాధికా ఆప్టే
వరుసపెట్టి క్వీన్, పికు, తను వెడ్స్ మను రిటర్న్స్.. ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అన్నీ బంపర్ హిట్లు అవుతున్నా, 'అహల్య' లాంటి షార్ట్ ఫిలింలకు కూడా భారీ ఎత్తున హిట్లు వస్తున్నా.. ఇప్పటికీ హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం తక్కువగానే ఉంటోందని హీరోయిన్ రాధికా ఆప్టే భగ్గుమంది. బద్లాపూర్, హంటర్ లాంటి సినిమాల్లో టాప్ పాత్రలు పోషించడంతో పాటు.. ఇటీవలే అహల్య అనే షార్ట్ ఫిలింలో కూడా రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. అందులో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినా పరిశ్రమలో మాత్రం హీరోయిన్లను చిన్నచూపు చూస్తున్నారని, వారికి హీరోల కంటే తక్కువ పారితోషికం ఇస్తున్నారని రాధికా ఆప్టే చెప్పింది. ఇది ఒక్క సినీపరిశ్రమలోనే కాదని, అన్నిచోట్లా ఇలాగే ఉందని వాపోయింది. సినిమాలు కేవలం మగవాళ్ల వల్లే పూర్తికావని, వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వందకోట్ల మార్కు అందుకున్నాయని, ఈ మార్పు పారితోషికాల్లో కూడా ఉండాలని తెలిపింది. హీరో హీరోయిన్లే కాక.. క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో కూడా ఈ వివక్ష కనపడుతోందంది. -
'అహల్య' అద్భుతం: అమితాబ్
దర్శకుడు సుజోయ్ ఘోష్ తీసిన 'అహల్య' షార్ట్ ఫిలింపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ షార్ట్ ఫిలింలో సౌమిత్ర చటర్జీ, రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. 14 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం.. పురాణాల్లోని అహల్య పాత్ర ఆధారంగా తీసినదే. 'షార్ట్ ఫిలింల మ్యాజిక్ అంటే ఇదే.. సుజోయ్ ఘోష్ అద్భుతం' అని అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతోపాటు షార్ట్ ఫిలిం లింకు కూడా షేర్ చేశారు. దాంతో సంబరపడిపోయిన సుజోయ్ ఘోష్.. 'ఐ లవ్యూ సర్' అంటూ సమాధానం ఇచ్చాడు. T 1939 - https://t.co/Vf3X5ODTMW ... the magic of short films .. Sujoy Ghosh .. brilliant !! — Amitabh Bachchan (@SrBachchan) July 23, 2015 -
అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!
నవాజుద్దీన్ సిద్దిఖీ...వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రనైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేస్తారని విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి నవాజ్ ఇటీవల ఓ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట. నవాజుద్దీన్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న చిత్రం ‘మాంఝీ’. తన భార్యలాగే ఇంకెవరూ చనిపోకూడదన్న కారణంతో కేవలం ఓ సుత్తితో 22 ఏళ్ల పాటు కొండను తవ్వి రోడ్డును నిర్మించిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రొమాన్స్కు చాలా ప్రాధాన్యం ఉందట. దర్శకుడు కేతన్ మెహతా ఈ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయానికి నవాజ్ చాలా సెలైంట్ అయిపోయేవారట. ఈ విషయమై రాధికా ఆప్టే మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాకు దూరంగా ఒంటరిగా కూర్చునేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటివరకూ బాగానే ఉన్నారు. సడన్గా ఏమైందా...? అని. నాకేమో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా లేదా అని భయం. కానీ యాక్షన్ చెప్పగానే సీన్లో లీనమైపోయేవారు’’ అని చెప్పారు. -
రాధిక ఆప్తేకు గోల్డెన్ చాన్స్
అదృష్టం ఎప్పుడు? ఎలా? వరిస్తుందో ఎవరికి తెలియదు.అలాంటి అదృష్టం ఇప్పుడు నటి రాధిక ఆప్తే తలుపు తట్టింది. ఆమె పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల అశ్లీల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమై కలకలం సృష్టించిన నటి రాధిక ఆప్తే. అలాగే అర్ధనగ్న దృశ్యాలతో ఇంటర్నెట్లో హల్చల్ చేసిన ఈ ఉత్తరాది భామను కోలీవుడ్కు పరిచయం చేసిన క్రెడిట్ నటుడు ప్రకాష్రాజ్కి దక్కుతుంది. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించి నాయకుడిగా నటించిన ధోనీ చిత్రంలో రాధిక ఆప్తే కీలక పాత్ర పోషించారు.ఆ తరువాత అళగురాజా, వెట్రిసెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ బ్యూటీకి టాలీవుడ్ గుర్తించింది. అక్కడ ఏకంగా బిగ్ స్టార్ బాలక్రిష్ణతో లెజెండ్ చిత్రంలో రొమాన్స్ చేశారు. అయితే అక్కడ హీరోల ఆధిక్యం అధికం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అక్కడి వారి ఆగ్రహానికి గురైంది. అలాంటి నటికి కోలీవుడ్లో గోల్డెన్చాన్స్ దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారర . ఇంతకీ అదేమిటో చెప్పలేదు కదూ’సూపర్స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో హీరోయిన్ రాధిక ఆప్తేనేనట. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్గా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసమే రజనీ గడ్డం, మీసం పెంచుతున్నారు. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం చాలా మంది నటీమణుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలిసింది. చివరకు దర్శకుడు రంజిత్కు నటి రాధిక ఆప్తే సూటబుల్ అనిపించడంతో ఆమెతో సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడు అడిగిన కాల్షీట్స్ రెడీగా ఉండడంతో రాధికఆప్తే కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. చిత్ర షూటింగ్ ఆగస్ట్లో మలేషియాలో ప్రారంభం కానుంది. -
వేడెక్కించే... షార్ట్ఫిల్మ్లో రాధికా ఆప్టే
పోలీస్ ఆఫీసర్ ఏదో పని మీద ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఓ అందమైన అమ్మాయి తలుపు తీసింది. క్షణం పాటు అతనికి ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలాయనతో మాట్లాడుతున్నాడు. అతను అక్కడ ఉన్నంతసేపు ఆమె తన చిలిపి చేష్టలతో కవ్విస్తూనే ఉంది. హఠాత్తుగా ఆ పోలీస్ను కౌగిలించుకోవడానికి సిద్ధపడుతోంది... ఈ దృశ్యాలన్నీ ‘అహల్య’ అనే బెంగాలీ లఘు చిత్రం ట్రైలర్లోవి. ఆ అందమైన యువతిగా నటించిన కథానాయిక - రాధికా ఆప్టే. ‘ధోని’,‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాధికా ఆప్టే ఇందులో చాలా సై్పసీగా నటించారు. విద్యాబాలన్తో ‘కహానీ’ చిత్రం తెరకెక్కించి అందరి ప్రశంసలూ అందుకున్న సుజయ్ ఘోష్ ఈ లఘు చిత్రానికి దర్శకుడు. మరి ఇలా విచిత్రంగా అంతుచిక్కని ప్రశ్నలా కనపడుతున్న ‘అహల్య’ ఎవరో ఏంటో... తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే! -
టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్
నటి రాధిక ఆప్తే గుర్తుందా? తమిళంలో ధోని, అళగురాజా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో కథానాయికిగా చేసింది. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ కథానాయకులు, దర్శకనిర్మాతలపై విరుచుకు పడుతోంది. ఈ మధ్య తన అశ్లీల దృశ్యాలు వెబ్సైట్స్, వాట్సాప్లలో హల్చల్ చేయడంతో కంగుతిన్న రాధిక ఆప్తే ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరిపై ఏం అనుమానం ఉందో తెలియదు గానీ ఈ బదలాపూర్ అమ్మడు టాలీవుడ్ సినీ వర్గాలపై రుసరుసలాడుతోంది. అక్కడి కొందరు దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవమే లేదంటూ దుమ్మెత్తి పోస్తోంది. కథానాయకుల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే టాలీవుడ్లో పలు అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తున్నట్లు తెలిపింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి అక్కడంత సీన్ ఏమీలేదు. ఆమె ఫైర్ అవ్వడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉంటుందనే భావన వినిపిస్తోంది. కోలీవుడ్లోనూ అవకాశాలు లేని రాధిక ఆప్తే ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్పై సారిస్తోంది.అన్నట్టు ఈ భామ ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోందన్నది గమనార్హం. -
ఆయనతో హిమాలయాలకు..!
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టేకు తెలుగు నాట మంచి హోమ్లీ ఇమేజ్ ఉంది. కానీ, బాలీవుడ్లో ఆమెకు దీనికి పూర్తి భిన్నమైన ఇమేజ్ ఉంది. ‘బద్లాపూర్’ చిత్రంలో అర్ధనగ్నంగా నటించి, ‘రాధికా ఇలా కూడా నటిస్తుందా?’ అని చాలామంది అనుకునేలా చేశారామె. ఆ తర్వాత ఓ డాక్యుమెంటరీ మూవీలో నగ్నంగా నటించి, షాకిచ్చారు. ఈ అర్ధనగ్న, నగ్న దృశ్యాల ద్వారా రాధిక ఈ మధ్య వార్తల్లో నిలిచారు. ఎక్కడికెళ్లినా ఆమెను వీటి గురించే అడుగుతున్నారు. ఈ తతంగంతో రాధికా విసిగిపోయారట. దాంతో కొంచెం సేద తీరాలనుకున్నారో ఏమో... ఆయనగారితో హిమాలయాలకు చెక్కేశారు. ఆయనగారు ఎవరు? అని ఊహల్లోకి వెళ్లకండి. ఆయన స్వయంగా రాధికా భర్తే. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు రాధిక. అడపా దడపా ఆయన రాధిక నటించే చిత్రాల లొకేషన్స్లోనూ కనిపిస్తుంటారు. ఆ సంగతలా ఉంచితే.. ‘‘మంచు కొండలకు వెళ్లడం భలే ఆనందంగా ఉంది. కొండలంటే నాకు చాలా ఇష్టమండీ బాబూ’’ అంటున్నారు రాధికా ఆప్టే. -
చీకటి కోణాలు
బాలకృష్ణతో కలిసి తాజా ‘లయన్’లో నటించిన రాధికా ఆప్టే మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. రుద్రన్ దర్శకత్వంలో అజ్మల్, రాధికా ఆప్టే జంటగా తమిళంలో నటించిన చిత్రం ‘వెట్రి సెల్వన్’. శ్రీనివాస దామర ఈ చిత్రాన్ని ‘టుడే’గా తెలుగులో అందించనున్నారు. వైద్య రంగంలో ఉన్న సమస్యలు, కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న అన్యాయాలను విశ్లేషిస్తూ, అక్కడి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొచ్చే చిత్రం ఇదని నిర్మాత చెప్పారు. -
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'
ముంబై: దక్షిణాది నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో ఆదివారం నుంచి వాట్సప్ లో చక్కర్లుకొడుతుండటంతో దర్శకుడు ముంబాయి పోలీసులని ఆశ్రయించారు. ఈ వీడియో క్లిప్లు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్లోవి. తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ధోని చిత్రం ద్వారా ప్రకాష్రాజ్కు జంటగా కోలీవుడ్కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్చిత్రంలో హీరోయిన్గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటించింది. కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం. -
'లయన్' న్యూ స్టిల్స్
-
అదే సెంటిమెంట్
నందమూరి బాలకృష్ణ ‘లయన్’గా గర్జించడానికి సిద్ధమవుతున్నారు. శక్తిమంతమైన పాత్రలో ఆయన నటిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవా దర్శకునిగా పరిచయమవుతున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తయిన ఈ సినిమా పాటలను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్ర ఆడియోను హైదరాబాద్లో భారీ ఎత్తున జరపనున్న వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కెరీర్లో ఘనవిజయాలైన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ పాటల వేడుకల్లోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోనే పాల్గొనడాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: రుద్రపాటి ప్రేమలత. -
సెక్స్ ‘హంటర్’!
శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హిట్ మూవీ ‘బదలాపూర్’లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే... తన ‘బోల్డ్’నెస్ను మరోసారి చాటింది. రీసెంట్గా రిలీజైన ‘హంటర్’ సినిమాలో అమ్మడు మరింత రెచ్చిపోయిందట. అంతే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్మైండెడ్గా మాట్లాడేస్తోంది. ఓ మరాఠీ డైలీతో మాట్లాడుతూ... అసలు తన దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతేనని తెగేసి చెప్పింది. ‘సెక్స్ గురించి ఓపెన్గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది’ అంటూ గటగటా చెప్పేసిందీ ఈ చిన్నది! -
హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా రాధికా ఆప్టే
సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో తారల నగ్నంగా నటించడం పరిపాటే. అయితే, తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్రాజ్కు జంటగా కోలీవుడ్కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది. ఆ మధ్య బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్చిత్రంలో హీరోయిన్గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు. అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు. అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం. -
ఆ ఫొటోలు నావి కావు!
రాధికా ఆప్టే... తెలుగు సినిమాల్లో చేస్తున్న తెలుగు తెలియని మరాఠీ నటి... రంగస్థలం నుంచి కళాత్మక సినిమా మీదుగా, కమర్షియల్ సినిమాలోనూ చకచకా అడుగులు వేస్తున్న నవతరం నాయిక. మొన్న రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘రక్తచరిత్ర’... నిన్న బాలకృష్ణ సరసన ‘లెజెండ్’... ప్రస్తుతం మళ్ళీ బాలకృష్ణ పక్కనే త్వరలో జనం ముందుకు రానున్న ‘లయన్’. ఇటీవలే వచ్చిన హిందీ చిత్రం ‘బద్లాపూర్’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారామె. మరాఠీ, హిందీ, తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూ పుణే, బొంబాయి, హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతున్న 29 ఏళ్ళ ఈ కథా నాయికతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ... తెలుగు సినిమాల్లో నటించడం ఎలా ఉంది? మొన్న మొన్నటి వరకు నాకు హిందీ, మరాఠీ చిత్రాలతో, కొద్దిగా తమిళ చిత్రాలతో పరిచయం. కానీ, ‘రక్తచరిత్ర’ దగ్గర నుంచి అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించడం నాకు ఒక కొత్త అనుభవం. హిందీ, మరాఠీ సినిమాలతో పోలిస్తే, తెలుగు చిత్రాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి భాష, సంస్కృతి వేరు. అంతేకాకుండా, తెలుగులో నేను నటించిన ‘లెజండ్’, తాజా ‘లయన్’ లాంటివి ప్రధానంగా భారీ బడ్జెట్ చిత్రాలు. నేనేమో ఎక్కువగా సమాంతర చిత్రాలలో నటిస్తుంటా. కాబట్టి, కొత్త సంగతులు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇక్కడ పాత్రలను ఎలా తీర్చిదిద్దుతారు, ఈ సంస్కృతిలో ఏవి పాపులర్, ఏవి పాపులర్ కావు అని తెలుసుకుంటున్నా. పైగా, రంగస్థలం నుంచి వచ్చిన నటిగా సంస్కృతి అనేది సినిమానూ, సినిమా అనేది మన సంస్కృతినీ ఎంతగా ప్రభావితం చేస్తుందనేది అధ్యయనం చేయడానికి కూడా ఇది ఉపకరిస్తోంది. అసలింతకీ మీకు తెలుగులో తొలి అవకాశం ఎలా వచ్చింది? నిజానికి, మాది సినిమాలతో సంబంధం లేని కుటుంబం. మా నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు... మహారాష్ట్ర అంతటా పేరున్న న్యూరోసర్జన్. మా అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న ఎనస్థీషియన్. నేను, ఇద్దరు తమ్ముళ్ళు - మొత్తం ముగ్గురం. లండన్లో నృత్యం కూడా నేర్చుకున్న నేను రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ వెళ్ళాను. నా సినిమాలు చూసి, దర్శకుడు రామ్గోపాల్వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన నన్ను ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్కు పిలిచారు. అక్కడ ఎంపికవడంతో, తెలుగులోకి వచ్చా. ‘రంగీలా’, ‘సత్య’ లాంటి హిందీ చిత్రాల వల్ల ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం. ముఠా కక్షల నేపథ్యంలోని ‘రక్త చరిత్ర’ నిజజీవిత వ్యక్తులు, ఘటనల ఆధారంగా తీసిన సినిమా కదా! మరి, మీకు ఏ విధమైన బెదిరింపులూ....! (చటుక్కున అందుకుంటూ...) అలాంటివేమీ నా వరకు రాలేదు. అయితే, ఆ చిత్ర కథ గురించి రామూ సార్ నాకు ముందుగానే వివరంగా చెప్పారు. మరి, హీరో బాలకృష్ణతో నటించడం ఎలా ఉంది? (మెరుస్తున్న కళ్ళతో...) ఆయనతో ఇది నా రెండో సినిమా. ‘రక్తచరిత్ర’ చూసిన ప్రకాశ్రాజ్ తమిళ - తెలుగు భాషల్లో ‘ధోనీ’ తీస్తూ నాకు అవకాశమిచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ ‘లెజెండ్’లో పాత్ర దక్కింది. ఆయన చాలా పెద్ద స్టార్. పెద్ద హీరో కుమారుడు. అయినప్పటికీ ఆయన తోటి నటీనటులతో కలసిపోయి, బాగా సహకరిస్తుంటారు. మా కాంబినేషన్లోని ‘లెజండ్’ సినిమా సూపర్హిట్టయింది. రానున్న ‘లయన్’ కూడా అంతే! ముఖ్యంగా ప్రతి డైలాగ్నూ ఎలా పలకాలో ఆయన స్పష్టంగా మనకు చెబుతారు. దీనివల్ల నేను డైలాగ్ను సరిగ్గా పలుకుతున్నా, అర్థం చేసుకుంటున్నా. మీకు తెలుగు రాదు కదా! మరి డైలాగులు చెప్పడం...? ప్రాథమికంగా నేను రంగస్థలం నుంచి వచ్చినదాన్ని కాబట్టి, నా తెలుగు డైలాగులన్నీ ముందుగానే దేవనాగరి లిపిలో రాసుకొని, కంఠస్థం చేస్తాను. వాటిని ఎలా పలకాలనే విషయంలో బాలకృష్ణ గారి సాయం చాలా ఉంది. అందుకే, వన్... టు... త్రీ... అని నంబర్లు చెబుతూ నటించడం కాకుండా, కష్టమైనా సరే ఒరిజినల్ డైలాగులు చెబుతూనే, నటిస్తున్నా. నా రంగస్థల అనుభవం కూడా అందుకు బాగా ఉపకరిస్తోంది. ఇంతకీ, ‘లయన్’లో మీ పాత్ర విశేషాలేమిటి? (నవ్వేస్తూ...) ఈ సినిమా ఒక థ్రిల్లర్, యాక్షన్ చిత్రం. అందరినీ ఆకట్టుకొనేలా ఉండే స్వీట్ అండ్ లవ్లీ పాత్ర నాది. పెపైచ్చు, కథలో కూడా కీలకమైన పాత్ర. ఊహించని మలుపులతో సాగుతుంది. అందుకే, ప్రస్తుతానికి నా పాత్ర వివరాలు సస్పెన్స్. రేపు తెర మీద చూస్తే, మీకే అర్థమవుతుంది. ప్రతి సినిమాలో ఇద్దరేసి నాయికల్లో ఒకరుగా నటిస్తున్నారే? ‘లెజండ్’లో నాకూ, మరో హీరోయిన్ సోనాలీ చౌహాన్కూ మధ్య కాంబినేషన్ సీన్లు లేవు. ‘లయన్’లో మాత్రం నేను, నటి త్రిష కలసి ఒక సీన్లో నటించాం. అలాగే, మేమిద్దరం కలసి ఒక పాటలో నర్తిస్తాం. నా పాత్రకున్న ప్రాముఖ్యం కీలకం కానీ, సినిమాలో ఇద్దరు హీరోయిన్లం ఉంటే నాకేంటి! పైగా, సెట్స్పై మాటలు కలబోసుకోవడానికి మరో నటి ఉండడం మరీ హ్యాపీ కదా! రంగస్థలం మీద మీకు చాలా అనుభవమే ఉన్నట్లుంది! ఇప్పటికి 13 - 14 ఏళ్ళుగా రంగస్థలంతో నాకు అనుబంధం. మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించా. మా ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేశా. ముఖ్యంగా ‘ఆసక్త’ అనే రంగస్థల బృందంతో ఎక్కువగా పనిచేశాను. పుణేలోని ‘బాల గంధర్వ’ లాంటి ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శనలిచ్చా. ఇప్పటికీ రంగస్థలమంటే నాకు ప్రేమ. అలాగే, సమాంతర చిత్రాల్లో నటించడం కూడా! తమిళంలో ‘ధోనీ’, ‘ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’, ‘వెట్రిసెల్వన్’, ’ఊలా’ మొదలైన సినిమాల్లో చేశా. దర్శకుడు ప్రకాశ్రాజ్తో తమిళంలో పనిచేయడం గురించి? ప్రకాశ్రాజ్ మంచి నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా. అందరూ అనుకుంటున్నట్లు ఆయన మరీ కఠినమేమీ కాదు. ఆయనతో పనిచేయడంలో చాలా ఫన్ ఉంది. కాకపోతే, ‘ధోనీ’ చిత్రాన్ని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తీయడంతో, వెంట వెంటనే రెండు భాషల్లో డైలాగులు చెబుతూ, నటించడం కొద్దిగా శ్రమ అనిపించింది. అయితేనేం, ఆయన భార్య పోనీ, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నట - దర్శకుడు అమోల్ పాలేకర్ సినిమాలో నటించిన అనుభవం మాటేమిటి? ఆయనను మంచి స్నేహితుడిగా భావిస్తా. మధ్యతరగతి మనస్తత్వాల్ని ప్రతిబింబిస్తూ ఆయన నటించిన ‘చిత్చోర్’ లాంటి అనేక సినిమాలన్నా, ఆయన అన్నా నాకు పిచ్చి ఇష్టం. రంగస్థలంపై కూడా ఆయన కృషి చాలా ఉంది. నాటకరంగంలో ఆయన మాకు ఎంతో అండగా నిలిచారు. పుణేలో రంగస్థల ఉత్సవం కూడా చేశారు. ఆయన తీసిన ‘సమాంతర్’ సినిమా నా కెరీర్లో ఒక మరపురాని అనుభవం. మీ తాజా హిందీ చిత్రం ‘బద్లాపూర్’కు మంచి పేరు వచ్చినట్లుంది! అవును. శ్రీరామ్ రాఘవన్ అద్భుతమైన దర్శకుడు. వాస్తవికతను ప్రతిబింబించేలా చాలా మంచి సినిమా తీశారు. దాదాపు రెండేళ్ళు నేను విరామం తీసుకున్న తరువాత, చేసిన ఈ సినిమా మళ్ళీ నాకు అందరిలో మళ్ళీ గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో డైలాగులు, సన్నివేశాల మీద, సెన్సార్ మీద విమర్శలూ వచ్చాయి! నేను ఆ విమర్శల్ని అంగీకరించను. అంతెందుకు! చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోకుండా, కొన్ని మాటలను సినిమా డైలాగుల్లో నుంచి నిషేధించాలంటూ ఇటీవలే కొత్త కేంద్ర సెన్సార్ బోర్డ్ చేసిన ప్రయత్నం చాలా హాస్యాస్పదం. వాళ్ళంతా పాత రాతియుగంలో ఉన్నట్లనిపిస్తోంది. మారుతున్న సమాజం, పరిస్థితుల్ని పట్టించుకోని మన సెన్సార్ వ్యవస్థ తిరోగమన దృక్పథంతో వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్భయ కేసులోని నేరస్థుడి ఇంటర్వ్యూతో వచ్చిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను ఆ డాక్యుమెంటరీ మొత్తం చూశాను. అందులో మనకు తెలియనిదీ, మన సమాజంలో లేనిదీ - ఏదీ అందులో లేదు. అన్నీ అందరికీ తెలిసినవే, చూస్తున్నవే. అయినప్పటికీ, దాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించడమెందుకో నాకు అర్థం కాదు. దేశంలో ఉన్న జనాభా సమస్య, నిరుద్యోగం, నిరక్షరాస్యత, స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం లాంటి సమస్యల పరిష్కారం ఆలోచించకుండా, వాస్తవాన్ని ఎత్తిచూపిన డాక్యుమెంటరీని నిషేధించడంలో విజ్ఞత ఏముంది! స్త్రీ పురుష అసమానత్వం సినీ రంగంలోనూ ఉందిగా! (కాస్త ఆవేశంగా) పారితోషికం, పాత్రచిత్రణ ఇలా అన్నింటిలో ఇక్కడ హీరోకు ఉన్న ప్రాధాన్యం హీరోయిన్కు ఎక్కడ ఉంటుంది! ఆ మాటకొస్తే,.. అసమానత్వం లేనిదెక్కడ! రంగస్థలం... సినిమా... చివరకు జర్నలిజమ్లో కూడా ఉంది. పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ సినిమాల్లో నేను ఎక్కువగా నటించేది అందుకే! కాకపోతే, పాటలు, ఫైట్లతో ఆడవాళ్ళను అందంగా, సంప్రదాయానికి కట్టుబడినట్లు చూపించే మాస్ సినిమాలు చేస్తే నటిగా కమర్షియల్ వ్యాల్యూ వస్తుంది. దాని వల్ల మనం ప్రత్యామ్నాయ సినిమాలు నటించినప్పుడు, అవి ఎక్కువ మందికి చేరతాయి. ఆ మధ్య మీ ఫోటోలంటూ... నగ్నంగా ఉన్న స్వీయచిత్రాలు (సెల్ఫీలు) కొన్ని నెట్లోకి వచ్చిన వివాదం గురించి...! (మధ్యలోనే అందుకుంటూ...) చూడండి. ఆ ఫోటోలు నావి అని మీరనుకుంటున్నారా? నావి కావు. ఇవాళ ఎవరి ఫోటోలైనా మార్ఫింగ్ చేసి పెట్టేస్తున్నారు. (కాస్త కోపంగా...) అయినా ఆ పెట్టినవాణ్ణి వెళ్ళి అడగండి. ఇలాంటి చౌకబారు ప్రయత్నాల గురించి పట్టించుకోకుండా వదిలేయాలే తప్ప, వాటి గురించి మాట్లాడి నా సమయం వృథా చేసుకోను. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు సున్నిత హృదయులెవరైనా బాధపడతారు కదా! అలా బాధపడడం వల్ల ఉపయోగం లేదు. అయినా, నేనే కాదు... తెలివైనవాళ్ళెవరూ అవాస్తవ ప్రచారం గురించి బాధపడరు, పడకూడదు. బ్రిటీష్ -ఇండియా కో-ప్రొడక్షన్ సినిమాలో పాత్ర మీకొచ్చినట్లుంది! అవును. పేరు - ‘బొంబేరియా’. ఏప్రిల్ నుంచి బొంబాయిలో షూటింగ్ మొదలవుతుంది. అలాగే, మరో రెండు చిత్రాలు హిందీలో ఒప్పుకున్నా. వాటి వివరాలు మార్చి చివరలో చెబుతా. మీకు పెళ్ళయిపోయిందని విన్నాం! అవును. (అప్పుడే అక్కడకు వచ్చిన భర్త బెనెడిక్ట్ టేలర్ను పరిచయం చేస్తూ...) ఈయనే! మంచి మ్యుజీషియన్, మ్యూజిక్ డెరైక్టర్ కూడా! బొంబాయిలో, ప్రధానంగా లండన్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. మా ప్రేమ, పెళ్ళి కథ చాలా పెద్దది. అది మరోసారి పాఠకులతో పంచుకుంటా! - రెంటాల జయదేవ -
హాలీవుడ్ చిత్రంలో...
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం ‘లయన్’లో నటిస్తున్నారు. మరోవైపు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న రాధికా ఆప్టేని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించింది. ఎంటీవీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పలు లఘు చిత్రాల సమాహారంతో సాగుతుంది. ఈ లఘు చిత్రాలకు అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతులు సాధించిన ఏడుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తారు. వారిలో హిందీ రంగానికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉండటం విశేషం. -
నో డేటింగ్!
రెండు రోజులు కలసి తిరిగితే చాలు... లేదంటే ఓ సినిమాలో కాస్త కెమెస్ట్రీ పండిస్తే చాలు... ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని గుసగుసలాడేస్తారేంటనేది మరాఠీ గుమ్మ రాధికా ఆప్టే ప్రశ్న. ఇంతకీ ఈ పురాణమెందుకు చెప్పిందనేగా..! ‘షోర్ ఇన్ ద సిటీ’లో తుషార్ కపూర్తో స్క్రీన్ పంచుకున్న ఈ సుందరి... అతడితో రియల్ లైఫ్ రొమాన్స్ కూడా చేసేస్తోందని మరాఠీ ఇండస్ట్రీలో టాక్. ఇదే విషయాన్ని అమ్మడిని అడిగితే... ‘నిజంగా ఇది సిల్లీ ప్రశ్న. అతడితో సినిమా తరువాత నేను నేరుగా లండన్ వెళ్లిపోయా. అసలు తుషార్ ఫోన్ నంబర్ కూడా నా దగ్గర లేదు’ అంటూ అమాయకంగా చెప్పేసింది రాధిక. -
బుల్లితెరపై బాలయ్య హీరోయిన్!
రక్తచరిత్ర, ధోనీ, లెజెండ్ సినిమాలు చూసినవాళ్లకి రాధికా ఆప్టేని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. అవ్వడానికి మహారాష్ట్ర అమ్మాయే అయినా, హిందీ సీమలో కంటే తెలుగువారికే ఎక్కువ తెలుసు రాధిక. ప్రస్తుతం బాలకృష్ణతో మరో సినిమా కూడా చేస్తోంది. అయితే జనాలు గుర్తుపట్టగలిగే పాత్రలే తప్ప, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయలేకపోయిందామె. నిరాశే చెందిందో, నటతృష్ణ తీర్చుకోవడానికి ఆరాటపడుతోందో తెలియదు కానీ... సీరియల్స్లో నటించడానికి అప్పుడే సిద్ధపడిపోయింది. బర్ఫీ, లైఫ్ ఇన్ మెట్రో లాంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు తీయనున్న ‘చోకర్బాలి’ డైలీ సోప్లో ప్రధాన పాత్రలో కనిపించనుంది రాధిక. రవీంద్రనాథ్ ఠాగూర్ రచన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సీరియల్, గతంలో సినిమాగా కూడా వచ్చింది. అందులో ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు అదే పాత్రను సీరియల్లో రాధిక చేయబోతోంది. ఆమె పాత్ర పేరు వినోదిని. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని, సమాజంలో అవమానాలు, ఇబ్బందుల పాలయ్యే పాత్ర. నటనకు బాగా ఆస్కారం ఉండటం... అనురాగ్ డెరైక్షన్లో, అది కూడా ఐశ్వర్య చేసిన పాత్రను చేసే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది రాధిక. మరి బుల్లితెర అయినా ఆమెకు తగిన గుర్తింపునిస్తుందో లేదో చూడాలి!