Rythu Bandhu Scheme
-
KTR: తప్పించుకోలేవు రేవంత్..!
-
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
రైతులకు గుడ్ న్యూస్: నేటి నుంచి రైతుబంధు జమ
నల్లగొండ టౌన్ : యాసంగి సీజన్ రైతుబంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు.. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే రూ.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నాం. – సోమగోని అంజయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
రబీ రంది తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్త రుణమాఫీపై కసరత్తు... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
రైతు బంధుపై పరిమితి పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్
-
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
‘రైతు బంధు’ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సీఈసీని కోరడం.. ఈ పథకం గురించి ప్రచార సభల్లో ఎలాంటి ప్రస్తావన చేయకూడదన్న అంశంతోపాటు పలు షరతులను విధిస్తూ సీఈసీ ఈ నెల 25న అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే పోలింగ్కు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానుందని మంత్రి హరీశ్రావు ఈ నెల 25న పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీనిని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్ను, షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి సంబంధించి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ సోమవారం ఉదయం లేఖ రాశారు. రబీ పంటల కోసం రైతుబంధు కింద గత ఐదేళ్లుగా అక్టోబర్–జనవరి మధ్యకాలంలో నగదు సాయం అందిస్తున్నారని, ఇందుకు నిర్దిష్టమైన తేదీలేమీ లేవని సీఈసీ అందులో అభిప్రాయపడింది. నవంబర్ నెలలోనే పంపిణీ చేయాలన్న ప్రాముఖ్యత ఏదీ లేదని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈసీ విధించిన షరతులివే.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతుబంధు అమలుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులను విధించింది. పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చరాదని, నగదు బదిలీపై ఎలాంటి ప్రచారం చేయవద్దని పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలెవరూ భాగస్వాములు కావొద్దని స్పష్టం చేసింది. తాజాగా బీఆర్ఎస్ సర్కారు యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 24 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 2018 నాటి షరతులకు లోబడి నగదు జమ చేస్తామని పేర్కొంది. అయితే సీఈసీ పాత షరతులకు తోడుగా మరిన్ని నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చింది. పోలింగ్కు 48గంటల ముందే నగదు జమ పూర్తికావాలని.. దీనిపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రస్తావన చేయవద్దని ఆదేశించింది. మీ వల్లే ఆగింది.. కాదు మీరే ఆపారు! ఎన్నికల ప్రచారంలో రైతుబంధు రచ్చరచ్చ జరుగుతోంది. సీఈసీ రైతుబంధును ఆపేయడానికి కారణం మీరంటే.. మీరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్నిచోట్లా ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. రైతులకు సాయం అందడం కాంగ్రెస్ పారీ్టకి ఇష్టం లేదని, ఆ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్వన్నీ అబద్ధాలని కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ముందుగానే ఆర్థికసాయం పంపిణీ చేయాలని మేం సూచించామని, కానీ బీఆర్ఎస్ కావాలని జాప్యం చేస్తూ ఎన్నికల స్టంట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పారీ్టలు రెండూ రైతులను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. -
కాంగ్రెస్కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్లీక్ తదితర స్కామ్ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
రైతుబంధుని ఈసీ నిలిపివేయడంపై కవిత అసంతృప్తి
-
రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్రావు మాటలతోనే?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడించింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్ రావు వల్లే రైతుబంధుకు బ్రేక్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇదిలాఉండగా.. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది. కాగా ప్రతీ, ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సహయాన్ని అందిస్తుంది. -
బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇచ్చింది. అయితే, గత వారం బీఆర్ఎస్ అభ్యర్థన మేరకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా, దీనిపై ఫిర్యాదులు రావడంతో రైతుబంధును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. -
రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
-
రైతుబంధుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: మంత్రి హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ అంటూ కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసిందని ఎద్దేవా చేశారు. అన్నదాతలపై కాంగ్రెస్కు కనికరం లేదు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘాటు విమర్శలు చేశారు. కాగా, మంత్రి హరీష్ రావు గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు కేవలం ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో తెలంగాణలో 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారు. రైతుబంధు అనేది కొత్త పథకం కాదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు సార్లు రైతు బంధు అందించాం. 12వ సారి ఇవ్వబోతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం అంటారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది?. రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. స్వయంగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మూడు గంటల కరెంట్ ఇస్తామన్నారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరిస్తున్నాము. ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము’అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా? -
యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్ టన్నులు. గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు? ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
TS: గుడ్న్యూస్.. నేటి నుంచే రైతుబంధు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్ సీజన్) పంటకుగానూ.. 1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్ సర్కార్ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు. రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా.. భాగంగా నేడు(జూన్ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది. ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు. ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు! -
ఇప్పటి వరకు రైతుబంధు రాలేదా?.. వారిందరికీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు.. -
10 రోజుల్లో ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
రైతుబంధు చూపి అన్నిటికీ కోత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఒక్కో రైతుకు రూ.10 వేల సాయం అందిస్తుంటే, కేంద్రం ఒక్కో రైతుకు ఎరువుల రాయితీ రూపంలో ఎకరానికి రూ.18,254 ఇస్తోందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూపి పంట నష్టానికి పరిహారం, పంటల బీమా తదితరాలన్నిటికీ కోతపెట్టిన ముఖ్యమంత్రి.. రైతులను తీవ్ర నష్టాలపాలు చేశారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్ష బాధితులకు అందని సాయం అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కానీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సాయం చేయలేదని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం ద్వారా సాయం అందుతుండగా.. తెలంగాణలో ఈ పథకం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు అప్పగించిన సీఎం.. తాను మహారాష్ట్రలోని బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్లో బిజీగా గడుపుతున్నారన్నారు కేసీఆర్ తనకు తాను దేశ్ కీ నేత అని చెప్పుకుంటున్నారని, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశ్ కీ నేత కాలేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. అక్కడ ఒక్క వార్డు మెంబర్ గెలిచినందుకే సంబరపడుతున్నారన్నారు. హామీలన్నీ తుంగలో తొక్కారు..: సీఎం అవ్వకముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కేంద్రమంత్రి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మొదట్లోనే వారిని మోసం చేశారన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీల అభివృద్ధి.. ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ డిజిటల్ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద ట్రాక్టర్లు ఇస్తుంటే వాటిని బీఆర్ఎస్ నాయకులు వారి బంధువులకు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీల వల్ల ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్రం నిర్మాణాత్మకంగా సబ్సిడీని అందిస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. ఎరువుల సబ్సిడీతో కౌలు రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణలో మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని, ఈ నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకు ఉందని కిషన్రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం దీనికి అవకాశం లేదని చెప్పారు. కవిత అరెస్టు మా చేతుల్లో లేదు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం తమ చేతుల్లో లేదని కిషన్రెడ్డి అన్నారు. ఇది ఈ కేసును పరిశోధిస్తున్న సీబీఐ పరిధిలోని అంశమని చెప్పారు. సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందునే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసన సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 27న పరేడ్ గ్రౌండ్స్లో లక్షమందితో యోగా మహోత్సవం ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనంగా యోగాను ప్రపంచం గుర్తించిందని, ఐక్యరాజ్యసమితితో పాటు 200కు పైగా దేశాల్లో యోగా ప్రజల జీవితాల్లో భాగమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్గా సికింద్రాబాద్లోని పెరేడ్గ్రౌండ్స్లో ఈనెల 27న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం టూరిజం ప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కౌంట్డౌన్ యోగా కార్యక్రమానికి హైదరాబాద్ జంట నగరాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులతో పాటు యోగా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే దేశంలోని ప్రజలందరినీ ఇందుకోసం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాం మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కిషన్రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్కు కూడా ఆహా్వనం పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో కొందరి రుణాలు రెన్యువల్ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. - కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా -
రైతుబంధుపై వీడని సస్పెన్స్.. కొత్త రైతులకు కష్టమే?
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : రైతుబంధు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. బయటకు చెప్పకూడదని వ్యవసాయాధికారులను కట్టడి చేసింది. బయటి వ్యక్తులకే కాదు మీడియాకు కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు జంకుతున్నారు. ఉద్యోగాలు పోతాయనేంతగా భయంతో ‘ఆ ఒక్కటి అడక్కు’ అని మాట దాటేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు నిధులు ఎంతమందికి వచ్చాయన్న లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుండడమే ఇందుకు కారణమని మాత్రం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో కొత్తగా 7,176 మంది రైతులను కలుపుకొని లబి్ధదారుల సంఖ్య 2,78,351 మందికి చేరుకుంది. ఇందుకు రూ.274.10కోట్లకు పైగా పెట్టుబడి సాయం అవసరమవుతోంది. తొలుత ఒకటి, రెండు, మూడెకరాలు వారికి పెట్టుబడి డబ్బులు అందగా, నాలుగు నుంచి ఆరెకరాల్లోపు ఉన్న రైతులకు ఆలస్యంగా అందాయి. ప్రస్తుతం ఆరు ఎకరాలకు పైగా ఉన్న వారికి ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పక్షం రోజులవుతున్నా తమకు రైతుబంధు రాలేదని రైతులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా డబ్బులు తప్పకుండా పడతాయని అధికారులు వారికి సముదాయిస్తున్నారు. కానీ, వరినాట్లు దాదాపు పూర్తయినప్పటికీ పంట సాయం అందకపోవడం పట్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎరువులు, మందుల కొనుగోలుకు చేతిలో పైసల్లేక అప్పు తెచ్చుకుంటున్నారు. కొత్త రైతులకు అనుమానమే.. జిల్లాలో రైతుబంధు పొందే లబ్ధిదారుల జాబితాలో కొత్తగా పట్టాపాసు పుస్తకాలు పొందిన 7,176 మంది రైతులను చేర్చింది. అర్హత ఉన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తుతో పాటు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్లను మండల వ్యవసాయాధికారులకు అందజేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ రైతుల పేర్లను మాత్రం రైతుబంధు పోర్టల్లో ఇంకా నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయాధికారులు రైతుల వివరాలను ఎంట్రీ చేయలేకపోతున్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ మండల కార్యాలయాల్లోనే పడున్నాయి. తద్వారా కొత్త రైతులకు యాసంగి పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఎల్ఏ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ను కొత్త పాస్పుస్తకాలు పొందిన రైతుల వివరాలు అందలేదని తెలుస్తోంది. -
వారికి రైతుబంధు రానట్టేనా?
సాక్షి, యాదాద్రి : కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైనే ఉన్నారు. 5,495 మంది దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఇటీవల సమస్యలను పరిష్కరించడంతో జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8 వేల మందికి పైగా రైతులు కొత్త పాస్ పుస్తకాలు పొందారు. వీరిలో 5,495 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా 2,500 మందికి పైగా దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్ 20లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు.దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశలో రైతులు వానాకాలం సీజన్లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ çవెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాలు పంపని సీసీఎల్ఏ నూతనంగా పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. దీంతో వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్ బుక్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.కానీ, వెబ్సైట్లో వారి వివరాలు చూపడం లేదు. డేటా వస్తే జమ చేస్తాం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్ఏ నుంచి మాకు రాలేదు. డేటాలో పట్టాదారు పాస్ బుక్ నంబర్, రైతు పేరు ఉంటుంది. ఈ వివరాలు సీసీఎల్ఏ నుంచి మాకు వస్తేనే నిర్ణీత ఫార్మాట్లో రైతుల బ్యాంకు అకౌంట్ నంబర్ అప్లోడ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. గత సీజన్లలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందింది. మాకు డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంటకు అందించే రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ఎకరం నుంచి ప్రారంభమై వరుసగా నిధుల విడుదల చేయనున్నారు. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. చదవండి: కాంగ్రెస్లో మరింత ముదిరిన సంక్షోభం.. పదవులకు 13 మంది రాజీనామా -
28 నుంచి ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది. కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుబంధు ఆగదు: మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగదని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. సీఎం కేసీ ఆర్కు నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సీఎం కేసీఆర్పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్) -
ఆ భూములకు రైతు ‘బంద్’!
రవీంద్రనాథ్ (పేరు మార్చాం)కు హైదరాబాద్ శివారులో ఐదెకరాల భూమి ఉంది. దానికి వ్యవసాయ పట్టా ఉంది. ఆ భూమిలో విల్లాలు నిర్మించారు. కానీ వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉండటంతో ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుబంధు అందుతోంది. రికార్డుల ప్రకారం భూమిలో ద్రాక్ష తోట అని ఉంది. రాజశేఖర్ (పేరు మార్పు) పేరుతో రంగారెడ్డి జిల్లాలో పదెకరాల భూమి ఉంది. అంతా వ్యవసాయ పట్టా భూమి. కానీ ఆ భూమిలో పంటలు పండట్లేదు. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. కానీ వ్యవసాయ పట్టా ఉండటంతో ఏడాదికి రూ. లక్ష రైతుబంధు అందుకుంటున్నాడు. రికార్డుల ప్రకారం అందులో కూరగాయల సాగు చేస్తున్నట్లు ఉంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు గుర్రుగా ఉంది. వాణిజ్య లావాదేవీలు, ఇతరత్రా అవసరాలకు వాడే భూములకు వ్యవసాయ పట్టా ఉంటే రైతుబంధును నిలిపేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. రైతుబంధు స్ఫూర్తికి విరుద్ధం 2018–19 వ్యవసాయ సీజన్ నుంచి రైతుబంధు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. మొదట్లో ఓ సీజన్కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021–22 వ్యవసాయ సీజన్లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది. నాలా మార్పిడి చేయకుండా వ్యవసాయ భూమిగానే.. రైతుబంధును కొందరు ధనవంతులైన సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర ధనవంతులు కూడా తీసుకుంటు న్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే వీటిని ప్రభు త్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాణిజ్య కార్యకలా పాల్లో, వ్యవసాయేతర రంగాల్లో ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చర్చ జరగ డంతో దానిపై దృష్టి పెట్టింది. కొన్ని భూముల్లో పరిశ్రమలు, విల్లాలు, ఇళ్లు ఉన్నా వాటిని నాలా మార్పిడి చేయకపోవ డంతో వ్యవసాయ పట్టా భూములుగా చలామణి అవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ వానాకాలం సీజన్ రైతుబంధును త్వరలో విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు. -
హైదరాబాద్లో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఆ మూడింటిపైనే కేసీఆర్ సర్కార్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దళిత సంక్షేమం, వ్యవసాయం, వైద్య, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి బడ్జెట్ ఉంటుందని సమాచారం. గత ఏడాది ప్రతిపాదించిన రూ.2.30 లక్షల కోట్ల అంచనాలతో పోలిస్తే.. ఈసారి బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022–23 సంవత్సరానికి అవసరమయ్యే నిధుల కోసం శాఖల వారీగా అంచనాల ప్రతిపాదనలు గత నెలాఖరులోనే ఆర్థిక శాఖకు చేరాయి. వీటితోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరణల బడ్జెట్ ప్రతిపాదనలు కూడా అన్ని శాఖల నుంచి అందాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వీటన్నింటినీ సమీక్షించి.. ఆచితూచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈనెల 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్ సమీక్ష సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ సూచనల మేరకు బడ్జెట్కు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్ర బడ్జెట్ను ఏటా మార్చి నెలలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా.. ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సొంత పన్ను ఆదాయం పెరగడంతో.. ఈసారి బడ్జెట్ గణాంకాలపై రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం గణనీయ ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందటి రెండేళ్లతో పోలిస్తే 2021–22లో సొంత పన్నుల ఆదా యం భారీగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో డిసెంబర్నాటికి నాలుగు ప్రధాన పన్ను ఆదాయాలు రూ.48 వేల కోట్లమేర రాగా.. కరోనాతో ప్రభావితమైన 2020–21లో రూ.44 వేల కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.65వేల కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెండుసార్లు భూముల ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ పెంపు, ఎక్సైజ్ విధానంలో మార్పులు, జీఎస్టీ, అమ్మకపు పన్ను వసూళ్లలో పకడ్బందీగా ముందుకెళ్లడంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే.. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం కంటే.. 10 శాతం ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ మూడూ కీలకం! ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో మూడు అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టు తెలిసింది. గత ఏడాదిలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులను బట్టి దళితబంధు, వ్యవసాయం–రైతులు, విద్య–వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. సాగునీటి బడ్జెట్కు గత బడ్జెట్ తరహాలోనే కేటాయింపులు ఉంటాయని, పాలమూరు లిఫ్టుతోపాటు కృష్ణా బేసిన్లో పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలకు యథాతథంగా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నాయి. దళిత బంధుకు రూ.20 వేలకోట్లు! ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి ఈసారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దళిత సాధికారత పేరుతో రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ ఈ క్రమంలోనే ప్రభుత్వ ‘దళిత బంధు’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రంలోని 15–16 లక్షల కుటుంబాలకు సాయం అందించాలని, ఇందుకోసం దశలవారీగా ప్రతిపాదనలు చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే సూచించారు. వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. దీంతో బడ్జెట్లో దళితబంధుకు పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. రైతుల కోసం మరో కొత్త పథకం? బడ్జెట్లో ప్రాధాన్యాల్లో మరో కీలక అంశంగా వ్యవసాయం–రైతుల అంశాలను తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.14,800 కోట్లు రైతుబంధుకు, రూ.5వేల కోట్లకుపైగా రుణమాఫీ కోసం, రూ.1,200 కోట్ల వరకు రైతు బీమా కోసం ప్రతిపాదించారు. వీటిని కొనసాగిస్తూనే.. ఈసారి రైతుల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వైద్యం–విద్యకు పెద్దపీట ఈసారి బడ్జెట్లో వైద్య, విద్యా రంగాలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా వంటి ఆరోగ్య విపత్తులు ఎప్పుడు వచ్చినా తట్టుకునేందుకు వీలుగా వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో ప్రత్యేక సౌకర్యాల కల్పన, ఇతర చర్యల కోసం వైద్యారోగ్య శాఖకు గతేడాది కంటే రూ.10 వేల కోట్ల మేర అధికంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇక విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ క్లాస్రూంల ఏర్పాటుపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్తున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక విద్యకు రూ.13వేల కోట్ల వరకు కేటాయిస్తారని సమాచారం. -
‘రైతు బంధు’ సంబరాలు
సత్తుపల్లి: రైతుబంధు పథకానికి రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సత్తుపల్లి మండలం గంగారంలో మంగళవారం రైతుబంధు సంబురాలను రంగవల్లులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతువేదిక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రైతుబంధు పథకం కింద 80వేల మంది రైతులకు రూ.5.67 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, రైతు సంఘం కన్వీనర్ గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, ఎస్కె రఫీ, మాదిరాజు వాసు పాల్గొన్నారు. వేంసూరు: మండల పరిధిలోని దూళ్లకోత్తురులో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. 70 ఏళ్లలో ఎన్నడు చూడని పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, మండల రైతుబంధు అధ్యక్షులు వెల్ధి జగన్మోహన్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. వైరారూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ.. ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండలంలోని కొండకొడిమలో మంగళవారం నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ, సర్పంచ్ దొంతెబోయిన శ్రీను, ఎంపీటీసీ రాయల రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏడీఏ బాబురావు, ఏఓ ఎస్.పవన్కుమార్, ఏఈఓ వెంకటనర్సయ్య తదితరులున్నారు. మధిర: మధిర వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ పాలాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చావా వేణు తదితరులు పాల్గొన్నారు. -
రైతు‘బంధువులు’ పెరిగారు!
సాక్షి, హైదరాబాద్: సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి సీజన్లో రైతుబంధు సాయం పొందేవారి సంఖ్య సగటున లక్ష వరకు పెరుగుతోంది. 2018, ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ఎకరానికి రూ.4 వేల సాయం చొప్పున ఇవ్వగా.. ఏడాది తర్వాత నుంచి ఎకరాకు రూ.5 వేలు అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం రబీ సీజన్ నిధులను త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 17 లక్షల ఎకరాలకు పరిష్కారం... వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో యజ మానుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వివాదం ఉన్న భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పెద్ద సంఖ్యలో భూ యజమానులు లావాదేవీలు సాగిం చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ధరణిలో సాంకేతికతను అప్డేట్ చేస్తుండటంతో మ్యూ టేషన్, సక్సెషన్ లాంటి అపరిష్కృత సమస్యలకు ప రిష్కారం లభించింది. ఆయా లబ్ధిదారులంతా రై తుబంధు సాయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య, భూ విస్తీర్ణం పెరుగుతోంది. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 17 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమవుతోంది. సీసీఎల్ఏ గణాంకాల్లో... సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా ఇప్పుడు రెవెన్యూ విభాగం పర్యవేక్షిస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన క్షణాల్లోనే పోర్టల్లో వివరాలు మారిపోతుంటాయి. రిజిస్ట్రేషన్ కాగానే లబ్ధిదారుకు మ్యూటేషన్ పూర్తయి పాసు పుస్తకం ప్రింట్ కాపీని ఇస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పోస్టు ద్వారా పాసుపుస్తకం లబ్ధిదారు ఇంటికి చేరుతుంది. ఈ క్రమంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం గణాంకాల ప్రకారం.. 63.25 లక్షల మంది పేరిట 1.50 కోట్ల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లెక్కన లబ్ధిదారులకు రూ.7,508.78 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ లెక్కన రబీ సీజన్లో లబ్ధిదారుల సంఖ్య అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అప్పులు తెచ్చిన తిప్పలు.. మహిళ బతికుండగానే ‘చంపేశాడు’
సాక్షి, పరిగి: తాను చేసిన అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బతికుండగానే ఓ మహిళా రైతు చనిపోయినట్లు దస్తావేజులు సృష్టించాడో ప్రబుద్ధుడు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల అమాయకత్వం,నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఆమె పేరున వచ్చిన రైతు బీమా డబ్బులు కాజేశాడు. కుల్కచర్ల మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మిరెడ్డి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్కు చెందిన రాఘవేందర్రెడ్డి (45) గ్రామంలో వ్యవసాయం చేయటంతో పాటు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈజీగా డబ్బులు సంపాదించి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. బతికుండగానే చంద్రమ్మ అనే మహిళ చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ఆమె పేరున వచ్చిన రైతుబీమా డబ్బులు కాజేశాడు. బాధితురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ రాఘవేందర్రెడ్డి ఇంట్లో చాలాకాలంగా పనిచేస్తూ వస్తుంది. ఆమె కుమారుడు బాలయ్య కూడా నిరక్షరాశ్యుడు. చంద్రమ్మకు ప్రస్తుతం 57 సంవత్సరాలు ఉండటంతో మరో ఏడాదిలో ఆమెకు రైతు బీమా వర్తించకుండా పోతుంది. దీంతో ఆమె బీమాను రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావించిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి పక్కా ప్లాన్తో ఆమె పేరున రైతు బీమా కాజేశాడు. ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్ తయారీ.. బీమా డబ్బులు రావాలంటే బాధితురాలు చంద్రమ్మ చనిపోయినట్టుగా నిరూపించే డెత్ సర్టిఫికెట్ అవసరమని గుర్తించిన నిందితుడు సర్టిఫికెట్ కోసం మహబూబ్నగర్కు వెళ్లి గ్రామ పంచాయతీ ముద్రలు కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. వాటితో సర్టిఫికెట్ తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేశాడు. సదరు మహళ కుటుంబ సభ్యులు నిందితుడి ఇంట్లో పనిచేసే వ్యక్తులే కావటంతో ఏదో అవసరం ఉందని నమ్మించి వారి నుంచి ఆధార్ కార్డులు తెప్పించుకున్నాడు. అనంతరం అన్ని వివరాలతో రైతు బీమా పోర్టల్లో అన్ని పత్రాలు అప్లోడ్ చేసి రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఫిజికల్గా విచారణ చేయాల్సిన ఏఈఓ సత్తార్.. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అయిన రాఘవేందర్రెడ్డికే ఫోన్చేసి చంద్రమ్మ మృతి విషయమై విచారణ చేశాడు. అతను చంద్రమ్మ మృతి చెందిన విషయం వాస్తవమే అని తెలపటంతో ఏఈఓ విచారణ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశాడు. నగదు జమవ్వగానే.. కొద్దిరోజుల తర్వాత చంద్రమ్మకు నామినీగా ఉన్న ఆమె కుమారుడు బాలయ్య బ్యాంకు ఖాతాలో రైతుబీమా నగదు జమయ్యాయి. విషయం తెలుసుకున్న రాఘవేందర్రెడ్డి తాను ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు నీ ఖాతాలో వేయించానని బాలయ్యను నమ్మించి రూ.5 లక్షల బీమా డబ్బులు బాలయ్య ఖాతా నుంచి తన స్నేహితుడైన మధు ఖాతాలో దఫదఫాలుగా వేయించుకుని తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు. రైతుబంధు రాకపోవటంతో.. అయితే చంద్రమ్మ మృతి చెందినట్లు సర్టిఫికెట్లు సృష్టించి బీమా డబ్బులు నొక్కేయటంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో పడాల్సిన రైతు బంధు డబ్బులు జమకాలేదు. దీంతో ఆమె కుమారుడు బాలయ్య రైతుబంధు డబ్బుల విషయమై రాఘవేందర్రెడ్డిని అడిగాడు. పలుమార్లు అడిగినా అతను స్పందించకపోవటంతో వేరే వారికి చెప్పి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయమై రెండు, మూడు రోజులుగా ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈఓ సత్తార్పై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ రాశారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ప్రస్తుతం రూ.80వేలు ఉండగా అవి సీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు కూడా లేఖ రాశారు. కుల్కచర్ల ఎస్ఐ విఠల్రెడ్డి, పరిగి ఎస్ఐ క్రాంతికుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో ఉన్నారు. -
సాక్షి పరిశోధన: పెట్టుబడి సాయం.. గుట్టుగా మాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్ (గడ్డం రాజిరెడ్డి): ఇది శ్రీ రాంసాగర్ ముంపు ప్రాంతం. ఇలా ముంపులో ఉన్న భూములకూ రైతు బంధు సాయం అందుతుండటం విస్మయం కలిగిస్తోంది. పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం శ్రీరాంసాగర్ నిర్మాణానికి ఈ భూమిని సేకరించారు. ఈ భూములకు రైతుల పేర్లను తీసివేసి అధికారులు మ్యుటేషన్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భూములుగా మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ వందలాది ఎకరాలు రైతుల పేర్లపైనే ఉన్నాయి. అంతేకాదు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఇలాంటి భూములను రైతుబంధు పథకం నుంచి తొలగించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో కొందరు.. రైతుల పేరిట ఈ ప్రాజెక్టు ముంపు భూములకు పెట్టుబడి సాయం పొందుతున్నారు. ఒక్క బాసర మండలంలోనే 2,863 ఎకరాల భూములకు రైతుబంధు అందినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, నందిపేట, బాల్కొండ తదితర మండలాల్లోనూ శ్రీరాంసాగర్ ముంపు గ్రామాలు ఉన్నాయి. కొందరు అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రైతుబంధు కింద తొలిసారి 2018 వానాకాలం (ఖరీఫ్) సీజన్లో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన ప్రభుత్వం, 2019 వానాకాలం నుంచి ఎకరానికి రూ. 5 వేలు చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ► ఈ పథకం కింద అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులు (4,72,983) లబ్ధి పొందుతుండగా, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో అతి తక్కువ మందికి (39,762) పెట్టుబడి సాయం అందుతోంది. ►సాగు భూమి ఉన్న ప్రతి రైతుకూ గరిష్ట పరిమితి లేకుండా అమలు చేస్తున్న పథకం మంచిదే అయినా.. వ్యవసాయ భూములేవో, ఇతర భూములేవో పరిశీలించకుండా పాస్ పుస్తకాలున్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం ఇస్తుండటంతో పెద్దమొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాలనీ భూమికీ ‘బంధు’వే ఏళ్ల క్రితం ఏర్పడిన ఓ కాలనీ భూమికీ రైతు బంధు నిధులు అందుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన భూమి పేరిట ఆ గ్రామానికి చెందిన కంచర్ల మనోహరమ్మ ఇప్పటివరకు 6 పర్యాయాలు పెట్టుబడి సాయం పొందింది. సుమారు 50 ఏళ్ల క్రితం కంచర్ల మల్లారెడ్డి 163/1 సర్వే నంబర్లోని 3.39 ఎకరాల భూమిని ఎస్సీ కాలనీ కోసం ఇచ్చాడు. అతనికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. అయితే ఈ భూమి రికార్డులో మల్లారెడ్డి పేరును అధికారులు తొలగించలేదు. దీంతో 2018 వరకు మల్లారెడ్డి పేరిటే రికార్డులో ఉంది. తర్వాత ఆయన కుమారుడు అశోక్రెడ్డి తన తండ్రి పేరు స్థానంలో తల్లి మనోహరమ్మ పేరు చేర్పించి రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి కాలనీగా ఉన్న భూమికి పట్టా చేయించాడు. దీంతో అప్పటినుంచి రైతుబంధు నిధులు మనోహరమ్మ ఖాతాలో జమ అవుతున్నాయి. దీనిపై మనోహరమ్మ పాలి వారైన కంచర్ల మహేందర్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 12న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆరో విడత రైతుబంధు మనోహరమ్మ పొందడం గమనార్హం. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కలెక్టరేట్కు నివేదిక పంపామని తహసీల్దార్ షేక్ అహ్మద్ చెప్పారు. దత్తప్పగూడెం ఎస్సీ కాలనీ ఇవే కాదు.. వ్యవసాయ భూముల్లో ఏళ్ల క్రితమే కాలనీలుగా ఏర్పడినా, అప్పట్లో ఎవరైతే రైతులు భూమిని విక్రయించారో అదే రైతుల ఖాతాల్లోకి కూడా నగదు వెళ్తోంది. అదే విధంగా వ్యవసాయ యోగ్యం కాని గుట్టలు, చెరువులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు (పట్టాభూములుగా చూపినవాటికి) సైతం రైతుబంధు అందుతోందని ‘సాక్షి’పరిశీలనలో తేలింది. కళాశాలలు, ఫంక్షన్ హాళ్లకు కూడా చాలాచోట్ల పెట్టుబడి సాయం అందుతోందనే ఆరోపణలున్నాయి. పొలం ఉన్నా, పెట్టుబడి డబ్బులు లేక ఎప్పటికప్పుడు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తూ.. కాలం కలిసి రాక రుణాల ఊబిలో చిక్కుకుపోతున్న రైతన్నలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’పథకం ప్రవేశపెట్టింది. తొలిసారిగా 2018 – 19 ఖరీఫ్ సీజన్ నుండి, ఈ వ్యవసాయ ప్రారంభ పెట్టుబడి సహాయ పథకం అమలు చేస్తోంది. అప్పట్నుంచీ ప్రతి సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతుల జాబితాలను తయారు చేస్తున్న వ్యవసాయ శాఖ వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. 2018 నుంచి 2021 జూన్ వరకు ఏడు పంట సీజన్లకు మొత్తం రూ.46,186.67 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 2018 – 19లో రూ.12 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది (2021 – 22)లో వానాకాలం, యాసంగి (రబీ) సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 63.25 లక్షల మంది రైతులకు 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు (జూన్ 15 నుంచి 25 వరకు) జమ చేసింది. అయితే వీటిల్లో కోట్ల రూపాయల నిధులు.. అక్రమార్కులు కొట్టేస్తున్నారు. రైతుబంధుపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా దిద్దుబాటు జరగక పోవడం శోచనీయం. ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు రైతుబంధు పథకాన్ని అందివచ్చిన అవకాశంగా మార్చుకున్న అధికారులు దీన్ని అమలు చేసే క్రమంలో చాలాచోట్ల ఇష్టారాజ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని కూడా కొన్నిచోట్ల తుంగలో తొక్కారు. పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి యాజమాన్య హక్కులు కల్పించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. కొత్తగా ఓ పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తున్నామంటే ఆ భూమికి సంబంధించిన పూర్తి దస్త్రాల నివేదికను కింది స్థాయి అధికారులు ఇవ్వాలి. ముఖ్యంగా 1/70 (అటవీ హక్కుల చట్టం) ఉన్న ప్రాంతంలో ఆర్ఓఆర్, టైటిల్ డీడ్లు వంటి పూర్తిస్థాయి దస్త్రాలు ఉండాలి. అలాంటి దస్త్రాలు ఉన్న భూములకే పుస్తకాలు ఇవ్వాలి. కానీ గిరిజనేతరులకు విక్రయించిన భూములకు కూడా యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. మామూలు పరిస్థితుల్లో కూడా సర్వేయర్తో పాటు వీఆర్వో, ఆర్ఐలు సంబంధిత భూస్వరూపం, పట్టాదారుకు సంబంధించిన పూర్తి దస్త్రాలకు సంబంధించిన నివేదికకు అనుగుణంగానే పాస్ పుస్తకాలు జారీ చేయాలి. కానీ చాలాచోట్ల అధికారులు, సిబ్బంది కుమ్మౖMð్క ఇష్టారాజ్యంగా ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుట్టల భూములకూ ఇచ్చారు.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, ముస్తఫాపూర్ గ్రామాలలో సుమారు 700 ఎకరాలు గుట్టలను కలుపుకొని ఉంది. మహ్మద్ ఖాద్రి పేరిట ముస్తఫాపూర్లో సర్వే నంబర్లు 211, 216లో 500 ఎకరాలు ఉంటుంది. కొత్తకొండలో సుధీర్రెడ్డి పేరిట 564 సర్వే నంబర్లో 200 ఎకరాలు గుట్టలను కలుపుకునే ఉంది. రైతుబంధు ప్రారంభంలో ఈ మూడు సర్వేనంబర్లలో ఉన్న కొంతభూమికి పెట్టుబడి సాయం అందింది. ఈ క్రమంలో మొత్తం భూములకు పాసుబుక్కులు ఇచ్చి రైతుబంధు ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి తహసీల్దార్ ఇటీవల మొత్తానికీ రద్దు చేసి డిజిటల్ సైన్ పెండింగ్లో పెట్టారు. వ్యవసాయేతర భూమిగా మార్చినా.. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, సైదాపురం గ్రామంలో సర్వే నంబర్లు 17, 18, 19, 20లో ఉన్న సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమిని 2015లో రెవెన్యూ శాఖ వ్యవసాయేతర భూమిగా మార్చింది. అప్పట్లోనే ఈ భూమిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయం జరిపింది. నాలా కనెక్షన్ కూడా మంజూరైంది. ఇలా ప్లాట్లు అయిన ఈ వెంచర్ను విచిత్రంగా వ్యవసాయ భూమిగా పేర్కొంటూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ భూములకు రైతుబంధు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వెంచర్ భూములతో వంచన వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో 419, 445, 446, 447, 453, 454, 465 సర్వే నంబర్లలోని 22 ఎకరాల్లో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. ఎకరం రూ.70 లక్షల నుంచి 80లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు గజాల చొప్పున విక్రయించారు. అయితే ఈ భూమికి రైతుబంధు పడుతుండటం వివాదాస్పదం అవుతోంది. అలాగే ధర్మసాగర్ మండలం పెండ్యాల శివారు 2 సర్వే నంబర్లలోని 12 ఎకరాల వెంచర్ భూమికీ పెట్టుబడి సాయం అందుతోంది. ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శివారు శివునిపల్లి సమీపంలోని ఓ వెంచర్ 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రవీందర్రెడ్డికి చెందిన సర్వే నంబర్ 510, 511, 512 లో ఉన్న ఈ భూమిని, మూడేళ్ల క్రితం స్టేషన్ ఘన్పూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. దీనికీ రైతుబంధు పొందుతున్నారు. అటవీ చట్టానికి తూట్లు పూర్వ ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెంలో ఓ దళారీతో చేతులు కలిపిన అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీనివాసపురం, గోగుబాక, రాళ్లగూడెం, సత్యనారాయణపురం, చినమిడిసిలేరు(జి), తేగడ(జడ్), వీరాపురం, జి.పి.పల్లి, చింతకుంట, లింగాల, చర్ల గ్రామాల్లోని భూములకు సంబంధించి 1/70 (అటవీ హక్కుల చట్టం)కు విరుద్ధంగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల భూమిని ఇతరులెవరికీ బదలాయించడానికి వీల్లేదు. కానీ తేగడ (జడ్)లో ఓ రైతుకు సంబంధించిన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించి పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. జి.పి.పల్లి (జడ్)లో ఓ వ్యక్తికి చెందిన 10.30 ఎకరాలను సబ్ డివిజన్లుగా మార్పు చేసి అనువంశికంగా వీలునామాలు సృష్టించి పట్టాదారు పుస్తకాలను జారీ చేశారు. రైతుబంధు అందేలా ఈ పుస్తకాల జారీకి సంబంధించి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడం వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత రద్దు చేశారు. నారాయణపురానికి నయాపైసా రాలే.. అక్రమాల్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కానీ మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామంలో మాత్రం రైతుబంధు ఇవ్వడం లేదు. ఊరిలో ఉన్న వెయ్యి మంది రైతుల్లో ఏ ఒక్క రైతుకూ సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో చిన్న తండాలు, శివారు గ్రామాలుగా ఉన్న నారాయణపురం, పీకల తండా, క్యాంపు తండాలను నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామం నుంచి వేరు చేసి కొత్తగా నారాయణపురం రెవెన్యూ విలేజ్గా మార్చారు. అనంతరం గ్రామాన్ని కేసముద్రం మండలంలో కలిపారు. దీంతో ఆ గ్రామ రైతుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గ్రామంలోని 1,827 ఎకరాల భూమిని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అటవీ భూముల్లో కలిపేశారు. వాస్తవానికి 1952కు ముందు ఈ భూములు అటవీ శాఖ పరిధిలోనే ఉన్నాయి. కానీ 1952 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అటవీ శాఖ నుంచి వెనక్కు తీసుకుని రైతులకు పంపిణీ చేసింది. అయితే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో రికార్డులు మార్చలేదు. దీంతో అవి అటవీ శాఖకు చెందిన సర్వే నంబర్ల పైనే కొనసాగుతూ వచ్చాయి. ప్రక్షాళనలో ఆ భూముల్లో 1,605 ఎకరాలను రిజర్వ్ ఫారెస్టులో ఉన్న పట్టా భూములుగా, మరో 222 ఎకరాలు పట్టా భూమిగా సర్కారు గుర్తించింది. నారాయణపురం రెవెన్యూ గ్రామంగా మారి వేరొక మండలంలో కలవడంతో ఏర్పడిన గందరగోళం, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు లేకపోవడంతో 1,605 ఎకరాలకు రైతుబంధు అందడం లేదు. దీంతో ఆ గ్రామ ప్రజలు పలుమార్లు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభను, సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నారాయణపురం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిలిచిపోయిందని ఇటీవల ఫారెస్టు క్లియరెన్స్ రావడంతో, వీరికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కేసముద్రం తహసీల్దార్ కోమల తెలిపారు. పహాణీల జాబితాను గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రదర్శించామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరు సర్వే నంబర్లలో గల రైతుల భూముల్లో ఎంజాయ్మెంట్ సర్వేను ప్రారంభించామని వివరించారు. వారంలో ఈ సర్వే పూర్తి చేస్తామని, రైతులు వారి భూముల్లో ఉండి తమకు సహకరించాలని కోరారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నా.. మరోవైపు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నా కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులకు రైతుబంధు అందడం లేదు. రైతుబంధు కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో గిరిజనులు చాలా ఏండ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. వీరికి 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలను అందజేశారు. అయితే ఇవింకా అధికారిక లెక్కల్లోకి ఎక్కకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రంలో సుమారు 96 వేల మందికి అటవీ హక్కుల గుర్తింపు పత్రాల మేరకు పట్టాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆర్ఓఎఫ్ఆర్ కింద ఉన్నా రైతుబంధు అందని రైతుల సాగు భూములు ముందే నమోదు కావడంతో రైతుబంధు కొన్నిచోట్ల నాలా (వ్యవసాయేతర భూమి) దరఖాస్తు కంటే ముందుగానే రైతుబంధు పథకంలో నమోదు కావడంతో నాలాగా కన్వర్షన్ అయినప్పటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు డబ్బులు జమ అవుతోంది. వచ్చే ఏడాది ఇలాంటి భూములను ఆన్లైన్లో తొలగిస్తాం. అప్పటి నుంచి డబ్బులు రావు. –పి.శ్రీనివాస్, తహసీల్దార్, లింగాలఘణపురం, జనగామ జిల్లా చదవండి: బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు KTR: ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం..! -
రైతు బంధుతో సమస్యలా? ఈ నెంబర్లకు కాల్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ఆదేశాల అనుసరించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని గౌరవనీయ ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 1800-200-1001, 040-33671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. చదవండి: రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు! -
తొలిరోజు రూ. 516 కోట్లు.. నేడు మరో రూ.1,152.46 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కు గాను రైతుబంధు నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఈ జమ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజు 16.95 లక్షల మంది రైతులకు రూ. 516.95 కోట్లు వారి బ్యాంకు ఖాతా ల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 36.10 కోట్లు జమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా లో అత్యల్పంగా 9,628 మంది రైతుల ఖాతా ల్లోకి రూ. 35.60 లక్షలు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10,33,915 ఎకరాలకు చెందిన 16,95,601 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు చేరినట్లు అధికారులు తెలిపారు. రెండోరోజు 2 ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకుగాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,152.46 కోట్లు జమ చేస్తామని వెల్లడించారు. రెండో రోజు కూడా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా1,10,407 మంది రైతుల ఖాతాలకు రూ. 85.23 కోట్లు జమ చేస్తారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయ మంత్రి నిరం జన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి హరీశ్రావు కూడా ట్విట్టర్ వేదికగా మొదటి రోజు రైతుల ఖాతా ల్లో సొమ్ము జమయినట్లు చెప్పారు. రైతులకు అభినందలు తెలిపారు. కాగా, ఈ సీజ¯Œ లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల (కోటిన్నర) ఎకరాలకు రూ. 7,508.78 కోట్లు రైతుబంధు నిధులు ఇవ్వనున్నారు. -
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడం ఎంతో ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఒక ఎకరా వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుబంధు నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్రావు తెలిపారు. గత సీజన్లో మాదిరిగానే జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 వరకు రైతుబంధు సొమ్ము అందరికీ అందుతుందన్నారు. ఈ సీజన్లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్ల నిధులు అందుతాయి. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది కొత్తగా రైతులు పెరిగిన సంగతి తెలిసిందే. -
మే 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబందు
తెలంగాణ రైతుల ఖాతాలో మే 15 నుంచి 25 వరకు రైతుబందు నగదు జమ కానుంది. ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితాను సీసీఎల్ఏ అందజేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరినట్లు మంత్రి తెలిపారు. మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. చదవండి: పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 నుంచి వచ్చేనెల 7వరకు రైతుబంధు సహాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) నిర్ణయించారు. సోమవారం ఆయన రైతుబంధుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బు జమ చేయాలని తెలిపారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.(చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ) -
ఆదాయం తగ్గినా పథకాలు ఆగవు
సాక్షి, సంగారెడ్డి: లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో, సదాశివపేట మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాల అందజేత కార్యక్రమాలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతినెలా రూ. వెయ్యి కోట్లు ఆసరా పింఛన్ల కోసం నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధుకు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,400 కోట్లు అందించామని వివరించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వారు తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీల వారీగా అర్హులను గుర్తించి ఒక్కొక్కరికీ తక్కువ వడ్డీతో రూ.10 వేలు అందజేస్తున్నామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ‘టెస్ట్ అండ్ ట్రీట్’ కరోనా వైరస్తో ఎవరూ భయపడవద్దని, లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చునని హరీశ్ సూచించారు. పీహెచ్సీలలో సైతం పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వైరస్ గురించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందన్నారు. టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ పద్ధతిలో కరోనా విషయంలో అన్ని సౌకర్యాలు ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. -
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుపడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలవుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (‘పవర్’కు పంప్హౌస్లు) సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. (విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం) -
చిట్ట చివరి రైతు దాకా రైతుబంధు అందాలి
-
రైతుబంధు సాయానికి టైమ్ లిమిట్ లేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని పేర్కొన్నారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. (ఆలయం, మసీదులకు కాకతాళీయంగానే నష్టం) కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసిందని. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందన్నారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అని తెలుసుకునిడబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపిందన్నారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని సూచించారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తుందని, రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. (టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరం) ‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. ఈ విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’ అని సీఎం కేసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. (సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్) -
తక్షణమే రైతుబంధు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదన్నారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ‘ఏడాదికి ఒక ఎకరానికి 10 వేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో రూ. 5 వేలు, యాసంగిలో రూ. 5 వేలు ఇస్తున్నాం. ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం రూ. 7 వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో రూ.1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు సొమ్ము మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడంపట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అభినందనులు తెలిపిన కేసీఆర్... రైతుబంధు డబ్బులను కూడా ఉపయోగించుకొని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... నియంత్రిత సాగు.. ఒక పంట కోసమో లేక ఒక సీజన్ కోసమో ఉద్దేశించినది కాదు. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం చోటుచేసుకుం టున్న నేపథ్యంలో భవిష్యత్లో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్ర బిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటీ 30లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తోంది. నియంత్రిత సాగుతో ఉజ్వల ప్రస్థానానికి తెలంగాణ నాంది పలుకుతుంది. లాభసాటి సాగే ప్రభుత్వ లక్ష్యం.. మార్కెట్లో డిమాండ్గల పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించింది. దీనికి రైతుల నుంచి వంద శాతం మద్దతు లభించింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన పంటల సాగే జరుగుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి, 12,31,284 ఎకరాల్లో కందులు, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్, 60,16,079 ఎకరాల్లో పత్తి, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలసాగు విధానం అమలు చేయడానికి సిద్ధం కావడం హర్షణీయం. రైతుల స్పందన అద్భుతం.. గొప్ప ముందడుగు తెలంగాణ సమాజం పరిణామశీలమైనది. రాష్ట్రంలో చైతన్యవంతమైన రైతాంగం ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక దేశంలోనే గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్వయసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. వ్యవసాయ రంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ఇది గొప్ప ముందడుగు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలవడానికి అమలు చేస్తున్న నియంత్రిత పద్ధతిలో పంటలసాగు వైపు మన రైతులు గొప్పగా తొలి అడుగు వేశారు. యాసంగిలో 45 లక్షల ఎకరాల్లో వరి .. ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడింది. ఇదే స్పూర్తితో యాసంగి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలో రైతులకు మార్గదర్శకం చేయడంతోపాటు ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉండేట్లు చూడాలి. గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితోపాటు మంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10–12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, 6–7 లక్షల ఎకరాల్లో మక్కలు, 4 లక్షల ఎకరాల్లో శనగలు, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాల్లో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులోకి తేవాలి. వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయాలి. పంజాబ్ నేర్పిన పాఠం.. గతంలో పంజాబ్ వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడం వల్ల పంజాబ్లో వ్యవసాయ వైపరీత్యం సంభవించింది. పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసింది. ఎరువుల వాడకంపై ... వేసిన ఎరువంతా వినియోగం కాక భూమిలోనే చాలా పాస్ఫేట్ (బాస్వరం) నిల్వలు పేరుకుపోతున్నాయి. పేరుకుపోయిన బాస్వరాన్ని తొలగించడానికి పాస్ఫేట్ సాల్యబుల్ బ్యాక్టీరియాను వదలడం ద్వారా భూ సారాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఇలాంటి విధానాలను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతోపాటు మార్కెట్లోకి క్రమ పద్ధతిలో సరుకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోదన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా... రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన ఇతర వ్యవస్థలు కూడా వృద్ధి చెందాలి. మిల్లింగ్ వ్యవస్థ పెరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చెప్పిన బహుళ ప్రయోజనాలివీ... నియంత్రిత సాగు వల్ల మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు, మద్దతు ధర సమస్య తలెత్తదు. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఒకే రకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్టవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్టవేసే ప్రమాదం ఉండదు. నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది. భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదు. -
ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుతో పాటు భూమి పాస్బుక్ జిరాక్స్ లేక ఎమ్మార్వోచే డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ (సేవింగ్స్ ఖాతా) తీసుకొని రావాలని సూచించింది. రైతు మాత్రమే వచ్చి దరఖాస్తు ఇవ్వాలని తెలిపింది. -
తెలంగాణలోనే అత్యంత తక్కువ కరోనా పరోక్షలు
-
రైతుబంధు ఎగ్గొట్టేందుకు కుట్ర
సాక్షి. జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నూతన వ్యవసాయ విధానం తుగ్లక్ పాలనను మరిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకే పనికిమాలిన మెలికలు పెడుతోందని మండిపడ్డారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు తగ్గిస్తుంటే.. ఈసారి పత్తి పంట విస్తీర్ణం పెంచాలనడం ఏమిటని ప్రశ్నించారు. కందులు, మినుముల కొనుగోలుకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పది లక్షల మందికి 1,600 పరీక్షలు చేస్తుంటే.. రాష్ట్రంలో 650 మందికి మాత్రమే చేయడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో 22 వేలు మాత్రమే చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చిన విరాళాల వివరాలు వెల్లడించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గల్ఫ్ కార్మికుల క్వారంటైన్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాజీవ్గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు బంధుకు రూ.7 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేయాలనే సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో 5.5 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. వీటితో పాటు మరో రూ.7 వేల కోట్లను రైతు బంధు కింద పెట్టుబడి సాయంగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది’అని ఆయన వెల్లడించారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
రైతుబంధుకు రూ. 5,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధుకు రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, ఆ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019–20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం రూ. 12,862 కోట్లు కేటాయించగా.. ఖరీఫ్లో రూ.6,862 కోట్లు మంజూరు చేశారు. రూ.5,100 కోట్లను రబీలో అందించేందుకు రంగం సిద్ధం చేశారు. నిధుల మం జూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. కాగా, రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. -
‘రైతుబంధు’కు పరిమితిపై ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : ‘రైతుబంధు’పథకం ఎన్ని ఎకరాలకు వర్తింపజేయాలన్న దానిపై పరిమితి విధించాలని ప్రతిపాదించామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ తిరస్కరించారని వెల్లడించారు. సోమవారం నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్లో 94%మంది రైతులకు ‘రైతుబంధు’నిధులు అందాయన్నారు. ఇంకా 6% మందికే ఇవ్వాల్సి ఉందని, వారికికూడా త్వర లోనే ఇస్తామన్నారు. రెన్యూవల్ చేసుకోవాలని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో రుణమాఫీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వేరుశనగ ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్న వనపర్తి జిల్లాలో ప్రత్యేక వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. -
త్వరలోనే ఖాతాల్లోకి ‘రైతుబంధు’
గద్వాల టౌన్: నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో ‘రైతుబంధు’డబ్బును ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం గద్వాలలో లబ్ధిదారులకు పాడి పశువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ‘రైతుబంధు’పై సరైన అవగాహన లేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఎలాంటి కోతలు లేకుండా దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో గద్వాల, అలంపూర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. -
ఒక్క క్లిక్తో కిసాన్ సమ్మాన్, రైతుబంధు స్టేటస్
నాగారం (తుంగతుర్తి): రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం కిసాన్ సమ్మాన్, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏడాదికి 2విడతల్లో ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. పీఎం కిసాన్సమ్మాన్ సమాచారం తెలుసుకునేందుకుప్రభుత్వం www.pmkisan.gov.in లోకి వెళ్లి బెన్ఫిషియర్ స్టేటస్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్నంబర్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంకులో డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుంది. అలాగే రైతుబంధు సమాచారాన్ని కూడా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.https://ifmis.telangana.gov.in లోకి వెళ్లి స్కీంవైజ్ రిపోర్టుపై క్లిక్ చేయాలి. అప్పుడు సంవత్సరం వద్ద 2019–2020 అని, పథకం వద్ద రైతుబంధు అని, కొత్తపట్టాదారుపాస్ బుక్నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సమాచారం తెలుస్తుంది. ఇలా ఇంటర్నెట్ ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. -
రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు
సాక్షి, కామారెడ్డి: అస్తవ్యస్తంగా ఉన్న దశాబ్దాల నాటి భూ రికార్డులను సరిచేయడం కోసం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. రైతుబంధు డబ్బులు నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కిన పలువురు రెవెన్యూ అధికారులు.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని తమ సంబంధికుల పేర్లపై రాసేశారు. కొన్ని సంఘటనలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అక్రమాలపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే భూ వివాదాలు తలెత్తుతున్నాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. 2017 సెప్టెంబర్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు అన్ని గ్రామాలలో రైతుల సమక్షంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. కొందరు అవినీతి అధికారులకు ఈ కార్యక్రమం వరంలా మారింది. అధికారులు రైతుల వద్దనుంచి డబ్బులు తీసుకుని, రికార్డుల ప్రక్షాళన చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి, అక్రమాలకు పాల్పడి జిల్లావ్యాప్తంగా పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ స్థాయి అధికారులు సైతం సస్పెండయ్యారు. ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువుల పేర్లమీదకు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెదలు పట్టించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, తప్పొప్పులను సరి చేయడం, ఫౌతి, వారసత్వ భూముల బదలాయింపు, పట్టామార్పిడీ, సవరణల కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పనిభారం ఎక్కువగా ఉండడంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు ఆన్లైన్లో లాగిన్ తీసుకుని వీఆర్వోలకు, వీఆర్ఏలకు పనులు అప్పగించారు. సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాల్సిన సిబ్బంది.. అవకాశం దొరకడంతో అవకతవకలకు పాల్పడినట్లు చాలా సంఘటనల్లో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు మాత్రమే అధికారుల దృష్టికి వచ్చాయి. మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఎల్లంపేట గ్రామాలకు చెందిన వీఆర్ఏలు, తమ పేర్లమీద, తమ బంధువుల పేర్ల మీద ప్రభుత్వ భూములను రికార్డులలో నమోదు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాడి వీఆర్ఏ సైతం రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను తమ బంధువులు, సన్నిహితుల పేరిట వీఆర్వోలు, వీఆర్ఏలు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లాలో రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం 20 వేలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. రైతుబంధు పథకం డబ్బులను కాజేసేందుకే ఆయా గ్రామాల్లో వీఆర్ఏలు, వీఆర్వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉంది. ఫోన్ఇన్ ద్వారా వెలుగులోకి.. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలనే సంకల్పంతో కలెక్టర్ సత్యనారాయణ రెండు నెలల క్రితం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన జేసీతో కలిసి రోజూ ఉదయం గంట పాటు ఫోన్ ద్వారా రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండలాల అధికారులను ఆదేశిస్తున్నారు. ఫోన్ఇన్లో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యంపైనే ఉంటున్నాయి. ఫోన్ఇన్ ప్రారంభమయ్యాక వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్పడిన అవినీతిని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇలా నలుగురు వీఆర్వోలు, పలువురు వీఆర్ఏలపై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించడంతో జరుగుతున్న అవకతవకలు నిర్ధారణ అయ్యాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లి వీఆర్వో సూర్యవర్ధన్ను వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమార్పేట్ వీఆర్వో మల్లేశ్ విధుల్లో నిర్లక్ష్యం కనబరచడం, ఇతర ఆరోపణలపై సస్పెన్షన్కు గురయ్యారు. ఇసాయిపేట, ఎల్లంపేట వీఆర్ఏలు ప్రభుత్వ భూములను తమ బంధువుల పేర్ల మీదకు మార్చినట్లు రుజువు కావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. వాడి వీఆర్ఏ కూడా గతంలో రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి వీఆర్ఏ నర్సింలు సైతం రికార్డులలో తప్పులు, అనుచిత ప్రవర్తన కారణంగా çసస్పెన్షన్కు గురయ్యారు. నెలరోజుల క్రితం రామారెడ్డి మం డలం మోషంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్ఏలు గ్రామానికి చెందిన మరొకరి భూమిని వారి పేర్ల మీదకు మార్చేందుకు ప్ర యత్నించగా అధికారులకు ఫిరఘ్యదులు వచ్చా యి. విచారణలో వాస్తవమేనని తేలడంతో స స్పెండ్ చేశారు. వీఆర్ఏల పనితీరుపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి. పక్షం రోజుల్లో.. పక్షం రోజుల్లో పలు మండలాలకు చెందిన ఐదుగురు వీఆర్ఏలు, ఇద్దరు వీఆర్వోలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం చూస్తుంటే రెవెన్యూశాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది. జిల్లాలోని మరో వీఆర్వో ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతేగాకుండా రైతుల పేరిట రికార్డులను నమోదు చేయడం, పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పించడంలోనూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. చర్యలు తప్పవు గతంలో రెవెన్యూ రికార్డుల నమోదులో జరిగిన అవకతవకలు మా దృష్టికి వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించాం. తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్, మాచారెడ్డి -
పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు వ్యవసాయం భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. రైతులు శ్రమకోర్చి అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు పంటఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ధరలు పలకడం లేదు. ఫలితంగా పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దుర్భర స్థితిలో పెట్టుబడి సాయం వారికి ఆయువుగా మారింది. ప్రభుత్వం అంజేస్తున్న ఈ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాల్లో జమ అయ్యిందే పాపం.. ఆ సొమ్మును గత పంట రుణం లేదంటే దాని వడ్డీ కింద బ్యాంకర్లు తీసుకుంటున్నారు. కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన రైతులు ఉట్టి చేతులతో తిరుగుముఖం పడుతున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం అందజేస్తున్న సాయం.. రైతు దరికి చేరడం లేదు. ఫలితంగా సర్కారు లక్ష్యంగా నీరుగారుతోంది. బ్యాంకుల కోత.. రైతుబంధు డబ్బులు ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో బ్యాంకు ఖాతా వివరాలు అందజేసిన 2.47 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. ఇప్పటిరకు సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమైంది. వాస్తవంగా రైతుబంధు డబ్బుల కోసం పథకం ఆరంభంలో కొందరు రైతులు ప్రత్యేకంగా ఖాతాలు తెరిచారు. వీటిని లోన్ ఖాతాలుగా పరిగణిస్తున్నారు. మరికొందరు రైతులు తమకు అప్పటికే ఉన్న పొదుపు ఖాతాల వివరాలను సమర్పించారు. లోన్ ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మను బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నారు. గతంలో తీసుకున్న పంట రుణం, వడ్డీ చెల్లింపు పేరిట ఈ సొమ్మును ఉంచుకుంటున్నారు. సేవింగ్ ఖాతాల్లో పడిన సాయంలో కోత పడటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఎటువంటి భేదం లేకుండా పెట్టుబడి సొమ్ము కచ్చితంగా రైతులకు అందాల్సిందే. ఈ విషయంలో ఇటు అధికారులు, బ్యాంకర్లు తీవ్రంగా విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. రుణ మాఫీ చేసిఉంటే.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో రైతులు పంట రుణాలు, వడ్డీ చెల్లించడం లేదు. ఇటీవల తీసుకున్న పంట రుణాలను కూడా రెండోసారి అధికారిలోకి వచ్చిన ఆ పార్టీ... వెంటనే మాఫీ చేస్తుందని రైతులు కొండంత ఆశతో ఉన్నారు. ఇటువంటి వారంతా రుణ మాఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో గతేడాది తీసుకున్న రుణాల గడువు ముగియడంతో చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ కష్టానికోర్చి చెల్లిస్తే తమకు మాఫీ వర్తించదేమోన్న బెంగ రైతులను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు రైతులకు ఇవ్వడం లేదు. ఒకవేళ రుణమాఫీ అయి ఉంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు తీసుకోవద్దని గతంలో కలెక్టర్ లోకేష్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. అయినా, కలెక్టర్ ఆదేశాలు బ్యాంకర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటిదేమీ లేదన్నారు. ఒకవేళ బ్యాంకర్లు పెట్టుబడి సొమ్ము ఇవ్వకుంటే.. సదరు రైతు ఖాతాను పరిశీలించాలని, అప్పుడే ఏ పద్దు కింద జమ కట్టుకున్నారో తెలుస్తుందని సమాధానమిచ్చారు. -
పెట్టుబడి సాయంలో జాప్యం
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం అనేక మంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఎదురుచూస్తున్నా ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా 38 శాతం మంది అన్నదాతలకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులపై పంటల సాగు భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడి కింద రైతులకు ఎకరాకు ఈ సీజన్ నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో 2.36 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. వీరిలో ఇంతవరకు 1.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమైంది. మొత్తం రూ.161.24 కోట్ల డబ్బులు అన్నదాతలకు అందాయి. మరో 88,482 మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరికి సుమారు రూ.90 కోట్ల నిధులు అవసరం. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడమే జాప్యానికి కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అప్పులు తెచ్చి సాగు.. రైతుబంధు సాయం అందుతుందున్న ధైర్యంతో చాలా మంది రైతులు అప్పు తెచ్చి పంటల సాగుచేస్తున్నారు. వాస్తవంగా సకాలంలో పెట్టుబడి సాయం అందితే.. కొంతలో కొంతైనా అప్పు భారం రైతులకు తప్పేది. రైతుబంధు సాయం అందజేతలో జాప్యం జరుగుతుండటంతో తమకు వడ్డీ భారం పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో కొందరికి ఖాతాల్లో డబ్బులు జమకాకపోగా.. మరికొందరు సాంకేతిక లోపాల వల్ల రైతుబంధుకు నోచుకోవడం లేదు. బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్ కోడ్, ఆధార్నంబర్లు తదితర వివరాలు తప్పుగా నమోదు కావడం వల్ల డబ్బులు అందడం లేదు. ఇంకొందరు వీటిని సరిదిద్దడానికి సరైన వివరాలు ఇచ్చినా ఆన్లైన్లో ఇంకా అప్డేట్ కావడం లేదని తెలుస్తోంది. దీంతో సాయం ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. -
ఏజెన్సీలో ‘పోడు’ పోరు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట పంచాయతీ పరిధిలోని వీరాపురం, కోటగడ్డ గ్రామాల్లో పోడు పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో 19 మంది ఆదివాసీలను పోలీసులు అరెస్టు చేశారు. కోటగడ్డ గ్రామం పరిధిలోని 20 హెక్టార్ల భూమి విషయంలో గత ఏడాది కాలంగా అటవీ శాఖకు, ఆదివాసీలకు పోరు జరుగుతోంది. ఈ భూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు శనివారం ఉదయం ట్రాక్టర్లతో దుక్కి దున్నుతుండగా 19 మంది ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అటవీశాఖ సెక్షన్ అధికారి సుక్కి, బీట్ అధికారి సత్యవతికి గాయాలయ్యాయి. కొందరు గిరిజనులు కూడా గాయపడ్డారు. అనంతరం ఆదివాసీలను అరెస్టు చేసి ఇల్లెందు పోలీస్స్టేషన్కు తరలించిన తర్వాత అటవీ అధికారులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ అనిల్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కోటగడ్డ అటవీ ప్రాంతంలో మొత్తం 34 హెక్టార్లు ఉండేదని, ఇందులో 14 హెక్టార్లు గిరిజనులకు, 20 హెక్టార్లు అటవీ శాఖ పరిధిలో ఉండేలా గతంలోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఎవరికీ పట్టాలు లేవని, ఒకవేళ ఎవరి వద్దనైనా ఉంటే అవి చూపిస్తే.. మొక్కలు నాటిన తర్వాత కూడా వారికే అప్పగిస్తామని చెప్పారు. హక్కు పత్రాలు లేకుండా పోడు నరికి భూమి తమదే అంటే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అరెస్టు చేసిన వారిలో ఒక్కరికి కూడా హక్కు పత్రాలు లేవని స్పష్టం చేశారు. కాగా, ముత్తారపుకట్ట సర్పంచ్ మంకిడి కృష్ణ మాట్లాడుతూ.. ఈ భూమిలో మల్లెల కృష కు 9 ఎకరాలు, కళకు 5 ఎకరాలు, సుగుణకు 4 ఎకరాల పట్టా ఉందని, రైతుబంధు పథకం కింద సాయం కూడా పొందారని వివరించారు. -
కొందరికే రైతుబంధు
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): జిల్లాలో రైతుబంధు కొందరికే అందింది. ప్రభుత్వం విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందలేదు. జిల్లాలోని 40 శాతం రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందగా, మరో 60 శాతం మంది రైతులకు అందాల్సి ఉంది. ఆయా రైతులకు సాయం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలోని 2,29,566 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం రూ.252.63 కోట్ల నిధులు అవసరమని తేల్చారు. మే చివరి వారం లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి స హాయంను అందించేందుకు ప్రభుత్వం ని ధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయం అందింది. ఇప్పటి వ రకు రూ.119 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రూ.133.63 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజను పనులు రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రైతులు పసుపు, మొక్కజొన్న, సొయా విత్తనాలు విత్తే పనిలో పడ్డారు. వరి పంటను సాగు చేయడానికి నారు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను ఇప్పటికే కొందరు రైతులు కొనుగోలు చేయగా, మరి కొందరు రైతులు కొనుగోలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. అయితే, రైతులకు గడచిన మే నెలలోనే పెట్టుబడి సహాయం అందించి ఉంటే ఇప్పటికే రైతులు పంటల సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే వారు. అయితే, రైతుబంధు అందించడానికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి త్వరగా ఆర్థిక సాయం అందించాలని అన్నదాతులు కోరుతున్నారు. తొందరలోనే నిధులు.. తొందరలోనే రైతులందరికీ రైతుబంధు నిధులు ఖాతాల్లోకి చేరుతాయి. ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. త్వరలోనే నిధులు పూర్తి స్థాయిలో విడుదల అయి రైతులకు పెట్టుబడి సహాయం అందుతుంది. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
‘రియల్’కు ‘రైతుబంధు’!
సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్టాపిక్గా మారింది. మిర్యాలగూడ డివిజన్లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది. మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్ ఎస్టేట్ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం. పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం.. అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి. అనుమతి లేని లేఅవుట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు. ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ? మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్ను పరిశీలించి వదిలేశారు. -
రైతుకు భరోసా
నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. సమస్యల ఏకరువు.. చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్కు ఫోన్లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ ఫోన్ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి ఫోన్ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని సంబంధిత వీఆర్ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్ ఇన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. సార్ నీ కాల్మొక్త.. పాసు బుక్ ఇస్తలేరు కలెక్టర్ సార్ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ. కలెక్టర్ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్ మీకు రుణపడి ఉంటా. నా భూమి నాకు ఇప్పించండి సార్.. నా పేరు కుర్వ దశరథ్. ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్ తహసీల్దార్ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్దే అని తేలితే సంబంధిత వీఆర్ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది సార్ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి. కలెక్టర్ స్పందిస్తూ.. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది. కొత్త పాసుపుస్తకం రాలేదు సార్.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్ మీకు పుణ్యమొస్తది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఫోన్ ఇన్ నీరటి వెంకటమ్మను లైన్లోనే పెట్టి వెంటనే వీఆర్ఓ కు ఫోన్ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్కు ఆదేశించారు. వీఆర్ఓ తో ఫోన్లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్పై ఉండాలని ఆదేశించారు. ఇనాం భూములకు.. సార్.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందిస్తూ.. బాపన్పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బుక్క రాలే.. పైసలు పడలే సార్.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం. నా కొడుకు జర్మనీలో ఉంటాడు సార్.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. కలెక్టర్ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలి. మీరు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్ నంబర్కు లింకైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్ చెబితే లింకప్ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. తహసీల్దార్ను కలిసిన రైతులు తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేశారు. కలెక్టర్కు ఫోన్ ఇన్లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
పార్ట్–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతులకు శాపంగా మారింది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. ఇప్పటికీ రెండు దఫాలు రైతుబంధు సాయం పంపిణీ చేసిన సర్కారు.. తాజాగా ఖరీఫ్ సీజన్కు గాను నగదును బ్యాంకుల్లో జమ చేస్తోంది. అయితే, పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేసింది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీ కింద పరిగణించిన సర్కారు.. ఆ భూములకు పట్టాదార్ పాస్పుస్తకాలను జారీ చేయలేదు. పెట్టుబడి సాయానికి పాస్బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ కేటగిరీ కింద చేరిన భూముల రైతులకు రైతుబంధు రాకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,534 ఖాతాల్లోని 9,92,295 ఎకరాల మేర భూములను పెట్టుబడి సాయం కింద పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో సుమారు రూ.496 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాల్లోకి చేరడంలేదు. అడ్డగోలుగా నమోదు రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కేసీఆర్ సర్కారు.. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం కింద వివాదరహిత భూములకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. వివాదాస్పద, అభ్యంతర భూములకు మాత్రం వాటి జారీని పక్కనపెట్టింది. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, అన్నదమ్ముల భూపంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా., ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం డెడ్లైన్ విధించడం, ఖరీఫ్లోపు కొత్త పాస్పుస్తకాలను జారీ చేసి రైతుబంధును ప్రవేశపెట్టాలనే ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం.. లోతుగా పరిశీలించకుండా వివాదరహిత భూములను కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. దాయాదులు, ఇతరత్రా ఎవరి నుంచి ఫిర్యాదు అందినా.. ఆ భూములకు పాస్బుక్కులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. ఈ విషయం తెలిసిన రైతులు.. తహసీళ్ల చుట్టూ ప్రదక్షణలు చేసినప్పటికీ, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో ఈ భూముల వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పార్ట్–బీ భూముల జాబితాను పరిశీలించి పరిష్కారం చూపెట్టకపోవడంతో మూడు సీజన్లలోను సంబంధిత రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఈ సారైనా వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితాను సవరించకపోతే లక్షలాది మంది అన్నదాతలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారనుంది. -
రైతుబంధుకు ‘సీలింగ్’!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూమి ఎంతున్నా రైతుబంధు సొమ్మును అందరికీ వర్తింపజేయాలని సర్కారు భావిస్తే, వ్యవసాయశాఖ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోయినా స్వతహాగా సీలింగ్ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నా, బహిరంగంగా దీనిపై మాట్లాడటం లేదు. ‘మాకు సర్కారు నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. కానీ 50 ఎకరాలు దాటిన వారికి మాత్రం పెట్టుబడి సొమ్మును నిలిపివేశాం’అని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. గత రబీలోనూ కొందరు రైతులకు ఇలాగే రైతుబంధు సొమ్మును నిలిపివేసినట్లు అప్పట్లో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సీలింగ్పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ప్రభుత్వం ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం చేయాలని భావించి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 54.50 లక్షల మందికి ఈ ఖరీఫ్లో ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ‘గివ్ ఇట్ అప్’నే ప్రోత్సహించాలన్న సర్కారు... రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్త మన్ననలు పొందడంతో పాటు ఏకంగా ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. దేశంలో పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మోడల్గా తీసుకొని పీఎం–కిసాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కేంద్రం మొదలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరిగా దీన్ని అమలుచేయడంలేదు. ఇంత సొమ్మును ఏ ప్రభుత్వం ఇవ్వడంలేదు. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నారు. మొదట్లో దీని అమలుకు సీలింగ్ తీసుకురావాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. కానీ ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోలేదు. ఎవరైనా పెద్ద రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వదులుకుంటే సరేనని, లేకుంటే వ్యవసాయ భూమి ఎంతున్నా ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వచ్ఛందంగా పెట్టుబడి సాయాన్ని వదులుకునే వారి కోసం ‘గివ్ ఇట్ అప్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు సంబంధిత పెద్ద రైతులు వ్యవసాయాధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని సూచించారు. అలా వదులుకున్న సొమ్మును రైతు సమన్వయ సమితి నిధికి పంపిస్తామని కూడా సర్కారు స్పష్టం చేసింది. కానీ స్వచ్ఛందంగా వదులుకోవడంపై ప్రచారం చేయాల్సిన అధికారులు ఇలా 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిర్భందంగా నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. వారిలో కొందరిని అధికారులు బుజ్జగించి సొమ్ము అందజేస్తున్నట్లు తెలిసింది. మొత్తం రైతుల్లో 50 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతుల సంఖ్య దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఉంటారని అంచనా. ‘గివ్ ఇట్ అప్’కు స్పందన రాకపోవడంతో అధికారులు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. ఇదిలావుండగా సీలింగ్పై ఏ అధికారి కూడా అధికారికంగా స్పందించడంలేదు. ఇప్పటివరకు రూ. 3,430 కోట్లు అందజేత... ఈ ఏడాది ఖరీఫ్ రైతుబంధు కింద 33.70 లక్షల మంది రైతులకు రూ. 3,430 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన సొమ్మును కూడా విడతల వారీగా జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
డబ్బుల్ ధమాకా
తొలకరి జల్లులు కురిసింది మొదలు దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం ఇలా అన్నదాతకు ఎన్నో రకాల ఖర్చులుంటాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగుబాట పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా.. వర్షాభావం, కరువు కాటకాలతో పెట్టుబడి చేతికి రాకపోగా చివరికి చేసిన అప్పులే మిగులుతున్నాయి. మరోపని చేయలేక ఉన్న భూమిని నమ్ముకుని కష్టాల సాగు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారి కష్టాలను దూరం చేసేందుకు.. మొహాల్లో చిరునవ్వును చిందించేందేకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కిసాన్ పథకంలో ప్రతిరైతుకు రూ.6వేల చొప్పున అందిస్తోంది. వారి వివరాలు కూడా కలిపితే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాక్షి, మెదక్ : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్సమ్మన్ నిధి పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పేర్కొంది. జిల్లాలో ఐదెకరాల లోపు 1,18,386 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.71కోట్ల 30 లక్షల 16వేలు అవుతోంది. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇంకా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రాని వారు చాలా మంది ఉన్నారు. రైతుబంధుతో రూ.372 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించేది. దానిని ప్రస్తుతం రూ.5 వేలకు పెంచింది. ఖరీఫ్, రబీసీజన్ కలిపి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వనుంది. జల్లాలోని 2,11,104 మంది లబ్ధిదారులలు 3.70 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.372 కోట్లను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనుంది. ఎకరం భూమి ఉన్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.16 వేల చొప్పున అందిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిల్లా రైతులకు రూ.443 కోట్ల 30 లక్షల 16వేలను అందిస్తున్నాయి. ‘రైతుబంధు’ అందింది ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నదాతలకు గొప్పవరం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షించదగిన విషయం. నాకు ఉన్న రెండన్నర ఎకరాలకు సంబంధించి రూ.12,500 వచ్చింది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. – కొమ్మాట బాబు, రైతు, నిజాంపేట -
రైతుబంధుపై ఆందోళన వద్దు
బషీరాబాద్: మీ సేవలో ఆధార్ లింక్ చేసుకున్న రైతులందరికీ త్వరలో పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ తెలిపారు. రైతుబంధు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. బషీరాబాద్ మండలం జలాల్పూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు హాజరైన కలెక్టర్ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. నీళ్లపల్లి అటవీ ప్రాంతం లోని భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో రైతుబంధు సాయం అందుతుందని చెప్పారు. ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధా ర్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. జలాల్పూర్లో చెం చులు తమకు పాసుపుస్తకాలు రాలేదని కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేప చేదు ఉమామహేశ్వరి, వీఆర్ఓ పెంటప్ప, రైతులు పాల్గొన్నారు. బడిబాటను విజయంవంతం చేయాలి... వికారాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14 నుంచి 19వరకు అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 14న వికారాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఏడీ భరత్ కుమార్, అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్గౌడ్, డీడబ్ల్యూఓలు జ్యోత్స్న, హన్మంతరావు, చైల్డ్లైన్ సభ్యులు పాల్గొన్నారు. బషీరాబాద్ ఎందుకు వెనకబడింది.. బషీరాబాద్: మరుగుదొడ్ల నిర్మాణంలో బషీరాబాద్ మండలం ఎందుకు వెనకబడిందని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరుకు మండలంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని రాధాకృష్ణ సమావేశ మందిరంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, ఎంపీపీ కరుణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని ఓడీఎఫ్గా మార్చడానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరిష్కరించుకోవాలనితెలిపారు. ఇసుక సమస్య లేకుండా తహసీల్దార్ అనుమతులు ఇస్తారని చెప్పారు. గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఉద్యమంలా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. ఈ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రవి, ఎంపీడీఓ అనురాధ, ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఎస్ఐ మహిపాల్రెడ్డి, ఉపాధి, వెలుగు అధికారులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రైతుబంధు అందాలి
మెదక్జోన్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అప్లోడ్ కాని రైతుల ఖాతాల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెండిం గ్లో ఉన్న ప్రతిరైతు వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి రైతుకు రైతుబంధు చేరాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏరైతూ నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతిఅధికారి అప్రమత్తంగా ఉండి రైతుబంధును విజయవంతం చే యాలన్నారు. ప్రతిఐదువేల ఎకరాలకో ఏఈ వోను ప్రభుత్వం నియమించిందని, వారు ప్రతి రోజు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అదికా రులు రైతులను కూరగాయల సాగు వైపునకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు హైదరాబాద్ నుంచి కూరగాయల దిగుమతి అవుతోందని, మన జిల్లాకు డిమాండ్ మేర కూరగాయలను మన జిల్లాలోనే సాగయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మార్కెట్ సౌకర్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను పం డించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సీతాఫల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతిఇంటికి మునగ, బొప్పాయి మొక్కలను అందించాలన్నారు. ఈ సారి హరితహారంలో ప్రజలకు ఇష్టమైన మొక్కలనే పంపిణీ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచయతీ కార్యదర్శులు ఊరూరా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాం, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్తో పాటు ఏడీఏలు, ఏవోలు, ఉద్యానవనశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుబంధు సాయం.. రూ.350 కోట్లు
ఖరీఫ్ ప్రారంభ సమయానికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గత రబీ సీజన్ వరకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం గత రబీలో ఎంపిక చేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతు సమగ్ర సమాచారం సేకరణతో.. సాగులో లేని భూములకు రైతుబంధు వర్తింపజేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాచారం(ఇబ్రహీంపట్నం): ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన జిల్లాలోని 2,77,516 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.350 కోట్లు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఖరీష్కు పెరిగిన రైతుల సంఖ్య... గత రబీ సీజన్లో పెట్టుబడి సాయాన్ని 2,74,000 మంది రైతులకు అందజేస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో అదనంగా 3,500 మంది రైతులు పెరిగారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2,77,516 ఉండగా, అందులో 2లక్షల 24వేల మంది రైతులకు సంబంధించి భూ వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 20వేల మందికి పైగా రైతులు సరైన వివరాలు అందజేయని కారణంగా రైతుబం«ధు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నారు. ఆన్లైన్ నమోదు కోసం రైతులు రికార్డులు అందజేస్తే వెంటనే వారి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా భూముల క్రయ, విక్రయాల వల్ల కూడా కొందరి రైతులకు రైతుబంధు అందడం లేదు. భూ వివరాలు తక్షణమే అందజేస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు ఎంతో మేలు ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతుబంధు సాయం జమ చేస్తుండడం సంతోషకరం. 15 ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – బత్తుల మోహన్రెడ్డి, రైతు, మాడ్గుల -
కాసులు ఖాతాల్లోకి..
ఖమ్మంవ్యవసాయం: పెట్టుబడి పైకం రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించి.. రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు జిల్లాలో 2,79,198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఒక్కో సీజన్కు ఎకరాకు రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లలో వేర్వేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సహా యం రూ.8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్లో చెక్కుల రూపంలో పెట్టుబడి అందించిన ప్రభుత్వం.. రబీ సీజన్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. గత ఏడాది సీజన్కు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకంలో ఎకరాకు సీజన్కు మరో రూ.వెయ్యి పెంచుతామని పేర్కొంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపి.. ఖరీఫ్ సీజన్ నాటికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. 2,79,198 మంది రైతులకు ‘పెట్టుబడి’ జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు(పోడు) హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్లు కేటాయింపు జిల్లాలో వివిధ రకాలుగా పట్టాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమి లో పంటల సాగుకు పెట్టుబడి సహాయంగా రూ.343.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. పెట్టుబడి సహాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిçంచే ప్రయత్నాలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాల ద్వారా చేరుతుంది. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంట పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
రైతుల ఖాతాల్లోకి రూ.2,233 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం నిధులను అధికారులు విడతలవారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ–కుబేర్ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. మంగళవారం నాటికి మొత్తం 21.22 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,233.16 కోట్లు రైతుబంధు డబ్బు జమ చేశారు. మిగిలిన సొమ్మును వారం పది రోజుల్లో జమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఖరీఫ్ సాగు మొదలైన నేపథ్యంలో పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో వారు నష్టపోకుండా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సహకార, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.1,080 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఖరీఫ్ ‘పెట్టుబడి’
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం నగదు రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఖరీఫ్లో రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడే విధంగా ఈ నెల మొదటి వారంనుంచి రైతుల ఖాతాల్లో నగదును జమచేయడాన్ని వ్యవసాయశాఖ ప్రారంభించింది. మృగశిర కార్తె ప్రారంభం కావడం జిల్లాలో రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు ప్రారంభించారు. సీజన్ మొదట్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేయడంతో.. రైతులకు సకాలంలో పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 4,14,272 మంది రైతులకు గాను రూ.579,96,32,660లను రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమచేయాల్సి ఉంది. అయితే ట్రెజరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 19,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.17,73,81,865 బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు వరుస క్రమంలో ఖాతాల్లో జమకానున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలకు ఖాతా నంబర్లు అందజేయాలి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులు సవరణలు చేసిన తరువాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పాస్బుక్కలు వచ్చిన వారు జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారికి గత ఖరీఫ్, రబీలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమకాలేదు. వారందరి నుంచి పాస్పుస్తకాల జిరాక్స్లను, రైతు ఖాతా నెంబర్లను సేకరించాలని వ్యవసాయ శాఖను అదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి పాస్పుస్తకాల జిరాక్స్లు, ఖాతా నంబర్లను సేకరించే పనిలో ఉన్నారు. రైతులందరూ విధిగా వ్యవపాయ విస్తరణాధికారులకు జిరాక్స్లను అందజేయాలని కోరుతున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు.. ఇతరుల నుంచి భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని తహసీల్దార్ నుంచి పాస్ పుస్తకం తీసుకున్న వారు కూడా రెవన్యూ శాఖ.. తమ పేరు వ్యవసాయ శాఖకు పంపిన జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ జాబితా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాల్సి ఉంది. వారి పేరు జాబితాలో ఉంటే వారు కూడా పాస్పుస్తకం, ఖాతా నెంబర్ జిరాక్స్లను అందజేస్తే ఖరీఫ్లో రైతుబంధు నగదు జమచేసే అవకాశం ఉంటుంది. దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ.. ఖరీఫ్లో రైతుబంధు పంపిణీ ఇప్పటికే ప్రారంభమై సుమారు రూ.17 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతులందరికీ తప్పకుండా దశల వారీగా ఖాతాల్లో జమచేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలును ప్రారంభించారు. రైతుబంధు పథకం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడనుంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకుని సకాలంలో పంటల సాగును చేపట్టాలి. – జి.శ్రీధర్రెడ్డి, జేడీఏ -
‘రైతుబంధు’వు రూ.88.81 కోట్లు
హన్మకొండ: వాన చినుకు పడింది మొదలు పొలం, సాగు పనులే లోకంగా అన్నదాతలు జీవనం సాగిస్తారు.. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇంకా చెబితే చీడపీడల కారణంగా అన్నదాతకు పంటలపై వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు.. ఫలితంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించేందుకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు అందజేశారు. అయితే, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచనున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నగదును ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రణాళికాయుతంగా.. గత వానాకాలం, యాసంగి సీజన్లో రైతుబంధు కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మూడో సారి ప్రస్తుత వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రబీలో రైతుబంధు అందించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నగదు రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో అదే విధానాన్ని ఈ ఖరీఫ్లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే వివరాలన్నీ సిద్ధం కాగా.. ఈనెలలోనే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేయనున్నారు. 11 మండలాలు... 77,079 మంది రైతులు వరంగల్ అర్బన్ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77,079 మంది రైతులు, 1,77,619.2 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని రైతులకు రూ.88,81,25,992.5 పెట్టుబడి సాయం అందనుంది. -
‘బంధు’.. భరోసా
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులకు సాగు సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా సహాయం అందిస్తోంది. గతంలో ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. మొదట చెక్కుల రూపంలో పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాటు చేసింది. పేద, మధ్య తరగతి రైతులకు ఈ పథకం వరప్రదాయినిగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరాకు రూ.2 వేలు చొప్పున పెంచారు. అంటే ఒక్కో సీజన్లో ఎకరానికి రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులకు రూ.35 కోట్ల అదనపు లబ్ధి చేకూరనుంది. 888 గ్రామాలు.. 1,19,115 మంది రైతులు.. వచ్చే ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 888 గ్రామాలకు చెందిన 1,19,115 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరికీ పెరిగిన సహాయం ప్రకారం రూ.186,25,15,662లను బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందులో పట్టాదారు పాస్పుస్తకాలు కలిగిన అర్హులైన 359 గ్రామాలకు చెందిన 1,00,835 మంది ఉన్నారు. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.152, 26, 98, 991 జమ చేయనున్నారు. ఇక ఆర్ఓఎఫ్ఆర్ కింద 529 గ్రామాలకు చెందిన 18,280 మంది రైతుల ఖాతాల్లో రూ.33,98,16,671 జమ చేస్తారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి మరో రూ.వెయ్యి ఆర్థిక సాయం పెంచడంతో సన్న, చిన్నకారు రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పెరిగిన రైతుబంధు సహాయంతో తమ జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగు పడ తాయని ఆయా వర్గాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల్లో పంపిణీ రైతుబంధు పథకానికి ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు కూడా విడుదలయ్యాయి. జిల్లాలోని అన్ని గ్రామాల రైతులకు మూడు వారాల్లో రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. – కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి -
ఖరీఫ్ రైతుబంధుకు రూ.6,900 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో రైతుబంధు పథకం అమలుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 6,900 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేస్తారు. సొమ్ము మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి పంపిస్తామని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ఎంత మేరకు మొదటి రోజు పంపిస్తారన్న దానిపై తమకు స్పష్టత లేదని, ఆర్థికశాఖ తన వద్ద ఉన్న నిధుల నుంచి విడుదలవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడంతో వీలైనంత త్వరగా రైతులందరికీ విడతల వారీగా సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుం దని తెలిపాయి. వాస్తవంగా ఖరీఫ్కు పెట్టుబడి సాయాన్ని మే నెలలోనే ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు ఎన్నికల కోడ్ కొనసాగడంతో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. 2019–20 బడ్జెట్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుబంధు అమలుకోసం సర్కారు రూ. 12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 6,900 కోట్లు ఖరీఫ్ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.38 కోట్ల ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. ఆ మేరకు దాదాపు 54.5 లక్షలమంది రైతులకు రైతుబంధు అందించా ల్సి ఉంది. అయితే అందులో ఇంకా కొందరు రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్లను వ్యవసాయ శాఖకు ఇవ్వలేదు. సాంకేతికంగా పట్టాదారు పాసు పుస్తకం రాకుండా అన్నీ సరిగా ఉన్న రైతులు తమను సంప్రదించాలని సర్కారు ఇప్పటికే విన్నవించింది. మూడు వారాల్లోగా అందరి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత రబీ సీజన్లో కొందరు రైతులకు పెట్టుబడి సాయం చేతికి రాలేదు. వారికి ఈ ఖరీఫ్తో కలిపి ఇస్తారా లేదా అన్నదానిపై వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గోపాల్ తనకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందిందని, కానీ రబీ సాయం రాలేదని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సరస్వతికి కూడా రబీ సొమ్ము అందలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖరీఫ్ సొమ్ముతో కలిపి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇలా లక్షలాది మంది రైతులు రబీ సాయం అందక వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు రైతుబంధు.. అటు పీఎం–కిసాన్ గతేడాది ప్రభుత్వం ఒక సీజన్కు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా, ఈ సీజన్ నుంచి రూ.5 వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచిన సంగతి విదితమే. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఐదెకరాలున్న రైతు గతంలో రూ.20 వేలు అందుకుంటే, ఈసారి రూ.25 వేలు అందుకోనున్నారు. ఒకేసారి ఇంత పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో పీఎం–కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వరకు సొమ్ము అందుకున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఐదెకరాల షరతును తొలగించి ఎన్నెకరాలున్న రైతులకైనా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణలోని రైతులందరికీ కూడా ఆ మేరకు లాభం జరగనుంది. తెలంగాణలో రైతు బంధు ఇస్తున్న ఆసరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నెకరాలున్నా రూ.6 వేలు మాత్రమే ఇవ్వడం, అదీ రూ.2 వేల చొప్పున మూడు విడతలు చేయడంతో దీనిపై రైతుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. -
రైతుబంధుకు సన్నద్ధం
మహబూబ్నగర్ రూరల్: ఖరీఫ్లో పంటల సాగుకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు వ్యవసాయశాఖ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉండటంతో ఆ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఈ–కుబేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఖరీఫ్ సీజన్లో రైతులకు చెక్కుల రూపంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. రబీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈసారి వానాకాలం పంట (ఖరీఫ్) కోసం కూడా రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వనుండటంతో రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి సాయం పెంపు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది. గత ఖరీఫ్ సీజన్లో.. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం అమలులో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 3,35,252 మంది రైతులకు రూ.355.21 కోట్లు మంజూరు చేయగా రూ.219.67 కోట్ల పెట్టుబడి సాయం కింద 2,87,128 మంది రైతులకు అందింది. వివిధ కారణాలతో రూ.136.21 కోట్లు రైతులకు అందలేదు. రబీ సీజన్లో రూ.342.12 కోట్లు జిల్లాకు విడుదల కాగా అందులో రూ.307.7 కోట్లు పెట్టుబడి కింద 2,62,612 మంది రైతులకు పంపిణీ చేశారు. పలు కారణాల వల్ల పంపిణీకి నోచుకోని రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఆనాడు నిలిచిపోయిన పెట్టుబడి పంపిణీపై వ్యవసాయ శాఖాధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్లి రైతులు కోరుతున్నారు. గతేడాది రూ.697.33 కోట్లు 2018–19 ఖరీఫ్లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. అలాగే రబీ సీజన్లో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.697.33 కోట్లు కేటాయించినా రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం గమనార్హం. సమస్యలు అధిగమించేనా..? గతేడాది ఖరీఫ్ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో 88,738 మంది రైతులు రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. నేరుగా ఖాతాల్లో జమ ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెట్టుబడి సాయం పంపిణీ కొంత ఆలస్యమైంది. జిల్లా రైతులకు రైతుబంధు సాయం పంపిణీపై చర్యలు చేపడతాం. ప్రస్తుత సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తాం. జిల్లాలో ఇంకా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించాల్సి ఉంది. ఏఈఓల ద్వారా వారి ఖాతా నంబర్లు సేకరిస్తాం. – సుచరిత, జేడీఏ, మహబూబ్నగర్ -
ఎకరానికి రూ. 5,000
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు సాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి రైతుకూ ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం విడుదల చేశారు. గతేడాది సీజన్కు ప్రతి రైతుకూ ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర అందించింది. ఈ ఖరీఫ్ నుంచి దాన్ని రూ. 5 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ ఖరీఫ్ నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకూ అందించనున్నారు. ఇందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్బీఐకి చెందిన ఈ–కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం ఆన్లైన్లో జమ చేస్తామని పార్థసారథి వివరించారు. పట్టాదారు పాసుపుస్తకంగల రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాగల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందించనుంది. రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు అందిన సమాచారం ప్రకారం 1.35 కోట్ల ఎకరాలకు చెందిన 54.50 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా ఆ ప్రకారం ప్రభుత్వం రూ. 6,750 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన రైతుల జాబితాలోని వారిలో కొందరు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించలేదు. ఒక అంచనా ప్రకారం వ్యవసాయశాఖ వద్ద కచ్చితంగా 50 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలున్నాయి. వారికి మాత్రమే రైతుబంధు సొమ్ము అందే అవకాశముంది. మిగిలినవారు కూడా తమ బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ వర్గాలు రైతులకు విన్నవించాయి. ఒకవేళ ఎవరికైనా అన్నీ క్లియర్గా ఉండి పట్టాదారు పాసుపుస్తకం మాత్రమే రాకపోతే, వారు కూడా తమను సంప్రదించాలని అధికారులు రైతులకు విన్నవిస్తున్నారు. ఈ ఖరీఫ్కు సంబంధించిన రైతుబంధు సొమ్ము ఈ నెల 4, 5 తేదీల నుంచే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రెండు మూడు వారాల్లోగా ప్రతి రైతుకూ సొమ్ము చేరుతుందని వెల్లడించాయి. సాయం వద్దనుకుంటే వదులుకోవచ్చు... తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులెవరైనా ఉంటే వారు ‘గివ్ ఇట్ అప్’ఫారాన్ని మండల వ్యవసాయాధికారి లేదా మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలా మిగిలిన పెట్టుబడి సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందించనుంది. గివ్ ఇట్ అప్పై రైతుల్లో విరివిగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. పీఎం–కిసాన్ సాయం కూడా... కేంద్ర ప్రభుత్వం పీఎం–కిసాన్ పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపజేస్తూ ఏటా రూ. 6 వేల చొప్పున సాయం అందించాలని శుక్రవారం నిర్ణయించింది. ఈ పథకం కింద తెలంగాణలోని రైతులకు రూ. 3,270 కోట్ల మేర వచ్చే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పథకాన్ని గత డిసెంబర్లో ఐదెకరాల లోపున్న రైతులకే కేంద్రం అమలు చేసింది. అప్పుడు తెలంగాణలో 25 లక్షల మందికి ఈ పథకం వర్తించింది. కానీ ప్రస్తుత ఏడాదిలో ఐదెకరాల పరిమితిని తొలగించి ఎంత భూమి ఉన్నా రైతులందరికీ రూ. 6 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు 54.50 లక్షల మంది ఉన్నారు. అయితే గతేడాది ఈ పథకం అమల్లో అనేక షరతులు విధించారు. ఇప్పుడు అవే షరతులు విధిస్తారా లేక రైతులందరికీ ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎవరికీ పట్టని కౌలు రైతు
హత్నూర(సంగారెడ్డి): సాగు చేసేందుకు సొంత భూమి లేక.. కూలీగా మిగలలేక.. ఆసాముల దగ్గర భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు దూరంగా కష్టాల్లోనే మగ్గుతున్నారు. పెట్టుబడికి బ్యాంకు లోను రాక, అప్పు పుట్టేదారి లేక పుట్టెడు దుఃఖంలోనే తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు. సొంత భూమి లేని కౌలు రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కౌలు రైతులు కుదేలవుతున్నారు. కౌలు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా సరైన ధర పడుతుందన్న నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, నీళ్ల కరువు ఎప్పుడూ కౌలు రైతులను భయపెడుతూనే ఉంటాయి. భూమికి కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుంది. సాగు సగంలోకి వచ్చాక పంటలకు నీళ్లందకపోతే పెట్టుబడి సొమ్ముతోపాటు కౌలు డబ్బులు నష్టపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా కౌలు రైతులను గాలికొదిలేశాయి. 2014 లోనే తమను కౌలుదారులుగా గుర్తించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వాలందించే సహాయం పట్టాదారుడికే చెందుతుండడం కౌలు రైతులకు కన్నీటినే మిగుల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. 2014వ సంవత్సరంలో 7000 మంది తమను కౌలు రైతులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా జీఓలు తీసుకువచ్చి గుర్తింపు కార్డులైనా ఇవ్వాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కౌలుదారులకు లోన్ ఎల్జిబిలిటీ కార్డులు జారీ చేస్తే బ్యాంకు రుణాలు దక్కేవి. పంట నష్ట పరిహారం అందడంతోపాటు విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేవి. కానీ ఇలాంటి ఏ సౌకర్యానికీ నోచుకోక కౌలు రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకేసారి కౌలు మొత్తం చెల్లించాలి భూ యజమానికి పంట సాగు చేయడానికి ముందే కుదుర్చుకున్న కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. పంటలు దిగుబడి వచ్చినా, రాకున్నా భూ యజమానికి సంబంధం ఉండదు. ఏడాదికి వర్షాధారిత భూములకు గతంలో ఎకరాకు రూ. 6 వేలు, సాగునీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 10 వేల కౌలు ఉండేది. ప్రస్తుతం వర్షాధార భూములకు రూ.15 వేలు సాగునీటి సౌకర్యం ఉన్న వాటికి రూ. 25 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు ఏడాదిగా కౌలు రైతుల ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయానికి నోచుకోక పంట పెట్టుబడులకు అప్పులు చేసి ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. పంట దిగుబడి రాక, వచ్చిన పంటకు గిట్టుబాటు లభించక మరింత నష్టపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రకటించినప్పటి నుంచి జిల్లా 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్నూర మండలంలో నవాబుపేట, పన్యాల, బడంపేట, సికింద్లాపూర్, దౌలాపూర్, చింతల్చెరువు, గ్రామాలతోపాటు జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, పుల్కల్, వట్పల్లి, కంది తదిదర మండలాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నప్పటికీ పంట పండలేదు. కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. – రవి, కౌలు రైతు, బడంపేట ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. సాగు సాయం చేస్తే కౌలు రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అప్పులు చేసి పంట సాగు కోసం కౌలు చేస్తున్నప్పటికీ లాభం లేదు. అరకొర పండిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా పథకం కూడా వర్తింపజేయాలి.– ఎల్లయ్య, కౌలు రైతు, మారేపల్లి -
రైతులకు మరో చాన్స్
రబీలో పంట సాగు చేసి రైతుబంధు పథకం పొందని వారికి శుభవార్త. రబీలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని, రైతుబంధు పథకం వర్తించని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. కొంతమంది రైతులు అర్హులయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నూతన పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ సాయానికి నోచుకోలేదు. రబీ దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత రెవెన్యూ యంత్రాంగం పట్టాపాస్ పుస్తకాలను అందించింది. అయితే అధికారులు గత సంవత్సరం నవంబరు నుంచి వరుస ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రైతులకు రైతుబంధు వర్తించనుంది. ఇటీవలనే తిరిగి రబీ ఆన్లైన్ సైట్ని రీ ఓపెన్ చేశారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2,81,938 మంది రైతులు ఉండగా, కేవలం 2,49,104 మంది మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు అందుకున్నారు. మిగతా 32,834 రైతులు తమవద్ద తగిన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరికి అందించాల్సిన రూ. 22,96,08,570 సొమ్ము వ్యవసాయ శాఖ దగ్గర జమయి ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోని రైతులను గుర్తించి వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రాగానే పూర్తి వివరాలతో కూడిన ప్రతులను ఏఈఓల ద్వారా రైతులకు అందించనున్నారు. ఈ ప్రకారం రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లతో ఫాం నింపి ఏఈఓకు ఈ నెల 31 వరకు అందించాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండొద్దు రైతుబంధు కోసం దరఖాస్తు చేస్తుకున్నా అనివార్య కారణాలతో బ్యాంకుల్లో చాలామంది రైతులకు సంబంధించి తిరస్కరించారు. ఇందులో అధికంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలను అందించినా డబ్బులు జమ కాలేదు. కొంత మందికి ఖాతాలో జమయినట్లు సమాచారం (మెస్సేజ్) వచ్చినా తీరా చూస్తే పాత బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇలాంటి వారికి అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు తెలుసుకున్నాక సంబంధిత గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కొత్త అకౌంట్ నంబర్లు ఇచ్చినట్లయితే ఇంతకుముందువలె ఎకరానికి రూ. 4 చొప్పున అందించనున్నారు. కాగా ఈ సహాయాన్ని ఈ ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.5వేలు చేయనున్నారు. జిల్లాలో రబీలో 32,834 మందికి రైతుబంధు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలను రైతులు సరిగ్గా ఇవ్వాలని, ఒక్క అంకె తప్పు పడినా ఇబ్బంది తప్పదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాల్లో వేయనున్నామని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రకటించింది. తొలకరి వర్షాలు కురిసే నాటికి ఖరీఫ్ సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభుత్వం ఒక్కో సీజన్కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వగా.. ఎన్నికల హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ. 5 వేలు ప్రతీ సీజన్కు ప్రతీ ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో రైతుబంధు రానివారికి రబీకి సంబంధించి ఎకరానికి రూ.4వేలు ఇవ్వనున్నారు. రైతుబంధు రాని అర్హులైన రైతులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గత రబీ సీజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు లేక, బ్యాంకు ఖాతా నంబర్లు తప్పులు, తదితర కారణాల వల్ల సుమారుగా 32,834 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం లబ్ధిదారులకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయడానికి అనుమతిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ సీజన్లో ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. బి.నర్సింహారావు, జేడీఏ -
అన్నదాతకు అండగా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముంది.. ఎంత పరిమాణంలో విత్తనాలు, ఎరువులు అవసరమో అంచనా వేసింది. మరో నెల రోజుల్లో తొలకరి పలకరించే వీలుండటంతో అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయడంలో నిమగ్నమైంది. గతేడాది తరహాలోనే 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను, భూగర్భ జలాలను నమ్ముకుని మెట్ట పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి వనరులు లేవు. దీంతో ఎప్పటిలాగే జిల్లాలో పత్తి అధిక మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 60,417 హెక్టార్లు. ఇంతే మొత్తంలో వచ్చే ఖరీఫ్లో సాగవుతుందని భావిస్తున్నారు. అయితే, గతేడాది రికార్డు స్థాయిలో 69వేల హెక్టార్లలో జిల్లా రైతులు సాగుచేశారు. వర్షాలు సకాలంలో కురిస్తే అదే స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగొచ్చని భావిస్తున్నారు. పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, వరి పంట వేయనున్నారు. కందుల సాగుపైనా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్లో సాగయ్యే అన్ని పంటలకు కలిపి సుమారు 26వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. సబ్సిడీపై విత్తనాలు పత్తి మినహా ఇతర పంటల విత్తనాలపై రైతులకు సబ్సిడీ లభిస్తుంది. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధర మారుతుంది. అయితే, ఇప్పటివరకు కొన్ని పంటల విత్తనాలకే సబ్సిడీ ధరను నిర్ణయించారు. మిగితా వాటి ధరను ప్రకటించాల్సి ఉంది. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కా>గా.. సబ్సిడీపై రూ.2,500లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150 కాగా.. రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు ఇప్పుడిప్పుడో గోదాంలకు చేరుతున్నాయి. తొలకరి ప్రారంభానికి ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు పొందవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. ముందే సాగుచేయాలి రైతుల పొలాల్లో కావాల్సిన స్థాయిలో సారం లేదు. ఈ లోటును అధిగమించేందుకు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటిని వేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. ఇప్పుడు వేసుకుంటేనే తొలకరి నాటికి పంట కావాల్సిన పోషకాల్లో సమతుల్యత ఏర్పడుతుందని వివరిస్తున్నారు. తద్వారా మంచి దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు. -
పడావు భూములకు రైతు‘బందు’?
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతుబంధు పథకంలో అన్ని భూములకు కాకుండా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రైతు సమగ్ర సర్వేలో పడావు భూములను ప్రత్యేకంగా గుర్తిస్తుండ డమే ఇందుకు కారణం.. దీంతో పడావు భూములకు పెట్టుబడి సాయం అందకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రైతు సమగ్ర సర్వేలో ప్రత్యేక కాలం చేర్చడమే ఈ ప్రచారానికి బలం చేకూర్చు తోంది. పెట్టుబడి సాయం పేర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు ఒక సీజన్లో రూ. 4 వేల చొప్పున ఇంత వరకు రెండు సీజన్లకుగాను ఏడాదిలో రూ. 8వేల చొప్పున రైతులకు అందించారు. ఈ ఖరీఫ్ సీజన్నుంచి పెట్టుబడి సాయం పెంచుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సీజన్కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10వేలు అందిస్తామని తెలిపింది. పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు.. సమగ్ర సర్వేలో పొందుపరిచిన అంశం నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడి సాయంలో కోతలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొత్తగా పడావు భూముల వివరాలు సేకరిస్తుండడంతో.. ఆ భూములకు రైతుబంధు ఇవ్వరేమోనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో రైతుబంధు వివరాలు సేకరించినప్పుడు పడావు భూముల వివరాలు లేవు. భూమి ఉంటే చాలు సాగులో ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా రైతుబంధు పథకం వర్తింపజేశారు. ఇప్పుడు పడావు భూముల అంశం చేర్చడంతో ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు ఒక సీజన్లో రూ. వెయ్యి చొప్పున పెంచిన భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే పడావు భూముల అంశం తీసుకువచ్చిందని రైతులు అనుమానిస్తున్నారు. -
భూ మార్పిడికి రైతుల మొగ్గు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని చూసిన తర్వాత అన్నదాతల ఆలోచనలు మారుతున్నాయి. వ్యవసాయ భూమి ఉండటం ఎంత లాభదాయకమో ఇప్పుడు వారికి తెలిసివస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో వివిధ కారణాల వల్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర వినియోగం (నాన్ అగ్రికల్చరల్ / నాలా) కోసం మార్పిడి చేసుకున్న రైతులు ఇప్పుడు తిరిగి అవే భూములను వ్యవసాయ భూములుగా మార్చాలంటూ రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నాన్ అగ్రికల్చరల్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు పలువురు పట్టాదారులు ముందుకు వస్తున్నారు. గతంలో కంపెనీల నిర్మాణం, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమనో ముందుగానే అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్పిడి చేసుకున్నారు. దీనికోసం ఆయా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములు నాన్ అగ్రికల్చర్ భూములుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ భూముల్లో కంపెనీల నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు, మరికొన్ని భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం పేర ఎకరాకు సంవత్సరానికి రూ.8 వేల చొప్పున గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఆర్థిక సాయం అందజేసింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పెంచిన డబ్బులు అందనున్నాయి. ఎకరాకు ఒక సీజన్కు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు రైతుకు అందనున్నాయి. దీంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు సాధారణ మరణం పొందినా రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తోంది. రైతుల పిల్లలకు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లలో (పాస్ పుస్తకాలు ఉన్నవారికి ) రిజర్వేషన్ అవకాశం కూడా ఉంది. అదే మాదిరిగా, బంగారు రుణాలపై కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి పొందితే తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. వాటితో పాటు పంట రుణాలు కూడా బ్యాంకుల నుంచి అతితక్కువ వడ్డీకి వస్తున్నాయి. ఇలా.. వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎన్నో ప్రయోజనాలను పట్టాదారు పాస్ పుస్తకాలతో పొందుతున్నారు. దీంతో పలువురు రైతులు తిరిగి తమ ‘నాలా’భూములను రద్దు చేయించుకుని వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. నష్టపోతున్న ‘నాలా’యజమానులు కంపెనీల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వారు తాము నష్టపోతున్నామన్న భావనకు వచ్చారు. అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా ఒక సారి మారిస్తే.. ఇక, ఆ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు ఉండవు. పైగా ప్రభుత్వం వ్యవసాయ భూములకు అందించే ఎలాంటి పథకాలు కూడా ఆ యజమానులకు వర్తించవు. నాన్ అగ్రికల్చర్ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే ఆ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందే అవకాశం ఉంది. కానీ అవి ఏర్పాటు చేయని కారణంగా ఇటు సబ్సిడీ రాకపోవడంతో పాటు వ్యవసాయదారులకు ఇచ్చే పథకాలు కూడా వర్తించకపోవడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు. దీంతో అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చుకున్నవారు తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏకు దరఖాస్తులు నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం శివారులో గట్టు పద్మావతి, యాపాల వెంకట్రెడ్డి అనే ఇద్దరు భూ యజమానుల పేర సర్వే నంబర్ 254లో ఆరున్నర ఎకరాల భూమి ఉంది. గతంలో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ కోసం తమ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడిచేసుకున్నారు. కానీ, అక్కడ ఆ ప్లాంటును నెలకొల్పలేదు. ఫలితంగా ఆ భూమి నాన్ అగ్రికల్చరల్ భూమిగానే కొనసాగుతోంది. దీంతో వీరు అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా.. వివిధ మండలాల నుంచి నాన్ అగ్రికల్చర్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చా లంటూ ఏడాది కాలంగా రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి. నాన్ అగ్రికల్చర్ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలనుకున్నా.. ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ను కూడా వాడుకునే అవకాశం ఉండదు. ప్రత్యేక చట్టంచేయాల్సిందే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు మాత్రమే చట్టం ఉందని, కానీ.. నాన్ అగ్రికల్చర్ భూమిని తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు చట్టం లేదని, దీనికోసం కొత్త చట్టం చేయాల్సిందేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారవర్గాలు చెప్పాయి. తాజాగా కొందరు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోగా అక్కడినుంచి నల్లగొండ కలెక్టరేట్కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి కూడా అన్ని వివరాలను సీసీఎల్ఏకు రాసి తిరిగి పంపుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. -
నిరీక్షణే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంట పెట్టుబడికి సాయం చేస్తామన్న సర్కారు సమయానికి ఆదుకోలేకపోయింది. పెట్టుబడి పైసలతో సాగు చేద్దామనుకున్న రైతులకు నిరాశనే మిగిల్చింది. రబీ సాగు సీజన్ పూర్తయినా పెట్టుబడి అందకపోవడంతో రైతులు కాసుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రైతుబంధు సాయం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అనేక మంది రైతులు భావించినా.. ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో సమాధానం లభించకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడొస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి యాసంగి సేద్యం చేసిన రైతులు మాత్రం సాగు నీరందక, ప్రకృతి సహకరించకపోవడం వంటి కారణాలతో నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. భూమినే నమ్ముకుని.. వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న రైతులను ఆదుకుని.. వారికి పంట పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం కింద ఖరీఫ్ సీజన్కు రూ.4వేలు, రబీలో రూ.4వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు. అయితే ఖరీఫ్లో మొదటిసారిగా ఈ పథకం కింద రైతులు డబ్బులు అందుకున్నారు. ఇక రెండో విడత రబీకి సంబంధించి మరికొంత మంది రైతులకు బ్యాంకుల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 2,65,355 మంది రైతులకు రూ.259కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని అందజేశారు. రబీలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే.. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం ప్రారంభం కాగా.. అప్పుడు రైతులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత వాటిని రైతులు బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అయితే రబీ సీజన్ గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతులకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులు అందజేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం చెక్కుల రూపంలో కాకుండా.. నేరుగా బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి అధికారులు రైతులకు బ్యాంకుల్లో నగదు నేరుగా జమ చేస్తున్నారు. అయితే రబీ సీజన్ పూర్తయినప్పటికీ ఇంకా కొందరికి బ్యాంకుల్లో నగదు జమ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందరికీ వచ్చినా తమకు ఎందుకు నగదు రాలేదనే ఆలోచనతో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 28,465 మందికి అందని రైతుబంధు.. రబీ సీజన్లో ఇంకా 28,465 మందికి రైతుబంధు నగదు అందాల్సి ఉంది. రైతుబంధుకు సంబంధించి రబీ సీజన్లో 2,51,759 మంది రైతులకు రూ.252కోట్లు అందాల్సి ఉంది. వీరందరికీ నగదు అందజేయాలని ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 2,23,294 మంది రైతులకు రూ.226కోట్లను పంపిణీ చేశారు. రబీ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దశలవారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. ఇంకా 28,465 మంది రైతులకు రూ.26కోట్లు అందాల్సి ఉంది. ఈ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సీజన్లో అప్పు తెచ్చుకుని పంటలు సాగు చేసుకున్నామని, పంట అమ్ముకునే సమయం వచ్చినా ఇంకా తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని పలువురు రైతులు వాపోతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం నగదు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇంకా రైతులకు ఇవ్వకపోవడానికి కారణమంటూ ఏమీ లేదని, ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొంటున్నారు. రైతుబంధు రాలేదు.. ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన కేతిరెడ్డి ఈశ్వరమ్మకు 3.28 ఎకరాల భూమి ఉంది. ఈమెకు ఖరీఫ్, రబీలో కూడా రైతుబంధుకు సంబంధించిన డబ్బులు రాలేదు. దీంతో భూమి ఉన్నప్పటికీ తనకు రైతుబంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులను అడిగితే.. వస్తుందని చెబుతున్నారని, రెండో విడతలో వస్తుందని అన్నారని ఆమె పేర్కొంటోంది. అయితే ఇప్పటివరకు రాలేదని చెబుతోంది. -
ఇంకా రాని ‘రైతు బంధు’
మోర్తాడ్(బాల్కొండ): రబీ సీజను ముగిసిపోతు న్నా రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో పలువురు రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజను కోసం రైతులు ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రానున్న మే నెలలో వచ్చే ఖరీఫ్ సీజను కోసం రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే రబీ సీజనుకు సంబంధిం చి పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో పెట్టుబడి సహాయం కోసం రైతులకు నిరీక్షణ తప్ప డం లేదు. ముందస్తు శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో జమ చేయా లని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో రైతుల ఖాతాల వివరాలను, ఆధార్ నంబర్లను వ్యవసాయాధికారులు సేకరించగా ప్రభుత్వం విడతల వారీ గా రైతుబంధు పథకం కింద నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 2.48 లక్షల మంది రైతులకు రూ.199 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంత వర కు ప్రభుత్వం రూ.146 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది. ఈ లెక్కన 75 శాతం మంది రైతులకు నిధులు ఖాతాల్లోకి చేరాయి. ఇంకా రూ.53 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ముందస్తు శాసనసభ ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా రైతుల ఖా తాల్లోకి నిధులు చేరాయి. ముందస్తు శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత మా త్రం రైతుబంధు నిలిచిపోయింది. అయితే తాము సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశామని ట్రెజరీ కార్యా లయం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం నిధులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా రు. ఇది ఇలా ఉండగా ట్రెజరీ శాఖకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్లనే రైతుబంధు పథకం కింద రైతులకు పూర్తి స్థాయిలో నిధులు జమ కావడం లేదని వెల్లడవుతోంది. మే నెలలో వచ్చే ఖరీఫ్కు సంబంధించిన పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు రబీ సీజను పెట్టుబడి సహా యం పూర్తి స్థాయిలో అందించకపోవడం తో ఖరీఫ్ పెట్టుబడిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం స్పం దించి రైతుబంధు రబీ పెట్టుబడి సహా యం పూర్తి స్థాయిలో చెల్లించి ఖరీఫ్ పెట్టుబడి సహాయంను అందించే విషయంపై స్పష్ట త ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
రైతు చింత!
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతమై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మొదటి విడతలో అధికారులు చకచకా పనులు చేసి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు అందించారు. రెండోవిడతలోనూ అలాగే అందించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఆన్లైన్ ద్వారా రైతుల ఖతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయాశాఖ అధికారులు రైతుల వద్ద వారి వ్యక్తిగత ఖాతాల వివరాలు తీసుకున్నారు. చాలామందికి అనుకున్న సమయంలోనే డబ్బులు జమ అయ్యాయి. వారిలో కొంతమందికి వివిధ కారణాలతో ఇంకా జమ కాలేదు. దీంతో రైతులు పెట్టుబడి పైసల కోసం రోజు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమలులో జాప్యం.. రైతుబంధు పథకం నగదు ఆన్లైన్ జమ నత్తనడకన సాగుతోంది. అక్టోబర్ మాసంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోనగదు జమ చేయాల్సి ఉన్నా నేటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. కానీ ఏ గ్రామానికి వెళ్లి అడిగినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని.. ఎప్పుడు అవుతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు.. రైతులు పంట పెట్టుబడి సాయంకోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. గత్యంతరం లేక మళ్లీ దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కి ఆర్థి్థకంగా నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేల చొప్పున అందించగా, రబీ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. డబ్బులు ఖాతాల్లో జమ కానీ రైతులు ఆందోళన చెంది వ్యవసాయ అధికారులను అడిగి వేసారిపోయారు. రేపు.. మాపంటూ కారణాలు చెప్పడంతో చేసేదిలేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించి అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. ఇందుకు సంబం«ధించి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటివరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ ఖాతాల్లో రైతుబంధు నగదు బదిలీ కోసం హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయానికి పంపించారు. అక్కడి అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఆన్లైన్ ద్వారా ట్రెజరీకి పంపించారు. ఇప్పటివరకు 2,34,300 మంది రైతులకు రూ.276.34 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 80 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపించినప్పటికీ వాటి వివరాలు సరిగా లేకపోవడం, వివిధ కారణాలతో దాదాపు 1800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాలను మళ్లీ సేకరించి పంపించనున్నారు. ఖాతాల వివరాలు ఇచ్చాం రైతుబంధు పథకం డ బ్బులు ఖాతాలో జ మ అవుతాయంటే వివరాలన్నీ అధికారులకు ఇచ్చాం. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతోంది. అయినా ఇంత వరకు మాకు పంట పెట్టుబడి సాయం రాలేదు. ఇకనైనా సారోళ్లు పట్టిం చుకుని పెట్టుబడి సాయం విడుదల చేయాలి. – జి.లక్ష్మయ్య, రైతు, రామచంద్రాపూర్, మహబూబ్నగర్ రూరల్ త్వరలో జమ చేస్తాం జిల్లాలోని 2,34,300 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.276.34 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వలేదు. వాటి సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తవ్వగానే వీలైనంత త్వరగా మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఆందోళనలో అన్నదాతలు
కరీంనగర్రూరల్: రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులందరికీ అందడం లేదు. అర్హులైన రైతులకు సకాలంలో సాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎకరానికి పెట్టుబడిసాయం కింద రూ.8వేలను రెండు విడతలుగా అందిస్తున్నారు. మొదటి విడతలో రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైనప్పటికీ రెండో విడత రబీసీజన్ ఆరంభంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంతమంది రైతులకు అందలేదు. పలువురు రైతులకు సాంకేతిక కారణాలతో డబ్బులు రాలేదు. రబీసీజన్ ప్రారంభమై మూడు నెలలవుతున్నప్పటికీ కొంతమందికి పెట్టుబడిసాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెండో విడతలో జాప్యం.. కరీంనగర్ మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7495 వేల మంది రైతులను రైతుబంధు పథకం కింద ఎంపిక చేసి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 7436 మంది రైతుల వివరాలను ట్రెజరీకి పంపించగా 6694 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయి. ఇంకా మిగిలిన 286 మంది రైతులకు పలు సాంకేతిక కారణాలతో ఇంతవరకు డబ్బులు జమకాలేదు. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుబంధు బడ్జెట్ను విడుదల చేయడంతో కొంతమంది రైతులకు మాత్రమే ఆర్థికసాయం మంజూరైంది. అనంతరం పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధుల విడుదలలో జాప్యం కావడంతో రైతుల బ్యాంకుఖాతాల్లోకి డబ్బులు జమకాలేని పరిస్థితి నెలకొంది. డబ్బుల కోసం వ్యవసాయాధికారులు, బ్యాం కుల చుట్టు రైతులు ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండో విడత డబ్బులు రాలేదు.. నాకు 5 ఎకరాల పొలముంది. రైతుబంధు పధకం మొదటి విడతలో రూ. 20వేల చెక్కు ఇచ్చారు. రెండో విడత డబ్బులు ఇంకా రాలేదు. అధికారులను అడిగితే వస్తాయంటున్నారు. అప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. – గొంకటి రాజిరెడ్డి, రైతు, గోపాల్పూర్ బ్యాంకు ఖాతాల్లో జమ రబీ సీజన్కు సంబంధించి రెండో విడత రైతుబంధు పథకం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కొందరు రైతులు సకాలంలో పట్టా దారు పాసుపుస్తకాలివ్వకపోవడం, స్థానికంగా లేకపోవడంతో ఆన్లైన్ చేయడంలో జాప్యం ఏర్పడింది. - బి.సత్యం, మండల వ్యవసాయాధికారి గ్రామాల వారీగా రైతుల వివరాలు ... గ్రామం ఆన్లైన్ నమోదు ట్రెజరీ ఖాతాల్లో జమ అందని రైతులు చామన్పల్లి 862 858 791 23 ఎలబోతారం 377 373 338 11 ఫకీర్పేట 108 107 102 02 జూబ్లీనగర్ 363 360 332 14 కొండాపూర్ 215 215 182 24 బొమ్మకల్ 824 821 778 14 చేగుర్తి 443 435 418 11 దుర్శేడ్ 893 893 833 29 చెర్లభూత్కూర్ 597 596 531 16 ఇరుకుల్ల 425 423 381 14 మొగ్ధుంపూర్ 644 640 569 21 ఆరెపల్లి 375 365 278 21 నగునూరు 1089 1080 920 72 వల్లంపహాడ్ 280 270 241 14 -
తొలి విడత ఓకే
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్రప్రభుత్వం రైతుబంధు పథకంతో అన్నదాతలకు అండగా నిలుస్తుండగా.. కేంద్రప్రభుత్వం సైతం తన వంతు ఆసరా ఇవ్వడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయం అందనుంది. ఇందులో భాగంగా తొలి విడత నగదు జమ చేసేందుకు అర్హుల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తాజా బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి జాబితాలు రూపొందించారు. ఈ జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి అనర్హులు ఉంటే పేర్లు తొలగించారు. అదే సమయంలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇక అర్హులుగా అధికారులు గుర్తించిన రైతులు బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయగా.. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రారంభించనుంది. కుటుంబం యూనిట్గా... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతీ రైతు కుటుంబాన్ని ఒక యూనిట్గా గుర్తించారు. కుటుంబ సభ్యులందరి వ్యవసాయ భూమి ఐదు ఎకరాల్లోపు ఉంటేనే ఈ పథకానికి అర్హులు. తెల్ల రేషన్కార్డు ప్రాతిపదికన అర్హులైన రైతుల జాబితాను తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు, నెలకు రూ. 10వేల కన్నా ఎక్కువ పింఛన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులూ అనర్హులే. ఇక వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇతర ప్రొఫెషనల్ వృత్తుల వారు దరఖాస్తు చేసుకున్నా ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతుల వివరాల నుంచి రెవెన్యూ భూరికార్డులు, రేషన్కార్డుల్లోని వివరాలు, ఆదాయపు పన్ను శాఖ వివరాలు, ట్రెజరీ నుంచి వేతనం తీసుకునే వారి వివరాలు తీసుకుని అర్హుల జాబితా రూపొందించారు. రెండు జిల్లాల్లో కలిపి... మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో తొలి విడతగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులైన రైతులు 1,17,451 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ఆధారంగా గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తొలి విడతలోరైతుల వివరాలపై ఏఓలు సర్వే చేయగా అందులో 1,17,451 మందిని అర్హులుగా, 729 మంది అనర్హులుగా గుర్తించారు. అయితే అర్హులుగా ఎంపికైన వారిలో 14,128 మంది రైతులు తమ బ్యాంకు వివరాలను సమర్పించలేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని అర్హులైన రైతులకు తొలి విడతగా రూ.2వేల చొప్పున రూ.23.49 కోట్ల సాయం అందనుంది. నేటి నుంచి.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించనుండడంతో అందుకు అనుగుణంగా జిల్లాలో డివిజన్ స్థాయిలో కార్యక్రమం నిర్వహించేం దుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లాలోని అదనపు వ్యవ సాయ అధికారులతో జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత శనివారం సమావేశమై పథకంపై చర్చించారు. పథకం తీరుతెన్నులు, అర్హుల ఎంపికలో పాటించాల్సిన అంశాలపై ఆరా తీశారు. -
విద్యావంతులకు భరోసా కల్పించేలా!
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకున్న వారికి ఉద్యోగం ఎలా భరోసా ఇస్తుందో.. వ్యవసాయం కూడా అలాంటి భరోసానే ఇవ్వాలి. అప్పుడే చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తారు. అప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య అనేదే ఉండదు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో సరిపెట్టకుండా గిట్టుబాటు ధర అందిస్తేనే ఇదిసాధ్యమవుతుంది. ఇందు కు కేంద్రమే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’అని తెలంగాణ కొత్త వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. నా ఆసక్తిని గుర్తించే! నాకు వ్యవసాయమంటే ఎంతో మక్కువ. సీఎం కేసీఆర్ ఈ శాఖ ఇస్తానని నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వ్యవసాయరంగంపై నాకున్న ఇష్టాన్ని గుర్తించే ఈ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నాను. వ్యవసాయశాఖను అప్పగించడం సంతోషంగా ఉంది. రైతులకు నేరుగా సాయం చేయడానికి వీలున్న శాఖ కావడం అదృష్టం. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయాయి. ఏవైనా వ్యక్తిగత కారణాలతో అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు.. కానీ వ్యవసాయానికి వాటితో సంబంధం లేదు. రాష్ట్రంలో రైతు ధీమాతో ఉన్నాడు. జీవితానికి ఢోకా లేదన్న భావన రైతులందరిలో నెలకొని ఉంది. ఉద్యోగులకు డీఏ.. మరి రైతులకు? ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. రెండు మూడేళ్లకోసారి ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టి ధరల పెరుగుదలను బట్టి జీతాన్ని పెంచుతారు. కానీ రైతులకు ఇలాంటి వెసులుబాటేదీ? అంటే డీఏ ఇవ్వాలని నా ఉద్దేశం కాదు. వ్యవసాయం రోజురోజుకు భారంగా మారుతోంది. సాగు ఖర్చు పెరుగుతుంది. కానీ ఆ మేరకు రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడంలేదు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే ఇస్తుంది. సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఈ బాధ్యత కేంద్రానిదే. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును పట్టించుకోవాలి. రైతుబంధుతో కేంద్రంలో కదలిక తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 70 ఏళ్ల తర్వాత రైతు గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్రం ఐదెకరాలలోపు రైతులకు ఏడాదికి కేవలం రూ.6 వేలు ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తుంది. వచ్చే ఖరీఫ్ నుంచి రూ.10 వేలు ఇవ్వనుంది. ఆ ప్రకారం ఎకరా భూమి కలిగిన వృద్ధ రైతులుం టే, వారికి వృద్ధాప్య పింఛన్ కూడా వస్తుంది. అంటే ఒక రైతుకు నెలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.24 వేల పింఛ న్ సహా ఇవి రెండూ కలిపితే ఏడాదికి రూ.34 వేలు వస్తుంది. తెలంగాణలో 90% మం ది రైతులకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఐదెకరాల భూమి కలిగి ఉండి వృద్ధాప్య పింఛన్ అందుకునే వారికి ఏడాదికి రూ.74 వేలు వస్తాయి. రైతుకు మన రాష్ట్రం చేస్తున్న సాయం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును ఆదుకోవాలి. రైతు సమన్వయ సమితులతో విప్లవం రైతు సమన్వయ సమితి సభ్యులు ఒక రైతు సైన్యం లాంటిది. దీని ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన చర్య. వ్యవసాయ ఉద్యోగులు కొంతమేరకే రైతులతో మమేకం కాగలరు. వారు సాంకేతికంగా చేదోడు వాదోడుగా ఉండగలరు. రైతు సమన్వయ సమితులు మాత్రం రైతులను సంఘటితం చేసి వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం మొదలు అనేక రకాలుగా సాయపడగలరు. రైతు సమన్వయ సమితులను మరింత పకడ్బందీగా ఉపయోగించుకునేలా మార్గదర్శకాలు తయారు చేయాల్సిన అవసరముంది. వారికి కేసీఆర్ గౌరవ వేతనం ఇస్తానన్న విషయం తెలిసిందే. వీటన్నింటిపై మార్గదర్శకాలు రూపొందిం చాక స్పష్టత వస్తుంది. వారి విధులు, బాధ్యత, శిక్షణ ఇచ్చి రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా చూడాలి. ఇదో ఉద్యమంలాగా జరగాలి. వ్యవసాయంతో..ఉద్యోగం ఇచ్చే భరోసా ఉద్యోగం కోసం యువతీ యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ భరోసా ఉంది. కానీ వ్యవసాయంలో ఎవరికీ భరోసా రావడంలేదు. ఆహారశుద్ది పరిశ్రమలతోపాటు ఇంకా అనేక అవకాశాలపై దృష్టిసారించాలి. అందుకోసం మేధోమథనం చేయాల్సి ఉంది. ఈ విషయంలో నా ఆలోచనను సీఎంకు వెల్లడిస్తాను. తెలంగాణలో సాగునీటి వనరులు సమకూరుతున్నకొద్దీ.. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సాగునీటి వనరులు సమకూరినచోట రైతులు వ్యవసాయం మొదలుపెట్టారు. దీంతో ట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. ట్రాక్టర్ షోరూంలు ఏర్పడ్డాయి. సాంకేతిక సిబ్బంది అవసరమైంది. ఇలా వ్యవసాయానికి తోడుగా అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా యి. అలా యువకులు వ్యవసాయంపై భరోసాతో ముందుకు రావాలి. రైతుకోసం దేశంలో ఒక నూతన అధ్యాయం మొదలుకావాలంటే తెలంగాణ రాష్ట్రమే దారి చూపించాల్సి ఉంది. అందుకోసం సీఎం నిరంతరం ఆలోచిస్తున్నారు. -
అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
-
రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, వృద్ధిపథంలో ముందుకు సాగనుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో దార్శనికతగల రాజకీయ నాయకత్వం, రాజకీయ స్థిరత్వం నెలకొనడం గొప్ప ప్రయోజనకరమన్నారు. తెలంగాణ ప్రజలు ఆశాజనక దృక్పథంతో ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిరాశాజనక ఆర్థిక విధానాలను అనుసరించకపోవడం వల్లే దేశంలో మరెక్కడా లేనివిధంగా ఇంటింటికీ, గ్రామగ్రామానికీ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటి సరఫరా కల సాకారమైందని కొనియాడారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిందని, ఒడిశాలో కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతంగా, తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అయితే ద్రవ్యలోటు, రుణాలు పెరిగిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్రవ్యలోటు, రుణాల నియంత్రణకు మధ్యంతర ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగింపు సందర్భంగా మంగళవారం తన బృందంతో కలసి ఆయన హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పర్యటన విశేషాలు, తమ పరిశీలనకు వచ్చిన అంశాలను వెల్లడించారు. దార్శనికతకు ప్రతిరూపం... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచే వృద్ధిపథంలో ముందుకు సాగుతోందని ఎన్.కె.సింగ్ తెలిపారు. దార్శనికతగల రాజకీయ నాయకత్వంతోపాటు మంచి ఆర్థిక వనరులు ఉండటమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రం గణనీయంగా ఆర్థికావృద్ధి సాధిస్తోందని, మూలధన వ్యయం సైతం అదే రీతిలో పెరుగుతూ పోతోందన్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగి ఉందని, అయితే దీనిపై కాగ్తోపాటు ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 14 శాతానికి మించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వృద్ధిరేటు సాధించిన కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సింగ్ కితాబిచ్చారు. జీఎస్టీని అమల్లోకి తెచ్చిన అనంతరం కొన్ని నెలలు మినహా రాష్ట్రానికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రాలేదన్నారు. రాష్ట్రం 20 శాతానికి మించి జీఎస్టీ వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. రాష్ట్రం సులభతర వాణిజ్య(ఈఓడీబీ) ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలవడం చిన్న విషయం కాదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం బాగుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సాగునీటి వసతుల కల్పన, సంక్షేమ పథకాలు వినూత్నంగా ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం గొప్ప దార్శనికతకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘనతను మరే రాష్ట్రం సాధించలేదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత నీటి సరఫరా వంటి సంక్షేమ పథకాలతో గరిష్ట సంక్షేమం అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆర్థికాభివృద్ధి తోడైతే రాష్ట్ర ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు రానుందని ప్రశంసించారు. రాష్ట్రానికి రాబడి సైతం రెట్టింపు కానుందన్నారు. నీటిపారుదల సదుపాయంతో పంట దిగుబడులు పెరగనున్నాయని, జనాభాలో అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిన వారికి జీవనోపాధి లభించనుందని వ్యవసాయ రంగ నిపుణుడైన తమ సభ్యుడు రమేశ్చంద్ అభిప్రాయపడ్డారని ఎన్.కె. సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ప్రభుత్వం పారదర్శకంగా, దాపరికం లేకుండా వ్యవహరించిందన్నారు. నిధుల కేటాయింపుపై సిఫారసులు.. ‘ద్రవ్యలోటు, అప్పులు కొంత వరకు ఒత్తిడి కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంక్షేమ పథకాలు గొప్ప ప్రయోజనం కలిగించనున్నాయి. విద్యాభివృద్ధి, వ్యవసాయ దిగుబడి, ఆరోగ్యం మెరుగు కానుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం కలిగించనున్నాయని సీఎం తెలిపారు’ అని ఎన్.కె.సింగ్ వెల్లడించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై సిఫారసులు చేస్తామన్నారు. రాజకీయ దార్శనికత, ఆర్థిక వనరుల లభ్యత వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని ఆర్థిక సంఘం సభ్యుడు రమేశ్ చంద్ పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటుతో పోలిస్తే 60 శాతం అధికంగా ఉందన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్రంలో ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు నిర్మించడాన్ని కమిషన్ కార్యదర్శి ఆరవింద్ మెహతా ప్రశంసించారు. నాలుగు సవాళ్లు! రాష్ట్రం నాలుగు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ పేర్కొన్నారు. అందులో అసమతౌల్య అభివృద్ధి ప్రధానమైదన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల నుంచే 52 శాతం జీఎస్టీ అందుతోందన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని రాష్ట్ర సగటుకు ఎగువన, మరికొన్ని దిగువన ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతౌల్య అభివృద్ధిని సాధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పెరిగిపోతున్న ద్రవ్యలోటు, రుణాలు కొంతవరకు సమస్యాత్మకంగా మారాయని, వాటి నియంత్రణపై మధ్యంతర ప్రణాళిక రూపొందించి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ ప్రణాళిక అమలు 15వ ఆర్థిక సంఘం కాలవ్యవధికి వీలుగా ఉండాలన్నారు. కేంద్రం 2018 బడ్జెట్లో తీసుకొచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ లక్ష్యాలకు లోబడి ద్రవ్యలోటు, రుణాలు ఉండేలా రాష్ట్రం పరిమితులు విధించుకోవాలని, స్థూల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ రెండు అంశాలతో వృద్ధికి ఆటంకం కలగకుండా పటిష్ట, ఆచరణీయమైన ప్రణాళికను చూడాలనుకుంటున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రణాళికలు కోరామన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల రుణాల పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకం లక్ష్యాలను అమలు చేయడంలో రాష్ట్రం వెనకబడిందన్నారు. -
అందని రబీ పెట్టుబడి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం జిల్లాలో కొంతమంది రైతులకే పరిమిత మవుతోందనే వాదన వినిపిస్తోంది. రబీ సీజన్ ప్రారంభమై జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో చెక్కుల అందజేసి బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రబీలోనూ చెక్కు లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా ముందస్తు ఎన్నికలతో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లాలో ఇంకా దాదాపు 23వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టుబడి పైసలు వస్తాయా రావా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ తోటివారికి డబ్బులు వచ్చి తమకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ రైతుబంధు రైతన్న దరికి చేరడం లేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే కొద్దిరోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. మరో నెల గడిస్తే రబీ ముగియనుంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు సాయం అందకపోవడంతో బ్యాంకుల, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరీక్షణ.. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి 23,113 మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదు. 20 మండలాల్లో భూమి కలిగిన రైతులు 1,36,718 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.120,74,92,810 పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,433 మంది రైతులకు రూ.90,29,26,930 డబ్బులు చెల్లించారు. మొత్తం 136718 రైతులకు గాను అధికారులు 1,21,268 మంది రైతుల వివరాలు సేకరించి అన్లైన్లో నమోదు చేశారు. పరిశీలన అనంతరం 1,18,918 మంది రైతులను గుర్తించారు. 15450 మంది రైతులు అందుబాటులో లేరని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు తప్పని ఎదురుచూపులు.. పెట్టుబడి సాయం అందని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, బ్యాంకుల్లో జమకానున్నాయని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే మీ ఫోన్కు మెస్సేజ్ వస్తుందని ఆ తర్వాతే రావాలని చెబుతున్నారు. పెట్టుబడి సొమ్ము వస్తుందని చాలా మంది రైతులు రబీలో అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అప్పుకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుకార్లతో ఆందోళన.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రైతుబంధుపై దుష్ప్రచారం నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతుబంధు తాత్కాలికమే అని వస్తున్న పుకార్లతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇవి కేవలం గాలి వార్తలే అని కొట్టిపారేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దశల వారీగా అందరి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాయం అందడంలేదు నాకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. వారసత్వంగా వచ్చింది. ఆభూమిని నా పేరుపై ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. నాకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో మెదటి విడత చెక్కులు అందలేదు. రెండో విడత కూడా వచ్చేలా లేదు. నాలాంటి వాళ్లు మండలంలో చాలమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాస్ పుస్తకాలు అందించాలి. – వామనరావు, రైతు, మహదేవ్పూర్ వారంలో సాయం అందిస్తాం.. వారంలో రైతులకు సాయం అందనుంది. ట్రెజరీకి వివరాలు పం పించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సబంధించి రైతుల నుంచి ఏఈఓలు వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల చివరలో కేంద్ర సాయం కూడా అందనుంది. – గౌస్ హైదర్, ఏడీఏ -
రైతు బంధు పై రభస
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దున్నేవారికి కాకుండా భూమి ఉన్నవారికే పెట్టుబడి సాయం అందుతోందని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 20శాతం మంది రైతుల దరికి ఇంకా ‘రైతుబంధు’ చేరలేదని వ్యాఖ్యానించింది. శనివారం చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకంపై వాడీవేడి చర్చ సాగింది. సభ ప్రారంభంకాగానే.. మంచాల, కందుకూరు జెడ్పీటీసీ సభ్యులు మహిపాల్, జంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటికీ, సగం మందికి ఇంకా లబ్ధి చేకూరలేదనే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన అధికారపక్ష సభ్యులు.. సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాలో నగదు జమ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోకుండా అడ్డగోలుగా మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. రెవెన్యూతోనే తలనొప్పి.. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల వ్యవహారాన్ని సమావేశం ఆక్షేపించింది. రెవెన్యూ అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పకడ్బందీగా రికార్డులను సరిదిద్దకపోవడం.. ఉద్దేశపూర్వకంగా పాస్బుక్కులను జారీచేయకపోవడంతో చాలామంది రైతులకు రైతుబంధు రాకుండా పోయిందని సభ్యులు విమర్శించారు. అభ్యంతరాలులేని భూములకు కూడా పాస్పుస్తకాలు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్రెడ్డి, శంషాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాలో నిధులు జమ కాకున్నా జమ అయినట్లు సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని, ఇలా రైతులను మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. సాంకేతిక సాకులతో రైతుబంధు పథకాన్ని వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. రైతుబంధుతో సంపన్నులకే లబ్ధి చేకూరిందని, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలో ఇంకా నయాపైసా జమ కాలేదని మంచాల జెడ్పీటీసీ సభ్యుడు మహిపాల్ అన్నారు. శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సిములు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ సాకుతో ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు జరగడంలేదని, పాస్పుస్తకాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. తాజాగా పాస్పుస్తకాలు అందినవారికి త్వరలోనే రైతుబంధు సాయం అందుతుందని, పాత బకాయిలు మాత్రం ఇచ్చే అంశంపై స్పష్టత లేదని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. క్షమాపణ చెబుతున్నా.. ‘అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది. కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం కింద ప్రతి రైతుకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాంకేతిక కారణాలతో కొంతమందికి ఇంకా సాయం అందలేదు. నగదు పంపిణీలో ఆలస్యమైనందుకు సర్కారు తరుఫున క్షమాపణలు చెబుతున్నా’ అని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. మేమే అక్రమార్కులమా? మొయినాబాద్ మండలంపై మీరు(డీపీఓ) కక్షగట్టారు. 111 జీఓ పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల లేఅవుట్ల జోలికి వెళ్లకుండా మావే కూల్చుతున్నారంటే మీ ఉద్దేశమేమిటో తెలుస్తోంది. ఎమ్మెల్యేతో మీరు మిలాఖత్ అయ్యారు. అజీజ్నగర్లో బడాబాబులు నిర్మించిన విల్లాలను టచ్ చేయకుండా.. 200 గజాల స్థలంలో ప్లాట్లు కొన్నవారిని వేధిస్తున్నారు అని మొయినాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాపచంద్రలింగం తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. హిమాయత్సాగర్ బొడ్డున హరీష్రావు, ఎమ్మెల్యే వివేకానంద నిర్మించిన భవనాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. సభ్యుడి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేధించిన డీపీఓ పద్మజారాణి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం తప్ప వివక్ష పాటిస్తున్నామనడం సరికాదన్నారు. అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా తొలగిస్తామని, అజీజ్నగర్ విల్లాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. సీనరేజీ సుంకం ఇవ్వరా? హైకోర్టు తీర్పు ఇచ్చినా సీనరేజీ సెస్సు ఇవ్వకపోవడం ఏమిటని చేవెళ్ల జెడ్పీటీసీ చింపుల శైలజ ప్రశ్నించారు. 2012–13 నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.520 కోట్లను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా కౌంటర్ దాఖలు చేయాలని భావించడం చూస్తే స్థానిక సంస్థలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ అంశంపై కలెక్టర్ లోకేశ్కుమార్ జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిఖ శాఖ పరిధిలో ఉందని, త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. జిల్లా ఖనిజ నిధి కింద అభివృద్ధి పనులు చేసేందుకు వెసులుబాటు ఉందని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి, వికారాబాద్ జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, యాదయ్య, మల్లారెడ్డి, వివేకానంద, మహేశ్రెడ్డి, ప్రకాశ్గౌడ్, రోహిత్రెడ్డి, ఆనంద్, ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. విజేతలకు సన్మానం ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి సన్మానించారు. శాలువా, పూలమాలలతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారుల సంఘం ఆకాక్షించింది. -
తేలిన.. లెక్క!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రైతాంగానికి హెక్టార్కు రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్రం చేసిన ప్రకటన జిల్లా రైతాంగంలో ఆనందం నింపుతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద ఈసాయం అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. దీనికి సంబంధించి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. హెక్టారుకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలు తమకు అందలేదని, ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో ఈ మొత్తాన్ని మినహాయిస్తారా..? లేదా అన్న విషయంలో స్పష్టత కానరావడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకంతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం మొత్తాన్ని జమ చేస్తామని కేంద్రం ప్రకటించిందని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో రాష్ట్రం ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో ఐదు ఎకరాలలోపు ఎంతమంది రైతులు (ఖాతాలు) ఉన్నారు..? మొత్తంగా ఐదు ఎకరాలలోపు కమతాల్లో ఎంత విస్తీర్ణంలో సాగుభూమి ఉంది..? అన్న వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. ఆర్థిక సాయంగా రూ.295.60కోట్లు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల మేరకు 6,80,915 ఎకరాల భూమి (5ఎకరాల లోపు) ఉంది. ఈ మొత్తం భూమి 3,46,442 రైతుల (ఖాతాలు) చేతుల్లో ఉంది. అయితే.. అధికారులు ఈ ఖాతాలను కూడా రెండు విభాగాలుగా విభజించారు. దీంతో రైతులకు అందనున్న ఆర్థిక సాయం కూడా వేర్వేరుగానే అందనుంది. ఒక ఎకరా నుంచి 2.46 ఎకరాల భూమి ఉన్న రైతులు 2,31,153 మంది ఉన్నారు. వీరి చేతిలో 2,77,947 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.6వేల చొప్పున వీరికి రూ.75,80,38,390 ఆర్థిక సాయం అందనుంది. కాగా, 2.47 ఎకరాల నుంచి 4.93 ఎకరాల మధ్యలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి 4,02,967 ఎకరాలు. ఈ భూమి 1,15,289 మంది రైతుల చేతుల్లో ఉంది. ఈ మొత్తం భూమికి రూ.219,80,07,109 ఆర్థిక సాయం రైతులకు అందనుంది. అంటే.. ఒక ఎకరానుంచి 5 ఎకరాలలోపు ఉన్న 3,46,442 మంది రైతులకు ఏటా 295 కోట్ల 60 లక్షల 45వేల 499 రూపాయల సాయం అందనుందని చెబుతున్నారు. అయితే, పూర్తి లెక్కలు తేలాక అటు వ్యవసాయ భూమి, రైతుల సంఖ్యలో కొద్దిగా తేడాలు ఉండొచ్చని, దీంతో కేంద్రం నుంచి అందే పెట్టుబడి సాయంలో కొంత వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఏటా రూ.295.60కోట్ల దాకా రైతులకు పెట్టుబడి సాయంగా అందనుంది. -
రైతులంటే ఇంత అలుసా..?
రైతులంటే ఇంత అలుసా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు విడతల రైతుబంధు పథకం పూర్తయింది... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది... అయినా ఇంతవరకు జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు అందలేదు... దీంతో రైతుబంధు పథకంతో పాటు రైతుబీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది... వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లిప్తత వీడాలి...? అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జేసీ జీవీ.శ్యాంప్రసాద్లాల్, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, జయశంకర్భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావుతో పాటు ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటగా ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరజవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హుస్నాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు రాయిరెడ్డి రాజిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తోట ఆగయ్య ఆమరజవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుపై చర్చ జరిగింది. సాక్షిప్రతినిధి,కరీంనగర్: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్రావు మాట్లాడుతూ..రైతుబంధు,రైతుబీమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం మం డలాల్లో 70 శాతానికిపైగా భూరికార్డులు సరిగ్గా లేవని ఆరోపించారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యులు శరత్రావు మాట్లాడుతూ మండలంలో 700మందికిపైగా రైతులకు పాసుపుస్తకాలు అందలేదన్నారు. మానకొండూర్, బోయిన్పల్లి, శంకరపట్నం జెడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆత్మ పథకంపై అవగాహన సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ గుండి గ్రామంలో సిలివేరి సత్తయ్య అనే రైతు మరణించాడని పాస్బుక్ లేకపోవడంతో రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయాడని ఇలాంటి ఘటనలు కొకొల్లాలుఅని సభదృష్టికి తెచ్చారు. వేములవాడ జెడ్పీటీసీ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు చెందిన భూమికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పాస్పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. మల్యాల జెడ్పీటీసీ శోభరాణి మాట్లాడుతూ బల్వంతపూర్ గ్రామంలో రైతు మరణిస్తే అర్హతలు ఉన్న రైతుబంధు చెక్కు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని సభదృష్టికి తెచ్చారు. ‘మిషన్భగీరథ’పనులపై అసంతృప్తి... మిషన్ భగీరథ పథకం పనులపై సభ్యులు మండిపడ్డారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ అయిలయ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని ట్యాం కులు నిర్మించారు...ఎక్కడెక్కడ పైపులు వేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లన్ని అస్థవ్యస్థంగా తయారవుతున్నాయని, పైపులు వేసిన చోట గుంతలు పూడ్చటం లేదని ఒకే కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో ట్యాంకులను కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గిందని కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. విద్యశాఖ తీరుపై ఆసక్తికర చర్చ... విద్యశాఖలో సమస్యలను ప్రతి సమావేశంలో విన్నవిస్తున్నా పరిష్కారానికి మోక్షం లభించడం లేదని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్ మాట్లాడుతూ.. కొత్తపల్లి మండల కేంద్రంలో వ్యాయమా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ 18 ఏళ్లుగా ఒకేస్కూల్లో పనిచేస్తున్నాడని, తనకున్న పలుకుబడితో విధులు నిర్వహించకుండా రాజకీయాలకే పరిమితమవుతున్నాడని ఆరోపించారు. మహాముత్తారం జెడ్పీటీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ల పోస్టులను భర్తీ చేయాలని , ప్రహరీ గోడలు ,అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని గత ఘటన ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వర్ల మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందిస్తున్నామని సమాధానం ఇవ్వబోతుండుగా.. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి అడ్డుపడి కొడిమ్యాల మండల కేంద్రంలో గత సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షల సందర్భంగా జరిగిన మాస్ కాపీయింగ్ వ్యవహారంలో పది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఒక్కరికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వడం లేదని డీఈవోను ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడి పరిధి మోడల్ స్కూల్ సొసైటీలో ఉందని డీఈవో సమాధానం ఇచ్చారు. మల్యాల ఎంపీపీ శ్రీలత, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ , మంథని జడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని సభ దృష్టికి తెచ్చారు. వైద్య శాఖ పై గరంగరం... జిల్లాలో వైద్యశాఖ తీరు మారడం లేదని, ప్రతి సమావేశంలో చెప్పిన విషయాలను చెప్పడమే తప్ప సమస్యలకు మోక్షం లభించడం లేదని వైద్యశాఖ అధికారుల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పోస్టుమార్టం భవనం పూర్తయిన ప్రారంభానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్తో పాటు తదితరులు ఆసుపత్రి సూపరింటెండెంట్పై మండిపడ్డారు. పోస్టుమార్టం భవనానికి దారి లేదనే నెపంతో వాయిదా వేయడం తగదని, కేవలం ప్రహరీ గోడ కూల్చేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకుల ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని, మంథని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టు డాక్టర్ను నియమించాలని చల్లా నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఐసీడీఎస్ అవినీతిపై మల్యాల జెడ్పీటీసీ బైఠాయింపు... జగిత్యాల జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లు వంటి వాటిలో రెండున్నర కోట్ల కుంభకోణం జరిగిందని రెండేళ్లుగా పత్రికలు కోడైకూస్తున్నా చర్యలు లేవని మల్యాల జెడ్పీటీసీ శోభారాణి అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా అధికారులు ఎవరూ సమావేశంలో లేకపోవడంతో అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు నేలపై కూర్చుంటానని చెబుతూ సమావేశం పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జోక్యం చేసుకోని సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవినీతి ఆరోపణల విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని చెప్పడంతో శోభారాణి శాంతించారు. 15రోజుల్లో పాసుపుస్తకాలు అందజేస్తాం 15 రోజుల్లో అర్హత గల రైతులందరికి పాసుపుస్తకాలు అందజేస్తాం. మిగిలిన చోట్ల భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 2వేల పాసుపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అర్హత గల రైతులందరికీ పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకం అందుతుంది. – శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ జాయింట్ కలెక్టర్ మార్చి 31లోగా ఇంటింటికీ నీరు పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు మార్చి 31లోపు మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీరు అందిస్తాం. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశాం. పైపుల కోసం వేసిన గుంతలు పూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లదే. దేశంలో పంజాబ్ రాష్ట్రం 70 శాతం ఇంటింటికి నల్లానీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వందశాతం భగీరథ నీళ్లు ఇంటింటికి అందజేస్తుంది. – శ్రీదేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులది అంతే బాధ్యత ఉంటుంది. సమావేశాలకు అధికారులు జవాబుదారీతనంతో పాటు సమగ్ర నివేదికలతో రావాలి. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు వ్యవహరించడం సరికాదు. – తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ -
రైతుబంధు సూపర్!
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించి పరిస్థితులకు అనుగుణంగానే సలహాలు, సూచనలు ఇస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. మూడేళ్లుగా తెలంగాణ వృద్ధిరేటు వేగంగా ముందుకెళ్తోందన్న ఆయన.. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటివి రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలకమైన ముందడుగని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఆర్థిక సంఘం చెప్పేదేమీ ఉండదని.. జాతీయాభివృద్ధి మండలిదే తుది నిర్ణయమని ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో ఉత్తర, దక్షిణ భారతాలంటూ వేర్వేరుగా చూడటంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలో తెలంగాణ, ఏపీల్లో 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఎన్కే సింగ్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ విశేషాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ ఆర్థికవేత్తగా, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఈ కాలంలో మీకు సవాల్గా అనిపించిన అంశాలేంటి? ఎన్కే సింగ్: ఆర్థిక సంఘం చైర్మన్లు ఎవరైనా చెప్పేదొక్కటే. కఠినమైన సవాళ్లున్నాయి. అయితే చాలా పరిమితుల్లో పనిచేయాల్సిన కారణంగా.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా నైపుణ్యంతో పరిష్కరించడం కష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని మూడు అంశాలు మార్చేశాయి. మొదటిది.. ప్రణాళికా సంఘం పనితీరులో మార్పుతీసుకురావడం. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను పక్కాగా ప్లాన్ చేయడం. ఈ ఏడాది రెవెన్యూ, మూలధనం లోటుంది. కానీ దీన్ని అధికారులు అంగీకరించరు. రెండోది.. జీఎస్టీపై ఆర్థిక సంఘానికి పూర్తి పట్టుంటుంది. ఇది ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం. సంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సమాఖ్య విధానంలో ఉన్న చాలా సమస్యల్లో జీఎస్టీ ద్వారా సానుకూల మార్పులొచ్చాయి. కామన్ మార్కెట్లో భారత్కు భారీ ప్రయోజనాలు చేకూరేందుకు అవకాశాలు కల్పించింది. మూడోది.. రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను తిరిగి పొందే సామర్థ్యాన్ని పెంపొందించడం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ సమస్యలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవి ఆర్థిక సంఘం ముందున్న ప్రధానమైన సవాళ్లు. ప్రశ్న: జనాభా నియంత్రణ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై మీరేమంటారు? జవాబు: నివేదికలో ఏయే అంశాలుండాలనే దానిపై ఆర్థిక సంఘం ప్రమేయం ఉండదు. ఇది పూర్తిగా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒకసారి నిబంధనలు రూపొందించాక వీటి ఆధారంగా పనిచేయడమే ఆర్థికసంఘం పని. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నది వాస్తవం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. వీటితోపాటుగా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. సమానత్వం, సామర్థ్యం మధ్య సమన్వయం చేయడం అంత సులువేం కాదు. భౌగోళిక అంశాల ఆధారంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడం ఆర్థిక సంఘం ఉద్దేశం కాదు. ఈ విషయంలో మేం చాలా విశాల ధృక్పథంతో ఉన్నాం. అసలు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడటం.. వాస్తవాలను తప్పుదారి పట్టించడమే. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని కనబరిచాయి. అందుకే ఆర్థిక సంఘం.. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం, ప్రజలకోసం ఏవిధంగా నిధుల వినియోగం చేస్తున్నాయనేదాన్నే విశ్వసిస్తుంది. 14, 15వ ఆర్థిక సంఘాలు ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ దిశగా ఆర్థిక సంఘం ఏమైనా పునరాలోచన చేస్తుందా? గతేడాది మేలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించినపుడు ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదనే అంశాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా జాతీయాభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తి రాజకీయ పరమైన అంశం. ఈ విషయంలో ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలేమీ ఉండవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. కర్ణాటకతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నష్టం చేస్తాయంటూ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు? ఈ విషయం నాకు తెలియదు. ఆర్థికపరమైన అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసుంటే.. దీనిపై మేం స్పందించడం సరికాదు. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోవడంపై మీరేమంటారు? గత మూడేళ్లలో తెలంగాణ గణనీయమైన ఆర్థిక వృద్ధిరేటు సాధించింది. గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. సాగునీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చెరువులను పునరుద్ధరిస్తోంది. సాగుకోసం భూగర్భ జలాలను పెంచేలా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సానుకూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇందుకు ప్రోత్సహించాలి. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పులు, ఆర్థిక లోటు, అనవసర ఖర్చులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు నివేదిక అందింది. హైదరాబాద్ పర్యటనలో ఆ రాష్ట్ర అకౌంట్ జనరల్తో మాట్లాడతాం. పూర్తి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి తదితర అంశాలపై సూచనలు ఇస్తాం. ఇటీవలి మీ పంజాబ్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలేమైనా ఇస్తారా? వీటిపై ముందుస్తు ఊహాగానాలు చేయలేం. పంజాబ్ పరిస్థితులు అక్కడి సమస్యలు వేరు. అక్కడి ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయినందుకు సూచనలిచ్చాం. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర నిధులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది? రుణాలను కూడా మాఫీ చేయాలని అడుగుతోంది? రాజ్యాంగ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం. ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు చేద్దామని ప్రయత్నిస్తే.. మిగిలిన రాష్ట్రాలకూ అది అమలవుతుంది. ఆర్టికల్ 275 కింద ఒక్కో రాష్ట్రం ద్రవ్యలోటును కూడా మేం పరిగణించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పోల్చి చూడాలి. తెలంగాణ పూర్తి ఆర్థిక స్థితిని చూశాకే ఏమైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం. వృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం కింద ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలుంటాయా? మేం విశాల ధృక్పథంతో ఆలోచిస్తాం. ఇందులో భాగంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం 3% ఆర్థిక లక్ష్యంలో 0.5% వెసులుబాటు కల్పించారు. మేం ఏం చేయాలనేది అన్ని విషయాలు క్రోడీకరించి నిర్ణయిస్తాం. ఆర్థిక సంఘం దృష్టిలో.. తమకు నిధులు కావాలంటున్న మండలాలు, జిల్లా పరిషత్ల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ దిశగా మాకు ప్రతిపాదనలు పంపాయి. మేం ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో పర్యటించాం. దాదాపు ప్రతిచోటా ఈ డిమాండ్ కనిపించింది. 14వ ఆర్థిక సంఘం కేవలం పంచాయతీల నిధుల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవడంపై మేం అధ్యయనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెల వ్యవస్థకు నిధులిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. రాజకీయ ప్రజాకర్షణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రుణమాఫీకి జై కొట్టడంపై మీరేమంటారు? ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం. ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 293 కింద ఆర్థిక స్థోమత అంశాన్ని మాత్రం మేం పరిశీలిస్తాం. అయితే.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్రం ఎందుకు వారికి సహకరించడం లేదు? రెవెన్యూ లోటు నిధులు (ఆర్డీజీ) ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిధుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం స్వతంత్రంగా సమీక్ష చేస్తుంది. ఒక్కో రాష్ట్రం పరిస్థితిని గమనిస్తాం. ప్రతి రాష్ట్రం ఆర్డీజీ కావాలంటుంది. కానీ అందరికీ ఇవ్వలేం. ఈ అంశంలో కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల సరఫరా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకు స్పష్టత వచ్చింది. కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది ఇంకా తెలియాలి. దీనికోసమే వేచి చూస్తున్నాం. ఆ తర్వాతే ఆర్డీజీకి అర్హులా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజాకర్షక పథకమైన రైతుబంధుపై విమర్శల గురించి మీరేమంటారు? రైతుసమస్యలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు తీసుకున్న చర్యలో రైతుబంధు కీలకమైంది. ఒడిశా ప్రభుత్వం కూడా కాలియా పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం కూడా ప్రతి రైతుకు రూ.6వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చింది. చాలారాష్ట్రాలు రైతు సమస్యలను పరిష్కరించేందుకు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పర్యటనలో ఆ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఎఫ్ఆర్బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంఘం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోదంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలపై? తెలంగాణకు వీలైనంత సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. ఆ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టే విషయంలో మేం చేయాల్సినవన్నీ చేస్తాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణకు ఎక్కువ అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి. -
‘సాయానికి’ సమాయత్తం
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘కిసాన్ సమ్మాన్’ యోజన పథకం అమలు ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సాగులో రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని 2018 ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్లో పంట పెట్టుబడిగా రెండు విడతలు రూ.4వేల చొప్పున రైతులకు ఇప్పటికే చెల్లించారు. 2019–20లో రూ.5వేల చొప్పున.. రూ.10వేలను అందిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించింది. దీనిని సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేలు అందించనున్నారు. దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు 12వేల కోట్ల మంది ఉండగా.. ఏడాదికి రూ.75వేల కోట్లను కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసి.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పథకం అమలులో వ్యవసాయ శాఖ కీలక భూమిక పోషించనుంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.. కలెక్టర్తో సమావేశమై పథకం అమలుపై చర్చించే పనిలో నిమగ్నమయ్యారు. ఐదెకరాల్లోపు రైతులు అర్హులు కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి ఐదెకరాల(2 హెక్టార్లు)లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు(మైనర్లు) కలిగి ఉన్న కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల్లోపు ఎంత భూమి కలిగి ఉన్నా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చుతారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అనర్హులు గ్రూప్–4, గ్రూప్–డీ మినహా ఇతర ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ పన్ను కలిగి ఉన్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనర్హులు. ఇక ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల్లో ఉన్న వారు కూడా అనర్హులే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా అనర్హులే. ఇంజనీర్లు, డాక్టర్లకు కూడా ఈ పథకం వర్తించదు. రిటైర్డ్ ఉద్యోగుల్లో కూడా రూ.10వేలకు మించి పెన్షన్ పొందే వారికి ఈ పథకం వర్తించదు. మూడు విడతలుగా సాయం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో అర్హులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 4 నెలలను ఓ విడతగా రూపొందించి.. ఒక్కో విడతలో రూ.2వేలను కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు విడుదల చేస్తుంది. 25 నాటికి వివరాలు అందించాలి.. కిసాన్ సమ్మాన్ పథకంలో అర్హులైన రైతుల జాబితాను ఈనెల 25వ తేదీ నాటికి అందించాలని(ఆన్లైన్) ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల మేరకు అర్హులైన రైతుల వివరాలను సేకరించి పంపించాలని ఆదేశాల్లో పేర్కొంది. రైతు పేరు, వయసు, స్త్రీ, పురుషుల వివరాలు, ఆధార్ నంబర్ లేదా ఏదైనా అర్హత కలిగిన గుర్తింపు కార్డు వివరాలతోపాటు రైతు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, మొబైల్ నంబర్ వివరాలను అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వ్యవహారాలన్నీ వ్యవసాయ విస్తర్ణాధికారులకు అప్పగించే పనిలో వ్యవసాయ శాఖ ఉంది. మార్చి 31 నాటికి తొలివిడత రూ.2వేలు ఖాతాల్లో జమ కిసాన్ పథకం కింద తొలి విడత నగదును మార్చి 31వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందని కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. పోస్టల్, కో–ఆపరేటివ్ బ్యాంకులతోపాటు అన్ని బ్యాంకులకు ఈ పథకం నగదును రైతులకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలో రూ.2.50లక్షల మంది అర్హులు కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి జిల్లాలో సుమారు 2.50లక్షల మంది అర్హులుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం రైతుల వివరాలను సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఏఈఓలు రంగంలోకి దిగనున్నారు. గ్రామాలవారీగా అర్హులైన రైతులను గుర్తించి.. జాబితాలను రూపొందించి గ్రామంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. -
విలీనం కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎం–కిసాన్) తెలం గాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో విలీనం చేసే ఆలోచన ఏమాత్రం లేదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి మూడు విడతల్లో కలిపి రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వేస్తామని రాష్ట్ర అధికారులకు ఆమె పేర్కొన్నారు. కేంద్ర పథకం అమలు కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్.కె. జోషితో సమావేశమయ్యారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజే శ్వర్ తివారీ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీసీఎల్ఏ డైరెక్టర్ కరుణ, వ్యవ సాయశాఖ అదనపు కమిషనర్ విజయ్కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర పథకం విలీనం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కానీ వేరుగానే ఆ పథకాన్ని అమలు చేస్తామని వసుధా మిశ్రా స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె మాటలతో రెండు పథకాల విలీన అంశం పక్కకు పోయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పీఎం–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, కాబట్టి రైతుబంధుతో కలిపి ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు రాదని అధి కారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా రెండు పథకాలు నడుస్తాయని, ఎన్నికల తర్వాత రెండో విడత సాయం జమ చేసే సమయంలో అప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన ఉంటుందని అంటున్నారు. కుటుంబానికి ఐదెకరాల వరకే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం చాలా పెద్దదని, రైతులందరికీ వర్తిస్తోందని సీఎస్తో సమావేశం అనంతరం వసుధా మిశ్రా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం కేవలం చిన్న, సన్నకారు రైతులకే పరిమితమైందని, కుటుంబానికి ఐదెకరాల లోపు ఉన్న రైతులకే వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. మార్చి నుంచి ఈ పథకం అమలు చేస్తామని, మార్చి చివరి నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున తొలి విడత సాయాన్ని జమ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన రైతుబంధు పథకానికి సంబంధించిన రైతుల డేటా తీసుకుంటామని, ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాలను రాష్ట్రానికి ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల సమాచారముందని, లేని రాష్ట్రాలకు కేంద్రం వద్ద ఉన్న డేటాను అందిస్తామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకానికి, రైతుబంధుకు సంబంధం లేదని వసుధా మిశ్రా స్పష్టం చేశారు. కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసుకొని ఈ పథకం ఉంటుందన్నారు. రైతులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపుకార్డుతోపాటు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు. రైతుబంధుతో కలిపి అమలు చేస్తామనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. కాగా, పీఎం–కిసాన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందనే నమ్మకాన్ని వసుధా మిశ్రా చెప్పినట్లు ఎస్.కె. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవేం నిబంధనలు...? కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకంలో చాలా కొర్రీలున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సాయం పొందేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులూ అర్హులు కారని కేంద్ర పథకంలో తేల్చారు. కేవలం నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. పైగా ఐదెకరాలతోపాటు భార్యాభర్తలను యూనిట్గా తీసుకున్నారు. దీని ప్రకారం ఒక కుటుంబం మొత్తానికి కలిపి ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి ఉంటే ఈ పథకం వర్తించదు. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలకు కలిపి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే ఈ పథకం వర్తించదు. ఈ ఫిబ్రవరి ఒకటి వరకు ఐదెకరాల భూమి ఎవరి పేరుమీద ఉంటే... రాబోయే ఐదేళ్ల వరకు వారికే వర్తిస్తుంది. ఒక వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు ఎన్నిచోట్ల సాగుభూమి ఉన్నా ఐదెకరాలకు మించి ఉండరాదు. ఇన్ని కొర్రీల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే మళ్లీ రైతుల వివరాలు సేకరించాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది సన్నచిన్నకారు రైతులు ఉంటే ఈ కొర్రీల కారణంగా సగానికిపైగా అర్హుల సంఖ్య పడిపోయే ప్రమాదముందని అంటున్నారు. ముందనుకున్నట్లుగా రూ. 2,800 కోట్లకుగాను సగానికి మించి రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపించడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డేటా మళ్లీ సేకరించాల్సిందేనని, అందుకోసం నెల రోజుల సమయం పడుతుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
వరాల..వాన
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వరాల జల్లు కురిసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చింది. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలందరినీ ఆకట్టుకునేలా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా పలు అంశాలను ఈ 2019–20 తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. అందరికీ మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘ఎన్నికల’ల బడ్జెట్ను పీయూష్ గోయల్ ద్వారా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుకు తోడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఊరట. అలాగే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కోసం కేంద్రం పద్దుల్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్పై మొత్తంగా అన్నివర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుండగా.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఓట్లను రాబట్టే ఎన్నికల బడ్జెట్గా వర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుంట నుంచి 1.25 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 2,74,368 మంది కాగా, 1.25 నుంచి 2.5 ఎకరాలున్న వారు 1,72,669 మంది, 2.5 నుంచి 5 ఎకరాలున్న వారు 1,45,008 మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6000 నగదు బదిలీ పథకం వల్ల మొత్తం 5,92,045 మందికి లబ్ది చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్కు రూ.750 కోట్ల కేటాయించగా, దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనుండటం శుభపరిణామం. అసంఘటిత కార్మికులకు అండ... అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీనిద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12,45,806 మందికి మేలు జరుగనుంది. ఇందులో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల సంఖ్య 5,84,654 మంది ఉండగా, భవనాలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో 6,61,052 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తోంది. వేతనజీవులకు ఊరట... వేతన జీవులకు, పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. మహిళలు, మహిళా ఉద్యోగులకు భరోసా... మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి అనేక రాయితీలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే 6కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం మరో రెండు కోట్ల కనెక్షన్లను ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 వేల వరకు కనెక్షన్లు రానున్నాయి. మాతృత్వయోజన పథకం కింద మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇవ్వడం హర్షనీయం. సుమారు 23,478 మంది మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు వర్తించనున్నాయి. అంగన్వాడీలకు పెరగునున్న వేతనం మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళా టీచర్లు, ఆయాలకు వేతనాలను 50 శాతం పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,235 మంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వస్తుండగా రూ.1,500 పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అమల్లోకి రావడం లేదు. అదేవిధంగా ఆయాలకు రూ.7,500లకు అదనంగా రూ.750 పెంచినట్లు ప్రకటించినా, ప్రస్తుతం రూ.7,500 వస్తోంది. కొత్తపల్లి–మనోహర్బాద్ లైన్కు రూ.200 కోట్లు... ఈ బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.64,587 కోట్లు కేటాయించినట్లు పేర్కొనగా... గతంతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బాగానే విదిల్చారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ 150 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ను 2006–07లో ప్రతిపాదించారు. ఆ సమయంలో దాని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. గడిచిన నాలుగేళ్లుగా ప్రతీ ఏటా రూ.137 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 32 కిలోమీటర్ల దూరం వరకు మనోహరాబాద్–గజ్వేల్ మధ్య పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. కాజీపేట–బల్హర్షా మధ్య 202 కిలోమీటర్ల దూరం వరకు మూడవ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని 2015–16వ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయించి రూ.2,063 కోట్లు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్లుగా రూ.360 కోట్లు కేటాయించగా ప్రస్తుత పనుల నిమిత్తం రూ.265 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాఘవపూర్ నుంచి మందమర్రి వరకు మూడవ రైల్వే ట్రాక్ వినియోగంలోకి రాగా రాఘవపూర్–పొత్కపల్లి–బిజిగిరిషరీఫ్–ఉప్పల్ మధ్య రెండవ విడత పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ బడ్జెట్ ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రాజకీయ లబ్దికి ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని తెలిసినా ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలులో ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఐదేళ్లలో చాలా సాధించాం. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్ సాధించాం. ఇంకా చాలా అంశాలకు సంబంధించి గెజిట్ విడుదల కావాల్సి ఉంది. – బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ ఎంపీ కేసీఆర్ పథకాలను ఫాలో అయిన కేంద్రం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లాభం జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎకరానికి, ఫసల్కు రూ.5వేలు ఇస్తున్నం. కేంద్రం మాత్రం రెండున్నర హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు రూ.6వేల చొప్పున ఇచ్చేలా బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సంస్కరణలు చేపట్టాం.. సంక్షేమం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నరు. కానీ నల్లధనం ఎంత మేరకు వెనక్కి తీసుకువచ్చారో... నోట్ల రద్దు తర్వాత ఎన్ని డబ్బులు తిరిగి వచ్చాయో చెప్పలేని పరిస్థితి. అయితే సంక్షేమం అని చెప్పి తెలంగాణ మోడల్ మొత్తం తీసుకున్నరు సంతోషం. – కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ ఓట్ల కోసమే మభ్యపెట్టే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చేసిన ప్రయత్నంగా కనబడుతోంది. నాలుగున్నరేళ్లుగా రైతాంగం సమస్యలపై ఊసేత్తని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రైతుల కోసం ఎకరాకు రూ.6వేలు అంటూ వరాలు కురిపించడం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని అర్థమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఈ దిగుమతులు వ్యవసాయరంగ సంక్షోభాన్ని తెలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. –కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సామాన్యులకు లాభం లేదు.. ఇది ఓట్ల బడ్జెట్ మాత్రమే. దీంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా చెల్లించడం కంటి తుడుపు మాత్రమే. ఉద్యోగాలివ్వడంలో విఫలమయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కార్పై ప్రజలు సర్జికల్ స్ట్రయిక్ చేస్తారు. –అంబటి జోజిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు -
రాష్ట్ర రైతులకు కేంద్రం ‘పెట్టుబడి’ 2,824 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకం కింద తెలంగాణలో 47.08 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు రూ. 2,824 కోట్ల పెట్టుబడి సాయం పొందనున్నారు. ఆయా రైతులందరికీ రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో (ఏటా రూ. 6 వేలు) వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. ప్రస్తుత రబీ సీజన్కు అంటే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తున్నందున ఈ ఏడాది మార్చి నాటికి రైతులకు డబ్బు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకు అవసరమైన రైతు బ్యాంకు ఖాతా నంబర్లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులకు ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వల్ల రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం రైతుల సంఖ్య 57.24 లక్షలుకాగా అందులో ఐదెకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతుల సంఖ్య 47.05 లక్షలుగా (అంటే 90 శాతం మంది) ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో అత్యధికంగా ఎకరం లోపు భూమి ఉన్నవారు 14.86 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సన్న, చిన్నకారు రైతుల చేతిలో 95.59 లక్షల ఎకరాలు (అంటే 68.05 శాతం) ఉంది. ‘రైతుబంధు’ఆదర్శంగా... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అమలు చేయడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల బ్యాంకు ఖాతాలు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని, కాబట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి రైతు బ్యాంకు ఖాతాలను సేకరించి ఇవ్వడమనేది సులువైన వ్యవహారం కాదని చెబుతున్నారు. లక్ష్యం ఒకటే అయినా ... రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు పథకం, కేంద్రం తెచ్చిన పెట్టుబడి సాయం పథకం లక్ష్యం రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే అయినప్పటికీ వాటి అమలు మాత్రం వేర్వేరుగా ఉంది. తెలంగాణలో రైతుబంధు కింద ప్రస్తుతం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుండగా కేంద్రం ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఏటా రూ.6 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ లెక్కన ఐదెకరాలున్న ఒక రైతు.. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.40 వేలు పొందితే కేంద్ర పథకం ద్వారా రెండు సీజన్లకూ కలిపి రూ.6 వేలే పొందుతాడు. దీనిపై పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద అన్ని వర్గాలూ పెట్టుబడి సాయం పొందుతుండగా మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకంతో ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకే అదనంగా కేంద్ర సాయం అందనుందని వ్యవసాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అమలు చేస్తే కేంద్రానికి పేరు రాదన్న భావనతోనే విడిగా అమలు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ ఊసే లేదు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రైతుబంధు తరహాలో ఐదెకరాలలోపు రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలోనే తెలంగాణ చర్చకు వచ్చింది తప్ప బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఏపీ, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ అంశంలో తప్ప మరెక్కడా తెలంగాణ ప్రస్తావన రాలేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఏపీకి, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. 2019–20కి కూడా నిధులు కేటాయించలేదు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, పలు జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని కొన్ని పద్దుల్లో చూపారు. తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్కు నిధుల ప్రస్తావన ఈ బడ్జెట్లో కనిపించలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేదు. కేంద్ర పన్నుల్లో వాటా ఇలా.. తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే మొత్తం (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం దక్కింది. ఇది రూ.20,583.05 కోట్లకు సమానం. గత ఏడాదికంటే దాదాపు రూ.2,022 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.6,665.84 కోట్లు, ఆదాయ పన్ను రూ.5,600.58 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,229.45 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.794 కోట్లు ఉన్నాయి. 2014–15తో పోల్చితే ఇప్పుడు కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా రెట్టింపు కావడం విశేషం. -
ఇదేం తిర‘కాసు’!
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సాయం..ఈ యాసంగి(రబీ) సీజన్లో ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. ఖజానాలో నగదు లేని కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు జమ కాలేదు. ఖరీఫ్, రబీ ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.4వేలను పెట్టుబడిగా అందించాలనేది లక్ష్యం. జిల్లాలోని 20వేల మంది రైతులకు పలు కారణాలతో ఈ పథకం వర్తించలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఆన్లైన్ విధానంలో నగదు జమ చేశారు. జిల్లాలో రబీ సీజన్కు 2,69,438 మంది రైతులను రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికి ఉన్న భూముల ఆధారంగా రూ.266.13కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 2,69,438 మంది రైతులు ఉండగా, వీరిలో 2,47,154 మంది బ్యాంక్ ఖాతాలను వ్యవసాయ విస్తరణాధికారులు ఆన్లైన్ చేశారు. వీరిలో 2,42,574 మంది రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు ట్రెజరీకి చేరాయి. 1.84లక్షల మందికి అందిన సాయం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ రైతుబంధు పథకం లబ్ధిదారుల వివరాలను, వారి బ్యాంక్ ఖాతాలను ట్రెజరీలకు అందించగా వీరిలో 1,84,806 మందికి లబ్ధి చేకూరింది. రైతుల ఖాతాల్లో రూ.185.48కోట్ల నగదును మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో ఇంకా 84,632 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.80.65కోట్లు అందాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటినా ఇంతవరకు రైతుబంధు పథకం ఊసే లేదు. ఖజానాలో నిధులు లేకనే లబ్ధిదారులకు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించలేకపోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీజన్ సగానికి వచ్చినా.. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలో అపరాలు, నూనె గింజల పంటలతోపాటు వరి నాట్లు వేశారు. వాటి సాగు కాలం కూడా సగానికి చేరింది. అపరాల పంటలు మరికొద్దిరోజుల్లో చేతికందనున్నాయి. ఖరీఫ్లో పంటల సాగుకు ముందుస్తుగా పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం..రబీలో బాగా వెనకబడిందని రైతులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో గతంలో మాదిరిగానే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకం నగదును తమ ఖాతాల్లో జమ చేసిందేమోననే ఆశతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపుజేయడంతో వీరు బ్యాంకులతోపాటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి డబ్బులు రాలేదు.. రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఇంకా ఇవ్వలేదు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వెంటనే అందజేస్తే ఉపయోగపడతాయి. ఖరీఫ్లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. మొక్కజొన్న, అపరాల పంటలు అప్పు చేసి వేసిన. రెండెకరాలకు అందే రూ.8వేల పెట్టుబడి సహాయం కోసం చూస్తున్నా. – భూక్య వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం కొందరికి జమ కావాల్సి ఉంది.. రైతుబంధు పథకం కింద రబీలో జిల్లాలోని కొందరు రైతులకు నగదు అందాల్సి ఉంది. ఈ ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నాం. ఆన్లైన్లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయింది. ఆన్లైన్ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు పడుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
నిలిచిపోయిన పెట్టుబడి సాయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. గత ఖరీఫ్లో రైతుబంధుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8వేల చొప్పున నగదు అందజేయాలని నిర్ణయించింది. అయితే, ఖరీఫ్లో రైతుల చేతికి నగదు అందినప్పటికీ, రబీ సీజన్ది మాత్రం ఇంకా అన్నదాతల ఖాతాల్లో జమ కాలేదు. ఎన్నికల వేళ ఆగమేఘాల మీద రైతుల బ్యాంకు అకౌంట్లలో నిధులను డిపాజిట్ చేసిన సర్కారు.. ఆ తర్వాత రైతుబంధును దాదాపుగా నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా 2,14,513 మంది రైతులకుగాను 1,87,854 మందికి పెట్టుబడి సాయం అందగా.. మరో 26,659 మంది ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఆర్థిక రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకం అమలుకు రూ.4500 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ తేల్చింది. నిధుల కొరత కారణంగా ఇందులో రూ.380 కోట్లు ఇంకా కర్షకుల దరికి చేరలేదు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో మూడో వంతు రైతులకు డబ్బులు డిపాజిట్ చేసింది. గత నెల ఐదో తేదీ నుంచి ఇప్పటివరకు కొత్తగా ఒక రైతుకూ సాయం అందలేదని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సాంకేతిక కారణాలను చూపుతూ అప్పుడు.. ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని ఆయన వాపోయారు. మరోవైపు వివిధ కారణాలతో పట్టాదార్ పాస్పుస్తకాలు జారీకానీ రైతులు రబీ సీజన్లోనైనా పెట్టుబడి సాయం అందుతుందని ఆశించారు. అయితే, ఎన్నికల కమిషన్ ఆంక్షలతో వీరికి మోక్షం కలగలేదు. చేయూతనందిస్తోంది. రబీ సీజన్ డిసెంబర్తో ముగిసింది. అయినప్పటికీ, ఈ సీజన్ సాయం రాకపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.24.73 కోట్లు రావాలి.. రబీ సీజన్లో పెట్టుబడి సాయం కింద జిల్లాకు రూ.204.17 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇంకా రూ.24.73 కోట్లు రావాల్సివుంది. ఖరీఫ్లో ప్రభుత్వమే చెక్కుల రూపేణా నగదును రైతులకు పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయిలోనే చెక్కులను ముద్రించి.. వ్యవసాయశాఖ ద్వారా అందజేసింది. అయితే, ఈ సారి ‘ముందస్తు’ ఎన్నికలు రావడంతో చెక్కుల పంపిణీకి బ్రేక్ పడింది. నేరుగా రైతుల ఖాతాలోనే సొమ్మును డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అంతేగాకుండా కొత్త లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చవద్దని ఆంక్షలు విధించింది. దీంతో గత ఖరీఫ్లో సాయం అందినవారికే ఈసారి కూడా నగదును బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నిధుల కటకట నేపథ్యంలో అన్ని జిల్లాలకు మన జిల్లా ట్రెజరీ నుంచే నిధులను మళ్లించింది. వివిధ పద్దుల కింద జమ అయ్యే నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చింది. ఇలా నిధుల లభ్యతకు అనుగుణంగా రైతుబంధుకు సొమ్ము విడుదల చేసిన రాష్ట్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. చేయూతనందిస్తోంది. రబీ సీజన్ డిసెంబర్తో ముగిసింది. అయినప్పటికీ, ఈ సీజన్ సాయం రాకపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
రైతు భరోసా పథకాన్ని ముందు నేనే ప్రకటించాను
-
దేశవ్యాప్త రైతుబంధుతో రాష్ట్రానికి మేలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుండటం.. ఈ పథక రూపశిల్పి కేసీఆర్కు ఊరట కల్గించనుంది. కేంద్రమే నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది బడ్జెట్లో ఖరీఫ్, రబీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించింది. ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆ రెండు సీజన్లలో రైతులకు అందజేసింది. దీని ప్రకారం దాదాపు రూ.11 వేల కోట్లు రైతులకు అందినట్లయింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఆ ప్రకారం బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రుణమాఫీకి దాదాపుగా రూ.20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వచ్చే బడ్జెట్లో దాదాపు రూ.35 వేల కోట్లు. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తుందని, ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ఇచ్చేలా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రైతుబంధు నిధులు ఎంతో ఊరటనిస్తాయన్న చర్చ జరుగుతోంది. 70% నిధులు కేంద్రం ఇస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే నిధులను మొత్తంగా భరించకపోవచ్చు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి.. రాష్ట్రాలూ ఈ భారాన్ని కొంతమొత్తంలో పంచుకునే దిశగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు సాధారణంగా 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఈ పద్ధతిలోనే రైతుబంధు నిధులూ కేటాయించాలని కేంద్రం భావిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పథకం కేంద్రమే అమలు చేస్తుందన్న భావన తీసుకురావాలంటే ఎక్కువ మొత్తంలో నిధులు తామే భరిస్తున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రధాని ప్లాన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే కేంద్రం 70%, రాష్ట్రాలు 30% భరించేలా విధివిధానాలు రూపొందించే అవకాశం ఉండొచ్చన్నారు. ఆ ప్రకారం కేంద్రం ఎకరాకు రూ.8 వేలలో 70%.. అంటే రూ.5,600 భరిస్తుంది. మిగిలిన రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తానని చెప్పింది కాబట్టి కేంద్రం ఇవ్వగా అవసరమైన దానికి అదనంగా రూ. 2 వేలు కలిపితే సరిపోతుంది. ఆ ప్రకారం ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.4,400 ఇస్తే సరిపోతుంది. అంటే రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో దాదాపు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే సరిపోతుంది. అంటే రూ.15 వేల కోట్లలో ఇవిపోను రూ.8 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ. 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎస్బీఐ పరిశోధన పత్రంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సాగు 34.59 కోట్ల ఎకరాలు కాగా ఆ స్థాయిలోనే ఖర్చవుతుందని తేల్చి చెప్పింది. -
జార్ఖండ్లో ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్లోనూ రైతుబంధు పథకాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సం గతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లోనూ ఆ బృందం పథ కంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి ఏడాదిలో రూ.10 వేలు ఇవ్వనున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలంగాణ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంటే ఒక సీజన్కు ఎకరానికి రూ.2,500 చొప్పున ఇచ్చే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకం తీరు తెన్నులను పరిశీలించనుందని అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్లోనూ మన సాఫ్ట్వేర్! జార్ఖండ్ ప్రభుత్వం అక్కడ రైతుబంధును అమలు చేస్తే తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ను తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ అధికారులను వారు కోరినట్లు తెలిసింది. రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంలో వ్యవసాయశాఖ భారీ కసరత్తే చేసింది. రైతుల వివరాలు, వారికి ఉన్న భూమి వివరాలను పక్కాగా రూపొందించింది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి సాఫ్ట్వేర్ను అభివృద్ధి పరిచింది. దీంతో పొరపాట్లు తలెత్తకుండా పథకం అమలు జరిగింది. ఈ నేపథ్యంలో మన సాఫ్ట్వేర్ను తీసుకోవాలని జార్ఖండ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ రాష్ట్ర అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం : కేటీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. ఒడిశా, జార్ఖండ్ తర్వాత తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ రైతుబంధు, రైతుబీమా లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమత ప్రకటిం చారని, ఈ మేరకు ఆమె ప్రకటనను జోడిస్తూ కేటీఆర్ ట్విట్టర్లో సోమవారం పోస్టు చేశారు. -
కొందరికే ‘బంధు’వు
మహబూబ్నగర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధు పథకం కింద నగదు జమ చేసే ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. రబీ సీజన్కు సంబంధించి అక్టోబర్ మాసంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. అయితే, మూడు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు నగదు అందలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది. అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు. చెక్కులకు బదులు నగదు రైతులు పంట పెట్టుబడి కోసం దళారులు, వ్యా పారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్ర భుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4 వేలు అందించారు. ఆ సమయంలో రైతులకు చె క్కులు అందించగా రైతుల్లో ఖాతాల్లో జమ చేసు కుని డబ్బు తీసుకున్నారు. ఇక రబీ సీజన్కు సం బంధించి పెట్టుబడులను చెక్కుల రూపంలో పం పిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. ఈ మేరకు రైతులకు చెక్కుల రూపంలో ఇవ్వకుండా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో రైతుల ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు ఆయా ఖాతాల్లో నగదు జమ చేయడం ఆరంభించారు. ఈ ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కాగా.. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. ఇప్పటి వరకు 80 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, మిగతా 20 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో డబ్బు అందని రైతులు అసలు డబ్బు వస్తుందా, రాదా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులను అడుగుతుండగా.. రేపు, మాపు అంటూ రకరకాలు కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా రబీ పెట్టుబడి, ఇతర ఖర్చులకు అండగా ఉంటుందనుకుంటున్న డబ్బు అందక వారు ఇబ్బంది పడుతున్నారు. ఖాతాల వివరాలు లేక... జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించిన అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటి వరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ అకౌంట్లలో రైతుబంధు నగదు జమ చేసేందుకు హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయానికి నివేదించారు. ఈ మేరకు కమిషనరేట్ అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బు చేసేలా ట్రెజరీకి పంపించారు. అలా ఇప్పటి వరకు 2,34,300 మంది రైతులకు సంబంధించి రూ.276.34 కోట్లు ఖాతాల్లో జమ అయింది. అంటే 80 శాతం మంది రైతులకు రైతు బంధు నగదు అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డ బ్బు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపింనా వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో దాదాపు 1,800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాల వివరాలను మరోసారి సేకరించి పంపించనున్నట్లు తెలిపారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రబీ పంటకు సంబంధించి రైతుబంధు నగదు అకౌంట్లలో జమ కావడంలో జాపం జరుగుతుంది. ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదు. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని వారితో పాటు అసలే ఖాతాల నంబర్లు ఇవ్వని వారి వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, రసాయన ఎరువులు కొనుగోలు చేయాల్సిన తరుణంలో చేతుల్లో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఖరీఫ్లోపెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేయగా.. సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు సంబం«ధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం వివరాలను సేకరించి కమిషనర్కు పంపించారు. ఆయా రైతుల ఖాతాల్లో దశల వారీగా రైతు బంధు డబ్బును జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండడంతో ఎప్పుడు డబ్బు జమ అవుతుందో తెలియక రైతులు ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.276.34 కోట్లు జమ జిల్లాలోని 2,34,300 మంది రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు రూ. 276.34 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆయా రైతులు కూడా త్వరగా తమ పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఏఈఓలను అందజేయాలి. అలా ఇచ్చిన వారి ఖాతాల్లో 15–20 రోజుల్లో రైతు బంధు నగదు జమ చేస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
అప్పుల సాగు..రైతుబంధుతో కాస్త బాగు
సాక్షి, హైదరాబాద్: అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నాబార్డు స్పష్టం చేసింది. తెలంగాణలో 79.5 శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై ఒకటో తేదీ నుంచి 2016 జూన్ 30 వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్) పేరిట నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబ ఆదాయాలు, వ్యవసాయ రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై సర్వే చేసింది. 29 రాష్ట్రాలలోని 245 జిల్లాల్లో 2,016 గ్రామాల్లో 40,327 కుటుంబాలను సర్వే చేసింది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 48 గ్రామాల్లో 958 కుటుంబాలను సర్వే చేసింది. వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, రైతుబంధుతో గ్రామాల్లో ప్రైవేటు అప్పులు తగ్గాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో సాగు, విత్తన ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గిందంటున్నారు. కూలీ ద్వారానే అధిక ఆదాయం దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారాకంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతు న్నారు. ఉదాహ రణకు వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ. 3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి పొలం పనుల ద్వారా రూ.3,025, ఉపాధి కూలీ ద్వారా రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. అలాగే చాలామంది వ్యవ సాయ కుటుం బాలకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేవు. కేవలం 5% మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారు. ఇందులో పంజాబ్లో అధికంగా 31%, గుజ రాత్లో 14%, మధ్యప్రదేశ్లో 13% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పవర్ టిల్లర్స్ 1.8%, స్ప్రింక్లర్లు 0.8%, సూక్ష్మసేద్యం 1.6%, హార్వెస్టర్లు 0.2% ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఇక మన రాష్ట్రంలో 2017 నుంచి రాష్ట్ర ప్రభు త్వం పెద్దఎత్తున సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిందని, దీంతో ఇప్పుడు ట్రాక్టర్లు కలిగిఉన్న వారి శాతం పెరి గిందని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు వినియోగిస్తున్న యంత్రాలలో పవర్ టిల్లర్స్ (చిన్న సాగు యంత్రాలు)7 శాతం ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. చదువుకోని వ్యవసాయ కుటుంబాలు 32 శాతం.. సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల్లో అసలు చదువుకోని (నిర క్షరాస్యులు) వారి శాతం దేశవ్యాప్తంగా 32.2% ఉంది. అలాగే కాస్తో కూస్తో చదవగలిగిన ప్పటికీ సాధారణ విద్య కూడా అభ్యసించని వారు 8% ఉన్నారు. వ్యవసాయేతర కుటుంబాల్లో సాధారణ విద్య అభ్యసించని వారు 7%గా ఉన్నారు. సగటున వ్యవసాయ కుటుంబాల్లో నెలవారీ ఆదాయం రూ.8,931గా ఉంది. అలాగే రాష్ట్రంలో నెలవారీ ఆదాయం రూ.7,811గా ఉంటే ఖర్చు రూ.6,813గా ఉంది. మిగులుతోంది కేవలం రూ.998 మాత్రమే కావడం గమనార్హం. పాడిపశువుల పోషణే ఆర్థిక భరోసా.. పాడి పశు పోషణ ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నాబార్డు సర్వే స్పష్టం చేసింది. కరువుకాటకాలు వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినపుడు పశుసంపదనే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వ్యవసాయ కుటుంబాలు 50.7 శాతం పాడి పశువుల పోషణ చేస్తుండగా, దుక్కిటెద్దులు కలిగి ఉన్నవారు 10.8 శాతంగా ఉంది. కోళ్లు వంటివి 5 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యవసాయేతర కుటుంబాల్లో కేవలం 5.7 శాతం మంది మాత్రమే పాడి పోషణ కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారికి, చిన్న, మధ్య తరహా, మహిళా రైతులకు కూడా పాడి ద్వారా ఉపాధి కలుగుతోంది. దీని ప్రకారం వ్యవసాయానికి అనుబంధంగా పాడి పోషణ ఉంటే నష్టాలు వచ్చినపుడు రైతులు నిలదొక్కుకోవచ్చునని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులు ఇవ్వడం వల్ల ఎంతోకొంత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు. -
కొత్తగా మరో మూడు లక్షల మందికి ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా మరో మూడు లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి రూ. 250 కోట్ల సొమ్ము జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీరంతా ఖరీఫ్లో అర్హత పొందలేదు. అప్పట్లో కొందరికి పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడం, ఇతరత్రా వివాదాలు నెలకొనడంతో అవరోధం ఏర్పడింది. వాటిని సరిదిద్ది రబీలో అర్హులుగా మార్చినా, కోడ్ నేపథ్యంలో పెట్టుబడి సొమ్ము ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వారికి తాత్కాలికంగా పంపిణీ నిలిపివేశారు. తాజాగా కోడ్ ముగియడంతో వీరందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని నిర్ణయించారు. అయితే అందుకు గాను ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, వచ్చాక వారికి రైతుబంధు సొమ్ము అందజేస్తామని అధికారులు అంటున్నారు. రబీలో ఇప్పటివరకు 50 లక్షల మందికి అందజేత... రబీలో ఇప్పటివరకు 50 లక్షల మంది రైతులకు రూ. 4,724 కోట్లు అందజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వీరికి అదనంగా మరో 3 లక్షల మందికి ఇవ్వనున్నారు. ఇదిలావుంటే ఖరీఫ్లో ఇచ్చినట్లే రబీలోనూ చెక్కులు ఇవ్వాలని మొదట్లో వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారులు 53 లక్షల మంది రైతుల పేరుతో చెక్కులు ముద్రించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వాటిని నిలుపుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేశారు. దీంతో ఆ చెక్కులన్నీ ప్రస్తుతం అలాగే ఉండిపోయాయి. వీటిని వచ్చే ఖరీఫ్లో గడువు తేదీ పెంచి వినియోగించాలని తొలుత వ్యవసాయశాఖ భావించింది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 5 వేల వంతున ఇవ్వాలని సర్కారు నిర్ణయించినందున చెక్కుల సమస్య ఇబ్బందికరంగా మారినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రూ. 4వేల మొత్తానికి చెక్కులను అందజేసి, మిగతా రూ.వెయ్యి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసే యోచన కూడా చేస్తున్నారు. తద్వారా పాత చెక్కులు వృథా కాకుండా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల వరకు మిగులుతుందని అంటున్నారు. రైతు బంధుకు గాను పెరిగిన మొత్తంతో ఏడాదికి రూ. 15 వేలు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. -
ఓట్ల పంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణ రైతాంగం పూర్తి అండగా నిలిచింది. రైతుబంధు పథకం లబ్దిదారులు ఆ గులాబీ పార్టీకే మళ్లీ పట్టం గట్టారు. ఖరీఫ్, రబీలలో ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇవ్వడంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆశించిన టీఆర్ఎస్ వర్గాలకు ఓటు రూపంలో ఆశీర్వాదం లభించింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారింది. రైతు బీమాతోనూ లబ్ది పొందుతున్నారు. రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తున్న తీరు కూడా ఓటుగా మారిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూ.10 వేల కోట్లు.. కోటి ఓట్లు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. చివరకు ఖరీఫ్లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ. 5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు. ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్ధిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్లకు పైగా ఓటర్లుంటే, అందులో హైదరాబాద్ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42% మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్ధిదారులని తేలింది. ఇక ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటివరకు 44 లక్షల మంది రైతులకు రూ.4,725 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. అంటే సరాసరి ప్రతీ రైతుకు రూ.10,738 ఇచ్చారు. ఇలా రెండు సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు దాదాపు రూ.21 వేలు ఇచ్చినట్లయింది. మొత్తంగా రెండు సీజన్ల కు కలిపి ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్ల రైతు జేబుల్లోకి వెళ్లాయి. పైగా వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తా మని టీఆర్ఎస్ హామీ ఇవ్వడంతో రైతులు వారి వైపు మొగ్గుచూపారు. ఇటు రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాల్లోపు రైతులే 68% మంది ఉన్నారు. అంటే వారంతా కూడా సన్న, చిన్నకారు రైతులేనని స్పష్టమవుతోంది. అందులో ఎకరాలోపున్న రైతులు 7.39%, 1–2 ఎకరాల మధ్య రైతులు 15.62%, 2–3 ఎకరాల మధ్య ఉన్న రైతులు 16.67%, 3–4 ఎకరాల మధ్య ఉన్న రైతులు 14.78%, 4–5 ఎకరాల మధ్య ఉన్నవారు 13.59% మంది ఉ న్నారు. ఐదెకరాల్లోపున్న రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే కావడంతో వారంతా టీఆర్ఎస్కే గంపగుత్తగా ఓట్లేశారు. -
రైతు ఆదాయం రెండున్నర రెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అన్నదాత ఆదాయం దాదాపు రెండున్నర రెట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎస్ఎల్బీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని వెల్లడించింది. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో 2022 నాటికి రైతు ఆదాయం అధికంగా ఉంటుందని తెలిపింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రైతు సంక్షేమ పథకాల కారణంగానే ఇది సాధ్యం కానుందని వెల్లడించింది. ఇందులో నాబార్డు పాత్ర కూడా కీలకమేనని పేర్కొంది. తలసరి రూ.2.01 లక్షలు 2015–16లో ప్రస్తుత ధరల ప్రకారం రైతుల సరాసరి ఆదాయం రూ.86,291. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ.63,492, వ్యవసాయేతర ఆదాయం రూ. 22,799. అదే జాతీయ స్థాయిలో అన్నదాత సగటు ఆదాయం రూ.96,703. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ. 58,246 కాగా.. వ్యవసాయేతర ఆదాయం రూ. 38,457. జాతీయస్థాయిలో రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయం తక్కువగా ఉండగా, రాష్ట్రంలో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. కానీ వ్యవసాయేతర రంగాల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో మాత్రం తెలంగాణ రైతులకు తక్కువ మొత్తం లభిస్తోంది. 2022–23 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం ఉన్న ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందని ఎస్ఎల్బీసీ నివేదిక పేర్కొంది. 2022–23 నాటికి తెలంగాణలో రైతు ఆదాయం రూ.2,01,431 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదే జాతీయస్థాయిలో రైతు ఆదాయం రూ.2,19,724 ఉండనుంది. రాష్ట్రంలో రైతు పొందే ఆదాయంలో వ్యవసాయం ద్వారా రూ.1,56,522, వ్యవసాయేతర రంగాల ద్వారా రూ.44,909 పొందే అవకాశముందని ఎస్ఎల్బీసీ వెల్లడించింది. అదే జాతీయస్థాయిలో వ్యవసాయ ఆదాయం రూ.1,52,031 వ్యవసాయేతర ఆదాయం రూ. 67,693 ఉంటుందని తెలిపింది. పెరుగుదలకు కారణమైన అంశాలు 2014–15 నుంచి తెలంగాణలో వివిధ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారానే రైతు ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. పంటల ఉత్పాదకత ద్వారా 13.40% ఆదాయ వృద్ధి నమోదైంది. పశుసంవర్థక రంగాల ద్వారా 15.10% ఆదాయం సమకూరింది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా 16.90%, పంటల మార్పిడి ద్వారా 4.60%, పంటలకు సరైన ధరలు 8.70%, ఇతర అంశాల ద్వారా 16.40% ఆదాయం సమకూరిందని తెలిపింది. రానున్న రోజుల్లో రైతుబంధు రైతు ఆదాయం పెరుగుదలలో కీలకం కానుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుబంధు ద్వారా అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు సమకూరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తాము చేపట్టే పలు కార్యక్రమాలు కూడా రైతు ఆదాయం పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటాయని నాబార్డు చెబుతోంది. రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీవో), ఏరియా అభివృద్ధి పథకాలు, గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు, సూక్ష్మస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్జీ) ద్వారా ఆర్థిక సాయం వంటివి కీలకమైనవని నాబార్డు చెబుతోంది. -
మంచిగనే జేసిండ్రు..మస్తుగ జెయ్యాలె!
పాలన మస్తుగుందని కొందరు.. ఇంకొంచెం మెరుగుపడాలని ఇంకొందరు.. ఇప్పటికే చేపట్టిన పథకాలు మేలు చేస్తున్నాయని కొంతమంది.. సరిపోవడం లేదని ఇంకొంత మంది.. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ టీఆర్ఎస్ సర్కారే రావాలని కొందరు.. కొత్త సర్కారుకు అవకాశం ఇవ్వాలని మరికొందరు.. ఇలా భిన్నాభిప్రాయాలు.. మనసులోని మాటలు.. మనోగతాలు.. ఎన్నికల వేళ ‘సాక్షి’ జనం నాడి పట్టే ప్రయత్నం చేసింది. అందుకు నాగ్పూర్ – బెంగళూరు (44వ నంబర్ జాతీయ రహదారి) హైవేను ఎంచుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు సుమారు 570 కిలోమీటర్ల మేర కొనసాగి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ వద్ద ముగుస్తుంది. 6 జిల్లాల మీదుగా సాగే ఈ రహదారి జీవన వైవిధ్యానికి ప్రతీక. అటువంటి రహదారిపై ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనం మనోగతం ఏమిటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏ పార్టీపై ఎవరు ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు?.. రెండ్రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ రహదారి వెంబడి ఉన్న పల్లె, పట్నం వాసులను ‘సాక్షి’ పలకరించింది. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం 15 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం ఒక్కో రూట్లో 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో ఎదురుపడిన వారితో పాటు, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకునే వారిని, రోడ్డు పక్కనున్న గ్రామాల వారిని బృందంలోని సభ్యులు పలకరించారు. ‘ఎన్నికలెలా జరుగుతున్నాయి?, ఏ పార్టీ గెలుస్తుంది?, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?, కేసీఆర్ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి?, సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించింది. రైతులు, కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత.. తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ మాదిరి పనిజేయాలె.. టీఆర్ఎస్ సర్కారు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. గతంలో రాజశేఖర్రెడ్డి పేదల కోసం అనేక మంచి పనులు చేసిండు. అప్పటి మాదిరి పనిచేసేటోళ్లే అధికారంలోకి రావాలె. – మణెమ్మ, చిరు వ్యాపారి, తూప్రాన్ ఎవరికో రైతు‘బంధువులు’? రైతుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై సానుకూలతే వ్యక్తమైంది. అత్యధిక మంది రైతులు రైతుబంధు, బీమా పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు అందకపోవడంపై మాత్రం కొందరి మాటల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కేసీఆర్కు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం పలువురు రైతుల నుంచి వ్యక్తమైంది. ‘24 గంటల కరెంట్ కంటే రైతుకు ఏం కావాలె? పెట్టుబడి డబ్బులిస్తుండు. ప్రస్తుతం ఆయన పథకాలతో మేమంతా సంతోషంగానే ఉన్నాం’ అని సోన్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్ చెప్పాడు. రామాయంపేట నుంచి చేగుంటకు పనిపై వెళ్తున్న బాలయ్య అనే రైతును పలకరిస్తే.. ‘కేసీఆర్ ఏం తక్కువ చేయలే.. మళ్లీ ఆయనొస్తారు’ అన్నారు. ముఖ్యంగా రైతుబంధు, బీమా పథకాలతో రైతులకు మేలు జరిగిందని పలువురు రైతులు చెప్పారు. ‘రైతుబంధు ఆలోచన దేశంలో ఎవరికైనా వచ్చిందా? ఇది కేసీఆర్ ఘనతే’ అని మానవపాడుకు చెందిన రైతులు మద్దిలేటి, మోహన్ అన్నారు. అయితే, కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులపై పని చేస్తున్నట్టు కనిపించింది. ‘కేసీఆర్ రుణమాఫీ చేసినా.. బ్యాంకోళ్లు చాలా ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ కూడా రూ.2 లక్షల మాఫీ అంటోంది కదా.. చూద్దాం’ అని అన్నారు నేరడిగొండకు చెందిన రైతు జాట్ మున్సింగ్. ‘కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. అందుకైనా కేసీఆర్కు ఒక అవకాశం ఇవ్వాలి’ అని మేడ్చల్కు చెందిన స్టేషనరీ దుకాణదారు సంజీవరావు అన్నారు. పెబ్బేరు, అలంపూర్ ప్రాంతాల్లో సాగునీటి కరువు తీరిపోయిందనే అభిప్రాయం అక్కడి రైతుల నుంచి వ్యక్తమైంది. పిప్పర్వాడిలో రైతు కుటుంబానికి చెందిన గృహిణి స్వప్న మాత్రం.. ‘కేసీఆర్ మల్ల సీఎం అవుతడు’ అంటూనే, ‘ఎకరానికి రూ.4 వేలు మోతుబరి రైతులకు ఇవ్వడం ఎందుక’ని ప్రశ్నించింది. ‘ఆసరా’నిచ్చేవి అవేనా! టీఆర్ఎస్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జైనథ్ నుంచి అలంపూర్ వరకు పలువురు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెద్దసంఖ్యలో వృద్ధులు, వితంతు మహిళలు ‘మళ్లీ కేసీఆర్ రావాలం’టూ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లికి చెందిన సంకటి గంగాధర్ను ఇదే విషయమై ప్రశ్నిస్తే.. ‘పేదల దేవుడు’ అంటూ కృతజ్ఞత వెలిబుచ్చారు. ఇంకా పలుచోట్ల వృద్ధుల నుంచీ అదే స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్ కూడా పెన్షన్ మొత్తాలను పెంచనున్నట్టు చెబుతున్నా.. అత్యధిక మంది ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నామని చెప్పడం విశేషం. ‘కేసీఆర్ కొడుకు లెక్క ఆదుకుంటుండు’ అని కానాపూర్ (మహబూబ్నగర్ జిల్లా)కు చెందిన రాములుతో సహా పలువురు వృద్ధులు చెప్పారు. ‘కల్యాణలక్ష్మి డబ్బులు రాబట్టె నా బిడ్డ పెళ్లి ఖర్చులకు వెతుకులాట తప్పింది’ అంటూ ఆనందంగా చెప్పింది జడ్చర్ల ఇబ్రహీంపల్లెకు చెందిన జయమ్మ. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం మారితే అవన్నీ ఆగిపోతాయని, కాబట్టి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలనే అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమైంది. మహారాష్ట్ర సరిహద్దులోని పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద హైవే పక్కనే తోపుడుబండి నడుపుకుంటున్న మహేందర్ను ఇదే విషయమై పలకరిస్తే.. ‘పనులైతే మంచిగ జరుగుతున్నయ్.. నేనైతే టీఆర్ఎస్సే గెలుస్తదనుకుంటున్న..’ అంటూ కుండబద్దలు కొట్టాడు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేకపోయారనే అసంతృప్తి ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు కేసీఆర్ను నమ్ముతున్నారు’ అని నార్సింగికి చెందిన రవి చెప్పాడు. మళ్లీ ఆయనే రావాలి.. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ పనితీరుపై అడిగిన ప్రతి పది మందిలో ఏడుగురు ‘బాగుంద’నే సమాధానమిచ్చారు. వీరిలో అత్యధిక మంది సంక్షేమ పథకాలు బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కొత్త ప్రభుత్వం.. పనులన్నీ మధ్యలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మారితే ప్రజలకే నష్టం’ అని కోమట్పల్లికి చెందిన రైతు మెట్టు యాదగిరి అభిప్రాయపడ్డాడు. అయితే టీఆర్ఎస్కు గెలుపు అంత సులువు కాదని, తీవ్ర పోటీ ఎదుర్కొంటోందని గజ్వేల్ నియోజకవర్గం ఇస్లాంపురకు చెందిన శ్రీధర్ అనే యువకుడు అన్నాడు. ‘పోటీ తీవ్రంగానే ఉంది. అయితే, కొద్దిపాటి తేడాతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది’ అని చేగుంట మండలం పోతన్పల్లికి చెందిన డ్రైవర్ దొంతి స్వామి చెప్పాడు. ‘నీళ్లు, పింఛన్లు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇళ్లేవి? మేనిఫెస్టో హామీలను బట్టి చూస్తే కాంగ్రెస్కూ చాన్సుంది’ అని రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన సాయిబాబా అనే యువకుడు అన్నాడు. అయితే, అత్యధిక మంది టీఆర్ఎస్ – కూటమి పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, ఎవరికీ గెలుపు నల్లేరుపై నడక కాదని అన్నారు. ఉద్యోగులు, యువకుల మిశ్రమ స్పందన ‘ఎవరికి ఏం అవసరమో గుర్తించి.. అన్నీ సమకూరుస్తున్నారు. ఇంకెవరొచ్చినా అంతకంటే ఏం చేయగలరు?’ అని మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఉద్యోగి కె.సాయిలు ప్రశ్నించారు. ఓయూ క్యాంపస్లో ఉండే మహిద్ అలీది కూడా ఇదే అభిప్రాయం. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన నడుస్తుందనే అభిప్రాయం కూడా పలువురు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. ‘లక్ష ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో కూడా చెప్పలేకపోయింది’ అని షాద్నగర్కు చెందిన నిరుద్యోగి శ్రీకాంత్రెడ్డి నిష్టూరమాడితే.. ‘వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నాం’ అని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్కు చెందిన ఆటోడ్రైవర్ రవి చెప్పాడు. ‘ఉద్యోగాలు భర్తీ చేయని మాట వాస్తవమే. కానీ, కూటమిలో ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. వారిలో ఎవరొచ్చినా అథోగతే. కాబట్టి కేసీఆర్ సర్కారు రావాలి. కానీ, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాలి’ అని గద్వాలకు చెందిన కాంట్రాక్టర్ అతిక్ రహమాన్ అభిప్రాయపడ్డారు. వీటి సంగతేమిటి? కొన్ని అంశాలపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరెలా స్పందించారంటే... - భూ రికార్డుల ప్రక్షాళనలో పలు తప్పులు దొర్లాయి. వీటిని సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. - దళితులకు మూడెకరాలు పంపిణీ చేయలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదు. - ఇంటింటికీ నల్లా పథకం అన్ని ప్రాంతాల్లోనూ అమలు కావడం లేదు. - కేసీఆర్, ప్రభుత్వ పనితీరు బాగున్నా.. స్థానిక ఎమ్మెల్యేల వ్యవహారశైలి బాలేదనే అసంతృప్తి - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తీరు బాగాలేదు. యువతకు ఉపాధి కల్పన అంతంతే.. ఎవరు గెలుస్తరో.. ప్రభుత్వ పనితీరు బాగుంది. మా నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలుస్తరో చెప్పలేం. కేసీఆర్ పథకాలు భేష్. – గంగాధర్, ఉద్యోగి, నార్సింగి తుమ్మిళ్లతో మేలు టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు బాగున్నాయి. తుమ్మిళ్ల లిఫ్టుకు నీరు వదలడం రైతుల అదృష్టం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ చేసి చూపారు. – రాముడు, నారాయణపురం విద్యుత్ కోతల్లేవ్.. గతంలో విద్యుత్ కోతలుండేవి. ప్రసు ్తతం 24 గంటలు కరెంటు ఇస్తున్నరు. కోతలు లేవు. కొన్ని హామీల అమలులో మాత్రం ప్రభుత్వం విఫలం.. – వెంకటేష్గౌడ్, కొత్తూరు సన్నబియ్యం మిన్న విద్యార్థుల కోసం పలు సంక్షేమ పథకాలు తెచ్చారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నా.. – వంశీ, నిజామాబాద్ కొన్నింట విఫలం కొన్ని పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైంది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు భేష్. అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేల పనితీరు నిరాశే.. – శ్రీధర్, కొడిచర్ల యువతకు నిరాశే.. నాలుగున్నరేళ్లలో యువతకు చేసిందేంటి? ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ పని తీరు బాగా లేదు. ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం యువత చూస్తోంది. – జ్యోతి,జక్రాన్పల్లి రైతుబంధు భేష్ సీఎం కేసీఆర్ బాగానే పని చేశారు. అందరు ఆయనే రావాలంటున్నరు. ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకం బాగున్నయి. – బి.రామకృష్ణ, జల్లాపురం, గద్వాల పింఛన్ మంచిగుంది.. రూ.200 ఉన్న పింఛన్ను రూ.వెయ్యి చేసిండు. నాకు ఖర్చులకు నా కొడుకు గుడ డబ్బులిస్తలేడు. అసొంటిది నెలనెలా కేసీఆర్ వెయ్యి రూపాలు పింఛనిస్తుండు. కొడుకు మల్లొస్తే పింఛను పెంచుతడట. కేసీఆర్ మంచోడు. నా కొడుకసొంటోడు. గీ సర్కారు మల్ల రావాలె.. – చంద్ర, వృద్ధురాలు, కుప్టి, ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత పాలన పర్వాలేదు టీఆర్ఎస్ పాలన పర్వాలేదు. ఇతర పార్టీలతో పోల్చితే బాగుంది. గతంలో చేయని పనులను చేపట్టారు. తిరిగి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలి. కేసీఆర్ ఉంటేనే అన్ని పథకాలు అమలవుతయి. –షేక్ అస్రాత్, మేడ్చల్, ఉద్యోగి పేదలను పట్టించుకోలేదు పేదల కోసం పని చేసే వారికే ప్రజలు పట్టం కడతారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో పక్షపాతం చూపించారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరించాలో ఇంకా నిర్ణయించుకోలేదు. – భారతి, కూరగాయల వ్యాపారి, తూప్రాన్ గిట్టుబాటు ధర కావాలె రైతుబంధు పథకం కింద డబ్బులిచ్చుడు కరెక్ట్ కాదు. పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలె. డబ్బులిస్తే రైతులు సోమరిపోతులవుతరు. పోనీ ఇస్తున్నారనుకున్నా.. కౌలు రైతులకు పైసలిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మంచిగనే ఉన్నయని అనిపిస్తోంది. – రామకృష్ణ, మన్నూర్, ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ రిజర్వేషన్లు ఏవి? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అమలు చేయలేదు. మాటమీద నిలబడలేదు. ఈ హామీ ఇచ్చే వారినే మైనార్టీలు ఆదరిస్తారు. – ఆయాజ్, హైదరాబాద్, నిరుద్యోగి పేదలు బాగుపడుతరు... టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలతో ఎంతో మందికి లాభం చేకూరింది. – రమేష్, హోటల్ నిర్వాహకుడు మహబూబ్నగర్ ...:: సాక్షి, నెట్వర్క్ -
యాభై ఎకరాలు దాటితే రైతుబంధు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్లో వ్యవసాయ భూమి ఎంతున్నా పెట్టుబడి సొమ్ము అందజేసిన వ్యవసాయ శాఖ, రబీలో సీలింగ్ అమలు చేస్తుండటం సంచలనం రేపుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా లేక స్వతహాగా అమలు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. సీలింగ్పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్షణం పేద, మధ్యతరగతి రైతులకు ముందు ఇచ్చి మిగిలిన వారికి తర్వాత ఇవ్వాలని అనుకుంటున్నామని, 50 ఎకరాలకు మించి రైతులకు లక్షలకు లక్షలు ఒకేసారి ఇచ్చే బదులు, ఆ సొమ్మును ఇతర రైతులకు ఇవ్వాలని భావిస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. సీలింగ్ చట్టం ప్రకారం 56 ఎకరాలకు మించి ఎవరికీ వ్యవసాయ భూమి ఉండకూడదనీ, అలా ఉన్న వారికి రైతుబంధు సొమ్ము ఇస్తే ఎన్నికల సమయంలో సమస్య వస్తుందన్న భావనతో ఇలా చేస్తున్నామని మరికొందరు అధికారులు అంటున్నారు. ఖరీఫ్లో వంద ఎకరాలకు మించి ఉన్న వారికీ పథకం అమలు చేసిన సంగతి విదితమే. ఖాతాలున్న వారందరికీ పంపిణీ పూర్తి... ఖరీఫ్లో గ్రామసభల్లో రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేసిన సర్కారు, ఎన్నికల కమిషన్ ఆదేశంతో రబీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్మును బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడి నిధుల మంజూరు కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించగా, వాటన్నిటికీ కలిపి రూ. 4,581 కోట్లు పెట్టుబడి సొమ్ము బదిలీ చేసినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఇంకా ఏడు లక్షల మంది ఖాతాలను సేకరించాల్సి ఉందని, వాటిని ఎన్నికల లోపుగానే సేకరించి సొమ్ము బదిలీ చేస్తామని అంటున్నారు. ఖరీఫ్లో దాదాపు 52 లక్షల మంది రైతులకు ఈ మొత్తం అందింది. రబీలో 50 లక్షల మంది వరకే ఉంటారంటున్నారు. వీటిలో ఎన్ఆర్ఐ ఖాతాలుండటం, కొందరు చనిపోవడం వల్ల ఈసారి తగ్గిందంటున్నారు. ‘గివ్ ఇట్ అప్’కు స్పందనేది? ధనిక రైతులు ఎవరైనా పెట్టుబడి సొమ్ము వద్దనుకుంటే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం గతంలో స్వచ్ఛంద ‘గివ్ ఇట్ అప్’కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ఖరీఫ్లో సీఎం సహా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమ్మతి ఇచ్చారు. ఒకరిద్దరు సీనియర్ ఐఏఎస్లు వీరిలో ఉన్నారు. ఇప్పుడు రబీలో ఎవరూ ముందుకు రావడంలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్ కారణంగా నేతలు, ధనిక రైతులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ‘గివ్ ఇట్ అప్’కు స్పందించడంలేదని చెబుతున్నారు. మరో వైపు సీలింగ్ దాటి భూములున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు తమ ఔదార్యాన్ని చాటుకోక పోగా రైతుబంధు సొమ్ము ఇంకా తమ బ్యాంకులో ఎందుకు జమ కాలేదంటూ వ్యవసాయశాఖకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిందిస్థాయి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఆరోగ్యశ్రీ రోగుల విలవిల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఈ నెల 20 నుంచి ఔట్పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు ఓపీ, వైద్య పరీక్షలు నిలిపేశామని చెబుతున్నా ఇన్పేషెంట్ (ఐపీ) సేవలను కూడా అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద రోజుకు సరాసరి 2 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు రిజిస్టర్ అవుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 13 వేల మంది ఓపీ సేవలకు వస్తుంటారు. అంటే ఈ వారం రోజుల్లో దాదాపు లక్ష మందికి పైగా ఓపీ సేవల కోసం ప్రయత్నించారు. అందులో కొందరికి మాత్రం కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో, నిమ్స్లో వైద్యం అందింది. కానీ మరో 50 వేల మంది వరకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకాల కింద ఎక్కడా వైద్య సేవలు అందలేదని ఆ శాఖ వర్గాలే అంచనా వేశాయి. దీంతో ఆయా రోగులంతా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. అత్యవసర సేవలకూ బ్రేక్! నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను పాక్షికంగా నిలిపేయడంతో అనేకచోట్ల అత్యవసర సేవలనూ నిలిపేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన రమేశ్బాబు అనే వ్యక్తి తన సోదరికి డయాలసిస్ కోసం నిత్యం ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయడంతో డయాలసిస్ను ఉచితంగా చేయడానికి ఆ ఆసుపత్రి నిరాకరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేన్సర్కు కీమోథెరపి వంటి చికిత్సలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. కొన్ని రకాల అత్యవసర ఫాలోఅప్ వైద్య సేవలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల కార్డులపైనే ఆధారపడిన బాధితులు ఘొల్లుమంటున్నారు. రైతుబంధుకే ప్రాధాన్యం.. ఎన్నికల సమయం కావడంతో పేదలు, ఉద్యోగుల బాధను ఎవరూ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ విచిత్రమేంటంటే ఆరోగ్యశ్రీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్కారు ఆపద్ధర్మంలో ఉంటే అధికారులు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నట్లు రూ.1,200 కోట్ల బకాయిలను చెల్లించడంలో సర్కారుకు అనేక పరిమితులున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పథకానికి తప్ప వేటికీ నిధులు విడుదల చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. రైతుబంధుకు ఇప్పటివరకు రూ.3,700 కోట్లు అందజేసింది. పలు విడతలుగా సొమ్మును రైతుబంధు కింద రైతులకు పంపిణీ చేస్తుంది. దీంతో ఆరోగ్యశ్రీ సహా వేటికీ ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అయితే ప్రభుత్వ ప్రాధాన్యం ఎలా ఉన్నా నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను పిలిపించి వారితో చర్చించి ఎలాగైనా ఒప్పించడంలో వైద్యాధికారులు విఫలమయ్యారు. ‘సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు. అందువల్ల మేం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించట్లేదు. మేమేం చేయగలం’అంటూ వైద్యాధికారులు చేతులెత్తేస్తున్నారు. -
ఐరాస సింపోజియంలో ‘రైతుబంధు’కు ప్రశంసల జల్లు
సాక్షి, హైదరాబాద్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) సమావేశంలో అంతర్జాతీయ ప్రముఖులు రైతుబంధు, రైతుబీమాలకు ప్రశంసల జల్లు కురిపించారు. రోమ్లోని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘రైతు కుటుంబాల కోసం వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై అంతర్జాతీయ సింపోజియం ప్రారంభమైంది. ఈ సింపోజియానికి ప్రపంచవ్యాప్తంగా 650 మంది ప్రముఖులు, ఆయా దేశాల ప్రభుత్వాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు హాజరయ్యారు. ఈ సింపోజియాన్ని ఐరాస ఎఫ్ఏవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ జోస్ గ్రాజినో డసిల్వా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమాలను ఎంతో వినూత్నంగా చేపట్టి రైతులను ఆదుకుంటున్నందుకు నేను చాలా ముగ్ధుడిని అయ్యాన’నని పేర్కొన్నారు. అదే సింపోజియంలో పాల్గొన్న ఐరాస ఆర్థిక, సామాజిక మండలి అధ్యక్షుడు ఇంగ రోండా, ఐరాసకు చెందిన వ్యవసాయాభివృద్ధి కోసం అంతర్జాతీయ నిధి ఉపాధ్యక్షుడు పాల్ వింటర్స్ సహా హాజరైన ప్రతినిధులు ఈ పథకాలపై హర్షాతిరేకం వ్యక్తంచేశారు. ‘వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల’పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన ఐరాస ఎఫ్ఏవో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మారియా హెలినా సామిడో మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమాలను ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా 700 వినూత్న పథకాల వివరాలు ఐరాసకు చేరాయని, వాటిలో 20ని తాము ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి ఐరాస ఎఫ్ఏవో డైరెక్టర్ జనరల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు, రైతుబీమాల గురించి వివరించారు. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
‘పెట్టుబడి’ ఎలా?
ఖమ్మంవ్యవసాయం: రైతుబంధుకు కాసుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రారంభించినా.. ఖజానాలో నగదు కొరత వల్ల రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభం కాగా.. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. నెల క్రితమే రబీ కోసం రైతుబంధు నగదును రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సీజన్కు ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడిగా అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు బ్యాంకు చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం అందించారు. జిల్లాలో వివిధ కారణాలతో 20వేల మంది రైతులకు అందలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలుపై పలు ఆంక్షలు విధించింది. ఖరీఫ్లో మాదిరిగానే చెక్కుల విధానం కాకుండా రైతుల బ్యాంక్ ఖాతాలో ఆన్లైన్ విధానంలో నగదును జమ చేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో వ్యవసాయాధికారులు రైతుల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఆన్లైన్లో పంపించారు. వీటి ఆధారంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. జిల్లాలో రబీ సీజన్కు గాను 2,59,264 మంది రైతులను రైతుబంధు పథకం కోసం వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికున్న భూముల ఆధారంగా రూ.256కోట్లు అవసరం ఉంది. ఈ క్రమంలో విడతలవారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేసే ప్రక్రియను ప్రారంభించారు. అయితే నిధుల లేమి కారణంగా ఆదిలోనే దీనికి బ్రేకులు పడ్డాయి. వ్యవసాయ శాఖ 2,32,765 మంది అర్హులైన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి.. రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించింది. ఇందులో 1,37,565 మంది రైతులకు రూ.140కోట్ల నగదు మంజూరైంది. ఈ మొత్తంలో 74,727 మంది రైతులకు రూ.80కోట్లు గత నెల చివరి వారంలో జమ అయ్యాయి. అప్పటి నుంచి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ ఖజానాలో నగదు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని తెలిసింది. ఇంకా 1.85 లక్షల మంది రైతులకు సుమారు రూ.186కోట్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కొందరు రైతులు డబ్బుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని చెబుతున్నారు. అధికారులు ఆయా రైతులకు సమాధానం చెప్పేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. కొందరు రైతులకు రైతుబంధు నగదు రావడం.. మరికొందరికి రాకపోవడంతో అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అన్నదాతల ఎదురు చూపులు రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేస్తున్నారు. వరినార్లు కూడా అక్కడక్కడ పోస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది అందితే కనీసం దుక్కులకు, విత్తనాలకు కొంత మేరకు ఉపయోగపడతాయని భావించారు. గ్రామాల్లో కొందరు రైతులకు మొదటి విడతగా ఖాతాల్లో నగదు పడగా.. మరికొందరు రైతులకు పడలేదు. దీంతో రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు నగదు ఎందుకు పడలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల్లో పడతాయని అధికారులు చెబుతున్నా.. ప్రక్రియ నిలిచిపోయి సుమారు 20 రోజులు కావస్తోంది. దీంతో నగదు ఎప్పుడు బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని రైతులు అధికారుల చట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి రాలేదు.. రబీ రైతుబంధు పెట్టుబ డి నగదు బ్యాంక్ ఖాతా లో జమ కాలేదు. ఐదెకరాలకు పెట్టుబడి సహా యం రూ.20వేలు వస్తా యి. ఆ సహాయం అంది తే రబీలో మొక్కజొన్న వేయాలని ఉంది. వ్యవసాయశాఖ అధికారులు వస్తాయంటున్నారు. బ్యాంక్ ఖాతాలో మాత్రం ఇంకా జమ కాలేదు. – తోట శ్రీను, బచ్చోడు, తిరుమలాయపాలెం మండలం వెంటనే ప్రయోజనం రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి వెంటనే అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. నష్టం వచ్చింది. ఈ భూమిలో మొక్కజొన్న వేయాలనుకుంటున్నా. రెండెకరాలకు రూ.8వేలు వస్తే విత్తనాలు, దుక్కికి ఉపయోగపడతాయి. – భూక్యా వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం ప్రక్రియ కొనసాగిస్తున్నాం.. రైతుబంధు పథకం ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఆన్లైన్లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయశాఖకు పం పించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లావ్యవసాయాధికారి -
‘రైతుబంధు’కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ప్రపంచదేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణకు చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రెండూ ఎంపిక కావ డం విశేషం. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈ నెల 21–23 తేదీల మధ్య ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా కోరింది. ఆ తేదీల్లో ఐరాస నిర్వహించే ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆయన ఈ నెల 20న రోమ్కు వెళ్లనున్నారు. ఆ 2 పథకాలకు సంబంధించి ఇప్పటికే ఐరాస పూర్తి సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి సేకరించింది. తక్కువ నిడివి గల రెండు ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రాలను కూడా ప్రభుత్వం ఐరాసకు పంపించింది. పథకాలపై రెండు ప్రత్యేక పుస్తకాలు రోమ్లో ఐరాసకు చెందిన ఎఫ్ఏవోలో జరిగే అంత ర్జాతీయ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతుండటంతో రైతుబంధు, రైతుబీమా పథకాలపై తక్కువ పేజీలు గల 2 ప్రత్యేక పుస్తకాలను వ్యవసాయశాఖ ముద్రించింది. వీటిని రోమ్ సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ ప్రతినిధులకు అందజేయనుంది. పుస్తకాల్లోని వివరాలు: రైతుబంధు పథకంపై వ్యవసాయశాఖ తయారు చేసిన పుస్తకంలో రాష్ట్రం లోని సాగు పరిస్థితులను వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ వంటి పథకాలనూ ప్రస్తావించారు. ఇక్కడున్న రిజర్వాయర్లు, నీటిపారుదల వసతి, రైతుబంధు పథకంలోని ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ప్రతీ రైతుకు ఒక సీజన్లో పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇదంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థికసాయంగా పేర్కొన్నారు. ఖరీఫ్లో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టి రైతులకు చెక్కుల ద్వారా గ్రామసభల్లో పంపిణీ చేసినట్లు వివరించారు. రైతుబీమాపైనా మరో పుస్తకాన్ని అధికారులు తయారుచేశారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా రూ. 5 లక్షల బీమా ఎల్ఐసీ ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఐరాస గుర్తింపు వల్ల ఎఫ్ఏవో నుంచి ఏమైనా ప్రత్యేకంగా నిధులు వస్తాయేమో అన్న చర్చ జరుగుతోంది. ప్రపంచంలో ఇలాంటి పథకం లేకపోవడంతో అది తమకు కలసి వస్తుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఓట్ల 'పంట' పండిస్తుంది!
రైతుబంధు పథకంపై అధికార పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాకు రూ.8వేల చొప్పున ఇస్తుండటంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చుసహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారి మరింత ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రైతు బీమాతోనూ అనేకమంది లబ్ది పొందుతున్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తుండడం కూడా తమకు లబ్ది చేకూరుస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 50.91 లక్షల లబ్దిదారులు... కోటి ఓట్లు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.16 లక్షల మంది రైతులకు రూ. 5,737 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.80 లక్షల చెక్కులను ముద్రించింది. అయితే ఎన్ఆర్ఐలకు చెక్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం, చనిపోయిన రైతుల పేర్లు ఉండటం, కొందరు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చివరకు గత ఖరీఫ్లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ.5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. ఇంత పెద్దఎత్తున రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం వేలాది కోట్లు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి కావడంతో ఈ పథకంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు. ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్దిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్ల ఓటర్లుంటే, అందులో హైదరాబాద్ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42 శాతం మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్దిదారులని తేలింది. గణనీయమైన ఈ ఓట్లు తమకు ఎన్నికల్లో కలిసి వస్తాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలోనూ రబీ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 15 లక్షల మంది రైతులకు రూ.1,700 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. ఎన్నికల నాటికి మిగిలిన రైతులందరికీ కూడా రూ.5 వేల కోట్లకు పైగానే సొమ్ము పంపిణీ చేయనుంది. ఇలా నగదు రూపంలో రైతుబంధు సాయం అందుతుండటంతో అది ఎన్నికలపై అనుకూల ప్రభావం చూపుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతుబంధు కింద ఖరీఫ్లో లబ్దిపొందిన వారిలో ఐదెకరాలలోపు రైతులే 68 శాతం మంది ఉన్నారు. ఈ రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు గొప్ప వరం రైతుబంధు అమలుతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పథకం గొప్ప వరం. రానున్న రోజుల్లో రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టాం. ప్రపంచంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదు. రైతులకు నగదుఇచ్చి ఆదుకోవడం చిన్న విషయం కాదు. ఒకవైపు సాగునీరు, మరోవైపు నిరంతర విద్యుత్తు, దాంతోపాటు రైతులకు పెట్టుబడి సాయంతో రైతు ఆత్మహత్యలు లేనేలేవు. రైతుల్లో వ్యవసాయంపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో రైతులంతా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలుపుతారనడంలో ఏమాత్రం సందేహంలేదు. – సాక్షి, హైదరాబాద్ -
బ్యాంకు‘బంధు’!
సాక్షి, హైదరాబాద్: రైతుల పట్ల బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. తమ అప్పులను వసూలు చేసుకోవడంపైనే అవి దృష్టి సారించాయి. రబీ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాలో పడగానే, ఆ సొమ్మును వారి అప్పుల కింద జమ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతుబంధు సొమ్మును అలా అప్పుల కింద జమ చేసుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. అయినా కేంద్రం ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంలో విఫలమైంది. రైతులకు కీలకమైన రబీ సీజన్లో పెట్టుబడి సొమ్ము ఉపయోగపడాల్సి ఉండగా, ఆ డబ్బును బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సరాసరి ప్రతీ రైతుకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు రైతుబంధు కింద సొమ్ము అందుతుంది. ఆ సొమ్మును పాత బాకీల కింద వసూలు చేసుకుంటే రైతుకు మిగిలేది శూన్యమే. దీంతో ప్రభుత్వం అందజేసే రైతుబంధు సొమ్ము బ్యాంకులకు వరంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. అయితే ఎంతమంది రైతుల నుంచి పెట్టుబడి సొమ్మును బ్యాంకులు అప్పులుగా వసూలు చేశాయన్న వివరాలు తమకు అందలేదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. 15 లక్షల మంది రైతులు.. రూ.1,700 కోట్లు జమ.. ఖరీఫ్లో 52 లక్షల మంది రైతులకు రూ. 5,100 కోట్ల వరకు రైతుబంధు కింద ప్రభుత్వం మొదటిసారి పంపిణీ చేసింది. ఇంకా అనేకమంది ఎన్ఆర్ఐలకు, ఇతరులకు పెట్టుబడి చెక్కులు ఇవ్వాల్సి ఉండగా, వివిధ కారణాలతో అవి నిలిచిపోయాయి. ఇక రబీ సీజన్ కోసం పెట్టుబడి చెక్కులను వ్యవసాయశాఖ వర్గాలు ముద్రించాయి. అయితే ఎన్నికల కమిషన్ చెక్కుల పంపిణీ చేపట్టొద్దని, రైతు ఖాతాల్లోకే బదిలీ చేయాలని సూచించడంతో ఆ ప్రకారమే రైతుబంధును అమలు చేస్తున్నారు. సోమవారం నాటికి 15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. ఇంకా మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. వారికి కూడా పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నారు. అయితే అప్పుల కింద పెట్టుబడి సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులున్న బ్యాంకు ఖాతాలు కాకుండా ఇతర బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వాలని, ఒకవేళ లేకుంటే కొత్తగా మరో బ్యాంకు ఖాతా తెరవాలని వ్యవసాయ శాఖ రైతులను కోరింది. రైతుబంధు సొమ్మును బ్యాంకులు రైతు అప్పుల కింద జమ చేసుకుంటుండటంపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే బ్యాంకులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు. ఎన్ఆర్ఐల ఖాతాల్లో ఖరీఫ్ చెక్కుల జమకు సన్నాహాలు ఇదిలాఉండగా ఇక్కడ భూమి కలిగి విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు ఖరీఫ్లో చెక్కుల పంపిణీ జరగలేదు. ఎట్టకేలకు వారి అనుమతి మేరకు ఇక్కడి వారి కుటుంబ సభ్యులకు చెక్కులు ఇచ్చేలా సర్కారు ఆదేశాలు జారీచేసింది. అయితే ఎన్నికల సీజన్ మొదలు కావడంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో ఎన్ఆర్ఐ చెక్కుల పంపిణీకి కూడా బ్రేక్ పడింది. అయితే ఆ చెక్కుల సొమ్మును సంబంధిత ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏ బ్యాంకు ఖాతాలో వేయాలో ఎన్ఆర్ఐలు తెలియజేస్తే ఆ ప్రకారం చేస్తామని వెల్లడించాయి. మొత్తం 63 వేల మంది ఎన్ఆర్ఐల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కానీ సమాచారం లేకపోవడంతో ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోకి రైతుబంధు సొమ్మును బదిలీ చేయలేదని అధికారులు తెలిపారు. -
పైసలు రాలే సారూ?
సాక్షి, ఆదిలాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం కింద పెట్టుబడి సాయం రైతులకు ఇంకా చేరలేదు. 2018–19 రబీ సీజన్ ముగింపునకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నా.. ఇంత వరకు సొమ్ము చేతికి అందలేదు. ఈ నెలాఖరు వరకు రబీ పంట వేస్తేనే సరైన సమయానికి పంట చేతికి వస్తుంది. ఇందుకు రైతులు భూములను చదును చేసి సిద్ధంగా ఉంచగా, కొందరు పంటలు కూడా వేశారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోంది. రబీ సీజన్ ముగుస్తున్నా ఆ డబ్బులు ఇంతవరకు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల పనుల్లో ఉండడం, ఒక్క వ్యవసాయ శాఖనే పెట్టుబడి సాయంపై దృష్టి సారించడంతో రైతుబంధు సొమ్ము రైతులకు సరైన సమయానికి పనికొచ్చేట్లు కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,11,164 మంది రైతులు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 1,00,456 మంది రైతుల నుంచి ఖాతాల వివరాలు సేకరించారు. ఇంకా 10,708 ఖాతాలను రైతుల వద్ద నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించాల్సి ఉంది. సేకరించిన వాటిని పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేయాల్సి ఉంది. 33 వేల మంది రైతులకు నగదు జమ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,11,164 మంది రైతులు ఉన్నారు. ఇప్పటిదాక 33 వేల మంది రైతులకు పెట్టుబడి అందగా, ఇంకా 78,164 మంది రైతులకు పెట్టుబడి సొమ్ము రావాల్సి ఉంది. జిల్లాలో గత నెల రోజులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) 1,00,456 మంది రైతుల ఖాతాలు సేకరించారు. ఆ వివరాలను మండల వ్యవసాయ అధికారుల(ఎంఏవో)కు అందజేశారు. ఎంఈవోలు 88,012 ఖాతాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించారు. అందులో నుంచి 33 వేల మంది రైతులకు మాత్రమే ‘రైతుబంధు’ కింద పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. వివరాలు పంపినా ఇంకా 55,012 మంది రైతుల ఖాతాలకు నగదు చేరలేదు. ఇదిలా ఉండగా, జిల్లా రైతులకు మొత్తం రూ.178 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.55 కోట్లు మాత్రమే వచ్చింది. మిగతా రూ.123 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కొనసాగుతున్న ఖాతాల సేకరణ.. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ గత నెల రోజుల నుంచి కొనసాగుతోంది. జిల్లాలో 1,11,164 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,00,456 మంది రైతుల ఖాతాలను సేకరించారు. మిగతా 10,708 మంది రైతుల ఖాతాలు తీసుకోవాల్సి ఉంది. కాగా, ఏఈవోలు గ్రామాల వారీగా వెళ్లి రైతుల ఖాతాల వివరాలు సేకరించి, ఆ ఖాతా పని చేస్తుందా.. లేదా అనేది సరి చూడాల్సి వస్తోంది. ఒకవేళ రైతు ఇచ్చిన బ్యాంకు ఖాతా పనిచేయకపోతే నగదు అందులో జమ కాదు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతోపాటు అధికారులను రైతులు నిలదీసే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు అధికారులు ముందే జాగ్రత్త పడుతూ ఖాతాలను పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ‘అందరికీ పెట్టుబడి’.. జిల్లాలోని రైతులందరికీ ఈ నెలాఖరులోగా రైతుబంధు సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున యాభై ఎకరాల వరకు పరిమితి లేకుండా ఇస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి యేడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ కాగా, రెండో విడత రబీ సీజన్ పెట్టుబడి పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నందున రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు మొదటి విడత చెక్కులు పొందిన రైతులే రెండో విడత నగదు పొందడానికి అర్హులుగా గుర్తించారు. ఆన్లైన్ ద్వారా నగదు జమ చేసేందుకు మొదటి విడత చెక్కులు పొందిన రైతుల వద్ద నుంచి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పెట్టుబడి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సగం మంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
రైతుబంధు రాలేదని నిరసనగ నాగుపామును చంపి..
-
రైతుబంధు రాలేదని..
పెద్దపల్లి రూరల్: రైతుబంధు రాలేదని ఓ రైతు నాగు పామును చంపి కాల్చుకుతిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన కీర్తి శ్రీనివాస్కు ఇదే మండలంలోని చందపల్లి గ్రామ శివారులో మూడు సర్వే నంబర్లలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వలేదు. గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో తన పాతపాసుపుస్తకాలు, సాదాబైనామా కాగితాలు అందించినా.. అధికారుల్లో స్పందనలేదని.. అధికారుల తీరు కారణంగానే రైతుబంధు పథకం కింద వచ్చే ఎకరానికి రూ.4 వేలు అందకుండా పోయాయని బాధితుడు కీర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల తీరును నిరసిస్తూ నాగుపామును చంపి కాల్చుకుతిన్నట్లు తెలిపారు. -
ఎదురుచూపులే..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పూర్తి కావచ్చింది. నవంబర్ నుంచి యాసంగి సాగు పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీని ఈ నెలలోనే చేపట్టాలని అంతా సిద్ధం చేసింది. అయితే ముందస్తు అసెంబ్లీఎన్నిల షెడ్యూల్ వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు చెక్కుల పంపిణీకి నిలిపివేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ఆదేశించింది. దీంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రెండవ విడతలో మొత్తం అర్హులైన రైతులు 1,16,557 మందికి గాను రూ.166.80 కోట్లు వరకు అందాల్సి ఉంది. ఇప్పటివరకు 65,220 మంది ఖాతాల వివరాలు తీసుకోగా, ఇందులో 51,337 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇందులో 13,400 మంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు నగదు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాల వివరాలు సేరించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మొదట ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించగా, గత పదిహేను రోజులుగా మండల వ్యవసాయ కార్యాలయ వద్ద రైతుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతులు ఖాతా వివరాలు అందజేయకపోవడంతో మరో వారం రోజులు గడువు పెంచారు. కోటపల్లి, తాండూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 80 శాతం వివరాలు సేకరించారు. మిగతా మండలాల్లో 50 నుంచి 70 శాతం పూర్తయ్యింది. రైతుల ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా, వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పని కానిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో రైతులు సమయానికి కార్యాలయాలకు వచ్చి వివరాలు అందించలేకపోతున్నారు. దీనికి తోడు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో కొంత వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెంచిన గడువులోగా అయినా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల వివరాలు తీసుకుంటే నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి విడత రైతులకే.. గత ఖరీఫ్లో రైతుబంధు చెక్కులు పొందిన రైతులకే రెండవ విడత యాసంగి పెట్టుబడి సాయం అందుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా మొదటి విడత చెక్కులు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి రైతుల ఖాతాల వివరాలు సేకరణ పనిలో పడ్డారు. ఖాతాలో ఆప్లోడ్ అయిన కొద్ది రోజులకు రైతుల సెల్కు ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్ వస్తోంది. అయితే ఇప్పటివరకు సాయం పొందాల్సిన రైతులకు సంబంధించిన ఖాతాల దరఖాస్తులు 65 శాతం రాగా.. ఇందులో 52 శాతం ఆన్లైన్లో అప్లోడ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సహకరిస్తే పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నెలాఖరు వరకు గడువు : వీరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రైతుల వివరాల సేకణరకు తొలుత ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వివరాల సేకరణలో ఆలస్యం కావడంతో గడువును నెలాఖరు వరకు పెంచడం జరిగింది. రైతులు ఆలస్యం చేయకుండా ఖాతాల వివరాలు అందజేస్తే సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పటివరకు 80 వేల మంది రైతుల వరకు ఖాతాల వివరాలు సేకరించాం. ఇందులో 62వేల మంది రైతుల వివరాలను ఆన్లైన్లో ఆప్లోడ్ చేశాం. జిల్లాలో ఇప్పటివరకు రూ.14 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. -
రైతుబంధు 25 శాతమే!
మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రబీ సీజనుకు గాను రైతులకు పెట్టుబడి సహాయం నాలుగు విడతల్లో విడుదలైంది. జిల్లాలోని రైతులకు ఇప్పటికి రూ.42 కోట్ల, 40 లక్షల, 62 వేల, 310 అందింది. 25 శాతం సొమ్ము విడుదల కాగా మరి కొద్ది రోజుల్లో మిగిలిన 75 శాతం సొమ్ము కూడా రైతుల ఖాతాలకు చేరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన కారణంగా రబీ పెట్టుబడి సహాయం చెక్కుల రూపంలో పంపిణీకి ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. అయితే రైతుల ఖాతాలకు నగదు బదిలీ ద్వారా పెట్టుబడి సహాయం అందించవచ్చని కమిషన్ సూచించడంతో రైతుల ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నం అయ్యారు. ఖరీఫ్ సీజనుకు గాను జిల్లాలోని 2 లక్షల, 271 మంది రైతులకు రూ.204.44 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో 5,518 మంది రైతులు మరణించినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మరణించిన రైతులను మినహాయించి ఇతర రైతులకు మాత్రమే రబీ సీజను పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన రైతులను మినహాయిస్తే జిల్లాలో 1,94,753 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో ఏఈవోలు నమోదు చేయగా వ్యవసాయాధికారులు ఆమోదం తెలిపి పెట్టుబడి సహాయం సొమ్ము రైతుల ఖాతాలకు బదిలీ కోసం వ్యవసాయ శాఖ కమిషనరేట్కు పంపించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారులు బ్యాంకులలో ఉన్న నిధుల ఆధారంగా రైతులకు దశల వారీగా నగదు బదిలీకి చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఆధార్ నంబర్, పట్టా పాసు పుస్తకం జిరాక్సు, బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఏఈవోలు తమకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ట్యాబ్లలో అప్లోడ్ చేస్తున్నారు. ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు కావడం, వ్యవసాయ శాఖ తమ వద్ద ఉన్న నిధులను దశల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ తెలిపారు. ఖరీఫ్ పెట్టుబడి సహాయం అందుకున్న ప్రతి రైతుకు రబీ పెట్టుబడి సహాయం అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
కొందరికే.. పెట్టుబడి
సాక్షి, జనగామ: యాసంగి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మొదటి దఫా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ అధికారులు జమ చేశారు. మొదటి దఫాలో కేవలం 3,915 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. రెండో విడత చెల్లింపు ల కోసం రైతుల ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు. ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నగదు రూపంలో చెల్లిం చడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిం ది. దీంతో చెక్కుల రూపంలో కాకుండా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సా యం జమ చేయాలని సూచించడంతో ఈ మేరకు అధికా రులు చెల్లింపుల ప్రక్రియను చేపట్టారు. తొలి విడతలో రూ.4.65 కోట్లు జమ.. ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడానికి రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తొలివిడత రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. రెండో పంటకు అక్టోబర్లో చెక్కులను అందించాల్సి ఉండగా ఇంతలో శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతుండడంతో రైతుబంధు చెక్కులను పంపిణీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేరుగా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 13 మండలాల్లోని 3,915 మంది రైతులకువారి అకౌంట్లలో రూ.4,65,69,240 ను జమ చేశారు. రెండో విడతలో రూ.26.82 కోట్లు..మొదటి దఫాలో తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం జమ చేశారు. నవంబర్ మొదటివారంలో రెండో దఫా పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. ఇందులో 22,109 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి రూ.26,82,52,460 చెల్లించనున్నారు. అకౌంట్ల సేకరణకు ఇక్కట్లు.. రైతుల బ్యాంకు అకౌంట్ల సేకరణలో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని 68 క్లస్టర్లల్లో ఏఈఓలు ఇంటింటా రైతు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేర్లతోపాటు ఆధార్ నంబర్, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్లతోపాటు 9 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓలు గ్రామాలకు వెళ్తున్నప్పటికీ రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాలు సేకరించలేక పోతున్నారు. ఖరీఫ్లో 6,829 చెక్కులు వాపస్.. జిల్లావ్యాప్తంగా 1,54,658 చెక్కులు రైతుల పేరుమీద వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం తిరిగి 6,829 చెక్కులను తీసుకుంది. మిగతా 1,47,823 చెక్కుల్లో 1,32,870 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 75 వేల మంది రైతుల ఖాతాలను సేకరించారు. మరో 50 వేల మంది రైతుల వివరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల వివరాలు లేకపోతే రైతుబంధు సాయాన్ని జమ చేయడం మరింత ఆలస్యం కానుంది. 75 వేల ఖాతాలను సేకరించాం యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొదటి విడత రైతుల అకౌంట్లలో జమ చేశాం. రెండో విడత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల అకౌంట్లను సేకరించాం. మిగతా రైతుల వివరాలను సేకరిస్తున్నాం. అందరికి డబ్బులు వచ్చేలా ప్రయత్నిస్తాం. –ఎన్.వీరూనాయక్, డీఏఓ -
పార్ట్–బీ.. పెట్టుబడి ఏది..?
సాక్షి, ఆదిలాబాద్ అర్బన్: ఈ యేడాది ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం రైతులందరికీ భరోసా ఇవ్వలేకపోతోంది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఆశించిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు భూ రికార్డుల ప్రక్షాళన సర్వే జరిగిన విషయం తెలిసిందే. ఆ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు భూములను రెండు భాగాలుగా చేసి తప్పులు లేని భూములను పార్ట్–ఏలో, తప్పులు, వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చేర్చారు. పార్ట్–ఏ భూములకు రైతుబంధు పథకం వర్తింపజేయగా, పార్ట్–బీ భూముల లెక్కలు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. తప్పులు, వివాదాలు ఉన్నట్లుగా తేలిన భూములను పార్ట్–బీలో చేర్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఆ లెక్కలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పార్ట్–బీ భూములకు ఈ యేడాది మేలో ప్రారంభమైన పెట్టుబడి పథకం దూరమైందని చెప్పవచ్చు. జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, తప్పులు, వివాదాల్లో ఉన్నాయి. ఈ భూములను అధికారులు పార్ట్–బీలో చేర్చడంతో ప్రభుత్వం నుంచి ప్రతీ సీజన్కు రావాల్సిన రూ.15.20 కోట్లు ఆగిపోతున్నాయి. కాగా, పార్ట్–బీ భూములను ప్రభుత్వం, రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడంతో రైతుబంధు సొమ్ము తమకు దక్కడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పనుల్లో జిల్లా యంత్రాంగం బీజీగా ఉండడంతో పార్ట్–బీ భూముల యాజమానులు ఎన్నికల తర్వాత కొలువుదీరే సర్కారుపైనే ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. జిల్లాలో భూ స్వరూపం ఇలా.. జిల్లాలో 18 మండలాలు, వాటి పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో వ్యవసాయ భూములతోపాటు అటవీ, సీలింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ భూములున్నాయి. జిల్లా భౌగోళిక ప్రాంతం 9,01,467 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అన్ని రకాల భూములు 8,46,952 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 3,71,636 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, 1,88,485 ఎకరాల్లో అటవీ భూమి ఉందని గతేడాది జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో వెల్లడైంది. 3,71,636 ఎకరాలు ఉన్న వ్యవసాయ భూములను పరిశీలిస్తే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న భూమి 3,33,636 ఎకరాలు ఉండగా, వివాదాలు, తప్పులు, సమస్యలు ఉన్న భూములు 38 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములనే పార్ట్–బీలో చేర్చారు. జిల్లాలో మొత్తం 2,01,980 సర్వే నంబర్లు ఉండగా, ఇందులో సుమారు 30,108 సర్వే నంబర్లలోని భూములు తప్పులుగా ఉన్నాయని సర్వేలో గుర్తించారు. సర్వే అనంతరం ఎలాంటి సమస్యలను లేని భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు తప్పులు లేని వ్యవసాయ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ లెక్క ప్రకారం జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల మంది పట్టాదారులకు పెట్టుబడి సొమ్ము అందజేశారు. ఈ రబీ సీజన్లో కూడా ఆ భూములకే పెట్టుబడి సొమ్ము వస్తోందని చెప్పవచ్చు. పార్ట్–బీ భూములకు యేడాదికి రూ.30.40 కోట్లు భూ రికార్డుల ప్రక్షాళన సర్వే ముగిసి దాదాపు పది నెలలు గడుస్తున్నా పార్ట్–బీలో చేర్చిన భూములను రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. ఈ భూములపై ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించకపోవడంతో ఆ లెక్కలు అలాగే ఉన్నాయి. రెవెన్యూ కోర్టు కేసులు, సివిల్ కేసులు, సరిహద్దు గుర్తింపు, శివాయ్ జమేధార్ సమస్యలు, థర్డ్పార్టీ సమస్యలు ఉన్న భూములు ఇప్పటికీ వివాదాల నుంచి బయటపడడం లేదు. పార్ట్–బీలో చేర్చిన సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, కేసులు, వివాదాల్లో ఉండడంతో రైతుబంధుకు దూరమవుతున్నాయి. పార్ట్–బీలో చేర్చిన 38 వేల ఎకరాలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున లెక్కేసుకున్న ఒక సీజన్కు రూ.15.20 కోట్లు జిల్లాకు వచ్చే ఆస్కారం ఉండేది. యేడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.30.40 కోట్లు వస్తుండేది. కానీ ఆ భూముల సమస్యలకు పరిష్కారం ఇంత వరకు దొరకకపోవడంతో ఆ సొమ్ము జిల్లాకు రావడం లేదు. ఇప్పుడున్న భూములకు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సొమ్ము మరింత అదనంగా జిల్లాకు రైతులకు దక్కాలంటే పార్ట్–బీ భూముల పరిష్కారంపై ఆధారపడి ఉందనే చెప్పవచ్చు. -
పెట్టుబడి సాయం.. రైతు ఖాతాల్లోకి
సాక్షి, వరంగల్ రూరల్: వచ్చే రబీ పంటకు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబం«ధు సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిAన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల బ్యాంక్ ఖాతా నంబర్లను సేకరిస్తున్నారు. జిల్లాలో 1,48,581 మంది పట్టాదారులకు రూ118,99,94,630 రైతు బంధు సాయం అందనుంది. ఖరీఫ్ సీజన్లో ఇచ్చిన విధంగానే రైతులకు చెక్కులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే చెక్కుల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ఈసీ ఆదేశించింది. రైతుల ఖాతా నంబర్లు సేకరించిన అధికారులు అందులోనే డబ్బులు జమచేస్తున్నారు. ఈ నెల చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో అందుకున్న వారికే.. ఖరీఫ్లో చెక్కులు అందుకున్న రైతులకే రబీ సాయం అందించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్కు 1,69,731 మంది పట్టాదారులు ఉండగా రూ130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్లో చెక్కులు అందుకున్న వారిలో కొందరు రైతులు మరణించారు. తొలి రోజు 3,771 మందికి సోమవారం తొలి విడతలో 3,771 మందికి రూ 3,19,80,220 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడతలో 19,258 మందికి రూ.16,67,01,920లు బ్యాంక్ ఖాతాల్లో మరో రెండు రోజుల్లో జమ కానున్నాయి. మొత్తం రెండు విడతల్లో 20,329 మందికి రూ.19,86,82,140 జమకానున్నాయి. ఇంకా 1,28,252 మందికి వివిధ విడతల్లో రూ 99,13,12,490 జమ చేయనున్నారు. తొలి విడతలో నెక్కొండ రైతులకు రైతు బంధుసాయం బ్యాంకుల్లో జమ కాలేదు. అధికారులకు సవాల్గా మారిన సేకరణ రైతుల నుంచి బ్యాంక్ అకౌంట్ల నంబర్ల సేకరణ అధికారులకు సవాల్గా మారిం ది. వ్యవసాయశాఖ అందించిన ప్రొఫార్మా ప్రకారం సేకరించాలని ఆదేశించారు. అన్ని వివరాల సేకరణలో అధికారులు తలమునకనవుతున్నారు. రైతుల నుంచి ఇంకా దాదపు 60 శాతం అకౌంట్ నంబర్లు సేకరించాల్సి ఉన్నట్లు తెలిసింది. విడతల వారీగా బ్యాంకుల్లో జమ ఈ నెల 10వ తేదీ నుంచి రైతు బంధు మంజూరైన వారి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. ఖరీఫ్లో చెక్కులు తీసుకున్న వారే రబీ సాయంకు అర్హులు. మొదటి విడతకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రెండు రోజుల్లో రెండో విడతకు సంబంధించిన డబ్బులు సైతం జమ చేస్తాం. గ్రామాల్లో వచ్చే వ్యవసాయ అధికారులకు రైతులు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి సహకరించాలి. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
పెట్టుబడి జమ
ఆదిలాబాద్టౌన్: రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల రూపంలో ఇవ్వకుండా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సోమవారం జిల్లాలోని 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2.30 కోట్లు జమ చేశారు. అకౌంట్లలో నగదును జమ చేయడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఏఈఓలు రైతుల వద్దకు వెళ్లి సేకరించారు. సోమవారం రైతు ఖాతాల్లో నగదు జమ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా హైదరాబాద్లోని ట్రెజరీ కార్యాల యం నుంచి నగదు జమ కానుంది. చాలామంది రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఏఈఓలకు ఇవ్వకపోవడంతో జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు. నేరుగా ఖాతాల్లోకి.. రైతుబంధు పథకం రెండో విడత పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో సోమవారం నుంచి వ్యవసాయ శాఖ జమ చేసింది. మొదటిరోజు జిల్లాలోని 5,458 ఎకరాలకు సంబంధించి 1,365 మంది రైతులకు గాను రూ.2.30 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం లక్షా 32వేల మంది రైతులు ఉన్నారు. రబీ పంటకు సంబంధించి మొత్తం రూ.2 కోట్ల 10లక్షలు జమ కావాల్సి ఉండగా, ఆర్ఓఎఫ్ఆర్కు సంబంధించి ఇంకా డబ్బులు జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 1,14,228 మంది రైతులకు గాను రూ.178.76 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఆయా మండలాల ఏఈఓలు 45,307 మంది రైతుల ఖాతాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు(ఏఓ) వాటిని పరిశీలించి 19,449 నిర్ధారణ చేసి నగదు జమ కోసం ఖాతాలను పంపించారు. మొదటిరోజు తొమ్మిది మండలాలు ఆదిలాబాద్రూరల్, బజార్హత్నూర్, బోథ్, గాదిగూడ, గుడిహత్నూర్, జైనథ్, మావల, తలమడుగు, ఉట్నూర్లకు సంబంధించిన 42 గ్రామాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. నేడు 18 మండలాల రైతులకు.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 30,873 ఎకరాలకు సంబంధించిన 7523 మంది రైతులకు గాను రూ.12కోట్ల 34 లక్షలు రబీ పంట సాయం ఖాతాల్లో జమ కానుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 శాతం మాత్రమే రైతుల ఖాతాలను నగదు జమ కోసం హైదరాబాద్కు పంపించారు. మిగతా 80 శాతం ఖాతాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఖాతాలు ఇవ్వని రైతులు ఉంటే సంబంధిత మండల ఏఈఓకు అందిస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. నగదు జమ చేస్తున్నాం.. రైతుబంధు రెండో విడత పెట్టుబడి సాయం కింద సోమవారం 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2కోట్ల 30లక్షలు ప్రయోగాత్మకంగా జమ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాలకు చెందిన 7523 మంది రైతుల ఖాతాల్లో రూ.12కోట్ల 34 లక్షలు జమ చేయనున్నాం. ఇప్పటివరకు 45,307 ఖాతాలను ఆన్లైన్ చేయడం జరిగింది. నగదు జమ కోసం 19,449 ఖాతాలను పంపించాం. ఇంకా ఖాతాల వివరాలను అందించని రైతులు మండల ఏఈఓలకు అందించాలి. – ఆశ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
17 లక్షల ఎకరాలు.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదాలున్నాయంటూ పార్ట్–బీలో చేర్చిన భూముల లెక్కలు ఎప్పుడు తేలుతాయో అంతుపట్టడం లేదు. గతేడాది సెప్టెంబర్లో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 2.3 కోట్లకు పైగా ఎకరాల్లోని భూముల్లో ఉన్న 1.42 కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి గాను ఏటా పెట్టుబడి సాయం కింద ఎకరాలకు రూ.8 వేలను ప్రభుత్వం అందిస్తుండగా, వివాదాస్పద భూములను పక్కన పెట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఈ ఏడాది మేలో రైతుబంధు కింద నగదు సాయమందగా, 5 నెలలైనప్పటికీ వివిధ పని ఒత్తిడుల కారణంగా రెవెన్యూ యంత్రాంగం ఈ భూముల లెక్కలను తేల్చలేకపోయింది. దీంతో ఈ భూముల్లో సాగు చేస్తున్న ప్రస్తుత రైతులకు ఏటా రూ.500 కోట్లపైగానే పెట్టుబడి సాయం నిలిచిపోతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాకే..: వివాదాస్పద భూములను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అంతా ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే వివాదాస్పద భూముల లెక్కలు తేలుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడి సాయం కింద ఆ భూములకు నగదు అందాలంటే ఎన్నికలైపోయేంతవరకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఎదురుచూపులు
మహబూబ్నగర్ రూరల్: రబీ సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం డబ్బులను సకాలంలో అందించాలని యోచిస్తున్నా సాధ్యం కావడంలేదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందించే బాధ్యతను జిల్లా వ్యవసాయ శాఖకు అప్పగించగా వారు పూర్తిస్థాయిలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సమయం కావడంతో ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషన్ రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందించడానికి అంగీకరించింది. దీంతో అధికారులు రైతుల ఖాతాల వివరాలు తీసుకుని జమ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో 3,40,674 మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి జిల్లాలో 3,40,674 మంది రైతుల బ్యాంకు ఖాతాలు, పాస్ పుస్తకం, ఆధార్ నంబర్లను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన తేదీ ప్రకారం నేటి నుంచే రైతుబం«ధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మొత్తం 3,40,674 మంది రైతులకు గాను కేవలం 9వేల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో మాత్రమే జమ కానుంది. పెట్టుబడి సాయం రైతులకు అందజేసే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించినప్పటి నుంచి నేటివరకు వ్యవసాయ శాఖ అవలంభిస్తున్న వైఖరితో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందకుండా పోయింది. ప్రణాళిక లేకనే.. వ్యవసాయ శాఖ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించకపోవడంతో ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ తూతూమంత్రంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో 38 మంది ఏఓలు, 162 మంది ఏఈఓలు ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మండలానికి ఏఓతో పాటు నలుగురు, ఐదుగురు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వారికి గ్రామాల్లో సహకారం అందించేందుకు వీఆర్ఏలు గ్రామానికి సుమారు 10 మంది చొప్పున ఉన్నారు. వీరంతా చురుకుగా విధులు నిర్వహిస్తే బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు చకచకా జరిగిపోతుంది. ఇప్పటికే 1.10 లక్షల ఖాతాలను ఆన్లైన్ చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. అయితే బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన తర్వాతనే రాష్ట్ర ట్రెజరీ ద్వారా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది. గత అనుభవాలతోనైనా.. ఖరీఫ్ సీజన్లో చెక్కుల పంపిణీ నేరుగా చేయడం వల్ల సాంకేతికంగా పలు తప్పులు దొర్లాయి. ఆయా మండలాల తహసీల్దార్లు వాటిని సరిచేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్లో రూ. 355.21 కోట్ల పెట్టుబడి సాయం జిల్లాకు మంజూరు కాగా వివిధ కారణాల వల్ల రూ. 50.21 కోట్లు పంపిణీకి నోచుకోలేదు. రూ. 305 కోట్లు పంపిణీకి నోచుకున్నాయి. రబీ సీజన్లో రూ. 305 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 4వేల చొప్పున నేరుగా జమ చేయాల్సి ఉన్నందున బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉంటేనే సమస్య ఉత్పన్నం కాదు. రైతుల పేర్లు, వివరాలు, భూ వివరాలు, ఖాతాల్లోని పేర్లతో ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నా అందులో పెట్టుబడి సాయం జమఅయ్యే అవకాశం లేదు. -
ముహూర్తం ఖరారు
యాసంగి పంటలకు పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఖరారయ్యింది. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ఈసారి చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, కామారెడ్డి: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తున్నారు. ఖరీఫ్లో రైతులకు చెక్కుల రూపంలో అందించారు. ప్రస్తుతం ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. దీంతో వ్యవసాయ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 2,07,611 మంది రైతులకు యాసం గిలో రూ. 176 కోట్ల పెట్టుబడి సాయం అందించా ల్సి ఉంది. వ్యవసాయ శాఖ అ«ధికారులు ఇప్పటివరకు 60 వేల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించారు. అయితే ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం సొమ్మును జమ చేయడానికి నిర్ణయించింది. జిల్లాలో తొలిరోజు 6,133 మంది రైతుల ఖాతాల్లో రూ. 6.25 కోట్లు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు కొన్ని ఖాతాల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 60 వేలమంది వివరాలు మాత్రమే.. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కులద్వారా పంపిణీ చేశారు. రైతులు చెక్కులను బ్యాంకులకు తీసువెళ్లి డ్రా చేసుకున్నారు. అయితే ఈసారి కూడా చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. చాలా మంది రైతులకు అప్పు కోసం తీసుకున్న ఖాతాలే ఉన్నాయి. కొందరికి మాత్రమే సేవింగ్స్ ఖాతాలున్నాయి. దీంతో రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ వ్యవసాయ శాఖకు కొంత ఇబ్బందికరంగా తయారైంది. రైతులు బ్యాంకులకు వెళ్లి కొత్త ఖాతాలు తీయడానికి సమయం పడుతుండడంతో ఇప్పటి వరకు కేవలం 60 వేల ఖాతాలు మాత్రమే వ్యవసాయ శాఖ సేకరించగలిగింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఈ నెల 25 లోగా సేకరించడం పూర్తయితే ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసే అవకాశాలుంటాయి. సాగు చేసేవారికి అందిస్తేనే.. ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం మొదలైంది. యాసంగితో రెండో విడత పంపిణీ జరుగుతోంది. అయితే పెట్టుబడి సాయం పెద్ద రైతులకే ఎక్కువగా మేలు చేస్తోందన్న అభిప్రాయం చిన్న, సన్నకారు రైతుల్లో ఉంది. జిల్లాలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వారిలో ఎకరం, ఎకరంనర, రెండెకరాలు ఉన్న రైతులు 80 శాతంపైనే ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, పడావుగా వదిలేసిన వారికి రూ.లక్షల్లో పెట్టుబడి సాయం అందుతుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంట సాగు చేసేవారికి సాయం అందించకుండా భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వృథాగా వదిలేసిన వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్న అభిప్రాయం ఉంది. అలాగే కౌలు రైతులకు ఈ పథకం వర్తించకపోవడంతో వారు నష్టపోతున్నారు. తమకు కూడా పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నేటినుంచి ‘రైతుబంధు’
నల్లగొండ అగ్రికల్చర్ : నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం అమలుచేస్తున్న రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి బదులు రైతుల ఖాతాల్లో నగదును జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దను నుంచి వారి బ్యాంకుఖాతా నంబర్లను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రబీ రైతుబంధు పథకం పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులు జిల్లా వ్యాప్తంగా 3,59,496 మంది ఉన్నారు. అయితే ఈ నెల 22 నాటికి రైతుల నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు 42 వేల ఖాతాలను సేకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ప్రక్రియ వేగవంతంగా సాగడంతో ఇప్పటి వరకు 77,821 ఖాతానంబర్లు, పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్ నంబర్లను సేకరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అనుసంధానం చేశారు. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి నగదు జమ చేయనుంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండో దశ పెట్టుబడి సాయం రైతులకు అందునున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రైతుల ఖాతా నంబర్లను దశల వారీగా సేకరించి రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయాన్ని జమచేయడానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఏఈఓలు లక్ష్యానికి మించి రైతుల నుంచి వివరాలు సేకరించడంపై జిల్లా వ్యవసాయాధికారి జి.శ్రీధర్రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచిసేకరించిన వివరాలు ఇలా.. మిర్యాలగూడ మండలంలో 17,306 మంది రైతులకు గాను 4,709 ఖాతాలు, దేవరకొండలో 11,930 మందికి 4,248, చింతపల్లిలో 13,132కు 4205, మునుగోడులో 13,562కు 3,704, పెద్దవూరలో 13,380కి 3,639, నల్లగొండలో 16,740కి 3,607, కనగల్లో 14,122కు 3,329, నిడమనూరులో 14,316కు 3,122, అడవిదేవులపల్లిలో 4,063కు 3,088, చండూరులో 12,713కు 2,953, నార్కట్పల్లిలో 12,943కు 2,664, వేములపల్లిలో 8,469కు 2,606 ఖాతాలను సేకరించారు. గుర్రంపోడులో 16,414కు 2,603, కట్టంగూరులో 11,507కు 2,592, తిరుమలగిరి(సాగర్)లో 9,782కు 2,530, దామరచర్లలో 8,500కు 2,423, కొండమల్లెపల్లిలో 8,074కు 2,358, పీఏపల్లిలో 11,157కు 2,344, నకిరేకల్లో 8,448కు 2,322, శాలిగౌరారంలో 12,912కు 2,155, అనుములలో 11,188కు 2,106, చిట్యాలలో 13,035కు 2,065, మర్రిగూడలో 11,715కు 1,976, తిప్పర్తిలో 10,696కు గాను 1,794 రైతుల ఖాతాలను సేకరించారు. కేతేపల్లిలో 9,106కు 1,590, మాడుగులపల్లిలో 10,969కు 1,540, గుండ్లపల్లిలో 11,648కి 1,362, నాంపల్లిలో 15,070కి 1,224, చందంపేటలో 9,083కు 944, త్రిపురారంలో 12,042కు 925 మంది రైతులనుంచి ఖాతాలను సేకరించారు. వీరందరికీ సోమవారం నుంచి ఆన్లైన్ ప్రక్రయ ద్వారా రబీ పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే వెంటనే ఆ బ్యాంకు నుంచి రైతుల మొబైల్కు మెసేజ్ వస్తుంది. అనిరంతరం కొనసాగుతుంది రైతులందరికీ రబీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమచేసే వరకు ఖాతా నంబర్ల సేకరణ, ఆన్లైన్ ద్వారా డబ్బులు వేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి రైతు విధిగా తమ పాస్పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ను వ్యవసాయ విస్తరణాధికారులను అందించాలి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటిదశలో వచ్చిన వారందరికీ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. జి.శ్రీధర్రెడ్డి, జేడీఏ -
రేపు రైతుల ఖాతాల్లోకి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రబీ రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్లో మొదటిదశ పెట్టుబడి సొమ్మును సోమ వారం రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధ్రువీకరించారు. ఐదు లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.500 కోట్లు బదిలీ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రభుత్వం రూ.5,100 కోట్లు పంపిణీ చేసింది. మొత్తం 51 లక్షల మంది రైతులకు గ్రామసభల్లో పెట్టుబడి చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్మును అందజేయాలని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పడంతో బదిలీ ప్రక్రియ చేపట్టింది. 13 లక్షల బ్యాంకు ఖాతాల సేకరణ... రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేపనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) 13 లక్షలు సేకరించారు. వాటిని మరోసారి పరిశీలించాక ఎటువంటి అభ్యంతరాల్లేని ఖాతాలు ఐదు లక్షలు మండల వ్యవసాయ అధికారుల(ఏవో) వద్దకు చేరాయి. వాటిని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపారు. వాటిని సరిచూసుకున్న ఆర్థికశాఖ సోమవారం ఆయా బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము బదిలీ చేయనుంది. నెలలోగా పూర్తి చేసే ప్రణాళిక... మొదటిదశలో ఐదు లక్షలమంది రైతులకు పెట్టుబడి సొమ్మును బదిలీ చేశాక, తదుపరి వారంరోజుల్లోనే మరో విడత సొమ్ము అందజేసేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. నెల రోజుల్లోగా మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చేరనుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతాల సేకరణ, సొమ్ము బదిలీ పనిలో దాదాపు 2,400 మంది ఏఈవోలు నిమగ్నమయ్యారు. -
22 నుంచి రైతులకు రబీ పెట్టుబడి సోమ్ము?
-
22 నుంచి పెట్టుబడి సొమ్ము?
సాక్షి, హైదరాబాద్: రైతులకు రబీ పెట్టుబడి సొమ్మును ఈ నెల 22 నుంచే అందజేయాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో ఇప్పటివరకు సేకరించిన 10 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. అందుకు సంబంధించి ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. ‘పండుగ తర్వాత ఈ నెల 22 నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. అన్నీ సక్రమంగా జరిగితే అంతకుముందే రైతుల ఖాతాల్లోకి రబీ పెట్టుబడి సొమ్ము జమ చేస్తాం’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైతుల ఖాతాలను ఎప్పటికప్పుడు వేగంగా అప్లోడ్ చేసేలా మొబైల్ యాప్ కూడా వ్యవసాయ శాఖ రూపొందించింది. దానివల్ల గ్రామాల్లో వ్యవసాయాధికారులు వీలైనంత త్వరగా రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించడం సాధ్యపడుతుంది. వేగంగా బ్యాంకు ఖాతాల సేకరణ.. గత ఖరీఫ్లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ.5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపంలో ఇవ్వకూడదని, ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రత్యామ్నాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ ఖాతాల నంబర్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము వెళ్తుంది. రైతుకు ఖాతా ఉన్న బ్యాంకుతో సంబంధం లేకుండా ఒకేసారి వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుంది. -
వారికి రైతు...బంధు
సాక్షి, మెదక్జోన్: వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కారించేందుకు ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేలాది మంది అన్నదాతలకు నిరాశే మిగుల్చుతోంది. జిల్లాలోని 44,932 ఎకరాల భూముల పలు సమస్యల్లో ఉన్నాయి. సమస్యాత్మక భూములను పార్ట్ బీలో ఉంచడంతో ఈ భూముల రైతులు ఖరీఫ్లో పంపిణీ చేసిన సాగు పెట్టుబడి సాయం(రైతుబంధు) అందలేదు. ప్రస్తుతం రబీ సీజన్కు మళ్లీ పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు. కానీఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం కొత్త వారికి రైతుబంధు ఇవ్వరాదనే నిబంధనతో సమస్యలు తీరిన రైతులకు సైతం రబీలో రైతుబంధు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇక సమస్యలు పరిష్కారం కాని రైతుల పరిస్థితి ఇంకా ఇబ్బందిగా మారింది. భూ సమస్య పరిష్కారం కాకపోగా రైతుబంధు రాని దుస్థితి. జిల్లాలో 3.20 లక్షల ఎకరాలు భూమి ఉండగా 25వేలకు పైగా ఎకరాల భూములు సమస్యల్లో ఉన్నాయి. ప్రధానంగా అటవీ భూములని ఫారెస్ట్ అధికారులు రైతులు సాగు చేసుకునే వేలాది ఎకరాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి భూములను జాయింట్ సర్వే పేరుతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్నారు. అలాగే అనేక గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న భూములతో పొలిస్తే రికార్డుల్లో మూడింతలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి లెక్కలను తెల్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి భూములు చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, ఎస్. కొండాపూర్, హవేళిఘణాపూర్ మండలంలోని బూర్గుపల్లి, లింగ్సాన్పల్లి తండా, గాజిరెడ్డిపల్లి, దూప్సింగ్, అల్లాదుర్గం తదితర మండలాల్లో సమస్యలు కొకల్లలుగా ఉన్నాయి. వీటిని పరిష్కారించేందుకు అధికారులు అడపదడపా సర్వేలు చేపడుతున్నప్పటికీ ఇవి నేటికీ కొలిక్కి రావడం లేదు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభించి ఏడాది కావస్తున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ సొమ్మును ప్రస్తుత రబీ సీజన్లో నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు. 1.90 లక్షల చెక్కుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 6.6 శాతం భూముల సమస్యలు పరిష్కరించాల్సింది. ఖరీఫ్కు ముందు 1.90 లక్షల చెక్కుల రూపంలో రూ. 140 కోట్లను అందజేశారు. ఇందులో చనిపోయిన రైతులు, విదేశాల్లో ఉన్న రైతులతో పాటు తక్కువ భూమి ఉన్న తదితర రైతులు 26వేల చెక్కులు మిగిలిపోయాయి. వాటికి సంబంధించి సుమారు రూ. 18 కోట్లు మిగిలినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన చెక్కులను ప్రభుత్వానికి తిరిగి పంపించారు. ప్రస్తుత రబీ సీజన్లో సమస్యల్లో ఉన్న భూములను వదిలేసి ఖరీఫ్లో చెల్లించిన మాదిరిగానే రబీలోనూ రైతుబంధు పెట్టుబడి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తమ సమస్యలు ఇంకెన్నాళ్లకు పరిష్కారిస్తారంటూ చెక్కులందని బాధిత రైతులు ప్రభుత్వంపై గుర్రుమీద ఉన్నారు. అయోమయ పరిస్థితి.. వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభిం చి ఏడాది పూర్తయిం ది. సర్వేలు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. మా గ్రామంలో 500 ఎకరాల్లోని భూములు మూడు సర్వే నంబర్లతో ఉన్నాయి. నాకు అందులో రెండు ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉందని నాకు ఖరీఫ్లో రైతుబంధు చెక్కు ఇవ్వలేదు. ఇప్పుడైనా చెక్కు ఇస్తారో?... ఇవ్వరో? తెలియని అయోమయ పరిస్థితి. –కుమ్మరి సిద్దిరాములు, జంగరాయి పార్ట్–బీ భూములకు సాయం లేదు.. సమస్యల్లో ఉన్న భూములు 44,932 ఎకరాలున్నాయి. ఈ భూములను సర్వే చేయిస్తున్నాం. వీటిలో ముఖ్యంగా అటవీ భూములున్నట్లు ఆ శాఖాధికారులు చెప్పడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వేలు ప్రారంభించాం. అలాగే కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో భూములు తక్కువ ఉండి రికార్డుల్లో మాత్రం మూడింతలుగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి భూములను పార్ట్–బీలో పొందుపర్చాం. రబీలోనూ ఈ భూములకు పెట్టుబడి సాయం లేదు. వీటి సమస్యలు పూర్తిగా పరిష్కారించాక నూతన పాస్బుక్లు అందజేసిన అనంతరం పెట్టుబడి సాయం అందుతుంది. –నగేశ్, జాయింట్ కలెక్టర్ -
ఖాతాల్లోకే ‘రైతుబంధు’
బూర్గంపాడు : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందజేతకు ఎన్నికల సంఘం షరతులు విధించింది. పెట్టుబడి సాయాన్ని నేరుగా చెక్కుల రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వ్యవసాయశాఖ ఎన్నికల సంఘం ఆదేశాలతో డైలమాలో పడింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకు ముమ్మర చర్యలు ప్రారంభించింది. గ్రామాల్లో ఏఈఓలు రైతుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి రైతుబంధు చెక్కులను ఈ నెల 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో చెక్కుల పంపిణీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఖాతాలలో జమచేసే చర్యలు ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయం అందేందుకు మరో ఇరవైరోజులకు పైగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల సేకరణలో అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించేందుకు బుధవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును జమచేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. బ్యాంకు ఖాతాలు లేనటువంటి రైతులకు వెంటనే ఖాతాలు తెరిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూశాఖ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పుడు రెవెన్యూశాఖ వద్ద ఉన్నటువంటి రైతుల బ్యాంకుఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో ఖాతాల సేకరణ సులువవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సాయం పొందినవారికే.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రైతుబం«ధు పథకంలో తొలివిడతలో చెక్కులు తీసుకున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాహక్కులు కలిగిన రైతులకు పెట్టుబడిసాయానికి గండిపడింది. ఏఈఓలు రైతుల బ్యాంకు ఖాతాల సేకరణకు సంబంధించి ఓ ఫార్మట్ను వ్యవసాయశాఖ తయారుచేసింది. ఇందులో రైతుపేరు, గ్రామం, మండలం, జిల్లా, ఆధార్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సెల్నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా నంబర్ వివరాలు నమోద చేసి రైతుసంతకం, ఏఈఓలు సంతకాలు చేయాల్సివుంది. ఈ నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్కు కార్యాలయానికి అన్లైన్లో పంపాలి. ఆ తరువాత ఈ– కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయనున్నారు. జిల్లా ఖరీఫ్లో 1.21 లక్షల మంది రైతులకు 1. 31 లక్షల చెక్కులను పెట్టుబడి సాయంగా అందించారు. ఖరీఫ్లో జిల్లాలో రైతులకు రూ. 120 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీలో కూడా అంతే మొత్తంలో అందనుంది. గతంలో లబ్ధిపొందిన వారికే.. ఖరీఫ్లో రైతుబంధు పథకంలో లబ్ధిపొందిన రైతులకే రబీలో పెట్టుబడి సాయం అందుతుంది. గతంలో మాదిరి చెక్కులు కాకుండా ఈ సారి రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం జమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ ప్రక్రియ అన్ని మండలాల్లో చేపట్టాం. రైతులు వ్యవసాయశాఖ అధికారులకు సహకరించి బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలి. –కే అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఖాతాల్లోకే రైతుబంధు..
హన్మకొండ: యాసంగి పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఉండేందుకు గత ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్లో చెక్కులను పంపిణీ చేయగా.. ఈ యాసంగిలోనూ అదే తరహాలో ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ విధానానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే యాసంగిలో రైతుబంధు పథకం అమలు చేయాలని, కొత్త వారిని మినహాయించాలని ఈసీ సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో గత ఖరీఫ్లో చెక్కులు పొందిన రైతులకు యాసంగికి గాను నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటికి వెళ్లి బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర వివరాలు సేకరించనున్నారు. దీని కోసం నిర్ధిష్టమైన ప్రొఫార్మాను సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. 74,664 మంది రైతులకు.. యాసంగికి సంబంధించి అర్బన్ జిల్లాలో 74,664 మంది రైతులకు 75,825 చెక్కుల రూపంలో రూ.69,12,56,170 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో వేయనున్నారు. గత ఖరీఫ్లో జిల్లాలో 75,085 మంది రైతులకు 75,540 చెక్కుల రూపంలో రూ.67,63,09,650 పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇందులో వివిధ కారణాలతో 6,756 మంది రైతులకు 6,817 చెక్కులు పంపిణీ కాలేదు. ఎన్నారైలు, చనిపోయిన రైతులు, డబుల్ జారీ అయిన వారు, వివాదాల్లో ఉన్న వారు మిగిలిపోయారు. అడ్డంకులు తొలగిపోయినా దూరమే.. గతంలో అన్ని సక్రమంగా ఉన్న ‘ఏ’ గ్రూపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించారు. సమస్యలుండి పాస్ బుక్కులు అందుకోని రైతులను బీ గ్రూపులో చేర్చి వారికి చెక్కులు అందించలేదు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్తగా పాస్ బుక్కులు అందుకున్న రైతులు ఉన్నారు. అయితే ఈ యాసంగిలో కొత్త వారికి రైతుబంధు పథకం అమలు చేయొద్దని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో కొత్త రైతులు యాసంగి పెట్టుబడికి దూరం కానున్నారు. వివరాలు అందజేయాలి.. ఇంటికి వచ్చే వ్యవసాయ విస్తరాణాధికారులకు రైతులు పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రొఫార్మాలో ఉన్న అంశాల మేరకు వివరాలు అందించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ప్రతి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, రైతు ఫోన్ నంబర్ను అధికారులకు ఇవ్వాలి. పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్లగానే ఫోన్ నంబర్కు సమాచారం వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పారు. -
ఖాతాల తిప్పలు!
మహబూబ్నగర్ రూరల్: రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆర్థిక సాయం అందించే రైతుబంధు పథకానికి ఖాతాల చిక్కొచ్చి పడింది. ప్రభుత్వం గత ఖరీఫ్లో పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో అందజేసిన విషయం విదితమే. ఈ మేరకు రానున్న రబీలో కూడా అందజేయాలని భావించగా... కేంద్ర ఎన్నికల సంఘం ఖాతాల్లో జమ చేసేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రైతుల బ్యాంకు ఖాతాలను గుర్తించే విషయంలో అధికారుల పని ముందుకు సాగ డం లేదు. ఈ నిబంధనను అధిగమించేందుకు మనుగడలో ఉన్న ఖాతాల వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు బుధవారం నుంచి మరోసారి రైతు ల ఇళ్ల తలుపు తట్టనున్నారు. కొనసాగుతున్నాయా? రైతుబంధు చెల్లింపుల్లో ఖాతాల విషయం అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల వేళ రైతుబంధు పథకంపై సందిగ్ధం నెలకొనగా.. చివరకు ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. పథకం కొనసాగింపునకు అడ్డు చెప్పనప్పటికీరైతులకు చెక్కుల రూపంలో కాకుండా ఆన్లైన్ చెల్లింపులు చేయాలని ఎన్నికల సంఘం షరతు విధించింది. రైతుబంధు పథకాన్ని రెండో విడత ప్రారంభించేందుకు ఇప్పటికే చెక్కులు సిద్ధం చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల సం ఘం ఆదేశంతో బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించా రు. కాగా బ్యాంక్ ఖాతాల్లో నాన్ ఆపరేటింగ్ సమ స్య ప్రస్తుతం అధికారులకు అడ్డంకిగా మారింది. 3,40,674 మంది పట్టాదారులు జిల్లాలో రైతుబంధు పథకం కింద ప్రభుత్వం 3,40,674 మంది పట్టాదారులు ఉండగా రూ.305 కోట్లు చెల్లించనుంది. దీనికోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 2.92 లక్షల చెక్కులు తయారు చేసి పంపిణీకి సిద్ధంగా పెట్టుకున్నారు. ఇదే సమ యంలో ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావ డంతో చెక్కులకు బదులు ఆన్లైన్లో చెల్లించేందుకు బ్యాంకు ఖాతాల పరిశీలన చేపట్టారు. ముం దుగా ప్రకటించిన లబ్ధిదారులు, నగదులో మార్పు లేకున్నా బ్యాంక్ ఖాతాలే సమస్యగా మారింది. ఏడాది క్రితం రైతు సమగ్ర సర్వే, రైతుబంధు పథకం అమలుల్లో భాగంగా అధికారులు రైతుల బ్యాం కు ఖాతాలు సేకరించారు. ఆ సమయంలోనే రైతు పేరు, భూమి విస్తీర్ణం, బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలను నమోదు చేశారు. కానీ బ్యాంక్ ఖాతాలు తీసి ఏడాది గడిచినందున ఆ ఖాతాలు కొనసాగుతున్నాయా, లేదా అనేది గుర్తించడం సమస్యగా మారింది. చాలామంది రైతులు ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించకపోవడం తో, బ్యాంకు నిబంధనల ప్రకారం అవి నాన్ ఆపరేటింగ్ కిందకు వెళ్లనున్నాయి. ఫలితంగా ఆన్లైన్లో డబ్బులు వేయడం, తీసుకోవడం కుదరదు. అలాంటి సమయంలో సదరు రైతు మరో ఖాతాను తీయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో రైతు ఖాతాను పరిశీలించాల్సి రావడంతో చెల్లింపుల్లో జాప్యం చో టు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా ఖరీఫ్ సీజన్కు గాను ప్రభుత్వం రూ.355.21 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో రూ.305 కోట్ల విలువైన చెక్కులను అధికారులకు రైతులకు పంపిణీ చేశారు. రైతుల ఇళ్ల వద్దకు అధికారులు రైతుబంధు పథకం అమలులో వ్యవసాయశాఖ అధికారులు కొత్త విధానాన్ని అవలంభించనున్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించేందుకు అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లనున్నారు. చెక్కుల రూపంలో వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రైతుబంధు అమలుకు ప్రత్యామ్నాయ చర్యల్లో నిమగ్నమైంది. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధికారుల వద్ద రైతుల బ్యాంక్ ఖాతా వివరాలు మరోసారి పరిశీలించాల ని ఆదేశించింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి మరోసారి బ్యాంకు ఖాతాల నంబర్లు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్ కోడ్ తదితర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమానికి బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వాడకంలో ఉన్న బ్యాంకు ఖాతా నంబర్లనే ఇవ్వాలని రైతులను అధికారులు ఈ సందర్భంగా కోరనున్నారు. ఖరీఫ్ సీజన్లో లబ్ధి పొందిన రైతులకే రైతుబం«ధు పథకం వర్తించనుండగా.. వారి నుంచే అధికారులు బ్యాంక్ ఖాతాలు సేకరిస్తారు. ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు ఏఈఓలు రైతు ల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇది లా ఉండగా రబీ సీజన్ కోసం రైతుబంధు పథకం జిల్లాలోని 26 మండలాలకు చెందిన రైతులకు పంపిణీ చేసేందుకు వచ్చిన 2.92 లక్షల చెక్కులను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరచాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. -
కొత్త రైతులకు నో చాన్స్
‘రైతు బంధు’ అమలు విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది.ఈ పథకంలో కొత్త వారిని చేర్చకూడదని సూచనలు చేసింది. దీంతో భూ వివాదాలు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’లోకి మారిన రైతులు, పలు కారణాల వల్ల ఖరీఫ్లో చెక్కులు పొందలేక పోయిన దాదాపు 60 వేల మందికి పైగా రైతులకు నిరాశే ఎదురు కానుంది. మోర్తాడ్(బాల్కొండ): పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో కొత్త వారిని చేర్చకూడదని ఎన్నికల కమిషన్ సూచించడంతో గతంలో చెక్కులు పొందిన రైతులకే ప్రయోజనం చేకూరనుంది. పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు, వివిధ కారణాల వల్ల ఖరీఫ్లో చెక్కులు పొం దలేక పోయిన రైతులకు నిరాశే ఎదురుకానుంది. అయితే రబీ సీజనుకు సంబంధించి పెట్టుబడి సహాయం అందించడానికి తమకు ఇంకా మార్గదర్శకాలు అందలేదని అందువల్ల ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి ఖరీఫ్కు రూ.4 వేల చొప్పున, రబీ సీజనుకు మరో రూ.4 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం విదితమే. ఖరీఫ్ సీజనుకు గాను మే నెలలోనే అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం చెక్కులను వ్యవసాయ శాఖ అందించింది. రబీ సీజనుకు సంబంధించి నవంబర్లో చెక్కులను అందించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలైతే పెట్టుబడి సహాయానికి బ్రేక్ పడవచ్చని భావించిన ప్రభుత్వం ఒక నెల ముందుగానే పంపిణీకి ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచే అన్ని గ్రామాలలో పెట్టుబడి సహాయం చెక్కులను అందించాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పలు సూచనలు, సలహాలను అందించడంతో రైతుబంధు పథకం అమలులో ఊహించని మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి చెక్కులను పంపిణీ చేయ కుండా రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సహాయం నగదు రూపంలో బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. అంతేగాక గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకు మాత్రమే రబీ సహాయంను అందించాలని కొత్త వారిని ఇప్పట్లో చేర్చవద్దని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీంతో జిల్లాలో వివాదాస్పద భూములు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు దాదాపు 30 వేల మంది పెట్టుబడి సహాయం అందుకోలేక పోతున్నారు. ఖరీఫ్ సీజనులో జిల్లాలోని 2లక్షల, 271 మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు అయ్యింది. రూ.204.44 కోట్ల నిధులు ఇందు కోసం కేటాయించారు. రైతులు మరణించడం, ప్రభుత్వ భూముల్లో సాగు, ఆధార్ కార్డు అందించకపోవడం వంటి కారణాలతో 36,903 మంది రైతులకు చెక్కులు పంపిణీ కాలేదు. ఈ చెక్కులు వ్యవసాయ శాఖ వద్దనే ఉండిపోయాయి. వీరు కూడా రబీలో పెట్టుబడి సహాయం పొందలేకపోతున్నారు. అయితే విదేశాల్లో ఉన్న రైతుల పేరిట మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల కోడ్ అమలుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో విదేశాల్లో ఉన్న రైతుల చెక్కులకు కోడ్ వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. ఖరీఫ్ సీజనులో ఎంత మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరైందో అంతే మొత్తం రబీ సీజనుకు కూడా మంజూరు కానుంది. ఇదిలా ఉండగా రైతుల ఖాతా నంబర్లను మళ్లీ సేకరించడమా లేక ధరణి వెబ్సైట్ ఆధారంగా నమోదైన ఖాతాల వివరాల ప్రకారం నగదు బదిలీ చేయడమా అనేది ప్రభు త్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం నడుచుకుంటామని వ్యవసాయ శాఖ చెబుతుండగా ఇందు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే రబీ సీజను పెట్టుబడి సహాయం ఎలా అందుతుందో స్పష్టం అవుతుంది. ఇందుకోసం కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నగదు బదిలీపై రైతుల్లో అసంతృప్తి రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల బ్యాంకర్లు పాత రుణాల వసూలుకు లింకు పెట్టి పెట్టుబడి సహాయం చెల్లించకుండా నిలిపివేస్తారని రైతులు అంటున్నారు. చెక్కులు ఇవ్వడం వల్ల తమకు అవకాశం ఉన్న బ్యాంకులో నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల పాత రుణాలకు బ్యాంకర్లు లంకె పెట్టే అవకాశం ఉండటంతో రైతులు ఈ విధానంపై పెదవివిరుస్తున్నారు. కాగా బ్యాంకర్లకు పెట్టుబడి సహాయం చెల్లింపులపై ఆదేశాలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను కోరుతున్నారు. తప్పులు వచ్చాయని చెక్కులు ఇవ్వలేదు మేము గతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి సంబంధించి మూడు ఎకరాలకు బదులు ఎక్కువ భూమి మా రికార్డులలో నమోదు అయ్యింది. దీంతో రూ.12 వేల పెట్టుబడి సహాయానికి బదులు ఎక్కువ సొమ్ము మంజూరైంది. అయితే అధికారులు అసలు ఉన్న భూమికి కూడా చెక్కు ఇవ్వలేదు. చెక్కును వాప సు తీసుకున్నారు. ఇంత వరకు మళ్లీ చెక్కు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు రూ.12 వేల చెక్కు ఇస్తారా ఇవ్వరా అనేది అధికారులు తేల్చడం లేదు. – బూత్పురం మహిపాల్, రైతు, మోర్తాడ్ బ్యాంకు ఖాతాలను సేకరించాలని ఆదేశించారు రైతుబంధు పథకాన్ని రబీ సీజనుకు అమలు చేయడానికి గాను రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించాలని సూచించారు. గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకే పెట్టుబడి సహాయం అందించనున్నారు. కొన్ని కారణాల వల్ల పెట్టుబడి సహాయం అందుకోని రైతులకు ఇప్పుడు సహాయం అందిస్తారా లేదో తెలియదు. ప్రస్తుతానికి సహాయం పొందిన రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నాం. –పర్స లావణ్య, వ్యవసాయాధికారి, మోర్తాడ్ -
రిజర్వుబ్యాంకు ద్వారా రైతుబంధు సొమ్ము
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి సొమ్మును నేరుగా రిజర్వుబ్యాంకు ద్వారా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడానికి వీలుపడుతుంద ని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైతులకు 64 బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఒక్క ఎస్బీఐ వద్దే 11 లక్షల రైతు ఖాతాలున్నాయి. మిగిలినవి వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. దీంతో రైతులందరి ఖాతా నంబర్లను సేకరించి ఒక్కో బ్యాంకుకు అందజేయడం క్లిష్టమైన పని. ఒక్కో బ్యాంకుకు ప్రభుత్వం సొమ్ము సరఫరా చేయడమూ ఇబ్బందేనని వ్యవసాయశాఖ అంచనా వేసింది. బ్యాంకులకు సొమ్ము ఇచ్చాక అవి రైతులకు సక్రమంగా పంపిణీ చేశాయా లేదా తెలుసుకునేందుకు ప్రతీ బ్యాంకును పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులన్నింటికీ రిజర్వుబ్యాంకు ద్వారా సొమ్మును జమచేయడమే పరిష్కారంగా వ్యవసాయశాఖకు కన్పించింది. ఇక రైతు ఖాతాలన్నింటినీ రిజర్వుబ్యాంకు ఇస్తే వివిధ బ్యాం కులతో సంబంధం లేకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సొమ్ము చేరిపోతుంది. అంటే ఏ బ్యాంకు ఖాతాకైనా రిజర్వుబ్యాంకు నుంచి సొమ్ము ఏకకాలం లో వెళ్లిపోతుంది. అందుకే దీనికి సంబంధించి రిజర్వుబ్యాంకు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రిజర్వుబ్యాంకు ద్వారా రైతు ఖాతాలకు సొమ్ము అందజేస్తే ఎక్కడా అవకతవకలు జరిగే వీలుండదంటున్నారు. ఏకకాలంలో ఖాతాల సేకరణ, సొమ్ము జమ ప్రస్తుతం వ్యవసాయశాఖ రైతు ఖాతాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. నెలాఖరు నాటికి రైతు బ్యాంకు ఖాతాలన్నింటినీ సేకరించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్బొజ్జాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతుల నుంచి బ్యాంకు ఖాతాలను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను సేకరించాలని నిర్ణయించారు. ఒకవైపు రైతు బ్యాంకు ఖాతాలను సేకరిస్తూనే, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు రిజర్వుబ్యాంకుకు అందజేస్తారు. అంతే మొత్తంలో సొమ్మును కూడా అందజేస్తారు. మరోవైపు తమ వద్దకు వచ్చిన ఖాతా నంబర్ల ప్రకారం రిజర్వుబ్యాంకు సంబంధిత సొమ్మును రైతులకు జమ చేస్తుంది. రైతు బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ, వాటిల్లోకి సొమ్ము జమ రెండూ ఏకకాలంలో జరగాలని నిర్ణయించారు. సవాలుగా మారిన ఖాతాల సేకరణ ఇదిలావుంటే వ్యవసాయశాఖ వద్ద ప్రస్తుతం 33 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నాయి. కానీ, అవి ఏమేరకు సరైనవో అన్న అనుమానాలున్నాయి. ఎస్బీఐ వద్ద ఉన్న 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు లక్షల ఖాతాలే సరిగా ఉన్నాయి. మిగిలిన 4 లక్షల ఖాతాల్లో తప్పులున్నట్లు గుర్తించారు. అందువల్ల ప్రతీ రైతు బ్యాంకు ఖాతాను సేకరించాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వ్యవసాయశాఖకు సవాలుగా మారింది. ప్రతీ రైతు వద్దకు వెళ్లి సేకరించడం మండల వ్యవసాయ విస్తరణాధికారులకు కీలకంగా మారింది. గ్రామాల్లో ఉండే రైతుల నుంచి సేకరించడమైతే సులువే కానీ, ఎక్కడో పట్టణాల్లో ఉండే వారి బ్యాంకు ఖాతాలను సేకరించడం ఎలాగన్న ప్రశ్న అధికారులను తొలుస్తోంది. ఎలాగైనా సేకరించి పెట్టుబడి సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయాల్సిందేనన్న సంకల్పంతో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. -
ఖాతాల్లోకే ‘రైతుబంధు’
సాక్షి, మెదక్జోన్: రైతులకు సాగు పెట్టుబడి కోసం ప్రత్యేకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా 5వ తేదీ నుంచి జిల్లాలో చెక్కుల పంపిణీని ప్రారంభించారు. తూప్రాన్, కౌడిపల్లి, నర్సాపూర్, నిజాంపేట, తదితర మండలాల్లో కొంతమందికి పంపిణీ చేశారు. కాగా అదే రోజు ఎన్నికల కోడ్ రావడంతో చెక్కుల పంపిణీని నిలిపివేశారు. కానీ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి రైతులకు చెక్కుల పంపిణీ చేయటాన్ని నిలిపివేయాలన్న ఎన్నికల కమిషన్ నేరుగా రైతు అకౌంట్లో పెట్టుబడి సాయం వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు రూ. 4 వేల చొప్పున నేరుగా ఆయా రైతుల అకౌంట్లోకే డబ్బులను వేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. ఇందుకోసం రైతుల పేర్లు, ఎంత భూమి ఉంది? అకౌంట్ నంబర్లను తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలాంటి అర్భాటం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బులను డ్రా చేసుకునే వీలు ఉంటోందని అధికారులు ఆలోచన. 2.20 లక్షల మంది రైతులకు లబ్ధి రబీ సీజన్కోసం పెట్టుబడి సాయం కింద జిల్లాలో 2.20 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇందుకోసం రూ. 140 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రబీ ప్రణాళికను సైతం ఇప్పటికే వ్యవసాయశాఖ అ«ధికారులు సిద్ధం చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తదితర వాటిని అందుబాటులో ఉంచామని వివరిస్తున్నారు. ఈ నెలలో పంపిణీ చేస్తే ముందుగా సన్నద్ధమై సాగుచేసుకునేందుకు వీలు ఉంటోంది. అప్పు కింద పట్టుకుంటారా..? రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేస్తే పంట రుణాలకు సంబంధించి పట్టుకుంటారని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 95 శాతం మంది రైతులు బ్యాంకు అధికారులకు అప్పులే ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు అధికారులు పట్టుకుంటే తమ పరిస్థితి ఏంటని పలువురు రైతులు వాపోతున్నారు. అదే జరిగితే ప్రభుత్వం తమకు ఇచ్చిన పెట్టుబడి అక్కరకు రాకుండా పోతుందని వారు బావిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులకు సరైన సూచనలు ఇస్తేనే బాగుంటుందని అన్నదాతలు కోరుతున్నారు. ఖరీఫ్లో మిగిలిన చెక్కులు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో పంపిణీ చేయగా జిల్లా వ్యాప్తంగా 26 వేల చెక్కులు మిగిలిపోయాయి. ఈ చెక్కులు పట్టాదారులకు తప్ప కుటుంబీకులకు కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఖరీఫ్ సిజన్లో జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలకుగాను 2.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎన్ఆర్ఐలకు సంబంధించిన చెక్కులు, చనిపోయినవారి చెక్కులు, కొద్ది పాటి అమౌంట్ ఉన్న చెక్కులు మిగిలిపోయాయి. వీటిని తిరిగి ప్రభుత్వానికి పంపించారు. అలా కాకుండా అందుబాటులో లేని రైతుల చెక్కులను సంబంధిత కుటుంబీకులకు అందజేస్తే ఉపయోగకరంగా ఉంటోందని రైతులు సూచిస్తున్నారు. ఖాతా నంబర్లు ఇవ్వాలి.. పెట్టుబడి సాయానికి సంబంధించి చెక్కుల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో అందుబాటులో లేని రైతులకు సైతం పెట్టుబడి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ సంబంధిత రైతు బ్యాంకు ఖాతాను తప్పని సరిగా అందించాల్సి ఉంది. పరుశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఖాతాల్లోకి ‘సాయం’
సాక్షి, వరంగల్ రూరల్: ఉత్కంఠకు తెరపడింది.. రైతుబంధు పెట్టుబడి పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో రబీలో అందించే రెండో విడత రైతు పెట్టుబడి సాయం అందజేసేందుకు మార్గం సుగమమైంది. మొదటి విడతలో అందించిన విధంగానే రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కోడ్ ప్రభావంతో హడావిడి లేకుండానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించా రు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఖరీఫ్లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేలు ఇలా ఏడాదికి రూ.8 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఖరీఫ్ సాయం అందించారు. ఈ నెల 5 నుంచి రబీ సాయం చెక్కులు పంపిణీ జరగాల్సిండగా శాససభ రద్దుతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలుకు ఎన్నికల సంఘం పలు షరతుల విధించింది. తొలి విడతలో అందుకున్న వారికే.. జిల్లాలో ఖరీఫ్కు 1,69,731 మంది పట్టాదారులుండగా రూ.130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్లో చెక్కులు అందుకున్న వారిలో పలువురు రైతులు మరణించారు. దీంతో రబీలో 1,48,581 మంది పట్టాదారులకు రూ.118,99,94,630 విలువ చేసే 1,49,095 చెక్కులు మంజూరయ్యాయి. ఆరు బ్యాంకులు.. జిల్లాలో ఆరు నోటిఫైడ్ బ్యాంకులను ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఐఓబీ, ఏపీజీవీబీ, సిండికేట్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను గుర్తించారు. ఆయా బ్యాంకుల చెక్కులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కు సంబంధించిన నెక్కొండ, నర్సంపేట, పర్వతగిరి, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతుల 50,573 చెక్కులు జిల్లాకు శనివారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు తీసుకొచ్చారు. వీటిని ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నారు. ఆంధ్రాబ్యాంకుకు నల్లబెల్లి, పరకాల, గీసుకొండ, సంగెం, శాయంపేట మండలాలు, ఎస్బీఐకి దామెర, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలు కేటాయించగా సిండికేట్ బ్యాంక్కు రాయపర్తి, కార్పొరేషన్ బ్యాంక్కు ఆత్మకూరు, ఏపీజీవీబీకి ఖానాపూర్ మండలాలకు ఆయా బ్యాంకుల చెక్కులు త్వరలో తీసుకురానున్నారు. మార్గదర్శకాల కోసం.. పెట్టుబడి సాయాన్ని రైతులకు నేరుగా చెక్కులు రూపంలో అందించకుండా ఖాతాలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో చెక్కుల పంపిణీని వ్యవసాయ అధికారులు నిలిపివేశారు. రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు సేకరించి ప్రభుత్వం అందించిన చెక్కులను వారి ఖాతాల్లో జమ చేస్తారా, చెక్కులు బ్యాంకులో వేయకుండా నేరుగా రైతు ఖాతాలోకి ఆర్టీజీఎస్ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో స్పష్టత రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆదేశాలు రాలేదు రైతుబంధు సాయం అందించేందుకు రైతుల నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు సేకరించాలని ఆదేశాలు రాలేదు. చెక్కుల పంపిణీ మాత్రం నిలిపివేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఎలా చెప్పితే అలా పాటిస్తాం. కొన్ని చెక్కులు జిల్లాకు చేరుకున్నాయి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతు ‘చి’క్కులు
సాక్షి, నాగర్కర్నూల్: రైతుబంధు పథకం ద్వారా ఖరీఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. కానీ ఈ రబీలో మాత్రం చెక్కుల పంపిణీకి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. సర్వత్రా అయోమయం పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేస్తారనే విషయం తెలుసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. బ్యాంకుల్లో ఖాతా ఉన్న రైతులు కుదుటగా ఉండగా ఖాతాలు లేనివారు ఆందోళన చెందుతున్నారు. సాగులో పెట్టుబడి అధికమవడం, ఎరువుల ధరలు పెరగడం, చీడపీడల ఉధృతి పెరుగుతుడడంతో ఎకరాలకు రూ.4వేల సాయంతో కొంత ఊరట లభిస్తుందని రైతులు ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలేలా ఉంది. మొదటి విడతలో జిల్లాలోని తిమ్మాజీపేట మండలం కొడుపర్తి, అప్పాయిపల్లి గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాల్సి వచ్చింది. ఆందోళనలో రైతులు రైతుబంధు పథకం కింద జిల్లాకు వచ్చిన చెక్కులను వ్యవసాయాధికారులు భద్రపరిచి పంపిణీకి సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పంపిణీ నిలిపి వేయాలని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్లో తీసుకున్న రైతుల ఖాతాలోకే నేరుగా జమచేయాలని నిర్ధేశించారు. ఈ రబీ సీజన్కు జిల్లాలోని 352 గ్రామాల్లోఉన్న 2,30,766 మంది రైతులకు రూ.266 కోట్ల 91 లక్షల 22వేల 820 లను 2,33,719 చెక్కుల రూపంలో అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదటగా 1,49,800 చెక్కులను పంపిణీ చేయడానికి జిల్లాలోని ఆయా వ్యవసాయ కార్యాలయాలకు చెక్కులు చేరుకున్నాయి. అయితే గతంలో చెక్కులు పొందిన రైతులు ఆధార్కార్డు, పాస్పుస్తకం చూపితే బ్యాంకులో నగదు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఖాతాలో జమచేయాలంటే ప్రతీ రైతుకు ఖాతా ఉండాల్సిందేననే నిబంధ ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఖాతాలేని రైతులు వేలల్లో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఎవరివద్ద కూడా సమాధానం లభించడంలేదు. అధికారుల్లోనూ అస్పష్టత చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతులు ఖాతాలో డబ్బులు జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలనే అంశంపై అధికారుల్లో కూడా స్పస్టత లేకుండా పోయింది. ఖాతాలోనే డబ్బులు జమ చేయాలంటే ప్రతీ రైతు నుంచి ముందు ఖాతా నంబర్ను సేకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకే చాలా సమయం పడుతుంది. ఇకపోతే ఖాతాలేని రైతులకు కొత్త ఖాతాలు తెరిపించి పాస్బుక్కులు ఇచ్చేవరకు చాలా సమయం పడుతుంది. జిల్లాలోని 2,30,766 మంది రైతుల ఖాతా నంబర్లను సేరించాలంటే అధికారులకు తలకు మించిన భారం. సమయం కూడా తక్కువగా ఉండటం, ప్రస్తుతం అధికారులంతా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంలతో ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఒకవేళ శరవేగంగా పనులు ప్రారంభించినా ఎంతవరకు సాధ్యమైతుంది.. అనే అంశంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాతా నంబర్లు సేకరించి వారి ఖాతాలో డబ్బులు జమచేసే వరకు రైతులు పొలం పనుల్లో బిజీగా ఉండే రోజులు వస్తాయి. గత ఖరీఫ్లో అనుకున్న సమయానికి రైతులకు పెట్టుబడి సాయం అందగా ఈ సీజన్లో మాత్రం అందుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పష్టమైన ఆదేశాలు రాలేదు రబీ సీజన్కు సంబంధించి రైతుబంధు చెక్కులనుశనివారం నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రస్తుతం నలిపివేశాం. నేరుగా రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియను ఎలా కొనసాగించాలనే అంశంపై ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1,49,800 చెక్కులు సిద్ధం చేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. – బైరెడ్డి సింగారెడ్డి,జిల్లా వ్యవసాయాధికారి -
రైతుబంధు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యాసంగి పంట సాగుకు పెట్టుబడిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ‘రైతుబంధు’ రెండో విడత కింద ఎకరాకు రూ.4 వేల పంపి ణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. తొలివిడతగా కొత్తూరు మండలం తీగాపూర్లో ఈ పథకం కింద రైతులకు చెక్కులను అందజేసింది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8 వేల నగదును ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా రబీ సీజన్కు సంబంధించిన సొమ్మును పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రైతుబంధు పథకం అమలుపై నీలినీడలు నెలకొన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం పంపిణీపై ఆంక్షలు విధించకపోవడంతో రబీ సాయాన్ని అందజేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, జిల్లా పరిధిలోని రైతులందరికీ సంబంధించిన చెక్కుల ముద్రణ ఇంకా పూర్తికాకపోవడానికి ప్రస్తుతానికి పరిమిత స్థాయిలో చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ భావించింది. అందుకనుగుణంగా తొలు త తీగాపూర్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినా.. దశలవారీగా మిగతా గ్రామాలకు కూడా విస్తరించనున్నారు. ఈ గ్రామ ంలోని 269 మంది రైతులకు రూ.18.71 లక్షల సాయాన్ని పంపిణీ చేశారు. తగ్గిన రైతుల సంఖ్య గత ఖరీఫ్లో రైతుబంధును ప్రవేశపెట్టిన సర్కారు అన్నదాతలకు చెక్కులను అందజేసింది. తొలి విడతలో భాగంగా మే నెలలో 2.87 లక్షల మందికి రైతుబంధు కింద చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. ఆక్షేపణలు, వివాదాస్పద భూములకు పాస్ పుస్తకాలను జారీ చేయకపోవడంతో ఈ భూములకు సంబంధించిన చెక్కులను పక్కన పెట్టింది. కాగా, వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టిన వాటిలో సుమారు 15 వేల పాస్పుస్తకాలను కొత్తగా జారీ చేశారు. దీంతో రైతుబంధు కింద మూడు లక్షల మందికి ఈసారి సాయం అందుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అయితే, అనూహ్యంగా ఈ సంఖ్య భారీగా తగ్గిపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలోకంటే ఈసారి తక్కువ మంది రైతులకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు సంకేతాలు అందడం విస్మయపరుస్తోంది. జిల్లావ్యాప్తంగా 2.68 లక్షల మందికి మాత్రమే సాయం అందించనున్నట్లు తెలిసింది. ఏఏ మండలాల్లో రైతుల సంఖ్య తగ్గిందనే అంశంపై వ్యవసాయశాఖ ఆరా తీస్తోంది. ఇదిలావుండగా, ఖరీఫ్లో ఏడు బ్యాంకుల ద్వారా రైతులకు చెక్కులను అందజేసిన యంత్రాంగం.. ఈసారి 8 బ్యాంకుల ద్వారా రైతుబంధు సాయా న్ని తీసుకునే వెసులుబాటు కల్పించింది. కార్పొరేషన్ బ్యాంకు స్థానే కొత్తగా ఐడీబీఐ, టీజీవీబీ బ్యాంకులను చేర్చింది. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈసారి రైతులకు చెక్కుల స్థానంలో వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేయ నున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
యాసంగికి చేయూత
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోసారి రైతుబంధు చెక్కుల ద్వారా యాసంగి పంటకు రైతులకు చేయూత అందించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో రైతులకు చెక్కులు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి సాయం చెక్కులను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 16 మండలాల్లో 1,43,281 చెక్కుల రూపంలో రబీ సీజన్కు రూ.126.54 కోట్లు పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో చెక్కుల వెరిఫికేషన్ పూర్తిచేశారు. కోడ్ నుంచి మినహాయింపు... రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే చెక్కులకు ఎన్నికల కోడ్ అడ్డువస్తుందని ముందుగా భావించినా.. ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చెక్కుల పంపిణీని పూర్తిచేయాలని భావిస్తున్నారు. రబీ సీజన్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మొదలెట్టారు. జిల్లాలో 3,23,031 ఎకరాల భూమి సాగవుతుండగా.. ఎకరానికి రూ.4 వేల లెక్కన యాసంగి పంటకు రూ.126.54 కోట్లు పంపిణీ చేయనున్నారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్వోఆర్, పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చెక్కులు అందనున్నాయి. చెక్కుల పంపిణీకి ప్రత్యేక బృందాలు... చెక్కుల పంపిణీలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు కీలకంగా వ్యవహరించనున్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాలవారీగా ఆర్ఐలు, వీఆర్వో, వీఆర్ఏలు, ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు సమన్వయంతో చేపట్టనున్నారు. సహకార, ఇతరశాఖలను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చెక్కుల వెరిఫికేన్ను పూర్తిచేసి ట్రెజరీల్లో భద్రపరిచిన అధికారులు శనివారం అన్ని తహసీల్, వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపించి, సోమవారం నుంచి గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు చెక్కులను సరఫరా చేశాయి. రైతు ఖాతాకలిగి ఉన్న సంబంధిత బ్యాంకు బ్రాంచితోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా సంబంధిత బ్యాంకులో నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చెల్లించేలా బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉంచేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గతంలో మాదిరిగానే చెక్కులు విత్డ్రా చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. చెక్కులు పంపిణీకి సిద్ధం రైతు బందు చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయి. రైతులకు అందించాల్సిన చెక్కులన్నింటిని వెరిఫికేషన్ చేసి పంపిణి చేస్తాం. శుక్రవారం తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో లాంఛనంగా ప్రారంభించాం. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రైతులందరికీ పంపిణీ చేస్తాం.– జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ -
రుణాలు లేనట్టే..!
సాక్షి, ఆదిలాబాద్టౌన్: రైతుబంధు పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంపై అయోమయం నెలకొంది. శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కావాల్సిన చెక్కుల పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. అధికారులు చెక్కులు పంపిణీ చేయాలా లేదా అనే అయోమయంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో పంపిణీ కార్యక్రమం ముందుకు సాగుతుందోలేదోనని సందేహం వ్యక్తం అవుతోంది. రైతులు శనివారం నుంచి చెక్కులు పంపిణీ చేస్తారనే సంతోషంలో ఉన్నప్పటికీ శుక్రవారం ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. జాబితాలో కొత్త రైతుల పేర్లు చేర్చవద్దని, ప్రచారం ఆర్భాటాలు, బహిరంగ సభలు నిర్వహించి చెక్కులను పంపిణీ వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏ నుంచి స్వయం ఉపాధి రుణాల కోసం ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఈ ఏడాది రుణాలు రావడం కష్టమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అంతంత మాత్రంగానే నోటిఫికేషన్ను విడుదల చేయడంతో కనీసం స్వయం ఉపాధి రుణాలను పొంది కుటుంబాన్ని పోషించుకుందామని ఆశలు పెట్టుకున్న గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశనే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017–18లో 300 మందికే.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల్లో 1,274 మంది నిరుద్యోగులు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రుణాలు మంజూరు కాగా వీరికి రూ.13.75 కోట్లు అవసరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కేటగిరి 1లో 506 మంది లబ్ధిదారులు, కేటగిరిలో 2లో 621 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి 3లో 147 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం 300 మందికి రూ.3కోట్ల వరకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 974 మంది లబ్ధిదారులు సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. 2018–19లో నిరాశే..? 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద రుణాలను అందించేందుకు వార్షిక ప్రణాళికను తయారు చేసి కమిషనరేట్కు పంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1915 మంది లబ్ధిదారులకు రూ.18.44 కోట్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. కానీ ఇటీవల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్త వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు కావడం కష్టమేనని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. అధికారులు సంబంధిత వార్షిక ప్రణాళికలను ముందస్తుగా ప్రభుత్వానికి పంపించి ఉంటే కోడ్ అమలు కంటే ముందుగానే గిరిజన నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగేదని పలువురు నిరుద్యోగులు పేర్కొంటున్నారు. తప్పని నిరీక్షణ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాల కోసం గిరిజన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికేట్లను సిద్ధంగా చేసుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. తీర ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిరాశ చెందుతున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైన వారికి సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ రుణాలను జమా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. దరఖాస్తులు స్వీకరిచాలి ఎస్సీ కార్పొరేషన్లో ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు కనీసం దరఖాస్తుల స్వీకరణ కోసం కనీసం నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. దీంతో జిల్లాలోని గిరిజన నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. – కుమ్ర రాజు, కుంమ్రంసూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ రుణాల కోసం ఎదురుచూపు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలు రాక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం స్వయం ఉపాధి పథకం కింద రుణాలకు దరఖాస్తు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుదామంటే 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రుణాల కోసం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా సబ్సిడీ జమ కాలేదు. అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ నగదు జమ అయ్యేలా చూడాలి. – ఆత్రం వెంకటేశ్, ఆదివాసీ యువజన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు -
‘రెండో’ చెక్కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయాధికారులు మండలాలవారీగా రైతులకు చెక్కులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. మొదటి విడతగా రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. అందులో కొన్ని లోటుపాట్లు జరగగా.. ఈసారి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు చెక్కుల పంపిణీపై వివరించారు. పాలనాపరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు రైతులకు సంబంధించిన చెక్కులు అందుతుండగా.. వీటిని వ్యవసాయాధికారులు పరిశీలించే పనిని ప్రారంభించారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 2,85,348 మంది రైతులు ఉన్నారు. వారికున్న భూముల ఆధారంగా ఖరీఫ్లో రూ.275.01కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రబీలో కూడా ఇదే మొత్తంలో చెక్కుల రూపంలో రైతులకు అందించనుంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ముందస్తుగా టమకా వేయించాల్సి ఉంటుంది. ఏఓలు, ఏఈఓల ద్వారా రైతులకు తెలియజేసి.. నిర్ణయించిన తేదీల్లో చెక్కులు అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. బ్యాంకులకు చేరుతున్న చెక్కులు రబీ సీజన్ ప్రారంభమవుతుండడంతో రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఐదు మం డలాలకు చెందిన చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. ఖమ్మం రూరల్ మండలానికి రూ.12.99కోట్ల విలువైన 13,436 చెక్కులు, నేలకొండపల్లికి సంబంధించి రూ.13.26కోట్ల విలువైన 16,203 చెక్కులు, తల్లాడకు సంబంధించిన రూ.12.31కోట్ల విలువైన 12,688 చెక్కులు, వేంసూరుకు సంబంధించి రూ.15.09కోట్ల విలువైన 15,227 చెక్కులు, ఎర్రుపాలెంకు సంబంధించి రూ.13.51కోట్ల విలువైన 13,439 చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కూడా చెక్కులు చేరుతున్నాయి. మధిరకు సంబంధించి 16,407, ముదిగొండ 15,404, సత్తుపల్లి 11,004, తిరుమలాయపాలెం 16,774, ఖమ్మంకు సంబంధించి 10,975 చెక్కులు ఐఓబీకి చేరాయి. ఆయా చెక్కులను వ్యవ సా య శాఖ శుక్రవారం నుంచి పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయి లో చెక్కులు మంజూరైన రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఖరీఫ్లో పంపిణీ కాని 20,274 చెక్కులు గత ఖరీఫ్లో 379 రెవెన్యూ గ్రామాల్లోని రూ.15.63కోట్ల విలువైన 20,274 చెక్కులు పంపిణీ కాలేదు. మొత్తం 2,83,756 చెక్కులను పంపిణీకి సిద్ధం చేయగా.. వాటిలో 674 చెక్కులలో తప్పులు దొర్లాయి. 2,68,499 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములకు సంబంధించి 5,691 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కాని 20,274 చెక్కులలో మరణించిన రైతులు.. రెండు ఖాతాలున్నవి.. తమకు సాయం అవసరం లేదని వెనుకకు ఇచ్చినవి.. ప్రభుత్వ భూమికి సంబంధించినవి.. భూ వివాదాలు నెలకొన్నవి.. భూమి లేకపోయినా చెక్కులు జారీ అయినవి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినవి.. చెక్కులలో తప్పులు ఉన్నవి.. ఉన్న భూమి కంటే ఎక్కువ నిధులతో ఉన్న చెక్కులు.. సాగులో లేని భూమికి వచ్చిన చెక్కులు.. ఆధార్ లేని చెక్కులు.. గ్రామాల్లో లేని రైతుల చెక్కులు.. విదేశాల్లో ఉంటున్న రైతులకు సంబంధించినవి.. అమ్మిన భూములకు సంబంధించిన చెక్కులు.. ఆర్ఓఎఫ్ఆర్ పెండింగ్ ఉన్న చెక్కులను పంపిణీ చేయలేదు. విదేశాల్లోని రైతులకూ.. గత ఖరీఫ్లో విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయలేదు. అయితే ప్రభుత్వం వీరికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రైతులకు కూడా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీ కూడా కొనసాగనున్నది. జిల్లాలో మొత్తం 744 చెక్కులకు సంబంధించి రూ.60లక్షలు రైతులకు అందజేయాల్సి ఉంది. చాలా సంతోషం.. తెలంగాణ ప్రభుత్వం అందించే వ్యవసాయ పెట్టుబడి రెండో విడత చెక్కులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మొదటి విడతలో నాకు రూ.14వేలు వచ్చాయి. రెండో విడత కూడా రూ.14వేలు వస్తాయి. ప్రస్తుతం వ్యవసాయం పనులకు చాలా ఉపయోగపడతాయి. – ఎనికె జానకిరామయ్య, రైతు, అప్పలనర్సింహాపురం రైతుకు భరోసా.. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పెట్టుబడి పథకం ఇవ్వడం భరోసా కల్పించింది. నాకు మూడున్నర ఎకరాలకు పెట్టుబడి అందింది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగు చేశాను. ఇప్పుడు వ్యవసాయ పనులకు సరైన సమయంలో రైతుబంధు ఇస్తుండడం మంచి పరిణామం. – అమరగాని వెంకయ్య, రైతు, చెరువుమాదారం పంపిణీకి చర్యలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కుల పంపిణీకి సంబంధించి చర్యలు చేపట్టాం. గతంలో ఖరీఫ్లో నిర్వహించిన విధంగానే చెక్కుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే చెక్కులు బ్యాంకులకు చేరుతున్నాయి. వచ్చిన చెక్కులను సంబంధిత మండలాల అధికారులతో పరిశీలించే పనిని చేపట్టాం. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి -
రైతుబంధు చెక్కుల పంపిణీకి ఆంక్షలతో ఈసీ అనుమతి
-
‘రైతుబంధు’కు షరతులతో ఓకే
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగ దును ట్రాన్స్ఫర్ చేయాలని, చెక్కుల పంపిణీ జరపరాదని తేల్చి చెప్పింది. ముందు గుర్తిం చిన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఐదు ప్రధాన షరతులతో అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ఎస్కే రుడోలా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్కుమార్కు లేఖ రాశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలకు కొత్త లబ్ధిదారుల పేర్లను జత చేయరాదని ఈ లేఖలో ఈసీఐ కోరింది. కార్యక్రమానికి సంబంధించి ప్రచారాన్ని నిర్వహించరాదని స్పష్టం చేసింది. కిట్స్/సామగ్రి, ఇతరాత్ర వస్తువుల పంపిణీకి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని, పెట్టుబడి సహాయం పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలు పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. రైతుబంధు కార్యక్రమానికి సంబంధించి ఈసీఐ నుంచి వచ్చిన మార్గదర్శకాలను సీఈవో కార్యాలయం వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖకు తెలియజేసింది. ఖాతాలను పరిశీలించండి... తక్షణమే రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించాలని, ఇప్పటికే తమ వద్ద ఉన్న లక్షలాది మంది ఖాతాలను మరోసారి పరిశీలించి సరిచూసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు కింద ఖరీఫ్లో ఎంతమంది సొమ్ము తీసుకున్నారో వారి ఖాతాలను సేకరించి తిరిగి 10 నుంచి 15 రోజుల్లో సొమ్ము జమ చేయాలని నిర్ణయించింది. రబీ రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం 11 జిల్లాల్లో అక్కడక్కడా ప్రారంభమైంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్న్ చెక్కుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో శనివారం నుంచి చెక్కుల పంపిణీని నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు ముద్రించిన 30 లక్షల చెక్కులు వృథా కానున్నాయి. 2 లక్షల మంది కొత్తవారికి నిలిపివేత ఖరీఫ్లో పెట్టుబడి సొమ్ము తీసుకున్న రైతులకే రబీ సొమ్ము ఇవ్వాలని, కొత్త రైతులకు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో కొత్త రైతుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 52 లక్షల మందికి రబీలో రైతుబంధు సొమ్ము ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈసారి ధరణి వెబ్సైట్ ద్వారా కొత్తగా మరో 2 లక్షల మంది వరకు రైతులు లబ్ధి పొందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వారందరికీ పెట్టుబడి సొమ్ము దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అయ్యాక వారికి ఇచ్చే అవకాశముంది. కొత్త వారు ఎవరనేది తెలుసుకోవడం కష్టంగా మారిందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. నేడు అత్యవసర సమావేశం రైతుబంధుపై ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రబీ ‘బంధు’కు రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతాంగానికి శుభవార్త. మరో మూడు రోజుల్లో ‘రైతుబంధు’ రెండో విడత సాయం చేతికందనుంది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8వేల నగదు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీ సీజన్కు సంబంధించిన చెక్కులను 5వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చెక్కులను ముద్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పథకానికి మే నెలలో శ్రీకారం చుట్టిన సర్కారు.. ఖరీఫ్కు సంబంధించిన చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ సీజన్ సాయాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 2.87 లక్షల మందికి పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. వివిధ కారణాలతో మిగతావారికి సంబంధించిన చెక్కులను పెండింగ్లో పెట్టింది. ఈ సారి మాత్రం దాదాపు 3లక్షల మంది రైతులకు చెక్కులు జారీ కానున్నాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అభ్యంతరాలతో గతంలో పక్కనపెట్టిన భూములకు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాస్పుస్తకాలను జారీ చేసినందున సుమారు 15వేల మంది రైతులు అదనంగా చేరినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్లో రూ.283.28 కోట్లు పంపిణీ చేసిన యంత్రాంగం తాజాగా రూ.300 కోట్ల మేర రైతులకు అందజేయడానికి సన్నద్ధమవుతోంది. మండల కేంద్రాలతో షురూ.. రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన సర్కారు.. పట్టాదార్పాస్పుస్తకాలు, చెక్కులను ఏకకాలంలో పంపిణీ చేసింది. దీంతోపాటు చెక్కుల్లో ముద్రణా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడింది. ఈ మేరకు రైతుకిచ్చే ప్రతి చెక్కు(లీఫ్)ను సునిశితంగా పరిశీలించింది. ఈ మేరకు నిర్దేశిత బ్యాంకు ప్రధాన కార్యాలయాల్లో వ్యవసాయశాఖాధికారులను అందుబాటులో ఉంచింది. దీంతో నిర్ధిష్ట సమయానికి రైతుల చేతికి సాయం అందింది. ఈ సారి మాత్రం ఈ ఇబ్బందుల నుంచి అధికారులకు విముక్తి కలుగనుంది. ధరణి వెబ్సైట్ నుంచే సమాచారాన్ని సేకరిస్తుండడం.. గతంలో ఒకసారి తప్పులను సరిదిద్దినందున చెక్కులను పరిశీలించే అవకాశంలేకుండా పోయింది. దీంతో వ్యవసాయశాఖాధికారులకు చెక్కుల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జిల్లాలోని రైతుల చెక్కుల పంపిణీ సాధ్యపడదు గనుక.. మండల కేంద్రాల్లోని రైతులకు తొలుత చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మండల కేంద్రాల రైతుల చెక్కుల ముద్రణపై దృష్టి సారించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు కూడా సమాచారం అందజేసింది. మండల కేంద్రంలో మొదలుపెట్టి దశలవారీగా గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించింది. -
నెలముందే పెట్టుబడి చెక్కులు
సాక్షి, హైదరాబాద్ : రబీ పెట్టుబడి చెక్కులను నెల రోజుల ముందే రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల 5 నుంచి చెక్కుల పంపిణీ మొదలు పెట్టాలని యోచిస్తోంది. 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద చెక్కుల పంపిణీపై దృష్టి సారించింది. వాస్తవంగా రబీ సీజన్కు సంబంధించిన రైతుబంధు చెక్కులను నవంబర్లో పంపిణీ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికల హడావుడి ఉంటుంది. ప్రజలు, అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉంటారు. పైగా షెడ్యూల్ జారీ చేశాక పంపిణీ వ్యవహారం క్లిష్టంగా మారనుంది. షెడ్యూల్ వచ్చాక ఎన్నికల కమిషన్ పంపిణీకి అనుమతి ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ముందే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా రిజర్వ్ బ్యాంకుకు ఇటీవల లేఖ రాసి అక్టోబర్లోనే బ్యాంకుల్లో నగదు ఉంచేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే వారం రోజుల్లో పంపిణీ చేసేలా చెక్కుల ముద్రణ చేపట్టాలని బ్యాంకులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈసీ అంగీకరిస్తుందా? గత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు సాయం అందిస్తోంది. రబీలోనూ పంట వేశారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా అందరికీ ఈ సాయం ఇవ్వనున్నారు. ఖరీఫ్లో 50 లక్షల మంది రైతులకు సొమ్ము అందజేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రద్దు కావడం, ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి రైతుకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వ్యవహారం కావడం, ఎన్నికల సమయంలో అంత సొమ్ము అందజేస్తే అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో రైతుబంధుపై ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ‘ఇది కొనసాగుతున్న కార్యక్రమం. పైగా బడ్జెట్లో రెండు సీజన్లకు కలిపి రూ.12 వేల కోట్లు కేటాయించాం. కాబట్టి రబీలో పెట్టుబడి సొమ్ము పంపిణీ అంశంపై మేం ఈసీ అనుమతి తీసుకోం. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అప్పుడు చూస్తాం. అప్పటివరకు మా పని మేం చేసుకుంటూ పోతాం. అక్టోబర్ 5 నుంచి చెక్కుల పంపిణీని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం’ అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఎవరైనా పార్టీ ప్రతినిధి బృందం వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప ఈ కార్యక్రమం నిలిచిపోదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈసీయే నిలిపేస్తే ఏంచేయాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. ఒకవేళ చెక్కుల పంపిణీ వద్దంటే రైతు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము నేరుగా పడేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాలున్నాయని, మిగిలిన రైతులవీ సేకరిస్తామని చెప్పారు. పైగా రబీలో రైతు పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,925 కోట్లకు పరిపాలన అనుమతి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. 52 లక్షల మంది రైతులు.. ఖరీఫ్లో 58.33 లక్షల చెక్కులను వ్యవసాయ శాఖ ముద్రించింది. అందులో 50 లక్షల చెక్కులను రైతులు తీసుకున్నారు. ఈసారి ధరణి వెబ్సైట్ ద్వారా ఎలాంటి వివాదాలు లేని పట్టాదారు రైతులు 52 లక్షల మంది తేలినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వారి పేరుతోనే చెక్కులను ముద్రిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఖరీఫ్లో ముద్రించిన చెక్కుల్లో చనిపోయిన రైతులవి, పలు లోపాలతో నిలిపేసినవి, ఇతరత్రా కారణాలతో పంపిణీ చేయనివి ఉన్నాయి. ఆయా పేర్లతో రబీ చెక్కులు ముద్రించబోమని అధికారులు చెబుతున్నారు. ఇక 1.9 లక్షల రైతు ఖాతాల విషయంలో ధరణి వెబ్సైట్లో తప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనివల్ల కొందరు రైతులను అన్యాయం జరిగే అవకాశముందన్న ఆరోపణలు వస్తున్నాయి.