Rythu Bandhu Scheme
-
KTR: తప్పించుకోలేవు రేవంత్..!
-
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
రైతులకు గుడ్ న్యూస్: నేటి నుంచి రైతుబంధు జమ
నల్లగొండ టౌన్ : యాసంగి సీజన్ రైతుబంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు.. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే రూ.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నాం. – సోమగోని అంజయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
రబీ రంది తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్త రుణమాఫీపై కసరత్తు... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
రైతు బంధుపై పరిమితి పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్
-
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
‘రైతు బంధు’ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సీఈసీని కోరడం.. ఈ పథకం గురించి ప్రచార సభల్లో ఎలాంటి ప్రస్తావన చేయకూడదన్న అంశంతోపాటు పలు షరతులను విధిస్తూ సీఈసీ ఈ నెల 25న అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే పోలింగ్కు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానుందని మంత్రి హరీశ్రావు ఈ నెల 25న పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీనిని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్ను, షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి సంబంధించి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ సోమవారం ఉదయం లేఖ రాశారు. రబీ పంటల కోసం రైతుబంధు కింద గత ఐదేళ్లుగా అక్టోబర్–జనవరి మధ్యకాలంలో నగదు సాయం అందిస్తున్నారని, ఇందుకు నిర్దిష్టమైన తేదీలేమీ లేవని సీఈసీ అందులో అభిప్రాయపడింది. నవంబర్ నెలలోనే పంపిణీ చేయాలన్న ప్రాముఖ్యత ఏదీ లేదని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈసీ విధించిన షరతులివే.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతుబంధు అమలుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులను విధించింది. పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చరాదని, నగదు బదిలీపై ఎలాంటి ప్రచారం చేయవద్దని పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలెవరూ భాగస్వాములు కావొద్దని స్పష్టం చేసింది. తాజాగా బీఆర్ఎస్ సర్కారు యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 24 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 2018 నాటి షరతులకు లోబడి నగదు జమ చేస్తామని పేర్కొంది. అయితే సీఈసీ పాత షరతులకు తోడుగా మరిన్ని నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చింది. పోలింగ్కు 48గంటల ముందే నగదు జమ పూర్తికావాలని.. దీనిపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రస్తావన చేయవద్దని ఆదేశించింది. మీ వల్లే ఆగింది.. కాదు మీరే ఆపారు! ఎన్నికల ప్రచారంలో రైతుబంధు రచ్చరచ్చ జరుగుతోంది. సీఈసీ రైతుబంధును ఆపేయడానికి కారణం మీరంటే.. మీరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్నిచోట్లా ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. రైతులకు సాయం అందడం కాంగ్రెస్ పారీ్టకి ఇష్టం లేదని, ఆ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్వన్నీ అబద్ధాలని కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ముందుగానే ఆర్థికసాయం పంపిణీ చేయాలని మేం సూచించామని, కానీ బీఆర్ఎస్ కావాలని జాప్యం చేస్తూ ఎన్నికల స్టంట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పారీ్టలు రెండూ రైతులను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. -
కాంగ్రెస్కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్లీక్ తదితర స్కామ్ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
రైతుబంధుని ఈసీ నిలిపివేయడంపై కవిత అసంతృప్తి
-
రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్రావు మాటలతోనే?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడించింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్ రావు వల్లే రైతుబంధుకు బ్రేక్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇదిలాఉండగా.. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది. కాగా ప్రతీ, ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సహయాన్ని అందిస్తుంది. -
బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇచ్చింది. అయితే, గత వారం బీఆర్ఎస్ అభ్యర్థన మేరకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా, దీనిపై ఫిర్యాదులు రావడంతో రైతుబంధును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. -
రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
-
రైతుబంధుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: మంత్రి హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ అంటూ కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసిందని ఎద్దేవా చేశారు. అన్నదాతలపై కాంగ్రెస్కు కనికరం లేదు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘాటు విమర్శలు చేశారు. కాగా, మంత్రి హరీష్ రావు గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు కేవలం ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో తెలంగాణలో 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారు. రైతుబంధు అనేది కొత్త పథకం కాదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు సార్లు రైతు బంధు అందించాం. 12వ సారి ఇవ్వబోతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం అంటారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది?. రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. స్వయంగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మూడు గంటల కరెంట్ ఇస్తామన్నారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరిస్తున్నాము. ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము’అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా? -
యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్ టన్నులు. గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు? ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
TS: గుడ్న్యూస్.. నేటి నుంచే రైతుబంధు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్ సీజన్) పంటకుగానూ.. 1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్ సర్కార్ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు. రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా.. భాగంగా నేడు(జూన్ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది. ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు. ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు! -
ఇప్పటి వరకు రైతుబంధు రాలేదా?.. వారిందరికీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు.. -
10 రోజుల్లో ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
రైతుబంధు చూపి అన్నిటికీ కోత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఒక్కో రైతుకు రూ.10 వేల సాయం అందిస్తుంటే, కేంద్రం ఒక్కో రైతుకు ఎరువుల రాయితీ రూపంలో ఎకరానికి రూ.18,254 ఇస్తోందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూపి పంట నష్టానికి పరిహారం, పంటల బీమా తదితరాలన్నిటికీ కోతపెట్టిన ముఖ్యమంత్రి.. రైతులను తీవ్ర నష్టాలపాలు చేశారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్ష బాధితులకు అందని సాయం అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కానీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సాయం చేయలేదని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం ద్వారా సాయం అందుతుండగా.. తెలంగాణలో ఈ పథకం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు అప్పగించిన సీఎం.. తాను మహారాష్ట్రలోని బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్లో బిజీగా గడుపుతున్నారన్నారు కేసీఆర్ తనకు తాను దేశ్ కీ నేత అని చెప్పుకుంటున్నారని, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశ్ కీ నేత కాలేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. అక్కడ ఒక్క వార్డు మెంబర్ గెలిచినందుకే సంబరపడుతున్నారన్నారు. హామీలన్నీ తుంగలో తొక్కారు..: సీఎం అవ్వకముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కేంద్రమంత్రి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మొదట్లోనే వారిని మోసం చేశారన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీల అభివృద్ధి.. ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ డిజిటల్ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద ట్రాక్టర్లు ఇస్తుంటే వాటిని బీఆర్ఎస్ నాయకులు వారి బంధువులకు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీల వల్ల ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్రం నిర్మాణాత్మకంగా సబ్సిడీని అందిస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. ఎరువుల సబ్సిడీతో కౌలు రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణలో మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని, ఈ నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకు ఉందని కిషన్రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం దీనికి అవకాశం లేదని చెప్పారు. కవిత అరెస్టు మా చేతుల్లో లేదు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం తమ చేతుల్లో లేదని కిషన్రెడ్డి అన్నారు. ఇది ఈ కేసును పరిశోధిస్తున్న సీబీఐ పరిధిలోని అంశమని చెప్పారు. సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందునే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసన సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 27న పరేడ్ గ్రౌండ్స్లో లక్షమందితో యోగా మహోత్సవం ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనంగా యోగాను ప్రపంచం గుర్తించిందని, ఐక్యరాజ్యసమితితో పాటు 200కు పైగా దేశాల్లో యోగా ప్రజల జీవితాల్లో భాగమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్గా సికింద్రాబాద్లోని పెరేడ్గ్రౌండ్స్లో ఈనెల 27న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం టూరిజం ప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కౌంట్డౌన్ యోగా కార్యక్రమానికి హైదరాబాద్ జంట నగరాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులతో పాటు యోగా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే దేశంలోని ప్రజలందరినీ ఇందుకోసం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాం మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కిషన్రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్కు కూడా ఆహా్వనం పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో కొందరి రుణాలు రెన్యువల్ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. - కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా -
రైతుబంధుపై వీడని సస్పెన్స్.. కొత్త రైతులకు కష్టమే?
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : రైతుబంధు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. బయటకు చెప్పకూడదని వ్యవసాయాధికారులను కట్టడి చేసింది. బయటి వ్యక్తులకే కాదు మీడియాకు కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు జంకుతున్నారు. ఉద్యోగాలు పోతాయనేంతగా భయంతో ‘ఆ ఒక్కటి అడక్కు’ అని మాట దాటేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు నిధులు ఎంతమందికి వచ్చాయన్న లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుండడమే ఇందుకు కారణమని మాత్రం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో కొత్తగా 7,176 మంది రైతులను కలుపుకొని లబి్ధదారుల సంఖ్య 2,78,351 మందికి చేరుకుంది. ఇందుకు రూ.274.10కోట్లకు పైగా పెట్టుబడి సాయం అవసరమవుతోంది. తొలుత ఒకటి, రెండు, మూడెకరాలు వారికి పెట్టుబడి డబ్బులు అందగా, నాలుగు నుంచి ఆరెకరాల్లోపు ఉన్న రైతులకు ఆలస్యంగా అందాయి. ప్రస్తుతం ఆరు ఎకరాలకు పైగా ఉన్న వారికి ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పక్షం రోజులవుతున్నా తమకు రైతుబంధు రాలేదని రైతులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా డబ్బులు తప్పకుండా పడతాయని అధికారులు వారికి సముదాయిస్తున్నారు. కానీ, వరినాట్లు దాదాపు పూర్తయినప్పటికీ పంట సాయం అందకపోవడం పట్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎరువులు, మందుల కొనుగోలుకు చేతిలో పైసల్లేక అప్పు తెచ్చుకుంటున్నారు. కొత్త రైతులకు అనుమానమే.. జిల్లాలో రైతుబంధు పొందే లబ్ధిదారుల జాబితాలో కొత్తగా పట్టాపాసు పుస్తకాలు పొందిన 7,176 మంది రైతులను చేర్చింది. అర్హత ఉన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తుతో పాటు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్లను మండల వ్యవసాయాధికారులకు అందజేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ రైతుల పేర్లను మాత్రం రైతుబంధు పోర్టల్లో ఇంకా నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయాధికారులు రైతుల వివరాలను ఎంట్రీ చేయలేకపోతున్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ మండల కార్యాలయాల్లోనే పడున్నాయి. తద్వారా కొత్త రైతులకు యాసంగి పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఎల్ఏ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ను కొత్త పాస్పుస్తకాలు పొందిన రైతుల వివరాలు అందలేదని తెలుస్తోంది. -
వారికి రైతుబంధు రానట్టేనా?
సాక్షి, యాదాద్రి : కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైనే ఉన్నారు. 5,495 మంది దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఇటీవల సమస్యలను పరిష్కరించడంతో జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8 వేల మందికి పైగా రైతులు కొత్త పాస్ పుస్తకాలు పొందారు. వీరిలో 5,495 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా 2,500 మందికి పైగా దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్ 20లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు.దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశలో రైతులు వానాకాలం సీజన్లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ çవెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాలు పంపని సీసీఎల్ఏ నూతనంగా పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. దీంతో వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్ బుక్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.కానీ, వెబ్సైట్లో వారి వివరాలు చూపడం లేదు. డేటా వస్తే జమ చేస్తాం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్ఏ నుంచి మాకు రాలేదు. డేటాలో పట్టాదారు పాస్ బుక్ నంబర్, రైతు పేరు ఉంటుంది. ఈ వివరాలు సీసీఎల్ఏ నుంచి మాకు వస్తేనే నిర్ణీత ఫార్మాట్లో రైతుల బ్యాంకు అకౌంట్ నంబర్ అప్లోడ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. గత సీజన్లలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందింది. మాకు డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంటకు అందించే రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ఎకరం నుంచి ప్రారంభమై వరుసగా నిధుల విడుదల చేయనున్నారు. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. చదవండి: కాంగ్రెస్లో మరింత ముదిరిన సంక్షోభం.. పదవులకు 13 మంది రాజీనామా -
28 నుంచి ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది. కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుబంధు ఆగదు: మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగదని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. సీఎం కేసీ ఆర్కు నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సీఎం కేసీఆర్పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్) -
ఆ భూములకు రైతు ‘బంద్’!
రవీంద్రనాథ్ (పేరు మార్చాం)కు హైదరాబాద్ శివారులో ఐదెకరాల భూమి ఉంది. దానికి వ్యవసాయ పట్టా ఉంది. ఆ భూమిలో విల్లాలు నిర్మించారు. కానీ వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉండటంతో ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుబంధు అందుతోంది. రికార్డుల ప్రకారం భూమిలో ద్రాక్ష తోట అని ఉంది. రాజశేఖర్ (పేరు మార్పు) పేరుతో రంగారెడ్డి జిల్లాలో పదెకరాల భూమి ఉంది. అంతా వ్యవసాయ పట్టా భూమి. కానీ ఆ భూమిలో పంటలు పండట్లేదు. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. కానీ వ్యవసాయ పట్టా ఉండటంతో ఏడాదికి రూ. లక్ష రైతుబంధు అందుకుంటున్నాడు. రికార్డుల ప్రకారం అందులో కూరగాయల సాగు చేస్తున్నట్లు ఉంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు గుర్రుగా ఉంది. వాణిజ్య లావాదేవీలు, ఇతరత్రా అవసరాలకు వాడే భూములకు వ్యవసాయ పట్టా ఉంటే రైతుబంధును నిలిపేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. రైతుబంధు స్ఫూర్తికి విరుద్ధం 2018–19 వ్యవసాయ సీజన్ నుంచి రైతుబంధు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. మొదట్లో ఓ సీజన్కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021–22 వ్యవసాయ సీజన్లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది. నాలా మార్పిడి చేయకుండా వ్యవసాయ భూమిగానే.. రైతుబంధును కొందరు ధనవంతులైన సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర ధనవంతులు కూడా తీసుకుంటు న్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే వీటిని ప్రభు త్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాణిజ్య కార్యకలా పాల్లో, వ్యవసాయేతర రంగాల్లో ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చర్చ జరగ డంతో దానిపై దృష్టి పెట్టింది. కొన్ని భూముల్లో పరిశ్రమలు, విల్లాలు, ఇళ్లు ఉన్నా వాటిని నాలా మార్పిడి చేయకపోవ డంతో వ్యవసాయ పట్టా భూములుగా చలామణి అవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ వానాకాలం సీజన్ రైతుబంధును త్వరలో విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు. -
హైదరాబాద్లో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఆ మూడింటిపైనే కేసీఆర్ సర్కార్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దళిత సంక్షేమం, వ్యవసాయం, వైద్య, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి బడ్జెట్ ఉంటుందని సమాచారం. గత ఏడాది ప్రతిపాదించిన రూ.2.30 లక్షల కోట్ల అంచనాలతో పోలిస్తే.. ఈసారి బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022–23 సంవత్సరానికి అవసరమయ్యే నిధుల కోసం శాఖల వారీగా అంచనాల ప్రతిపాదనలు గత నెలాఖరులోనే ఆర్థిక శాఖకు చేరాయి. వీటితోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరణల బడ్జెట్ ప్రతిపాదనలు కూడా అన్ని శాఖల నుంచి అందాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వీటన్నింటినీ సమీక్షించి.. ఆచితూచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈనెల 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్ సమీక్ష సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ సూచనల మేరకు బడ్జెట్కు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్ర బడ్జెట్ను ఏటా మార్చి నెలలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా.. ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సొంత పన్ను ఆదాయం పెరగడంతో.. ఈసారి బడ్జెట్ గణాంకాలపై రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం గణనీయ ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందటి రెండేళ్లతో పోలిస్తే 2021–22లో సొంత పన్నుల ఆదా యం భారీగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో డిసెంబర్నాటికి నాలుగు ప్రధాన పన్ను ఆదాయాలు రూ.48 వేల కోట్లమేర రాగా.. కరోనాతో ప్రభావితమైన 2020–21లో రూ.44 వేల కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.65వేల కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెండుసార్లు భూముల ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ పెంపు, ఎక్సైజ్ విధానంలో మార్పులు, జీఎస్టీ, అమ్మకపు పన్ను వసూళ్లలో పకడ్బందీగా ముందుకెళ్లడంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే.. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం కంటే.. 10 శాతం ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ మూడూ కీలకం! ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో మూడు అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టు తెలిసింది. గత ఏడాదిలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులను బట్టి దళితబంధు, వ్యవసాయం–రైతులు, విద్య–వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. సాగునీటి బడ్జెట్కు గత బడ్జెట్ తరహాలోనే కేటాయింపులు ఉంటాయని, పాలమూరు లిఫ్టుతోపాటు కృష్ణా బేసిన్లో పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలకు యథాతథంగా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నాయి. దళిత బంధుకు రూ.20 వేలకోట్లు! ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి ఈసారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దళిత సాధికారత పేరుతో రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ ఈ క్రమంలోనే ప్రభుత్వ ‘దళిత బంధు’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రంలోని 15–16 లక్షల కుటుంబాలకు సాయం అందించాలని, ఇందుకోసం దశలవారీగా ప్రతిపాదనలు చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే సూచించారు. వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. దీంతో బడ్జెట్లో దళితబంధుకు పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. రైతుల కోసం మరో కొత్త పథకం? బడ్జెట్లో ప్రాధాన్యాల్లో మరో కీలక అంశంగా వ్యవసాయం–రైతుల అంశాలను తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.14,800 కోట్లు రైతుబంధుకు, రూ.5వేల కోట్లకుపైగా రుణమాఫీ కోసం, రూ.1,200 కోట్ల వరకు రైతు బీమా కోసం ప్రతిపాదించారు. వీటిని కొనసాగిస్తూనే.. ఈసారి రైతుల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వైద్యం–విద్యకు పెద్దపీట ఈసారి బడ్జెట్లో వైద్య, విద్యా రంగాలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా వంటి ఆరోగ్య విపత్తులు ఎప్పుడు వచ్చినా తట్టుకునేందుకు వీలుగా వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో ప్రత్యేక సౌకర్యాల కల్పన, ఇతర చర్యల కోసం వైద్యారోగ్య శాఖకు గతేడాది కంటే రూ.10 వేల కోట్ల మేర అధికంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇక విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ క్లాస్రూంల ఏర్పాటుపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్తున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక విద్యకు రూ.13వేల కోట్ల వరకు కేటాయిస్తారని సమాచారం. -
‘రైతు బంధు’ సంబరాలు
సత్తుపల్లి: రైతుబంధు పథకానికి రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సత్తుపల్లి మండలం గంగారంలో మంగళవారం రైతుబంధు సంబురాలను రంగవల్లులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతువేదిక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రైతుబంధు పథకం కింద 80వేల మంది రైతులకు రూ.5.67 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, రైతు సంఘం కన్వీనర్ గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, ఎస్కె రఫీ, మాదిరాజు వాసు పాల్గొన్నారు. వేంసూరు: మండల పరిధిలోని దూళ్లకోత్తురులో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. 70 ఏళ్లలో ఎన్నడు చూడని పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, మండల రైతుబంధు అధ్యక్షులు వెల్ధి జగన్మోహన్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. వైరారూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ.. ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండలంలోని కొండకొడిమలో మంగళవారం నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ, సర్పంచ్ దొంతెబోయిన శ్రీను, ఎంపీటీసీ రాయల రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏడీఏ బాబురావు, ఏఓ ఎస్.పవన్కుమార్, ఏఈఓ వెంకటనర్సయ్య తదితరులున్నారు. మధిర: మధిర వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ పాలాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చావా వేణు తదితరులు పాల్గొన్నారు. -
రైతు‘బంధువులు’ పెరిగారు!
సాక్షి, హైదరాబాద్: సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి సీజన్లో రైతుబంధు సాయం పొందేవారి సంఖ్య సగటున లక్ష వరకు పెరుగుతోంది. 2018, ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ఎకరానికి రూ.4 వేల సాయం చొప్పున ఇవ్వగా.. ఏడాది తర్వాత నుంచి ఎకరాకు రూ.5 వేలు అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం రబీ సీజన్ నిధులను త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 17 లక్షల ఎకరాలకు పరిష్కారం... వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో యజ మానుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వివాదం ఉన్న భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పెద్ద సంఖ్యలో భూ యజమానులు లావాదేవీలు సాగిం చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ధరణిలో సాంకేతికతను అప్డేట్ చేస్తుండటంతో మ్యూ టేషన్, సక్సెషన్ లాంటి అపరిష్కృత సమస్యలకు ప రిష్కారం లభించింది. ఆయా లబ్ధిదారులంతా రై తుబంధు సాయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య, భూ విస్తీర్ణం పెరుగుతోంది. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 17 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమవుతోంది. సీసీఎల్ఏ గణాంకాల్లో... సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా ఇప్పుడు రెవెన్యూ విభాగం పర్యవేక్షిస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన క్షణాల్లోనే పోర్టల్లో వివరాలు మారిపోతుంటాయి. రిజిస్ట్రేషన్ కాగానే లబ్ధిదారుకు మ్యూటేషన్ పూర్తయి పాసు పుస్తకం ప్రింట్ కాపీని ఇస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పోస్టు ద్వారా పాసుపుస్తకం లబ్ధిదారు ఇంటికి చేరుతుంది. ఈ క్రమంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం గణాంకాల ప్రకారం.. 63.25 లక్షల మంది పేరిట 1.50 కోట్ల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లెక్కన లబ్ధిదారులకు రూ.7,508.78 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ లెక్కన రబీ సీజన్లో లబ్ధిదారుల సంఖ్య అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అప్పులు తెచ్చిన తిప్పలు.. మహిళ బతికుండగానే ‘చంపేశాడు’
సాక్షి, పరిగి: తాను చేసిన అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బతికుండగానే ఓ మహిళా రైతు చనిపోయినట్లు దస్తావేజులు సృష్టించాడో ప్రబుద్ధుడు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల అమాయకత్వం,నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఆమె పేరున వచ్చిన రైతు బీమా డబ్బులు కాజేశాడు. కుల్కచర్ల మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మిరెడ్డి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్కు చెందిన రాఘవేందర్రెడ్డి (45) గ్రామంలో వ్యవసాయం చేయటంతో పాటు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈజీగా డబ్బులు సంపాదించి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. బతికుండగానే చంద్రమ్మ అనే మహిళ చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ఆమె పేరున వచ్చిన రైతుబీమా డబ్బులు కాజేశాడు. బాధితురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ రాఘవేందర్రెడ్డి ఇంట్లో చాలాకాలంగా పనిచేస్తూ వస్తుంది. ఆమె కుమారుడు బాలయ్య కూడా నిరక్షరాశ్యుడు. చంద్రమ్మకు ప్రస్తుతం 57 సంవత్సరాలు ఉండటంతో మరో ఏడాదిలో ఆమెకు రైతు బీమా వర్తించకుండా పోతుంది. దీంతో ఆమె బీమాను రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావించిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి పక్కా ప్లాన్తో ఆమె పేరున రైతు బీమా కాజేశాడు. ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్ తయారీ.. బీమా డబ్బులు రావాలంటే బాధితురాలు చంద్రమ్మ చనిపోయినట్టుగా నిరూపించే డెత్ సర్టిఫికెట్ అవసరమని గుర్తించిన నిందితుడు సర్టిఫికెట్ కోసం మహబూబ్నగర్కు వెళ్లి గ్రామ పంచాయతీ ముద్రలు కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. వాటితో సర్టిఫికెట్ తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేశాడు. సదరు మహళ కుటుంబ సభ్యులు నిందితుడి ఇంట్లో పనిచేసే వ్యక్తులే కావటంతో ఏదో అవసరం ఉందని నమ్మించి వారి నుంచి ఆధార్ కార్డులు తెప్పించుకున్నాడు. అనంతరం అన్ని వివరాలతో రైతు బీమా పోర్టల్లో అన్ని పత్రాలు అప్లోడ్ చేసి రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఫిజికల్గా విచారణ చేయాల్సిన ఏఈఓ సత్తార్.. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అయిన రాఘవేందర్రెడ్డికే ఫోన్చేసి చంద్రమ్మ మృతి విషయమై విచారణ చేశాడు. అతను చంద్రమ్మ మృతి చెందిన విషయం వాస్తవమే అని తెలపటంతో ఏఈఓ విచారణ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశాడు. నగదు జమవ్వగానే.. కొద్దిరోజుల తర్వాత చంద్రమ్మకు నామినీగా ఉన్న ఆమె కుమారుడు బాలయ్య బ్యాంకు ఖాతాలో రైతుబీమా నగదు జమయ్యాయి. విషయం తెలుసుకున్న రాఘవేందర్రెడ్డి తాను ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు నీ ఖాతాలో వేయించానని బాలయ్యను నమ్మించి రూ.5 లక్షల బీమా డబ్బులు బాలయ్య ఖాతా నుంచి తన స్నేహితుడైన మధు ఖాతాలో దఫదఫాలుగా వేయించుకుని తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు. రైతుబంధు రాకపోవటంతో.. అయితే చంద్రమ్మ మృతి చెందినట్లు సర్టిఫికెట్లు సృష్టించి బీమా డబ్బులు నొక్కేయటంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో పడాల్సిన రైతు బంధు డబ్బులు జమకాలేదు. దీంతో ఆమె కుమారుడు బాలయ్య రైతుబంధు డబ్బుల విషయమై రాఘవేందర్రెడ్డిని అడిగాడు. పలుమార్లు అడిగినా అతను స్పందించకపోవటంతో వేరే వారికి చెప్పి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయమై రెండు, మూడు రోజులుగా ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈఓ సత్తార్పై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ రాశారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ప్రస్తుతం రూ.80వేలు ఉండగా అవి సీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు కూడా లేఖ రాశారు. కుల్కచర్ల ఎస్ఐ విఠల్రెడ్డి, పరిగి ఎస్ఐ క్రాంతికుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో ఉన్నారు. -
సాక్షి పరిశోధన: పెట్టుబడి సాయం.. గుట్టుగా మాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్ (గడ్డం రాజిరెడ్డి): ఇది శ్రీ రాంసాగర్ ముంపు ప్రాంతం. ఇలా ముంపులో ఉన్న భూములకూ రైతు బంధు సాయం అందుతుండటం విస్మయం కలిగిస్తోంది. పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం శ్రీరాంసాగర్ నిర్మాణానికి ఈ భూమిని సేకరించారు. ఈ భూములకు రైతుల పేర్లను తీసివేసి అధికారులు మ్యుటేషన్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భూములుగా మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ వందలాది ఎకరాలు రైతుల పేర్లపైనే ఉన్నాయి. అంతేకాదు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఇలాంటి భూములను రైతుబంధు పథకం నుంచి తొలగించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో కొందరు.. రైతుల పేరిట ఈ ప్రాజెక్టు ముంపు భూములకు పెట్టుబడి సాయం పొందుతున్నారు. ఒక్క బాసర మండలంలోనే 2,863 ఎకరాల భూములకు రైతుబంధు అందినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, నందిపేట, బాల్కొండ తదితర మండలాల్లోనూ శ్రీరాంసాగర్ ముంపు గ్రామాలు ఉన్నాయి. కొందరు అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రైతుబంధు కింద తొలిసారి 2018 వానాకాలం (ఖరీఫ్) సీజన్లో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన ప్రభుత్వం, 2019 వానాకాలం నుంచి ఎకరానికి రూ. 5 వేలు చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ► ఈ పథకం కింద అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులు (4,72,983) లబ్ధి పొందుతుండగా, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో అతి తక్కువ మందికి (39,762) పెట్టుబడి సాయం అందుతోంది. ►సాగు భూమి ఉన్న ప్రతి రైతుకూ గరిష్ట పరిమితి లేకుండా అమలు చేస్తున్న పథకం మంచిదే అయినా.. వ్యవసాయ భూములేవో, ఇతర భూములేవో పరిశీలించకుండా పాస్ పుస్తకాలున్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం ఇస్తుండటంతో పెద్దమొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాలనీ భూమికీ ‘బంధు’వే ఏళ్ల క్రితం ఏర్పడిన ఓ కాలనీ భూమికీ రైతు బంధు నిధులు అందుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన భూమి పేరిట ఆ గ్రామానికి చెందిన కంచర్ల మనోహరమ్మ ఇప్పటివరకు 6 పర్యాయాలు పెట్టుబడి సాయం పొందింది. సుమారు 50 ఏళ్ల క్రితం కంచర్ల మల్లారెడ్డి 163/1 సర్వే నంబర్లోని 3.39 ఎకరాల భూమిని ఎస్సీ కాలనీ కోసం ఇచ్చాడు. అతనికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. అయితే ఈ భూమి రికార్డులో మల్లారెడ్డి పేరును అధికారులు తొలగించలేదు. దీంతో 2018 వరకు మల్లారెడ్డి పేరిటే రికార్డులో ఉంది. తర్వాత ఆయన కుమారుడు అశోక్రెడ్డి తన తండ్రి పేరు స్థానంలో తల్లి మనోహరమ్మ పేరు చేర్పించి రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి కాలనీగా ఉన్న భూమికి పట్టా చేయించాడు. దీంతో అప్పటినుంచి రైతుబంధు నిధులు మనోహరమ్మ ఖాతాలో జమ అవుతున్నాయి. దీనిపై మనోహరమ్మ పాలి వారైన కంచర్ల మహేందర్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 12న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆరో విడత రైతుబంధు మనోహరమ్మ పొందడం గమనార్హం. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కలెక్టరేట్కు నివేదిక పంపామని తహసీల్దార్ షేక్ అహ్మద్ చెప్పారు. దత్తప్పగూడెం ఎస్సీ కాలనీ ఇవే కాదు.. వ్యవసాయ భూముల్లో ఏళ్ల క్రితమే కాలనీలుగా ఏర్పడినా, అప్పట్లో ఎవరైతే రైతులు భూమిని విక్రయించారో అదే రైతుల ఖాతాల్లోకి కూడా నగదు వెళ్తోంది. అదే విధంగా వ్యవసాయ యోగ్యం కాని గుట్టలు, చెరువులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు (పట్టాభూములుగా చూపినవాటికి) సైతం రైతుబంధు అందుతోందని ‘సాక్షి’పరిశీలనలో తేలింది. కళాశాలలు, ఫంక్షన్ హాళ్లకు కూడా చాలాచోట్ల పెట్టుబడి సాయం అందుతోందనే ఆరోపణలున్నాయి. పొలం ఉన్నా, పెట్టుబడి డబ్బులు లేక ఎప్పటికప్పుడు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తూ.. కాలం కలిసి రాక రుణాల ఊబిలో చిక్కుకుపోతున్న రైతన్నలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’పథకం ప్రవేశపెట్టింది. తొలిసారిగా 2018 – 19 ఖరీఫ్ సీజన్ నుండి, ఈ వ్యవసాయ ప్రారంభ పెట్టుబడి సహాయ పథకం అమలు చేస్తోంది. అప్పట్నుంచీ ప్రతి సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతుల జాబితాలను తయారు చేస్తున్న వ్యవసాయ శాఖ వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. 2018 నుంచి 2021 జూన్ వరకు ఏడు పంట సీజన్లకు మొత్తం రూ.46,186.67 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 2018 – 19లో రూ.12 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది (2021 – 22)లో వానాకాలం, యాసంగి (రబీ) సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 63.25 లక్షల మంది రైతులకు 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు (జూన్ 15 నుంచి 25 వరకు) జమ చేసింది. అయితే వీటిల్లో కోట్ల రూపాయల నిధులు.. అక్రమార్కులు కొట్టేస్తున్నారు. రైతుబంధుపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా దిద్దుబాటు జరగక పోవడం శోచనీయం. ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు రైతుబంధు పథకాన్ని అందివచ్చిన అవకాశంగా మార్చుకున్న అధికారులు దీన్ని అమలు చేసే క్రమంలో చాలాచోట్ల ఇష్టారాజ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని కూడా కొన్నిచోట్ల తుంగలో తొక్కారు. పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి యాజమాన్య హక్కులు కల్పించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. కొత్తగా ఓ పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తున్నామంటే ఆ భూమికి సంబంధించిన పూర్తి దస్త్రాల నివేదికను కింది స్థాయి అధికారులు ఇవ్వాలి. ముఖ్యంగా 1/70 (అటవీ హక్కుల చట్టం) ఉన్న ప్రాంతంలో ఆర్ఓఆర్, టైటిల్ డీడ్లు వంటి పూర్తిస్థాయి దస్త్రాలు ఉండాలి. అలాంటి దస్త్రాలు ఉన్న భూములకే పుస్తకాలు ఇవ్వాలి. కానీ గిరిజనేతరులకు విక్రయించిన భూములకు కూడా యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. మామూలు పరిస్థితుల్లో కూడా సర్వేయర్తో పాటు వీఆర్వో, ఆర్ఐలు సంబంధిత భూస్వరూపం, పట్టాదారుకు సంబంధించిన పూర్తి దస్త్రాలకు సంబంధించిన నివేదికకు అనుగుణంగానే పాస్ పుస్తకాలు జారీ చేయాలి. కానీ చాలాచోట్ల అధికారులు, సిబ్బంది కుమ్మౖMð్క ఇష్టారాజ్యంగా ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుట్టల భూములకూ ఇచ్చారు.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, ముస్తఫాపూర్ గ్రామాలలో సుమారు 700 ఎకరాలు గుట్టలను కలుపుకొని ఉంది. మహ్మద్ ఖాద్రి పేరిట ముస్తఫాపూర్లో సర్వే నంబర్లు 211, 216లో 500 ఎకరాలు ఉంటుంది. కొత్తకొండలో సుధీర్రెడ్డి పేరిట 564 సర్వే నంబర్లో 200 ఎకరాలు గుట్టలను కలుపుకునే ఉంది. రైతుబంధు ప్రారంభంలో ఈ మూడు సర్వేనంబర్లలో ఉన్న కొంతభూమికి పెట్టుబడి సాయం అందింది. ఈ క్రమంలో మొత్తం భూములకు పాసుబుక్కులు ఇచ్చి రైతుబంధు ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి తహసీల్దార్ ఇటీవల మొత్తానికీ రద్దు చేసి డిజిటల్ సైన్ పెండింగ్లో పెట్టారు. వ్యవసాయేతర భూమిగా మార్చినా.. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, సైదాపురం గ్రామంలో సర్వే నంబర్లు 17, 18, 19, 20లో ఉన్న సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమిని 2015లో రెవెన్యూ శాఖ వ్యవసాయేతర భూమిగా మార్చింది. అప్పట్లోనే ఈ భూమిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయం జరిపింది. నాలా కనెక్షన్ కూడా మంజూరైంది. ఇలా ప్లాట్లు అయిన ఈ వెంచర్ను విచిత్రంగా వ్యవసాయ భూమిగా పేర్కొంటూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ భూములకు రైతుబంధు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వెంచర్ భూములతో వంచన వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో 419, 445, 446, 447, 453, 454, 465 సర్వే నంబర్లలోని 22 ఎకరాల్లో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. ఎకరం రూ.70 లక్షల నుంచి 80లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు గజాల చొప్పున విక్రయించారు. అయితే ఈ భూమికి రైతుబంధు పడుతుండటం వివాదాస్పదం అవుతోంది. అలాగే ధర్మసాగర్ మండలం పెండ్యాల శివారు 2 సర్వే నంబర్లలోని 12 ఎకరాల వెంచర్ భూమికీ పెట్టుబడి సాయం అందుతోంది. ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శివారు శివునిపల్లి సమీపంలోని ఓ వెంచర్ 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రవీందర్రెడ్డికి చెందిన సర్వే నంబర్ 510, 511, 512 లో ఉన్న ఈ భూమిని, మూడేళ్ల క్రితం స్టేషన్ ఘన్పూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. దీనికీ రైతుబంధు పొందుతున్నారు. అటవీ చట్టానికి తూట్లు పూర్వ ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెంలో ఓ దళారీతో చేతులు కలిపిన అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీనివాసపురం, గోగుబాక, రాళ్లగూడెం, సత్యనారాయణపురం, చినమిడిసిలేరు(జి), తేగడ(జడ్), వీరాపురం, జి.పి.పల్లి, చింతకుంట, లింగాల, చర్ల గ్రామాల్లోని భూములకు సంబంధించి 1/70 (అటవీ హక్కుల చట్టం)కు విరుద్ధంగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల భూమిని ఇతరులెవరికీ బదలాయించడానికి వీల్లేదు. కానీ తేగడ (జడ్)లో ఓ రైతుకు సంబంధించిన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించి పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. జి.పి.పల్లి (జడ్)లో ఓ వ్యక్తికి చెందిన 10.30 ఎకరాలను సబ్ డివిజన్లుగా మార్పు చేసి అనువంశికంగా వీలునామాలు సృష్టించి పట్టాదారు పుస్తకాలను జారీ చేశారు. రైతుబంధు అందేలా ఈ పుస్తకాల జారీకి సంబంధించి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడం వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత రద్దు చేశారు. నారాయణపురానికి నయాపైసా రాలే.. అక్రమాల్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కానీ మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామంలో మాత్రం రైతుబంధు ఇవ్వడం లేదు. ఊరిలో ఉన్న వెయ్యి మంది రైతుల్లో ఏ ఒక్క రైతుకూ సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో చిన్న తండాలు, శివారు గ్రామాలుగా ఉన్న నారాయణపురం, పీకల తండా, క్యాంపు తండాలను నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామం నుంచి వేరు చేసి కొత్తగా నారాయణపురం రెవెన్యూ విలేజ్గా మార్చారు. అనంతరం గ్రామాన్ని కేసముద్రం మండలంలో కలిపారు. దీంతో ఆ గ్రామ రైతుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గ్రామంలోని 1,827 ఎకరాల భూమిని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అటవీ భూముల్లో కలిపేశారు. వాస్తవానికి 1952కు ముందు ఈ భూములు అటవీ శాఖ పరిధిలోనే ఉన్నాయి. కానీ 1952 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అటవీ శాఖ నుంచి వెనక్కు తీసుకుని రైతులకు పంపిణీ చేసింది. అయితే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో రికార్డులు మార్చలేదు. దీంతో అవి అటవీ శాఖకు చెందిన సర్వే నంబర్ల పైనే కొనసాగుతూ వచ్చాయి. ప్రక్షాళనలో ఆ భూముల్లో 1,605 ఎకరాలను రిజర్వ్ ఫారెస్టులో ఉన్న పట్టా భూములుగా, మరో 222 ఎకరాలు పట్టా భూమిగా సర్కారు గుర్తించింది. నారాయణపురం రెవెన్యూ గ్రామంగా మారి వేరొక మండలంలో కలవడంతో ఏర్పడిన గందరగోళం, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు లేకపోవడంతో 1,605 ఎకరాలకు రైతుబంధు అందడం లేదు. దీంతో ఆ గ్రామ ప్రజలు పలుమార్లు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభను, సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నారాయణపురం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిలిచిపోయిందని ఇటీవల ఫారెస్టు క్లియరెన్స్ రావడంతో, వీరికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కేసముద్రం తహసీల్దార్ కోమల తెలిపారు. పహాణీల జాబితాను గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రదర్శించామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరు సర్వే నంబర్లలో గల రైతుల భూముల్లో ఎంజాయ్మెంట్ సర్వేను ప్రారంభించామని వివరించారు. వారంలో ఈ సర్వే పూర్తి చేస్తామని, రైతులు వారి భూముల్లో ఉండి తమకు సహకరించాలని కోరారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నా.. మరోవైపు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నా కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులకు రైతుబంధు అందడం లేదు. రైతుబంధు కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో గిరిజనులు చాలా ఏండ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. వీరికి 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలను అందజేశారు. అయితే ఇవింకా అధికారిక లెక్కల్లోకి ఎక్కకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రంలో సుమారు 96 వేల మందికి అటవీ హక్కుల గుర్తింపు పత్రాల మేరకు పట్టాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆర్ఓఎఫ్ఆర్ కింద ఉన్నా రైతుబంధు అందని రైతుల సాగు భూములు ముందే నమోదు కావడంతో రైతుబంధు కొన్నిచోట్ల నాలా (వ్యవసాయేతర భూమి) దరఖాస్తు కంటే ముందుగానే రైతుబంధు పథకంలో నమోదు కావడంతో నాలాగా కన్వర్షన్ అయినప్పటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు డబ్బులు జమ అవుతోంది. వచ్చే ఏడాది ఇలాంటి భూములను ఆన్లైన్లో తొలగిస్తాం. అప్పటి నుంచి డబ్బులు రావు. –పి.శ్రీనివాస్, తహసీల్దార్, లింగాలఘణపురం, జనగామ జిల్లా చదవండి: బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు KTR: ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం..! -
రైతు బంధుతో సమస్యలా? ఈ నెంబర్లకు కాల్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ఆదేశాల అనుసరించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని గౌరవనీయ ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 1800-200-1001, 040-33671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. చదవండి: రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు! -
తొలిరోజు రూ. 516 కోట్లు.. నేడు మరో రూ.1,152.46 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కు గాను రైతుబంధు నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఈ జమ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజు 16.95 లక్షల మంది రైతులకు రూ. 516.95 కోట్లు వారి బ్యాంకు ఖాతా ల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 36.10 కోట్లు జమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా లో అత్యల్పంగా 9,628 మంది రైతుల ఖాతా ల్లోకి రూ. 35.60 లక్షలు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10,33,915 ఎకరాలకు చెందిన 16,95,601 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు చేరినట్లు అధికారులు తెలిపారు. రెండోరోజు 2 ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకుగాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,152.46 కోట్లు జమ చేస్తామని వెల్లడించారు. రెండో రోజు కూడా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా1,10,407 మంది రైతుల ఖాతాలకు రూ. 85.23 కోట్లు జమ చేస్తారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయ మంత్రి నిరం జన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి హరీశ్రావు కూడా ట్విట్టర్ వేదికగా మొదటి రోజు రైతుల ఖాతా ల్లో సొమ్ము జమయినట్లు చెప్పారు. రైతులకు అభినందలు తెలిపారు. కాగా, ఈ సీజ¯Œ లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల (కోటిన్నర) ఎకరాలకు రూ. 7,508.78 కోట్లు రైతుబంధు నిధులు ఇవ్వనున్నారు. -
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడం ఎంతో ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఒక ఎకరా వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుబంధు నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్రావు తెలిపారు. గత సీజన్లో మాదిరిగానే జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 వరకు రైతుబంధు సొమ్ము అందరికీ అందుతుందన్నారు. ఈ సీజన్లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్ల నిధులు అందుతాయి. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది కొత్తగా రైతులు పెరిగిన సంగతి తెలిసిందే. -
మే 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబందు
తెలంగాణ రైతుల ఖాతాలో మే 15 నుంచి 25 వరకు రైతుబందు నగదు జమ కానుంది. ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితాను సీసీఎల్ఏ అందజేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరినట్లు మంత్రి తెలిపారు. మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. చదవండి: పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 నుంచి వచ్చేనెల 7వరకు రైతుబంధు సహాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) నిర్ణయించారు. సోమవారం ఆయన రైతుబంధుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బు జమ చేయాలని తెలిపారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.(చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ) -
ఆదాయం తగ్గినా పథకాలు ఆగవు
సాక్షి, సంగారెడ్డి: లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో, సదాశివపేట మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాల అందజేత కార్యక్రమాలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతినెలా రూ. వెయ్యి కోట్లు ఆసరా పింఛన్ల కోసం నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధుకు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,400 కోట్లు అందించామని వివరించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వారు తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీల వారీగా అర్హులను గుర్తించి ఒక్కొక్కరికీ తక్కువ వడ్డీతో రూ.10 వేలు అందజేస్తున్నామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ‘టెస్ట్ అండ్ ట్రీట్’ కరోనా వైరస్తో ఎవరూ భయపడవద్దని, లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చునని హరీశ్ సూచించారు. పీహెచ్సీలలో సైతం పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వైరస్ గురించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందన్నారు. టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ పద్ధతిలో కరోనా విషయంలో అన్ని సౌకర్యాలు ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. -
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుపడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలవుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (‘పవర్’కు పంప్హౌస్లు) సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. (విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం) -
చిట్ట చివరి రైతు దాకా రైతుబంధు అందాలి
-
రైతుబంధు సాయానికి టైమ్ లిమిట్ లేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని పేర్కొన్నారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. (ఆలయం, మసీదులకు కాకతాళీయంగానే నష్టం) కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసిందని. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందన్నారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అని తెలుసుకునిడబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపిందన్నారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని సూచించారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తుందని, రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. (టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరం) ‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. ఈ విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’ అని సీఎం కేసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. (సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్) -
తక్షణమే రైతుబంధు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదన్నారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ‘ఏడాదికి ఒక ఎకరానికి 10 వేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో రూ. 5 వేలు, యాసంగిలో రూ. 5 వేలు ఇస్తున్నాం. ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం రూ. 7 వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో రూ.1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు సొమ్ము మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడంపట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అభినందనులు తెలిపిన కేసీఆర్... రైతుబంధు డబ్బులను కూడా ఉపయోగించుకొని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... నియంత్రిత సాగు.. ఒక పంట కోసమో లేక ఒక సీజన్ కోసమో ఉద్దేశించినది కాదు. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం చోటుచేసుకుం టున్న నేపథ్యంలో భవిష్యత్లో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్ర బిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటీ 30లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తోంది. నియంత్రిత సాగుతో ఉజ్వల ప్రస్థానానికి తెలంగాణ నాంది పలుకుతుంది. లాభసాటి సాగే ప్రభుత్వ లక్ష్యం.. మార్కెట్లో డిమాండ్గల పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించింది. దీనికి రైతుల నుంచి వంద శాతం మద్దతు లభించింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన పంటల సాగే జరుగుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి, 12,31,284 ఎకరాల్లో కందులు, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్, 60,16,079 ఎకరాల్లో పత్తి, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలసాగు విధానం అమలు చేయడానికి సిద్ధం కావడం హర్షణీయం. రైతుల స్పందన అద్భుతం.. గొప్ప ముందడుగు తెలంగాణ సమాజం పరిణామశీలమైనది. రాష్ట్రంలో చైతన్యవంతమైన రైతాంగం ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక దేశంలోనే గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్వయసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. వ్యవసాయ రంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ఇది గొప్ప ముందడుగు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలవడానికి అమలు చేస్తున్న నియంత్రిత పద్ధతిలో పంటలసాగు వైపు మన రైతులు గొప్పగా తొలి అడుగు వేశారు. యాసంగిలో 45 లక్షల ఎకరాల్లో వరి .. ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడింది. ఇదే స్పూర్తితో యాసంగి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలో రైతులకు మార్గదర్శకం చేయడంతోపాటు ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉండేట్లు చూడాలి. గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితోపాటు మంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10–12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, 6–7 లక్షల ఎకరాల్లో మక్కలు, 4 లక్షల ఎకరాల్లో శనగలు, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాల్లో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులోకి తేవాలి. వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయాలి. పంజాబ్ నేర్పిన పాఠం.. గతంలో పంజాబ్ వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడం వల్ల పంజాబ్లో వ్యవసాయ వైపరీత్యం సంభవించింది. పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసింది. ఎరువుల వాడకంపై ... వేసిన ఎరువంతా వినియోగం కాక భూమిలోనే చాలా పాస్ఫేట్ (బాస్వరం) నిల్వలు పేరుకుపోతున్నాయి. పేరుకుపోయిన బాస్వరాన్ని తొలగించడానికి పాస్ఫేట్ సాల్యబుల్ బ్యాక్టీరియాను వదలడం ద్వారా భూ సారాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఇలాంటి విధానాలను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతోపాటు మార్కెట్లోకి క్రమ పద్ధతిలో సరుకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోదన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా... రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన ఇతర వ్యవస్థలు కూడా వృద్ధి చెందాలి. మిల్లింగ్ వ్యవస్థ పెరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చెప్పిన బహుళ ప్రయోజనాలివీ... నియంత్రిత సాగు వల్ల మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు, మద్దతు ధర సమస్య తలెత్తదు. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఒకే రకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్టవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్టవేసే ప్రమాదం ఉండదు. నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది. భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదు. -
ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుతో పాటు భూమి పాస్బుక్ జిరాక్స్ లేక ఎమ్మార్వోచే డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ (సేవింగ్స్ ఖాతా) తీసుకొని రావాలని సూచించింది. రైతు మాత్రమే వచ్చి దరఖాస్తు ఇవ్వాలని తెలిపింది. -
తెలంగాణలోనే అత్యంత తక్కువ కరోనా పరోక్షలు
-
రైతుబంధు ఎగ్గొట్టేందుకు కుట్ర
సాక్షి. జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నూతన వ్యవసాయ విధానం తుగ్లక్ పాలనను మరిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకే పనికిమాలిన మెలికలు పెడుతోందని మండిపడ్డారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు తగ్గిస్తుంటే.. ఈసారి పత్తి పంట విస్తీర్ణం పెంచాలనడం ఏమిటని ప్రశ్నించారు. కందులు, మినుముల కొనుగోలుకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పది లక్షల మందికి 1,600 పరీక్షలు చేస్తుంటే.. రాష్ట్రంలో 650 మందికి మాత్రమే చేయడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో 22 వేలు మాత్రమే చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చిన విరాళాల వివరాలు వెల్లడించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గల్ఫ్ కార్మికుల క్వారంటైన్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాజీవ్గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు బంధుకు రూ.7 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేయాలనే సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో 5.5 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. వీటితో పాటు మరో రూ.7 వేల కోట్లను రైతు బంధు కింద పెట్టుబడి సాయంగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది’అని ఆయన వెల్లడించారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
రైతుబంధుకు రూ. 5,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధుకు రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, ఆ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019–20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం రూ. 12,862 కోట్లు కేటాయించగా.. ఖరీఫ్లో రూ.6,862 కోట్లు మంజూరు చేశారు. రూ.5,100 కోట్లను రబీలో అందించేందుకు రంగం సిద్ధం చేశారు. నిధుల మం జూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. కాగా, రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. -
‘రైతుబంధు’కు పరిమితిపై ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : ‘రైతుబంధు’పథకం ఎన్ని ఎకరాలకు వర్తింపజేయాలన్న దానిపై పరిమితి విధించాలని ప్రతిపాదించామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ తిరస్కరించారని వెల్లడించారు. సోమవారం నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్లో 94%మంది రైతులకు ‘రైతుబంధు’నిధులు అందాయన్నారు. ఇంకా 6% మందికే ఇవ్వాల్సి ఉందని, వారికికూడా త్వర లోనే ఇస్తామన్నారు. రెన్యూవల్ చేసుకోవాలని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో రుణమాఫీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వేరుశనగ ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్న వనపర్తి జిల్లాలో ప్రత్యేక వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. -
త్వరలోనే ఖాతాల్లోకి ‘రైతుబంధు’
గద్వాల టౌన్: నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో ‘రైతుబంధు’డబ్బును ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం గద్వాలలో లబ్ధిదారులకు పాడి పశువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ‘రైతుబంధు’పై సరైన అవగాహన లేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఎలాంటి కోతలు లేకుండా దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో గద్వాల, అలంపూర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. -
ఒక్క క్లిక్తో కిసాన్ సమ్మాన్, రైతుబంధు స్టేటస్
నాగారం (తుంగతుర్తి): రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం కిసాన్ సమ్మాన్, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏడాదికి 2విడతల్లో ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. పీఎం కిసాన్సమ్మాన్ సమాచారం తెలుసుకునేందుకుప్రభుత్వం www.pmkisan.gov.in లోకి వెళ్లి బెన్ఫిషియర్ స్టేటస్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్నంబర్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంకులో డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుంది. అలాగే రైతుబంధు సమాచారాన్ని కూడా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.https://ifmis.telangana.gov.in లోకి వెళ్లి స్కీంవైజ్ రిపోర్టుపై క్లిక్ చేయాలి. అప్పుడు సంవత్సరం వద్ద 2019–2020 అని, పథకం వద్ద రైతుబంధు అని, కొత్తపట్టాదారుపాస్ బుక్నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సమాచారం తెలుస్తుంది. ఇలా ఇంటర్నెట్ ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. -
రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు
సాక్షి, కామారెడ్డి: అస్తవ్యస్తంగా ఉన్న దశాబ్దాల నాటి భూ రికార్డులను సరిచేయడం కోసం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. రైతుబంధు డబ్బులు నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కిన పలువురు రెవెన్యూ అధికారులు.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని తమ సంబంధికుల పేర్లపై రాసేశారు. కొన్ని సంఘటనలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అక్రమాలపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే భూ వివాదాలు తలెత్తుతున్నాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. 2017 సెప్టెంబర్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు అన్ని గ్రామాలలో రైతుల సమక్షంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. కొందరు అవినీతి అధికారులకు ఈ కార్యక్రమం వరంలా మారింది. అధికారులు రైతుల వద్దనుంచి డబ్బులు తీసుకుని, రికార్డుల ప్రక్షాళన చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి, అక్రమాలకు పాల్పడి జిల్లావ్యాప్తంగా పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ స్థాయి అధికారులు సైతం సస్పెండయ్యారు. ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువుల పేర్లమీదకు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెదలు పట్టించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, తప్పొప్పులను సరి చేయడం, ఫౌతి, వారసత్వ భూముల బదలాయింపు, పట్టామార్పిడీ, సవరణల కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పనిభారం ఎక్కువగా ఉండడంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు ఆన్లైన్లో లాగిన్ తీసుకుని వీఆర్వోలకు, వీఆర్ఏలకు పనులు అప్పగించారు. సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాల్సిన సిబ్బంది.. అవకాశం దొరకడంతో అవకతవకలకు పాల్పడినట్లు చాలా సంఘటనల్లో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు మాత్రమే అధికారుల దృష్టికి వచ్చాయి. మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఎల్లంపేట గ్రామాలకు చెందిన వీఆర్ఏలు, తమ పేర్లమీద, తమ బంధువుల పేర్ల మీద ప్రభుత్వ భూములను రికార్డులలో నమోదు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాడి వీఆర్ఏ సైతం రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను తమ బంధువులు, సన్నిహితుల పేరిట వీఆర్వోలు, వీఆర్ఏలు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లాలో రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం 20 వేలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. రైతుబంధు పథకం డబ్బులను కాజేసేందుకే ఆయా గ్రామాల్లో వీఆర్ఏలు, వీఆర్వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉంది. ఫోన్ఇన్ ద్వారా వెలుగులోకి.. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలనే సంకల్పంతో కలెక్టర్ సత్యనారాయణ రెండు నెలల క్రితం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన జేసీతో కలిసి రోజూ ఉదయం గంట పాటు ఫోన్ ద్వారా రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండలాల అధికారులను ఆదేశిస్తున్నారు. ఫోన్ఇన్లో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యంపైనే ఉంటున్నాయి. ఫోన్ఇన్ ప్రారంభమయ్యాక వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్పడిన అవినీతిని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇలా నలుగురు వీఆర్వోలు, పలువురు వీఆర్ఏలపై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించడంతో జరుగుతున్న అవకతవకలు నిర్ధారణ అయ్యాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లి వీఆర్వో సూర్యవర్ధన్ను వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమార్పేట్ వీఆర్వో మల్లేశ్ విధుల్లో నిర్లక్ష్యం కనబరచడం, ఇతర ఆరోపణలపై సస్పెన్షన్కు గురయ్యారు. ఇసాయిపేట, ఎల్లంపేట వీఆర్ఏలు ప్రభుత్వ భూములను తమ బంధువుల పేర్ల మీదకు మార్చినట్లు రుజువు కావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. వాడి వీఆర్ఏ కూడా గతంలో రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి వీఆర్ఏ నర్సింలు సైతం రికార్డులలో తప్పులు, అనుచిత ప్రవర్తన కారణంగా çసస్పెన్షన్కు గురయ్యారు. నెలరోజుల క్రితం రామారెడ్డి మం డలం మోషంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్ఏలు గ్రామానికి చెందిన మరొకరి భూమిని వారి పేర్ల మీదకు మార్చేందుకు ప్ర యత్నించగా అధికారులకు ఫిరఘ్యదులు వచ్చా యి. విచారణలో వాస్తవమేనని తేలడంతో స స్పెండ్ చేశారు. వీఆర్ఏల పనితీరుపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి. పక్షం రోజుల్లో.. పక్షం రోజుల్లో పలు మండలాలకు చెందిన ఐదుగురు వీఆర్ఏలు, ఇద్దరు వీఆర్వోలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం చూస్తుంటే రెవెన్యూశాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది. జిల్లాలోని మరో వీఆర్వో ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతేగాకుండా రైతుల పేరిట రికార్డులను నమోదు చేయడం, పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పించడంలోనూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. చర్యలు తప్పవు గతంలో రెవెన్యూ రికార్డుల నమోదులో జరిగిన అవకతవకలు మా దృష్టికి వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించాం. తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్, మాచారెడ్డి -
పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు వ్యవసాయం భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. రైతులు శ్రమకోర్చి అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు పంటఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ధరలు పలకడం లేదు. ఫలితంగా పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దుర్భర స్థితిలో పెట్టుబడి సాయం వారికి ఆయువుగా మారింది. ప్రభుత్వం అంజేస్తున్న ఈ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాల్లో జమ అయ్యిందే పాపం.. ఆ సొమ్మును గత పంట రుణం లేదంటే దాని వడ్డీ కింద బ్యాంకర్లు తీసుకుంటున్నారు. కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన రైతులు ఉట్టి చేతులతో తిరుగుముఖం పడుతున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం అందజేస్తున్న సాయం.. రైతు దరికి చేరడం లేదు. ఫలితంగా సర్కారు లక్ష్యంగా నీరుగారుతోంది. బ్యాంకుల కోత.. రైతుబంధు డబ్బులు ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో బ్యాంకు ఖాతా వివరాలు అందజేసిన 2.47 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. ఇప్పటిరకు సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమైంది. వాస్తవంగా రైతుబంధు డబ్బుల కోసం పథకం ఆరంభంలో కొందరు రైతులు ప్రత్యేకంగా ఖాతాలు తెరిచారు. వీటిని లోన్ ఖాతాలుగా పరిగణిస్తున్నారు. మరికొందరు రైతులు తమకు అప్పటికే ఉన్న పొదుపు ఖాతాల వివరాలను సమర్పించారు. లోన్ ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మను బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నారు. గతంలో తీసుకున్న పంట రుణం, వడ్డీ చెల్లింపు పేరిట ఈ సొమ్మును ఉంచుకుంటున్నారు. సేవింగ్ ఖాతాల్లో పడిన సాయంలో కోత పడటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఎటువంటి భేదం లేకుండా పెట్టుబడి సొమ్ము కచ్చితంగా రైతులకు అందాల్సిందే. ఈ విషయంలో ఇటు అధికారులు, బ్యాంకర్లు తీవ్రంగా విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. రుణ మాఫీ చేసిఉంటే.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో రైతులు పంట రుణాలు, వడ్డీ చెల్లించడం లేదు. ఇటీవల తీసుకున్న పంట రుణాలను కూడా రెండోసారి అధికారిలోకి వచ్చిన ఆ పార్టీ... వెంటనే మాఫీ చేస్తుందని రైతులు కొండంత ఆశతో ఉన్నారు. ఇటువంటి వారంతా రుణ మాఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో గతేడాది తీసుకున్న రుణాల గడువు ముగియడంతో చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ కష్టానికోర్చి చెల్లిస్తే తమకు మాఫీ వర్తించదేమోన్న బెంగ రైతులను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు రైతులకు ఇవ్వడం లేదు. ఒకవేళ రుణమాఫీ అయి ఉంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు తీసుకోవద్దని గతంలో కలెక్టర్ లోకేష్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. అయినా, కలెక్టర్ ఆదేశాలు బ్యాంకర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటిదేమీ లేదన్నారు. ఒకవేళ బ్యాంకర్లు పెట్టుబడి సొమ్ము ఇవ్వకుంటే.. సదరు రైతు ఖాతాను పరిశీలించాలని, అప్పుడే ఏ పద్దు కింద జమ కట్టుకున్నారో తెలుస్తుందని సమాధానమిచ్చారు. -
పెట్టుబడి సాయంలో జాప్యం
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం అనేక మంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఎదురుచూస్తున్నా ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా 38 శాతం మంది అన్నదాతలకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులపై పంటల సాగు భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడి కింద రైతులకు ఎకరాకు ఈ సీజన్ నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో 2.36 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. వీరిలో ఇంతవరకు 1.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమైంది. మొత్తం రూ.161.24 కోట్ల డబ్బులు అన్నదాతలకు అందాయి. మరో 88,482 మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరికి సుమారు రూ.90 కోట్ల నిధులు అవసరం. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడమే జాప్యానికి కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అప్పులు తెచ్చి సాగు.. రైతుబంధు సాయం అందుతుందున్న ధైర్యంతో చాలా మంది రైతులు అప్పు తెచ్చి పంటల సాగుచేస్తున్నారు. వాస్తవంగా సకాలంలో పెట్టుబడి సాయం అందితే.. కొంతలో కొంతైనా అప్పు భారం రైతులకు తప్పేది. రైతుబంధు సాయం అందజేతలో జాప్యం జరుగుతుండటంతో తమకు వడ్డీ భారం పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో కొందరికి ఖాతాల్లో డబ్బులు జమకాకపోగా.. మరికొందరు సాంకేతిక లోపాల వల్ల రైతుబంధుకు నోచుకోవడం లేదు. బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్ కోడ్, ఆధార్నంబర్లు తదితర వివరాలు తప్పుగా నమోదు కావడం వల్ల డబ్బులు అందడం లేదు. ఇంకొందరు వీటిని సరిదిద్దడానికి సరైన వివరాలు ఇచ్చినా ఆన్లైన్లో ఇంకా అప్డేట్ కావడం లేదని తెలుస్తోంది. దీంతో సాయం ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. -
ఏజెన్సీలో ‘పోడు’ పోరు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట పంచాయతీ పరిధిలోని వీరాపురం, కోటగడ్డ గ్రామాల్లో పోడు పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో 19 మంది ఆదివాసీలను పోలీసులు అరెస్టు చేశారు. కోటగడ్డ గ్రామం పరిధిలోని 20 హెక్టార్ల భూమి విషయంలో గత ఏడాది కాలంగా అటవీ శాఖకు, ఆదివాసీలకు పోరు జరుగుతోంది. ఈ భూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు శనివారం ఉదయం ట్రాక్టర్లతో దుక్కి దున్నుతుండగా 19 మంది ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అటవీశాఖ సెక్షన్ అధికారి సుక్కి, బీట్ అధికారి సత్యవతికి గాయాలయ్యాయి. కొందరు గిరిజనులు కూడా గాయపడ్డారు. అనంతరం ఆదివాసీలను అరెస్టు చేసి ఇల్లెందు పోలీస్స్టేషన్కు తరలించిన తర్వాత అటవీ అధికారులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ అనిల్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కోటగడ్డ అటవీ ప్రాంతంలో మొత్తం 34 హెక్టార్లు ఉండేదని, ఇందులో 14 హెక్టార్లు గిరిజనులకు, 20 హెక్టార్లు అటవీ శాఖ పరిధిలో ఉండేలా గతంలోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఎవరికీ పట్టాలు లేవని, ఒకవేళ ఎవరి వద్దనైనా ఉంటే అవి చూపిస్తే.. మొక్కలు నాటిన తర్వాత కూడా వారికే అప్పగిస్తామని చెప్పారు. హక్కు పత్రాలు లేకుండా పోడు నరికి భూమి తమదే అంటే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అరెస్టు చేసిన వారిలో ఒక్కరికి కూడా హక్కు పత్రాలు లేవని స్పష్టం చేశారు. కాగా, ముత్తారపుకట్ట సర్పంచ్ మంకిడి కృష్ణ మాట్లాడుతూ.. ఈ భూమిలో మల్లెల కృష కు 9 ఎకరాలు, కళకు 5 ఎకరాలు, సుగుణకు 4 ఎకరాల పట్టా ఉందని, రైతుబంధు పథకం కింద సాయం కూడా పొందారని వివరించారు. -
కొందరికే రైతుబంధు
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): జిల్లాలో రైతుబంధు కొందరికే అందింది. ప్రభుత్వం విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందలేదు. జిల్లాలోని 40 శాతం రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందగా, మరో 60 శాతం మంది రైతులకు అందాల్సి ఉంది. ఆయా రైతులకు సాయం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలోని 2,29,566 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం రూ.252.63 కోట్ల నిధులు అవసరమని తేల్చారు. మే చివరి వారం లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి స హాయంను అందించేందుకు ప్రభుత్వం ని ధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయం అందింది. ఇప్పటి వ రకు రూ.119 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రూ.133.63 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజను పనులు రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రైతులు పసుపు, మొక్కజొన్న, సొయా విత్తనాలు విత్తే పనిలో పడ్డారు. వరి పంటను సాగు చేయడానికి నారు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను ఇప్పటికే కొందరు రైతులు కొనుగోలు చేయగా, మరి కొందరు రైతులు కొనుగోలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. అయితే, రైతులకు గడచిన మే నెలలోనే పెట్టుబడి సహాయం అందించి ఉంటే ఇప్పటికే రైతులు పంటల సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే వారు. అయితే, రైతుబంధు అందించడానికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి త్వరగా ఆర్థిక సాయం అందించాలని అన్నదాతులు కోరుతున్నారు. తొందరలోనే నిధులు.. తొందరలోనే రైతులందరికీ రైతుబంధు నిధులు ఖాతాల్లోకి చేరుతాయి. ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. త్వరలోనే నిధులు పూర్తి స్థాయిలో విడుదల అయి రైతులకు పెట్టుబడి సహాయం అందుతుంది. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
‘రియల్’కు ‘రైతుబంధు’!
సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్టాపిక్గా మారింది. మిర్యాలగూడ డివిజన్లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది. మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్ ఎస్టేట్ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం. పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం.. అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి. అనుమతి లేని లేఅవుట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు. ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ? మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్ను పరిశీలించి వదిలేశారు. -
రైతుకు భరోసా
నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. సమస్యల ఏకరువు.. చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్కు ఫోన్లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ ఫోన్ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి ఫోన్ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని సంబంధిత వీఆర్ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్ ఇన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. సార్ నీ కాల్మొక్త.. పాసు బుక్ ఇస్తలేరు కలెక్టర్ సార్ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ. కలెక్టర్ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్ మీకు రుణపడి ఉంటా. నా భూమి నాకు ఇప్పించండి సార్.. నా పేరు కుర్వ దశరథ్. ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్ తహసీల్దార్ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్దే అని తేలితే సంబంధిత వీఆర్ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది సార్ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి. కలెక్టర్ స్పందిస్తూ.. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది. కొత్త పాసుపుస్తకం రాలేదు సార్.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్ మీకు పుణ్యమొస్తది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఫోన్ ఇన్ నీరటి వెంకటమ్మను లైన్లోనే పెట్టి వెంటనే వీఆర్ఓ కు ఫోన్ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్కు ఆదేశించారు. వీఆర్ఓ తో ఫోన్లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్పై ఉండాలని ఆదేశించారు. ఇనాం భూములకు.. సార్.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందిస్తూ.. బాపన్పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బుక్క రాలే.. పైసలు పడలే సార్.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం. నా కొడుకు జర్మనీలో ఉంటాడు సార్.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. కలెక్టర్ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలి. మీరు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్ నంబర్కు లింకైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్ చెబితే లింకప్ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. తహసీల్దార్ను కలిసిన రైతులు తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేశారు. కలెక్టర్కు ఫోన్ ఇన్లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
పార్ట్–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతులకు శాపంగా మారింది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. ఇప్పటికీ రెండు దఫాలు రైతుబంధు సాయం పంపిణీ చేసిన సర్కారు.. తాజాగా ఖరీఫ్ సీజన్కు గాను నగదును బ్యాంకుల్లో జమ చేస్తోంది. అయితే, పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేసింది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీ కింద పరిగణించిన సర్కారు.. ఆ భూములకు పట్టాదార్ పాస్పుస్తకాలను జారీ చేయలేదు. పెట్టుబడి సాయానికి పాస్బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ కేటగిరీ కింద చేరిన భూముల రైతులకు రైతుబంధు రాకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,534 ఖాతాల్లోని 9,92,295 ఎకరాల మేర భూములను పెట్టుబడి సాయం కింద పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో సుమారు రూ.496 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాల్లోకి చేరడంలేదు. అడ్డగోలుగా నమోదు రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కేసీఆర్ సర్కారు.. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం కింద వివాదరహిత భూములకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. వివాదాస్పద, అభ్యంతర భూములకు మాత్రం వాటి జారీని పక్కనపెట్టింది. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, అన్నదమ్ముల భూపంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా., ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం డెడ్లైన్ విధించడం, ఖరీఫ్లోపు కొత్త పాస్పుస్తకాలను జారీ చేసి రైతుబంధును ప్రవేశపెట్టాలనే ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం.. లోతుగా పరిశీలించకుండా వివాదరహిత భూములను కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. దాయాదులు, ఇతరత్రా ఎవరి నుంచి ఫిర్యాదు అందినా.. ఆ భూములకు పాస్బుక్కులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. ఈ విషయం తెలిసిన రైతులు.. తహసీళ్ల చుట్టూ ప్రదక్షణలు చేసినప్పటికీ, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో ఈ భూముల వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పార్ట్–బీ భూముల జాబితాను పరిశీలించి పరిష్కారం చూపెట్టకపోవడంతో మూడు సీజన్లలోను సంబంధిత రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఈ సారైనా వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితాను సవరించకపోతే లక్షలాది మంది అన్నదాతలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారనుంది. -
రైతుబంధుకు ‘సీలింగ్’!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూమి ఎంతున్నా రైతుబంధు సొమ్మును అందరికీ వర్తింపజేయాలని సర్కారు భావిస్తే, వ్యవసాయశాఖ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోయినా స్వతహాగా సీలింగ్ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నా, బహిరంగంగా దీనిపై మాట్లాడటం లేదు. ‘మాకు సర్కారు నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. కానీ 50 ఎకరాలు దాటిన వారికి మాత్రం పెట్టుబడి సొమ్మును నిలిపివేశాం’అని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. గత రబీలోనూ కొందరు రైతులకు ఇలాగే రైతుబంధు సొమ్మును నిలిపివేసినట్లు అప్పట్లో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సీలింగ్పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ప్రభుత్వం ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం చేయాలని భావించి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 54.50 లక్షల మందికి ఈ ఖరీఫ్లో ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ‘గివ్ ఇట్ అప్’నే ప్రోత్సహించాలన్న సర్కారు... రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్త మన్ననలు పొందడంతో పాటు ఏకంగా ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. దేశంలో పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మోడల్గా తీసుకొని పీఎం–కిసాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కేంద్రం మొదలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరిగా దీన్ని అమలుచేయడంలేదు. ఇంత సొమ్మును ఏ ప్రభుత్వం ఇవ్వడంలేదు. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నారు. మొదట్లో దీని అమలుకు సీలింగ్ తీసుకురావాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. కానీ ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోలేదు. ఎవరైనా పెద్ద రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వదులుకుంటే సరేనని, లేకుంటే వ్యవసాయ భూమి ఎంతున్నా ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వచ్ఛందంగా పెట్టుబడి సాయాన్ని వదులుకునే వారి కోసం ‘గివ్ ఇట్ అప్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు సంబంధిత పెద్ద రైతులు వ్యవసాయాధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని సూచించారు. అలా వదులుకున్న సొమ్మును రైతు సమన్వయ సమితి నిధికి పంపిస్తామని కూడా సర్కారు స్పష్టం చేసింది. కానీ స్వచ్ఛందంగా వదులుకోవడంపై ప్రచారం చేయాల్సిన అధికారులు ఇలా 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిర్భందంగా నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. వారిలో కొందరిని అధికారులు బుజ్జగించి సొమ్ము అందజేస్తున్నట్లు తెలిసింది. మొత్తం రైతుల్లో 50 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతుల సంఖ్య దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఉంటారని అంచనా. ‘గివ్ ఇట్ అప్’కు స్పందన రాకపోవడంతో అధికారులు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. ఇదిలావుండగా సీలింగ్పై ఏ అధికారి కూడా అధికారికంగా స్పందించడంలేదు. ఇప్పటివరకు రూ. 3,430 కోట్లు అందజేత... ఈ ఏడాది ఖరీఫ్ రైతుబంధు కింద 33.70 లక్షల మంది రైతులకు రూ. 3,430 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన సొమ్మును కూడా విడతల వారీగా జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
డబ్బుల్ ధమాకా
తొలకరి జల్లులు కురిసింది మొదలు దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం ఇలా అన్నదాతకు ఎన్నో రకాల ఖర్చులుంటాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగుబాట పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా.. వర్షాభావం, కరువు కాటకాలతో పెట్టుబడి చేతికి రాకపోగా చివరికి చేసిన అప్పులే మిగులుతున్నాయి. మరోపని చేయలేక ఉన్న భూమిని నమ్ముకుని కష్టాల సాగు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారి కష్టాలను దూరం చేసేందుకు.. మొహాల్లో చిరునవ్వును చిందించేందేకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కిసాన్ పథకంలో ప్రతిరైతుకు రూ.6వేల చొప్పున అందిస్తోంది. వారి వివరాలు కూడా కలిపితే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాక్షి, మెదక్ : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్సమ్మన్ నిధి పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పేర్కొంది. జిల్లాలో ఐదెకరాల లోపు 1,18,386 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.71కోట్ల 30 లక్షల 16వేలు అవుతోంది. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇంకా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రాని వారు చాలా మంది ఉన్నారు. రైతుబంధుతో రూ.372 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించేది. దానిని ప్రస్తుతం రూ.5 వేలకు పెంచింది. ఖరీఫ్, రబీసీజన్ కలిపి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వనుంది. జల్లాలోని 2,11,104 మంది లబ్ధిదారులలు 3.70 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.372 కోట్లను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనుంది. ఎకరం భూమి ఉన్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.16 వేల చొప్పున అందిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిల్లా రైతులకు రూ.443 కోట్ల 30 లక్షల 16వేలను అందిస్తున్నాయి. ‘రైతుబంధు’ అందింది ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నదాతలకు గొప్పవరం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షించదగిన విషయం. నాకు ఉన్న రెండన్నర ఎకరాలకు సంబంధించి రూ.12,500 వచ్చింది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. – కొమ్మాట బాబు, రైతు, నిజాంపేట -
రైతుబంధుపై ఆందోళన వద్దు
బషీరాబాద్: మీ సేవలో ఆధార్ లింక్ చేసుకున్న రైతులందరికీ త్వరలో పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ తెలిపారు. రైతుబంధు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. బషీరాబాద్ మండలం జలాల్పూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు హాజరైన కలెక్టర్ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. నీళ్లపల్లి అటవీ ప్రాంతం లోని భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో రైతుబంధు సాయం అందుతుందని చెప్పారు. ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధా ర్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. జలాల్పూర్లో చెం చులు తమకు పాసుపుస్తకాలు రాలేదని కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేప చేదు ఉమామహేశ్వరి, వీఆర్ఓ పెంటప్ప, రైతులు పాల్గొన్నారు. బడిబాటను విజయంవంతం చేయాలి... వికారాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14 నుంచి 19వరకు అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 14న వికారాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఏడీ భరత్ కుమార్, అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్గౌడ్, డీడబ్ల్యూఓలు జ్యోత్స్న, హన్మంతరావు, చైల్డ్లైన్ సభ్యులు పాల్గొన్నారు. బషీరాబాద్ ఎందుకు వెనకబడింది.. బషీరాబాద్: మరుగుదొడ్ల నిర్మాణంలో బషీరాబాద్ మండలం ఎందుకు వెనకబడిందని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరుకు మండలంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని రాధాకృష్ణ సమావేశ మందిరంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, ఎంపీపీ కరుణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని ఓడీఎఫ్గా మార్చడానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరిష్కరించుకోవాలనితెలిపారు. ఇసుక సమస్య లేకుండా తహసీల్దార్ అనుమతులు ఇస్తారని చెప్పారు. గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఉద్యమంలా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. ఈ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రవి, ఎంపీడీఓ అనురాధ, ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఎస్ఐ మహిపాల్రెడ్డి, ఉపాధి, వెలుగు అధికారులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రైతుబంధు అందాలి
మెదక్జోన్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అప్లోడ్ కాని రైతుల ఖాతాల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెండిం గ్లో ఉన్న ప్రతిరైతు వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి రైతుకు రైతుబంధు చేరాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏరైతూ నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతిఅధికారి అప్రమత్తంగా ఉండి రైతుబంధును విజయవంతం చే యాలన్నారు. ప్రతిఐదువేల ఎకరాలకో ఏఈ వోను ప్రభుత్వం నియమించిందని, వారు ప్రతి రోజు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అదికా రులు రైతులను కూరగాయల సాగు వైపునకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు హైదరాబాద్ నుంచి కూరగాయల దిగుమతి అవుతోందని, మన జిల్లాకు డిమాండ్ మేర కూరగాయలను మన జిల్లాలోనే సాగయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మార్కెట్ సౌకర్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను పం డించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సీతాఫల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతిఇంటికి మునగ, బొప్పాయి మొక్కలను అందించాలన్నారు. ఈ సారి హరితహారంలో ప్రజలకు ఇష్టమైన మొక్కలనే పంపిణీ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచయతీ కార్యదర్శులు ఊరూరా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాం, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్తో పాటు ఏడీఏలు, ఏవోలు, ఉద్యానవనశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుబంధు సాయం.. రూ.350 కోట్లు
ఖరీఫ్ ప్రారంభ సమయానికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గత రబీ సీజన్ వరకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం గత రబీలో ఎంపిక చేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతు సమగ్ర సమాచారం సేకరణతో.. సాగులో లేని భూములకు రైతుబంధు వర్తింపజేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాచారం(ఇబ్రహీంపట్నం): ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన జిల్లాలోని 2,77,516 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.350 కోట్లు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఖరీష్కు పెరిగిన రైతుల సంఖ్య... గత రబీ సీజన్లో పెట్టుబడి సాయాన్ని 2,74,000 మంది రైతులకు అందజేస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో అదనంగా 3,500 మంది రైతులు పెరిగారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2,77,516 ఉండగా, అందులో 2లక్షల 24వేల మంది రైతులకు సంబంధించి భూ వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 20వేల మందికి పైగా రైతులు సరైన వివరాలు అందజేయని కారణంగా రైతుబం«ధు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నారు. ఆన్లైన్ నమోదు కోసం రైతులు రికార్డులు అందజేస్తే వెంటనే వారి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా భూముల క్రయ, విక్రయాల వల్ల కూడా కొందరి రైతులకు రైతుబంధు అందడం లేదు. భూ వివరాలు తక్షణమే అందజేస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు ఎంతో మేలు ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతుబంధు సాయం జమ చేస్తుండడం సంతోషకరం. 15 ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – బత్తుల మోహన్రెడ్డి, రైతు, మాడ్గుల -
కాసులు ఖాతాల్లోకి..
ఖమ్మంవ్యవసాయం: పెట్టుబడి పైకం రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించి.. రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు జిల్లాలో 2,79,198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఒక్కో సీజన్కు ఎకరాకు రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లలో వేర్వేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సహా యం రూ.8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్లో చెక్కుల రూపంలో పెట్టుబడి అందించిన ప్రభుత్వం.. రబీ సీజన్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. గత ఏడాది సీజన్కు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకంలో ఎకరాకు సీజన్కు మరో రూ.వెయ్యి పెంచుతామని పేర్కొంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపి.. ఖరీఫ్ సీజన్ నాటికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. 2,79,198 మంది రైతులకు ‘పెట్టుబడి’ జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు(పోడు) హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్లు కేటాయింపు జిల్లాలో వివిధ రకాలుగా పట్టాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమి లో పంటల సాగుకు పెట్టుబడి సహాయంగా రూ.343.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. పెట్టుబడి సహాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిçంచే ప్రయత్నాలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాల ద్వారా చేరుతుంది. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంట పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
రైతుల ఖాతాల్లోకి రూ.2,233 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం నిధులను అధికారులు విడతలవారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ–కుబేర్ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. మంగళవారం నాటికి మొత్తం 21.22 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,233.16 కోట్లు రైతుబంధు డబ్బు జమ చేశారు. మిగిలిన సొమ్మును వారం పది రోజుల్లో జమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఖరీఫ్ సాగు మొదలైన నేపథ్యంలో పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో వారు నష్టపోకుండా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సహకార, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.1,080 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఖరీఫ్ ‘పెట్టుబడి’
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం నగదు రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఖరీఫ్లో రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడే విధంగా ఈ నెల మొదటి వారంనుంచి రైతుల ఖాతాల్లో నగదును జమచేయడాన్ని వ్యవసాయశాఖ ప్రారంభించింది. మృగశిర కార్తె ప్రారంభం కావడం జిల్లాలో రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు ప్రారంభించారు. సీజన్ మొదట్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేయడంతో.. రైతులకు సకాలంలో పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 4,14,272 మంది రైతులకు గాను రూ.579,96,32,660లను రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమచేయాల్సి ఉంది. అయితే ట్రెజరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 19,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.17,73,81,865 బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు వరుస క్రమంలో ఖాతాల్లో జమకానున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలకు ఖాతా నంబర్లు అందజేయాలి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులు సవరణలు చేసిన తరువాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పాస్బుక్కలు వచ్చిన వారు జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారికి గత ఖరీఫ్, రబీలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమకాలేదు. వారందరి నుంచి పాస్పుస్తకాల జిరాక్స్లను, రైతు ఖాతా నెంబర్లను సేకరించాలని వ్యవసాయ శాఖను అదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి పాస్పుస్తకాల జిరాక్స్లు, ఖాతా నంబర్లను సేకరించే పనిలో ఉన్నారు. రైతులందరూ విధిగా వ్యవపాయ విస్తరణాధికారులకు జిరాక్స్లను అందజేయాలని కోరుతున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు.. ఇతరుల నుంచి భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని తహసీల్దార్ నుంచి పాస్ పుస్తకం తీసుకున్న వారు కూడా రెవన్యూ శాఖ.. తమ పేరు వ్యవసాయ శాఖకు పంపిన జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ జాబితా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాల్సి ఉంది. వారి పేరు జాబితాలో ఉంటే వారు కూడా పాస్పుస్తకం, ఖాతా నెంబర్ జిరాక్స్లను అందజేస్తే ఖరీఫ్లో రైతుబంధు నగదు జమచేసే అవకాశం ఉంటుంది. దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ.. ఖరీఫ్లో రైతుబంధు పంపిణీ ఇప్పటికే ప్రారంభమై సుమారు రూ.17 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతులందరికీ తప్పకుండా దశల వారీగా ఖాతాల్లో జమచేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలును ప్రారంభించారు. రైతుబంధు పథకం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడనుంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకుని సకాలంలో పంటల సాగును చేపట్టాలి. – జి.శ్రీధర్రెడ్డి, జేడీఏ -
‘రైతుబంధు’వు రూ.88.81 కోట్లు
హన్మకొండ: వాన చినుకు పడింది మొదలు పొలం, సాగు పనులే లోకంగా అన్నదాతలు జీవనం సాగిస్తారు.. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇంకా చెబితే చీడపీడల కారణంగా అన్నదాతకు పంటలపై వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు.. ఫలితంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించేందుకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు అందజేశారు. అయితే, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచనున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నగదును ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రణాళికాయుతంగా.. గత వానాకాలం, యాసంగి సీజన్లో రైతుబంధు కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మూడో సారి ప్రస్తుత వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రబీలో రైతుబంధు అందించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నగదు రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో అదే విధానాన్ని ఈ ఖరీఫ్లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే వివరాలన్నీ సిద్ధం కాగా.. ఈనెలలోనే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేయనున్నారు. 11 మండలాలు... 77,079 మంది రైతులు వరంగల్ అర్బన్ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77,079 మంది రైతులు, 1,77,619.2 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని రైతులకు రూ.88,81,25,992.5 పెట్టుబడి సాయం అందనుంది. -
‘బంధు’.. భరోసా
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులకు సాగు సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా సహాయం అందిస్తోంది. గతంలో ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. మొదట చెక్కుల రూపంలో పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాటు చేసింది. పేద, మధ్య తరగతి రైతులకు ఈ పథకం వరప్రదాయినిగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరాకు రూ.2 వేలు చొప్పున పెంచారు. అంటే ఒక్కో సీజన్లో ఎకరానికి రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులకు రూ.35 కోట్ల అదనపు లబ్ధి చేకూరనుంది. 888 గ్రామాలు.. 1,19,115 మంది రైతులు.. వచ్చే ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 888 గ్రామాలకు చెందిన 1,19,115 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరికీ పెరిగిన సహాయం ప్రకారం రూ.186,25,15,662లను బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందులో పట్టాదారు పాస్పుస్తకాలు కలిగిన అర్హులైన 359 గ్రామాలకు చెందిన 1,00,835 మంది ఉన్నారు. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.152, 26, 98, 991 జమ చేయనున్నారు. ఇక ఆర్ఓఎఫ్ఆర్ కింద 529 గ్రామాలకు చెందిన 18,280 మంది రైతుల ఖాతాల్లో రూ.33,98,16,671 జమ చేస్తారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి మరో రూ.వెయ్యి ఆర్థిక సాయం పెంచడంతో సన్న, చిన్నకారు రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పెరిగిన రైతుబంధు సహాయంతో తమ జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగు పడ తాయని ఆయా వర్గాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల్లో పంపిణీ రైతుబంధు పథకానికి ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు కూడా విడుదలయ్యాయి. జిల్లాలోని అన్ని గ్రామాల రైతులకు మూడు వారాల్లో రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. – కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి -
ఖరీఫ్ రైతుబంధుకు రూ.6,900 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో రైతుబంధు పథకం అమలుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 6,900 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేస్తారు. సొమ్ము మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి పంపిస్తామని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ఎంత మేరకు మొదటి రోజు పంపిస్తారన్న దానిపై తమకు స్పష్టత లేదని, ఆర్థికశాఖ తన వద్ద ఉన్న నిధుల నుంచి విడుదలవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడంతో వీలైనంత త్వరగా రైతులందరికీ విడతల వారీగా సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుం దని తెలిపాయి. వాస్తవంగా ఖరీఫ్కు పెట్టుబడి సాయాన్ని మే నెలలోనే ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు ఎన్నికల కోడ్ కొనసాగడంతో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. 2019–20 బడ్జెట్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుబంధు అమలుకోసం సర్కారు రూ. 12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 6,900 కోట్లు ఖరీఫ్ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.38 కోట్ల ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. ఆ మేరకు దాదాపు 54.5 లక్షలమంది రైతులకు రైతుబంధు అందించా ల్సి ఉంది. అయితే అందులో ఇంకా కొందరు రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్లను వ్యవసాయ శాఖకు ఇవ్వలేదు. సాంకేతికంగా పట్టాదారు పాసు పుస్తకం రాకుండా అన్నీ సరిగా ఉన్న రైతులు తమను సంప్రదించాలని సర్కారు ఇప్పటికే విన్నవించింది. మూడు వారాల్లోగా అందరి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత రబీ సీజన్లో కొందరు రైతులకు పెట్టుబడి సాయం చేతికి రాలేదు. వారికి ఈ ఖరీఫ్తో కలిపి ఇస్తారా లేదా అన్నదానిపై వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గోపాల్ తనకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందిందని, కానీ రబీ సాయం రాలేదని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సరస్వతికి కూడా రబీ సొమ్ము అందలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖరీఫ్ సొమ్ముతో కలిపి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇలా లక్షలాది మంది రైతులు రబీ సాయం అందక వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు రైతుబంధు.. అటు పీఎం–కిసాన్ గతేడాది ప్రభుత్వం ఒక సీజన్కు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా, ఈ సీజన్ నుంచి రూ.5 వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచిన సంగతి విదితమే. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఐదెకరాలున్న రైతు గతంలో రూ.20 వేలు అందుకుంటే, ఈసారి రూ.25 వేలు అందుకోనున్నారు. ఒకేసారి ఇంత పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో పీఎం–కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వరకు సొమ్ము అందుకున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఐదెకరాల షరతును తొలగించి ఎన్నెకరాలున్న రైతులకైనా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణలోని రైతులందరికీ కూడా ఆ మేరకు లాభం జరగనుంది. తెలంగాణలో రైతు బంధు ఇస్తున్న ఆసరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నెకరాలున్నా రూ.6 వేలు మాత్రమే ఇవ్వడం, అదీ రూ.2 వేల చొప్పున మూడు విడతలు చేయడంతో దీనిపై రైతుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. -
రైతుబంధుకు సన్నద్ధం
మహబూబ్నగర్ రూరల్: ఖరీఫ్లో పంటల సాగుకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు వ్యవసాయశాఖ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉండటంతో ఆ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఈ–కుబేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఖరీఫ్ సీజన్లో రైతులకు చెక్కుల రూపంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. రబీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈసారి వానాకాలం పంట (ఖరీఫ్) కోసం కూడా రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వనుండటంతో రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి సాయం పెంపు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది. గత ఖరీఫ్ సీజన్లో.. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం అమలులో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 3,35,252 మంది రైతులకు రూ.355.21 కోట్లు మంజూరు చేయగా రూ.219.67 కోట్ల పెట్టుబడి సాయం కింద 2,87,128 మంది రైతులకు అందింది. వివిధ కారణాలతో రూ.136.21 కోట్లు రైతులకు అందలేదు. రబీ సీజన్లో రూ.342.12 కోట్లు జిల్లాకు విడుదల కాగా అందులో రూ.307.7 కోట్లు పెట్టుబడి కింద 2,62,612 మంది రైతులకు పంపిణీ చేశారు. పలు కారణాల వల్ల పంపిణీకి నోచుకోని రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఆనాడు నిలిచిపోయిన పెట్టుబడి పంపిణీపై వ్యవసాయ శాఖాధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్లి రైతులు కోరుతున్నారు. గతేడాది రూ.697.33 కోట్లు 2018–19 ఖరీఫ్లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. అలాగే రబీ సీజన్లో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.697.33 కోట్లు కేటాయించినా రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం గమనార్హం. సమస్యలు అధిగమించేనా..? గతేడాది ఖరీఫ్ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో 88,738 మంది రైతులు రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. నేరుగా ఖాతాల్లో జమ ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెట్టుబడి సాయం పంపిణీ కొంత ఆలస్యమైంది. జిల్లా రైతులకు రైతుబంధు సాయం పంపిణీపై చర్యలు చేపడతాం. ప్రస్తుత సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తాం. జిల్లాలో ఇంకా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించాల్సి ఉంది. ఏఈఓల ద్వారా వారి ఖాతా నంబర్లు సేకరిస్తాం. – సుచరిత, జేడీఏ, మహబూబ్నగర్ -
ఎకరానికి రూ. 5,000
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు సాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి రైతుకూ ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం విడుదల చేశారు. గతేడాది సీజన్కు ప్రతి రైతుకూ ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర అందించింది. ఈ ఖరీఫ్ నుంచి దాన్ని రూ. 5 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ ఖరీఫ్ నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకూ అందించనున్నారు. ఇందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్బీఐకి చెందిన ఈ–కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం ఆన్లైన్లో జమ చేస్తామని పార్థసారథి వివరించారు. పట్టాదారు పాసుపుస్తకంగల రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాగల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందించనుంది. రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు అందిన సమాచారం ప్రకారం 1.35 కోట్ల ఎకరాలకు చెందిన 54.50 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా ఆ ప్రకారం ప్రభుత్వం రూ. 6,750 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన రైతుల జాబితాలోని వారిలో కొందరు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించలేదు. ఒక అంచనా ప్రకారం వ్యవసాయశాఖ వద్ద కచ్చితంగా 50 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలున్నాయి. వారికి మాత్రమే రైతుబంధు సొమ్ము అందే అవకాశముంది. మిగిలినవారు కూడా తమ బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ వర్గాలు రైతులకు విన్నవించాయి. ఒకవేళ ఎవరికైనా అన్నీ క్లియర్గా ఉండి పట్టాదారు పాసుపుస్తకం మాత్రమే రాకపోతే, వారు కూడా తమను సంప్రదించాలని అధికారులు రైతులకు విన్నవిస్తున్నారు. ఈ ఖరీఫ్కు సంబంధించిన రైతుబంధు సొమ్ము ఈ నెల 4, 5 తేదీల నుంచే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రెండు మూడు వారాల్లోగా ప్రతి రైతుకూ సొమ్ము చేరుతుందని వెల్లడించాయి. సాయం వద్దనుకుంటే వదులుకోవచ్చు... తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులెవరైనా ఉంటే వారు ‘గివ్ ఇట్ అప్’ఫారాన్ని మండల వ్యవసాయాధికారి లేదా మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలా మిగిలిన పెట్టుబడి సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందించనుంది. గివ్ ఇట్ అప్పై రైతుల్లో విరివిగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. పీఎం–కిసాన్ సాయం కూడా... కేంద్ర ప్రభుత్వం పీఎం–కిసాన్ పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపజేస్తూ ఏటా రూ. 6 వేల చొప్పున సాయం అందించాలని శుక్రవారం నిర్ణయించింది. ఈ పథకం కింద తెలంగాణలోని రైతులకు రూ. 3,270 కోట్ల మేర వచ్చే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పథకాన్ని గత డిసెంబర్లో ఐదెకరాల లోపున్న రైతులకే కేంద్రం అమలు చేసింది. అప్పుడు తెలంగాణలో 25 లక్షల మందికి ఈ పథకం వర్తించింది. కానీ ప్రస్తుత ఏడాదిలో ఐదెకరాల పరిమితిని తొలగించి ఎంత భూమి ఉన్నా రైతులందరికీ రూ. 6 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు 54.50 లక్షల మంది ఉన్నారు. అయితే గతేడాది ఈ పథకం అమల్లో అనేక షరతులు విధించారు. ఇప్పుడు అవే షరతులు విధిస్తారా లేక రైతులందరికీ ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎవరికీ పట్టని కౌలు రైతు
హత్నూర(సంగారెడ్డి): సాగు చేసేందుకు సొంత భూమి లేక.. కూలీగా మిగలలేక.. ఆసాముల దగ్గర భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు దూరంగా కష్టాల్లోనే మగ్గుతున్నారు. పెట్టుబడికి బ్యాంకు లోను రాక, అప్పు పుట్టేదారి లేక పుట్టెడు దుఃఖంలోనే తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు. సొంత భూమి లేని కౌలు రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కౌలు రైతులు కుదేలవుతున్నారు. కౌలు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా సరైన ధర పడుతుందన్న నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, నీళ్ల కరువు ఎప్పుడూ కౌలు రైతులను భయపెడుతూనే ఉంటాయి. భూమికి కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుంది. సాగు సగంలోకి వచ్చాక పంటలకు నీళ్లందకపోతే పెట్టుబడి సొమ్ముతోపాటు కౌలు డబ్బులు నష్టపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా కౌలు రైతులను గాలికొదిలేశాయి. 2014 లోనే తమను కౌలుదారులుగా గుర్తించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వాలందించే సహాయం పట్టాదారుడికే చెందుతుండడం కౌలు రైతులకు కన్నీటినే మిగుల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. 2014వ సంవత్సరంలో 7000 మంది తమను కౌలు రైతులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా జీఓలు తీసుకువచ్చి గుర్తింపు కార్డులైనా ఇవ్వాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కౌలుదారులకు లోన్ ఎల్జిబిలిటీ కార్డులు జారీ చేస్తే బ్యాంకు రుణాలు దక్కేవి. పంట నష్ట పరిహారం అందడంతోపాటు విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేవి. కానీ ఇలాంటి ఏ సౌకర్యానికీ నోచుకోక కౌలు రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకేసారి కౌలు మొత్తం చెల్లించాలి భూ యజమానికి పంట సాగు చేయడానికి ముందే కుదుర్చుకున్న కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. పంటలు దిగుబడి వచ్చినా, రాకున్నా భూ యజమానికి సంబంధం ఉండదు. ఏడాదికి వర్షాధారిత భూములకు గతంలో ఎకరాకు రూ. 6 వేలు, సాగునీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 10 వేల కౌలు ఉండేది. ప్రస్తుతం వర్షాధార భూములకు రూ.15 వేలు సాగునీటి సౌకర్యం ఉన్న వాటికి రూ. 25 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు ఏడాదిగా కౌలు రైతుల ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయానికి నోచుకోక పంట పెట్టుబడులకు అప్పులు చేసి ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. పంట దిగుబడి రాక, వచ్చిన పంటకు గిట్టుబాటు లభించక మరింత నష్టపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రకటించినప్పటి నుంచి జిల్లా 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్నూర మండలంలో నవాబుపేట, పన్యాల, బడంపేట, సికింద్లాపూర్, దౌలాపూర్, చింతల్చెరువు, గ్రామాలతోపాటు జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, పుల్కల్, వట్పల్లి, కంది తదిదర మండలాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నప్పటికీ పంట పండలేదు. కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. – రవి, కౌలు రైతు, బడంపేట ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. సాగు సాయం చేస్తే కౌలు రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అప్పులు చేసి పంట సాగు కోసం కౌలు చేస్తున్నప్పటికీ లాభం లేదు. అరకొర పండిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా పథకం కూడా వర్తింపజేయాలి.– ఎల్లయ్య, కౌలు రైతు, మారేపల్లి -
రైతులకు మరో చాన్స్
రబీలో పంట సాగు చేసి రైతుబంధు పథకం పొందని వారికి శుభవార్త. రబీలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని, రైతుబంధు పథకం వర్తించని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. కొంతమంది రైతులు అర్హులయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నూతన పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ సాయానికి నోచుకోలేదు. రబీ దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత రెవెన్యూ యంత్రాంగం పట్టాపాస్ పుస్తకాలను అందించింది. అయితే అధికారులు గత సంవత్సరం నవంబరు నుంచి వరుస ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రైతులకు రైతుబంధు వర్తించనుంది. ఇటీవలనే తిరిగి రబీ ఆన్లైన్ సైట్ని రీ ఓపెన్ చేశారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2,81,938 మంది రైతులు ఉండగా, కేవలం 2,49,104 మంది మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు అందుకున్నారు. మిగతా 32,834 రైతులు తమవద్ద తగిన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరికి అందించాల్సిన రూ. 22,96,08,570 సొమ్ము వ్యవసాయ శాఖ దగ్గర జమయి ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోని రైతులను గుర్తించి వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రాగానే పూర్తి వివరాలతో కూడిన ప్రతులను ఏఈఓల ద్వారా రైతులకు అందించనున్నారు. ఈ ప్రకారం రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లతో ఫాం నింపి ఏఈఓకు ఈ నెల 31 వరకు అందించాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండొద్దు రైతుబంధు కోసం దరఖాస్తు చేస్తుకున్నా అనివార్య కారణాలతో బ్యాంకుల్లో చాలామంది రైతులకు సంబంధించి తిరస్కరించారు. ఇందులో అధికంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలను అందించినా డబ్బులు జమ కాలేదు. కొంత మందికి ఖాతాలో జమయినట్లు సమాచారం (మెస్సేజ్) వచ్చినా తీరా చూస్తే పాత బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇలాంటి వారికి అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు తెలుసుకున్నాక సంబంధిత గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కొత్త అకౌంట్ నంబర్లు ఇచ్చినట్లయితే ఇంతకుముందువలె ఎకరానికి రూ. 4 చొప్పున అందించనున్నారు. కాగా ఈ సహాయాన్ని ఈ ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.5వేలు చేయనున్నారు. జిల్లాలో రబీలో 32,834 మందికి రైతుబంధు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలను రైతులు సరిగ్గా ఇవ్వాలని, ఒక్క అంకె తప్పు పడినా ఇబ్బంది తప్పదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాల్లో వేయనున్నామని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రకటించింది. తొలకరి వర్షాలు కురిసే నాటికి ఖరీఫ్ సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభుత్వం ఒక్కో సీజన్కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వగా.. ఎన్నికల హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ. 5 వేలు ప్రతీ సీజన్కు ప్రతీ ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో రైతుబంధు రానివారికి రబీకి సంబంధించి ఎకరానికి రూ.4వేలు ఇవ్వనున్నారు. రైతుబంధు రాని అర్హులైన రైతులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గత రబీ సీజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు లేక, బ్యాంకు ఖాతా నంబర్లు తప్పులు, తదితర కారణాల వల్ల సుమారుగా 32,834 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం లబ్ధిదారులకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయడానికి అనుమతిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ సీజన్లో ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. బి.నర్సింహారావు, జేడీఏ -
అన్నదాతకు అండగా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముంది.. ఎంత పరిమాణంలో విత్తనాలు, ఎరువులు అవసరమో అంచనా వేసింది. మరో నెల రోజుల్లో తొలకరి పలకరించే వీలుండటంతో అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయడంలో నిమగ్నమైంది. గతేడాది తరహాలోనే 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను, భూగర్భ జలాలను నమ్ముకుని మెట్ట పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి వనరులు లేవు. దీంతో ఎప్పటిలాగే జిల్లాలో పత్తి అధిక మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 60,417 హెక్టార్లు. ఇంతే మొత్తంలో వచ్చే ఖరీఫ్లో సాగవుతుందని భావిస్తున్నారు. అయితే, గతేడాది రికార్డు స్థాయిలో 69వేల హెక్టార్లలో జిల్లా రైతులు సాగుచేశారు. వర్షాలు సకాలంలో కురిస్తే అదే స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగొచ్చని భావిస్తున్నారు. పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, వరి పంట వేయనున్నారు. కందుల సాగుపైనా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్లో సాగయ్యే అన్ని పంటలకు కలిపి సుమారు 26వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. సబ్సిడీపై విత్తనాలు పత్తి మినహా ఇతర పంటల విత్తనాలపై రైతులకు సబ్సిడీ లభిస్తుంది. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధర మారుతుంది. అయితే, ఇప్పటివరకు కొన్ని పంటల విత్తనాలకే సబ్సిడీ ధరను నిర్ణయించారు. మిగితా వాటి ధరను ప్రకటించాల్సి ఉంది. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కా>గా.. సబ్సిడీపై రూ.2,500లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150 కాగా.. రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు ఇప్పుడిప్పుడో గోదాంలకు చేరుతున్నాయి. తొలకరి ప్రారంభానికి ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు పొందవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. ముందే సాగుచేయాలి రైతుల పొలాల్లో కావాల్సిన స్థాయిలో సారం లేదు. ఈ లోటును అధిగమించేందుకు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటిని వేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. ఇప్పుడు వేసుకుంటేనే తొలకరి నాటికి పంట కావాల్సిన పోషకాల్లో సమతుల్యత ఏర్పడుతుందని వివరిస్తున్నారు. తద్వారా మంచి దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు. -
పడావు భూములకు రైతు‘బందు’?
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతుబంధు పథకంలో అన్ని భూములకు కాకుండా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రైతు సమగ్ర సర్వేలో పడావు భూములను ప్రత్యేకంగా గుర్తిస్తుండ డమే ఇందుకు కారణం.. దీంతో పడావు భూములకు పెట్టుబడి సాయం అందకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రైతు సమగ్ర సర్వేలో ప్రత్యేక కాలం చేర్చడమే ఈ ప్రచారానికి బలం చేకూర్చు తోంది. పెట్టుబడి సాయం పేర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు ఒక సీజన్లో రూ. 4 వేల చొప్పున ఇంత వరకు రెండు సీజన్లకుగాను ఏడాదిలో రూ. 8వేల చొప్పున రైతులకు అందించారు. ఈ ఖరీఫ్ సీజన్నుంచి పెట్టుబడి సాయం పెంచుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సీజన్కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10వేలు అందిస్తామని తెలిపింది. పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు.. సమగ్ర సర్వేలో పొందుపరిచిన అంశం నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడి సాయంలో కోతలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొత్తగా పడావు భూముల వివరాలు సేకరిస్తుండడంతో.. ఆ భూములకు రైతుబంధు ఇవ్వరేమోనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో రైతుబంధు వివరాలు సేకరించినప్పుడు పడావు భూముల వివరాలు లేవు. భూమి ఉంటే చాలు సాగులో ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా రైతుబంధు పథకం వర్తింపజేశారు. ఇప్పుడు పడావు భూముల అంశం చేర్చడంతో ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు ఒక సీజన్లో రూ. వెయ్యి చొప్పున పెంచిన భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే పడావు భూముల అంశం తీసుకువచ్చిందని రైతులు అనుమానిస్తున్నారు.