Teja
-
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్లో చేరిపోయారు. వారిని యూనిఫామ్లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్గా చేరింది. ఫ్రెషర్గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
గ్యాంగ్స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్ అదిరింది
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
ఆ ఒక్క తప్పు వల్లే నా లైఫ్ ఇలా ఉంది
-
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ ప్రి - ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని ‘కిక్ స్టార్ట్’ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా... నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన "అలా మొదలైంది" చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. -
Ahimsa Movie Review: ‘అహింస’ మూవీ రివ్యూ
టైటిల్: అహింస నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాత : పి.కిరణ్ దర్శకత్వం : తేజ సంగీతం: ఆర్పీ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : జూన్ 2, 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రఘు(అభిరామ్) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో అహింస మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్ స్క్రీన్ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్ ఎందుకు వారికి సపోర్ట్గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. అభిరామ్కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్గా కమల్ కామరాజు, లాయర్గా సదా తన పాత్రలకు న్యాయం చేశారు. విలన్గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మీరు కూడా RGV లాగా మారిపోయారా ..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోను అంటే..!
-
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
తేజ్ కామెడీ పంచెస్ చూస్తే నాన్ స్టాప్ గ నవ్వుతూనే ఉంటారు
-
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ. (ఇది చదవండి: ఉదయ్కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు. తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే పారిపోయా. ఫుట్పాత్పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. (ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!) మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్ అందుకున్నా అని తేజ వెల్లడించారు. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత సురేష్బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ను వదిలారు. ఇక ఈ ఈవెంట్కు పలువురు టాలీవుడ్ పెద్దలు రానున్నట్లు సమాచారం. -
దగ్గుబాటి మల్టీస్టార్ లో నాగచైతన్య ...
-
ఉదయ్కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. -
నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లలో తేజ ఒకరు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింస. చిత్రం సినిమాతో జర్నీ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. వాటిని ఎప్పటికీ మర్చిపోనని తేజ అన్నారు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. 'నేను నా ఇంటి సైట్ను బ్యాంక్లో పెట్టా. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి ఈ ఆస్తి జప్తులో ఉందని గేటుకు రాశారు. ఆ తర్వాత అప్పు కట్టేశా. కానీ జీవితంలో మళ్లీ లోన్ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచా. కానీ నా జీవితంలో చేసిన తప్పులు, అవమానాలను గుర్తు పెట్టుకుంటా. మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తీసినప్పుడే హిట్టా, ఫ్లాపా అనేది ముందే తెలుస్తుంది. అందుకే నేను ఏ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోను. సినిమా విషయంలో బడ్జెట్ ఉందని ఎలా పడితే అలా చేయకూడదు. కథకు తగిన బడ్జెట్లోనే తీయాలి. అంతే కానీ ఉంది కదా అని కథను మించి బడ్జెట్ ఖర్చు పెడితే అంతే ' అని అన్నారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) -
రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్ చూశారా?
ఓ యువకుడిని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేస్తుంది. గురువారం హీరో రామ్చరణ్ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్గా లాయర్ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పి. కిరణ్ నిర్మాత. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్ రెడ్డి. -
నేరుగా ఓటీటీలోకి వస్తున్న ‘జగమేమాయ’.. రిలీజ్ ఎప్పుడంటే?
చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగమేమాయ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అయింది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే.. 'నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను.' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సమాజంలో మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ సినిమాలో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా రానా సోదరుడి ‘అహింస’
నిర్మాత సురేశ్బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘యూత్ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’ పాటలు చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ!
కొత్త నటులతో సినిమా తీయడంలో దర్శకుడు తేజ దిట్ట. టాలీవుడ్కి ఆయన చాలా మంది హీరోహీరోయిన్లను అందించాడు. . ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. అయితే షూటింగ్ సమయంలో తేజ కాస్త మొరటుగా ప్రవర్తిస్తాడట. తాను అనుకున్నట్లుగా సీన్ రాకపోతే నటీనటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. తాజాగా తేజ మరో యంగ్ హీరో చెంప పగలగొట్టాడట. ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అభిరామ్పై డైరెక్టర్ తేజ చేయి చేసుకున్నట్లు టీటౌన్ టాక్. షూటింగ్లో భాగంగా ఒక రోజు లెన్త్ సీన్ ప్లాన్ చేశాడట తేజ. ఆ సీన్లో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. తేజ ఎన్నిసార్లు చెప్పినా.. సరిగా నటించలేదట. దీంతో తేజ అతనిపై చేయి చేసుకున్నాడట. దీంతో అభిరామ్ అలిగి..కొద్ది రోజుల పాటు షూటింగ్కి వెళ్లలేదట. చివరకి సురేశ్బాబు రంగంలోకి దిగి..కొడుకును బుజ్జగించి షూటింగ్కి పంపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తేజ గానీ, అభిరామ్ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
దగ్గుబాటి వారసుడి చెంప పగలగొట్టిన డైరెక్టర్ తేజ
-
ఉదయ్ కిరణ్ చావుకు కారణం తెలుసు: తేజ సంచలన వ్యాఖ్యలు
ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్ దర్శకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి.. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు. తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. 'అహింస' గ్లింప్స్ చూశారా?
దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలసిందే. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హీరోని కొందరు అడవిలో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం, తర్వాత వాళ్లు మళ్లీ లాక్కొచ్చి కొడుతుంటారు. ఈ గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.ఈ చిత్రంలో అభిరామ్కు జోడీగా గీతికా తివారి హీరోయిన్గా నటించింది. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న‘ చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’ సాంగ్
‘హుషారు’ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. ‘పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా ’అంటూ సాగే ఈ పాటకి డాక్టర్ భవ్య దీప్తిరెడ్డి లిరిక్స్ అందించగా.. రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. సందీప్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్కి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్ ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవ్య దీప్తి సాహిత్యంతో గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫి చాలా బాగుంది. ఈ పాటలో హీరో తేజ, అఖిల చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది’ అన్నారు. -
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన డైరెక్టర్ తేజ!
టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలతో తేజ కూడా ఒకరు. చిత్రం సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన తేజ తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్టు సాధించాడు. కానీ కొంతకాలంగా ఆయనకు సాలిడ్ హిట్టు మాత్రం దొరకడం లేదు. గత పదిహేనేళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ తప్పితే మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన రానా తమ్ముడు అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తేజ బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు,‘తస్కరి’ అనే వెబ్ సిరీస్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
ఆ మూవీతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ!
డైరెక్టర్ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నాడు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 22 తేజ బర్త్డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడిల్ ఎపిక్ లవ్స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకే ఫ్రేంలో ‘గాడ్ ఫాదర్’, ‘భీమ్లా నాయక్’, వీడియో వైరల్ లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను ఆయన బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మూవీలో తేజ కొడుకు అమితవ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Taking you back in the year 1836, when LOVE was INNOCENT ❤️ Here’s the PRE LOOK POSTER of an Epic Love Story #VikramAditya 🎬 Directed by @tejagaru ❤️🔥 Shoot Begins today🤘 More details to be revealed soon✨@LNPOfficial #NallamalupuSrinivas (Bujji)#HappyBirthdayTeja 💥 pic.twitter.com/fzKTQuqaaY — LNP (@LNPOfficial) February 22, 2022 -
దగ్గుబాటి రానా తమ్ముడి ‘అహింస’.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్
Rana Daggubati Brother Debut Movie First Look: దర్శకుడి తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. పలువురు యంగ్ హీరో,హీరోయిన్లు తేజ దర్శకత్వంలో నటించాలని ఆశ పడేవారు. అయితే ఇటీవల కాలంలో తేజను వరుస ప్లాపులు పలకరించాయి. చాలా కాలం తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’మూవీ తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ విజయాన్ని అలాగే కొనసాగించడంతో తేజ విఫలం ఆయ్యాడు. ఆ మూవీ తర్వాత తేజ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో తేజ కాస్త విరామం తీసుకొని.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజ. నేడు(ఫిబ్రవరి 22) తేజ బర్త్డే. ఈ సందర్భంగా ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి అహింస అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోనె సంచితో కట్టేసి ఉండగా.. అతడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ !! Presenting the Fierce Pre Look Poster of #AbhiramDaggubati’s #AHIMSA 🩸 A Film by @tejagaru 🎬 Principal Shoot Completed 🤘#Kiran @rppatnaik #SameerReddy @boselyricist @AnandiArtsOffl #HappyBirthdayTeja pic.twitter.com/AfBZsky3XA — Suresh Productions (@SureshProdns) February 22, 2022 -
‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది చిత్ర బృందం. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’.. పారితోషికం వేలల్లో, వసూళ్లు కోట్లలో
Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, ప్లాప్లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సింది. ఉషా కిరణ్ మూవీస్లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్ కిరణ్ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో తేజ ఉదయ్ కిరణ్ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్ను అనుకోలేదట. హీరో మాధవన్తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్ కిరణ్ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. -
దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీకోసం తేజ మ్యూజిక్ సిట్టింగ్స్
టాలీవుడ్ ప్రమముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, గేయ రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఆర్.పి.పట్నాయక్-తేజ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. మనసుకు హత్తుకునే సాహిత్యానికి ప్రసిద్ది చెందిన స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికలో అభిరామ్ ఫస్ట్ మూవీ తప్పకుండా మ్యూజికల్ బొనాంజగా ఉండబోతుంది. -
తన సినిమా పనులను స్టార్ట్ చేసిన అభిరామ్ దగ్గుబాటి
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. తాను హీరోగా పరిచయం కానున్న సినిమా పనులను షురూ చేశారు అభిరామ్. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఆదివారం జరిగాయని తెలిసింది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఆర్.పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. -
ఉదయ్ కిరణ్ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. నేడు(జూన్ 26) అతడి జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఉదయ్ సినీ కేరీర్పై ఓ లుక్కెద్దాం. ఉదయ్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్ కిరణ్ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. అలా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ క్రమంలో అతడు నటించిన శ్రీరామ్ మూవీ ప్లాప్ అవ్వడంతో కొంతాకాలం సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ‘ఔనన్నా.. కాదన్నా’ మూవీతో ఉదయ్కి మరో హిట్ అందించాడు. దీంతో మళ్లీ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గాడిన పడిందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా తర్వాత ఉదయ్కి ఆశించిన అవకాశాలు రాలేదు. చేసిన కొన్ని సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఉదయ్కి సినిమాల అవకాశాలు దగ్గడమే కాకుండా అప్పటికే ఉదయ్తో తీస్తాన్న పలు ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. అయితే ఇందుకు కారణంగా లేకపోలేదు. అయితే ఉదయ్ ఆగిపోయిన ఆ పది క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. నర్తనశాల బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పటి హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల మూవీకి సన్నాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సౌందర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. అయితే ఇందులోని కీలక పాత్ర అభిమాన్యుడి కోసం ఉదయ్కిరణ్ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో.. ఈ బ్యానర్లో ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాకు తీయాలని భావించారు మేకర్స్. అంతేగాక ఈ చిత్రానకి లవర్స్ అనే టైటిల్ను కూడా ఖారారు చేశారట. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. కాగా ఈ బ్యానర్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో తెలుగుతో పాటు పలు తమిళం చిత్రాలు కూడా వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ సినిమా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో ఒక సినిమా తీయాలని చర్చించుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రత్యూష క్రియేషన్స్ ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొదలు పెడదామని అనుకుని దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాతా ఈ మూవీ అనుకొకుండా ఆగిపోయింది. చంద్రశేఖర్ యేలేటితో.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్తో ఓ సినిమా అనుకున్నారట. ప్రేమంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టారు. దాదాపు 80 శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎందుకో తెలియదు కాదు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఆది శంకరాచార్య ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ సినిమా పట్టాలెక్కే సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు. జబ్ వి మెట్ తెలుగు రీమేక్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్. ఈ మూవీతో హిందీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయ్ కిరణ్, త్రిష హీరోహీరోయిన్లుగా తెలుగులో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ పట్టాలేక్కలేదు. అయితే తమిళంలో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో ‘కందేన్ కందాలయి’గా ఈ మూవీని చిత్రీకరించగా.. తెలుగులోకి ‘ప్రియ.. ప్రియతమా’ పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజుతో ఓ సినిమా ఉదయ్ కిరణ్తో మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి సినిమాలు చేసి మంచి హిట్ అందించారు ఎంఎస్ రాజుజ దీంతో ఉదయ్ కిరణ్తో హ్యాట్రిక్గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. తేజతో మరోసారి ఉదయ్ కిరణ్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’ బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ డైలామా పడిన సమయంలో ‘ఔనన్నా కాదన్న’ సినిమా తీసి హిట్ అందించాడు తేజ. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఉదయ్ కిరణ్ను మళ్లీ ఆదుకునేందుకు తేజ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఉదయ్కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేస్తుండానే ఉదయ్ అనుకొకుండా మృతి చెందాడు. ఉదయ్ మరణాంతరం ఇదే విషయాన్ని తేజ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం -
45 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్
డైరెక్టర్ తేజ గతేడాది రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి గోపీచంద్తో 'అలిమేలుమంగ వేంకటరమణ' కాగా మరొకటి దగ్గుబాటి రానాతో 'రాక్షసరాజు రావణాసురుడు'. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్కు నోచుకోనేలేదు, అప్పుడే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తొలి ప్రయత్నంలోనే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1" తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో షురూ కానున్నట్లు పేర్కొన్నాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపాడు. అంతే కాదు, ఇందులో 45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా 2000 సంవత్సరంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో తేజ టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్పీ పట్నాయక్ కూడా ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నాడు తేజ. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు లైఫ్ ఇచ్చిన తేజ ఈసారి ఇండస్ట్రీకి ఎవర్ని పరిచయం చేస్తారనేది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్ మరోసారి 'చిత్రం' మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. Will start shoot this Year! pic.twitter.com/VHVIJEJ2PT — Teja (@tejagaru) February 22, 2021 చదవండి: తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే బన్నీని పోలీసులు అలా వాడేసుకున్నారన్నమాట! -
రమణ యాక్షన్
వెంకటరమణ యాక్షన్ మొదలుపెట్టే డేట్ ఫిక్సయిందట. ఈ ఫైట్ అలిమేలు కోసమేనా? తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలిమేలు మంగ వెంకటరమణ’. ‘జయం, నిజం’ సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న హైదరాబాద్లో ప్రారంభం కానుందని తెలిసింది. యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నారు. -
తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే
ఇండస్ట్రీకి పరిచయమై పుష్కర కాలం పూర్తయినా కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఇటీవల పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ వైవాహిక బంధాన్ని, సినీ కెరీర్ను బాగానే మేనేజ్ చేస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ల్లో పాల్గొంటూనే మరోవైపు భర్త గౌతమ్ కిచ్లుకు తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా భర్తతో కలిసి పలు దేశాల్లో విహరించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవే కాకుండా కాజల్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్ హాసన్ ఇండియన్-2లో కూడా నటిస్తోంది. అంతేగాక భర్త గౌతమ్తో కలిసి కుషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ భామ. ఇదిలా ఉండగా డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కాజల్ వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకోగా ఆమె స్టానంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నును తీసుకున్నట్లు వినికిడి. కాగా కాజల్, తేజ కాంబినేషన్లో ఇప్పటికే లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రితో పాటు సీతా సినిమాలు వచ్చాయి. -
బ్యాక్డోర్ ఎంట్రీ
పూర్ణ ప్రధాన పాత్రలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం పూర్ణ కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు బి.శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు రావడం ఖాయం’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఓంకార్ యూనిట్, సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, సహ నిర్మాత: ఊట శ్రీను. -
బ్యాక్ డోర్తో ఇబ్బందులు
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పూర్ణ, తేజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘బ్యాక్డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు కర్రి బాలాజీ. ‘‘బాలాజీగారు కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టే చిత్రమిది’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోగా తేజకు పాజిటివ్గా తేలింది. (కరోనా నుంచి కోలుకున్న బిగ్ బి) కాగా ఈ విషయంపై తేజ స్పందిస్తూ.. ‘అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్కు వెళ్లి కరోనా తెచ్చకున్నా. మా షూటింగ్లో సభ్యులకు గానీ, మా కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదు. నా ఒక్కడికే కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నా’ అని తెలిపారు. మరోవైపు తేజకు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ నెల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆ మహమ్మారి బారిన పడటం గమనార్హం. (దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్) Director @tejagaru about spreading #CoronavirusIndia. #StaySafe pic.twitter.com/lD9R1ZtPtM — Vamsi Shekar (@UrsVamsiShekar) June 12, 2020 -
సోషల్ మీడియాలో లైవ్ ఆడిషన్స్
కొత్త వారికి నటీనటులుగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే డైరెక్టర్ తేజ మరోసారి తన తర్వాతి సినిమాకి ప్రతిభావంతులైన నటీనటులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ఆడిషన్స్ నిర్వహించనుండటం విశేషం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇలా లైవ్ ఆడిషన్స్ ప్లాన్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్లో సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమా కాగా, మరొకటి గోపీచంద్తో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ చిత్రం. ఈ రెండు సినిమాల్లో దేని కోసం ఈ ఆడిషన్స్ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. కాగా హలో యాప్లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్ ఆడిషన్స్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఆయా సినిమా యూనిట్స్ తక్కువ మందితో షూటింగ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక ఆడిషన్స్ కూడా ఇలా లైవ్లో జరుగుతున్నాయన్న మాట. -
లాక్డౌన్లో ఏం చేస్తున్నారు?
నెలరోజులయింది అందరం లాక్డౌన్లో ఉండి. గృహ నిర్భందనను, ప్రభుత్వ నిబంధనలను క్రమంగా పాటిస్తూ కరోనా దరి చేరకుండా పోరాటం చేస్తున్నాం. ఈ 30 రోజుల్లో ఏం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఈ లాక్డౌన్ పూర్తయ్యేలోగా ఎలాంటి విషయాలు నేర్చుకొని బయటకు రావాలనుకుంటున్నాం? ఒక్కసారి అందరం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవే ప్రశ్నలను కొందరు స్టార్స్ని అడిగితే ఇలా సమాధానమిచ్చారు. అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక ‘‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానమే. మన కులం, మతం, స్టేటస్ ఇవేమీ మనల్ని ఎక్కువ... తక్కువ చేయవు. ఈ విషయం కంటికి కనిపించని ఒక్క సూక్ష్మ జీవి మళ్లీ మనందరికీ గుర్తు చేస్తోంది’’ అన్నారు భూమిక. లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ఈ విధంగా చెప్పారు. కరోనా వైరస్ మనకు తెలియకుండానే దాడి చేస్తుంటుంది. చివరకు మనకు సరైన అంత్యక్రియలు కూడా జరగనివ్వకుండా చేస్తోంది. గోల్డెన్ టెంపుల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే నిర్మల్ సింగ్ కల్సా పద్మశ్రీ పొందారు. ఆయన ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఊరి స్మశానంలో జరపొద్దని, వైరస్ వ్యాప్తి చెందుతుందని గ్రామ ప్రజలు అడ్డుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతున్నాను. ఇంటి పని, వంట పని, మా పిల్లాడిని చదివిస్తూ, వాడితో ఆడుకుంటున్నాను. మొక్కల్ని పెంచుతున్నాను. మా కుక్కల్ని చూసుకుంటున్నాను. కరోనా నిజంగా మ్యాజిక్ చేసింది. అందరూ తమ ఇంటి సభ్యులతో ఎక్కువసేపు గడిపేలా చేస్తోంది. వ్యాయామం చేస్తున్నాను. పంజాబీ మాట్లాడటం వచ్చు కానీ రాయడం, చదవడం రాదు. ప్రస్తుతం పంజాబీ నేర్చుకుంటున్నా. అలాగే కరోనా మనందరిలో క్రమశిక్షణ, కంట్రోల్ను చాలావరకూ నేర్పింది. సాధారణంగానే నేను చాలా పరిశుభ్రతను పాటించే వ్యక్తిని. అందుకని శుభ్రం గురించి కొత్తగా నేర్చుకున్న విషయాలే లేవు. మానవత్వం మీద గౌరవం పెరిగింది - మధుబాల ‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానవత్వం, కృతజ్ఞతాభావం వంటి వాటి పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా గడ్డు పరిస్థితుల నుంచి మనందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటి మధుబాల. ఇంకా పలు విషయాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం అందరం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా నా భర్త, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. నిజానికి ఒక రోజులో మేం అందరం ఇంట్లో కలుసుకునే సందర్భాలు కూడా తక్కువ. ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. రోజంతా మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు కొంచెం ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు. నాకు అలా కుదరదు కాబట్టి వ్యాయామం, యోగ, డ్యాన్స్, రీడింగ్ వంటివి చేస్తున్నాను. రోజులో సమయం కుదిరినప్పుడు అమేజాన్, నెట్ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూస్తున్నాను. వ్యాయామానికి, రీడింగ్కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానసికంగా ధృడంగా ఉండాలని కోరుకుంటాను. నా బాడీ, మైండ్ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమిస్తాను. నేను బుక్స్ ఎక్కువగా చదువుతాను. ప్రస్తుతం ఫిక్షన్కి చెందినవి కాకుండా కొన్ని సీరియస్ బుక్స్ చదువుతున్నాను. దీని వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాను. నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ఈ లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించు కుంటున్నాను. ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం - తేజ ‘‘మనుషులందరం ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం. ఆ వైఖరి మారాలి’’ అంటున్నారు దర్శకుడు తేజ. లాక్డౌన్ సమయాల్లో ఆయన ఏం చేస్తున్నారు? అనే విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ లాక్ డౌన్ వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భూమి కేవలం మనకు (మనుషులకు) మాత్రమే కాదు. భూమి మీద నివశించే ప్రతీ ఒక్కరికీ అంతే హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతున్నాను, రాసుకుంటున్నాను, గిన్నెలు శుభ్రం చేస్తున్నాను, మా కుక్కపిల్లలకు స్నానం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, గార్డెనింగ్ చేయడం, మా ఆవిడ నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు తనకు డ్రైవర్గా ఉండటం వంటి పనులు చేస్తున్నాను. లాక్డౌన్ పరిస్థితుల ఆధారంగా ఓ కథ రాస్తున్నాను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అవగాహన చేసుకుంటున్నాను. ఈ కోర్స్ పాస్ అవుతాననే అనుకుంటున్నాను. తేజ, అల్లరి నరేష్ వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు - అల్లరి నరేష్ ‘‘లాక్డౌన్లో భాగంగా గడిచిన ఈ 30 రోజులు ఓ వినూత్నమైన అనుభవాన్నిస్తున్నాయి. కరోనా కారణంగా మనకంటే తీవ్రంగా నష్టపోయిన కొన్ని దేశాల్లోని ప్రçస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు ‘అల్లరి’ నరేష్. ఇంకా పలు విషయాలను పంచుకున్నారు. మనం ఆగర్యోం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, ఐసొలేషన్ వంటివాటితోనే మనం కరోనాను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయాల్లో మన మానసిక ఆరోగ్యం, సహనం కూడా ముఖ్యమే. మన ఇంట్లో చిన్నారులు ఉన్నప్పుడు రోజును తప్పనిసరిగా ఓ క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాల్సిందే. మా దినచర్య మా మూడున్నరేళ్ల పాప సమయపాలనను బట్టి ప్రారంభం అవుతుంది. నా భార్య (విరూప) నా కూతుర్ని ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకే నా భార్య ఈ లాక్డౌన్ పరిస్థితులను బాగా బ్యాలెన్స్ చేస్తోంది. మా చిన్నారికి పాఠాలు చెప్పడం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి చేస్తున్నాం. అయితే లాక్డౌన్ వల్ల మన రోటీన్ లైఫ్ తప్పక ప్రభావితం అవుతుంది. నేను వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు వారాలుగా అదే పనిలో ఉన్నాను (సరదాగా). వంట చేయడం అంటే రెసిపీని ఫాలో కావడమే కాదు. తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను వంట చేయడాన్ని నా భార్య, నా కుమార్తె బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ముగ్గురం కలిసి వంట పనులు చేయాలనుకున్నాం. మా పాప వెల్లుల్లి తొక్క తీయడం, ఆకుకూరలను తుంచడం వంటి పనులు చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నాకు హలీమ్ అంటే ఇష్టం. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లి తినలేం. అందుకని ఈ ఏడాది నేనే స్వయంగా హలీమ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. -
వెరైటీ టైటిళ్లతో తేజ కొత్త చిత్రాలు.. హీరోలు వీరే
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం. -
పాయల్ రాజ్పుత్కు మరో చాన్స్!
తొలి సినిమాతోనే టాలీవుడ్ను షేక్ చేసిన అందాల భామ పాయల్ రాజ్పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ, తొలి ప్రయత్నంలోనే గ్లామర్ షోతో పాటు నెగెటివ్ రోల్లోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో నటిస్తున్నారు పాయల్. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్కు చాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్ నటించబోయేది హీరోయిన్గా కాదు. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్ రాజ్పుత్ స్పెషల్ సాంగ్లో అలరించారు. -
కల నెరవేరుతుందా?
తేజ హీరోగా, హరిణి రెడ్డి హీరోయిన్గా రాజేష్ కనపర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డ్రీమ్ బాయ్’. మాస్టర్ ఎన్.టి. రామ్చరణ్ సమర్పణలో 7 వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ కనపర్తి మాట్లాడుతూ– ‘‘మంచి కథాబలం ఉన్న చిత్రమిది. వైవిధ్యమైన కథతో రూపొందుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇది నా తొలి సినిమా. కథాబలం ఉన్న చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు, సూర్య, హేమ, ధనరాజ్ లాంటి సీనియర్ నటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తేజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. త్వరలో వైజాగ్లో చిత్రీకరించనున్నాం’’ అని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తి చేసుకొని జూలై నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు తెలిపారు. చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని–సుభాష్ బొంతు. -
‘సీత’ మూవీ రివ్యూ
టైటిల్ : సీత జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : తేజ నిర్మాత : రామబ్రహ్మం సుంకర ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి కొత్తగా ప్రయత్నించాడు. లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీత చిత్రంలో బెల్లంకొండ ఓ చాలెంజింగ్ రోల్లో కనిపించాడు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండకు ఆశించిన సక్సెస్ అందించిందా..? తేజ వరుసగా మరో సక్సెస్ సాధించాడా..? కథ : సీతా మహాలక్ష్మి (కాజల్ అగర్వాల్) డబ్బుకు తప్ప మనుషులకు, బంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని పొగరుబోతు. తండ్రితో గొడవపడి సొంతంగా బిజినెస్ చేసి చిక్కుల్లో పడుతుంది. తను కొన్న ఓ స్థలం సమస్యల్లో ఉండటంతో లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్) సాయం కోరుతుంది. అయితే బసవ అందుకు బదులుగా తనతో నెల రోజులు గడపాలని అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అగ్రిమెంట్ ముందు ఒప్పుకున్న సీత, తన పని పూర్తయిన తరువాత కాదనటంతో వ్యాపరపరంగా సీతకు అడ్డంకులు సృష్టిస్తాడు బసవ. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తనకు డబ్బు కావాలి. కానీ సీత తండ్రి తన ఆస్తినంత భూటన్లో బాబాల దగ్గర పెరుగుతున్న రఘురామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) పేరిట రాసేస్తాడు. దీంతో ఆస్తి కోసం రామ్ను కలుస్తుంది సీత. చిన్నతనంలో ‘సీతను నువ్వు చూసుకోవాలి, నిన్ను సీత చూసుకుంటుంది’ అని మామయ్య చెప్పిన మాటలకు కట్టుబడిన రామ్, సీతతో సిటీ వచ్చేస్తాడు. అలా వచ్చిన సీతా రామ్లకు బసవ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్కు, ఇమేజ్కు ఏ మాత్రం సెట్ అవని అమాయకుడి పాత్రలో పూర్తిగా నిరాశపరిచాడు. సినిమా చూశాక అసలు ఈ సినిమాకు సాయి శ్రీనివాస్ ఎలా ఓకె చెప్పాడా అన్న అనుమానం రాక మానదు. హీరోయిన్గా సీత పాత్రకు కాజల్ అగర్వాల్ పూర్తి న్యాయం చేశారు. తల పొగరు ప్రదర్శించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ సీన్స్లోనూ మెప్పించారు. విలన్గా సోనూసూద్ ఆకట్టుకున్నాడు. బసవ క్యారెక్టర్లో తేజ గత చిత్రాల పాత్రల ఛాయలు కనిపించినా.. సోనూ తనదైన మేనరిజమ్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రల్లో మన్నార చోప్రా, భాగ్యరాజ, తనికెళ్ల భరణి, అభిమన్యూ సింగ్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ అంతా చెప్పేసిన దర్శకుడు తేజ... తరువాత కథనాన్ని ముందుకు నడిపించేందుకు చాలా కష్టపడ్డాడు. తన గత చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు చాలా రిపీట్ అయిన భావన కలుగుతుంది. కథపరంగా పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్లను ఇరికించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇక సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతీ సారి కొత్త ట్విస్ట్తో షాక్ ఇచ్చాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకత్వం చేసిన అనూప్ రుబెన్స్ పరవాలేదనిపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాట్రోగఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కాజల్ అగర్వాల్ మైనస్ పాయింట్స్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్క్రీన్ప్లే క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కజురహో బీర్ఫెస్ట్లో ‘సీత’ బృందం..!
-
నాది యావరేజ్ బ్రెయిన్
‘‘సీత’ సినిమా ఎలా వచ్చిందని బెంగళూరులో అడగ్గానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మామూలుగా సినిమా చాలా బాగా వచ్చింది.. సూపర్గా వచ్చిందని చెబుతారు. కానీ నేను అబద్ధం చెప్పలేను.. నిజమూ చెప్పలేను.. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో తేజ మాట్లాడుతూ– ‘‘సీత’ చిత్రం 90 శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా తీసేసి పరుచూరి బ్రదర్స్కి చూపించా. వాళ్లు చెప్పిన కరెక్షన్స్తో మళ్లీ షూట్ చేసి అంతా సరి చేశా. ఎందుకంటే నాది అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు యావరేజ్ బ్రెయిన్. నా కళ్లజోడు చూసి మేధావి అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, అనూప్.. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే (ప్రేక్షకులు)ఇవ్వగలరు. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. మీరంతా బాగుండాలి’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి పాసొనేట్ ఫిల్మ్ మేకర్ను నేను లైఫ్లో కలవలేదు. ఇలాంటి డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పని చేస్తానని అనుకోలేదు. పురుషుల కంటే మహిళలకు మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో ‘సీత’ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ నేను నెర్వస్ ఫీలవుతున్నా. ‘సీత’ సినిమాతో చాలా నేర్చుకున్నా. తేజగారు లేకపోతే నేను ఈ స్టేజ్పై ఉండేదాన్ని కాదు. ఆయన స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నా. ‘సీత’ సినిమాతో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘నా ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగితే వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది తెలుగు భాషే. టాలీవుడ్ నా ఫేవరెట్ ఇండస్ట్రీ’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మన్నారా చోప్రా పాల్గొన్నారు. -
‘సీత’ ప్రీ రిలీజ్ వేడుక
-
తేజగారు నా బ్రెయిన్ వాష్ చేశారు
‘‘సీత’ సినిమా స్టోరీ తేజగారు నాకు ఎప్పుడో చెప్పారు. అప్పటి టైమ్కు సెట్ అవుతుందా? అనుకున్నాం. అప్పుడు నా డేట్స్ కూడా ఖాళీ లేవు. అలా ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టాం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలో ‘సీత’ సినిమా నాతోనే తీయాలి. వేరే హీరోయిన్తో మిమ్మల్ని చేయనివ్వనని ఆటపట్టించేదాన్ని. పెర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇది. అందుకే మిస్ చేసుకోకూడదు అనుకున్నాను’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నాకు పురాణాలంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాకు పురాణాలకు ఎక్కువ సంబంధం లేదు. ఇదంతా ప్రస్తుత కాలంలో జరిగే కథ. సినిమాలో ఎక్కువ మానవ సంబంధాలు, లక్ష్యాల గురించి చర్చించాం. కొందరమ్మాయిలు సింపుల్గా పెళ్లి చేసుకుని సెటిలైతే చాలు అనుకుంటున్నారు. కొందరమ్మాయిలు ఏదైనా సాధించాలనుకుంటారు. ఇందులో నా పాత్రకు ఓ గోల్ ఉంటుంది. దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది. తను చాలా స్వార్థపరురాలు. ► తేజగారు స్క్రిప్ట్కు తగ్గ టైటిల్ మాత్రమే పెడతారని మనకు తెలుసు. దీనికి అలానే పెట్టారు. నటిగా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ప్లస్, మైనస్సులు ఆయనకు తెలుసు. ఇందులో నటిగా నన్ను ఇంకా పుష్ చేశారు. తేజగారంటే నాకు చాలా గౌరవం. సినిమా మీద ఆయనకున్న డ్రైవ్ ‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఆయన నాకు లక్కీ. ► సాయిశ్రీనివాస్తో మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. మేమిద్దరం ‘కవచం’ సినిమా చేయడం వల్ల ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయిందనుకుంటున్నాను. నా పాత్ర కంటే కూడా తనది ఇంకా కష్టమైన పాత్ర. చాలా బాగా చేశాడు. యంగ్ హీరోలతో యాక్ట్ చేసినా డామినేట్ చేయను. సరదాగా టీజ్ చేస్తానేమో. ► ఈ సినిమాలో నా పాత్రను కొందరు రిలేట్ చేసుకోవచ్చు. కొందరు ఇలా ఉందేంటి? అని కూడా అనుకోవచ్చు. నా పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ పాత్రను కొన్నిసార్లు నేనూ రిలేట్ చేసుకున్నా, కొన్నిసార్లు ఇది టూమచ్ అనుకున్నాను. ప్రతీ సీన్ ముందు తేజగారు కొంచెం బ్రెయిన్ వాష్ కూడా చేశారు. ఆ పాత్ర అలాంటిది. ► సీత పాత్ర చేయడానికి హోమ్వర్క్ అంటే.. తేజగారితో చాలా డిస్కషన్స్ చేశాను. సీత ఎలా ఉంటుంది అని నోట్స్ రాసుకున్నాను. చాలా పుస్తకాలు చదివాను. అలాగే ఈ సినిమాలో నా స్టంట్స్ నేనే చేసుకున్నాను. గాయాలు కూడా అయ్యాయి. నా వీపు అంతా ప్లాస్టర్స్తో నిండిపోయింది. నిటారుగా కూర్చోలేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరఫీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ► నా తోటి హీరోయిన్లు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారని నేను చేయను. నాకు నచ్చాలి కదా? పక్కవారితో పోల్చి చూసుకోను. నా దగ్గరకు వచ్చిన వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటాను. ► 23న ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. 24న మా సినిమా రిలీజ్ కాబోతోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆ ఉద్దేశమే లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. సినిమాలు చేసే ప్రాసెస్ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించను. ► తెలుగులో శర్వానంద్తో ఓ సినిమా, తమిళంలో క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, ‘జయం’ రవితో చేసిన ‘కోమలి’ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ‘భారతీయుడు 2’ జూన్ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. మరో ప్రాజెక్ట్ వివరాలు రెండు రోజుల్లో తెలియజేస్తాను. -
రూమరమరాలు
ఇంగ్లిష్లో ‘రూమర్ మిల్’ అనే మాట ఉంది. అంటే.. పిడి మరలాగే రూమర్లకూ ఒక మర ఉంటుందని!ఆ పిండితో ఏ రొట్టే చెయ్యలేం. కానీ ఆకలి తీరుతుంది!రూమరో రామచంద్రా..అన్నంతగా ఉన్న..ఆకలి తీరుతుంది. కానీ.. రూమర్లు లైట్గా ఉండాలి. లైట్గా ఉంటే..మరమరాల్లా ఎంజాయ్ చెయ్యొచ్చు.మోతాదు మించితేనే ముంచినంత పని చేస్తాయి! ప్రాణి పుట్టుకకు ఎక్స్వై క్రోమోజోములు అవసరం. ప్రాణం లేని రూమర్ పుట్టుకకు ‘డెవిల్స్ వర్క్షాప్’ ఒకటి చాలు! పనిలేని బుర్ర! అది పుట్టిస్తుంది అందమైన రూమర్లు. బాధించే రూమర్లు. కంపెనీలను లాస్ చేయించే రూమర్లు. కెరీర్ను దెబ్బదీసే రూమర్లు. మంచి రూమర్లు ఎక్కువ కాలం బతకవు. బతికినా వెంటనే చనిపోతాయి. చెడ్డ రూమర్లే.. ‘పాపి చిరాయువు’లా బతికేస్తుంటాయి! రూమర్లంటే ఎవరైనా భయపడి చచ్చేది అందుకే. సెలబ్రిటీలకైతే రూమర్లంటే మహా వణుకు. నోరు మెదపరు. వాళ్ల నోట్లో వేలుపెట్టి కోపం తెప్పించి, వేలు కొరికించుకుని రూమర్లు క్రియేట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అసలు నోరు, వేలు, కోపం, కొరకడం.. ఇవేవీ లేకుండానే పుట్టే రూమర్లూ ఉంటాయి! నానీ ‘జెర్సీ’ బాగుందని జూ‘‘ ఎన్టీఆర్ ఎక్కడో ఒక ట్వీటో, చిన్న మాటో వేశాడు. అక్కడో రూమర్ పుట్టేసింది. ‘కథానాయకుడు’ బాగుందని అనలేదు. ‘మహానాయకుడు’ బాగుందని అనలేదు. ‘జెర్సీ’ బాగుందని అన్నాడు. తాతగారి మీద తీసిన ఆ రెండు బయోపిక్కుల్లో తనకు పాత్రే లేకుండా చేసినందుకు జూ‘‘ ఎన్టీఆర్ అలా రివెంజ్ తీర్చుకున్నాడని రూమర్. అర్థం లేని రూమర్లపై ఎవరైనా ఎందుకు మాట్లాడతారు. ఎన్టీఆర్ కూడా మాట్లాడలేదు. లోకంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా రూమర్లకు అనువుగా ఉండేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. హాలీవుడ్లో రోజుకు లక్ష రూమర్లు పుట్టుకొస్తుంటాయి. బాలీవుడ్లో వెయ్యి రూమర్లు ఉసురు పోసుకుంటాయి. మన తెలుగువుడ్ ఇంకా అంత ‘డెవలప్’ కాలేదు. నయం అనుకోవాలి అంతగా డెవలప్ కాకపోవడం. షూటింగ్ స్పాట్ వరకైతే ఓకే. మరీ ఇళ్లలోకి వెళ్లిపోకూడదు కదా. కానీ పబ్లిక్ పర్సన్స్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దేన్ ప్రైవేట్ పర్సన్స్ పబ్లిక్ లైఫ్. మానవ నైజం. ‘సైరా’ సెట్లో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంటికెళ్లాక పెరట్లో మొక్కలకు ట్యూబ్ పట్టుకుని నీళ్లు పడుతున్నప్పుడు చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ‘‘సరే రావయ్యా.. మొక్కలకు నీళ్లు పడుతున్నప్పుడు ఒక ఫొటో తీసుకో’’ అని చిరంజీవి అంటారేమో. అయితే ఇండస్ట్రీలో అంత ఈజీగా ఏదీ ఉండదు. ఈజీగా లేని పరిస్థితుల్లో ఈజీగా పుట్టేవే రూమర్లే. దసరాకి కాదా సైరా ‘సైరా నరసింహారెడ్డి’ ఈ దసరాకు విడుదల కానట్లేనా! అనే రూమర్ ఇప్పుడు రౌండ్లు కొడుతోంది. మెగాస్టార్ అభిమానుల డీలా పడిపోయారు. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత పదేళ్లకు ‘ఖైదీ నెం.150’గా సాక్షాత్కరించారు చిరు. మళ్లీ రెండేళ్ల గ్యాప్! సైరా కోసం అవురావురుమని చూస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుందని చూస్తుంటే రూమర్ రిలీజ్ అయింది.. దసరాకు విడుదల కావడం లేదని!! దర్శకుడు సురేందర్రెడ్డి. నిర్మాత రామ్ చరణ్. భారీగా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ అవుతోందనీ, క్లయిమాక్స్కి వచ్చేశామని కూడా చెప్పారు. ఇప్పుడేమిటి దసరాకు కాదంటున్నారు? సెట్లో అగ్నిప్రమాదం జరిగింది కదా, అందుకే లేట్ అవుతోందని ఒక రూమర్. లేట్ చేయించడానికే అగ్నిప్రమాదం సృష్టించారని ఇంకో రూమర్. రామ్ చరణ్కి ప్రకటన ఇవ్వక తప్పలేదు. ‘‘అవును.. సైరా దసరాకు విడుదల కావడం లేదు’’ అన్నాడు. ఆ వెంటనే.. ‘‘అక్టోబర్ 2కి విడుదల చేస్తున్నాం’’ అన్నాడు. చిరు అభిమానులు ఆనందంతో షాక్లోకి వెళ్లిపోయారు. అక్టోబర్ 2.. ఈ ఏడాది దసరాకంటే ముందొచ్చేస్తోంది మరి! దసరా అక్టోబర్ 8న. ఆశించినదానికి ఆరు రోజులే ముందే అయినా ఫ్యాన్స్కి అదో పెద్ద పండుగ. అయితే రామ్ చరణ్ నిజంగానే అలా అన్నారా లేక అన్నారని ఒక రూమరా?! ఏమైనా ఉల్లాసం కలిగించే సంగతే. గుడ్ రూమర్. ఏమి సేస్తిరి.. ఏమి సేస్తిరి?! చిరు ఇంట్లోనే సగానికి పైగా సినిమా ఇండస్ట్రీ ఉంది. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, పొలిటికల్ లీడర్స్ అంతా కలిపి పదిమందికి పైగా ఉన్నారు. అంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సహజీవనం చేస్తుంటుంది. పవన్ కల్యాణ్ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాడని ఆ మధ్య ఒక రూమర్ వచ్చింది. ఇప్పుడు అల్లు అరవింద్కి, ఆయన కొడుకు అల్లు అర్జున్కి సినిమాలు తీసే విషయంలో మాటామాట వచ్చింది మరో రూమర్! రాజకీయంగా కూడా చిరంజీవి మీద, పవన్ కల్యాణ్ మీద అనేక రూమర్లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు అవుట్ డేటెడ్. అప్డేట్ ఏంటంటే.. పవన్ కల్యాణ్కు హీరో రాజశేఖర్ కౌంటర్ ఇచ్చాడని! ఇవ్వడం అంటే డైరెక్ట్గా కాదు. ఇన్డైరెక్ట్గా. ‘కల్కి’లో రాజశేఖర్ హీరో. గత గురువారం విడుదలైన ‘కల్కి’ టీజర్లో రాజశేఖర్ ‘ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా?’ అంటూ ‘గబ్బర్సింగ్’లో పవన్ని ఇమిటేట్ చేస్తాడు. గబ్బర్సింగ్లోని రౌడీల అంత్యాక్షరి సీన్లో.. రౌడీలను కమెడియన్లా పాడిస్తూ పవన్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక కమెడియన్ లేచి, హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సాంగ్ ‘రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా’ అనే సాంగ్ని ఎత్తుకుంటాడు. రాజశేఖర్ని ఇమిటేట్ చేస్తూ సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ప్రేక్షకులు నవ్వలేక చచ్చిన సీన్ అది. ఆ రౌడీ కమెడియన్.. సాంగ్ని పూర్తి చెయ్యగానే ‘ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి. ఎప్పుడూ ఇలాగే సేస్తురా.. ఈ మధ్యనే ఇలాగే సేస్తున్నారా?’ అంటాడు. అప్పట్లో రాజశేఖర్కి, చిరంజీవికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని పవన్ కావాలనే ఆ డైలాగులతో రాజశేఖర్కి కౌంటర్ ఇచ్చారని ఒక రూమర్ వచ్చింది. ఆ సీన్ని దృష్టిలో పెట్టుకుని ‘కల్కి’లో ఇప్పుడు రాజశేఖర్ పవన్కి కౌంటర్ ఇచ్చాడని రూమర్. ఈ రూమర్కి బొత్తిగా బేస్ లేకుండా ఏమీ లేదు. కల్కి టీజర్ ఎండింగ్లో.. సేమ్ అదే కమెడియన్ని... పోలీస్ గెటప్లో ఉన్న రాజశేఖర్ (గబ్బర్సింగ్లోని రౌడీ అంత్యాక్షరిలో పవన్దీ పోలీస్ గెటప్పే) కాలితో తంతాడు.. ‘ఏంట్రా ఆ ఊపుడు’ అంటూ.. నన్నే ఇమిటేట్ చేస్తావా అన్నట్లు. దీంతో రూమర్ క్రియేట్ అయి చక్కర్లు కొడుతోంది.. గబ్బర్సింగ్తో రాజశేఖర్ని పవన్ దెబ్బకొడితే, కల్కితో పవన్ని రాజశేఖర్ దెబ్బకు దెబ్బ కొట్టాడని. కనిపించవేం ప్రభాస్ ‘సైరా’లా, అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంకో సినిమా ప్రభాస్ నటిస్తున్న ‘సాహో. 2017 జూన్లో షూటింగ్ మొదలైంది. ఇప్పటికింకా షూటింగ్ నడుస్తూనే ఉంది. సినిమా మాట తర్వాత సంగతి విడిగానైనా ప్రభాస్ని చూద్దామంటే ఆయనెక్కడా కనిపించడం లేదు. ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో అని బెంగ పెట్టేసుకున్నారు ఫాన్స్. సాహో డైరక్టర్ సుజీత్ని తిట్టుకుంటున్నారు కూడా. అంత లావున ఏం తీస్తున్నాడో అని. అప్పుడప్పుడు ప్రభాస్ని కూడా! డార్లింగ్ అనీ, మిస్టర్ పర్ఫెక్ట్ అనీ హాయిగా ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించక ఎందుకీ భారీ ప్రాజెక్టులు అని వారి ఆవేదన. ప్రభాస్ కెరీర్ గురించి కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాహుబలి, సాహో.. ఇలా ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తీసుకుంటూ పోతుంటే ప్రభాస్ బాడీ ఏమౌతుంది? ఆ తర్వాత కెరీర్ ఏమవుతుంది? కెరీర్ని పనిగట్టుకునేం నిర్మించుకోనవసరం లేదు. ప్రభాస్కి క్రేజ్ ఉంది. నిర్మాతలు వచ్చేస్తారు. పాత్రల కోసం బాడీని ఫ్లక్చువేట్ చేసుకుంటూ పోతుంటే.. ఫిట్నెస్ దెబ్బతిన్నాక ఏ నిర్మాత దగ్గరికొస్తాడు? ఇవన్నీ రూమర్లు కాదు. చింతాక్రాంతులైన అభిమానుల సందేహాలు. మరి రూమర్ ఏమిటి? సాహూలో ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఆ లెవల్లో అంటే.. ప్రేక్షకుల అంచనాలు అంతకుమించిన లెవల్లోనే ఉంటాయి. అయితే దర్శకుడు సుజి తెరకెక్కించిన కొన్ని కీలకమైన సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేనంత వీక్గా ఉన్నాయని, వాటిని మళ్లీ రీషూట్ చేయాలని దర్శకుడిని అడిగితే అతడి ఇగో హర్ట్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. రీషూట్ కోసం ప్రభాస్ అడగడం నిజమైతే ఉండొచ్చు కానీ, దర్శకుడి ఇగో హర్ట్ అవడం మనవాళ్లు కల్పించిన రూమర్ అయి ఉండడానికి ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి. సుజీత్ నిన్నమొన్నటి కుర్రాడు. ఇరవై మూడేళ్ల వయసులో ‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హిట్ కొట్టాడు. తర్వాత మూడేళ్లకు సాహో మొదలు పెట్టాడు. రెండు సినిమాలకే మనిషి ఎదగవచ్చేమో కానీ, మనిషిలోని ఇగో సాధారణంగా ఎదగదు. ముందనుకున్న డేట్ ప్రకారం ఆగస్టు 15న సాహో విడుదల కావాలి. అయితే రీషూట్ల కారణంగా ఆ తేదీకి విడుదల కాకపోవచ్చని ఒక రూమర్. నిప్పు లేకుండా పొగ రాదని అంటారు. కానీ నిప్పు లేకుండానే పొగ తెప్పించేస్తుంది రూమర్. ఎంటర్టైన్మెంట్ ఇండస్త్రీలో రూమర్లు సాధారణమే. అయితే అవి వ్యక్తిగతాల్లోకి వెళ్లి మనసుల్ని పాడు చేసేంతగా ఉండకూడదు. ఇమేజ్ని దెబ్బతీయకూడదు. భవిష్యత్తును నాశనం చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యేలోపు రూమర్ ఒక టీజర్లా ఉండాలి తప్ప, ఎవర్నీ టీజ్ చేసేలా ఉండకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు... ఈ మధ్య డైరెక్టర్ తేజ మీద కూడా కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ మధ్యే అనేం ఉంది. తేజ నిక్కచ్చిగా మాట్లాడతాడు. దానిని అర్థం చేసుకోలేనివాళ్లు రూమర్స్ క్రియేట్ చేస్తారు. కావాలని చెయ్యరు. వాళ్లన్నవి, అనుకున్నవి రూమర్స్ అయిపోతాయి. చెప్పినట్లు చెయ్యకపోతే తేజ హీరోయిన్లపై చెయ్యి చేసుకుంటాడని ఎప్పటి నుంచో ఉన్న రూమర్. ఈ మధ్య ఒక న్యూస్ చానెల్కు తేజ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. ఇలాంటి రూమర్లను నవ్వుతూ కొట్టిపడేశారు. ఆ ఇంటర్వ్యూలోనే తేజ.. ‘నేనెప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ’ అన్నాడు. ఇక రూమర్లు మొదలయ్యాయి. ఆయన అన్న సందర్భం వేరు. తేజ ‘సీత’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. మే 24న విడుదల అవుతోంది. ఆ సినిమా కథ చెప్పడం కోసం కాజల్తో కూర్చుంటే.. ఆ పాత్రకు తను బాగా కనెక్టయి.. ఎప్పుడు డిస్కషన్స్కి కూర్చుందాం అన్నా వెంట పడి వచ్చేస్తుంది అనే అర్థంలో తేజ ఆ మాట అన్నారు. ముందు వెనకల్ని వదిలేసి ‘ఎప్పుడు పిలిస్తే అప్పుడు’ అనే ముక్కను పట్టుకోవడంతో అది రూమర్ అయింది. మహిళలకు తేజ రెస్పెక్ట్ ఇస్తారు. అతడి సినిమాల్లోని మహిళల పాత్రలూ ఇండివిడ్యువాలిటీతో ఉంటాయి. సీతనే తీసుకుందాం. అందులో కాజల్ డామినేటెడ్ రోల్లో డిఫరెంట్గా కనిపించబోతోంది. సీత అంటే మనకో సంప్రదాయ భావన ఉంటుంది కదా. దానికి భిన్నంగా ఉంటుంది కాజల్. అలాగని సంప్రదాయ విరుద్ధంగా ఏమీ ఉండదు. టీవీ ఇంటర్వ్యూలో కాజల్ గురించి తేజ మరో మాట కూడా చెప్పారు. ఇండస్ట్రీలో.. ఎవరు సక్సెస్లో ఉంటే వారి వెనుక పడి వస్తారు. కాజల్ అలాక్కాదు. తనకు సక్సెస్లు, ఫెయిల్యూర్స్తో నిమిత్తం లేదు. కథ నచ్చితే వెంటపడి చేస్తుంది అని అన్నారు. తేజ స్ట్రయిట్ ఫార్వార్డ్. అనవసరంగా ఒకర్ని పొగడరు. తిట్టాల్సి వస్తే తిట్టకుండా వదలరు. ఈ ముక్కుసూటి ధోరణి కారణంగా రూమర్స్కి ఆయనో నాణ్యమైన ముడిసరుకు అవుతున్నారు ఎప్పటికప్పుడు. -
యువతి ఫోటోలు మార్ఫింగ్, ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, భీమవరం : ప్రయివేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తూ విజ్ఞానంతో వికృత చేష్టలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్కు దిగి మనోవేదనకు గురిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సేనపరిగి హిమతేజకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్బుక్ పరిచయాన్ని ఆపేసి, మాట్లాడటం మానేసింది. ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తర్వాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు. వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావేంటని అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అభినవ ‘సీత’రాముల కథ
వరుసగా మాస్ సినిమాలు చేస్తూ సక్సెస్ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇన్నాళ్లు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్ సినిమా చేశాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. సినిమాలో కీలక పాత్రలను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇన్నాళ్లు సీరియస్ యాక్షన్ రోల్స్ లో కనిపించిన శ్రీనివాస్ ఈ సినిమా కామెడీ టచ్ ఉన్న పాత్రలో నటించాడు. అయితే తన మార్క్ యాక్షన్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పడినట్టుగా తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
మే 24న రాబోతోన్న ‘సీత’
‘కవచం’ సినిమాతో రీసెంట్గా పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్కు ఆశించిన విజయం దక్కలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో మరోసారి కాజల్ అగర్వాల్తో కలిసి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో రాబోతోన్న మరో చిత్రం ‘సీత’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈపాటికే విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని సరైన సమయం కోసం చూసి వేసవి చివర్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సోనూసూద్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించంగా డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బుల్.. బుల్.. బుల్లెట్టు మీదొచ్చె..!
మాస్ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. కాజల్ అగర్వాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సీత యూనిట్ తాజాగా సినిమాలోని మాస్ సాంగ్ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్పై చిత్రీకరించిన స్సెషల్ సాంగ్ను బుధవారం రిలీజ్ చేశారు. అనూప్ రుబెన్స్ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
సీతని నేను చూసుకోవాలి
బంజారాహిల్స్లో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించినందుకు... అనే డైలాగ్తో ప్రారంభమవుతుంది ‘సీత’ సినిమా టీజర్. నువ్వు నాలా ఉన్న మగాడికి హెల్ప్ చెయ్ పెళ్లి చేసుకుని(సోనూసూద్)... ఈ పెళ్లి, పర్మనెంట్ అటాచ్మెంట్స్ నాకు వర్కవుట్ అవ్వదు(కాజల్), నువ్వు మట్టికొట్టుకుపోతావే.. నువ్వు సీతవికాదే సూర్పణఖవి, ఇంత కంత్రీ పిల్లకి ఆపేరు పెట్టారేమిటా అనుకున్నాను.. పక్కనే శ్రీరాముడు ఉన్నాడన్న సంగతి అర్థం కాలేదు నాకు(తనికెళ్ల భరణి), హలో సార్.. నా పేరు రఘురామ్.. సీతని నేను చూసుకోవాలి, సీత నన్నుచూసుకోవాలని మావయ్య చెప్పారు(సాయి శ్రీనివాస్)... వంటి డైలాగులు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీత’. కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా టీజర్ని విజయవాడలోని వి.ఆర్.సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో రిలీజ్ చేశారు. ‘‘ఈ ఫంక్షన్లో బెల్లంకొండ, పాయల్ రాజ్పుత్ స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్, అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫామెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ వేడుకలో తేజ, నిర్మాత అనీల్ సుంకర, కిషోర్ గరికపాటి పాల్గొన్నారు. -
‘సీత’ సందడే లేదేంటి!
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ కథానాయకుడు కమర్షియల్ సక్సెస్లు మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ తరువాత తేజ దర్శకత్వంలో సీత సినిమాను ప్రారంభించాడు. గత ఏడాది జూలైలోనే తేజ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కవచం సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశారు. కవచం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా సీతకు సంబంధించి ప్రమోషన్ ప్రారంభం కాలేదు. గతంలో ఏప్రిల్ 25న సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఇప్పటి వరకు రెండు పోస్టర్స్ తప్ప సినిమా ప్రమోషన్ ప్రారంభం కాలేదు. దీంతో సీత ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. సాయి శ్రీనివాస్కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతోంది. అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’పై తేజ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా తేజను దర్శకుడిగా తీసుకున్నారు. ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరిగిన తరువాత తేజ తప్పుకోవటంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజకు యన్.టి.ఆర్ కథానాయకుడికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించిన తేజ.. తాను ‘సీత’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా ఆ సినిమా చూడలేదని చూసిన తరువాత స్పందిస్తానంటూ సమాధానమిచ్చారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
తమిళ స్టార్ హీరోతో తేజ!
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘సీత’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. తేజ తన తదుపరి చిత్రంగా ఓ తమిళ స్టార్ హీరోతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ లో సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటుడు విశాల్. కోలీవుడ్లో హాట్ ఫేవరెట్ గా మారిన ఈ తెలుగబ్బాయి చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తేజ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం టెంపర్ రీమేక్గా తెరకెక్కుతున్న అయోగ్య షూటింగ్లో బిజీగా ఉన్న విశాల్, అక్టోబర్ నుంచి తేజ సినిమాకు డేట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. -
‘సీత’ నుంచి ఫస్ట్ లుక్!
బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కోసం ప్రయత్నిస్తూ.. వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్గా కవచం మూవీతో పలకరించినా.. ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న ‘సీత’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్లుక్ను బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి ఫామ్లోకి వచ్చిన డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ‘సీత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండ హీరోకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీకి అనూప్రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Gear up guys.. Here it is!!! Presenting #sitafirstlook.#DirectorTeja @MsKajalAggarwal #freakycouple 😉#HappyRepublicDay2019 pic.twitter.com/CuMyCxFAu9 — Sai bellamkonda (@BSaiSreenivas) January 26, 2019 -
సాఫ్ట్ టైటిల్తో మాస్ హీరో..!
బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ యువ కథానాయకుడు భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయకకు మంచి టాక్ వచ్చిన హిట్ లిస్ట్లో చేరలేకపోయింది. తరువాత చేసిన సాక్ష్యం, కవచం సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రూట్ మార్చాడు ఈ యంగ్ హీరో. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సీత అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జోరు పెంచాడు
యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో జోరు పెంచారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్న మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు శ్రీనివాస్. తాజాగా ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మేజర్ షూటింగ్ విదేశాల్లో ప్లాన్ చేశాం. లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో రూపొందననున్న ఈ సినిమాలో నటించనున్న ఇతర తారాగణం వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొంది చిత్రబృందం. -
కొండ చిలువతో ‘చందమామ’
యంగ్ హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా ఫుల్ ఫాంలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇక కెరీర్ ముగిసిపోనట్టే అనుకుంటున్న సమయంలో బౌన్స్ బ్యాక్ అయిన భామ ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కాజల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్లో జరుగుతోంది. షూటింగ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్స్టాగ్రామ్ పేజ్లో ఈ వీడియోను షేర్ చేశాడు. -
కొండ చిలువతో కాజల్ అగర్వాల్
-
వివాదాస్పదమైన బెల్లంకొండ ఫోటో
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ చిత్రాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే కెరీర్ మలుపు తిప్పే భారీ కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకు దక్కలేదు. తాజాగా ఈ యంగ్ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్లో జరుగుతోంది. షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు సాయి శ్రీనివాస్. అయితే అలా షేర్ చేసిన ఫోటో ఒకటి వివాదాస్పదంగా మారింది. ఏనుగు దంతాలపై కూర్చొని పోజ్ ఇచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలా మూగజీవి మీద కూర్చొని ఫోటో దిగటం జీవ హింస కిందకే వస్తుందంటున్నారు జంతు ప్రేమికులు. అయితే శ్రీనివాస్ ఆ ఫోటోను తన ట్విటర్ నుంచి తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
బెల్లంకొండ కొత్త సినిమా అప్డేట్
అల్లుడు శీనుగా వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడు పెంచాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి శ్రీనివాస్ త్వరలో సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాక్ష్యం షూటింగ్ పూర్తి చేసిన సాయి శ్రీనివాస్ కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన ఐదో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాను ప్రారంభించనున్నారు. సాయి శ్రీనివాస్ ఆరో చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా రేపు (సోమవారం) ఉదయం నానక్రామ్గూడాలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్మీద ఉన్న సినిమాలో సాయి శ్రీనివాస్కు జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తదుపరి చిత్రలోనూ హీరోయిన్గా నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
తేజ నెక్ట్స్ సినిమా ఫిక్స్!
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తరువాత దర్శకుడు తేజ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ, తరువాత చాలా కాంబినేషన్స్ను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నా అది పట్టాలెక్కలేదు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తానే తప్పుకున్నాడు. రానాతో మరో సినిమా అనుకున్నా రానాకు ఖాలీ లేకపోవటంతో కుదరలేదు. దీంతో తేజ మరో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తేజ కొత్త సినిమాపై మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. తేజ తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్. అంటే వరుసగా రెండు సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. -
కొత్త హీరోతో కాజల్..!
మరో స్టార్ వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య తన కుమారుడ్ని హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎంతో మంది నటులను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
‘ఎన్టీఆర్’ రిలీజ్.. అదే రోజు ఎందుకంటే..!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న చివరి నిమిషంలో దర్శకుడు తేజ తప్పుకోవటంతో వాయిదా పడింది. త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ను ప్రారంభించనున్నట్టుగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ను జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 9నే రిలీజ్ డేట్గా ప్రకటించటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తొలిసారిగా జనవరి 9నే ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో చారిత్రక ప్రాదాన్యం ఉన్న అదే రోజు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
మైనర్పై టీడీపీ నేత కుమారుడి లైంగిక దాడి
సాక్షి, గుంటూరు : ‘మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.. ఇలాంటి వారిని మహిళలు రోడ్లపైకి ఈడ్చి బుద్ధి చెప్పాలి..’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన సమయంలో గుంటూరు వచ్చిన ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో హెచ్చరికలు చేయడంతో అంతా నిజమని నమ్మారు. అయితే ఆయన హెచ్చరించిన వారం రోజులకే అదే దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై టీడీపీ మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా గర్భవతిని సైతం చేసిన దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారే తప్ప, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. మంత్రి నియోజకవర్గంలో మరో అమానుషం.. తాజాగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అధికార పార్టీ నేత తనయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేతలే నిరుపేద బాధిత కుటుంబాన్ని డబ్బుతో మభ్యపెట్టి కేసు లేకుండా చేశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులం పరువు పోతుందంటూ కొందరు అధికార పార్టీ నేతలు పంచాయితీ చేసి బాలిక కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేలా మాట్లాడి కేసు లేకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు అత్యాచార ఘటన గురించి వివరాలు తెలిసినప్పటికీ అధికార పార్టీ నేత తనయుడు కావడంతో రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీనిపై ఈనెల 13న‘మైనర్ బాలికపై టీడీపీ నేత తనయుడి లైంగిక దాడి’ శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందించిన ఎస్పీ వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరు వెళ్ళిన సమయంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. అమానుష ఘటన వివరాలివీ... అమృతలూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శరణు విశ్వతేజ అనే యువకుడు ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి రామమందిరం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష్ణుతేజ తండ్రి నాగేశ్వరరావు అధికార పార్టీ ముఖ్యనేత. గతంలో ఆయన కూచిపూడి నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మృగాడి బెదిరింపులతో విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు బాలిక భయపడింది. ఇది జరిగిన రెండు రోజులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసేందుకు కుమార్తెతో కలసి పోలీసు స్టేషన్కు వెళుతుండగా, మృగాడి బంధువులు ఆమెను అడ్డుకుని కుల పెద్దలు, అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టారు. బాలిక కుటుంబం పూరిగుడిసెలో నివాసం ఉంటూ కటిక బీదరికంతో ఇబ్బందులు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని బాలికపై అమానుషానికి వెలకట్టేందుకు వెనుకాడలేదు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు తెలిసినా... అత్యాచార ఘటన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ వారిద్దరూ రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. బాలిక కుటుంబానికి మాత్రం కేవలం రూ.4 లక్షలు చెల్లించారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’ దీనిని వెలుగులోకి తెచ్చింది. రూరల్ ఎస్పీ చొరవతో... విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరుకు వెళ్ళిన సమయంలో బాలికను, ఆమె తల్లిని పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాలిక, ఆమె తల్లితో డీఎస్పీ స్నేహిత మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇచ్చి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అమృతలూరు అధికార పార్టీ నేతలు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని డబ్బుతో ఆడపిల్లపై అమానుషానికి పాల్పడితే దానికి వెలకట్టే దుశ్చర్యకు పాల్పడ్డారు. విషయం బయట పడడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి పెంచే యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. -
వాస్తవ సంఘటనలతో...
సోమవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజకిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. సినిమాకు మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గీతాంజలి, త్రిపుర’ చిత్రాల దర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్ర పటానికి నమస్కరించి, చిత్ర పటంపై క్లాప్నిచ్చి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలైన ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే థ్రిల్ మెయింటేన్ చేస్తుంది. జూన్ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి నాయకా,నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అన్నారాయన. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడైన ఆకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్:ఉపేంద్ర, ఆర్ట్:చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ–స్క్రీన్ప్లే–దర్శకత్వం: రాజకిరణ్ -
బాలయ్య సొంత బ్యానర్లో మరో సినిమా
కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించిన బాలయ్య, దర్శకుడు తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో ఆ చిత్ర షూటింగ్ను తాత్కాలికంగా పక్కకు పెట్టారు. ఈ గ్యాప్లో వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. అంతేకాదు తనకు సింహా, లెజెండ్ లాంటి ఘనవిజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్.బి.కె ఫిలింస్ బ్యానర్పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ను కూడా బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఎన్టీఆర్’ని పక్కన పెట్టేశారా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో కూడా తేజ దర్శకుడిగా కొనసాగారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు తాను ఎన్టీఆర్కు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక దశలో బాలయ్యే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరింత ఆలస్యమవుతుండటంతో బాలయ్య మరో సినిమా ప్రారంభించాలనుకుంటున్నారట. చాలా రోజులుగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సీ కల్యాణ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ను పక్కన పెట్టి ఈ సినిమాను ముందుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట నందమూరి నటసింహం. అయితే ఈ విషయంపై ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
మరో వార్ డ్రామాలో రానా..?
ఈ జనరేషన్ హీరోల్లో పీరియాడిక్, హిస్టారికల్ పాత్రలకు తగ్గ నటుడంటే ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించిన రానా.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో కూడా ఆ తరహా పాత్రల్లోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా.. 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా సైనికుడిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మరో మూవీ హాథీ మేరి సాథీలోనూ నటిస్తున్నాడు రానా. తరువాత ట్రావెన్కోర్ రాజు మార్తండ వర్మ కథతో అదే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో వార్ డ్రామాకు రానా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా ఘనవిజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ఈ సినిమా భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనుందట. అయితే ఈ వార్తలపై హీరో రానా, దర్శకుడు తేజ ఇంతవరకు స్పందించలేదు. -
మరో సీనియర్ హీరోతో తేజ..?
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ఆ సినిమా తరువాత సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయటం రాదంటూనే వరుసగా స్టార్ హీరోల పేర్లు తెర మీదకు తెస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తరువాత సీనియర్ హీరో వెంకటేష్తో ఓ సినిమాను ప్రారంభించాడు తేజ. ఆ సినిమాకు సంబంధించి వెంకటేష్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ లోగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ (బయోపిక్) ప్రారంభం కావటంతో వెంకటేష్ సినిమాకు బ్రేక్ పడింది. కానీ తాను ఎన్టీఆర్ ప్రాజెక్ట్ను ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దలేనన్న భావనతో బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు తేజ. వెంకటేష్ సినిమా ఆగిపోవటం, ఎన్టీఆర్ సినిమా నుంచి తానే తప్పుకోవటంతో ఇప్పుడు మరో సీనియర్ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట ఈ క్రియేటివ్ డైరెక్టర్. కింగ్ నాగార్జున హీరోగా ఓ సినిమా చేయాలని తేజ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాను పూర్తి చేసిన నాగ్, ప్రస్తుతం యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావటానికి కాస్త సమయం పడుతుంది. మరి అప్పటి వరకు తేజ వెయిట్ చేసి నాగ్తో సినిమా చేస్తాడా..? లేక మరో ప్రాజెక్ట్ను లైన్లోకి తీసుకువస్తాడా చూడాలి.