Telugu Serial Latest Episodes
-
Karthika Deepam: మోనితకు ఊహించని ట్విస్ట్, గీతలు చెరిపేసిన దీప
కార్తీకదీపం జూలై 8వ ఎపిసోడ్: కార్తీక్ సౌందర్య అమెరికా వెళ్లిందని చెప్పగానే మోనిత సాక్షి సంతకాల పెట్టడానికి తప్పించుకోడానికే వెళ్లిందా? అంటుంది. ఇక తను మౌనంగా ఉండే పని కాదని, ఎదోకటి చేయాలంటూ కార్తీక్ వెళ్లిపోమ్మని చెబుతూ కారు ఎక్కబోతుంటే కార్తీక్ ఆమె చెయి పట్టుకుని ఆపుతాడు. ఆ తర్వాత ఇక తాను చేయని తప్పుకు దోషిలా ఉండలేనని, తన ప్రేమయేయం లేకుండా జరిగింది తన తప్పుల జాబితాలో చేరదు అని గట్టిగా అరిచి చెబుతాడు కార్తీక్. అంతేగాక ‘నీ నాపై ప్రేమ, వదిలేస్తాననే భయం లాంటివి కనిపించడం లేదు. కావాల్సిన దాని కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది’ అని అనడంతో మోనిత ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగే ‘స్నేహం కావాలంటే ముందు వరుసలో ఉంటా. అంతేగాని న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. మౌనంగా భరిస్తున్న కదా అని ఈ దోషాన్ని దీప, మా అమ్మకు అంటగట్టాలని చూస్తే అది సహించను. నా తప్పు లేకుండా జరిగిందానికి నేను నైతిక బాధ్యత వహించలేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత షాక్ అవుతూ ప్రియమణి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు అందరిలాంటి మగాడు కాదని, తన భార్య, తల్లి, కుటుంబం జోలికి వస్తే ఊరుకోడని ఆమె అన్న మాటలను తలచుకుని కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ హిమ, శౌర్యలకు కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువెళతాడు. హిమ, శౌర్యను పిలిచి నాన్న డాడీ మీకు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమ్మని చెబుతాడు. పిల్లలు అవి వేసుకోని రాగానే సెల్ఫీ తీసుకుందామని, దీపను కూడా పిలిచి తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలతో ఈ ఫొటో మన సెల్ఫోన్ అన్నింటిలో ఆ ఫొటోనే వాల్పేపర్గా ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత వారికి తెచ్చిన బట్టలను మీ స్నేహితులకు చూపించుకోమ్మని వెళ్లండని చెప్పి పిల్లలను బయటకు పింపిస్తాడు. ఆ తర్వాత దీపను కుర్చీలో కూర్చోబెట్టి ‘నా ప్రవర్తన నీకు కొత్తగా అనిపించోచ్చు దీప. కానీ ఇన్ని రోజులు నా తప్పు లేకుండానే నేను తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉన్నాను. ఇక నుంచి అలా ఉండదు. ఈ 25 తేదీలోపు ఈ సమస్య తప్పకుండా పరిష్కారం దొరుకుంది. నన్ను నమ్ము దీప’ అంటూ ఆమె మీద ఒట్టు వేస్తాడు. తరువాయి భాగం.. ఆదిత్య, దీప దగ్గరికి వచ్చి వదినా అన్నయ్య తప్పు చేశాడో లేదో అది నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి నీకు చెబుతాను అంటూ దీప విజనగరం వెళ్లినప్పుడు కార్తీక్ను నిలదీసిన విషయం చెబుతాడు. అప్పుడు అన్నయ్య మరోసారి పరీక్షలు చేయించుకుంటానని తనతో అన్నది చెబుతాడు. అంతేగాక అన్నయ్య ల్యాబ్ కూడా వెళ్లాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగానే ఇందులో ఏమైనా ఉందేమో? ఇప్పుడు మనం ఏం చేద్దాం వదిన అనగానే, ఆదిత్యను ఆ ల్యాబ్కు వెళ్లి కనుక్కొమ్మంటుంది. అంతేగాక గోడ మీద మోనిత గీసిన గీతలను తడి గుడ్డతో చెరిపేస్తుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
నందును ఎగరేసుకుపోయిన లాస్య, ఒంటరైన తులసి!
Intinti Gruhalakshmi July 8వ ఎపిసోడ్: నందు, తులసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. బృందావనంలా కళకళలాడిన ఈ ఇంటిని చీల్చడానికి శూర్పణఖలా దిగింది మాయదారి లాస్య. ఆమె రాకతో నందు, తులసి మధ్య ఎంతటి అగాధం ఏర్పడింతో అందరికీ తెలిసిందే. ఆమె మాయలో నుంచి తన భర్తను బయటపడేసి తిరిగి తనదారికి తెచ్చుకోవాలన్న తులసి ఎంతగానో ప్రయత్నించింది, కానీ ఆమె కల కలగానే మిగిలిపోయింది. తులసి, నందుల విడాకుల ఘట్టం ఆఖరి దశకు చేరుకుంది. ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు కోర్టుకు చేరుకున్నారు. ఇంకా కోర్టు లోపలకు కూడా వెళ్లకముందే మరోసారి గొడవకు దిగారు. ఈ వాదనల వల్ల కొత్తగా ఏ ప్రయోజనమూ లేదంటూ తులసి అక్కడి నుంచి విసురుగా లోనికి వెళ్లిపోయింది. 'విడాకుల అర్జీ పెట్టుకుని సరిగ్గా ఏడాదవుతోంది. గతసారి వచ్చినప్పుడు మీ భార్య తన కాళ్ల మీద తను ఎలా బతుకుతుందో అని భయపడ్డారు. మరి ఇప్పుడు ఆ విషయంలో మీకు ఏదైనా భరోసా దొరికిందా?' అని జడ్జి నందును ప్రశ్నించగా అసలు ఆ విషయం గురించి తనకు అవసరం లేదని తేల్చి చెప్పాడు. దీంతొ మీ వల్ల కన్నీళ్లను దిగమింగుకున్నాను, ఎన్నో బాధలను భరించాను అని తులసి కంటతడి పెట్టుకుంది. అలా వీరిద్దరి మధ్య వాదన మొదలైంది. నీ వల్లే కోర్టు మెట్లెక్కానంటూ ఇద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు. దీంతో వారిద్దరినీ జడ్జి వారించారు. అనంతరం నందు నుంచి భరణం ఆశిస్తున్నారా? అని తులసిని అడిగాడు. అందుకు ఆమె తనకు విడాకులు మాత్రమే ఇప్పించండని, ఇంకేదీ వద్దని చెప్పింది. దీంతో జడ్జి వారికి విడాకులు మంజూరు చేశాడు. దీంతో తులసి ఏకాకిగా మారగా నందు మాత్రం లాస్యతో వెళ్లిపోయాడు. -
Karthika Deepam: అర్జెంటుగా అమెరికా వెళ్లిన సౌందర్య, షాక్లో మోనిత
కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరోవైపు మోనిత కార్తీక్ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది. దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది. ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత. కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది. తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్. -
Devatha : రుక్మిణికి షాక్..ఊహించని కోరికను బయటపెట్టిన సత్య
రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా నిలబడతాడు. నిజం ఏంటో చెప్పాలని దేవుడమ్మ దగ్గరకు వెళ్తాడు. అయితే అసలు ఆదిత్య ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినేందుకు దేవుడమ్మ సిద్ధపడదు. తన పెంపకంపై మచ్చ తీసుకువచ్చావంటూ ఆదిత్యపై నిందలేస్తుంది. కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కనికరం చూపదు. సీన్కట్ చేస్తే.. ఎంత చెప్పినా వినకుండా నువ్వు అనుకున్నదే చేశావంటూ సత్య రుక్మిణిపై కోపంగా ఉంటుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని చెప్తుంది. అదేంటో తెలియాలంటే ఎపిసోడ్లో ఎంటర్ అవుదాం. దేవత సీరియల్ జులై7న 279వ ఎపిసోడ్ నాటి విశేషాలను తెలుసుకుందాం. రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా మిగులుతాడు. ఇది జీర్ణించుకోలేకపోతున్న ఆదిత్య అసలు సత్యతో ఏం జరిగిందన్న నిజాన్ని దేవుడమ్మకు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. తన తప్పు లేదని తల్లికి తెలియజేయాలని అనుకుంటాడు. అయితే ఆదిత్య చెప్పేది వినేందుకు దేవుడమ్మ నిరాకరిస్తుంది. ఇన్నాళ్లుగా పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని అంటుంది. కొడుకు తప్పు చేశాడంటే, అందులో తల్లి పాత్ర కూడా ఉంటుందని, ఈ పాపంలో తననూ భాగం చేశావని చెప్తూ దేవుడమ్మ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజానికి ఇందులో తన తప్పేం లేదని ఆదిత్య చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగానా కనికరం చూపదు. సీన్కట్ చేస్తే.. జరిగిన దాన్ని గుర్తు చేసుకొని సత్య బాధపడుతుంది. ఇలా జరగడానికి కారణం నువ్వే కదా అని రుక్మిణిని నిందిస్తుంది. ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెయ్యాలనుకున్నదే చేశావ్ కదా అక్కా అంటూ రుక్మిణిని నిలదీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తన బిడ్డను ఈ ఇంటి వారసుడిగా చేయాలని సత్య కోరుతుంది. నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటే పరిష్కారం అని బదులిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను నీ బిడ్డగా చూసుకొని పెంచాలని సత్య రుక్మిణిని కోరుతుంది. మరోవైపు రుక్మిణి వద్ద నుంచి సాంత్వన పొందాలని ఆదిత్య భావించినా అవి కలలుగానే మిగిలిపోతాయి. తను ఎంతలా బాధపడుతున్నా రుక్మిణి ఆదిత్యను దగ్గరికి తీసుకోదు. సీన్ కట్ చేస్తే..తన ఇద్దరి కూతుళ్ల జీవితాలు ఇలా అయిపోయాయంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. ఒకరికి న్యాయం చేస్తే..మరొకరు బలవుతారంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. -
తులసి- నందుల విడాకుల కథ క్లైమాక్స్కు!
Intinti Gruhalakshmi July 7th Episode: తులసి, నందు విడిపోవాల్సిందేనా అని కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే అనసూయ మాత్రం దెప్పి పొడిచింది. ఎప్పుడెప్పుడు విడాకులు మంజూరవుతాయా? అని తహతహలాడిపోయింది. తులసి పీడ విరగడవుతుందని లోలోపలే ఆనందించింది. ఎప్పటిలాగే తులసి మీద విరుచుకుపడుతూ ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టింది. మనసుకు శూలాల్లా గుచ్చుతున్నా పైకి అవేవీ కనిపించకుండా జాగ్రత్తపడింది తులసి. ఆమెను నానామాటలు అన్న అనసూయ మీదకు విరుచుకుపడింది ఆమె కూతురు మాధవి. నీలాంటి ఆడదాన్ని ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. సాటి ఆడది అనే జాలి లేకుండా వదిన జీవితం నాశనమైపోవాలని కోరుకుంటున్న నీకు పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉందని చీదరించుకుంది. తులసికి విడాకులిస్తే నందు తన సొంతమైపోయినట్లేనని లాస్య తెగ ఆనందపడింది. మరికొద్ది క్షణాల్లో అతడు పూర్తిగా తనవాడు కాబోతున్నాడని సంబరపడిపోయింది. అయితే అప్పటిలోపు నందు మనసు మార్చుకోకుండా చూడమని భాగ్య హెచ్చరించడంతో లాస్య కన్నీటి డ్రామా మొదలు పెట్టింది. విడాకుల విషయంలో ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పడంతో అలాంటిదేమీ లేదని నందు బదులిచ్చాడు. అంతేకాకుండా లాస్యకు ప్రామిస్ కూడా చేశాడు. కోర్టుకు తులసి తల్లి కూడా వచ్చింది. ఎప్పటికైనా మీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అనుకున్న ప్రతీది జరగాలనుకోవడం అత్యాశేనని చెప్పుకొచ్చింది. రేపటి ఎపిసోడ్లో కోర్టు మెట్లెక్కిన నందు, తులసి ఇద్దరూ విడిపోవడానికి తప్పు నీదంటే నీదని నిందించుకున్నట్లు తెలుస్తోంది.. జడ్జి ముందే వాదులాటకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విడాకులు ఖాయంగా కనిపిస్తోంది. -
Devatha : అలా ఎందుకు జరిగిందో వివరించిన ఆదిత్య..
నిజం తెలిసిన భాగ్యమ్మ తన కూతుళ్లకు ఇలా ఎందుకు జరిగిందంటూ బాధపడిపోతుంది. మరోవైపు ఈ పరిస్థితి నుంచి సత్యకు దారి చూపాలని రుక్మిణి భీష్మించుకుంటుంది. ఆదిత్య-సత్యలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీంతో కమల , భాగ్యమ్మ షాక్ అవుతారు. అలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని వివరిస్తారు. అయినా రుక్మిణి మాత్రం పట్టు వీడదు. తను అనుకన్నది చేస్తానని చెప్తుంది. మరోవైపు సత్యతో తనకున్న బంధం, తను గర్బవతి కావడం వంటి విషయాలను ఆదిత్య తన తండ్రికి వివరిస్తాడు. ఇది కేవలం తన ప్రాణాలు కాపాడటం కోసం సత్య చేసిన త్యాగమని, ఇందులో తప్పు లేదని చెప్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జులై 6న 278వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఇంట్లో అందరూ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చిక్కుకుపోయారు. తన ఇద్దరు కూతుళ్లకు ఇలాంటి పరిస్థితి దాపరించింది ఏంటి అంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. మరోవైపు ఇప్పుడు ఏం చేయబోతున్నావ్ అంటూ రుక్మిణిని అడగ్గా..సత్య కోరుకుందే చేయాలని నిర్ణయించుకున్నా అని సమాధానమిస్తుంది. సత్యకు, ఆదిత్యలకు పెళ్లి చేస్తానని చెప్పడంతో కమల, భాగ్యమ్మ షాక్ అవుతారు. ఇలా చేస్తే నీ జీవితం ఏం కావాలంటూ ప్రశ్నిస్తారు. అయినప్పటికీ సత్య జీవితం నిలబడాలి అంటే ఇది చేయక తప్పదు అని రుక్మిణి తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తుంది. సీన్ కట్ చేస్తే..ఇంత తప్పు ఎలా జరిగిందంటూ ఈశ్వర్ ప్రసాద్ ఆదిత్యను నిలదీస్తాడు. దీంతో తాను అనారోగ్యం పాలైనప్పుడు సత్య చేసిన త్యాగాన్ని వివరిస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తనను బతికించడానికి సత్య ఇలా చేసిందని, ఇందులో తమ తప్పు లేదని ఆదిత్య తన గతం గురించి వివరిస్తాడు. కేవలం తన ప్రాణాలు నిలబెట్టడానికి సత్య చేసిన ప్రయత్నమని చెబుతాడు. దీంతో ఆదిత్యను అర్థం చేసుకున్న ఈశ్వర్ ప్రసాద్ ఇదే విషయాన్ని దేవుడమ్మకు చెప్పమని కోరుతాడు. ఆదిత్య తన తల్లి వద్దకు వెళ్లి జరిగిన నిజం గురించి వివరించేందుకు ప్రయత్నించగా, దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తానేమీ వినాలనుకోవడం లేదని బదులిస్తుంది. కొడుకు చేసిన మోసాన్ని తట్టుకొని కుమిలిపోతుంది. మరోవైపు ఆదిత్యను ఓదార్చేందుకు రుక్మిణి ప్రయత్నిస్తుంది. సత్య గర్భవతి కావడంలో ఆదిత తప్పు లేదని తెలుసుకున్న రుక్మిణి మనసు మార్చుకుంటుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : ఆదిత్యకు షాక్ : దేవుడమ్మకు నిజం చెప్పేసిన రుక్మిణి
సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. నిజం చెప్పిన తర్వాతే తన ఇంటి నుంచి బయటకు కదలాలని సత్యపై హుకూం జారి చేస్తుంది. ఈ నిందను తన బిడ్డ ఎందుకు మోయాల్సి వస్తుందని ప్రశ్నిస్తుంది. సత్య క్యారెక్టర్ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి నిప్పులాంటి ఆ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం మరెవరో కాదు నీ కొడుకే అంటూ దేవుడమ్మకు బదులిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జులై 5న 277వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. సత్య కడుపులో బిడ్డకు తన కొడుకుతో సంబంధం అట్టగట్టడంపై నిజం ఏంటో చెప్పాలంటూ సత్యను ఒత్తిడి చేస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెప్పి తీరాలని పేర్కొంటుంది. అయితే సత్య నోరు విప్పక పోవడంతో తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అబద్దాలు చెబుతూ ఏం సాధించాలనుకుంటున్నావ్ అంటూ సత్యను నిందిస్తుంది. గతంలో ఎవరినో తెచ్చి నా బిడ్డకు తండ్రి అని పరిచయం చేశావ్..ఇంత జరుగుతున్నా నోరు తెరవడం లేదంటే నిన్ను ఏ పేరుతో పిలవాలి అంటూ సత్య క్యారెక్టర్ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి అడ్డుపడుతుంది. తన చెల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని ధీటుగా బదులిస్తుంది. సత్య మనసుపడింది, తన బిడ్డకు కారణం మరెవరో కాదు ఆదిత్యే అన్న నిజాన్ని బయటపెడుతుంది. దీంతో దేవుడమ్మ సహా ఇంట్లో వాళ్లందరూ షాక్కి గురవుతారు. అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఆదిత్య ప్రయత్నించగా, దేవుడమ్మ వినేందుకు ఒప్పుకోదు. కన్నకొడుకు అంటే పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని బాధపడుతుంది. నువ్వు కూడా నీ తండ్రి బాటలోనే నడిచావా అంటూ ఆదిత్య వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరోవైపు నిజం తెలిసి ఇన్ని రోజులు మోసం చేసిన సత్యను, ఆ నిజాన్ని కప్పిపుచ్చాలని చూసిన రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రపంచంలో ఇలాంటి అక్కాచెల్లెళ్లు ఎవరైనా ఉంటారా అంటూ ఇద్దరిపై కోపం వెళ్లగక్కుతుంది. సీన్కట్ చేస్తే..దేవుడమ్మ లాంటి మంచి మనిషికి ఎందుకింత అన్యాయం చేశారంటూ భాగ్యమ్మ తన కూతుళ్లపై చిందులేస్తుంది. ఇలా ఎందుకు చేశారంటూ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజం తెలుసుకున్న దేవుడమ్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
దీపతో మోనిత కండీషన్ గురించి చెప్పి ఎమోషనలైన కార్తీక్
కార్తీకదీపం జూలై 5ఎపిసోడ్: మోనిత వీడియో కాల్ చేసి కార్తీక్ పెళ్లి చీరలు ఎలా ఉన్నాయో నిన్ను అడగమంది అనడంతో దీప రగిలిపోతుంది. ఎంటీదని సౌందర్యను దీప ప్రశ్నిస్తుంది. దీంతో సౌందర్య ఆ మోనిత కావాలనే నిన్ను రెచ్చగోట్టాలని కాల్ చేసి వాడిని ఇరికించిందని నా మనసు చెబుతుంది అంటుంది. అంతేగాక వాడు నిజంగా తప్పు చేశాడంటే తను నమ్మలేకపోతున్నానని, ఇందులో ఏదో తెలియని గూడుపుఠాని ఉందని నా మనసు చెబుతుంది దీప, ఒకసారి మనసుతో ఆలోచించు నువ్వు అంటూ తనతో చివరి వరకు కలిసి పోరాడటానికి సాటి స్త్రీగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపకు భరోసా ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య. ఇక కార్తీక్.. మోనిత దీపకు కాల్ చేసి ఇరికించిన సంఘటననే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచకుంటూ వస్తాడు. అటు వైపే వెళుతున్న సౌందర్య కార్తీక్ను చూసి కారు ఆపుతుంది. కార్తీక్కు ఎదురుగా వెళ్లి ఏమైందరా అని అడగ్గా నా బతుకులాగే కారు కూడా పాడైందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆ మోనిత దగ్గరి నుంచే వస్తున్నావా? అని సౌందర్య ప్రశ్నించడంతో నీకేలా తెలుసంటూ ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్. అప్పుడు కాల్ చేసినప్పుడ దీప పక్కనే ఉన్నానని మరిచిపోయావా? అంటుంది. అవునంటూనే మునిగిపోయాను మమ్మీ సుడిగుండంలో ఊపిరి ఆడనడల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్. కార్తీక్ నుంచి ఆ మాటలు విని సౌందర్య తట్టుకోలేకపోతుంది. జాలిగా పెద్దోడా అంటూ పెళ్లి బట్టల గురించి ఆరా తీస్తుంది. టైం దగ్గర పడుతోందని కార్తీక్ అనగానే స్నేహానికి పరిమితులు ఉంటాయిరా అని అప్పడే చెప్పాను నువ్వు వినలేదని కార్తీక్ను మందలిస్తుంది. అలాగే జరిగిన దాని గురించి ఏం చేయలేమని, జరగబోయేదంటీ? ఆ పెళ్లి, ముహుర్తం సంగతేంటని సౌందర్య కార్తీక్ను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ ఏదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతోంది మమ్మీ.. నమ్మండని.. తను నటించడం లేదు అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. ‘నేను మనసులో ఏం అనుకుంటున్నానో అదే చెబుతున్నాను మమ్మీ. నా తప్పు లేకుండానే బాధ్యున్ని అయ్యాను. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను. కానీ తన ఆశలకి నేను సమాధి కట్టాను. ఇది పాపమా.. శపమా అర్థం కావడం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. సౌందర్య అలా బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్లిన హిమ, శౌర్య అమ్మనాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని భాగ్యాన్ని అడుగుతారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిని త్వరలోనే కలుస్తారంటూ పిల్లలకు సర్థిచెబుతుంది. మరోవైపు దీప మోనిత వీడియో చేసి చీరలు చూపించిన సీన్ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ముందు నిలబడతాడు. జరిగినదానికి క్షమాపణలు కోరుతూ పెళ్లి బట్టలు తను కొనలేదని చెబుతాడు. దీంతో ఆ మోనిత సంగతి తనకు తెలుసని, మీరే ఏంటన్నది తనకు అర్థం కావడం లేదంటూ పెళ్లి డేటు, రిజిస్టర్ మ్యారేజ్పై నిలదీస్తుంది. తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. తడబడుతూనే ఏది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుందంటూ బాధపడుతుంటాడు. దీంతో దీప కోపంగా చూస్తూ అంత కీలు బొమ్మల ఎలా మారిపోయారంటుంది. 25 తారిఖున పెళ్లి అంటున్నారు దాని మాటేంటి అనగానే కార్తీక్ నాకు ‘నా భార్య పిల్లలె ముఖ్యం’ అంటాడు. దీంతో మరీ మోనిత ఒక్కతే వెళ్లి తాళి, పూల దండ వేసుకుని వస్తుందా అని అని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని, మోనితను ఫ్రెండ్లాగే చూశాను కానీ తను నాకు నరకం చూపిస్తుందంటాడు. నువ్వు అన్నట్లుగా నన్ను కీలు బోమ్మను చేసి ఆడుకుంటోందని, ఫోన్ ఎత్తకపోతే బెదిరింపులు, కలవకపోతే హెచ్చరికలు, తనతో కలిసి బయటకు వెళ్లకపోతే సాధింపలు పదే పదే తప్పును అడ్డం పెట్టుకుని నన్ను మరబోమ్మలా మార్చేసింది దీప దగ్గర విలపించుకుంటాడు కార్తీక్. అంతేగాక ఈ పెళ్లికి నిన్ను, అమ్మను తీసుకువెళ్లి సాక్షి సంతకం పెట్టించమని కండీషన్ కూడా పెట్టిందని దీపతో చెప్పడంతో షాక్ అవుతుంది. ఇలా వారి మధ్య వాదన జరుగుతుండా హిమ, శౌర్యలు వస్తారు. వారు రాగానే కార్తీక్ తల దించుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: కార్తీక్, మోనితల పెళ్లిపై సౌందర్యను నిలదీసిన దీప
కార్తీకదీపం జూలై 2: కార్తీక్, మోనితల పెళ్లి విషయం తెలుసుకున్న దీప తండ్రి మురళీ కృష్ణ సౌందర్య దగ్గరికి వస్తాడు. ఈ విషయంపై సౌందర్యను నిలదీయడంతో ఆమె మౌనంగా ఉండిపోతుంది. చెయ్యని తప్పుకు నా బిడ్డ పదేళ్లు శిక్ష అనుభవించింది.. ఇప్పుడు కూడా ఏం చెయ్యారా మీరు? అని ప్రశ్నిస్తాడు. దీనిపై సౌందర్యతో వాదించి చివరకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లగానే సౌందర్య ‘ఓ కన్నతండ్రిగా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకే నా దాగ్గర సమాధానం లేదు. మరీ ఇవే ప్రశ్నలు దీప అడిగితే, ఈ పెళ్లి విషయం గురించి తనకు తెలిస్తే ఏంటి పరిస్థితి’ అంటూ మనసులోనే మదనపడుతుంది. ఇదిలా ఉండగా పిల్లలతో కలిసి కార్తీక్ భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తుంది. హిమ మాట్లాడుతూ మధ్యలో డాడీ మనం బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా అని అంటుంది. దీంతో వెంటనే శౌర్య కూడా అవునవును.. మనం నలుగురం కలిసి బయటికి వెళ్దాం.. చాలా బాగుంటుందని అంటుంది. అలాగే దీపతో అమ్మా నువ్వు కూడా వస్తావు కదా అని అడగ్గానే ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను అంటుంది. అందరం కలిసి బయటి వెళదామని అనగానే కార్తీక్, పిల్లలు సంతోషిస్తారు. అలాగే తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఈ నెల 25 తేదీన మనం నలుగురం కలిసి బయటికి వెళ్దామని, ఆ రోజు డాడీని ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి అనగా కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనిత ఉదయం లేవగానే పొట్టపై చెయి పెట్టుకుని గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మురిసిపోతుంది. 16 ఏళ్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే ఈ తల్లి పెళ్లి చేస్తున్నావు. నువ్వు గ్రేట్ బేటా అంటూ సంబరపడిపోతుంది మోనిత. మరోవైపు సౌందర్య దీప ఇంటికి వస్తుంది. మురళీ కృష్ణ దీపకు పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా? అని భయపడుతూనే లోపలికి వెళ్లేసరికి దీప గుమ్మం దగ్గరే ఎదురు పడుతుంది. రండి అత్తయ్యా అంటూ దీప అతి మార్యాదు చేయడం చూసి సౌందర్య అనుమాన పడుతుంది. ఆ తర్వాత దీప మోనిత, కార్తీక్ల పెళ్లి విషయం గురించి తనకు ఎందుకు చెప్పలేదని దీప సౌందర్యను నిలదీస్తుంది. చివరకు తనలాగే తన పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లున్నాడు ఆ దేవుడు కానీ దీప బతికి ఉండగా.. నా పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అని ఆవేశంగా అంటుంది. అంతేగాక ఇన్నాళ్లు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతుంది. ‘కొన్నేళ్ల పాటు దారుణమైన నిందను మోశాను. అది చెరిగిందో లేదో తెలియదు కానీ మళ్లీ జీవితాంతం అనుభవించడానికి దారుణమైన పరిస్థితి వచ్చింది. నా మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. నా భర్త తప్పు చేశాను తప్పు చేశాను అంటే.. దేవుడు లాంటి మనిషి తప్పు చెయ్యడం ఏంటీ అనుకున్నాను.. ఏదో చెబుతారు ఏదో చెబుతారు అనుకుంటే మోనితోచ్చి కడుపు వచ్చింది అని చెప్పింది. లోపల నా గుండె రగిలిపోతుంది, కడుపు మండుతుంది అత్తయ్యా.. నేను సగటు స్త్రీనే కదా’ అంటూ సౌందర్యతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది దీప. దీంతో సౌందర్య బాధగా దీపా నేనే కాదు.. ఈ విషయం వాడు నీతో చెప్పలేక నలిగిపోతున్నాడే అంటుంది. కానీ దీప మాత్రం అవును, పాపం నిజంగానే నలిగిపోతూనే నిసహాయంగా చూస్తూనే.. దానితో కలిసి 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్ కంగారుగా బయటకు వెళతాడు. ఎక్కడికి అని అడిగిన అర్జేంట్ పనుందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
శోకసంద్రంలో మునిగిపోయిన తులసి, నందు పరిస్థితి కూడా అంతే!
Intinti Gruhalakshmi Juny 2వ ఎపిసోడ్: తండ్రిగా, భర్తగా, కొడుకుగా అన్ని రకాలుగా మీరు ఓడిపోయారని నందును విమర్శించింది తులసి. జీవితంలో ఓడిపోతే అండగా నిలబడేదాన్ని కానీ విలువల్లో ఓడిపోయారని అసహ్యించుకుంది. దీంతో ఆమెకు నచ్చజెప్పాలని చూసిన నందును మధ్యలోనే ఆపేసింది తులసి. ఇన్నాళ్లూ మీరు చెప్పింది, నేను విన్నది చాలని తేల్చి చెప్పింది. దీంతో ఇదే సరైన సమయమనుకున్న లాస్య వీళ్లను శాశ్వతంగా విడగొట్టాలని భావించింది. నీకు విలువ లేని చోట ఉండాల్సిన అవసరం లేదని, మనం వెళ్లిపోదామంటూ నందు చేయి పట్టుకుని లాగింది. అందరి దగ్గర అవమానాలు పడే దుస్థితి మనకక్కర్లేదని చెప్పింది. నందు అప్పటికీ ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో శిలావిగ్రహంలా నిల్చుండిపోతే ఆమె అతడిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయింది. తన భార్య, కుటుంబం నుంచి నందును దూరం చేసింది. నందుకు మానసికంగా విడాకులిచ్చేసిన తులసి భర్త లేకపోయినా తనను ప్రేమించే కుటుంబం ఉందని పైకి ధైర్యాన్ని నటించింది. మీ కొడుకులా మధ్యలో వదిలేసి పోనని, అలా వదలడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకే అని నందు తండ్రితో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నందు కూడా జరిగినదాన్ని తలుచుకుంటూ తెగ బాధపడ్డాడు. విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నా తులసి తనతో తెగదింపులు చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో తనకు తెలియకుండానే అతడిలో అంతర్మథనం మొదలైంది. తను ఎంచుకున్న రూటు సరైనదేనా? అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు. నందు కట్టుకున్న భార్య కోసం తపిస్తాడా? లేదా మధ్యలో వచ్చిన లాస్య చేయి పట్టుకుని నడుస్తాడా?అతడిప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడి తనయుడు -
karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత..
కార్తీకదీపం జూలై 1వ ఎపిసోడ్: కార్తీక్ మనసు బాగాలేక సౌందర్య దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోనిత తన దగ్గరికి వచ్చి వెళ్లిన విషయం సౌందర్య కార్తీక్తో చెబుతుంది. అంతేగాక ఆశీర్వదించండి అంటూ కాబోయే అత్త దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్లిందని కార్తీక్, మోనితకు రిజిస్టర్ మ్యారేజ్ అనే విషయం తనకు తెలిసిందని కార్తీక్ స్పష్టం చేస్తుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలని ధీనంగా అడగ్గా ఏం చేసిన దీప, పిల్లలు, తల్లిదండ్రులైన తమకు, మోనితకు జావాబుదారిగా ఉండాలని అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్ తనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనగానే ‘నువ్వు చేసిన పాపమే’ అంటుంది సౌందర్య. ‘నా కోడలు ఏ తప్పు చేయకపోయిన పదేళ్లు అనుమానించి తనని బాధపెట్టావు, నీ కన్న బిడ్డే నిన్ను నాన్న అని పిలవడానికి సంకోచించేల చేశావు. ఇన్నాళ్ల దాని ఏడుపే నీకు శాపంగా మారింది’ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయలేను మై డియర్ స్టుపిడ్ సన్ అంటూ సౌందర్య కార్తీక్కు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే కార్తీక్కు తల తిరిగినట్టు అయ్యి అక్కడే కూలబడతాడు. మరోవైపు నిజం తెలుకున్న భాగ్యం దీపకు వచ్చి చెప్పేస్తుంది. దీపతో నీ తలరాత ఇలా ఉందేంటే, నీకు జీవితాంతం కష్టాలు తప్పవా? అంటూ మోనిత, కార్తీక్లకు 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అనే విషయం చెబుతుంది. అది విని షాక్ అయిన దీప ఇదేలా సాధ్యమని, దీనికి డాక్టర్ బాబు ఒప్పుకున్నారా? అని అనుమానంగా ప్రశ్నించగా మోనిత రసీదు కూడా చూపించిందని ఏడుస్తూ చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ రోడ్డు పక్కన కారు ఆపి ‘ఈ పెళ్లి ఎలా ఆపాలి. దీపకు ఈ విషయం తెలియకముందే ఇది జరగాలి. అది మోనిత చెప్పినట్లు వింటేనే సాధ్యం అవుతుంది. కానీ మోనిత వినే పరిస్థితిలో లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటీ? ఇంకా ఈ నరకం ఎంతకాలం’ అంటూ కార్తీక్ మదనపడుతుంటాడు. మరోవైపు నిజం తెలుసుకున్న దీప కలవరపడుతూ ఉంటుంది. ‘డాక్టర్ బాబుకు, మోనితకు పెళ్లి జరిగితే, నా పిల్లల భవిష్యత్తు, నా సంసారం, నేను ఏం కావాలి’ అని తలచుకుంటూ బాధపడిపోతుంది. ఈ నిజం తనతో ఎందుకు చెప్పలేదని, ఎవరో బయటి వాళ్లు వచ్చి చెబితే కానీ తెలియలేదు అని ఆలోచిస్తుంది. మోనిత అంటే చెప్పదు పెళ్లి ఆపేస్తానని, మరీ డాక్టర్ బాబు ఎందుకు చెప్పలేదు ఆపకూడదనా? అని అనుకుంటూ మరీ అత్తయ్యా ఎందుకు చెప్పలేదు, చెప్పాలకున్న చెప్పలేకపోయారా? ఎప్పుడు నాకు తల్లిలా తోడు ఉండే ఆమె ఈ సారి కొడుకు నిస్సహయత చూసి ఆమెలోని తల్లి మనుసు చలించి కొడుకు వైపు మళ్లిందా? అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మోనిత అద్దంలో చూసుకుంటూ ‘నా భార్య దీప గుడి కట్టాలి’ అని కార్తీక్ అన్న మాటాలను తలచుకుని రగిలిపోతుంది. అక్కడే ఉన్న పూల ప్లాస్క్తో అద్దాన్ని పగలగోడుతుంది. ఆ శబ్థం అక్కడికి వచ్చిన ప్రియమణి మోనిత సీరియస్గా ఉండటం చూసి భయపడుతుంది. ఏమైందని భయంతోనే అడుగుతుంది. ఇంతలో కాస్తా కూల్ అయిన మోనిత ఇంటి, వంటి పనితోనే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీన్ చేయి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప పిల్లలకు భోజనం పెడుతుండా నాన్న వచ్చాక తింటామని చెబుతారు. దీంతో దీప నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు తినేయండి చెప్పిన వినకుండా లేట్ అయిన వేయిట్ చేస్తామంటూ మారాం చేస్తారు. ఏ పని మీద వెళ్లారో తెలియదు కదా ఎందుకు వేయిట్ చేయడం అనేలోపే కార్తీక్ వచ్చేస్తాడు. కార్తీక్ రాగానే తోందరగా ఫ్రెష్ అయి వస్తే కలిసి తిందాం డాడీ అని హిమ, శౌర్య అడగ్గా సరే అని వెళతాడు. దీంతో పిల్లలు నాన్న చల్ల నీళ్లతో స్నానం చేయడని చెప్పావు కదమ్మా మరేందుకు డాడీకి వేడి నీళ్లు పెట్టలేదని హిమ అడుగుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకే పెట్టలేదని దీప అనడంతో మరీ ఇప్పుడు వెళ్లి పెట్టు అనగానే అది విన్న కార్తీక్ వద్దని సమాధానం ఇస్తాడు. -
లాస్యను చెప్పుతో కొట్టాలన్న తులసి, మౌనంగా ఉన్న నందు
Intinti Gruhalakshmi July 1వ ఎపిసోడ్: అనసూయ దంపతుల పెళ్లిరోజు వేడుక ఘనంగా, సంతోషంగా సాగింది. ఈ సందర్భంగా దంపతుల మధ్య అన్యోన్యతను, సఖ్యతను వివరిస్తూ నందు తండ్రి పెద్ద లెక్చరే ఇచ్చాడు. పెళ్లి గొప్పతనాన్ని వివరించాడు. కానీ ప్రస్తుత కాలంలో ఎంతమంది పెళ్లిని గౌరవిస్తున్నారని తులసి తల్లి సరస్వతి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇదే అదును అనుకున్న లాస్య తోక తొక్కిన తాచులా దిగ్గున లేచింది. ఆవిడ కావాలని నందును పని గట్టుకుని తిడుతోందని పేర్కొంది. అల్లుడిని అవమిస్తున్నావంటూ సరస్వతిని నోటికొచ్చినట్లు తిట్టింది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే చూడలేవా? మొగుడు పోయినదానివి నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ? అని ఈసడించుకుంది. దీంతో సహనం కోల్పోయిన తులసి ఆమె చెంప చెళ్లుమనిపించింది. ఇంకొక్క మాట మాట్లాడితే నిలువునా పాతేస్తానని వార్నింగ్ ఇచ్చింది. "నన్నంటే పడ్డాను, మంచితనంతో ఆడుకుంటే వదిలేశాను, నాది అనుకున్న ప్రతీదాన్ని లాక్కున్నా భరించాను, కానీ నా తల్లి జోలికొస్తే ఊరుకునేదే లేదు" అని హెచ్చరించింది. దీంతో లాస్య.. నా మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకున్నావేంటని నందును రెచ్చగొట్టింది. ఆమె ఒత్తిడి మీద తులసి ముందుకు వచ్చిన నందు.. లాస్య చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. నందు లాస్యకు సపోర్ట్ చేయడాన్ని చూసి తులసి షాక్ తింది. అప్పనంగా వస్తున్న ఆడపిల్ల కనిపిస్తుంది కానీ అప్పగింతల సమయంలో ఆడపిల్లల కన్నీళ్లు మాత్రం కనిపించవని నిందించింది. ఆడపిల్లల తల్లిదండ్రుల గొప్పతనం గురించి పెద్ద క్లాస్ పీకింది. "మీ అత్తను ఇన్ని మాటలు అన్నదాన్ని చెప్పు తీసుకుని కొట్టాలి, కానీ మీరు తన తప్పేంటని అడుగుతున్నారు? అవును, నిజమే.. తప్పు చేసింది నేను. నా భర్త ఏదో ఒకరోజు మారతాడని ఎదురు చూడటమే నేను చేసిన తప్పు. విడాకుల మీద సంతకం చేశాక కూడా మీరు నా సొంతం అవుతారని ఆశపడటం నేను చేసిన తప్పు. ఇప్పుడు చెప్తున్నా వినండి.. ఈ క్షణమే మీకు నా మనస్సాక్షిగా విడాకులిస్తున్నా. ఈ క్షణం నుంచి మీరెవరో, నేనెవరో?" అని తులసి తేల్చి చెప్పేసింది. ఈ హఠాత్పరిణామంతో లాస్య లోలోపలే తెగ సంతోషించింది. అయితే రేపటి ఎపిసోడ్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిన్ను అవమానించే ఈ కుటుంబం నీకొద్దంటూ లాస్య నందును శాశ్వతంగా తన ఫ్యామిలీకి దూరం చేయాలని చూసింది. వాళ్లతో తెగదింపులు చేసుకుందామని నందును అక్కడి నుంచి లాక్కుపోవాలని చూసింది. కానీ నందు మాత్రం శిలావిగ్రహంలా అక్కడే నిలబడిపోయాడు. మరి చివరికి నందు తన కుటుంబంతో ఉండటానికి సిద్ధపడతాడా? లేదా లాస్యతో వెళ్లిపోతాడా? అన్నది ఉత్కంఠగా మారింది. చదవండి: ఇక్కడ ఫెయిలైతే తర్వాత ఏంటి? ప్లాన్ బి కూడా లేదు! రాధే శ్యామ్ క్లైమాక్స్ సీన్ లీక్, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి! -
మోనితకు పిండివంటలు చేసి తీసుకెళ్లిన భాగ్యం
కార్తీకదీపం జూన్ 30 ఎపిసోడ్: ప్రియమణి కంగారుగా మోనితకు ఫోన్ చేస్తుంటే. అప్పటికే ఇంటికి చేరుకున్నమోనిత..వస్తున్నానని చెప్పాను కదే, మళ్లీ మళ్లీ చేస్తావేంటి అని విసుగ్గా అంటుంది. దీంతో ప్రయమణి వచ్చినావిడకి ఏం ఇవ్వమంటారని ఫోన్ చేశానమ్మా అంటుంది. ఎవరు వచ్చారు కార్తీక వాళ్ల అమ్మా.. అనగానే ఆవిడ నాకు తెలుసు కదమ్మా ఈవిడను నేను ఎప్పుడు చూడలేదు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఎవరబ్బా నాకు చుట్టాలు ఎవరూ కూడా లేరు కదా ఎవరో చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. వెళ్లగానే లోపల భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుమానంగా చూస్తుంది. మోనితను చూసి భాగ్యం రారా మోనిత ఏమైన తిన్నావా? అసలే వట్టి మనిషివి కాదు ఎదోకటి తినాలి ఖాళీ కడుపుతో ఉండద్దు అని వెటకారంగా అంటుంది. మంచినీళ్లు తాగుతావని మోనితకు మర్యాదలు చేస్తుంటే ‘హాలో ఇది నా ఇల్లు’ అంటుంది మోనిత, దీంతో ఓహో నీ ఇల్లు అయితే మర్యాద చేయకూడదా? అని వెటకారంగా అంటుంది. వెంటనే ఈ ఇళ్లు ఎవరిది నీదేనా, డాక్టర్ బాబు కొనిచ్చాడా? అని అడుగుతుంది. తన డబ్బుతోనే కొనుక్కున్నానంటూ అసహనం చూపిస్తుంది మోనిత. అవునా... ఇప్పటి దాక డాక్టర్ బాబు నుంచి శాంతం లాగేశావ్ అనుకుంటున్నారంతా అంటూ భాగ్యం మోనితకు చురకలు అట్టిస్తుంది. సరేలే.. ఉత్తమనిషివి కాదని ఉత్తి పుట్టిళ్లు క్రియేట్ చేసి నీకు సున్నుండలు, మైసూరు పాక్, రవ్వలడ్డూలు తెచ్చాను అంటుంది. దీంతో ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా? అని అడగ్గానే మోనిత కాదు దీప పిన్ని అని చెప్పతుంది. దీంతో ప్రియమణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మోనితతో ఎలాగు నీ డబ్బుతోనే ఇళ్లు కొనుక్కున్న అన్నావుగా నీకు పుట్టబోయే బిడ్డను కూడా నువ్వే పెంచుకోమని, కావాంటే డాక్టర్ బాబు చదివిస్తాడని మోనితకు సలహా ఇస్తుంది భాగ్యం. నా అల్లుడు అందులో బంగారం నువ్వే చూశావుగా శౌర్య ఎవరో తెలియకుండానే చదివించాడు, ఇక సొంత బిడ్డ అని తెలిసి చదివించకుండా ఉంటాడా? అంటుంది. అలాగే కార్తీక్కు దూరంగా ఉంటూ తన మానని తనని బతకమని చెప్పడంతో మోనిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. భాగ్యం తెచ్చిన రవ్వలడ్డూలు తెప్పించి అవి తింటుంది. అందులో చక్కర తక్కువగా ఉందని భాగ్యం స్టైల్ చెబుతుంది మోనిత. సరేలే తను చెప్పే గుడ్ న్యూస్ వింటే చాలా స్వీట్ ఉంటుందంటూ కార్తీక్కు తనకు పెళ్లని, ఈ నెల 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో అని చెప్పి రసీదు చూపిస్తుంది మోనిత. దీంతో భాగ్యం షాక్ అయ్యి ఏడుస్తూ దీపకు అన్యాయం జరుగుతుంది అంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీప కార్తీక్ను భోజనానకి పిలవడానిక వెళుతుంది. కార్తీక్ తనకు ఆకలిగా లేదని, మీ ముగ్గురు తినేయండి అంటూ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. ఎక్కడికి వెళుతున్నారని లేను అడగలేదే అని దీప వెటకారంగా అంటుంది. దీంతో కార్తీక్ నువ్వు ఏం అనుకున్న నేను మాత్రం మా అమ్మ దగ్గరికే వెళుతున్నానని, పిల్లలు అడిగితే అర్జెంట్ సర్జరీ ఉంటే వెళ్లానని చెప్పమంటాడు. దీప తను అబద్దం చెప్పలేను అనగాను నీకు ఎలా వీలైయితే అలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప ఇంతలా మదనపడుత్ను వ్యక్తి ఆ తప్పు ఎలా చేశాడు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లి దోషిలా నిలబడతాడు. సౌందర్య దేశోద్దారకుడు, సుపుత్రుడు ఎక్కడ ఆ బిరుదులు, ఏ ఇంటి వాకిట్లో తాకట్టు పెట్టివచ్చావు అంటూ కార్తీక్కు చివాట్లు పెడుతుంది. అలాగే మోనత, కార్తీక్ పెళ్లి అనే విషయం కూడా తీయడంతో ఎలా తెలుసని కార్తీక్ ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మోనిత వచ్చి, వెళ్లిన విషయం చెబుతుంది. ఏం చేయాలి అని సౌందర్యను కార్తీక్ సలహా అడగ్గా.. ఏం చేసిన జవాబుదారిగా ఉండాలని చెబుతుంది. దీపకు, పిల్లలకు, తమకు మోనితకు జవాబుదారిగా ఉండాలని కార్తీక్ను హెచ్చరిస్తుంది. -
తులసి తల్లిని అవమానించడమే పనిగా పెట్టుకున్న లాస్య!
Intinti Gruhalakshmi June 30వ ఎపిసోడ్: సరస్వతి అనుమానించినట్లే జరిగింది. తను తీసుకొచ్చిన బట్టలను తిరస్కరిస్తారేమోన్న అనుమానమే నిజమైంది. ఆమె తెచ్చిన బట్టల కంటే లాస్య తెచ్చినవే బాగున్నాయని అనసూయ పెదవి విరిచింది. దీంతో లాస్య డిజైన్ చేయించుకు వచ్చిన ఖరీదైన చీర మాత్రమే కట్టుకుంటానని మొండిగా మాట్లాడింది. ఆమె ప్రవర్తనకు తులసి మనసు చిన్నబుచ్చుకున్నా బయటకు మాత్రం.. తన కోరిక ప్రకారమే జరగనీయండని తెలిపింది. లాస్య బట్టలే వేసుకోమంటూ తన మామయ్యకు కూడా సర్ది చెప్పింది. ఫంక్షన్లో అనసూయ దంపతులు నూతన వధూవరులుగా రెడీ అయి మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కొత్త పెళ్లి జంటలాగా తెగ సిగ్గుపడిపోయారు. పెళ్లి చూపుల్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఇద్దరూ ఎలా కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్తూ వారి మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వేడుకలో అందరూ స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అనసూయ దంపతులు కూడా పాటలకు కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంట్లోని ప్రతి ఒక్కరూ అనసూయ దంపతుల్లో ఎవరెక్కువ ఇష్టమో చెప్తూ అందుకు గల కారణాలను వివరించారు. నందు వంతు వచ్చేసరికి తనకిద్దరూ ఇష్టమేనన్నాడు. అమ్మ ప్రేమ, నాన్న కోపం రెండూ తన ఎదుగుదలకే పనికొచ్చాయన్నాడు. తర్వాత తులసి మాట్లాడుతూ.. అత్తలో అమ్మను, మామలో నాన్నను చూసుకున్నానని చెప్పుకొచ్చింది. తన బాధలను, కష్టాలను కూడా పక్కనపెట్టి కేవలం సంతోషాలను మాత్రమే ప్రస్తావించింది. దీంతో మాధవి స్పందిస్తూ.. నీకు జరిగే చేదును కూడా మంచి అనుకోవడం నీ గొప్పతనమని తులసిని ప్రశంసించింది. అప్పటిదాకా సంతోషంగా సాగుతున్న ఆ పార్టీలో లాస్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. మరోసారి తులసి తల్లిని ఆవిడ దారుణంగా అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఓపిక నశించిన తులసి ఉగ్రరూపం ఎత్తింది. నోటికొచ్చినట్లు వాగుతున్న లాస్య చెంప చెళ్లుమనిపించింది. తన తల్లి మీద నోరు జారిన లాస్యను వెనకేసుకొచ్చిన నందు మీద కూడా ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ గొడవ తీవ్రతరం కానుందా? దీని పరిణామాలు ఏవైపుకు దారి తీస్తాయి? అనేది రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే! చదవండి: AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ -
Devatha : సూరికి తెలిసిపోయిన రుక్మిణి ప్రెగ్నెన్సీ విషయం
ఆదిత్యకు సత్యకు ఇచ్చి పెళ్లి చేయాలన్న తన నిర్ణయంపై రుక్మిని వెనక్కి తగ్గదు. సత ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తను చెప్పింది జరిగి తీరుతుందని చెబుతుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని శపథం చేస్తుంది. సీన్కట్ చేస్తే రుక్మిణి ఆదిత్యతో ముభావంగా ఉండటాన్ని దేవుడమమతో పాటు రాజం కూడా గమనిస్తుంది. అలా ఎందుకు ఉంటుందోనన్న అనుమానం ఇద్దరిలో మొదలవుతాయి. మరోవైపు రుక్మిణి ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి వెళ్లడం సూరి గమనిస్తాడు. అంతేకాకుండా రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 29న 272వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో రుక్మిణి ముభావంగా ఉండటాన్ని దేవుడమ్మతో పాటు రాజం కూడా కనిపెడుతుంది. భర్తతో అలా ఎందుకు ఉంటున్నావంటూ ప్రశ్నించగా అదేం లేదంటూ రుక్మిణి దాటవేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యతో నీ పెళ్లి చేసి తీరుతానని రుక్మిణి సత్యతో శపథం చేస్తుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని చెబుతుంది. సత్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలని, అలా ఉంటేనే నీకు గౌరవం అంటూ సత్యను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా సత్య అందుకు అంగీకరించదు. మరోవైపు రుక్మిణి ఆదిత్యతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తుంది. ఇది చూసిన సత్య వాళ్లిద్దరూ క్లోజ్గా ఉండటం చూసి నొచ్చుకొని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఈ ఒక్క కారణం చాలు నీకు, పెనిమిటికి పెళ్లి చేయడానికి అని రుక్మిణి భావిస్తుంది. సీన్కట్ చేస్తే రుక్మిణి ఎవరికీ చెప్పకుండా హాస్పిటలల్కి చెకప్కి వెళ్తుంది. అయితే అక్కడ రుక్మిణిని చూసిన సూరి ఆమె ఎందుకు వచ్చిందో తెలియక సందేహపడతాడు. డాక్టర్తో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరిగ్గా క్లారిటీ రాకపోవడంతో అక్కడ ఉన్న ఓ నర్సును కనుక్కుంటాడు. ఏం జరిగింది అని అడగ్గా..మొదట ఆమె చెప్పడానికి సందేహిస్తుంది. అయితే తన మాటలతో గారడి చేసిన సూరి నిజాన్ని తెలుసుకుంటాడు. రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాకవుతాడు. మరి ఈ విషయం దేవుడమ్మకు చెప్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
తులసి ఉగ్రరూపం, షాక్లో నందు! విడాకులు తప్పవా?
Intinti Gruhalakshmi June 29వ ఎపిసోడ్: నందు జరిపిస్తున్న తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకకు ఆహ్వానం అందడంతో తులసి తల్లి సరస్వతి కూడా రిసార్ట్కు చేరుకుంది. ఆమెను చూడగానే లాస్య, భాగ్య తమ నోటికి పని చెప్తూ పెద్దావిడను అనరాని మాటలు అన్నారు. పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుండాలని చీదరించుకున్నారు. నానామాటలని ఆమె మనసుకు తూట్లు పొడిచారు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తులసి తన తల్లి మీద జరుగుతున్న మాటల దాడికి అడ్డుపడుతూ లాస్య మీద విరుచుకుపడింది. మొగుడిని వదిలేసి అనాథలా తయారయ్యావు, కన్నకొడును వదిలేసి వాడిని అనాథను చేశావు, నీకేం తెలుసు కన్నతల్లి విలువ అంటూ లాస్యను తిట్టిపోసింది. మీరసలు మనుషులే కాదంటూ అసహ్యించుకుంది. మరోవైపు తులసి తల్లి ఫంక్షన్కు రావడంతో నందు చాలా సంతోషించాడు. ఆమెకు ఒక రూమ్ చూపించమని లాస్యకు చెప్పాడు. అయితే ఇక్కడ కూడా లాస్య తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. గదులు ఖాళీగా లేవని బయటే సర్దుకోమని చెప్పింది. దీంతో నందు ఎక్కడో ఎందుకు, మన గదిలో ఉంటుందిలే అని చెప్పడంతో ఖంగు తిన్న లాస్య కుదరదని తేల్చి చెప్పింది. గదిలో విలువైన వస్తువులున్నాయంటూ వారిని పరోక్షంగా దొంగలతో సమానంగా పోల్చింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించానంది. అందుకే తన కొడుక్కి చెప్పి అమ్మ కోసం ప్రత్యేక గది రెడీ చేయించానంటూ లాస్యకు కౌంటరిచ్చింది. అయినా ఈ ఫంక్షన్కు తులసి తల్లి రావడమేంటని అంకిత అభిని ప్రశ్నించింది. అసలు అదేం ప్రశ్న అన్న అభి తను మా అమ్మమ్మ అని, ఇంట్లో వేడకకు ఆమె రాకపోవడమేంటి? ఇంత స్టుపిడ్గా మాట్లాడతావేంటి? అని అంకితకు అక్షింతలు వేశాడు. దీంతో అంకిత హర్ట్ అయినట్లు కనిపించడంతో ఆమె ఈ ఇంటి మనిషని, ఈ వేడుకలో ఆమె ఉండాల్సిందేనని సర్ది చెప్తాడు. ఇక ఫంక్షన్లో వేదిక మీద కూర్చునే అనసూయ దంపతుల కోసం తులసి తల్లి పట్టుబట్టలు తీసుకొచ్చింది. అయితే తన చేతుల మీదుగా ఇస్తే వారు తీసుకుంటారా? అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే అనసూయ ఈ బట్టలు మేం కట్టుకోవాలా? అని ఎదురు ప్రశ్నించింది. అయితే ఆమె భర్త అనసూయకు ఎలాగోలా నచ్చజెప్పే చాన్స్ ఉంది. కానీ అడుగడుగునా సరస్వతిని అవమానించాలని కంకణం కట్టుకున్న లాస్య మాత్రం తనకొచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మొగుడు పోయినదానివంటూ సరస్వతిని అనరాని మాటలు అంది. తన కళ్లముందే తల్లిని దారుణంగా నిందిస్తూ చులకనగా చూస్తుండటం సహించలేకపోయిన తులసి.. లాస్యను లాగి కొట్టింది. అయితే నందు మాత్రం అంత జరిగినా లాస్యను వెనకేసుకురావడం గమనార్హం. అతడి ప్రవర్తనకు మరింత బాధపడ్డ తులసి మానసికంగా నందుకు ఈ క్షణమే విడాకులిచ్చేస్తున్నాని చెప్పింది. మరి తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? -
లాస్య చెంప చెళ్లుమనిపించిన తులసి, నందుకు విడాకులు!
Intinti Gruhalakshmi జూన్ 28వ ఎపిసోడ్: శృతి కాలిని తన ఒడిలోకి తీసుకున్న ప్రేమ్ ఎంతో ఇష్టంగా ఆమెకు నెయిల్ పాలిష్ పెట్టాడు. ఇది చూసిన అంకితకు ఒళ్లు మండిపోయింది. వీళ్లిద్దరినీ ఇలాగే వదిలేస్తే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటుందని, శృతి ఈ ఇంటి కోడలవుతుందని, అది జరగడానికి అస్సలు వీల్లేదని మనసులో నిర్ణయించుకుంది. దీంతో వెంటనే ప్రేమ్ దగ్గరకు వెళ్లి శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీసింది. అలాంటి ఉద్దేశ్యం లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేయకూడదని చెప్తూ మంచిదానిలా నటిస్తూ ప్రేమ్ను నమ్మించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక తులసి అత్తామామల పెళ్లై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నందు గ్రాండ్ ఫంక్షన్ జరిపించే ఏర్పాట్లలో ఉన్నాడు. ఈ వేడుకకు తులసి తల్లి వస్తుందన్న విషయం తెలిసిన లాస్య మరో కుట్ర పన్నింది. ఆమెను అడ్డుపెట్టుకుని ప్రళయం సృష్టించేందుకు రెడీ అయింది. మరో పక్క నందు ఈ వేడుకను సాంప్రదాయంగా జరిపించాల్సిన బాధ్యతను తులసికి అప్పగించాడు. అయితే దాన్ని సవ్యంగా జరగనివ్వకూడదని ఫిక్సైంది లాస్య. ఈ వేడుక ద్వారా నందు కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే ఈ ఫంక్షన్కు హాజరైన తులసి తల్లిని అవమానించింది. మొగుడు పోయినదానివి, నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ అని నిందించింది. తన కళ్లముందే తల్లిని అవమానించడంతో తట్టుకోలేకపోయిన తులసి లాస్య చెంప చెళ్లుమనిపించింది. పెద్దావిడను అవమానించిన లాస్యను తిట్టాల్సింది పోయి ఆమె మీద చేయి చేసుకున్నందుకు నందు తులసి మీద కోప్పడ్డాడు. దీంతో మరింత ఆవేశపడ్డ తులసి మానసికంగా మీకు నేనే విడాకులిస్తున్నానంటూ బాంబు పేల్చింది. భర్త స్థానం నుంచి మిమ్మల్ని చెరిపేస్తున్నానని తేల్చి చెప్పడంతో నందు షాకయ్యాడు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? తులసి, నందుల మధ్య మరింత అగాధం ఏర్పడనుందా? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: Rohit Shetty Love Story: డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్.. కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం కన్నుమూత -
Devatha : రుక్మిణిని మందలించిన దేవుడమ్మ
ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తనపై దేవుడమ్మకు సందేహం కలుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నేరుగా రుక్మిణినే నిలదీస్తుంది. సత్యపై ప్రేమ ఉండటం తప్పులేదని, అలా అని భర్తను నిర్లక్ష్యం చేస్తే తాను సహించలేనని పేర్కొంటుంది. తన కొడుకు బాధ పడితే చూడలేనని చెప్పి తన బాధ్యతను గుర్తు చేస్తుంది. దీంతో దేవుడమ్మ అప్పుడే కనిపెట్టిందని, కానీ ఆమెను బాధపెట్టాలనుకోవడం తన ఉద్దేశం కాదని రుక్మిణి మనసులో అనుకుంటుంది. మరోవైపు సత్య-ఆదిత్యలు ఫోన్లో మాట్లాడుకోవడన్ని రుక్మిణి పసిగడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 28న 271వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తిస్తున్న తీరుకు విసుగుపోయిన దేవుడమ్మ రుక్మణిని పిలిచి మందలిస్తుంది. తన బిడ్డ సంతోషంగా లేకపోతే తాను తట్టుకోలేనని, ఆదిత్యతో సఖ్యతతో మెలగమని సూచిస్తుంది. సత్యపై ఒక అక్కగా చూపిస్తున్న ప్రేమను తాను అర్థం చేసుకోగలనని, అయితే తన కొడుక్కి ఏ లోటు లేకుండా చూడాల్సిన బాధ్యతను మరవద్దని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం నీ బాధ్యత అన్న విషయం గుర్తుపెట్టుకోమని అంటోంది. దీంతో తన పెనిమిటితో మంచిగా ఉండటం లేదన్న విషయాన్ని అప్పుడే అత్తమ్మ గ్రహించిందని, కానీ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని తలుచుకొని బాధపడుతుంది. ఇలాగే ఉంటూ సత్య, ఆదిత్యలను ఒక్కటి చేయాలని, అప్పుడే తన చెల్లికి న్యాయం జరుగుతుందని రుక్మిణి భావిస్తుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి అన్న మాటలను తలుచుకొని ఆదిత్య బాధపడుతాడు. సత్య కూడా ఇలాగే అనుకుంటుందేమోనని తనకు ఫోన్ చేస్తాడు. అయితే అక్క మనిద్దరిని ఒక్కటి చేసేవరకు ఊరుకోదని, దీన్ని ఎలా అయినా ఆపాలని సత్య ఆదిత్యతో అంటుంది. ఇక సత్య-ఆదిత్యల ఫోన్లో మాట్లాడుకోవడం చూసిన రుక్మిణి ఇలా అయినా తన చెల్లికి ఆదిత్య దగ్గరయితే అదే సంతోషమని సంబరపడుతుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఇల్లు శుభ్రం చేస్తూ కాలు జారి కింద పడిపోతుండగా, ఆదిత్య వచ్చి ఆమెను పట్టుకుంటాడు. అయితే ఆ సమయంలో రుక్మిణి ఆదిత్యతో దురుసుగా మాట్లాడటం దేవుడమ్మ చూస్తుంది. ఈ విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: మోనితతో కారెక్కి వెళ్లిన కార్తీక్, కోపంతో రగిలిపోతున్న దీప
కార్తీకదీపం జూన్ 26వ ఎపిసోడ్: దీప పిల్లలు కనబడకపోవడంతో కంగారుగా ఆటూ ఇటూ వెతికగా ఎక్కడ కనిపించకపోవడంతో సౌందర్యకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. పిల్లలు ఇక్కడే ఉన్నారని సౌందర్య చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది దీప. అనంతరం కార్తీక్ గురించి అడగ్గా ఏం సమాధానం చెప్పకుండా ఉంటాను అత్తయ్య అని ఫోన్ పెట్టెస్తుంది. వెంటనే కార్తీక్ వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప లోపలికి వెళ్లిపోవడంతో గతంలో కార్తీక్ ఆమెను అవమానించిన సంఘనలను గుర్తు చేసుకుంటాడు. తన జీవితం ఇలా అయిపోయిందేంటని, శౌర్యను రౌడీలా, హిమను అనాధల చూశాను, తాళి కట్టిన భార్యను కళంకితల చూశాను అంటూ కుమిలిపోతాడు. ఇప్పుడు దీపను ప్రేమగా చూసుకున్న నమ్మదు.. ఎలా అంటూ బాధపడుతుంటాడు కార్తీక్. ఇదిలా ఉండగా పిల్లలు సౌందర్య దగ్గర దీప, కార్తీక్ల తీరు గురించి చెప్పి బాధపడుతుంటారు. ఈ మధ్య వాళ్లలో చాలా తేడా వచ్చిందని, వారి పద్దతి మాకు అసలు నచ్చడం లేదని, అమ్మ-నాన్నను చూస్తుంటే విసుగోస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తారు. వారి మాటలకు సౌందర్య షాక్ అవుతుంది. కన్న తల్లిదండ్రుల మీద విసుగు రావడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. అలాగే కార్తీక్ గురించి నిజం తెలిస్తే ఆ విసుగు స్థానంలో అసహ్యం వస్తే కార్తీక్ ఏం అవుతాడని తలుచుకుని కంగారు పడుతుంది. వెంటనే వారితో ‘ఏ అమ్మ-నాన్నలు పిల్లలకు విసుగు వచ్చేలా ఉండరని, మీ అమ్మ-నాన్నకు మీరంటే ప్రాణమని, వాళ్ల మూడ్ బాగాలేదనుకుంటా అందుకు అలా ఉండిఉంటారని శౌర్య, హిమలకు నచ్చజేప్పుతుంది సౌందర్య. మరోవైపు భాగ్యం దీపకు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమంటూ చెంపలు కొట్టుకుంటుంది. ఒకప్పుడు దీప తను హింసించిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. తనే గనుక దీపను బాగా చూసుకుంటే అసలు డాక్టర్ బాబును పెళ్లి చేసుకునేదే కాదనీ, బాగా చదివిస్తే ఈ వంటలు, దోసలు వేసుకొకుండా ఏం చక్క ఓ ఆఫీసరు పెళ్లి చేసుకునేదంటూ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది భాగ్యం. వెంటనే దీప కాపురం ఎలాగైనా సెట్ చేస్తానని, ఆ మోనితకు బుద్ధి చెప్పి కార్తీక-దీపలు దగ్గరయ్యాలా చూస్తునంటూ గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక మోనిత వీధి చివరన కారు ఆపి కార్తీక్ రమ్మన్నానని చెప్పి వారణాసిని పంపిస్తుంది. కార్తీక్ బస్తి వాళ్లకు వైద్యం అందిస్తుండగా దీప బట్టలు ఉతికి ఆ పక్కనే ఆరెస్తుంటుంది. ఇంతలో వారణాసి వచ్చి మోనిత పిలుస్తుందని చెప్పగానే దీప ఒక్కసారిగా ఆగి చూస్తుంది. కార్తీక్ కూడా దీప వంక మెల్లిగా చూస్తాడు. మోనిత మేడమ్ పిలుస్తుందని వీధి చివరన ఉందని చెప్పడంతో కార్తీక్ అక్కడికి వెళతాడు. కార్తీక్ రావడంతో మోనిత నవ్వుతూ పలకరించావా అని మోనిత అనగానే నువ్వు వచ్చావని పులకరించి పలకరించాలా? అని కోపంగా అంటాడు కార్తీక్. కాల్ చేసి రమ్మని ఉంటే వచ్చేవాడిని కదా ఇలా గోలచేసి పోతానంటే వచ్చాను. ఎందుకీ బెదిరింపులు.. నాకు దీపకు మధ్య కంచె వేసే ప్రయత్నమా? నన్ను ఒక పంజరంలో బందించే ప్రయత్నమా? అని కార్తీక్ ఆవేశపడుతాడు. మరోవైపు దీప చాటుగా ఆటోలో కూర్చుని వాళ్ల మాటల్ని వింటుంది.కార్తీక్ మాటలకు మోనిత ‘నువ్వు నా కోసం రావట్లేదు కాబట్టి.. నేను నీకోసం వచ్చాను.. నన్ను అవైడ్ చేద్దాం అనుకుంటున్నావా’ అంటుంది బాధగా. ‘నాకు తెలియని కొన్ని క్షణాలని నా జీవితంలో బలవంతంగా నువ్వు రాస్తుంటే.. పుస్తకం మూసేసినట్లు నా ఆలోచనలు మూసేశాను’ అని అంటున్న కార్తీక్ మాటలకు దీప ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక మోనిత తను సౌందర్య దగ్గరికి వెళ్లోచ్చిన విషయం చెబుతుంది వెంటనే కార్తీక్ ‘మా అమ్మ ఇంకా సంస్కారాన్ని మోస్తూనే ఉందా నాలాగా’ అంటాడు కోపంగా. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మోనిత అనగానే కార్తీక్ నువ్వే నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావని, పరిచయం లేని ప్రమాదంలా కనిపిస్తున్నావు అంటాడు. ‘ఇంతకు ముందు నువ్వు స్నేహితురాలిగా కనిపించేదానివి.. ఇప్పుడు అలా లేవు.. నడిచే విస్పోటనంలా కనిపిస్తున్నావు’ అంటాడు. అలాగే ‘దీప మీద అప్పట్లో ఉన్న కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే.. కాని అది ఆసరాగా తీసుకుని ఏనాడైనా నిన్ను తాకానా?నీతో ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా? మన మధ్య ఈ తప్పు జరిగిందని నువ్వు వచ్చి చెప్పే వరకూ నాకు తెలియలేదు అంటే అందులో నా ప్రమేయం ఎంతవరకూ ఉందనేది నువ్వే ఆలోచించు’ అంటాడు కార్తీక్. ఆ తర్వాత మోనిత తనదైన శైలిలో తెలివిగా కార్తీక్కు సమాధానం ఇచ్చి నోరు మూపిస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లాలి కారు ఎక్కమని అడగ్గానే కార్తీక్ కారు ఎక్కుతాడు. అది చూసి దీప ఆవేశంగా ఇంటికి వెళ్లిపోతుంది. కోపంతో రగిలిపోతూ వారణాసి ఆటోను కడుగుతూ తన కసి చూపిస్తుంది. ఇంతలో సౌందర్య రాగానే ‘మీరా నేను అవసరమైన పనిలో ఉన్నాను మీరు వెళ్లి లోపల కూర్చోండిని అంటుంది’ దీప. -
Devatha : రుక్మిణి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్న ఆదిత్య
రుక్మిణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంపై ఆదిత్య బాధపడతాడు. అంతేకాకుండా ఈ విషయం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తనపై పెట్టుకన్న నమ్మకాన్ని వమ్ము చేయలేనని భావిస్తాడు. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని, ఈ ఊరు వదిలి వెళ్తేనే రుక్మిణి ఈ ఆలోచనల నుంచి బయట పడ్తుందని, దీనికి ఇదే పరిష్కారమని అనుకుంటాడు. ఇదే విషయాన్ని దేవుడమ్మతోనూ చెప్తాడు. చదువుకోడానికి హైదరాబాద్ వెళ్లాలని తన మనసులో మాటను బయటపెట్టేస్తాడు. అయితే ఇందుకు దేవుడమ్మ అంగీకరించదు. తన కోరికను నిజం చేసే పట్నం వెళ్లాలని ఆంక్షలు పెడుతుంది. దేవుడమ్మ అలా అనడానికి కారణమంటి అన్నది తెలియాలంటే ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వాల్సిందే..దేవత సీరియల్ జూన్ 26న 270వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత 270వ ఎనిసోడ్ : సత్యకు తనకు పెళ్లి చేయాలన్న రుక్మిణి నిర్ణయంపై ఆదిత్య బాధపడతాడు. ఒకవేళ నిజాన్ని తన తల్లి దేవుడమ్మకు తెలిసినా ఆమె తట్టుకోలేదని, మరోవైపు రుక్మిణి ఆలోచనల్ని అదుపుచేయలేనని అంటాడు. దీనికి ఒక్కటే పరిష్కారమని, రుక్మిణికి దూరంగా ఊరు వదిలి వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తాడు. ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వాలని, దానికోసం తాను హైదరాబాద్ వెళ్తానని ఆదిత్య దేవుడమ్మకు చెబుతాడు. అయితే మనవడిని ఎత్తుకోవాలన్నది తన కోరిక అని, మరో రెండు, మూడు నెలలు అయ్యాక వెళ్లమని దేవుడమ్మ చెబుతుంది. అయితే తాను ఇప్పుడే వెళ్లాలని ఆదిత్య ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ అందుకు అంగీకరించదు. ఇక మరోవైపు తన తల్లి గారింటికి వెళ్లిన రుక్మిణి,సత్యలను చూసి భాగ్యమ్మ చాలా సంతోషిస్తుంది. మామిడిపండు పులిహోర చేశానని చెప్పడంతో రుక్మిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పుల్లటి పదార్థాలు రుక్మిణి ఎంతో ఇష్టంగా తినడం చూసి కమల, సత్యలకు అనుమానం వస్తుంది. కొంపదీసి నువ్వు నెల తప్పావా అని సత్య ప్రశ్నిస్తుంది. దీంతో షాక్ అయిన రుక్మిణి అదేం లేదని బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఆదిత్య సడెన్గా పట్నం ఎందుకు వెళ్తానంటున్నాడో అని దేవుడమ్మ ఆలోచిస్తుంది. కొన్ని రోజులుగా రుక్మిణి-ఆదిత్యల ప్రవర్తనపై అనుమానం వస్తుంది. -
25వ తేదీన ఏం చేయబోతుందో సౌందర్యకు వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 25 ఎపీసోడ్: కార్తీక్, దీపలు కూర్చుని మాట్లాడుకునే సీన్తో నిన్నటి ఎపిసోడ్ ముగిసన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్ అదే సీన్తో ప్రారంభమవుతుంది. దీప మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను చేయని తప్పుకు ఎన్నో అనరాని మాటలు పడ్డాను. ఇప్పుడు అలాంటి మాటలు మిమ్మల్ని అనలేను. అలాగే ఇంకేవరు అన్న వినలేను. మీకు నాకు అదే తేడా. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంట దీప ఎందుకు స్పందించడం లేదో’ అని అంటుంది. ఆ తర్వాత మీ భార్యగా మీకు ఏ విధంగా సాయపడగలను? నాకు నేను సర్దిచెప్పుకోవాలా? లేక నా తలరాత ఇంతేనని రాజీ పడాలా? అని కార్తీక్ని ప్రశ్నస్తుంది. దీంతో కార్తీక్ నువ్వు నువ్వుగానే ఉండని, తనని నమ్ము అంటాడు. నా మీద కోపంగా ఉంటే తిట్టు.. ఇంకా కసి తీరకపోతే చెంప పగలగొట్టు దీప అంటుండగా దీప అలా మాట్లాడకు అన్నట్లుగా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ‘నేను తప్పు చేయలేదు అనట్లేదు.. కానీ ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగిందని నమ్ము. ఇదంతా నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పడంలేదు దీప’ అంటాడు. దీంతో ఇప్పడే నా ప్రమేయం లేకుండ జరిగిందని చెబుతూనే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదంటున్నారే అని ప్రశ్నించింది. ‘అవును మళ్లీ మళ్లీ అదే చెబుతాను ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండోద్దని వేడుకుంటాడు కార్తీక్. మరోవైపు మోనిత సౌందర్య ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేమని అడగ్గా ‘నా కొడుకు నాకో విషయం చెప్పాడు’ అని చెప్పి మోనితలో కంగారు పుట్టిస్తుంది సౌందర్య. ఇక శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తెప్పిస్తుంది. అది తాగిన మోనిత టెన్షన్గా ఇప్పటికైనా చెప్పండి ఆంటీ.. కార్తీక్ మీతో ఏం చెప్పాడని నిళ్లు నములుతూ అడుగుతుది. వెంటనే సౌందర్య నీకు తెలిసి తెలియనట్లు నటించడకు మోనితా.. వాడు చెప్పింది నిజమని నా మనసు చెబుతోంది అంటూ కార్తీక్ సౌందర్యతో ‘నేనుఆ తప్పు చేశానంటే నమ్మలేకపోతున్న మమ్మీ. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు’ అని అన్నాడని అంటుంది. ఆ తర్వాత మోనితతో.. ఇంకా వివరంగా ఇంకా లోతుగా దీనిపై చర్చించగలను కాకపోతే నువ్వే ఒక గైనకాలజిస్ట్వి కాబట్టి అంత వివరంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినా ఇప్పుడు నువ్వు కన్నెపిల్లవి కాదంటే.. దానికి కారణం మా వాడికి తెలియదు అంటే.. అయినా సరే వాడేనని నువ్వు అంటే.. మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అని సౌందర్య అనడంతో మోనిత అయోమయంగా చూస్తుంది. అంతేగాక ఈ తప్పు గురించి తప్పుడు సమాచారం క్రియేట్ చేశావా? అని, తప్పటడుగు వెనుక తప్పని సరైన కారణం కనిపెట్టావా? అని నిలదీస్తుంది. అలాగే పూజ రోజు నువ్వు దీప ముందే ఈ విషయం బయటపెట్టగానే.. వాడు తలదించుకోలేదు సరికదా.. నీకే చివాట్లు పెట్టాడు.. ఆ నిజాయితీ వాడి కళ్లల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను అని సౌందర్య ప్రశ్నలతో కడిగిపారేసే సరికి మోనిత షాక్ అవుతుంది. అయితే మోనిత కాసేపటికి తేలుకుని ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో మీకు తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయినా క్రియేట్ చెయ్యడానికి నేనేం పురాణకాలనాటి స్త్రీని కాదు..ఇది నిజం.. దీన్ని నిరూపించుకోవడానికి ఏ వేదిక కావాలంటే ఆ వేదికను ఆశ్రయించొచ్చు అని సవాలు చేస్తుంది. దీప విషయంలో మీ కొడుకుని నమ్మని మీరు నా విషయంలో మీ కొడుకునే నమ్ముతున్నారా? ఇంతకాలం మీరు చాలా ఫర్ఫెక్ట్ అనుకున్నాను.. నాకు సపోర్ట్ చేసి మొదటి వ్యక్తి మీరే అవుతారు అనుకున్నాను.. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు.. మీ కొడుకుతో కలిసి నాకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక నా జీవితం గురించి ఎవరితోనూ సలహాలు తీసుకోదలుచుకోలేదు. నిజం నా కడుపులో ఉంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను.. ఈ నెల 25 తారీఖున కార్తీక్తో నా పెళ్లికి స్లాట్ రిజిస్టర్ చేసుకోబోతున్నాననంటూ సౌందర్యకు షాక్ ఇస్తుంది. అయితే ఏ ఊరికో వెళ్లి తల దాచుకోమనే చవకబారు సలహాలు ఇవ్వద్దని మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను.. అదే జరిగితే.. పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి.. గుర్తుపెట్టుకోండి ఆంటీ అంటూ హెచ్చరిస్తుంది. అలాగే 25 తేదీన మీ కొడుక్కి నాకు పెళ్లి.. నన్ను ఆశీర్వదించండి అత్తయ్యగారు అంటూ సౌందర్య కాళ్లకు దండం పెట్టుకుంటూ ఆశీర్వదించమని మోనిత అంటుండగా సరిగ్గా అప్పుడే హిమ, శౌర్యలు ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మోనిత ఆంటీ ఎందుకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందని అడడంతో సౌందర్య పిల్లలు ఏం వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. -
తులసిని గెంటేస్తానన్న లాస్య, సడన్గా సీన్లోకి నందు ఎంట్రీ!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 25వ ఎపిసోడ్: నందు చేతుల మీదుగా తమ 50వ పెళ్లిరోజు ఫంక్షన్ జరిపించాలని అనసూయ మంకుపట్టు పట్టింది. దీనికి ఒప్పుకునేవరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేది లేదని తేల్చి చెప్పింది. తులసి ప్రేమగా తీసుకొచ్చిన ఇడ్లీ ప్లేటును కూడా నేలకు విసిరి కొట్టింది. నీ మాయమాటలకు లొంగనంటూ తన పంతం నెగ్గించుకోవాలని చూసింది. మరోవైపు తులసి ఆంటీ వల్లే ఇంట్లో ఈ గొడవలన్నీ అని అంకిత అభితో వాపోయింది. ఆంటీ పంతం నెగ్గించుకోవడానికి, తనను అందరూ మెచ్చుకోవడం కోసం అమ్మమ్మను ఇంత బాధపెడుతోందని అభిప్రాయపడింది. దీంతొ అభి తల్లిని వెనకేసుకురాగా అంకిత మాత్రం ఇదంతా తులసి ఆంటీ వల్లే జరుగుతోందని విమర్శించింది. మరోవైపు శృతి, ప్రేమ్ కూడా ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ నానమ్మ బ్లాక్మెయిల్ చేస్తుందని ఆగ్రహించారు. కానీ అనసూయ భోజనం మానేసి ఎక్కడ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుందోనని తులసి భయపడిపోయింది. కానీ తనకంత సీను లేదని, కడుపు మాడ్చుకుంటానని బెదిరిస్తుందే తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని మామయ్య నచ్చజెప్పాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారో లేదో అనసూయ కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో వెంటనే డాక్టర్ను ఇంటికి పిలిపించారు. కానీ మొండిదల ఎక్కువ ఉండే అనసూయ వైద్యం చేయించుకోవడానికి కూడా నిరాకరించింది. అయితే ఆమె అన్నపానీయాలు మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదం అని వైద్యురాలు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినా సరే 50వ పెళ్లిరోజు ఫంక్షన్ తన కొడుకు చేతుల మీదుగా జరగాల్సిందేనని, అది వాడి నోటి వెంట వింటేనే తను ఈ నిరాహార దీక్ష వదిలేస్తానంది. దీంతో అత్త క్షేమం కోసం తులసి లాస్య గడప తొక్కక తప్పలేదు. ఇదే అదును అనుకున్న లాస్య తులసి మీద మాటల యుద్ధం ప్రకటించబోయింది. అవమానంతో తలదించుకునేలా చేయాలనుకుంది. బయటకు గెంటేస్తానంటూ బెదిరించింది. కానీ అంతలోనే నందు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తులసిని చూసి భగ్గుమని లేచాడు. మరి నందు.. తులసి చెప్పేది వింటాడా? తన తల్లి కోసం ఆమె వెంట ఇంటికి వెళ్తాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: Michael Jackson: ఊహించాడు.. అచ్చం అలాగే చనిపోయాడు! -
Devatha : సత్య-ఆదిత్యలను పెళ్లి చేసుకోవాలని కోరిన రుక్మిణి
సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటివి మాట్లాడొద్దని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెబుతుంది. ఇందుకు రుక్మిణి అడ్డుపడతుంది. మరోవైపు ఆదిత్యతో రుక్మిణి సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి దేవుడమ్మ కనిపెడుతుంది. వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని ఆలోచనలో పడిపోతుంది. సీన్కట్ చేస్తే..హాస్పిటల్కు వెళ్లేటప్పుడు కూడా ఆదిత్యను తోడు తీసుకెళ్లకుండా దేవుడమ్మ అడ్డుపడుతుంది. రుక్మిణి-సత్యలను మాత్రమే వెళ్లాల్సిందిగా ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 25న 269వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో మాట్లాడాలని చెప్పిన రుక్మిణి సత్య గదిలోకి రావడానికి ఎందకు భయపడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కోప్పడుతుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉందని, అది మీ ఇద్దరు ఒక్కటి కావాలని చెప్తుంది. ఆదిత్య సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదని తేల్చిచెప్పేస్తాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పడంతో రుక్మిణి అడ్డుపడుతుంది. సీన్కట్ చేస్తే.. మృగశిర మాసం ప్రారంభం కానుండటంతో నువ్వుల నూనె రాసుకోవాలని దేవుడమ్మ ఆదిత్యకు చెబుతుంది. రుక్మిణిని పిలిచి నీ పెనిమిటికి నూనె రాయి అని చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అయితే ఇందుకు రుక్మిణి ఒప్పుకోదు. దేవుడమ్మ వచ్చే సమయానికి అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని దేవడమ్మ సందేహిస్తుంది. సీన్కట్ చేస్తే..సత్యను హాస్పిటల్కు తీసుకెళ్లాలని రుక్మిణి చెప్పగ, అందుకు తన పర్మిషన్ అక్కర్లేదని చెప్తుంది. ఆదిత్యను తోడు తీసుకెళ్లబోతుంటే అందుకు దేవుడమ్మ అడ్డు చెబుతుంది. మిల్లు వద్ద పనులు ఉన్నాయని, అవి చూసుకోవాలని చెప్పి రుక్మిణి-సత్యలను వెళ్లమంటుంది. మరోవైపు రుక్మిణి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందని ఆదిత్య ఆలోచనలో పడిపోతాడు. మరి రుక్మిణి పడుతున్న ఆరాటం దేవుడమ్మ కనిపెడుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: మోనిత ప్లాన్ను సౌందర్య తిప్పి కొట్టబోతుందా?!
కార్తీకదీపం జూన్ 24వ ఎపిసోడ్: తమ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ వివరించడంతో దీప ఆలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోనిత కార్తీక్కు పెట్టిన గడువు రెండు రోజుల్లో పూర్తైయిపోతుందని, ఎల్లుండి ఈ టైంకి ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే ఒళ్లు పులకరిస్తుందంటూ మురిసిపోతుంది. అంతేగాక తనని తిట్టిన దీప, సౌందర్యల నోళ్లు ఈ దెబ్బకు మూతపడతాయని తెగ సంబరపడిపోతూ ప్రియమణిని పిలిచి వేడి నీళ్లు తీసుకురమ్మని చెబుతుంది. ఇదిలా ఉంగా భాగ్యం మురళీ కృష్ణతో దీప ఇంటికి వెళ్లోస్తానని చెబుతుంది. ఎందుకని అడగ్గా దీపను ఇంటికి తీసుకువచ్చేస్తానని, అది డాక్టర్ బాబుతో ఉండేలా కనిపించడంలేదంటుంది. అంతేగాక ఇక దీప కష్టాలు పడింది చాలు ఇకనైనా దాని కష్టాలను దూరం చేద్దామని అనడంతో దీప గురించి భాగ్యం అంతగా ఆలోచించడం చూసి మురళీ కృష్ణ ఆనందపడిపోతాడు. మరోవైపు మోనిత కార్తీక్కు ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా కార్తీక్ లిఫ్ట్ చేయడు. అలా దాదాపు మోనితవి 25కు పైగా మిస్డ్ కాల్స్ ఉండటం చూస్తాడు కార్తీక్. దీంతో ఆలోచనలో పడతాడు. మోనిత ఏంటీ ఇన్నిస్లార్లు కాల్ చేస్తుందని, ఏం మాట్లాడాలి. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఏమైన రచ్చ చేస్తుందా అంటూ ఆలోచిస్తుండగా శౌర్య అప్పడే వస్తుంది. నాన్న.. నాన్న అని ఎన్నిసార్లు పలిచిన కార్తీక్ పలకడు. దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మరోవైపు దీప కూడా అంతే తీవ్ర ఆలోచనలో పడుతుంది. డాక్టర్ బాబు మీద తను పెట్టుకున్న నమ్మకానికి ఎందుకింత ఎదురు దెబ్బ తగిలిందని, మోనిత ఎంత జానతనం చూపించిన ఆయన చలించడని గట్టిగా నమ్మాను.. అయినా ఈ తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తుండగా మధ్యలో హిమ వచ్చి అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిన పలకకపోవడంలో అక్కడి నుంచి హిమ వెళ్లిపోతుంది. ఇక ఇందులో మోనిత కుట్ర ఏదో ఉందని అది ఎలా తెలుస్తుందంటూ ఆలోచిస్తూ దీప ప్రియమణిని నిలిదీస్తే చెబుతుందా? అని అనుకుంటుంది. చెప్పదు.. మరి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుందని మదనపడుతుంది దీప. ఇక కార్తీక్ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోనిత రగిలిపోతుంది. తనని అవాయిడ్ చేస్తున్నాడా? ఇంత చెప్పిన కార్తీక్ తన మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదని మండిపోడుతుంది. ఇంకా దీపనే కోరుకుంటే ఆ తర్వాత తను చేసేది చూసి బుర్ర తిరగడమే కాదు.. తనే నా చుట్టు తిరిగేలా చేస్తా అనుకుంటూ క్యాలెండర్లో 25 తారీఖుని స్కెచ్తో మార్క్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియమణి వచ్చి ఈ సున్నా ఏంటని అడగ్గా.. ఇది సున్నా కాదే వెర్రి మొహమా.. సునామీ.. ఆ రోజు తను క్రియేట్ చెయ్యబోయే సునామీ అని సమాధానం ఇస్తుంది. మరోవైపు సౌందర్య కూడా దీప, కార్తీక్ల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా.. మోనిత చీర కట్టుకుని ఇంటికి వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే అత్త ఎదురైందంటే మంచి శకునమే అంటూ నమస్తే ఆంటీ అంటూ లోపలికి వెళుతుంది. సౌందర్యతో తనకు న్యాయం చేయమని, కార్తీక్ తననుంచి మొహం చాటేస్తున్నాడని చెబుతూ, సాటి స్త్రీగా తన దరపున పోరాడాల్సిన సమయం వచ్చింది ఆంటీ అంటూ సౌందర్య దగ్గర అమాయకంగా నటిస్తుంది మోనిత. దీంతో సౌందర్య అవును పోరాడే సమయం వచ్చందని, కార్తీక్ తనతో ఓ మాట చెప్పడంటూ సౌందర్య మోనితలో కంగారు పుట్టిస్తుంది. దీంతో అదేంటని భయంగా అడగడంతో మోనిత వంక సౌందర్య అనమానంగా చూస్తుంది. అదేం లేదని నువ్వు కంగారు పడకు అంటూ శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తీసుకురమ్మని చెబుతుంది సౌందర్య. వెంటనే శ్రావ్య అయ్యో.. కడుపుతో ఉన్నానంటుంది కదా అత్తయ్యా.. ఏ పుల్ల మామిడి కాయలో, చింతకాయ ఏమైనా అడుగుతుందేమో అని వెటకారంగా అంటుంది. ‘అంత వికారంగా ఏం కనిపించడటం లేదులే.. జ్యూస్ చాల్లే’ అని అంతే వెటకారంగా అంటుంది సౌందర్య. ఏం చెప్పి ఉంటాడు కార్తీక్.. ఈవిడేంటీ? ఏ మాత్రం తొణక్కుండా ఉంది’ అని మోనిత మాత్రం చేతులు నలిపేసుకుంటూ కంగారుపడుతుంది. మరోవైపు దీప కార్తీక్లు కూర్చుని ఉండగా.. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో.. నా పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు దీపని కార్తీక్ అంటాడు. అంతేగాక నీ మౌనాన్ని భరించలేకపోతున్నానని, నాతో మాట్లాడు దీపని కార్తీక్ వేడుకుంటాడు. దీంతో దీప చెప్పండి డాక్టర్ బాబు.. మీరే నాతో మళ్లీ ఏదో చెబుతానంటున్నారు.. విన్నదే అయితే వినడం ఎందుకు? ఉన్నదే అయితే చెప్పడం దేనికీ?’ అంటుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి ప్రవర్తనపై విసుగు చెందిన సత్య
రుక్మిణి సత్యపై అతి ప్రేమ కురిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తుంది. ఇదే విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుంది. మరోవైపు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని ఆదిత్యకు సలహా ఇస్తుంది. సీన్కట్ చేస్తే రుక్మిణి ప్రవర్తనపై సత్య కూడా ఇబ్బంది పడుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతుంది. మరోవైపు ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పి రుక్మిణి ఆదిత్యను సత్య గదిలోకి పిలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 24న 268వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ రుక్మిణి సత్యపై అతి ప్రేమ చూపిస్తుంటుంది. దీన్ని గమనించిన దేవుడమ్మ సత్యపై ప్రేమ ఉండొచ్చు గానీ నీ భర్తను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తుంది. ఇక రుక్మిణి ప్రవర్తనను చూసి ఆదిత్య కూడా బాధపడతాడు. సీన్కట్ చేస్తే దేవుడమ్మ, ఈశ్వర్ ప్రసాద్ వెళ్లి ఆదిత్యకు నచ్చజెప్పుతారు. రుక్మిణి అలా చేసిందని మనసు నొచ్చుకోవద్దు అని చెబుతూనే, రుక్మిణిపై కోప్పడొద్దని చెబుతుంది. వారి ప్రేమకు ఇది అడ్డు రాకూడదని హితవు పలుకుతుంది. అయితే దేవుడమ్మ తనపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని ఆదిత్య బాధపడతాడు. తన వల్ల ఇంత తప్పు జరిగినందుకు తనలో తానే మదనపడతాడు. మరోవైపు రుక్మిణి తనపై చూపిస్తున్న అతిప్రేమను చూసి సత్య చిరాకు పడుతుంది. ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నావ్ అని రుక్మిణిని నిలదీస్తుంది. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతుంది. ఇంతలోనే ఆదిత్య అక్కడకు వచ్చి తనను ఎందుకు పిలిచావని రుక్మిణిని అడుగుతాడు. ఇలా అమ్మ చూస్తే ఏం అనుకుంటుంది అని ప్రశ్నిస్తాడు. చూస్తే చూడని, ఎందుకు భయపడుతున్నావ్ పెనిమిటి అని రుక్మిణి బదులిస్తుంది. మరి రుక్మిణి ఆలోచన ఏంటి? సత్య- ఆదిత్యలను కలపాలన్న నిర్ణయాన్ని వాళ్లకు చెబుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
అనసూయ నిరాహార దీక్ష, లాస్య గడప తొక్కిన తులసి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 24వ ఎపిసోడ్: నందు తల్లిదండ్రులకు పెళ్లై 50 ఏళ్లు పూర్తయిందని భాగ్య లాస్యకు చెప్పింది. దీన్ని ఓ వేడుకలా జరుపుకుందామని తులసి ప్లాన్ చేస్తోందని తెలిపింది. కానీ ఆ వేడుక జరపాలంటే డబ్బులు అవసరమని, అంత డబ్బు తులసి దగ్గర లేదు కాబట్టి నువ్వే ఆ సెలబ్రేషన్స్ దగ్గరుండి జరిపించావంటే ఆ కుటుంబం అంతా నిన్ను తలకెక్కించుకుంటుందని చెప్పింది. దీంతో ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందని లాస్య ఆలోచించింది. మరోవైపు తన అత్తామామల పెళ్లిరోజును పండగలా జరపాలని తులసి తెగ ఆశపడుతోంది. అయితే తన పెద్ద కొడుకు లేకపోతే ఆ ఫంక్షన్లో కూర్చునే ప్రసక్తే లేదని అనసూయ తెగేసి చెప్పింది. నందు వస్తే అతడి వెంట ఆ కొరివి దెయ్యం లాస్య వస్తుందని, అది నాకిష్టం లేదన్నాడు ఆమె భర్త. మీరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో ఎవరి మాటా విననని, తన కొడుకు రావాల్సిందేనని అనసూయ తేల్చి చెప్పింది. నందు మాత్రం ఏకంగా ఈ ఫంక్షన్ను రిసార్ట్లో జరిపించాలనుకుంటాడు. ఇదే విషయాన్ని ఎంతో ఆదుర్దాగా ఇంటికి వెళ్లి మరీ చెప్తాడు. కానీ నందు నిర్ణయాన్ని అతడి తండ్రి అంగీకరించడు. నీ ఆఫర్లు ఇక్కడ ఎవరికీ అక్కర్లేదంటాడు. ఈ వేడుక జరిపే అర్హత కూడా లేదని నిందిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో అని అవమానిస్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు తన మాట కాదన్నారంటే ఈ కొడుకు చచ్చిపోయినట్లేనని, ఇంకెప్పుడూ మీ ముఖం కూడా చూడనని చెప్పి విసురుగా వెళ్లిపోతాడు. అతడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నందు తల్లి అతడి చేతుల మీదుగా ఫంక్షన్ జరగలేదంటే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పింది. నువ్వు చచ్చినా సరే, తాను మాత్రం ఆ ఫంక్షన్కు వచ్చేదే లేదని నందు తండ్రి తేల్చి చెప్తాడు. ఈ క్రమంలో అనసూయ తన పంతం నెగ్గించుకోవడానికి నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో కంగారుపడ్డ తులసి.. నందు చేతుల మీదుగా ఫంక్షన్ జరుగుతున్నట్లు అతడి నోటితోనే చెప్పించాలనుంది. ఇందుకోసం లాస్య ఇంటి మెట్లు ఎక్కక తప్పలేదు. మరి తన ఇంటికి వచ్చిన తులసిని లాస్య అవమానిస్తుందా? లేక అటు నుంచటే బయటకు పంపించేస్తుందా? అసలేం జరగనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
Karthika Deepam: ఇదేమైన మోనిత డ్రామా? అని అనుమానిస్తున్న దీప
కార్తీకదీపం జూన్23వ ఎపిసోడ్: మోనితకు గట్టిగా బుద్ది చెప్పాలని సౌందర్యకు సలహా ఇవ్వడానికి వెళ్లిన భాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఇంటివ దగ్గర మురళీ కృష్ణ ఎదురు చూస్తుంటాడు. ఇంతలో భాగ్యం వస్తుంది. రాగానే చెప్పావా అంటూ ఆత్రుతగా అడుగుతాడు మురళీ కృష్ణ. దీంతో భాగ్యం అక్కడ జరిగిన విషయం, సౌందర్య ఏం చెప్పిందో అన్ని వివరిస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక్ ఫుల్గా తాగి ఆ రోజు మోనిత ఇంట్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ మోనిత గీసిన గీతలు చూస్తూ మనసులో తప్పు చేసిన భావనతో పశ్చాతాప పడతాడు. మరోవైపు దీప పిల్లలు పడుకుని ఉండగా వారిని చూస్తూ హిమా ఆటోలో తనతో బాధపడిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది.హిమ అడిగిన ఏ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని ఆలోచిస్తుంది. చిన్నప్పుడు సవతి తల్లి కారణంగా లేకుండా ఎందుకు కొడుతుందని నాన్న అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు, నా మీద డాక్టర్ బాబుకు అనుమానం ఎందుకంటే సమాధానం లేదు, ఇప్పుడు నాన్న ఎందుకు అలా ఉంటున్నాడంటే నా దగ్గర సమాధానం లేదంటూ మనసులో అనుకుంటు కుమిలి పోతుంది. నా కడుపున పట్టినందుకే మీకు ఇన్ని కష్టాలంటూ దీప మదనపడుతుండగా బయట నుంచి శబ్థం వినిపిస్తుంది. దీంతో దీప వెళ్లి చూడగా కార్తీక్ తను ఏ తప్పు చేయలేదని నన్ను నమ్ము దీప అంటూ బాధపడుతుంటాడు. ‘నాతో మాట్లాడూ దీప, వాదించు.. తిట్టూ.. నేను చెప్పేది విను దీప’ అంటూ తల పట్టుకుని ఏడుస్తుంటాడు కార్తీక్. దీంతో దీప మనసులో తను ఏం చేసిన కరెక్ట్ అని వాదించి మనిషి ఎందుకు ఇలా ఉంటున్నాడు. తప్పు చేశాననే భావన ఆయనలో కనిపిస్తుంది. ఎలాగు మోనితను పెళ్లి చేసుకుంటా అనుకున్నాను కదా అందుకే ఇద్దరం కలిసిపోయామని ఆయన చెప్పోచ్చు.. కానీ అలా కాకుండా తప్పు చేసిన వాడిలా అసలు నోరు కూడా మెదపడం లేదంటూ దీప కార్తీక్ను చూస్తూ మనసులోనే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కింద కూర్చోని బాధపడుతుంటే దీప వెళ్లి మంచినీళ్లు ఇస్తుంది. గ్లాస్ తీసుకుని నీళ్లు తాగిన అనంతరం కార్తీక్ తనతో మాట్లాడమని, తాను ఏ తప్పు చేయలేదంటూ దీపతో అంటాడు. ‘దేవుడు నాకు పిల్లలు పుట్టే యోగం ఉందని మరో రకంగా అయినా తెలియజేయోచ్చు కదా. ఎవరైతే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారో నా క్లోజ్ ఫ్రేండ్కే అలా జరగడం ఏంటి’ అంటూ కుంగిపోతాడు. అంతేగాక ఆ రోజు ఫుల్గా తాగి ఉన్నానని అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటాడు. అంతేగాక మ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ చెప్పగానే దీప ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా ఆదిత్య సౌందర్యతో హిమా, శౌర్యలను చూసోస్తానని సౌందర్యతో అనగానే ఆమె వద్దని చెబుతుంది. కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడని అన్నయ్యను చూడగానే నీ మాటలు అదుపులో ఉండవని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావని చెబుతుంది సౌందర్య. ఇక దీప కార్తీక్ తనతో చెప్పిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇదంతా నిజమేనా లేక మోనిత ఏదైనా డ్రామా ఆడుతుందా? అనుకుంటుంది. డాక్టర్ బాబులో మోనితపై అభిమానం కనిపించడం లేదని ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తిలా చూస్తున్నాడనుకుంటుంది. దీని వెనక ఎదో రహస్యం ఉందని కనిపెట్టాలని దీప నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
అంకితకు షాకిచ్చిన అభి, ఉద్యోగం మానేయడంతో పాటు..
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 23వ ఎపిసోడ్: నువ్వు కనిపించినప్పుడల్లా కంపరం వేస్తోందంటూ అంకిత శృతిని చీదరించుకుంది. దీంతో శృతి ఎంతగానో బాధఫడింది. మీరందరూ బాగుండాలని, ఈ ఇంటివాళ్లు క్షేమంగా ఉండాలని అందు కోసం తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. కానీ నువ్వు మాత్రం చెప్పుడు మాటలు విని మోసపోకని అంకితను హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన అంకిత.. నా ముందు నిలబడటానికి అర్హత లేని నువ్వు నాకు సుద్దులు చెప్తున్నావా? అని మండిపడింది. నిన్ను అందరూ అసహ్యించుకునేలా చేయనిదే తన పగ చల్లారదని చెప్పి అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోయింది. అభిని వీలైనంత త్వరగా తన వాళ్ల దగ్గర నుంచి దూరం చేయాలని ఆ ఇంట్లో అడుగు పెట్టిన అంకితకు షాకిచ్చాడు అభి. తను ఉద్యోగం మానేశానని, పైగా ఫారిన్ వెళ్లడం లేదంటూ బాంబు పేల్చాడు. మీ అమ్మ మాటలు వినడం వల్లే బిడ్డను దూరం చేసుకున్నామని, ఇంకా వాళ్ల నిర్ణయాలకు తల వంచాల్సిన అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో కొంత కంగారుపడ్డ అంకిత.. ఇప్పుడు తనేమన్నా చివరికి మాత్రం తన మాటకు తలొగ్గాల్సిందేనని లోలోపలే అభిప్రాయపడింది. ఇక దివ్య ల్యాప్టాప్ పాడైందని ప్రేమ్ తన డబ్బులతో ట్యాబ్ తీసుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే అంకిత కూడా ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆమెకు ఇవ్వబోయింది. అయితే దాన్ని తీసుకునేందుకు దివ్య నిరాకరించింది. ప్రేమ్ అన్న ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే తీసుకుంటానంటూ అంకితకు ఝలకిచ్చింది. ఇక నందు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుదామని తులసి కుటుంబం ప్లాన్ వేసింది. కానీ ప్లాన్లు వేస్తే సరిపోదని, సెలబ్రేషన్ చేయడానికి సొమ్ములుండాలని దెప్పి పొడిచింది అనసూయ. అయితే నందు వచ్చి ఈ వేడుకను రిసార్ట్లో జరిపించాలనుకుంటున్నట్లు చెప్తాడు. దీనికి అతడి తండ్రి ససేమీరా కుదరదని తేల్చి చెప్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు.. తన మాటను కాదంటే నీ కొడుకు చచ్చిపోయినట్లేనంటాడు. మరి నందు కోరికను అతడి తండ్రి మన్నిస్తాడా? ఈ వేడుకలు తులసి ఇంట్లో జరుగుతాయా? లేదా రిసార్ట్లో జరగనున్నాయా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: తోటలో పండ్లు తెంపి అమ్ముకుంటున్న నరేశ్! -
Devatha : రుక్మిణి ప్రెగ్నెన్సీ.. సంతోషంలో ఆదిత్య
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని కోరుకుంటూ రుక్మిణి ఆమెకు ప్రసాదం తెచ్చిస్తుంది. మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి సత్య అనుమానం వ్యక్తం చేయగా అదేమీ లేదని రుక్మిణి బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని , అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సత్య ఆదిత్యను కోరుతుంది. రుక్మిణి వాంతులు చేసుకోవడం ఆ తర్వాత పుల్లటి మామిడికాయలు తినడం చూసి ఆమె గర్భవతి అయ్యిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 22న 266వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడి ప్రసాదాన్ని తాను తినకండా రుక్మిణి సత్యకు ఇస్తుంది. ముడుపు దగ్గరనుంచి ప్రసాదం వరకు తనతోనే ఎందుకు చేయిస్తున్నావంటూ సత్య ప్రశ్నించగా..నీ కడుపులో బిడ్డ కోసం అని రుక్మిణి చెబుతుంది. ఇక సీన్ కట్ చేస్తే రుక్మణి వాంతులు చేసుకుంటుంది. దీంతో ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి విషయం ఏమో అని సత్య అనుమానం వ్యక్తం చేయగా రుక్మిణి వాటిని ఖండించింది. అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. మరోవైసు రుక్మిణి తనపై చూయిస్తున్న ప్రేమానురాగాలకు సత్య భయపడిపోతుంది. ఎక్కడ తన జీవితం నాశనం చేసుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యకు చెప్పి తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతుంది. సీన్కట్ చేస్తే రుక్మిణి వాంతులు చేసుకోవడం దేవుడమ్మ చూస్తుంది. ఏదైనా విశేషమే అని అడిగితే అదేమీ లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు ఈశ్వర్ ప్రసాద్ తోట నుంచి మామిడి పళ్లు తేగానే రుక్మిణి ఎంతో ఆతృతగా వాటిని తీసుకొని తింటుంది. దీంతో కోడలు నెల తప్పిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆదిత్య కూడా అక్కడే ఉండటంతో విషయం తెలిసి సంతోషంలో మునిగితేలతాడు. థ్యాంక్యూ అంటూ రుక్మిణిని ఎత్తుకొని చాలా సంతోషిస్తాడు. అయితే అదేమీ లేదని, కేవలం మామిడి పళ్లతో పచ్చడి చేయడానికి తిని చూశానని రుక్మిణి చెప్పడంతో అందరూ నిరాశ చెందుతారు. మరి రుక్మిణి ప్రెగ్నెన్సీ విషయం సత్య తెలుసుకుంటుందా అని తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
ఏదైనా దీవిలో ఇరుక్కుపోయామా అని భయమేస్తోంది అమ్మ: హిమా
కార్తీకదీపం జూన్ 22 ఎపిపోడ్: కార్తీక్ దీప ఇంటి ముందు జనత ఉచిత వైద్యశాల పేరుతో క్టీనిక్ నడుపుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ పేషెంట్స్ను చూస్తుండగా సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. కార్తీక్ అతడి రిపోర్ట్స్ చూసి మందులు రాసి ఇస్తాడు. అంతేగాక తన దగ్గర పని చేయాలని అందుకు తనకు రూ. 25 వేల జీతం ఇస్తానని కార్తీక్ చెప్పడంతో లక్ష్మణ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ దేవుడు అంటూ పొగుడుతుండగా సరిగ్గా అదే సమయానికి దీప బయటకు వస్తుంది. లక్ష్మణ్ దీపను చూసి దీపమ్మా ఇలా రమ్మా అంటూ పిలిచి వారిద్దరి కాళ్లకు దండం పెట్టుకుంటాడు. మీరిద్దరూ ఆదర్శ దంపతులంటూ మీలో రాముడు, సీత.. శివుడు, పార్వతిలు కనిపిస్తున్నారంటాడు. దీంతో కార్తీక్ ‘ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్న ఈ మనిషి లోపల ఎంత దుర్మార్గుడో వీళ్లకేం తెలుసు అనుకుంటున్నావా దీపా’ అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే హిమ బయటికి వచ్చి అమ్మా వెళ్దామా అంటుంది. కార్తీక్ ఎక్కడికి అనడంతో మార్కెట్కు వెళ్తున్నామని చెబుతుంది దీప. ఇదిలా ఉండగా భాగ్యం సౌందర్యతో రహస్యంగా మాట్లాడుతుంది. మోనితకు ఇలా సాఫ్ట్గా చెబితే పని జరగదని, తను వెళ్లి తన తీరులో మోనితకు వార్నింగ్ ఇస్తానని చెబుతుంది భాగ్యం. లేదంటే మీరైనా క్లాసుగా కాకుండా మాస్గా వార్నింగ్ ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది. అది జరగని పని.. మన దగ్గర తప్పు పెట్టుకుని మోనితని ఏం చేయలేమని సౌందర్య అంటుంది. అంతేగాక తన దగ్గర ఇప్పుడు బ్రహ్మస్త్రం ఉందని ఇప్పుడు మోనిత భయపెట్టడం జరగదంటుంది. కానీ భాగ్యం మాత్రం మనసైడు తప్పు ఉన్న తల వంచకుండా తెలివిగా ఆలోచించి మోనిత పని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని.. గోడపై మోనిత గీసిన గీతలని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండగా లోపల నుంచి శౌర్య వస్తుంది. కార్తీక్ ఆ గీతలను చూస్తుండటం చూసి అవి నీ భవిష్యత్తు అన్నావు కదా నాన్న ఇప్పుడు వాటి వల్ల ఎమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమాయకంగా. అప్పుడే కార్తీక్కు అన్ని గుర్తు చేసుకుంటాడు. దీప ప్రెగ్నెట్ అని తెలియగానే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని గట్టిగా అరిచి చెప్పిన సంఘటన, అలాగే శౌర్య గతంలో నాన్న పిలిచి నువ్వే మా నాన్నవని ఎప్పుడో తెలుసు అనడం, కార్తీక్ హిమని ఎత్తుకుని తిరిగింది అన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతాడు. దీంతో శౌర్యను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని తీప్పుతుండగా అప్పుడే సౌందర్య వస్తుంది. అదంతా చూసి ఆనందిస్తుంది. ఇంతలో కార్తీక్ సౌందర్య చూసి నానమ్మ వచ్చిందని చెప్పగానే శౌర్య సంతోషిస్తుంది. లోపలికి వచ్చిన సౌందర్య గోడ మీద ఉన్న గీతలను చూసి శౌర్యతో గ్లాసులో నీళ్లు తెమ్మని చెబుతుంది. ఆ లోపు కార్తీక్తో ఆ గీతల్ని చెరపకుండా అలేనే ఉంచుతావా అని ప్రశ్నిస్తుంది. అయినా కార్తీక్ మౌనంగా ఉంటాడు. ‘ఆ గీతల్ని చెరిపి నీ రాతను మార్చుకోరా’ అంటుంది అనడంతో తన వల్ల కాదేమో మమ్మీ అంటాడు కార్తీక్ నిరాశగా.. ఆ మోనిత నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని, తనని బెదరిస్తుంది కానీ దీపకు భయపడుతుంది అంటుంది. అందుకే. సమస్యని దీపకు చెప్పు.. దీప చేతిలో పెట్టు.. ఆ గీతల్ని దీపే చెరిపేస్తుంది అని సౌందర్య చెబుతుంది. దీంతో ఆ కార్తీక్ దీప చూసే చూపుల్లో ఆ గీతల్ని చెరిపే బాధ్యత నీదే అన్నట్టు నాకు అర్థమవుతుంది మమ్మీ.. ఇంకా ఆ గీతల్ని ఎలా చెరిపేస్తుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆటో వస్తుండగా హిమ దీపతో వారణాసి ఎందుకు రాలేదని, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. దీంతో ఏదో పని మీద బయటకు వెళ్లాడని దీప సమధానం ఇస్తుంది. ఆ తర్వాత హిమ నాకు చాలా భయంగా ఉందని, ఏదో మనసులో తెలియని బాధ ఉంటోందంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనం అందరం కలిసే ఉన్నా ఏంటో భయం భయంగా అనిపిస్తుందంటూ బాధపడుతుంది. వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే.. ఇక మీదట వారణాసి కూడా మనతో మాట్లాడడేమోననే భయమేస్తోందని, ఈ ప్రపంచంలో మనషులంతా వేరు, మన నలుగురం వేరేమో.. ఏదైనా దివిలో ఇరుక్కుపోయామోనని అనిపిస్తుంది అమ్మ అంటూ హిమ కన్నీరు పెట్టుకోవడంతో దీప హిమను దగ్గరకు తీసుకుని తాను కూడా ఎమోషనల్ అవుతుంది. -
అత్త కోసం కొత్త స్కూటీ తెచ్చిన అంకిత, కానీ..
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 22వ ఎపిసోడ్: తులసి ఇంట్లో మంట పెట్టేందుకు అంకిత లాస్యతో చేతులు కలిపింది. దీనికోసం ముందుగా తులసిని తన మాయమాటలు, మంచితనంతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా అసలు రంగు బయటపెట్టనుంది. అందులో భాగంగా తులసిని మాయ చేసేందుకు ఆమెకు ఓ స్కూటీ కొనివ్వాలనుకుంటుంది. ఇందుకోసం తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఆ ఇంటిని ముక్కలు చేసేందుకు లక్ష రూపాయలు ఇవ్వలేనా? అని అడిగిన మొత్తాన్ని కూతురికి పంపిస్తుంది. దీంతో అంకిత ఓ కొత్త స్కూటీ కొనుక్కొచ్చి అత్త ముందుంచుతుంది. అయితే దాన్ని తీసుకునేందుకు తులసి తటపటాయించడంతో 'నన్ను పరాయిదానిలా చూస్తున్నారా? మీ వారసుడిని చంపేశానని నాపై కోపమా?' అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంది. ఇది నీ డబ్బుతో కాదు, మీ అమ్మ ఇచ్చిన డబ్బుతో కొన్నావు. ఆ డబ్బును అనుభవించే హక్కు నీకు మాత్రమే ఉంటుంది, అందుకే ఈ బైక్ వద్దంటున్నానని చెప్తుంది తులసి. మరోవైపు లాస్య కొత్త కారు కొందామని నందు వెంటపడింది. దివ్య ఫీజు కోసం ఆ కారు అమ్మేద్దామనుకున్నాం. కానీ తులసి అలా కాకుండా చేసింది. ఇప్పుడు ఆ కారు తులసి వేసిన ముష్టిలా అనిపిస్తోంది. ఆ కారెక్కాలంటేనే కంపరంగా ఉంది. ప్లీజ్.. కొత్త కారు తీసుకుందాం అని ఒత్తిడి చేస్తుంది. దీంతో అయిష్టంగానే నందు ఒప్పేసుకున్నాడు. ఇక తన అత్తామామలకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపించాలని తులసి ప్లాన్ చేసింది. అయితే కొడుకు రాకపోతే తాను కూడా ఫంక్షన్కు వచ్చేది లేదని తేల్చి చెప్పేసింది అనసూయ. మరి తులసి అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
Karthika Deepam: అసలేం జరిగిందో దీపకు వివరించిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 21వ ఎపిసోడ్.. సౌందర్యని కలవడానికి వెళ్లిన దీప.. తిరిగి రావడం, కార్తీక్ తింటూ రా దీపా.. నీకు ఇడ్లీ తీసిపెట్టాను అని చెప్పడంతో.. మరి నాకు అంటూ మోనిత ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. నవ్వుతూ.. లోపలికి వచ్చి.. టిఫిన్ తింటాను అంటూ కూర్చుంటుంది. అంతేగాక దీపను కూడా తిను అని అడగడంతో.. ఇప్పుడు తినను తర్వాత తర్వాత తింటానని దీప సమాధానం ఇస్తుంది. వెంటనే మోనిత ‘చెప్పాను కదా దీప నీలాగా నేను వేయిట్ చేయలేను’ అంటూ పిల్లలకు అర్థం కాకుండా తెలివిగా మాట్లాడుతుంది. ఇండ్లీ పెట్టుకుని ‘కార్తీక్ ఇడ్లీ సూపర్ నీ చేతుల్లానే భలే మెత్తగా ఉంది’ అని మాట్లాడుతూ దీప ఉడుక్కునేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటోంది, అందుకే టైమ్కి తింటున్నాను. లేకపోతే కళ్లు తిరుగుతున్నాయి. ఈ మధ్య వికారంగా ఉంటోందంటూ తన మాటలతో కార్తీక్ను, దీపను ఇబ్బంది పెడుతుంది మోనిత. ఇక హిమ, శౌర్యలకు తెచ్చిన చాక్లెట్స్ బ్యాగులోంచి తీసి మనపిల్లలే కదా అని తీసుకొచ్చాను అంటుంది. ఇక మోనిత తీరు చూసి కార్తీక్ మనసులో ‘నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు.. గిల్టీగా ఫీల్ కాలేదు.. అందుకే నాకు తల దించుకోవడం అలవాటు లేదు.. ఇప్పుడు అర్థమవుతుంది చెయ్యని నేరానికి దీప పాపం ఎంత నరకం అనుభవించుంటుంది?’ అనుకుంటాడు బాధగా. పిల్లలను బయటకు వెళ్లమని చెప్పి మోనిత గోడ మీద గీసిన 10 గీతల్లో రెండో గీత కొట్టేసి వెళ్లిపోతుంది. ఇక సౌందర్య ఇంటికి వెళ్లి పరువు గురించి, దీప జీవితం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రావ్య కూల్ చేసే ప్రయత్నం చేస్తే.. శ్రావ్యతో కూడా అదే బాధను పంచుకుని బాధపడుతుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన మోనిత అద్దంలో చూసుకుంటూ దీప తనకంటే అందంలో, చదువులో, డబ్బు సంపాదనలో ఎందులో ఎక్కవ కాదు మరేందుకు కార్తీక్ దీపనే ఇష్టపడుతున్నాడని ప్రియమణిని అడుగుతుంది. ప్రియమణి అన్నింట్లోనూ మీరే ఎక్కువ అంటూనే మోనితకు కౌంటర్ వేస్తుంది. మోనిత చేతిని తీసి ఆమె గుండెల మీద పెట్టి.. ‘ఇప్పుడు చెప్పండమ్మా.. దీపమ్మ మంచిదా.? మీరు మంచివారా’ అంటుంది. దాంతో మోనితకి తను చేసిన నేరాలన్నీ గుర్తొస్తాయి. మీ కళ్లలోనే తెలుసిపోతుందమ్మా.. మీరు మంచివారైతే కార్తీక్ అయ్యే మీ దగ్గరకు వస్తాడని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే మోనిత మాత్రం మనసులో.. ‘ఎవరు ఎన్ని చెప్పినా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను’ అనుకుంటుంది. ఇదిలా ఉండగా దీప దగ్గరకు వారణాసి కంగారు వస్తూ అక్కా.. డాక్టర్ మోనిత ఇక్కడికి వచ్చి వెళ్లిందా?’ అని అడుగుతాడు. దీంతో ఏం అయ్యిందని దీప అడగ్గా.. మోనిత తనని తమ్ముడని పిలిచిందని, నిన్ను బాగా చూసుకోమ్మని ఇక నుంచి ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలని అన్నదని చెబుతాడు.అదంతా విన్న కార్తీక్ అక్కడి రాగానే వారణాసి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ దీప వంక జాలిగా చూస్తూ దీపకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నస్తాడు. ఇంతలో పిల్లలు వాళ్లిదరికీ ఫోటోస్ తీసి.. ‘సూపర్ నాన్నా.. సూపర్ డాడీ.. మీరు ఇలా కలిసి ఉంటేనే మాకు చాలా ఇష్టం.. ఇంతకన్నా మాకు ఏం అవసరం లేదు’ అంటారు. తరువాయి భాగంలో కార్తీక్ అసలు ఏం జరిగిందనేది ఏడుస్తూ చెపుతాడు. తనకు పిల్లలు పుట్టరని మోనిత చెప్పిందనే విషయంతో పాటు ఆరోజు రాత్రి మోనిత ఇంట్లోనే ఫుల్గా తాగి పడిపోయిన విషయం చెబుతాడు. ఆ మైకంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని ఈ విషయం మోనిత తనకు చెప్పేవరకు తెలియదని కార్తీక్ దీపకు వివరిస్తాడు. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్: ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్ -
Devatha :కనకం చెంప పగలకొట్టిన దేవుడమ్మ
రుక్మిణి- సత్యల మోసం గురించి దేవుడమ్మకు చెప్పాలని కనకం తెగా హడావిడి చేస్తుంది. అయితే అక్కడ సీన్ రివర్స్ కావడంతో బిక్కమొఖం వేసుకుంటుంది. అయినా తను చెప్పిందే నిజం అన్నట్లు వాదిస్తుంది. ఆ మాటల్లోనే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆదేత్య తండ్రి అని చెప్పడంతో దేవుడమ్మ కనకం చెంప చెళ్లుమనిపిస్తుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు కనకంను ఇంట్లోంచి గెంటివేస్తుంది. ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 21న 265వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణి స్థానంలో సత్య వ్రతం చేయడాన్ని చూసి కనకం ఆశ్చర్యపోతుంది. ఈ విషయాన్ని దేవుడమ్మకు చెప్పాలని తెగ ఆరాటపడుతుంది. వెంటనే దేవుడమ్మను పిలిచి సత్య చేస్తున్న వ్రతం గురించి వివరిస్తుంది. కావాలంటే అక్కడికే వెళ్లి చూద్దామని చెప్తుంది. అయితే సరిగ్గా దేవుడమ్మ వచ్చే సమయానికి సీన్ రివర్స్ అవుతుంది. సత్య స్థానంలో రుక్మిణి పూజ చేస్తుంటుంది. దీంతో కనకంకు దిమ్మతిరిగిపోయింది. వీళ్లు కావాలని ఇలా చేస్తున్నారని, కావాలంటే పంతులును అడగాలని చెప్తుంది. అయితే ఆయన కూడా ప్లేటు మార్చేసి రుక్మిణికే అండగా నిలుస్తారు. దీంతో దేవుడమ్మ కనకంను తిట్టి పోస్తుంది. అయితే ఇందులో తన తప్పేమీ లేదని, అసలు సత్య కడుపులో పెరుగుతుంది ఆదిత్య బిడ్డే అన్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్తుంది. దీంతో దేవుడమ్మ కనకం చెంప చెల్లుమనిపిస్తుంది. తన కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తుంది. అయినా కనకం మాట వినకుండా ఆదిత్యే సత్య బిడ్డకు తండ్రి అంటూ వాదిస్తుండటంతో మరోసారి కనకంపై దేవుడమ్మ చేయిచేసుకుంటుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు గానూ వెంటనే ఇంట్లోంచి వెళ్లాలని ఆదేశిస్తుంది. అయితే తన వల్ల కనకం అత్తను బయటకు పంపొద్దని రుక్మిణి వేడుకున్నా దేవుడమ్మ అందుకు అంగీకరించదు. మరి ఇంట్లోంచి వెళ్లగొట్టినందుకు కనకం ఏం చేస్తుంది అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: లాస్యతో చేతులు కలిపిన అంకిత
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 21వ ఎపిసోడ్: అభి నేరుగా అంకితను తీసుకుని తులసి ఇంటికి వెళ్లినందుకు నందు ఆగ్రహించాడు. మీతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎన్ని చేసినా ఇలా దూరం చేస్తున్నారని ఆవేశపడ్డాడు. అత్తిల్లు వదిలేసి వచ్చినట్లు తనతో ఒక మాటైనా చెప్పలేదేంటని నిలదీశాడు. లాస్యతో ఉన్నంత మాత్రాన పిల్లలను దూరం పెట్టనని స్పష్టం చేశాడు. దీంతో అభి తండ్రి అలకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అంకిత మనం అందరితో సమానంగా కలిసిపోవాలని, కాబట్టి మామయ్య ఇంటికి వెళ్లొద్దామని అభికి నచ్చజెప్పింది. మరోవైపు తనమూలంగా మళ్లీ ఇంట్లో గొడవలు రాకూడదని ఇక్కడి నుంచి వెళ్లిపోతానంది శృతి. అంకిత మనసులో తన మీదున్న ద్వేషం గొడవలకు దారి తీస్తుందని భయపడింది. కానీ తను ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, ఇంకోసారి అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వొద్దని తులసి మరీమరీ చెప్పడంతో శృతి కిమ్మనకుండా ఉండిపోయింది. ఇక అభి, అంకిత.. నందు ఇంటికి వెళ్లి అతడికి సారీ చెప్పారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న లాస్య అంకిత దగ్గర అసలు కూపీ లాగింది. ఏ పని మీద తులసి ఇంటికొచ్చావని నిలదీసింది. దీంతో ఓపెన్ అయిపోయిన అంకిత.. అభిని తన వాళ్ల దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేద్దామనే ఇక్కడికి వచ్చానని చెప్పింది. ఇది విని సంతోషపడిపోయిన లాస్య.. ఎలాంటి సాయం కావాలన్నా తనను నిరభ్యంతరంగా అడగొచ్చని తెలిపింది. అలా వీళ్లిద్దరూ తులసి మీద కుట్ర పన్నేందుకు చేతులు కలిపారు. మరి వీరి పన్నాగాన్ని తులసి పసిగడుతుందా? మున్ముందు తులసికి మరిన్ని చిక్కులు తప్పవా? అనేది రానున్న ఎపిసోడ్లలో చూడాలి. చదవండి: 'ఇడియట్' హీరోయిన్ రక్షిత ఇలా అయిపోయిందేంటి? -
9 రోజుల తర్వాత అలా చేస్తా: ప్రియమణికి వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 19: అబార్షన్ చేసుకోమ్మని సర్దిచెప్పడానికి వెళ్లిన కార్తీక్కు మోనిత షాక్ ఇస్తుంది. కార్తీక్నే ఎదోక నిర్ణయం తీసుకోవాలని లేదంటే తానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగాక భార్య స్థానం ఇవ్వమంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లిన చెప్పి సలహా అడుగుతాడు. సౌందర్య తానేం చేయలేనని, నువ్వు తప్పు చేశాడు ఫలితం అనుభవించాల్సిందే అంటూ హితవు పలుకుతుంది. మరీ కార్తీక్ మోనిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నాడో నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య దగ్గరికి వెళ్లి సలహా అడిగిన కార్తీక్కు ఆమె చివాట్లు పెడుతుంది. తానేం చేయలేనని చేతులెత్తెస్తుంది. దీంతో కార్తీక్ తిరిగి దీప ఇంటికి వచ్చేస్తాడు. ఉదయం దీప లేచేసరికి కార్తీక్ బయట పడుకుని కనిపిస్తాడు. అలా కార్తీక్ను చూడటంతో దీప మనసు కరుగుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి తీసుకేళ్లి కార్తీక్ను లేపుతుంది. దీప పిలుపుతో కళ్లు తెరిచిన కార్తీక్ ఆమెను చూసి ఏంటి ఇంత ఉదయాన్నే రేడి అయ్యావని కంగారు పడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావా? ప్లీజ్ దీప అలా చేయకు అని తను తట్టుకోలేనని, పిల్లలు మమ్మీ ఏదని అడిగితే ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు కార్తీక్. దీంతో దీప ఎక్కడికి వెళ్లడం లేదని, కాస్తా పనుండి బయటకు వెళ్తున్నట్లు చెబుతుంది. అలాగే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదంటూ గంటలో వస్తానని చెబుతుంది. దీంతో కార్తీక్ మన కారులో డ్రాప్ చేస్తానంటాడు. కానీ దీప వారణాసి ఆటోలో వెళ్తానని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప, సౌందర్యలు పార్కులో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మోనిత, ప్రియమణితో కలిసి వాకింగ్కు వస్తుంది. అదే సమయంలో మోనిత తొమ్మిది రోజుల తర్వాత తను ఏం చేయనుందో ప్రియమణికి వివరిస్తుంది. దీంతో ప్రియమణి అది జరిగే పని కాదని, దీప, సౌందర్యలు అడ్డుకుంటారనగానే మోనిత అక్కడ దీపను, సౌందర్యను చూస్తుంది. సౌందర్య దీపతో కార్తీక్ తన దగ్గరికి వచ్చి సలహా అడిగిన విషయం చెబుతుంది. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి వారిని పలకరిస్తుంది. ఆ తర్వాత ‘ఓ కాలమా ఇది నీ గాలమా’ కాలానికి అద్భుతమైన శక్తి ఉంది ఆంటీ అంటూ దీప విజయనగం వెళ్లిన రోజులను గర్తు చేస్తుంది. అంతేగాక హిమను వెతికి పెడితే కార్తీక్ తనని పెళ్లి చేసుకుంటానని అడమేంటని, చావుబతుకుల్లో ఉన్న దీపను కార్తీక్ బతికించుకోవడం ఏమిటి? పాపం ఇన్ని చేసిన కార్తీక్ను దీప ఛీ కొట్టే పరిస్థితి రావడం ఏంటీ? అంటూ ఇది మోనిత మహత్యం కాదని, కాల మహత్యం అంటుంది. ఇప్పుడు కాలం గాలి రెండూ ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయంటూ విర్ర వీగుతుంది మోనిత. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సౌందర్య కార్తీక్ చేసిన పనికి కోపం తెచ్చుకుంటూ ఏం చేయాలేని పరిస్థితి తీసుకోచ్చాడని, కాళ్లు చేతులు కట్టేశాడంటూ అహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే నీకు అన్యాయం జరగనివ్వనని, కష్టం కలగనివ్వను అంటుండగా.. దీప తనకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంతుంటుంది అత్తయ్యా తన మాటలతో సౌందర్యను బాధపెడుతుంది. ఇక తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం కార్తీక్కు, దీపకు సాయం చేస్తానంటుంది. ఇలాంటి విషయాలను డీల్ చేయాలంటే ఆ సౌందర్య, దీప, కార్తీక్ ఎవరి వల్ల కాదని తనలాంటి వాళ్ల వల్లే అవుతుంది అంటుంది. నేనోంటో చూపిస్తా అని మురళీ కృష్ణతో చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మొక్కలకు నీళ్లు పడుతుండగా.. పిల్లలు దీప గురంచి అడుగుతారు. బయటికి వెళ్లిందని అనడంతో ఏంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అని అడుగుతుంది. నిజంగా అమ్మ మీతో చెప్పిందా? ఏ గోడకో, చెట్లకో చెప్పిందా అంటూ కార్తీక్, దీపలు ఎందుకు మాట్లాడుకోవడం లేదని, దీప తనపై ఎందుకు కోపంగా ఉందని పిల్లలు కార్తీక్ను ప్రశ్నిస్తారు. దీంతో ప్రశ్నలు ఆపి ఫ్రెష్ అయ్యి రండని, టిఫిన్ చేసి పెడతా అంటాడు కార్తీక్. దీప వచ్చేసరికి పిల్లలు బయట ఆడుకుంటారు. కార్తీక్ అప్పడే టిఫిన్ చేస్తాడు. దీపను చూసి నువ్వే వచ్చేసరికి లేటు అవుతుంది తను తినేస్తున్నానని అంటుండగా.. అప్పుడే మోనిత మరీ నాకు అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి స్థానంలో వ్రతం చేసిన సత్య.. కనకం షాక్
సత్య గురించి రుక్మిణి అంతలా ఆలోచించడం ఏంటని దేవుడమ్మ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సత్య జీవితం కోసం ఆలోచిస్తూ ఆదిత్యతో సంతోషంగా ఉండడం లేదని గుర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఈశ్వర్ ప్రసాద్తో చెబుతుంది. సీన్కట్ చేస్తే రుక్మిణి చేయాల్సిన వ్రతాన్ని తను చేయకుండా చెల్లెలు సత్యను కూర్చోబెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని, అందుకు ఈ వ్రతం చెయ్యమని కోరుతుంది. ఇక సత్య వ్రతంలో కూర్చోవడాన్ని చూసిన కనకం షాకవుతుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 19న 264వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్19 : సత్య చేసింది తప్పు అని తెలిసినా రుక్మిణి వెంటేసుకొని రావడాన్ని దేవుడమ్మ సహించదు. తన మాటను లెక్కచేయకుండా ఇంటికి తేవడం ఏంటని ఈశ్వర్ ప్రసాద్తో చర్చిస్తుంది. సత్య గురించి ఆలోచిస్తూ ఆదిత్యతో సఖ్యతగా లేకపోవడం, ఇద్దరి దాంపత్య జీవితానికి అడ్డుగా మారుతుందని ఆందోళన పడుతుంది. సీన్ కట్ చేస్తే పిల్లలు పుట్టాలని దేవుడమ్మ రుక్మిణితో చేయించాలనుకున్న వ్రతాన్ని సత్యతో చేయించాలని రుక్మిణి భావిస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటూ వ్రతం చేయాల్సిందిగా సత్యను కోరడంతో ఆమె షాకవుతుంది. తన మాటకు అడ్డు చెప్పకుండా చెప్పింది చేయాల్సిందిగా కోరుతుంది. దీంతో తన వల్ల రుక్మిణి-ఆదిత్యల జీవితం ఏమైపోతుందో అని సత్య కంగారు పడుతుంది. ఇలా జరగకూడదని, వెంటనే కమలకు ఫోన్ చేస్తుంది. తనకు ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదని, అయితే ఎక్కడకు వెళ్లనీయకుండా రుక్మిణి అడ్డుపడుతందని చెప్తుంది. దీంతో ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసని, ఎలాగోలా ఇంటికి వచ్చేయమని కమల చెబుతుండగా, భాగ్యమ్మ ఫోన్ తీసుకుంటుంది. అక్కడ ఉంటేనే బావుంటుందని, ఊళ్లోకి వస్తే అందరి మాటల భరించాల్సి వస్తుందని చెప్తుంది. సీన్ కట్చేస్తే వ్రతంలో తన స్థానంలో సత్యను కూర్చోబెడుతుంది. -
Karthika Deepam: భార్య స్థానం కోరిన మోనిత, సౌందర్యను సలహా అడిగిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 18: మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్ని బెదిరిస్తుంది. పది అంటే పదే రోజుల్లో తనకు న్యాయం జరిగే నిర్ణయం చెప్పాలని గోడ మీద 10 గీతలు గీసి కౌంట్డౌన్ స్టార్ట్ అంటూ హెచ్చరించి వెలుతుంది. ఆ తరువాత కార్తీక్ మోనితకు ఆబార్షన్ చేయించుకోమ్మని చెప్పేందుకు ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ మోనిత కార్తీక్ చెప్పేది వినకుండా తనని పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వమని అడుగుతుంది. దీంతో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మోనితతో పదేళ్లుగా దీపను అనుమానించానని, ఇప్పుడది తప్పని తేలింది. ఈ సయమంలో అంటూ నానుస్తుండగా.. అయితే దానికి నాకు సంబంధం ఏంటని నిలదీస్తుంది మోనిత. ‘నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? నేనే చేయను. దీప కంటే ముందు నుంచి నిన్న ప్రాణంగా ప్రేమిస్తున్న, మరీ నా మీద ఎందుకు నీ ప్రేమ రాలేదు. కనీసం జాలి అయినా చూపించు కార్తీక్. అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి న్యాయం చెయ్యమంటున్నాను.. అంతే’ అంటుంది మోనిత. త్వరలో కార్తీక్ను తన నిర్ణయం చెప్పాలని, లేదంటే తనే ఏదోక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఆ తర్వాత ‘నీ యాక్షన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని చెప్పు’ అంటూ హెచ్చరిస్తుంది మోనిత. మరోవైపు పిల్లలు దీప బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి ఇంతకుముందు నాన్న వస్తే ఇష్టమైనవవి వంటలు అన్ని చేసి పెట్టెదానివి. ఇప్పుడు నాన్న వచ్చి మనతోనే ఉంటున్నా ఈ పిచ్చి వండి పెడుతున్నావు? ఏమైంది అమ్మ నీకు కొన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నావు. నాన్నకు, నీకు మధ్య ఏం జరిగిందని పిల్లలు ఆరా తీస్తారు. అలాగే గోడ మీద గీతలు గురించి అడుగుతూ.. కార్తీక్ తన చేతి గీతలని, భవిష్యత్ చెప్పిన మాటలకు అర్థం ఏంటని దీపను ప్రశ్నిస్తారు. అయినా దీప ఏం మట్లాడదు. దీంతో హిమ మీరు చెప్పకపోతే మేమే కనిపెడతామని, శౌర్యతో నువ్వు ఇవన్ని తెలుసుకుంటావు కదా అనగానే ‘నాన్ననే కనిపెట్టిన దాన్ని ఇది నాకు పెద్ద విషయం కాదు’ అంటుంది. శౌర్య తెలుసుకుంటా ఖచ్చితంగా కనిపెడతా అని అక్కడ నుంచి వెళ్లిపోగానే దీప ‘పిల్లలకి నిజంగానే ఆయన చేసిన తప్పు గురించి తెలిస్తే.. ఆయన్ని క్షమిస్తారా? కచ్చితంగా క్షమించరు. అసహించుకుంటారు’ అంటూ మనసులో మదన పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మోనిత దగ్గర జరిగిందంతా సౌందర్యకు చెబుతాడు. ‘ఇందులో నేను చెయ్యగలిగింది ఏం లేదు’ అని సౌందర్య అంటే.. ‘అలా అనకు మమ్మీ.. ఊబిలో కూరికుపోయాను.. చెయ్యి అందించి గట్టుకు చేర్చు మమ్మీ’ సౌందర్యను సలహా అడుగుతాడు. కార్తీక్.. చిన్నప్పుడు నీకు గాజేంద్ర మోక్షం చదివి వినిపించాను గుర్తుందా.. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలిరా.. అది చాలా శక్తివంతురాలు. దాని నోటికి చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నావు. నా దగ్గరకి వచ్చి మొరపెట్టుకుంటే కాపాడటానికి నేను విష్ణుమూర్తిని కాదు.. దాని తల ఛేదించి నిన్ను రక్షించడానికి నా దగ్గర విష్ణు చక్రమూ లేదు’ అని అంటుంది. అలా అనకు మమ్మీ ఎలాగైన నన్ను దీని నుంచి బయట పడే మార్గం చూపించమని కార్తీక్ అడగ్గా.. దీనికి ఒకేట మార్గం ఉందని, మోనిత స్వయంగా తన కడుపు నాటకమని లేదా ఆ కడుపులో బిడ్డకు నువ్వు తండ్రివి కాదని చెప్పాలని అంటుంది. అదే జరిగే పనేనా? అని మోనిత నీళ్లలో ఉన్న మొసలి అని అది నిన్ను ముంచెడయం ఖాయం, నువ్వు తప్పు చేశావు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దానికి మోక్షం ఆ పైవాడు చూపిస్తాడు అంటూ కార్తీక్కు చివాట్లు పెడుతుంది సౌందర్య. రాత్రి ఇంటిక తిరిగి వచ్చేస్తాడు. పిల్లలకు చాక్లేట్స్, బిస్కెట్స్ తీసుకుని వెళుతాడు కార్తీక్. ఇక తెల్లారి దీప లేచి చూసేసరికి కార్తీక్ బయట పడుకుని ఉంటే కాఫీ తీసుకుని వెళ్లిని డాక్టర్ బాబు అంటూ దీప కార్తీక్ని నిద్ర లేపుతుంది. ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
అంకిత సూసైడ్ ప్లాన్! దారుణంగా మోసపోతున్న అభి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 18వ ఎపిసోడ్: ఇంటిల్లిపాది తనను చేతకానివాడిలా చూడటం తట్టుకోలేకపోయాడు నందు పెద్దకొడుకు అభి. దీంతో అత్తింటి నుంచి పెట్టేబేడా సర్దుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంకిత అతడిని ఆపే ప్రయత్నం చేసింది కానీ అభి వినిపించుకోలేదు. ఈ గడప దాటి వెళ్తే మళ్లీ ఇంట్లో అడుగు పెట్టలేవు అని అంకిత తండ్రి హెచ్చరించినా అతడు వెళ్లిపోవడానికే రెడీ అయ్యాడు. నేల మీదకు రావాల్సిన పసిపాపను కడుపులో చంపేశారు, దీన్ని హత్య కాకపోతే ఇంకేం అంటారు. ఇలాంటి మనుషుల మధ్య నేనుండలేను అంటూ అక్కడివారికి గుడ్బై చెప్పి వెళ్లిపోయాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిన అభి తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. ఈ ఇంటిని వదిలి వెళ్లాకే మీ అందర ప్రేమకు దూరమయ్యానని తెలిసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అంకితను వదిలేసి వచ్చానని చెప్పగానే తులసి లాగి కొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని మండిపడింది. ఇంతలో అంకిత తల్లి ఫోన్ చేసి తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పింది. కాకపోతే సకాలంలో చూశాం కాబట్టి తను ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అభి వెంటనే వస్తున్నానని చెప్పాడు. అయితే అంకితను వెంట తీసుకుని రమ్మని తులసి అభికి సూచించింది. మీ మధ్య దూరాలు పెంచే చోట ఉండకూడదని స్పష్టం చేసింది. దీంతో ఎలాగైనా అంకితను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలన్న ధృడ సంకల్పంతో అభి ఆ ఇంటికి వెళ్లాడు. అప్పుడు బిడ్డను చంపి ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీశాడు. ఇక్కడ మనం ఉండకూడదని, తనతో వచ్చేయమని అంకితను కోరాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు కుదరదని చెప్పారు. కేవలం తన భార్య అభిప్రాయం మాత్రమే అడుగుతున్నానని అభి చెప్పడంతో అంకిత ఆలోచనలో పడింది. అభిని తిరిగి రప్పించాలనుకుని సూసైడ్ ప్లాన్ వేస్తే ఇలా అయ్యిందేటని అంకిత తల్లి పరిపరివిధాలా ఆలోచించింది. ఇంతలో అంకిత అభి వెంట వెళ్తానని, అక్కడివాళ్లకు, అతడికి మధ్య దూరాన్ని పెంచి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా తిరిగొచ్చేలా చేస్తానని చెప్పింది. దీంతో తులసి ఇంట్లో మళ్లీ కలహాలు మొదలయ్యేటట్లు కనిపిస్తోంది. చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’! -
karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్, భార్య స్థానం అడిగిన మోనిత
కార్తీకదీపం జూన్ 17: మోనిత దీప ఇంటికి వస్తుంది. దీప గొప్పది. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతల గురించి.. అలాంటిది దీప. భర్త ఎలాంటి వాడైనా పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే పాతకాలం నాటి మనిషి.. భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి పదేళ్లగా ఎదురు చూసింది.. కానీ నాకు అంత ఓపిక లేదందూ గోడ మీద 10 గీతలు గీసి అవి చూపిస్తూ.. పది రోజులు నీకు టైమ్ ఇస్తున్నాను.. పది రోజుల్లో నాకు న్యాయం జరిగే సమాధానం కావాలని లేదంటే నీ కుటుంబం గడగడ వణికిపోయేలా చేస్తానంటూ హెచ్చరిస్తుంది. ఇక మోనిత వెళ్లిపోతూ వెనక్కి తిరిగి ఎక్కువగా ఆలోచించకు దీప.. ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఏం లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో.. ఎందుకంటే రేపు నాకు పురుడు పొయ్యాల్సింది నువ్వే.. పది మందికి అన్నం పెట్టిన చెయ్యి.. నీ చేత్తో పురుడు పోస్తే చాలా మంచిది అంటూ దిప ఉడికించి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం దీప దగ్గరకు వెళ్లి భర్త రాజీపడమని చెబుతానంటూ మురళీ కృష్ణతో చెబుతుంది. దీంతో అతను వద్దని భాగ్యంకు నచ్చజెప్పిన వినకుండా వెళ్తనని మొండిగా అంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతల దగ్గరకు వెళ్లి ఏంటవి అని మాట్లాడుకుంటుంటారు. మ్యాథమెటిక్స్ హా, ఆల్జిబ్రా గీతలు అంటూ వాళ్లు మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గర నుంచి దీప, సోఫాలో కూర్చున్న కార్తీక్ వింటుంటారు. ఆ తర్వాత పిల్లలు దీపని ‘ఇవి ఎవరు గీసారని అడగ్గా దీప కార్తీక్ వైపు చూస్తుంది. దాంతో పిల్లలు కార్తీక్ని నువ్వు గీశావా? నాన్న అని అడగ్గా... అవి నా భవిష్యత్ అమ్మ అంటాడు. దాంతో దీప కార్తీక్ తానో తప్పు చేశానని, నా భవిష్యత్కి సంబంధించింది. రేపు చెబుతాను అన్ని విషయం గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ చెబుతానన్న నిజం మోనిత ప్రెగ్నెంట్ విషయం అయ్యి ఉంటుందని, మోనిత ద్వారానే కార్తీక్ తన పతివ్రత అనే నిజాన్ని నమ్ముతున్నాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. మొత్తానికి పిల్లలు కార్తీక్ చెప్పిన పెద్ద పెద్ద మాటలు అర్థం చేసుకోలేక.. ‘మన లెక్కలే బెస్ట్ అర్థమవుతాయి’ అనుకుంటూ వెళ్లిపోతారు. ఇక సౌందర్య దీప, కార్తీక్ల గురించి దిగులు పడుతూ ఉండగా.. దీపకు బహుమతిగా ఇవ్వడానికి కార్తీక్ గిఫ్ట్ పేపర్తో కవర్ చేసిన శ్రీశ్రీ పుస్తకం సౌందర్య కంటపడుతుంది. ‘దాన్ని తీసి పైన ఉన్న ‘దీపకు ప్రేమతో నీ డాక్టర్ బాబు’ అనేది చదివి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పుస్తకం చూసి.. ‘అంటే ఈ గిఫ్ట్ వాడి చేతులతో దానికి ఇద్దాం అనుకున్నాడా..? ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడు? ఎందుకు ఇవ్వలేదు?’ అని ఆలోచనలో పడుతుంది. బహుశా ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్ని నిలదీస్తే.. దీప పవిత్రత అనే విషయం కార్తీక్కి ముందే తెలిసిందని బయటపడుతుంది. అప్పుడు దీప కార్తీక్ కాస్తైనా దగ్గరవుతారని ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ మోనిత ఇంటికి వెళతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మోనిత అని అంటాడు. ఏ విషయం అని అడుగుతుంది మోనిత. ‘అదే.. ఇంటికి వచ్చి పదిరోజులు గడువు ఇచ్చావు కదా అంటుండగా అందులో తప్పేముంది కార్తీక్ అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మన మధ్య జరిగింది అది ప్రేమతోనో, ఇష్టంతోనో కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా అని ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావని మోనిత అంటుంది. అలాగే దీప మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నాకు అన్యాయం చెయ్యాలని చూడకు కార్తీక్ అంటూ మోనిత రిక్వెస్ట్గా అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదు అని కార్తీక్ అంటుండగా ‘నేను చెప్పిన మాటల్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు.. అందరి ముందు నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లే నాకు భార్య స్థానం ఇవ్వు’ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ మోనితా ప్లీజ్ అంటాడు ధీనంగా. తానేం తప్పు మాట్లాడలేదని ఎదురు తిరుగుతుంది మోనిత. అది కాదు మోనితా.. గత పదేళ్లుగా నా భార్యని నేను అనుమానించాను.. ఇప్పడు అది తప్పు అని తెలిసింది.. ఇప్పుడు ఈ టైమ్లో అని అంటూ కార్తీక్ ఆగిపోతాడు. దీంతో ‘దానికీ నాకు సంబంధం ఏంటీ కార్తీక్.. నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్ నా వల్ల కాదు అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నేను అన్యాయం అయిపోతాను.. ఏం కార్తీక్.. ఇప్పుడు దీప మీద ప్రేమ కలిగింది సరే.. మరి దీపకంటే ముందు నుంచే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే.. మరి నా మీద నీకెందుకు ప్రేమ కలగడం లేదు?’ అని కార్తీక్తో అంటుంది. -
Intinti Gruhalakshmi: ఇంటికొచ్చిన కొడుకు చెంప పగలగొట్టిన తులసి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 17వ ఎపిసోడ్: ఇంట్లోకి మనుమడో, మనుమరాలో వస్తారని సంతోషపడ్డ నందు, తులసి.. అంకిత అబార్షన్ చేయించుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభికి తెలీకుండా అలా ఎలా అబార్షన్ చేసుకుంటుంది? పాపం, నా కొడుకు ఎంత కుమిలిపోతున్నాడో? అని నందు తల్లడిల్లిపోయాడు. నందు కుటుంబం గురించి ఆలోచించడం చూసి లాస్య లోలోపలే ఉడుక్కుంది. మరోవైపు అభి, అంకిత బంధానికి బీటలు వారనున్నట్లు కనిపిస్తోంది. మనిద్దరి రక్తం కలిసి ప్రాణం పోసుకున్న బిడ్డను చంపేశావు, ఇంకా ఏం చేద్దామని నా దగ్గరికి వస్తున్నావ్ అని అభి తన భార్యను చీదరించుకున్నాడు అభి. నా ఆశలను ఆవిరి చేశావంటూ ఆగ్రహించాడు. నువ్వు చంపింది నీ కడుపులో ఉన్న బిడ్డను కాదు, మన ప్రేమను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పిచ్చి పని ఎందుకు చేశావని నిలదీశాడు. దీంతో అంకిత నీవల్లే అబార్షన్ చేయించుకున్నానని చెప్తూ బాంబు పేల్చింది. ఇప్పటివరకు మనం సెటిల్ కాలేదని, నువ్వు బిడ్డను పోషించలేవనే గర్భాన్ని తీయించేసుకున్నానని అభికి సూటిగా చెప్పింది. ఇప్పటికే నువ్వు చేతకానివాడిలా మిగిలిపోయావని నిందించింది. పైసా సంపాదించడం చేతకాదని సూటిపోటి మాటలతో అతడి మనసును ఛిద్రం చేసింది. దీంతో తను జీవితంలో ఫెయిల్ అయ్యానని రోదించాడు అభి. అటువైపేమో అభి పరిస్థితిని తలుచుకుని తులసి తల్లడిల్లిపోయింది. అతడి ఆశలు అడియాసలయ్యానని దిగులు చెందింది. ఆ ఇంట్లో అందరూ ఉన్నా అభి అనాధలా బతుకుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమించిన అమ్మాయే వాడిని మోసం చేసిందని దుఃఖించింది. నిత్యం కుమిలిపోతూ ఉండే జీవితం వాడికొద్దని సంతోషకరమైన జీవితాన్ని అందించాలని తులసి ఆశపడుతోంది. రేపటి ఎపిసోడ్లో అభి అత్తింటిని వదిలి తిరిగి తల్లి దగ్గరకు వచ్చేశాడు. ఆ ఇంటినే కాదు అంకితను కూడా వదిలేశానని చెప్పడంతో తులసి చెంప పగలగొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని కోప్పడింది. మరి అభిని తులసి ఇంట్లోకి రానిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: Sai Pallavi : బాలీవుడ్ ఆఫర్ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం ఇదేనట -
చాచి కొట్టిన అభి, జీవితంలో క్షమించనంటూ చీదరింపు!
త్వరలోనే ఓ పసిబిడ్డకు తండ్రవుతానన్న సంతోషం అభికి ఎక్కువకాలం నిలవలేదు. అటు కొడుకును మనసారా ఆశీర్వదించడానికి వెళ్లిన తులసి, నందుల ఆనందం కూడా క్షణాల్లో ఆవిరైపోయింది. అంకిత అబార్షన్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో అభి గుండె బద్ధలైంది. అతడిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరి నేటి(జూన్ 16) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. నందుతో కలిసి అభి దగ్గరకు వెళ్లడానికి తులసి అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో అభి ఇంటికి చేరుకున్నారు. కానీ కొడుకు సంతోషం కోసం ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. అంకిత త్వరలో ఓ పసిపాపను చేతిలో పెడుతుందని తెగ సంతోషడిపోయారు. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తులసి చెప్తుండగా ఉన్నట్లుండి అంకిత ఏడుపందుకుంది. తనను క్షమించమని వేడుకుంది. ఇంతలో ఏమైందని అందరూ గాబరా పడగా అంకిత అబార్షన్ చేయించుకున్న విషయాన్ని ఆమె తల్లి బయట పెట్టింది. దీంతో ఆడుకోవడానికి మాకు మనవడిని ఇస్తున్నాడని సంతోషంతో వెళ్లిన నందు దంపతులకు నిరాశే ఎదురైంది. పిల్లలంటే పడి చచ్చే అభి తన భార్య అబార్షన్ చేయించుకోవడాన్ని సహించలేకపోయాడు. అంకితను లాగి చెంప మీద కొట్టాడు. మా ముందే కూతురి మీద చేయి చేసుకుంటావా? అంటూ అంకిత తల్లిదండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. దీంతో చిర్రెత్తిపోయిన అభి అబార్షన్ తప్పని మీ కూతురిని ఎందుకు ఆపలేదని ఎదురు ప్రశ్నించాడు. మా ప్రేమకు ప్రతీకలా పెరుగుతున్న పసిగుడ్డును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంకితను జీవితంలో క్షమించను అని తేల్చి చెప్పాడు. అభికి తెలియకుండా అబార్షన్ చేయించడం తప్పన్న నందు మీద కూడా అంకిత తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. మీ క్యారెక్టర్ ఏంటో చూసుకోండి, మీరు నోరు విప్పితే నలుగురూ నవ్విపోతారు.. అంటూ చీవాట్లు పెట్టారు. దీంతో అవమానభారంతో తలదించుకున్న నందు, తులసి కన్నీళ్లతో అక్కడి నుంచి చెరో దారిన వెళ్లిపోయారు. అయితే అభి పరిస్థితిని తల్చుకుని బాధపడ్డ తులసి కొడుకుకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భావించింది. మరి అందుకు తల్లిగా తనేం చేయనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. చదవండి: Tamanna Bhatia: బుల్లితెరపై సందడి చేయనున్న తమన్నా! -
Devatha : ఆదిత్య మాటలకు షాక్ అయిన సత్య
రుక్మిణికి నిజం తెలిసిందని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. ఇలా ఎందుకు చేశావంటూ ఆదిత్యపై కోప్పడుతుంది. సీన్ కట్ చేస్తే సత్య ఆదిత్యను ఏదో తిడుతున్నట్లు కనిపించిందని కనకం పసిగడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడా అంటూ ఆదిత్యను రెచ్చగొడుతుంది. మరోవైపు సత్యను చూసిన రుక్మిణి ఆమె చెంప పగలకొడుతుంది. ఇలాంటి త్యాగం చేసి ఎవరిని ఉద్దరించాలనుకున్నావ్ అంటూ సత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పట్నుంచి నేను చేసే పనికి ఎందుకు, ఏమిటీ అడగకుండా ఉండాలని తను చెప్పిందే వినాలని సత్యచేత ప్రమాణం చేయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 15న 260వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్15వ ఎపిసోడ్ : రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందంటూ సత్య ఆదిత్యను నిలదీస్తుంది. రుక్మిణి ఒంటిరిగా ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మన మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేశానని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. నిజం ఎందుకు చెప్పావంటూ కోప్పడుతుంది. ఇన్ని రోజులుఘేది జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని బాధపడుతుంది. రుక్మిణిని వెతికేందుకు వెళ్తుంది. ఇక ఆదిత్య పడుతున్న టెన్షన్ చూసి ఏం జరిగిందని కనకం ప్రశ్నిస్తుంది. ఆదిత్యను రెచ్చగొడుతూ మాట్లాడటంతో అతడు కనకంపై సీరియస్ అవుతాడు. సీన్ కట్ చేస్తే..రుక్మిణి సత్యకు కనిపించిన వెంటనే సత్య చెంప పగలకొడుతుంది. త్యాగం ఎప్పుడైనా ఒకరికి మంచికి ఉపయోగపడాలే తప్పా నాశనానికి కాదు అని హితవు పలుకుతుంది. దగ్గరుండి తన పెళ్లి చేసి ఇంత తప్పు ఇలా చేశావని నిలదీస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి తనకు అన్నీ ఇచ్చిన నీకు నువ్వు కోరుకున్నది ఇవ్వాలనుకున్నాను..అందుకే ఇలా చేశాను అక్కా అని సత్య బదులిస్తుంది. ఇక ఇప్పట్నుంచి తాను చెప్పింది వినాలని, దేవుడమ్మ ఇంట్లోనే ఉండాలని సత్యతో ప్రమాణం తీసుకుంటుంది. సీన్ కట్చేస్తే తను చేసిన తప్పుకు క్షమించమని ఆదిత్య రుక్మిణిని కోరుతాడు. ఈ నిజం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తన తల్లి ముందు తనను దోషిగా నిలబెట్టవద్దని ప్రాథేయపడతాడు. -
karthika Deepam: నాన్న ఏదో తప్పు చేసిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు..
కార్తీకదీపం జూన్ 15: దీప దీర్ఘంగా ఆలోచిస్తూ బయట కూర్చుంటే హిమ వచ్చి ఏమైందని, నువ్వు డాడీ ఎందుకలా ఉంటున్నారని ప్రశ్నిస్తుంది. ఈ లోపు అక్కడికి శౌర్య కూడా వస్తుంది. వచ్చిరాగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి దీపతో ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావని అడగడంతో పనుందంటూ లోపలికి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత పిల్లలిద్దరూ ‘అమ్మకు ఏమైంది? నాన్న కూడా ఈ మధ్య ఎలానో ఉంటున్నారు. ఎప్పుడు అమ్మ గురించి అడిగిన చికాకు పడే నాన్న.. నిన్న మనం అడగ్గానే తలదించుకుని ఉన్నాడు. నాతో రండి అంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏదో తప్పు చేసిన వాడిలా సైలెంట్గా ఉంటున్నాడు’ అని అనుకుంటారు. దీంతో రౌడీ అదేంటో నేను తెలుసుకుంటా అని హిమతో అంటుంది. అయితే లోపలి నుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకునేదంతా దీప వింటుంది. మరోవైపు సౌందర్య దీప ఇంట్లో నిన్న ఏం జరిగి ఉంటుందా? అని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తాడు. శ్రావ్య కార్తీక్తో టిఫిన్ తీసుకురమ్మంటారా బావగారు అని అడగ్గానే.. ‘వద్దమ్మా నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంట్లో చేస్తాను’ అని కార్తీక్ అంటాడు. వెంటనే సౌందర్యతో ‘మీ అక్కా పిల్లలతో కలిసి మా ఇంట్లో భోజనం చేస్తాను.. ఆహా వినడానికి ఎంత సంస్కారవంతంగా ఉందిరా.. ఈ మాట చెప్పడానికి నీకు పదేళ్లు పట్టింది’ అని అంటుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటూ అవును మమ్మీ పెద్ద తప్పు చేశాను.. అదే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని అనగానే వెంటనే సౌందర్య మరి ఆ తప్పుని(మోనిత ప్రెగ్నెన్సీ విషయం) అంటూ ప్రశ్నిస్తుంది. అలాగే సౌందర్య మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది కార్తీక్.. నిన్ను చూస్తే కాదు.. దీప, పిల్లలు గుర్తోస్తే అంటుంది. అంతేగాక పిల్లలు, దీపా పదేళ్లుగా పడిన కష్టాలను ఆమె కార్తీక్కు గుర్తు చేస్తుంది. ‘శౌర్య సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి ఎంతలా ఆలోచిందిరా, ఇంత ఐశ్యర్యం ఉన్నా బస్తిల్లో లేనివాళ్లలా ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నువ్వు మారిపోయి అంతా బాగుంటుందని సంతోషించే సమయానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. రేపు మోనితను కడుపుతో చూసి పిల్లలు ఆమె భర్త ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతవురా’ అని నిలదీస్తుంది సౌందర్య. దీంతో పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య కోపంతో ‘పళ్లు రాలగోడతాను’ అని కార్తీక్పై అరుస్తుంది. మోనిత అంటే ఆడబొమ్మ కాదురా.. ఆడపల్లి ఆమె ఎలాంటిదైన కానీ ఒక మాగాడి వల్ల తల్లి అవ్వడం అంటే చిన్న విషయం కాదురా. మోనిత పొగరుదే కావచ్చు, పరాయి అడదాని భర్తను కోరుకున్నదే కావచ్చు. పదహారేళ్లుగా చూస్తున్నా మోనితా నిన్ను తప్పా మరే మగాడిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వే ప్రాణంగా బతికింది. అందుకే అది ప్రమాదకారి అని ఎన్నోసార్లు హెచ్చరించిన వినలేదు. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. అందరిని పడేశావు. నువ్వు ఇప్పుడు నా భార్య, పిల్లలు అంటే ఆమె ఊరుకుంటుందా? నా పరిస్థితి ఏంటని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది’ అంటుంది సౌందర్య మధ్యలో మోనిత ఫోన్ చేయడంతో కార్తీక్ కట్ చేస్తాడు. అయినా పదే పదే ఫోన్ చేస్తుండటంతో కార్తీక్ ఫోన్ స్విచ్చావ్ చేస్తాడు. దీంతో మోనిత ‘నా ఫోన్ కట్ చేస్తాడా? ఇంతకు ముందు చేస్తున్నాడంటే ఒకే కానీ ఇప్పుడు నా గురించి తెలిసి కూడా కాల్ కట్ చేస్తున్నాడేంటి?’ అంటే కార్తీక్ నన్ను కట్ చేస్తున్నాడా? అలా జరగకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తన చీర ఐరన్ చేయమని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప పిల్లను తీసుకుని గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కార్తీక్ జనతా హాస్పిటల్ అనే బోర్డు పెట్టి ఉచిత వైద్యం అందించబడును అనే బోర్డు పెడతాడు. అది చూసి పిల్లలు దీప షాక్ అవుతారు. లోపలి నుంచి కార్తీక్ బయటకు వస్తాడు. పిల్లలు ఇక ఇక్కడే ఉంటావా నాన్నా అని అడగ్గానే ‘అవునమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను.. ఇక్కడే వైద్యం చేస్తాను’ అంటూ దీపను చూస్తూ సమాధానం ఇస్తాడు. ఇక పేదవారికి ఉచిత వైద్యం చేస్తానంటూ దీపతో లక్ష్మణ్కు ట్రీట్మ్మెంట్ చేస్తానని చెప్పి రమ్మని చెప్పుమంటాడు. దీంతో హిమ అమ్మా నువ్వు ఇప్పుడు హ్యాపీనేగా అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో శౌర్య నాన్న చాలా మంచివాడని తనకు చిన్పప్పుడే తెలుసని, భలబద్రాపురంలో ఉన్నప్పుడు నాన్నని క్యాంప్లో చూశాని అప్పటి విషయం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్నా అని శౌర్య అనగానే దీప రెండు కనుబొమ్మలు పైకి లేపి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీక్కు మోనిత వార్నింగ్, 10 రోజులు డెడ్లైన్.. లేదంటే నీ ఫ్యామిలీ..
కార్తీకదీపం జూన్ 14: కార్తీక్ దీపతో మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీప మాత్రం కార్తీక్ వంక కోపంగా చూస్తుంటే అలా చూడకు దీప.. ఆ చూపులు తట్టుకోలేను అంటాడు. అదంతా చాటుగా హిమ, శౌర్యలు వింటారు. కానీ దీప మాత్రం కరగదు. సీరియస్గా ఒకటి అడుగుతా చేస్తారా? అని అంటుంది. అదేంటో.. దీప కార్తీక్ మాటలకు కరిగిపోతుందా? లేదా! అనేది నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ‘నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు.’ అంటాడు దీప కళ్లల్లోకి చూస్తూ. ‘నువ్వు, పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏదీ ముఖ్యం కాదు దీపా.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు దీప.. ’ అనే కార్తీక్ మాటలు విని పిల్లలు సంతోషిస్తుంటే.. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ‘నా మాటల నమ్మనట్టుగా అలా చూడకు దీపా.. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపా.. నేను భరించలేకపోతున్నాను.. ఏదో ఒకటి మాట్లాడు.. ప్లీజ్’ అంటాడు కార్తీక్. కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు నమ్ము దీప అని ప్రాధేయపడ్డ కూడా దీప కరగదు. దీంతో కార్తీక్ ‘నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీపా.. మనసులోని ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో’ అంటాడు. దీంతో దీప ఒక మాట అడుగుతాను చేసిపెడతారా? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ సంబరపడిపోతూ నువ్వు నోరు తెరిచి అడిగావ్ అది చాలు నాకు.. నువ్వు ఏం అడిగిన సరే అది చేసి పెడతాను.. చెప్పు ఏం చెయ్యమంటావు ఈ దేశాన్నే వదిలి విదేశాలకు వెళ్లిపోదామా? అని అంటాడు. ‘నీకు ఏ దేశమంటే ఇష్టమో చెప్పు పిల్లలని తీసుకుని అక్కడే సెటిలైయిపోదాం.. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం. మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతుకుదాం’ అంటాడు. దానికి దీప అప్పుడు మోనితకి అన్యాయం చేసినట్లు అవుతుందిగా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు.. మాట్లాడను కూడా అంటూ సరోజక్క మరిది లక్ష్మణ్ విషయం అడుగుతుంది. మీ చెయ్యి మీ మనసు మంచిదని నమ్ముతున్నాడు అంటుంది. ఆ నమ్మకాన్ని పోనివ్వకూడదని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నమ్మకాన్ని నిలబెడతారా? మిమ్మల్ని దేవుడు అన్నాడు. వైద్యం చేస్తారా? అతడిని మీ దగ్గరకు పంపించమంటారా? అంటుంది దీప. దీంతో కార్తీక నిరాశగా లేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సౌందర్య, ఆదిత్య, శ్రావ్యలు కార్తీక్ పిల్లల్ని తీసుకుని తీసుకొస్తాడని నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు. ఆదిత్య కార్తీక్ చేసిన తప్పు గురించి ఎత్తడంతో సౌందర్య కార్తీక్ వైపే మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య నేను తప్పుగా అన్నానా మమ్మీ, అన్నయ్య తప్పు చేయలేదంటావా? అని ప్రశ్నించగా సౌందర్య ‘నేను తప్పు కాదు అనడం లేదురా వాడు తిరగబడి నా ఇష్టం అనట్లేదుగా. చేసిన తప్పుకు పశ్చాతాప పుడుతున్నాడు, సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. అందుకే వాడంటే జాలి కలుగుతోంది’ అంటుంది బాధగా. కార్తీక్ నిద్రపోతున్న హిమ, శౌర్యను లేపి ఎక్కడ ఉంటారని అడగ్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని సమాధానం ఇస్తారు. దీంతో నేను వెళ్లి మీ బట్టలు తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇక తెల్లారి హిమకు ఏదో వాసన రావడంతో మెలుక వస్తుంది. కిచెన్లోకి వెళ్లి చూడగా పాలన్నీ పొంగి కింద వరకూ ఒలిగిపోతాయి. అది చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది హిమ. దీప బాధగా బయట కూర్చుని ఉండటం చూసి దగ్గరికి వెళ్లి ‘అమ్మా నీకు ఏమైంది. నాన్న మీద ఎందుకు కోపం’ అని అడుగుతుంది. తరువాయి భాగంలో.. మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్కు వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా పదోరోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రేడి అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. -
Devatha : సత్య-ఆదిత్యలను ఒక్కటి చేయాలనుకున్న రుక్మిణి
ఆదిత్య నిజం ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అని రుక్మిణితో అంటాడు. సత్యను ప్రేమించింది తానే అని, అయితే ఇలా మోసం చేయాలనుకోలేదు అని పేర్కొంటాడు. ఆదిత్య మాటలకు షాక్ అయిన రుక్మిణి తనను ఒంటరిగా వదిలేయమని కోరుతుంది. మరోవైపు తన వల్లే సత్య- ఆదిత్యలు విడిపోయారని బాధపడుతుంది. ఇద్దరి కన్నీళ్లకు కారణం తానే అని ఎంతో మదనపడుతుంది. సత్య-ఆదిత్యల మధ్యలో తాను ప్రేవేశించి వారి సంతోషాన్ని పోగొట్టానని కుంగిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 14న 259వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అన్న నిజాన్ని ఆదిత్య ఒప్పుకుంటాడు. పెళ్లికి ముందు తాను ప్రేమించింది సత్యనే అని, అయితే నీకు అన్యాయం మాత్రం చేయాలనుకోలేదు అని రుక్మిణితో అంటాడు. సత్య కావాలనే ప్రేమను త్యాగం చేసిందని చెప్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తన వల్లే ఇద్దరూ దూరం అయ్యారని బాధపడుతుంది. సత్య- ఆదిత్యల మధ్యలో తాను వచ్చి వారి జీవితాన్ని నాశనం చేశానని రుక్మిణి బాధపడుతుంది. ఇద్దరినీ ఒక్కటి చేయాలని అనుకుంటుంది. ఇక కొద్ది సేపు తనను ఒంటరిగా వదిలి పెట్టమని ఆదిత్యను కోరుతుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్లను అని ఆదిత్య అంటున్నా రుక్మిణి వెళ్లాల్సిందిగా కోరుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆదిత్య రుక్మిణిని వదిలి ఇంటికి వస్తాడు. హాస్పిటల్కు అని వెళ్లి ఆదిత్య ఒక్కడే ఒంటిరిగా రావడంతో కనకం, రాజ్యంలలో అనుమానాలు మొదలవుతాయి. రుక్మిణి ఎక్కడ అని ప్రశ్నించినా ఆదిత్య సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్తాడు. జరిగిన తప్పును ఊహించుకొని తనలో తానే కుమిలిపోతాడు. ఇది చూసిన కనకం తెగ సంబరపడిపోతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని తహతహలాడుతుంది. మరోవైపు రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో సత్య కంగారుపడుతుంది. నిజం తెలుసుకున్న రుక్మిణి సత్య-ఆదత్యలను ఒక్కటి చేస్తుంది? ఇప్పుడు రుక్మిణి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Intinti Gruhalakshmi: కొడుకు కోసం కలవనున్న తులసి, నందు!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 14వ ఎపిసోడ్: తన భార్య అంకిత గర్భవతన్న విషయం తెలిసి అభి ఎగిరి గంతేశాడు. కంటికి రెప్పలా చూసుకుంటానంటూ అంకితను ఎత్తుకుని తిరిగాడు. తండ్రవుతున్నాడన్న సంతోషంలో మునిగి తేలుతున్న అభి ఈ వార్తను అమ్మకు చెప్పాలంటూ వెంటనే తులసికి ఫోన్ చేశాడు. అంకిత గర్భవతి అని, నువ్వూ, నాన్న జంటగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండని కోరాడు. దీంతో నందుతో కలిసి రావాలా? వద్దా? అని తులసి ఆలోచనలో పడింది. ఈ కుటుంబమే వద్దనుకుని వెళ్లిన అతడిని ఎలా ఒప్పించాలో అర్థం కాక తల పట్టుకుంది. అయినా కొడుకు సంతోషం కోసం నందు దగ్గర కాళ్లబేరానికి పోవాలా? అని తనను తానే మథనపడింది. ఇది చూసిన తులసి మామయ్య వెంటనే తన కొడుక్కి ఫోన్ చేశాడు. అభి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని నందుకు చెప్పాడు. నువ్వు, తులసి కలిసి అక్కడికి రావాలని అభి ఆశపడుతున్నాడని పేర్కొన్నాడు. తనకు మనుమడు రాబోతున్నాడని సంతోషించిన నందు తులసితో కలిసి కొడుకు ఇంటికి వెళ్లాలా? అని ఓ క్షణం తటపటాయించాడు. కానీ కొడుకు కోసం భార్యతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి దీనికి లాస్య ఒప్పుకుంటుందా? లేదా? అనేది పక్కన పడితే మొదలు తులసే అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కలిసి వెళ్లడం నాకిష్టమేనా? అని ఎందుకు అడగలేదని తన మామయ్యను నిలదీసింది. ఇదిలా వుంటే అంకిత తనకు అబార్షన్ జరిగిన విషయాన్ని అభికి చెప్పలేక, మనసులో దాచుకోలేక నరకం అనుభవిస్తోంది. కడుపులో బిడ్డను తానే చంపేసుకున్నానని కుమిలిపోయింది. ఈ విషయం తెలియని అభి.. అంకిత కడుపులో బిడ్డ పెరుగుతోందనుకుని తన గదినంతా చిన్నపిల్లల పోస్టర్లతో నింపేశాడు. పుట్టే బిడ్డ కోసం ఇప్పటి నుంచే తన కళ్లు ఎదురు చూస్తున్నాయని ఆనంద భాష్పాలు రాల్చాడు. కడుపులో మోసే అమ్మ కన్నా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసే నాన్నకే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చాడు. పుట్టే బిడ్డ కోసం తాపత్రయపడుతున్న అభి సంతోషాన్ని తనే నాశనం చేశానని అంకిత కుమిలిపోయింది. మరి రేపటి ఎపిసోడ్లో అభి కోరిక మేరకు నందు, లాస్య జంటగా అతడి ఇంటికి వెళ్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: కూతురు ఫోటో షేర్ చేసి మురిసిపోతున్న హీరోయిన్ అసిన్ -
Devatha : సత్య బిడ్డకు తండ్రిని తానే అని ఒప్పుకున్న ఆదిత్య
కనకం అన్న మాటలు తలుచుకొని సత్య కుంగిపోతుంది. మరోవైపు తనకు ఆరోగ్యం బాలేదని చెప్పి రుక్మిణి ఆదిత్యను బయటకు తీసుకెళ్తుంది. మార్గమధ్యలో మనం వెళ్లేది హాస్పిటల్కు కాదని, కారును మామిడితోట వద్ద ఆపమని చెప్తుంది. అక్కడే సత్య-ఆదిత్యల గురించి నిజాన్ని తెలుసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అంటూ ఆదిత్య ఒప్పుకుంటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 12న 258వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం అన్న మాటలకు సత్య బాధపడుతుంది. తనకు వేరే వాళ్లతో పెళ్లి ఎలా చేస్తారంటూ రాజ్యాన్ని నిలదీస్తుంది. అయితే ఇది అందరి నిర్ణయం కాదని, కనకం మాటలను పట్టించుకోవద్దని రాజ్యం బదలిస్తుంది. ఇక సత్యను అంటే ఆదిత్యకు అంత కోపం ఎందుకు వస్తుందంటూ కనకం రుక్మిణిని అడుగుగుతుంది. ఏదో తన బిడ్డే అన్నట్లు ఆదిత్య మాట్లాడటం చూస్తుంటే తనకేదో అనుమానం కలుగుతుందని రుక్మిణిని చెబుతుంది. ముందే జాగ్రత్తగా ఉండమని, లేదంటే నీ జీవితం కూడా నాశనం అవుతుందని రుక్మిణి మనసులో మరింత అనుమానం రేపుతుంది. సీన్ కట్ చేస్తే తన ఆరోగ్యం బాలేదని, తనను హాస్పిటల్కు తీసుకెళ్లాలని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. ఇద్దరూ కలిసి వెళ్తుండగా రుక్మిణి కారును తన తోట వైపు తీసుకెళ్లమని చెప్తుంది. అయితే హాస్పిటల్కి కదా వెళ్లాల్సింది అని ఆదిత్య ప్రశ్నించగా..తను బాగానే ఉన్నానని, ఒక విషయం మాట్లాడటానికే తోటకు తీసుకొచ్చానని రుక్మిణి బదులివ్వడంతో ఆదిత్య షాకవుతాడు. రుక్మిణి ఏం మాట్లాడుతుందో అని టెన్షన్ పడతాడు. దీంతో దేవుడమ్మ మీద ప్రమాణం చేసి తను అడిగే ఒక ప్రశ్నకు నిజం చెప్పాలంటూ రుక్మిణి మాట తీసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటి అని రుక్మిణి ప్రశ్నిస్తుంది. దీంతో ఆదిత్య నిజాన్ని ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని నిజం చెప్పేయడంతో రుక్మిణి షాకవతుంది. తర్వాత రుక్మిణి ఏం చేస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి వంటి వివరాలను తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
హిమ తర్వాత అంతగా నేను ప్రేమించింది నిన్నే దీప: కార్తీక్
కార్తీకదీపం జూన్ 12: అమ్మని మళ్లీ తిట్టి పంపేశావా డాడీ, అమ్మ అంటే నీకు జాలి లేదా?’ అంటూ ఎమోషనల్గా ప్రశ్నిస్తుంటారు పిల్లలు. దీంతో నాతో రండీ అని పిల్లల్ని తీసుకుని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక మోనిత తన ఫోన్లో పిల్లల ఫొటోలు చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి పాలు తీసుకుని రావస్తుంది. అవి తాగుతూ.. ‘కడుపుతో ఉన్నాను కదా కాస్త కారం, ఉప్పు, మసాలాలు తగ్గించు’ అంటుంది. సరేనమ్మ అన్న ప్రియమణి అనుమానంగా ‘మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా? లేక నాటకం ఆడుతున్నారా’ అనడంతో మోనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావే. ఈ విషయంలో నేనేందుకు అబద్దం ఆడతాను, నేను కడుపుతో ఉన్నాననేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం’ అటూ ఆవేశ పడుతుంది మోనిత. మరోవైపు దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ, శౌర్య అమ్మా.. అంటూ వచ్చి ఆనందంగా పట్టుకుంటారు. వెంటనే గుమ్మం దగ్గరే ఆగిపోయిన కార్తీక్ని చూసి ‘పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు.. నా దగ్గర వదిలపెట్టడానికి తీసుకొచ్చి ఉంటారు’ అని మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మళ్లీ ఎందుకచ్చావమ్మా నాన్న నిన్ను ఏమైనా అన్నాడా? అని పిల్లలు అడగ్గా దీప నాకెందుకో అంతపెద్ద ఇంట్లో కంఫర్ట్గా ఉండటం లేదని సమాధానం ఇస్తుంది. వెంటనే హిమ బాధగా.. ‘మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్గా ఉండరు కదమ్మా’ అని అనగానే దీప కోపంగా కార్తీక్వైపు కళ్లు తిప్పి ‘ఆయనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే.. అక్కడుండొచ్చు’ అంటుంది. దీంతో కార్తీక్ వెంటనే మీ అందరితో కలిసి తను ఇక్కడే ఉంటానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్తో దీపతో కాస్తా మాట్లాడాలని చెప్పి పిల్లలను పడుకొమ్మంటాడు. అయితే కార్తీక్ భోజనం చేశావా? అని అడగ్గానే తిన్నాని అబద్ధం చెబుతుంది దిప. ఇదిలా ఉండగా మోనితకు తను పురిటినొప్పులతో చనిపోయినట్లు పిడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి పీడకల వచ్చిందేంటని కంగారు పడుతుంది. అన్నట్టు చనిపోయినట్లు కలొస్తే మంచి జరుగుతుంది అంటారు కదా.. నాకూ మంచే జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నా కార్తీక్తో సంతోషంగా ఉంటాను అనుకుంటూ పడిపడి నవ్వుకుంటుంది. వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్లి గిన్నెలో అన్నం ఉండటం చూసి దీప తినలేదని తెలుసుకుంటాడు. దీపతో మాట్లాడాలని హాల్కు తీసుకుని వస్తాడు కార్తీక్. అన్నం పెట్టుకుని కలుపుతూ దీపను తినమన్నట్లు ముద్ద పెడతాడు. కానీ ఆమె సీరియస్గా చూసేసరికి చేయి తీసుకుని దీప చేతిలో అన్నం ముద్ద పెడతాడు. ప్లీజ్ తిను దీప అని చెప్పడంతో ఆమె తింటుంది. కార్తీక్ అన్నం కలుపుతూ ‘నేను నటించడం లేదు దీపా.. నా కసలు నటించడం చేతకాదు.. మనసుకి అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే కచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత’ అని తన క్యారెక్టర్ ఏంటో దీపకు చెప్పాలనుకుంటాడు. ఇక కార్తీక్ కాలేజీ రోజుల్లో హిమను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని, ఆ తర్వాత అంతగా ప్రేమించింది నిన్నే దీప అని చెబుతాడు. ‘హిమ చనిపోయాక కొన్నాళ్లు పిచ్చొడిని ఆయ్యాను, జీవితంలో ఇక పెళ్లి అనే మాటే లేదు అనుకున్నాను నిన్ను చూసేదాక.. నీ ఆత్మ సౌందర్య నాకు నచ్చి.. హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే. నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసినా నీ మెడలో తాళి కట్టాను.. నెమ్మదిగా కన్విన్స్ చెయ్యొచ్చు అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు’ అంటూ దీప కళ్లలోకే చూస్తూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
దీప ఇంట్లో లేదని కనిపెట్టిన శౌర్య, కార్తీక్ను నిలదీసిన హిమ..
కార్తీకదీపం జూన్ 11: హిమ, శౌర్యలు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసి అంతా షాక్లో ఉండిపోతారు. అది గమనించిన పిల్లలు మీలో మేము వచ్చి ఆనందంగా కనిపించకపోగా అప్పుడే ఎందుకొచ్చారా? అన్నట్టు చూస్తున్నారని ప్రశ్నిస్తారు. కాసేపటికి అమ్మ కనిపించడం లేదని అడగ్గానే అందరు ఒకరి మొహలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(జూన్ 11వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడగ్గానే అందరు కంగుతింటారు. ఆ తర్వాత సౌందర్య ముందు ఫ్రెష్ అయ్యి రండి అనడంతో శ్రావ్య బ్యాగ్స్ తీసుకుని పిల్లల్ని పైకి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం కార్తీక్నే గమనిస్తూ వెనక్కి వచ్చి ఏం అయ్యింది డాడీ బాగా డల్గా కనిపిస్తున్నావని అడగ్గా.. ‘మీ మీద బెంగ పెట్టుకున్నాడే.. ప్రశ్నలు ఆపి వెళ్లు’ అని సౌందర్య పంపిస్తుంది. దీంతో కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. మురళీ కృష్ణ దీప ఇంటి నుంచి తిరిగి వచ్చి అన్ని మర్చిపోయి కార్తీక్తో ఉండమని, కాపురం చక్కదిద్దుకొమ్మని చెబుతామనుకుంటే అసలు ఆ విషయమే నాతో చెప్పనివ్వలేదంటూ సలహాలు ఏం ఇవ్వద్దు నాన్నా తినేసి వెళ్లు అందని భాగ్యంతో చెబుతూ బాధపడతాడు. దాంతో భాగ్యం ఆ మోనిత అనుకున్నది మాత్రం సాధించింది అంటూ తిట్టిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత ఇంట్లో వాంతులు (వేగుళ్లు) చేసుకుంటుంది. ప్రియమణి చెవులు మూసి సాయం చేస్తుంది. ఆ తర్వాత మీది ఎవరి పోలిక అమ్మాని మోనితని అడుగుతుంది. మోనిత.. నవ్వుతూ ‘ఈ ప్రపంచంలో నాకు ఎవరితో పోలికే లేదే. నేనో స్పెషల్ అంతే.. కాకపోతే ఇంకా ఆరో నెలల్లో నా పోలికలతోనే మరో ప్రాణి ఈ భూమ్మిద పడదుతుంది’ అంటు మురిసిపోతుంది. దీప సరోజక్క మరిది లక్ష్మణ్ గురించి అతడి రిక్వస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో సరోజక్క వచ్చి ఆమె మరిది లక్ష్మణ్ వచ్చిన విషయం గరించి అడుగుతుంది. ‘అది నువ్వేమీ పట్టించుకోకు దీప, డక్టర్ బాబు, నువ్వు బాగుంటే ఇక్కడకి నువ్వేందుకు వస్తావు. అది కూడా ఆలోచన లేని అమాయకుడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నువ్వు డాక్టర్ బాబుతో ఏం చెబుతావు? పక్క మనిషి గురించి పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. అన్నింటికీ సిద్ధపడే ఉండాలి. అందరితో పాటే ఇతడు కూడా భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. బతుకుతాడు. లేదంటే లేదు. పాపం మా చెల్లెల్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. సరేలే నువ్వేం ఆలోచించకు. వస్తాను దీపా’ అంటూ వెళ్లిపోతుంది. ఇక సరోజక్క వెళ్లగానే దీప లక్ష్మణ్కి వైద్యం చేయించమని డాక్టర్ బాబుతో చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఈ టైమ్లో ఈ గోలంతా ఏంటీ అంటారా? అంటూ ఆలస్యం చేయకుండా లక్ష్మణ్ విషయం ఎలగైనా ఆయనకు చెప్పాలని మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా శౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప గదికి వెళ్లి ఆమె బ్యాగు, కబోర్డ్లో బట్టలు చూస్తుంది. అవి ఉండకపోయేసరికి అమ్మ ఇంట్లోంచి మళ్లీ వెళ్లిపోయింది అని తెలిసి ఏడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లిందని, నాన్న ఏమైనా అన్నాడా? నాన్న తిట్టి అమ్మను పంపిచాడా? అసలు ఎక్కడ ఉన్నావమ్మా అంటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే కార్తీక్ని నిలదీయడానికి వెళుతుంది. సరిగ్గా అప్పుడే హిమ తల్లి గురించి కార్తీక్ని, సౌందర్యని నిలదీస్తుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన శౌర్య ‘లేదు హిమా.. అమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది’ అంటుంది. ఆ తర్వాత శౌర్య, హిమలు ఏడుస్తూ అమ్మ ఎక్కడికి వెళ్లిందని, నువ్వే పంపించావా నాన్న? అంటు రకరకాల ప్రశ్నలు వేస్తూ కార్తీక్ను నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పలేక కార్తీక్ తల దించుకుంటాడు. -
Devatha : సత్యకు సంబంధం చూసిన కనకం.. కోపగించుకున్న ఆదిత్య
కనకం తీరు మారదు. తన భర్త రంగా చేసిన పనికి ఇంట్లో అందరినీ ఆడిపోసుకుంటుంది. దేవుడమ్మ కూడా తనకు న్యాయం చేయలేదంటూ ఫైర్ అవుతుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో సత్యను టార్గెట్ చేసిన కనకం ఆమెను అనరాని మాటలు అంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది. మరోవైపు కనకం మాటలకు ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సత్య విషయంలో కలగజేసుకోవద్దని, తన పనేంటో అది మాత్రమే చూసుకోవాలని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 11న 257వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం తన భర్త రంగా బంతితో తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ రాజ్యం భర్తను నిందిస్తుంటుంది. తనకు అన్యాయం చేశారంటూ ఆడిపోసుకుంటుంది. మరోవైపు రాజ్యం తోనూ తగువు పెట్టుకుంటుంది. అందరికి అన్నీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో దేవుడమ్మ వచ్చాక తేల్చుకోవాలని రాజ్యం బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే.. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఇదే సరైన టైం అనుకుందో ఏమో కానీ కనకం సత్యను టార్గెట్ చేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో ఇంతవరకు తెలియదని, ఇక తన జీవితం నాశనం అని అంటుంది. అంతేకాకుండా తండ్రి లేకుండా పెరిగే బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది. కనకం మాటలకు సత్య చాలా బాధపడుతుంది. ఈశ్వర్ ప్రసాద్ కూడా ఇక ఈ టాపిక్ ఆయేయాలని చెప్పినా కనకం మాత్రం తీరు మార్చుకోదు. సత్యకు తన ఊళ్లో ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడని, తను 10వ తరగతి వరకు చదువుకున్నాడని, ఆ అబ్బాయిని సత్యకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని కనకం సూచిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ఉక్రోషానికి లోనవుతాడు. సత్య విషయం నీకెందుకు పిన్నీ అంటూ తీవ్ర స్థాయిలో కోపం వ్యక్తం చేస్తాడు. వేరే వాళ్ల విషయాలు అంత పట్టించుకోవడం అవసరం లేదని, తన పని తాను చేసుకోవాలంటూ హితవు పలుకుతాడు. ఇంకోసారి సత్య గురించి కలగజేసుకుంటే బాగుండదని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తనకు ఇంత కోపం ఎందుకు వస్తుందని ఆలోచనలో పడిపోతుంది. -
Intinti Gruhalakshmi: మెట్టు దిగిన నందు, అవమానించిన తులసి!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 11 ఎపిసోడ్: తులసితో సంతకం చేయిస్తానని ధీమాగా వెళ్లిన లాస్యకు మొండిచేయే ఎదురైంది. ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరగ్గొడతానన్నదాన్ని సంతకం ఎలా పెడతానని తులసి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన లాస్య.. నందు, నీ ఫ్యామిలీ మెంబర్స్ను దూరం పెట్టకూడదంటే సంతకం పెట్టాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది. ఇది విన్న తులసి, ఇదే మాట నందుతో అన్నావంటే చెప్పు తీసుకుని కొడతాడని తిట్టింది. దీంతో అవమానభారంతో వెనుదిరిగి వచ్చిన లాస్య నువ్వు వెళ్తేనే పనవుతుందంటూ నందును ఉసిగొల్పింది. చిన్న సంతకం పెట్టడానికి ఎందుకింత పోజు కొడుతుందని నందు తులసి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆమె ఇంటి మెట్లు ఎక్కాడు. ఫైల్ మీద సంతకం చేయమని అడిగాడు. అలా సంతకం చేస్తే తను భార్య అని ఒప్పుకున్నట్లే కదా అని తులసి లాజిక్లు మాట్లాడింది. దీంతో అత్త అనసూయ తులసి మీద చిర్రుబుర్రులాడబోయింది. ఆమె మాటలనుమధ్యలోనే అడ్డుకున్న తులసి.. కొడుకు జీవితం బంగారంలా, కోడలు జీవితం బురదపాలవ్వాలనుకునే నీకు మాట్లాడే అర్హత లేదని ఆమె నోరు మూయించింది. మరోవైపు అభికి అంకిత గర్భవతన్న విషయం తెలిసింది. ఈ శుభవార్తను అతడు తల్లితో పంచుకున్నాడు. నాన్నను వెంటపెట్టుకుని వచ్చేయమని కోరాడు. దీంతో తులసి తను సంతకం పెట్టాలంటే తనవెంట అభి ఇంటికి రావాలని నందుకు కండీషన్ పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి నిజంగానే తులసి ఈ కండీషన్ పెడుతుందా? లేదా అసలు సంతకమే పెట్టదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆ సీక్వెల్లో నేను, నా కొడుకు కలిసి నటిస్తాం: బాలయ్య -
Devatha : కమలను అవమానించిన కనకం..
సత్య, రుక్మిణి వాళ్లు ఇంటికి బయలుదేరుతారు. మార్గమధ్యలో వాళ్లకు రాజ్యం వాళ్లు ఎదురవుతారు. దీంతో రుక్మిణి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఏదైనా శుభవార్తా అంటూ రాజ్యం ఎంతో ఆతృతతో అడగగా లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు తన సూటిపోటి మాటలతో కనకం కమలను ఆడిపోసుకుంటుంది. సత్య, రుక్మిణులను దెబ్బిపొఘుస్తూ మాట్లాడుతుండగా కమల ఆమెకు గట్టి సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 10న 256వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య, రుక్మిణులను తీసుకొని ఆదిత్య ఇంటికి బయలుదేరుతాడు. ఏ ఆడపిల్లకైనా తను గర్భవతి అయ్యిందనే సంగతి భర్తకే మొదట చెప్పాలనుకుంటుంది కదా అని రుక్మిణి ఆదిత్యను అడుగుతుంది. కానీ అందరికీ ఆ అదృష్టం రాదని చెబుతూ బాధపడుతుంది. అయితే రుక్మిణి ఇలా ఎందుకు అంటుందో సత్య, ఆదిత్యలకు అర్థం కాదు. ఇక తనకు దాహం వేస్తుందని చెప్పడంతో ఆదిత్య కొబ్బరి బోండం వద్ద కారును ఆపతాడు. అక్కడే వాళ్లకు రాజ్యం వాళ్లు కనిపిస్తారు. రుక్మిణి వాంతులు చేసుకుంటుంది అందుకే హాస్పిటల్కి వెళ్లాం అని చెప్పగానే ఏదైనా శుభవార్తా అని అడుగుతుంది. అదేమీ లేదని రుక్మిణి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతారు. మరోవైపు కనకం తన సూటిపోటి మాటలతో కమలను ఆడిపోసుకుంటుంది. సత్య, రుక్మిణుల గురించి పదేపదే దెబ్బిపొడుస్తుంటుంది. దీంతో ముందు రంగా మామ గురించి చూసుకోమని చెప్పి కమల గట్టి సమాధానం ఇస్తుంది. ఇక రుక్మిణి వాళ్లు రాగానే డాక్టర్ ఏం చెప్పింది? గుడ్న్యూసే కదా అంటూ కనకం రుక్మిణిని అడుగుతుంది. అక్కడ కొద్ది సేపు కనకం తన మాటలతో డ్రామా చేస్తుంది. సీన్ కట్ చేస్తే రంగా గురించి అన్ని తెలిసినా అతడిని గాడిలో పెట్టలేదంటూ కనకం రాజ్యం వాళ్ల భర్తపై అరుస్తుంది. తప్పును తప్పు అని చెప్పకుండా పైపెచ్చు సమర్థించారంటూ అతడిపై మండిపడుతుంది. మరోవైపు సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
కార్తీక్ని మాటలతో చంపేసిన సౌందర్య, చివరికి ట్విస్ట్ ఏంటంటే..
కార్తీకదీపం జూన్ 10: దీపను ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన కార్తీక్కు నిరాశ ఎదురైంది. కార్తీక్ మాట్లాడుతున్న పట్టించుకోనట్లుగా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కార్తీక్ తప్పు చేశాడన్న విషయాన్ని నమ్ముతున్నట్లు చెప్పకనే చెబుతుంది. దీంతో కార్తీక్ బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు మోనిత వీడియో మెసెజ్ పంపి బుల్లి కార్తీక్ పుడతాడంటు మురిసిపోతుంది. కార్తీక్ తన తప్పుకు కుమిలిపోతు బాధతో మేడపైకి వెళ్లగా అప్పటికే సౌందర్య అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మేడపైకి వెళ్లగా అక్కడ సౌందర్యను చూసి తలదించుకుని వెనక్కి తిరుగుతాడు. కొడుకుని చూసి సౌందర్య పెద్దోడా.. ఇలా రా అని పిలిసి ‘నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు.. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రమూర్తి అని మురిసిపోయేదాన్ని. నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదురా’ అంటుంది సౌందర్య బాధగా. దీంతో కార్తీక్ తను కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ ధీనంగా మొహం పెడతాడు. సౌందర్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్యమూ ఉంటుంది రాక్షత్వమూ ఉంటుంది. కానీ బలహీనక్షణాల్లో కూడా లోపలి రాక్షసుడ్ని బయటికి రానివ్వని వాడినే సంస్కారవంతుడు అంటు కార్తీక్తో నా కొడుకు సంస్కారవంతుడు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక మామూలు మగాడివే అని నిరూపించుకున్నావు అంటుంది. అంతేగాక నీలో అనుమానం తప్ప ఇంకేలోపం లేదని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీప గర్వంగా తల ఎత్తుకుంది, నువ్వు తలదించుకుని పాతాళానికి దిగజారవు అంటు మట్లాడుతుంది సౌందర్య. అలాగే మీ నాన్నగారు ఫోన్ చేసి పిలలు ఇంటికి వెళ్లిపోదామంటు గోల చేస్తున్నారని చెప్పారు, ఇవాళ రేపో వాళ్లు వస్తే అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు దీప ఏ తప్పు చేసిందని నిందించావో, దూరం పెట్టావో అదే తప్పు నువ్వు చేశావని పిలలతో చెప్పగలవా? ఈ సారి కాలుష్యం నావైపు వీచింది అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక తప్పు వాళ్ల అమ్మ మీదకు మాత్రం నెట్టకురా.. ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగబుద్ధి చూపిస్తావేమోనని చెబుతున్నాను అంటు మాటలతో కార్తీక్ను బాధపెడుతుంది సౌందర్య. ఒకవేళ పిల్లలను తీసుకురాకని మీ నాన్నతో చెబితే ఆయన ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, మళ్లీ మీరు తాత కాబోతున్నారని నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్ వెంటనే సౌందర్య చేతులు పట్టుకుంటాడు. సౌందర్య ‘భయపడకు కార్తీక్.. చెప్పనులే.. అంతటి శుభవార్త విని ఆయనకు ఏదైనా అయితే భరించాల్సింది నేనే కదా.. నాకంత ధైర్యం లేదు కార్తీక్’ అంటూ సౌందర్య ఏడుస్తుంటే కార్తీక్ కూడా ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.కార్తీక్ తన పాపానికి ప్రాయిశ్చిత్తం లేదని, ఒక పవిత్రమూర్తిని ఏ విషయంలో క్షోభపెట్టానో వాస్తవానికి ఆ నేరం తాను చేసినందుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తోందంటు ప్రశ్చాతాప పడతాడు. ఈ నరకం అనుభవించే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే బాగుంటుందనిపిస్తోంది మమ్మీ.. నన్ను చంపెయ్ మమ్మీ అంటాడు కార్తీక్. కానీ ఒక్కటి మాత్రం నిజం మమ్మీ.. ఇది ఏదో పొరపాటువల్ల జరిగింది కానీ దీప మీద ప్రేమ లేకో.. మోనిత మీద మోజుతోనూ కాదు నన్ను నమ్ము మమ్మీ.. కోడలు తప్పు చేసిందంటేనే నమ్మని దానివి.. కొడుకు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతున్నావా అని ధీనంగా అడిగే సరికి సౌందర్య మనసు కాస్త కరుగుతుంది. ‘నువ్వు కావాలని ఈ తప్పు చెయ్యలేనది నేను నమ్ముతాన.. కానీ అది అక్కడ అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉందిరా.. బలహీన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉండొచ్చు.. కానీ తప్పు తప్పే కదా కార్తీక్.. ఏదో చిన్న తప్పు అని చెరుపేసుకోలేం కాదుకదా.. ఆ మోనిత మంచిది కాదురా కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా అలాంటి వారికి దూరంగా ఉండరా ఎంతటి నీచానికైనా దిగజారుతుందిరా అని నేను నీ భార్య చిలక్కి చెప్పినట్లు చెప్పాం. కానీ నువ్వు పెడచెవిన పెట్టావు. చివరికి ఫలితం అనుభవిస్తున్నావు’ అంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా దీప సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. గతంలో డాక్టర్ బాబు తన వైద్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు. మళ్లీ తనకు కాస్త నీరసం పెరిగిందని, కార్తీక్ దగ్గర వైద్యం ఇప్పించాలని కోరతాడు. దీంతో తనకు కొంచం టైం కావాలంటుంది దీప. సరేనంటు అతడు వెళ్లిపోతాడు. కార్తీక్, సౌందర్య భోజనం చేస్తుంటే సడెన్గా శౌర్య, హిమలు వస్తారు. వారిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో పిల్లలు మేము ఎందుకు వచ్చామా అన్నట్లు చూస్తున్నారెంటి, మేము ఇంతా ఆనందంగా ఉంటే అంటు ప్రశ్నిస్తారు. దీంతో సౌందర్య వాళ్లకు ఏదో చెప్పి నచ్చజెబుతుంది. ఆ తర్వాత అమ్మ ఏది అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: తులసి చేతిలో నందు జాతకం!
నందు పడ్డ కష్టానికి ప్రతిఫలం తులసి మీద ఆధారపడి ఉంది. అతడు పూర్తి చేసిన ప్రాజెక్టుకు డబ్బులు రావాలంటే తులసి సంతకం తప్పనిసరి అని చెప్పడంతో నందు, లాస్య టెన్షన్ పడ్డారు. ఎలాగైనా తులసితో సంతకం పెట్టిస్తానని లాస్య ఆమె ఇంటికి వెళ్లింది. మరి అక్కడేం జరిగింది? లాస్య అడిగినదానికి తులసి అంగీకరించిందా? లేదా? అనేది నేటి (జూన్ 10) ఎపిసోడ్లో చదివేయండి... కళ్లు తిరిగి పడిపోయిన అంకిత ఆరోగ్యానికి ఏమైందోనని అభి కలవరడ్డాడు. తను తీసుకోవాల్సిన ఫుడ్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు అంతా తానే దగ్గరుండి చూసుకుంటానని చెప్పాడు. అతడి ప్రేమకు పరవశించిపోవాలో, గర్భవతి అన్న విషయాన్ని దాస్తున్నందుకు బాధపడాలో తెలీని దుస్థితిలో ఉంది అంకిత. మరోవైపు ఆమె తల్లి మాత్రం వీలైనంత త్వరగా అబార్షన్ చేయించాలని నిర్ణయించుకుంది. మరోపక్క ప్రేమ్, శృతిల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్ మీద అభిప్రాయమేంటి అని పనిమనిషి రాములమ్మ అడగ్గానే శృతి గుటకలు మింగింది. తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాలా? వద్దా? అని నానారకాలుగా ఆలోచించింది. చివరకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుండె దాటి బయటకు రాలేవంటూ సమాధానం దాటవేసింది.. కానీ రాములమ్మ మాత్రం ప్రేమ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తేల్చి చెప్పింది. ఏదో ఒకరోజు అతడే ఈ విషయాన్ని నీ ముందుకు వచ్చి చెప్తాడని అనడంతో శృతి సిగ్గుతో బిడుసుకుపోయింది. తులసి ఇంటికి వచ్చిన అంజలి తన స్నేహితురాలితో కాసేపు కబుర్లాడింది. బిజినెస్ స్టార్ట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చిన మాధవి.. నందు అన్నయ్యతో బంధాన్ని తెగతెంపులు చేసుకోమని వదినకు సెలవిచ్చింది. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం దేనికని ప్రశ్నించింది. అన్నయ్య వదిలేసినా ఆయన తిరిగొస్తాడని చూడటం వ్యర్థమని అభిప్రాయపడింది. దీనికి తులసి స్పందిస్తూ కలిసి ఉండాలా? విడిపోవాలా? అనేది నిర్ణయించుకునేందుకు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చింది. మరో పక్క నందు పూర్తి చేసిన ప్రాజెక్టులో అతడి భార్య సంతకం కూడా ఉంటేనే ప్రాజెక్టు పూర్తి డబ్బులు పంపిస్తామని చెప్పాడు. తులసి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే సరిపోతుంది కదా అని లాస్య సలహా ఇచ్చింది. ఆ సంతకం ఫోర్జరీ అని తెలిస్తే జైలుపాలవుతామని నందు హెచ్చరించాడు. ఎలాగైనా తన దగ్గర సంతకం తీసుకోవాల్సిందేనని చెప్పాడు. కానీ తులసి దగ్గరకు వెళితే ఒక మెట్టు దిగినట్లు అవుతుందని మధనపడ్డాడు. దీంతో లాస్య తన చేత ఎలాగైనా సంతకం చేయించుకొస్తానని చెప్పింది. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లి సంతకం కోసం రిక్వెస్ట్ చేయకుండా ఆర్డర్ వేసింది. సంతకం పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మరి లాస్య మాటలకు తులసి వెనకడుగు వేసి సంతకం పెడుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ -
Devatha : సత్య బిడ్డకు కారణం నువ్వేనా పెనిమిటి : రుక్మిణి
సత్య-రుక్మిణిలు హాస్పిటల్కు వెళ్లడంతో శుభవార్తతోనే తిరిగి వస్తారని కనకం అంటుంది. దీంతో కమలలో పలు సందేహాలు కలుగుతాయి. ఇప్పుడు రుక్మిణి గర్భవతి అయితే సత్యను ఆదిత్య వదిలేస్తాడా? దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు సత్య భర్త మీరే కదా అని ఆదిత్తో అనడంతో రుక్మిని చాలా బాధపడుతుంది. ఇది పసిగట్టిన సత్య రుక్మిణికి నిజం తెలిసిపోయింది అని ఆదిత్యతో అంటుది. ఇలాంటి విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్8న 254వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-రుక్మిణిలను తీసుకొని ఆదిత్య హాస్పిటల్కు వెళ్తాడు. అయితే రుక్మిణి గుడ్న్యూస్తోనే తిరిగి వస్తుందని కనకం ఈశ్వర్ ప్రసాద్తో అంటుంది. దీంతో ఒకవేళ రుక్మిణి గర్భవతి అయితే ఆదిత్య సత్యను వదిలేస్తాడా? ఈ నిజం తెలిస్తే దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. నిజం తెలిస్తే సత్య-రుక్మిణి ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని భావిస్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు..సత్య భర్త మీరే కదా..ఆమెను తీసుకొని లోపలికి వెళ్లండి అని ఆదిత్యతో అనగానే ముగ్గురూ ఏం చెయ్యాలో తెలియక సైలెంట్ అయిపోతారు. ఇక రుక్మిణి కూడా సత్యనే తీసుకొని వెళ్లమని ఆదిత్యకు చెప్తుంది. అయితే రుక్మిణి పడుతున్న బాధను సత్య పసిగడుతుంది. మనద్దరి మీద అక్కకు అనుమానం వచ్చిందని, అందుకే అక్కఘిలా తనలో తానే కుమిలిపోతుందేమో అని సత్య చెప్తుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి మరో డాక్టర్ వద్దకు వెళ్లి మాట్లాడుతుంది. ఆరోజు దేవుడమ్మ ఇంటికి వచ్చి రుక్మిణిని చెకప్ చేసిన డాక్టరే అక్కడా కనపడుతుంది. దీంతో ప్రెగ్నీన్సీ విషయం చెప్పొద్దని అన్నవ్వాంటే ఏదో పెద్ద విషయమే ఉంటుందని చెప్పి డాక్టర్ రుక్మిణికి మద్దతిస్తుంది. ఇక సత్య-ఆదిత్యలు బయటకు వచ్చి చూసి రుక్మిణి కనపడకపోయేసరికి కంగారు పడతారు. రుక్మిణి ఎక్కడికి వెళ్లిందో అని భయపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుక్మిణి తానే వేరే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకున్నానని చెప్పడంతో షాకవుతారు. రుక్మిణి మాటలు సత్య అనుమానానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇక సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
బుల్లి కార్తీక్ పుడతాడంటూ.. కార్తీక్కు మోనితా వీడియో మెసెజ్
కార్తీకదీపం జూన్ 9: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి దీప ఇంట్లో లేదని తెలుసుకున్న సౌందర్య, ఆదిత్యలతో మీరు ఆపలేదా? అని అడగ్గా ఏందుకు ఉండాలి ఇక్కడ? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో అసలేం జరిగిందో కార్తీక్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సౌందర్య వినిపించుకోకుండా... ఇది నాకు కాదు నీ భార్యకు, నీ వల్ల గర్భవతి అయిన ఆ మోనితకు అంటుంది. ఇక కార్తీక్ దీపను తీసుకురావడానికి శ్రీరాంనగర్ బస్తీకి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(మంగళవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. దీప శ్రీరామ్ నగర్ బస్తీలో ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటే వారణాసి ఇళ్లంతా కడుగుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వారణాసితో మీ అక్క నాతో ఇంటికి వస్తుందని చెబుతాడు. దీంతో దీప వెంటనే వద్దులే డాక్టర్ బాబు ఎవరు ఎక్కడుండాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు.. మీరు నేను కాదు అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. దీప మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అంటు వివరిస్తుంటాడు. కానీ దీప వినదు. కుర్చీ వెయ్యనా.. భోజనం చేశారా? అంటూ పొంతన లేని సమాధానాలిస్తూ, ఆ విషయం అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది. అయినా కార్తీక్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారణాసిని అడ్డు పెట్టుకుని ‘ఇక చాలు వారణాసీ.. ఎంతసేపు కడుగుతావు.. వదిలెయ్’ అంటు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కార్తీక్ తనని అర్థం చేసుకునే అవకాశమే లేదని అర్థమైందని తలదించుకుంటాడు. ‘నన్ను క్షమించే ప్రసక్తే లేదని క్లియర్గా తెలుస్తోంది.. నీకంటే నేనే దురదృష్టవంతుడ్ని దీపా.. నీకంటే ఎక్కువగా నేనే నష్టపోయాను’ అంటు పశ్చాత్తాపపడతాడు కార్తీక్. అయినా దీప తన తీరు మార్చుకోకుండా ‘మంచి నీళ్లు కూడా తేవాలి వారణాసీ’ అంటుంది. సీన్ వారణాసికి కూడా అర్థమై బాధగా, మౌనంగా చూస్తాడు. ఇక కార్తీక్ వెళ్లొస్తాను అని ముందుకు కదలడంతో భోజనం చెయ్యరా? అని అడుగుతుంది దీప. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కార్తీక్ అనగా.. ‘ఈ ఇంట్లో అయినా..ఆ ఇంట్లో అయినా.. మరింకెక్కడైనా భోజనం మాత్రం మానకండి’ అని దీప సమాధానమిస్తుంది. కార్తీక్ తప్పు చేశాడని తాను కూడా నమ్మతున్నట్లు చెప్పకనే చెబుతుంది దీప. మురళీ కృష్ణ దీప గురించి బాధపడుతుంటే.. భాగ్యం వచ్చి దీప జీవితం నిలబడే మార్గం ఒకటుందయ్యా అంటూ.. ‘అల్లుడు తప్పు చేశాడని దీప తనతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు.. ఆ మాటకొస్తే నీ మొదటి పెళ్లాం చచ్చిపోతే నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? నేను నీతో కాపురం చెయ్యట్లేదా? ఇదీ అంతేనయ్యా.. కాకపోతే దీప ఉండగానే మోనితకి కడుపు చేశాడు.. ఇప్పుడు గొడవలకు పోయి జీవితం నాశనం చేసుకోవడం కంటే.. రాజీ పడి కలిపోవడం మేలు.. లేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అని సలహా ఇస్తుంది భాగ్యం. అది విని మురళీ కృష్ణ నిజమే అంటూ ఆలోచనలో పడతాడు. కార్తీక్ తన రూమ్లో జరిగిందంతా తలుచుకుని కుమిలిపోతూ.. ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో డ్రింక్ చేసిన సీన్ గుర్తు చేసుకుని.. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటాడు. ‘బుద్ది లేదా రా నీకు.. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక ఆడపిల్ల ఇంట్లో డ్రింక్ చెయ్యడమేంట్రా.. ముందు కొడితే.. సంస్కారం ఏం అయిపోయింది.. మమ్మీ ఎప్పుడూ అంటుంది నువ్వు స్టుపిడ్ అని.. నిజంగానే నేను స్టుపిడ్ని..’అని తిట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే మోనిత ఓ వీడియో మెసెజ్ పంపిస్తుంది. ఇంతలో మోనిత కార్తీక్కు వీడియో మెసేజ్ పంపిస్తుంది. ‘హాయ్ కార్తీక్.. ఎలా ఉన్నావ్.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా? మగా? అని డౌట్ వచ్చింది. నేను గైనకాలజిస్ట్ కాబట్టి స్కాన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అది నేరం.. అయినా డెలివరీ అయ్యేదాకా ఆగితేనే థ్రిల్ అంటుంది. ఇంతకీ నీకు ఎవరు కావాలి పాపా? బాబా? పాప వద్దులే.. ఆల్ రెడీ మనకు ఇద్దరున్నారు కదా.. మనకు బాబే కావాలి. దేవుడ్ని నేను అదే కోరుకుంటాను.. బుల్లి కార్తీక్ని ఇవ్వమని.. ఐ లవ్ దట్ ఫీలింగ్ బై' అంటుంది వీడియోలో. అది చూసి కార్తీక్ తలపట్టుకుని మరింత కుంగిపోతాడు. మోనిత మాత్రం సంబరపడిపోతూ ‘ఇదేంటి కార్తీక్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు..నన్ను దూరం పెడుతుతున్నాడా? అంటే కార్తీక్ కూడా కొంత మంది మగాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా? అని ఓ సెకన్ కంగారుపడుతుంది. కానీ అంతలోనే నా కార్తీక్ అలా చేయడు. ఏదో కంగారులో ఉండి సమాధానం ఇవ్వలేదనుకుంటా’ అంటూ సరిపెట్టుకుంటుంది మోనిత. -
కాళ్లు విరగ్గొడతానన్న తులసి కాళ్ల బేరానికి!?
ఒక్కో మెట్టు ఎదగాలన్న తులసి ఆశయానికి బీజం పడింది. నలుగురు మహిళలను పనిలో చేర్పించుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మరోవైపు జిత్తులమారి లాస్య కుట్రకు నందు అన్యాయంగా బలైపోతున్నాడు. ఎంతో పెద్ద ప్రాజెక్టును దక్కించుకున్న నందు మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితికి తానే కారణమంటూ తనలో తానే కుమిలిపోయాడు. మరి నేటి(జూన్ 9)ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. తులసి కుట్టు మిషన్లు తెచ్చి తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఆమె అత్త అనసూయ అయిష్టంగానే తులసిని ఆశీర్వదించింది. మూడు మిషన్లు మూడు వందల మిషన్లుగా మారాలని, వ్యాపారంలో వృద్ధి సాధించాలని శృతి ఆకాంక్షించింది. ఇక మొదటి రోజే తులసి పగలూరాత్రీ తేడా లేకుండా కష్టపడింది. ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అన్నీ దగ్గరుండి చూసుకుంది. మరోవైపు పూటుగా తాగి వచ్చిన నందు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేశానని లాస్యకు తెలిపాడు. కానీ తులసి వ్యాపారం మొదలు పెట్టిందని, తానేమో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తాగి తూలుతున్నానని బాధపడ్డాడు. అసలు ఈ స్థితికి వచ్చేలా నన్ను మోసం చేసింది ఎవరో తెలిసిపోయిందనగానే లాస్య గుండె ఝల్లుమంది. అంతలోనే దీనికంతటికీ కారణం తానే అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఇక అంకిత పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. స్నేహితురాలితో సరాదాగా ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి డాక్టర్కు కబురుపెట్టింది. ఇంటికి వచ్చి అంకితను పరీక్షించిన వైద్యురాలు అంకిత ఎక్కువగా టెన్షన్ పడటం వల్లే ఇలా అయ్యిందని చెప్పింది. మరీ ఆలస్యం చేస్తే ఆమెకు అబార్షన్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదని హెచ్చరించింది. తులసి చీదరించినా, ఛీ కొట్టినా లాస్య తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఫైల్ మీద సంతకం పెట్టమంటూ మరోసారి తులసి ఇంటి గడప తొక్కింది, అంతేకాదు ఫైల్ మీద సంతకం పెట్టమంటూ డిమాండ్ చేసింది. దీంతో ఆమె మీద చిర్రుబుర్రులాడిన తులసి.. ఈ ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరిగి చేతిలో పెడ్తాను అని చెప్పినదాన్ని సంతకం ఎలా చేస్తాననుకున్నావు అని మండిపడింది. సంతకం పెట్టకపోతే నందుకు తన కుటుంబ సభ్యులను శాశ్వతంగా దూరం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరి ఆమె వార్నింగ్కు తులసి భయపడుతుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ -
Devatha : రుక్మిణి గర్బవతి అన్న నిజం బయటపడ్తుందా?
సత్యకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని రుక్మిణి భావిస్తుంది. దీంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని సత్యను ప్రశ్నిస్తుంది. అతను ఎవరు అయినా నీకిచ్చి పెళ్లి చేస్తానని సత్యకు చెప్పడంతో ఆమె షాకవుతుంది. రుక్మిణి తన కోసం త్యాగం చేస్తుందేమో అని, అలా జరగకూడదని భావిస్తుంది. మరోవైపు రుక్మిని వాంతులు చేసుకోవడంతో అందరూ కంగారు పడతారు. అయితే రుక్మిణి మాత్రం సత్య-ఆదిత్యల విషయం తెలిసే వరకు తాను గర్భవతినన్న నిజం బయటకు రావొద్దని నిర్ణయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్8న 254వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యకు అమ్మానాన్నలు లేకుండా చేశానని రుక్మిణి బాధపడుతుంది. అయితే అమ్మానాన్నలు లేనిలేటు లేకుండా తనను చూసుకున్నారని సత్య జవాబిస్తుంది. అయితే తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని రుక్మిణి సత్యను కోరుతుంది. అతను ఎవరు అయినా సరే నీకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో సత్య షాకవుతుంది. దీనర్థం అక్క ఆదిత్యను తనకోసం త్యాగం చేస్తుందా అని తనలో తానే అనుకుంటుంది.ఘిలా చేస్తే ఇప్పటివరకు తాను చేసిన త్యాగం వృధా అవుతుందని, ఆదిత్య లేకపోతే తన అక్క చచ్చిపోతుందని, ఆమె జీవితం నాశనం కాకూడదని కోరుకుంటుంది. మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి హాస్పిటల్కి తీసుకెళ్లమని ఈశ్వర్ ప్రసాద్ ఆదిత్యకు చెప్తాడు. అలాగే సత్యను వెంట తీసుకెళ్లి తనకు కూడా చెకప్లు చేయించాలని చెప్తాడు. అయితే రుక్మిణి ఎందుకు వాంతులు చేసుకుంటుందో తెలియక ఆదిత్య కంగారు పడతాడు. ఇది ప్రెగ్నెన్సీ అయితే కాదుకదా అని ఆలోచిస్తాడు. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఆరోగ్యంపై ఈశ్వర్ ప్రసాద్ కమలకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాల్సిందిగా కబరు పెడతాడు. దీంతో తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని, ఇక నిజం బయటకు వచ్చే రోజు దగ్గరల్లోనే ఉందని కమల బాధపడుతుంది. ఇక మరోవైపు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎలా అయినా దాయాలని, సత్య-ఆదిత్యల గురించి నిజం తెలిసే వరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడాలని రుక్మిణి భావిస్తుంది. మరి హాస్పిటల్లో రుక్మిణి అనుకున్నదే జరుగుతుందా? ఆమె గర్భవతి అన్న విషయం అందరికి తెలిసిపోతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
నిజం తెలుసుకున్న నందు, లాస్యలో మొదలైన టెన్షన్!
తులసిని ఓడించాలని లాస్య, తులసి మీద విజయం సాధించాలని నందు తెగ కష్టపడుతున్నారు. అయితే ఇందులో ఒకరిది స్వార్థం అయితే మరొకరిది అవసరం. ఏదేమైనా నందు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి అతడి పరిస్థితి దయనీయంగా మారింది. కంపెనీ కష్టాల్లో కూరుకుపోతూ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాస్యే కారణమైనప్పటికీ ఆ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం శోచనీయం. తులసిని ఓడించాలన్న లాస్య ప్లాన్ కూడా బెడిసికొట్టింది. అసలు నేటి(జూన్ 8) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. తులసి తన ప్రాజెక్ట్ చేజారిపోయినందుకు బాధపడలేదు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నవ్వుతూ ఎదుర్కొనే ఆమె ఈ విషయాన్ని కూడా పాజిటివ్గానే స్వీకరించింది. కానీ అంతలోనే కంపెనీ నుంచి ఆమెకు ఫోన్కాల్ వచ్చింది. తనకు పోటీగా వచ్చిన స్టెల్లా డిజైన్లు కాపీవని తేలాయని, నిజాయితీగా స్వంత డిజైన్లు గీసిన మీకు ప్రాజెక్ట్ అప్పగిస్తున్నామని వెల్లడించింది. దీంతో తులసి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిసాయి. మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని నందు మల్లగుల్లాలు పడ్డాడు. తనకు సాయం చేయమని తండ్రి కాళ్ల మీద పడ్డాడు. తను పెట్టిన కంపెనీ కష్టాల్లో ఉందని, ఉద్యోగులకు చిల్లిగవ్వ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని కన్నీరు పెట్టుకున్నాడు. నీకేదైనా సాయం చేయగలిగితే అది తులసి మాత్రమేనని తండ్రి తేల్చి చెప్పడంతో నందు తన అహాన్ని అణుచుకుని భార్యను అర్థించాడు. తనను గండం నుంచి గట్టెక్కించమని కోరాడు. దీంతో విస్తుపోయిన తులసి తన తాళిని ఎగతాళి చేసినందుకు సాయం చేయాలా? కుటుంబాన్ని అనాథలా వదిలేసినందుకు సాయం చేయాలా? అని మండిపడింది. తన చేత పెట్టించిన కన్నీరే నీ పతనానికి కారణమైందంటూ భర్త మీద విరుచుకుపడింది. కానీ ఇదంతా కల అని తెలియడంతో నందు నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడ్డాడు నందు. తులసిని సాయం అడగకుండానే జీవితంలో గెలిచి తీరాలని సంకల్పించాడు. తులసిని మాత్రం ప్రాధేయపడకూడదని నిర్ణయించుకున్నాడు. నందు తనకు సాయం చేయమని స్నేహితుడు దివాకర్ను కోరాడు. ఇప్పుడు పెట్టుబడి పెడితే వచ్చే లాభం మొత్తాన్ని తనకే ఇస్తానని చెప్పడంతో అతడు సానుకూలంగా స్పందించాడు. ఈ మేరకు ఇద్దరూ అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. అయితే ఇలా లాభం లేకుండా బిజినెస్ చేయడం లాస్యకు ఏమాత్రం నచ్చలేదు. కానీ తులసిని ఓడించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పడంతో ఆమె ఊరుకుండిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్లో నందు మరోసారి తాగి తూగినట్లు కనిపిస్తోంది. తనకు తెలిసినవారే వెన్నుపోటు పొడుస్తూ ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారని ఆవేదన చెందాడు. నీడలా ఉంటూ మోసం చేస్తున్నదెవరో తనకు తెలిసిందంటూ చెప్పడంతో లాస్య నీళ్లు నమిలింది. మరి నిజంగానే తనకు నమ్మకద్రోహం చేస్తుంది లాస్య అన్న విషయం నందుకు తెలిసిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
Devatha : తల్లి కాబోతున్న రుక్మిణి.. బాధలో సత్య
రాధా-కృష్ణుల బొమ్మపై నిజం తెలిసేవరకు తాను గర్భవతి అన్న విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. ఆ బొమ్మ సత్యే ఆదిత్యకు ఇచ్చిందని రుక్మిణి బలంగా నమ్ముతుంది. కానీ సత్య-ఆదిత్యలకు ఏ సంబంధం ఉండకూడదని కోరుకుంటుంది. తన చెల్లెలు సత్య జీవితం బాగుండాలని ఆశిస్తుంది. మరోవైపు రుక్మిణి పడుతున్న వేదనను చూసి సత్య కంగారుపడుతుంది. తమ గురించి నిజం తెలిస్తే రుక్మిణి బతకదని ఆదిత్యకు చెబుతుంది. సీన్ కట్చేస్తే సత్య-రుక్మిణిల గురించి కమల బాధపడుతుంది. వాళ్లిద్దరి జీవితాలు నాశనం అవుతాయేమో అని కంగారుపడుతుంది. మరోవైపు తనను క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్7న 253వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్ 7 : సత్యకు ఇచ్చిన రాధా-కృష్ణుల బొమ్మ చూసి రుక్మిణి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. ఆ బొమ్మ గురించి ఏం అడిగినా ఇద్దరూ ఒకేలా సమాధానం చెబుతుండటంతో రుక్మిణికి మరింత అనుమానం కలుగుతుంది. ఈ బొమ్మ సంగతి తేలే వరకు తాను గర్భవతి అన్న నిజాన్ని బయటపెట్టకూడదని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. మరోవైపు రుక్మిణి ఆరోగ్య పరిస్థితి చూసి సత్య బాధపడుతుంది. ఆదిత్యకు, తనకు ఉన్న సంబంధం గురించి అక్కకు తెలిసిపోయిదేమో అని కంగారు పడుతుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతుంది. నేనే నీకు బొమ్మ ఇచ్చిన విషయం అక్కకు తెలిసిపోయింది అందుకే ఇలా అయ్యిందంటూ సత్య ఆదిత్యతో అంటుంది. ఇక సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన రుక్మిణి ఇద్దరిని చూసి ఇక్కడేం చూస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. భోజనానికి పిలవడానికి వచ్చానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. కాసేపటికి సత్య గదిలోకి రుక్మిణి వస్తుంది. తన ఆరోగ్యంపై రుక్మిణి చూపిస్తున్న శ్రద్ద చూసి సత్య తనను క్షమించమని కోరుతుంది. నీ వల్లే మా అమ్మానాన్నలు చనిపోయారంటూ చెప్పినందుకు నువ్వెంత బాధపడుతున్నావో తెలుసని, అందుకు క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితం ఎటు పోతుందో అని కమల బాధపడుతుంది. నిజం తెలిసే రోజు తొందర్లోనే ఉందని తెలిసి బాధపడుతుంది. -
kathika Deepam: తప్పు చేశావంటు మోనితను నిలదీసిన కార్తీక్..
కార్తీకదీపం జూన్ 7: మోనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి వెళ్లిపోతుంది. మురళీ కృష్ణ దీపకు అన్యాయం జరిగిందనే బాధలో కార్తీక్ని కడిగిపాడేస్తాడు. ఆ తర్వాత దీపను వీళ్ల దగ్గర ఉండోద్దని, మన ఇంటికి పొదామని చేయి పట్టుకుంటాడు. మరీ దీప వెళుతుందా? కార్తీక్ మోనిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడో నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. మురళీ కృష్ణ వెళ్లిపోదాం పదమ్మా అని దీప చేయి పట్టుకోగానే ఆమె కార్తీక్, సౌందర్యల వంక చూస్తుంది. ఆ తర్వాత తండ్రి చేయిని విడిపించుకుని దండం పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్లు చేయి చాచి చూపింది. దాంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్లగానే కార్తీక్, దీపల ఫొటో కనిపిస్తుంది. అది నేలపై విసిరికొట్టి కోపంతో రగిలిపోతుంటాడు. భాగ్యం ఏమైందిని అడగ్గా జరిగిన విషయం చెబుతాడు. దీనికి భాగ్యం కూడా ‘నువ్వు చేసిందే కరెక్ట్ అయ్యా.. నేను కూడా రావాల్సింది మోనితను, అల్లుడిని కలిపి కడిగిపారాశేదాన్ని’ అని కోపంగా అంటుంది. మరోవైపు కార్తీక్ మోనిత దగ్గరికి వెళతాడు. అక్కడ ‘తప్పు చేశావ్ మోనిత తాగిన మైకంలో నేను ఏదో తప్పు చేయబోతే కనీసం నువ్వైనా నా చెంపలు చెడామడా కొట్టి ఆపాల్సింది కదా. నువ్వు తప్పు చేసిందే కాక నాతో కూడా తప్పు చేయించావు’ అని అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో మోనిత ‘అదేంటి కార్తీక్ తప్పు అంతా నేను చేసినట్లు మాట్లాడుతున్నావు. నువ్వే కదా హిమను తీసుకువస్తే పెళ్లి చేసుకుంటా అన్నావ్, హిమ వచ్చింది. కానీ నువ్వు పెళ్లి ఊసే ఎత్తలేదు. పైగా వెత్తుక్కుంటు నువ్వే వెళ్లి నీ భార్య, పిల్లలని తెచ్చుకున్నావు’ అంటుంది. అంతేగాక అయినా ఆ రోజు నిన్ను వద్దంటు ఆపాను కానీ నువ్వు పెళ్లి చెసుకుంటానని చెప్పావు అని చెబుతుంది. అలాగే.. ‘పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తూ మరో మగాడికి నా మనసులో చోటు ఇవ్వలేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నాకు నువ్వు పెళ్లి చేసుకుంటా అనేసరికి ఉప్పోంగి పోయాను. అందుకే నిన్ను దూరం పెట్టలేక నన్ను నేను అర్పించుకున్నానంటూ కన్నీరు పెట్టుకుని దీపలా నన్ను వదిలేయకు కార్తీక్ నీకు దండం పెడతాను’ అంటూ కార్తీక్ కాళ్లపై పడుతుంది. కార్తీక్ అలానే షాక్లో చూస్తూ, భారంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా.. దీప ఒంటరిగా కూర్చుని పూజ రోజు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటుంది. కార్తీక్ పెద్ద తప్పు చేశానని, సరిదిద్దుకోలేని నేరం చేశాను అంటు దీప కాళ్లు పట్టుకోబోయింది, మోనిత ప్రెగ్నెంట్ అనగానే షటప్ అంటు తిట్టు పంపిచింది అంతా తలచుకుంటుండగా అక్కడికి సౌందర్య వస్తుంది. కొడుకు చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఇన్నాళ్లు దీప పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంటుంది. వాడు నువ్వు ఏ తప్పు చేయాలేదని నిరూపించుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోయావు, గుడి దగ్గర ప్రసాదాలు తిని బతికావ్.. చివరకు నమ్మే సమయం వచ్చిన అది ఇంత నీచంగానా? వీడి వల్ల ఆ మోనిత కడుపు పండితే నీ సంతానం వాడి సంతానమని నమ్మడమా? ఏంటిది అంటూ దీప భుజంపై వాలి ఏడుస్తుంది. -
కాళ్ల మీద పడ్డ నందు, గట్టెక్కించంటూ వేడుకోలు
తులసి ప్రయత్నాన్ని దెబ్బ కొట్టాలన్న లాస్య ప్లాన్ విజయవంతమైంది. కానీ తొలి ప్రయత్నంలోనే ఓటమిపాలైనందుకు తులసి దిగులు చెందలేదు. తను ఎగసిపడే ఉప్పెనలాంటిదాన్నంటూ మరింత ధైర్యంగా ముందడుగు వేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఎలాగైనా తులసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని రగిలిపోయింది లాస్య. మరి నేటి (జూన్ 7) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. ఎంతో కష్టపడి గీసిన డ్రెస్ డిజైన్స్కు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోవడంతో తులసి తెగ టెన్షన్ పడింది. కానీ ఆ ఫైళ్లను మాయం చేసిన అనసూయ మాత్రం లోలోపలే సంతోషించింది. అయితే అనసూయ కుట్రను పసిగట్టిన శృతి తిరిగి ఆ ఫైళ్లను వెతికి తీసుకొచ్చింది. దీంతో అప్పటివరకు ఆందోళన చెందిన తులసి హమ్మయ్య అని ఓ నిట్టూర్పు వదిలి వాటిని తీసుకుని బయటకు వెళ్లిపోయింది. ఇక తులసిని ఓడించేందుకు లాస్య డిజైనర్ స్టెల్లాను రంగంలోకి దింపింది. దీంతో కంపెనీ యాజమాన్యం తులసి, స్టెల్లా ఇద్దరి డిజైన్లు చూసి, చివరికి స్టెల్లాకు ప్రాజెక్టు అప్పజెప్పేందుకు మొగ్గు చూపింది. దీంతో లాస్య ఊహించినట్లుగానే తులసికి ప్రాజెక్టు దక్కకపోవడంతో ఆమె నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో లాస్య తులసికి తారసడి ఆమెను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించింది. కానీ తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదగడం తథ్యం అని లాస్య నోరు మూయించింది తులసి. ఇంట్లో తనకు కాంట్రాక్ట్ రాలేదన్న విషయాన్ని చెప్పడంతో గయ్యాలి అత్త అనసూయ మళ్లీ తన నోటికి పని చెప్పింది. తులసికి ఏమీ చేత కాదంటూ నానా మాటలు అంది. ఇదిలా వుంటే రేపటి ఎపిసోడ్లో ఆర్థిక సాయం కోసం నందు తండ్రి కాళ్ల మీద పడ్డాడు. కానీ ఇప్పుడు తాను సాయం చేసే స్థితిలో లేనని చేతులెత్తేసిన అతడు వెళ్లి తులసిని అడగమని సలహా ఇచ్చాడు. దీంతో తనను ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించంటూ భార్యను ప్రాధేయపడ్డాడు. కానీ ఇందుకు తులసి ఏమాత్రం చలించనట్లు కనిపిస్తోంది. మరి ఆమె నందుకు సాయం చేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నందు నావాడు అంటూ గోతులు తీస్తున్న లాస్య! -
karthika Deepam: మోనితపై కార్తీక్ ఫైర్, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది..
కార్తీకదీపం జూన్ 5: కార్తీక్ దీప కాళ్లు పట్టుకుని, నిజం చేప్పేలోపే మోనిత వచ్చి కథ అంతా మారుస్తుంది. తాను గర్భవతిని అని దీవించండి అంటూ సౌందర్యతో అంటుంది. అది విన్న వారంత ఒక్కసారిగా షాక్ అవుతారు. మరీ మోనిత చెప్పింది నమ్ముతారా! మరీ దీప ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నదనేది నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. నేను నెల తప్పాను ఆంటీ అని చెప్పగానే సౌందర్య కోపంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్’ అంటుంది ఆవేశంగా. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అంటుంది మోనిత. దాంతో అంతా షాక్ అవుతారు. వెంటనే కార్తీక్ కోపంగా ‘స్టాపిట్ మోనితా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి అమ్మా దీపా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవని పేరంటంలా వచ్చేస్తావ్.. రసాబస చెయ్యాలని చూస్తావ్.. నువ్వు నా ఫ్రెండ్వా శత్రువ్వా.. ఎందుకింత దారణంగా మాట్లాడుతున్నావ్?’ అంటాడు ఆవేశంతో ఊగిపోతూ. వెంటనే మోనిత నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అందరిని నమ్మించేందుకు కార్తీక్ పురషాహంకారం చూపించుకుంటున్నావా ఆడదంటే అంత అలుసా? ప్రెగ్నెంట్ అని అబద్దం చెబుతున్నా అనుకుంటే అది దాస్తే దాగే విషయమా? అంటుంది. పోనీ నా ప్రెగ్నెన్సీకి నువ్వు కారణం కాదంటావా? రేపు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బటయపడుతుంది కదా.. ఏ ఆడదైనా ఈ విషయంలో అబద్దం చెబుతుందా కార్తీక్.. ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం. నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్ కార్తీక్.. అది అబద్దం అని ఇవాళ నా వల్ల నిర్ధారణ అయ్యింది’ అంటుంది మోనిత. దీప బాధగా తలవంచి నిలబడగా.. మోనిత దీపని చూసి లోలోపల నవ్వుకుంటూ దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ‘నన్ను క్షమించు దీప కార్తీక్ నీ విషయంలో తప్పు జరిగిందని గట్టిగా నమ్మేసరికి.. ఒక ఫ్రెండ్గా అతడ్ని సపోర్ట్ చేశాను.. సాటి ఆడదానిగా నీకు అన్యాయం చేశాను.. నువ్వు కళంకితవు కాదు.. పరమ పవిత్రురాలు.. కార్తీక్ ఒక్క క్షణం కాదంటేనే నేను భరించలేకపోయాను. నువ్వు 10 ఏళ్ల పాటు ఈ నింద నువ్వు ఎలా తట్టుకున్నావో ఎలా మోశావో ఊహిచడం నావల్ల కాదు. నువ్వు చాలా గ్రేట్ దీపా హ్యాట్సాప్ టు యూ’ అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక సౌందర్య వైపు తిరుగుతుంది. ‘మీరు చాలా మంచివారు ఆంటీ.. కొడుకు మాట కూడా నమ్మకుండా కోడలికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిత్వం మీది.. నేను ఆడపిల్లనే నాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే ఆలోచించి మీ అబ్బాయికి చెప్పండి.. ఇంకా మీకు ఎవరికీ నమ్మకం కుదురకపోతే.. ఇదిగో నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్’ అని దేవుడు దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. మోనిత వెళ్లిపోగానే మురళీ కృష్ణ పెద్దగా నవ్వుతూ.. ‘దీన్ని ఏం అంటారు? మోసమా? కుట్రనా నయవంచనా? ఇంత దారుణమా.. ఇంత నీచత్వమా? ఎలాగో నాకు పిల్లలు పుట్టరనే సాకుతో ఇలా ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు ఆవిడ వల్ల ఈ నిజం బయటపడింది.. బయటపడని బాగోతాలు ఎన్నో? ఇంకెంత మంది అభాగ్యులు ఉన్నారో మీ లిస్ట్లో? అంటూ కార్తీక్ని ప్రశ్నిస్తాడు. ‘మురళీ కృష్ణ గారు..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఆపవయ్యా.. ఆయనకి మూడ్ వస్తే మావయ్యా అంటాడు.. కోపమొస్తే మురళీ కృష్ణా అంటాడు.. మావయ్యా అంటే మురిసిపోవాలి.. నోరుమూసుకుని పోవాలంటే పోవాలి.. ఎందుకంటే దీనికి పెళ్లి ముందు నాకు పిల్లలు పుట్టరు.. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి అభ్యంతరం లేదంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇతడిలోని నిజాయితీకి మురిసిపోయాను’ అంటూ మురళీ కృష్ణ ఏడుస్తూ అంటుంటే కార్తీక్ తలదించుకుంటాడు. దీప బొమ్మలా నిలబడి ఉంటుంది. ‘ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా.. పిల్లలు పుట్టకపోతే ఏంటిలే దత్తత తీసుకుంటారులే అనుకుని, నా కూతురు ఇంతటి వాడ్ని మిస్ అయిపోకూడదని.. ఆ విషయం నా కూతురుకి కూడా చెప్పకుండా పెళ్లి చేశాను.. వరమో శాపమో దీని కడుపు పండింది. అప్పటి నుంచి దీపను చేడిపోయావంటు కార్తీక్ అవమానించిన రోజులను గుర్తు చేస్తూ కార్తీక్పై అసహనం వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ట. ఇక వెంటనే సౌందర్య వైపు తిరిగి.. ‘చెయ్యని తప్పుకుని ఇన్నేళ్లు నరకం చూపించిన నీ కొడుక్కి ఎలాంటి శిక్ష వేస్తావమ్మా.. నీ కొడుకు వల్ల జీవితమే నాశనం అయిన నా కూతురికి ఏం న్యాయం చేస్తావమ్మా? అని అడుగుతాడు. దీపతో నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపం, అంతకన్నా ఏం లేదమ్మా.. పదమ్మా వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోదాం అనడంతో దీప కార్తీక్ వైపు చూస్తుంది. ఆ తర్వాత దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, నెక్ట్ మోనిత వేసే ప్లాన్ ఏంటో సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: దీప కాళ్లు పట్టుకున్న కార్తీక్, మోనిత ఎంట్రీ, షాక్లో సౌందర్య
కార్తీకదీపం జూన్ 4: పూజకు అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెబుతాడోనన్న టెన్షన్తో ఉంటుంది. కార్తీక్ దీపకు గిప్ట్ ఇవ్వాలని శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేసి.. ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి పెట్టుకుంటాడు. అదే టైమ్కి మోనిత తన ఇంట్లో పూజకు వెళ్లడానికి బాగా రెడీ అవుతుంది. ప్రియమణీతో త్వరలోనే పప్పు అన్నం పెడతానంటు ఏవేవో కబుర్లు చెబుతుంది. ఇక పూజాలో దీపకు చెబుతాన్న విషయం కార్తీక్ చెప్పనున్నాడా? లేదా ఇలోపు మోనిత ఎలాంటి ట్వీస్ట్ ఇవ్వబోతోంది అనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య ఇంట్లో పూజకు అన్ని రేడి చేస్తారు. దీంతో పూజారి పూజకు టైం అవుతుంది అనడంతో అంతా కిందకి వస్తారు. కానీ కార్తీక్ మాత్రం కిందకు రాడు. దీంతో కార్తీక్ రాకపోవడంతో సౌందర్య ఆదిత్యను అన్నయ్య ఎక్కడ అని అడగడంతో ఇంకా గదిలోనే ఉన్నాడంటూ పైకి చూస్తుండా అప్పడే కార్తీక మెట్లు తిగుతూ వస్తాడు. వస్తూనే క్షమాపణలు ఎలా అడగాలో తెలియడం లేదంటు దీప దగ్గరికి వెళ్లతాడు. వెంటనే కార్తీక్కు తను దీపకోసం పెట్టిన గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇష్టమైన శ్రీశ్రీ పుస్తకం ఇచ్చి క్షమాపణలు కోరతాను అంటు వెళ్లి తెద్దామని వెనక్కి వెళ్లబోతాడు. దాంతో సౌందర్య ‘టైమ్ అవుతుందిరా.. దేవుడికి దన్నం పెట్టుకుని కూర్చోండి’ అంటుంది. వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి.. దీపవైపు చూస్తూ దేవుడికి కాదు మమ్మీ.. ముందు దేవతకు దండం పెట్టుకోవాలి అంటు దీప ముందు మోకాళ్లపై కూర్చుని తన కాళ్లకు దండం పెట్టబోతాడు కార్తీక్. పడ్డాడు. దీప వెనక్కి జరిగిపోతుంది కంగారుగా. అంతా షాక్లో ఉంటారు. తెలియకుండా నవ్వుముఖాలుగా ఉంటాయి ఆదిత్య, శ్రావ్య, దీప తండ్రి, సౌందర్య అంతా ఆనందంతో ముఖాలు వెలిగిపోతాయి. ‘నేను చేసిన తప్పుకు శిక్ష ఏ కోర్టులోనూ ఏ జడ్జ్ వెయ్యలేడు..బయటికి కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను.. మాటలతో గుండెల్లో పొడిచి పొడిచి చిత్రవథ చేశాను. అందరినీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకున్నాను.. నేను చేసిన అపరాధం హత్యానేరం కన్నా పెద్దది. దానికి ఉరిశిక్షవేశానా సరిపోదు.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప’ అని కార్తీక్ క్షమాపణలు చెప్పడంతో దీప ఎంటో అర్థం కానట్లు అయోమయంలో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రాగానే ‘అంత తప్పు నువ్వేం చేశావ్?’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ షాక్తో వెనక్కి తిరిగి చూస్తు దీప పక్కన నిలబడతాడు. ‘చెప్పు కార్తీక్ అంత పెద్ద తప్పు ఏం చేశావ్? తప్పు తెలుసుకున్నావ్.. సరిదిద్దుకుంటావ్.. ఇన్నాళ్లు నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్స్ అలా వచ్చాయ్.. అందుకు నువ్వేం చేస్తావ్? ఎవరిదో రిపోర్ట్ నీవనుకుని ల్యాబ్ టెక్నీషియన్ మార్చేస్తే. నువ్వేం చేస్తావ్? అది మానవ తప్పిదం.. అందులో నిన్ను తప్పు బట్టడానికి ఏం లేదు’ అంటుంది మోనిత. మోనిత మాటలకు అంతా బిత్తరపోతారు. వెంటనే మోనితే మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవాలే తేలింది.. 100 పర్సెంట్ నీకు ఆ అర్హత ఉంది.. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం దేనికి? నీకు పిల్లలు పుడతారు కార్తీక్.. హిమ, సౌర్య నీ కన్నబిడ్డలు. నీ సంతానమే’ అంటుంది నవ్వుతూ. ‘మోనితా నువ్వేం మాట్లాడుతున్నావ్?’అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్.. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నాను.. కానీ పట్టరాని ఆనందంలో ఈ వార్త అందరికీ అందజెయ్యాలనే కంగారులో స్వీట్స్ తీసుకుని రావడం మరిచిపోయాను. పోనీలెండీ.. ఇక్కడ అక్షింతలు ఉన్నాయిగా.. అవి నా నెత్తిన వేసి నన్ను ఆశీర్వదించండి ఆంటీ’ అంటూ సౌందర్య కాళ్ల మీద పడుతుంది మోనిత. అంతా షాక్లోనే ఉండిపోతారు. సౌందర్య అయోమయంగా.. ‘వాడికి పిల్లలు పుడతారని నువ్వు చెప్పడమేంటీ? నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు’ అంటుంది. వెంటనే పైకి లేచిన మోనిత.. నవ్వుతూ.. ‘నేను నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది..’ అంటుంది. వెంటనే సౌందర్య ఆవేశంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్..’ అని అరుస్తుంది. ‘ఇంతచెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అని చెప్పడంతో అందరి మొహాలు తెల్లబోతాయి. ఇక ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
Intinti Gruhalakshmi: తులసి ప్రయత్నాన్ని దెబ్బ కొట్టిన లాస్య!
నందు నావాడు అంటూనే గోతులు తీయడం మొదలు పెట్టింది లాస్య. అతడిని పూర్తిగా తనవైపు తిప్పుకుని అతడి ఆఫీసులో పని చేసే ఉద్యోగి ద్వారా డబ్బు గుంజుతోంది. అటు తులసి కూడా ఎదగడానికి వీల్లేదని కంకణం కట్టుకుంది. తనను ఒక్క అడుగు కూడా ముందుకెళ్లనివ్వనని శపథం చేసింది. మరి నేటి(జూన్ 4) ఎపిసోడ్లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. నందు ఆఫీసులో ఉద్యోగులకివ్వాల్సిన జీతాలను లాస్య దొంగ లెక్కలతో తన అకౌంట్లోకి పంపించుకుంది. అతడి డబ్బులను కాజేసి నందుకే వెన్నపోటు పొడిచింది. ఈ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం గమనార్హం. పైగా ఆఫీసు లెక్కల బాధ్యతను కూడా లాస్యకే అప్పగించడం దురదృష్టకరం.. ఇదిలా వుంటే తులసి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలని తహతహలాడుతోంది. అందులో భాగంగా కుట్టు మిషన్లు ఆర్డర్ ఇవ్వాలని, ఓ నలుగురిని పనిలో పెట్టుకోవాలని ప్లాన్లు వేస్తోంది. సరిగ్గా అప్పుడే వచ్చిన ప్రేమ్ ఒక టీవీ సీరియల్కు టైటిల్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ వచ్చిందంటూ శుభవార్త చెప్పాడు. కొడుకు ఆశయం నెరవేరుతున్నందుకు తులసి తెగ సంతోషించింది. ఏదైనా సాధించి తీరాలన్న తులసి స్థైర్యాన్ని దెబ్బతీయాలని లాస్య ఫోన్ చేసింది. 'మొగుడు లేనివాళ్లకు చిన్ననాటి స్నేహితుడే చేదోడువాదోడు.. నందు లేకపోయినా పక్కన రోహిత్ ఉన్నాడుగా..' అంటూ వక్రమాటలు మాట్లాడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి.. లాస్య మీద అసహనం ప్రదర్శించింది. నిద్రపోతున్న సింహాన్ని లేపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన లాస్య 24 గంటల్లో తానేంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని మల్లగుల్లాలు పడుతున్న నందుకు లాస్య మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కోసారి ఇలాంటివి ఎదురవుతాయంటూనే మళ్లీ అప్పు చేయమని సూచించింది. అప్పు చేస్తే వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుందని నందు టెన్షన్ పడుతుంటే లాస్య మాత్రం తన అకౌంట్లో డబ్బు జమైందని లోలోపలే సంతోషపడింది. ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య.. తులసి తలపెట్టిన పనికి ఆదిలోనే ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించింది. తులసి ఎంతో కష్టపడి గీసిన డిజైన్లను తనకు తెలియకుండా మాయం చేసేసి దెబ్బ తీసింది. మరి ఇది జిత్తులమారి లాస్య పన్నిన కుట్ర అని తులసికి తెలుస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: సితార: చేతిలో పువ్వు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్ -
karthika Deepam: దీపకు కార్తీక్ ప్రత్యేక బహుమతి, ఇంతలో ఫోన్ రింగ్..
కార్తీకదీపం జూ 2: కార్తీక్ రేపు ఏం చెప్పబోతున్నాడో తెలియక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటు కంగారు పడిపోతుంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ధైర్యం చెప్పి కార్తీక్ కాసేపు మాట్లాడమంటు గదిలోకి పంపిస్తుంది. ఆ సమయానికి కార్తీక్ కవితల పుస్తకం చూస్తు కనిపిస్తాడు. మరోవైపు కార్తీక్ చేసిన అవమానానికి మోనిత రగిలిపోతుంది. కార్తీక్ చేతి ఆ పుస్తకం చూసి దీప ఎల స్పందించనుంది, పగతో ఉన్న మోనిత ఏం చేయబోతుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. భాగ్యం ఇస్తీ చేసుకుంటూ దీప ఎందుకు ఫోటోను గోడకు పెట్టనివ్వాలేదు? డాక్టర్ బాబు చేసేది కూడా అలానే ఉంటుందిల.. దీప అనుమానం నిజమే అయ్యి ఉంటుందా? లేక డాక్టర్ బాబు మారిపోయి ఉంటాడా అని తనలో తనే మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ గదికి వెళ్లేసరికి అతడు ఏదో ఆలోచిస్తు మందు తాగడం చూస్తుంది(కానీ కార్తీక్ దీపని అవమానించిన క్షణాలను తలుచుకుని కుమిలిలోతుంటాడు). అలా కార్తీక్ను చూసి తలుపు దగ్గరి నుంచే తిరిగి వెనక్కివచ్చేస్తుంది దీప. కింద సౌందర్య భర్త ఆనందరావుతో మాట్లాడుతుంటే దీప కిందికి రావడం గమనించి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని అడగ్గా డాక్టర్ బాబు ఏదో టెన్షన్లో ఉన్నంటున్నాడు, మందు తాగుతున్నాడని చెబుతుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వాడు తాగడం మానేశాడే.. మొన్నెప్పుడో తాగొస్తే.. మనసు బాలేదు అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా మోనిత పొద్దున్నే లేచి కాఫీ చేసి ప్రియమణిని లేపి తాగమని ఇస్తుంది. దీంతో షాక్ అయిన ప్రియమణి కోపం వస్తే కొట్టండి, తిట్టండి కానీ ఇలాంటివి చేయకండని అని అనడంతో.. భవిష్యత్తులో కార్తీక్కి పెట్టి ఇవ్వాలిగా.. ప్రాక్టీస్గా ఉంటుందని పెట్టాను చెబుతుంది. ఆ తర్వాత ఆ కాఫీ తాగి పైన ఉన్న తన చీర ఇస్తీ చేయి అంటు ‘నేను కార్తీక్ దగ్గరకు వెళ్లాలి.. త్వరగా చేసిపెట్టు అంటుంది. ప్రియమణి మనసులో.. ‘ఈమె హడావుడి చేస్తే దీపమ్మ కొంప ముచ్చేలానే ఉంది’ అనుకుంటుంది. ఇక అటు సౌందర్య ఇంట్లో పూజకు అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భాగ్య కాలు జారిపడిందని, కాలు నెప్పి పెడ్డటంతో రాలేదని మురళీ కృష్ణ మాత్రమే వస్తాడు పూజకు. ఇక అటు దీప, ఇటు కార్తీక్లు వేరు వేరు రూమ్స్లో రెడీ అవుతూ ఉంటారు. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెప్పబోతున్నాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ పంచెకట్టుకుని. శ్రీ శ్రీ పుస్తకాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి.. దానిపై స్లిప్ అంటించి ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి.. మళ్లీ ఆ స్లిప్ చించి ‘దీపకు ప్రేమతో కార్తీక్’ అని రాసి మురిసిపోతుంటాడు. ఇంతలో కార్తీక్కు ఫోన్ రావడంతో ఆ గిఫ్ట్ బెడ్ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపకు శ్రీశ్రీ కవితలంటే పచ్చి. ఆ పిచ్చి కారణంగానే కార్తీక్ దీపను అవమానించేందుకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీశ్రీ కవితలు వింటేనే రగిలిపోయే కార్తీక్ అదే శ్రీశీ కవిత పుస్తకాన్ని దీపకు బహుమతి ఇచ్చి.. తనలోని అనుమానం నిజం కాదని చేప్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి వచ్చింది. ఈలోపు మోనిత ఎంట్రి ఇచ్చి కార్తీక్ ప్లాన్ మొత్తం తారుమారు చేయనుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : పసరు మందుతో సత్యను చంపాలనుకున్న కమల
రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. సత్యను చంపేస్తే ఎవరికి ఏ బాధ ఉండదని నిర్ణయించుకుంటుంది. సీన్ కట్ చేస్తే సత్య-ఆదిత్యలు మరోసారి రుక్మిణి కంటపడతారు. సత్యను ఆదిత్య స్వయంగా తన చేత్తో ఎత్తుకొని తీసుకెళ్లడం చూసి రుక్మిణి గుండె పగులుతుంది. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటల విని మరింత బాధపడిపోతుంది. ఇది నిజం కావొద్దంటూ ప్రార్థిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్3న 250వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్ 3 : సత్య-ఆదిత్యలపై తనకున్న అనుమానం గురించి రుక్మిణి కమలతో పంచుకుంటుంది. తాను స్వయంగా తయారుచేసిన రాధాకృష్ణల బొమ్మ సత్యను ఇస్తే అది ఆదిత్య దగ్గరికి ఎలా వచ్చిందంటూ సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. త్వరలోనే ఈ నిజం బయటకు వచ్చేస్తుందేమో అని కంగారు పడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. ఎంత వద్దని చెప్పినా సత్య అక్కడికి పోయి రుక్మిణి జీవితాన్ని నాశనం చేస్తోందంటూ తనపై కక్ష పెంచుకుంటుంది. దీంతో ఓ పసరు మందు నూరి సత్యకు తినిపించాలనుకుంటుంది. అది ఏం మందు అని భాష అడగ్గా సత్యను చంపేద్దామనుకుంటున్నా అని కమల చెప్పిన సమాధానంతో భాష షాక్ అవుతాడు. దీనంతటికి కారణం సత్యే అని, అసలు సత్యనే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేస్తే అప్పుడు ఎవరికీ ఏ బాధ ఉండదని కమల బదులిస్తుంది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? చీమకు కూడా హాని చేయని నువ్వు ప్రాణం తీసేంత ధైర్యం ఉందా అంటూ కమల చేస్తోన్న తప్పును ఎత్తిచూపుతాడు. ఇలాంటివి చేయోద్దని గట్టిగా చెప్తాడు. మరోవైపు సత్య కాలికి ఏదో గుచ్చుకొని బాధపడుతుంటే ఆదిత్య అక్కడికి వస్తాడు. సత్యను చూసి తట్టుకోలేక తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆ దృశ్యం రుక్మిణి కంటపడటంతో గుండె పగిలినంత పని అయ్యింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇది నిజం కాకూదంటూ ప్రార్థిస్తుంది. కలలో కూడా ఇలాంటిది జరగడకూడదని అనుకుంటుంది. సత్య-ఆదిత్యల ప్రేమ విషయం మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Intinti Gruhalakshmi: నందుకు లాస్య వెన్నుపోటు!
లాస్య తన వంకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. నందు మీద ప్రేమను ఒలకబోస్తూనే అతడికి వెన్నుపోటు పొడుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల వేతనాల కోసం ఉంచిన డబ్బును నందుకు తెలియకుండా అప్పనంగా వాడుకుంటోంది. పైగా ఆ డబ్బంతా ప్రాజెక్టుకు ఖర్చైపోయినట్లు నమ్మించింది. దీంతో నందు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. మరోవైపు తులసి కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామని చూస్తోంది. మరి నేటి (జూన్ 3) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చిన దివ్య మీద నోరు పారేసుకుంటున్న లాస్యకు చుక్కెదురైంది. దివ్యకు క్లీస్ పీకుతున్న లాస్యను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడు నందు. తర్వాత కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడాడు. అప్పుడు దివ్య తను ఫస్ట్ డే కాలీజేకి వెళ్తున్నానంటూ తండ్రి కాళ్ల మీద పడిపోయింది. దీంతో ఆమెను చేరదీసిన నందు నువ్వు మంచి డాక్టర్గా ఎదగాలంటూ ఆశీర్వదించాడు. మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తకు చెప్పకుండా తప్పు చేస్తున్నానా? అని లోలోపలే అంతర్మథనం చెందసాగింది. అది చూసిన ఆమె తల్లి అబార్షన్ చేయించుకోవాల్సిందేనని పదేపదే ఆమె మీద ఒత్తిడి తెచ్చింది. గర్భవతినన్న విషయం నీ భర్తకు చెప్తే అతడు అబార్షన్ జరగనివ్వడని హెచ్చరించింది. దీంతో అంకిత పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇక నందుకు నీడలా ఉండే లాస్య పాములా విషం చిమ్ముతోంది. నందు కోసం ఏదైనా చేస్తాను అని ప్రేమ ఒలకబోసే ఆమె వెనక మాత్రం గోతులు తీస్తోంది. ఆఫీసులో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఉంచిన డబ్బును లాస్య లాగేసుకుంది. అయితే ఆ డబ్బు ప్రాజెక్టు వర్క్కు అయిపోయిందని నమ్మించి ఉద్యోగుల కోసం డబ్బు సర్దుమని వేరే ఉద్యోగితో చెప్పించింది. ఇది నిజమని నమ్మిన నందు నాలుగు రోజుల్లో వారికి వేతనాలు ఇచ్చేలా డబ్బు సర్దుతానని చెప్పాడు. మరోవైపు తులసి కుట్టు మిషన్ వచ్చినవాళ్లను చేర్చుకుని కుటీర పరిశ్రమ పెడితే బాగుంటుందని భావించింది. ఇంకా తన భవిష్యత్తులో ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అని ప్లానింగ్ చేస్తుండగా ఆమె స్నేహితురాలు అంజలి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే తులసి అత్త అనసూయ అంజలి మీద నోరు పారేసుకుంది. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి వచ్చేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. తులసిలో వచ్చిన మార్పును చూసి అంజలి షాకైంది. మరి అంజలి ఏ పని మీద తులసి దగ్గరకు వచ్చింది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: హీరో నిఖిల్ కారుకు రెండు చలాన్లు దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
Devatha : రుక్మిణి ప్రశ్నలకు షాకైన సత్య-ఆదిత్యలు
కృష్ణ-సత్యభామల బొమ్మ తన వద్ద ఎక్కడినుంచి వచ్చిందని రుక్మిణి ఆదిత్యను నిలదీస్తుంది. దీంతో షాకైన ఆదిత్య ఎవరో కావాల్సిన వారు ఇచ్చారంటూ మాట దాటేస్తాడు. సీన్ కట్ చేస్తే..సత్య గదిలోంచి ఆదిత్య రావడాన్ని చూసిన రుక్మిణి వాళ్లిద్దరి మధ్యా తానే అడ్డుగా ఉన్నానా అని ఆలోచిస్తుంది. మరోవైపు తాను ఇచ్చిన బొమ్మ ఎక్కడ ఉందంటూ రుక్మిణి సత్యను ప్రశ్నిస్తుంది. ఇక తన అనుమానం మరింత బలపడిందని రుక్మిణి భావిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే2న 249వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత మే2 ఎపిసోడ్: ఆదిత్య లాకర్లో తాను సత్యకు బహుమతిగా ఇచ్చిన కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి రుక్మిణి షాకవుతుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యేనా అని అనుమానపడుతుంది. తన అనుమానం నిజం కాకూడదంటూ దేవుణ్ని ప్రార్థిస్తుంది. ఇక ఆ బొమ్మ ఎక్కడిదంటూ రుక్మిణి ఆదిత్యని నిలదీయడంతో ఆదిత్య ఆశ్చర్యపోతాడు. ఎవరో కావాల్సిన వాళ్లు ఇచ్చుంటారంటూ ఆదిత్య సందేహిస్తూ చెప్తాడు. ఇక ఇదే విషయాన్ని ఆదిత్య సత్యతో చెప్తాడు. దీంతో తమ విషయం ఎక్కడ బయటపడిపోతుందేమో అని సత్య కంగారుపడిపోతుంది. ఆ బొమ్మ స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారు చేసిందని, ఇప్పుడు తనకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే రుక్మిణి అటువైపు వస్తుండడాన్ని గమనించిన ఆదిత్య సత్య గదిలోంచి జారుకునే ప్రయత్నం చేస్తుండగా రుక్మిణి ఆదిత్యని కనిపెడతుంది. సత్య గదిలోకి ఎందుకు వెళ్లాలంటూ అడగ్గా ఏదో ఎగ్జామ్స్ కోసమని చెప్పి ఆదిత్య వెళ్లిపోతాడు. సీన్కట్ చేస్తే తాను పూజ చేస్తున్న సమయంలో సత్యను కూడా అక్కడకి వచ్చి హారతి తీసుకోమని రుక్మిణి అడుగుతుంది. అయితే దేవుణ్ని దండం పెట్టుకుంటుండగా అక్కడ కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి సత్య కంగు తింటుంది. ఇక తాను బహుమతిగా ఇచ్చిన బొమ్మ ఎక్కడుందంటూ సత్యను అడగ్గా అది పాండిచ్చెరిలోనే ఉండిపోయిందని చెప్పి సత్య అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో సత్య-ఆదిత్యలపై రుక్మిణికి అనుమానం బలపడుతుంది. ఇద్దరూ మాటల్లో తడబాటును రుక్మిణి గమనిస్తుంది. మరి ఈ నిజాన్ని రుక్మిణి ఎలా తెలుసుకుంటుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: మోనితను అవమానించిన కార్తీక్, సంతోషంలో దీప, సౌందర్య
కార్తీకదీపం జూన్ 2: దీప కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదేంటో చెప్పండి డాక్టర్ బాబు అని దీప వేడుకున్ప్పటివకి కార్తీక్ పూజ రోజే చేప్తానని, ఇది నా జీవితానికి సంబంధించిన విషయమంటూ దీప మరింత కంగారు పెట్టడం, ఇటు మోనిత కార్తీక్ను తన భర్తను చేసుకునే పెద్ద రహస్యాన్ని బయటపెట్టేందుకు సన్నాహాలు చేయడం ఇలా గత మూడు రోజులుగా ఇదే సాగుతుంది. మరీ ఈ రోజు అయినా ఆ నిజాన్ని కార్తీక్ బయటపెట్టి దీప గుండెదడను తగ్గిస్తాడో లేదో నేటి(జూన్ 2వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనితా కార్తీక్తో అర్జంటుగా మాట్లాడాలనునకుంటుంది. ఇందుకోసం కార్తీక్ను ఇంటికి వెళ్లాలనుకుంటుంది. ‘ఎటు నేను పెద్ద జలక్ ఇవ్వబోతున్నాను కదా..అందుకే వాళ్లింటికే వెళ్లి చివరి సారిగా దీప మొగుడిగా నా కార్తీక్ని చూడాలి. నా విషయంలో ఆ దీప కానీ.. ఆ సౌందర్య కానీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అది ఈ రోజు వరకే.. ఎందుకంటే రేపటితో సీన్ మొత్తం మారిపోతుందిగా.. పాపం దీప.. కార్తీక్ మారిపోయాడు ఇక తనతోనే ఉండిపోతాడు అనుకుంటోంది.. రేపటితో కార్తీక్ ఆ దీపకు భర్తగా కాదు.. ఈ మోనితకి భర్త కాబోతున్నాడు.. ఇన్నీ సంవత్సరాల నా కల రేపటితో నెరవేరబోతుంది.. కార్తీక్.. వస్తున్నా’ అంటు తెగ మురిసిపోతు బయలుదేరుతుంది మోనిత. మరోవైపు భాగ్యం.. ఇంట్లోని పాత ఫొటోలను తూడుస్తూ దీప, కార్తీక్లు కలిసి ఉన్న ఫోటో(గతంలో కార్తీక్ పగలగొట్టిన విషయం గుర్తొచ్చి.. ఈ ఫోటోని గోడకు తగిలించే రోజు ఎప్పుడొస్తుందో? ఏంటో’ అని నిట్టుర్పుగా అంటుంది. అలాగే కార్తీక్ మారిన విషయం, దీప వైద్యం చేయించి బతికుంచుకున్నాడంటే డాక్టర్ బాబు మారినట్లే కదా మరీ ఇంకేందుకు ఈ ఫొటో దాచడమని గోడకు తగిలించబోతుంటే అప్పడే సౌందర్య, దీపలు అక్కడి వస్తారు. దీంతో భాగ్యాన్ని ఏం చేస్తున్నావని సౌందర్య అడగ్గా.. ఈ విషయం చెబుతుంది. ఆలస్యం చేయకుండ ఆ ఫొటోను గోడకు తగిలించమని సౌందర్య చెప్పగా.. దీప వద్దు అని అడ్డుపడుతుంది. రేపు ఆ విషయం ఏంటో చెప్పాక తగిలించోచ్చు లే అనడంతో వారు ఊరుకుండిపోతారు. ఆ తర్వాత భాగ్యంతో రేపు మనింట్లో పూజ ఉందని.. మీరు తప్పకుండా రావాలని పిలుస్తుంది సౌందర్య. ఇక కార్తీక్ బయట నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లో అప్పటికి ఎవరు ఉండకపోవడంతో బాధగా కూర్చుని.. ‘రేపు నా జీవితంలో చాలా భారంగా ఉండబోతుంది. తర్వాత నేను నా మనసులోని భారాన్ని దింపేసుకుని ఫ్రీ కాబోతున్నా.. అప్పుడు అంతా సంతోషమే.. కానీ రేపు గడిచేదెలా’ అంటూ తనలో తనే సంఘర్షణ పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ‘హాయ్ కార్తీక్’ అంటూ గుమ్మంలోంచి ఎంట్రీ ఇస్తుంది మోనిత. నువ్వేంటి ఇలా వచ్చావ్’అని కార్తీక్ చిరాకు మూడ్లో అనడంతో. నేను అంతే అడ్డదారుల్లో రావడం నాకు ఇష్టం ఉండదు.. మనదంతా రహదారి అంటూ పెద్దగా నవ్వుతుంది. ఇంతలో దీప, సౌందర్య భాగ్యం ఇంటి నుంచి వస్తారు. ‘ఏంటి దీపా.. బాగున్నావా? అదేంటి అప్పుడే అత్తా-కోడళ్లు బయట షికార్లు చేస్తున్నారంటు కాస్త రెస్ట్ తీసుకో దీప అని వెటకారంగా ఉంటుంది. వెంటనే కార్తీక్ అప్పుడే ఎందుకు బయటికి వెళ్లావు దీపా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ప్రేమ అనడంతో మోనిత రగిలిపోతుంది. ఇంతలో సౌందర్య.. ‘పిల్లలు ఎక్కడరా కనిపించడం లేదని కార్తీక్ని అడుగుతుంది. దీంతో కార్తీక్ వాళ్లను డాడీ దగ్గర ఫామ్ హౌజ్లో దింపి వచ్చాను మమ్మీ అంటాడు. అదేంటీ రేపు పూజ పెట్టుకునీ.. అంటు సౌందర్య మోనితని చూసి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయారు ఆంటీ.. పిలవని పేరంటంగా నేను వస్తాననా? నాకు రావాలని ఉంటే పిలవకపోయినా వస్తానుగా.. మీరు ఆగిపోకండి.. మాట్లాడండి’ అంటుంది మోనిత నవ్వుతూ. దాంతో సౌందర్య.. అలా ఎందుకు చేశావురా రేపు పూజలో పిల్లలు లేకుండా ఎలా?అంటుంది సౌందర్య. దాంతో మళ్లీ మోనిత కలుగజేసుకుని.. నిజమే కార్తీక్.. పెళ్లి అయ్యి పదేళ్లు అయినా.. పదేళ్ల కూతుర్లు ఉన్నా.. నీకు ఈ మాత్రం కూడా తెలియదు.. పూజలో ఆడపిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటే ఎంత అందంగా ఉంటుంది.. వెళ్లు.. వెళ్లి తీసుకొచ్చేసెయ్.. వెళ్లు వెళ్లు అంటూ కాస్తా చనువుగా మాట్లాడుతుంది మోనిత. అప్పటికే విసిగిపోయి ఉన్న కార్తీక్ ‘విల్ యు ప్లీజ్ సెట్ యువర్ మౌత్ మోనితా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా.. నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావ్? ఎన్నిసార్లు చెప్పినా నీకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది’ అని కార్తీక్ మోనితపై అరుస్తాడు. అలా అనేసరికి మోనిత షాక్లో దీప, సౌందర్యలు సంతోషంలో ఉంటారు. క్షమించు కార్తీక్. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవడం వల్ల నోరు జారాను.. రియల్లీ సారీ.. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మీరే మాట్లాడుకోండి.. నేనొస్తాను’ అంటూ మోనిత బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెంటనే సౌందర్య ‘పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని చెబుతుంది. దీంతో కార్తీక్ వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించేసి వచ్చాను.రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మోనిత కారులో వెళ్తూ జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతుంది. ‘ఇంతకాలం చేదు అయిపోయిన నీ పెళ్లాం ఇప్పుడు బెల్లమైపోయిందా కార్తీక్.. దాని ముందే నన్ను అవమానించావ్ కదూ.. చెబుతా.. రేపు ఈ టైమ్కి నువ్వు నా కాళ్ల దగ్గర ఈ కారు క్లచ్లా పడి ఉంటావ్. నిన్ను నేను వదలను’ అంటూ కోపంతో ఊగిపోతుంది. తరువాయి భాగంలో సౌందర్య దీపను కార్తీక్ గదిలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు కాస్తా మాటలు కలుపు అని చెబుతుంది. నేను ఇప్పుడు వెళ్లి ఏం మాట్లాడను అత్తయ్య వెళ్లను అంటుంది. అయినా సౌందర్య వెళ్లు ఏం కాదని చెప్పి పంపిస్తుంది. దీప గదిలోకి వెళ్లేసరి కార్తీక్ ఒకప్పుడు తాను చింపేసిన కవిత పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. ఇది చూసి దీప మరింత షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi:ప్రేమ్, శృతి మధ్య ప్రేమ చిగురిస్తోందా?
మెడిసిన్లో సీటు సంపాదించిన దివ్య తన చదువుకు ఇక ఏ ఢోకా లేదన్న సంతోషంలో మునిగి తేలుతోంది. కాలేజీలో మొదటిసారి అడుగు పెట్టబోతున్నందుకు తల్లి ఆశీర్వాదాలు తీసుకుంది. తండ్రికి కూడా ఓ మాట చెప్దామని వెళ్తే నందుకు బదులు లాస్య తారసడింది. దొరికిందే ఛాన్సనుకున్న లాస్య.. దివ్య మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం చేసింది. తులసితో ఏమీ కాదని, తల్లిని వదిలి వచ్చేయమని ఉచిత సలహా ఇచ్చింది. మరి దీనికి దివ్య ఏమని సమాధానమిచ్చింది? నేటి(జూన్ 2) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. చాలా రోజుల తర్వాత ప్రేమ్ను చూసిన శృతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దీంతో ఇంటి సభ్యులు ఆమెను ఆటపట్టించారు. ఇక సంగీతం ప్రాక్టీస్ చేస్తున్న ప్రేమ్ దగ్గరకు వెళ్లిన శృతి సరదాగా సెటైర్లు వేయడంతో అతడు ఆమె వెంటపడ్డాడు. అలా వీరిద్దరూ తమ మధ్య ఉన్న ఎడబాటును చెరిపేస్తూ స్విమ్మింగ్ పూల్లో పడి నీళ్లలో ఆడుకున్నారు. వీరి జలకాలాటలు చూసి తులసి, ఆమె మామయ్య ఆశ్చర్యపోయారు. దీంతో శృతి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తతో చెప్పలేక, అలా అని మనసులో దాచుకోలేక తెగ ఇబ్బందిపడింది. తనకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్న అభి దగ్గర ఇంత పెద్ద విషయం దాచి మోసం చేస్తున్నానేమోనని బాధతో కంటనీరు పెట్టుకుంది. ఒకవేళ నేను నీ దగ్గర ఏదైనా దాస్తే ఏం చేస్తావు? అని అంకిత అడగ్గా.. నువ్వు నా దగ్గర ఏదీ దాచలేవన్న నమ్మకం తనకుందని, ఒకవేళ అలా దాచితే అప్పుడు మన మధ్య ప్రేమ, నమ్మకానికి చోటు లేనట్లేనని అభి చెప్పడంతో అంకిత మరింత ఎమోషనల్ అయింది. ఇక దివ్య తను కాలేజీకి మొదటిసారి వెళ్తున్నానని, అందుకు ఆశీస్సులు కావాలంటూ తల్లి కాళ్ల మీద పడిపోయింది. నిజానికి తనకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయని, కాకపోతే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని, అందుకోసమే వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే కాలేజీకి వెళ్లేముందు నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోమని తులసి సూచించింది. నువ్వు డాక్టర్ కావాలని నాన్న ఎన్నో కలలు కన్నాడని చెప్తూ తప్పకుండా ఈ విషయం మీ నాన్నకు చెప్పి తీరాల్సిందేనని అనడంతో దివ్య నేరుగా లాస్య ఇంటికి వెళ్లింది. దివ్య తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయిన లాస్య మెడిసిన్ ఫీజు కోసం వచ్చావా? అని ఎగతాళి చేసింది. అయినా నువ్వు మీ అమ్మతో ఉంటే భవిష్యత్తు గంగలో కలిసినట్లేనని, చదువుకోలేవని మనసులో విషం నింపే ప్రయత్నం చేసింది. నీ తల్లిని నమ్ముకుంటే ఏమీ మిగలదని, సరాసరిగా ఇక్కడికి వచ్చేయమని సూచించింది. ఎందుకంటే నీకు తండ్రైన నందు ఇప్పుడు తనవాడని చెప్పింది. దీంతో ఒక్కసారిగా నవ్వేసిన దివ్య మా నాన్నకు నీ మీదున్న నమ్మకం కన్నా నా మీదున్న ప్రేమే ఎక్కువ అని చెప్పడంతో లాస్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. తన తల్లి దగ్గర సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పడంతో లాస్య ముఖం మాడిపోయింది. మరి దివ్య నందు ఆశీర్వాదాలు తీసుకుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: Gunasekhar: అందుకే ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు! -
గర్భం దాల్చిన అంకిత, అబార్షన్ చేయించుకోమన్న తల్లి
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిస్తుంటే నందు మాత్రం తన ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదన్న టెన్షన్లో మగ్గిపోతున్నాడు. అటు లాస్య మాత్రం తులసి ధైర్యాన్ని కుంగదీసేందుకు, ఆమెను ఒంటరిని చేసి చిత్తు చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. మరి నేటి (జూన్ 1) నాటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. లాస్య ఇంటికి వెళ్లొచ్చినందుకు అనసూయకు ఆమె భర్త చీవాట్లు పెట్టాడు. మనం నందు దగ్గరకు వెళ్లకూడదని, అతడికి బుద్ధి రావాలని, బంధాల విలువ తెలిసి రావాలని తెలిపాడు. అయితే కొడుకును చూసి రావడం తప్పేం కాదని తులసి అత్తకు మద్దతిస్తూనే అక్కడ తన వ్యక్తిగత విషయాలు చర్చించకూడదు అని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు అంకిత గర్భం దాల్చిన సంతోషకర విషయాన్ని తల్లితో పంచుకుంది. అయితే ఆమె ఊహించినదానికి భిన్నంగా అంకిత తల్లి పెద్ద నిట్టూర్పు విడిచింది. అదేమీ శుభవార్త కాదంటూ, పైగా భవిష్యత్తు అడ్డు అవుతుందని చెప్తూ అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చింది. వీలైతే ఈ విషయాన్ని అభికి చెప్పకుండా దాచమని సూచించింది. ఎందుకంటే అతడు కుదరదంటే పెద్ద రాద్ధాంతం అవుతుందని అభిప్రాయపడింది. అయినా ఇప్పుడు నీకు పిల్లలు కాదు, భవిష్యత్తు ముఖ్యమని నొక్కి చెప్పింది. దీంతో అంకిత ఇప్పుడేం చేయాలా? అని ఆలోచనలో పడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ప్రేమ్ వచ్చీరాగానే లాస్య ఇంటికి వెళ్లి నందు మీద చిర్రుబుర్రులాడాడు. మా అమ్మను వదిలేసి లాస్యతో బయటకు వచ్చేసినప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని చెప్పాడు. మా అమ్మ ఒక్కో మెట్టు ఎదగడం, మీరు రెండు మెట్లు దిగడం ఏకకాలంలో జరుగుతుందని, మీరు ఏదో ఒక రోజు మా అమ్మ కాళ్ల మీద పడతారని జోస్యం పలికాడు. దీంతో నందు, లాస్య భగభగమండిపోయారు. తులసి కావాలనే ప్రేమ్ను మిమ్మల్ని నిందించడానికి పంపిందని లాస్య చెప్పడంతో నందు మరింత ఆగ్రహం చెందాడు. ఇదిలావుంటే అంకిత తను గర్భవతినన్న విషయాన్ని భర్తకు చెప్తుందా? ఒకవేళ చెప్పిన తర్వాత అబార్షన్కు అతడిని ఒప్పిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్ ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం -
Devatha : సత్య-ఆదిత్యలపై రుక్మిణికి మొదలైన అనుమానం
సత్య గదిలోకి ఆదిత్య వెళ్లడాన్ని చూసిన కనకం అక్కడే తలుపు చాటున వాళ్ల మాటలన్ని వింటుంది. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన రుక్మిణి మనసులో అనుమానం అనే బీజాన్ని బలంగా నాటుతుంది. సత్య-ఆదిత్యల గురించి ఊళ్లో నానారకాలుగా మాట్లాడుకుంటున్నారని, అనుమానం రేకెత్తిస్తుంది. ఇక రుక్మిణి తన గదిలోకి వెళ్లగానే మరో షాక్ తగులుతుంది. తాను స్వయంగా తయారు చేసిన కృష్ణా-రాధల బొమ్మ తన బీరువాలో చూసి ఆశ్చర్యపోతుంది. సత్యకు ఇచ్చిన బొమ్మ ఆదిత్య బీరువాలో ఉండటం చూసి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే1న 247వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత సీరియల్ మే1 : సత్య గురించి దేవుడమ్మ అడిగే ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకుంటానని రుక్మిణి కనకంతో అంటుంది. తన చెల్లి అంటే తనకు ప్రాణం అని, తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే అని ధీటుగా బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే సత్యకు సడెన్గా ఎక్కిళ్లు రావడంతో పక్కన మంచినీళ్లు కోసం వెతుకుతుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదిత్య సత్య గదిలోకి వెళ్తాడు. నీళ్లందించి తన ఆరోగ్యం గురించి వాకబు చేస్తాడు. అయితే ఆదిత్య సత్య గదిలోకి వెళ్లడం గమనించిన కనకం వీళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని తలుపు చాటునే ఉంటుంది. ఇద్దరూ క్లోజ్గా మాట్లాడుకుంటున్న సమయంలో రుక్మిణి కూడా అక్కడికి వస్తే బాగుంటుందని కనకం అనుకుంటుండగానే ఆమె అక్కడికి వస్తుంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న కనకం సత్య-ఆదిత్యలు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారని, ఒకరి యోగక్షేమాల పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తున్నారని అంటుంది. అయితే ఇది మామూలు విషయమే అని, ఆదిత్య బావ కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెబుతున్నాడని రుక్మిణి జావాబిస్తుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో పాండిచ్చెరి వెళ్లి వెతికినా మీకు కనిపించలేదని, ఇప్పటికే సత్య-ఆదిత్యలపై ఊళ్లో జనాలు నానారకాలుగా మాట్లాడుతున్నారని రుక్మిణి మనసులో అనుమానపు బీజాన్ని రేకెత్తిస్తుంది. దీంతో అదే ఆలోచిస్తున్న రుక్మిణి తన గదిలోకి వెళ్లి బీరువా తెరవగా అక్కడ ఓ బొమ్మ చూసి షాకవుతుంది. అది కృష్ణ, సత్యభామల అందమైన బొమ్మ అది. అది స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారుచేసి సత్యకు తాను చదువుకుంటున్న సమయంలో ఇచ్చింది. మరి అది ఇక్కడికి ఎలా వచ్చింది? సత్యను ప్రేమించి మోసం చేసింది నా పెనిమిటేనా అని రుక్మిణికి సందేహం కలుగుతుంది. ఇలా జరగకూడదని, తాను అనుకుంటుంది నిజం కాకూడదని బాధపడుతుంటుంది. మరి రుక్మిణికి సత్య-ఆదిత్యల విషయం తెలుస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనిత కొత్త స్కెచ్.. భారతిని ఇంటికి పిలిచి..
కార్తీకదీపం జూన్ 1: కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెప్పి క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇటూ మోనిత.. కార్తీక్, దీపలు విడిపోయే పెద్ద సీక్రేట్కు రీవిల్ చేసేందుకు సిద్దమవుతుంది. మరోవైపు కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇన్ని సస్పెన్స్ల నడుమ కార్తీక్ దీపకు నిజం చెబుతాడా లేదా అనేది నేటి(జూన్ 1వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనిత డాక్టర్ భారతిని ఇంటికి పిలుస్తుంది. తనకు నచ్చిన మైసూర్ పాక్ స్వీట్ను ప్రియమణితో స్పెషల్గా చేయిస్తుంది. భారతి మోనిత నానా హడావుడి చేస్తూ భారతి స్వీట్ ఇస్తుంది. గదిలోకి వెళ్లి పండ్లు, చీర తీసుకోచ్చి.. దీపను చావు అంచుల నుంచి లాక్కొంచి కార్తీక్ ఆరోగ్యం అప్పగించావ్ కదా అందుకే ఇది ఇస్తున్నా అంటుంది. కానీ భారతి అది తీసుకునేందుకు ఇష్టపడదు. వద్దంటుంటే బలవంతంగా చీర ఇస్తుంది. ఇదంతా చూసి భారతి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి మోనిత ఏమైనా కొత్త నాటకానికి తెరలేపిందా అంటు అనుమానంగా ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. ఇక ఆమె వెళ్లిపోగానే మోనిత ‘ఇదంత భారతి కార్తీక్కు చెబుతుంది, కార్తీక్ వెళ్లి దీప, సౌందర్యలకు చెబుతాడు, ఆ తర్వాత నా ప్లాన్ ఏంటో తెలియక ఆ అత్త-కోడళ్లు తలలు పట్టుకుంటారు. ఇలోపు నేను చేయాల్సిన పని చేసేస్తా’ అని మనసులో అనుకుంటు నువ్వుకుంటుంది. గదిలో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప ధీనంగా కూర్చోని ఆలోచిస్తుంది. ఇంతలో సౌందర్య దీప కోసం జ్యూస్ తెచ్చి తాగమంటుంది. కార్తీక్ చెప్పబోయే విషయం ఏంటా అని దీప సౌందర్యతో అంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి ‘మమ్మీ మోనిత భారతిని పిలిచి చీర పళ్లు పెట్టిందట.. దీప కోలుకునేలా చేశావ్.. థాంక్యూ.. వాళ్లు ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయంలో ఉండిఉండరు. అందుకే వాళ్ల తరపున నేను ఈ చిరు కానుక ఇస్తున్నాను అంటూ భారతికి చీర పెట్టిందట.. పాపం పిచ్చిది’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సౌందర్య, దీప షాక్ అవుతారు. మోనితని పాపం పిచ్చిది.. అంటున్నాడు ఈ అమాయకుడు అని సౌందర్య తిట్టుకుంటుంది. దీప మనసులో రేపు ఈయన చెప్పబోయే విషయానికి మోనితకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మోనిత బాల్కనీలో కూర్చుని.. ఈ పాటికి ఆ అత్తాకోడళ్లకు తెలిసే ఉంటుంది. అర్థం కాక జుట్టు పీక్కుంటుంటారు. ఇలాగే నా లక్ష్యం కోసం ఏదొక అడుగు వేస్తూ ఏదోరోజు ఒక అడుగు కార్తీక్ ఇంట్లో వేస్తాను.. వెంటనే మంచి ముహూర్తం ఉంటే చూసిపెట్టుకోవాలి అనుకుంటుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తనకు తెలిసిన పంతులు ఫోన్ చేసి ఇవ్వమంటుంది. ప్రియమణి ఫోన్ చేసి ఇవ్వగానే మోనిత నేనొక మంచి పని తలపెడుతున్నాను పంతులుగారు.. మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అని అడుగుతుంది మోనిత. దీంతో ఆ పంతులు రేపు మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వా మూడు నెలల దాక మంచి ముహుర్తాలు లేవని చెబుతాడు. దాంతో మోనిత వెంటనే మనసులో ‘రేపే అంటే టైమ్ లేదే.. ఇంత తక్కువ టైమ్లో అంత పెద్ద స్కెచ్ వెయ్యడం ఎలా అబ్బా? ఏది ఏమైనా సరే.. రేపటితో నేను అనుకున్నది జరగాలి.. జరిగి తీరాలి..’ అని నిర్ణయించుకుంటుంది. కార్తీక్ బయటికి వెళ్లబోతుంటే.. దీప డాక్టర్ అని పిలిచి ఆపగా.. ఏం కావాలి, చీరలా, పండ్లా.. ఏం తేవాలి దీపా అని అడుగుతాడు. అవేం కాదు డాక్టర్ బాబు.. మీరు చెబుతానన్న విషయం ఏంటో.. అది అంటుంది దీప. వెంటనే కార్తీక్ రేపు నేను చెప్పబోయే విషయం.. నా జీవితానికి సంబంధించినది అంటాడు. అంటే నా జీవితానికి సంబంధంలేనిదా అని దీప ప్రశ్నించగా.. ‘నా జీవితంతో ముడిపడే కదా నీ జీవితం’ అంటాడు కార్తీక్. ‘నా మనసు ఆగడం లేదు డాక్టర్ బాబు.. మీరు చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది.. ఇప్పుడే చెప్పొచ్చు కదా? నా గుండె దడ తగ్గుతుంది?’ అంటుంది దీప రిక్వస్ట్గా. దీంతో కార్తీక్ తాను తప్పు చేశానని, అది నా నోటితో నేను చెప్పడానికి నన్ను నేను సిద్దం చేసుకోవాలంటే దానికి కొంచం టైం కావాలి అంటాడు. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి కారులో వెళ్లిపోతాడు. అనంతరం దీప ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగంలో పూజకు అందరు సిద్దంగా ఉంటారు. దీప, సౌందర్య, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని సౌందర్య చెప్పగా ‘వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించి రమ్మన్నాను.. రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు..’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరగనుందనేంది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: తప్పు చేశానన్న కార్తీక్.. బాంబు పేల్చడానికి సిద్దమైన మోనిత
కార్తీకదీపం మే 31: బుల్లితెర ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అందరూ కోరుకున్నట్టుగానే దీప కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ తనని పట్టించుకోకుండా దీప మీద ప్రేమ కురిపిస్తుండటంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ పూర్తిగా మారిపోయాడని తెలుసుకున్న మోనిత ఎలాంటి కుట్ర పన్ననున్నందో నేటి(మే 31) ఎపిసోడ్లో తెలుసుకొండి.. దీప కోలుకుని ఇంటికి వస్తుంది. మరోవైపు మోనిత నిరాశగా కూర్చోని దిగులుగా ఉండగా ప్రియమణి.. మోనితకి కాఫీ తెచ్చిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడుస్తూ కూర్చుంటారు, కార్తీక్ అయ్యకి.. ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదమ్మా? ఏంటమ్మా మీరు ఏడుస్తున్నారు.. వాళ్లింటికి వెళ్లి ఇష్టమొచ్చినట్లు దులిపెయ్యండి అంటుంది. అంటే కార్తీక్ అయ్యని నమ్ముకున్నవాళ్లలో ఎవరో ఒకరు ఏడవాల్సిందేనా.. మీకేం ఖర్మమ్మా.. మీరు పడే బాధేంటో ఆవిడకు తెలిసి తీరాలని ఏవేవో చెబుతుంది. అది వింటు మోనిత మనసులో ‘ఊరుకో ప్రియమణీ.. నేను దీపని కాదు సర్దుకుపోవడానికి.. మోనితని.. మోసం చేసే వాళ్లని క్షమించను.. కొడతా.. కోలుకోలేని దెబ్బ కొడతా.. నా ప్రేమతో ఆడుకుంటే ప్రేమించినవాడు అని కూడా చూడను.. అతి త్వరలో విడుదల కానుంది ఒక భయంకరమైన చిత్రం’ అంటూ నవ్వుకుంటుంది. సౌందర్య కార్తీక్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చార్రా అని కనుక్కుని పిల్లలతో ఆనందంగా ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్తుంది. హిమ, శౌర్యలు అమ్మ నాన్నకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం అంటూ పైకి వెళతారు. ఇంతలో మోనిత ఫోన్ చేయడంతో సౌందర్య.. శుభమా అని దీప కోసం ఎదురు చూస్తుంటే ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేసింది..చూద్దాం అంటు లిఫ్ట్ చేస్తుంది. ఆంటీ దీప ఇంటికి వచ్చిందా? అని అడగ్గా.. ఇంకా రాలేదని చెబుతుంది సౌందర్య. ‘అయ్యో ఏమైందని వెటకారంగా అనడంతో.. ఏం కాలేదు.. ఇకపై ఏం కాదు కూడా.. అయినా ఇంకా రాలేదు అంటే.. దారిలో ఉంది.. వస్తూ ఉందని అర్థం.. ఇది తెలుసుకోవడానికి ఫోన్ చేశావా అని మోనితకు సౌందర్య కౌంటర్ వేస్తుంది. లేదు ఆంటీ దీప ఉంటే విష్ చేద్దామని ఫోన్ చేశాను అంటుంది మోనిత. అంతేగాక ఇక నుంచి నువ్వు మా మీద ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సౌందర్య అనడంతో ఏం.. ఎందుకు ఆంటీ అని అడుగుతుంది మోనిత. అది అంతేలే.. చూడు నేను ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నాను.. ఇలా మాట్లాడి దాన్ని కాస్తా చెడగొట్టకని సౌందర్య అనగానే మోనిత నవ్వుతూ.. అలా అనకండి ఆంటీ ఎలాంటి మూడ్నైనా చెడగొట్టే టాలెంట్ నాలో ఉంది.. సరే మీరు హ్యాపీ మూడ్లో ఉన్నారు కదా.. ఇలా ఎన్ని రోజలు ఉంటారో నేను చూస్తాను అని మోనిత హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతుంది. అది విని సౌందర్య ‘ఏంటే నువ్వు చూసేది ఇప్పుడు నా కొడుకు చాలా మారిపోయాడు.. నా కోడల్ని బంగారంలా చూసుకుంటున్నాడు.. నువ్వు చెప్పే సోది వినడం అవసరమా చెప్పు.. పెట్టెయ్ ఫోన్’ అని విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పెట్టేశాక మోనిత మనసులో ‘నీ కోడలు దీప బంగారం అయితే మరి నేనేంటి? ప్లాటినమ్నా? దానికంటే నేనే ఎక్కువని రుజువు చేస్తాను.. ఫేస్ చెయ్యడానికి రెడీగా ఉండండి ఆంటీ అని మనసులో పడిపడి నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప, కార్తీక్ల కారు వస్తుంది. దీప దిగగానే కార్తీక్ ఆమె పట్టుకుని నడిపించుకుంటు వస్తాడు. వాళ్లను గుమ్మం దగ్గరే ఆపి సౌందర్య శ్రావ్యను పిలిచి హారతి ఇచ్చి ఆనందంతో మురిసిపోతు ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సౌందర్య. లోపలికి వెళ్లగానే పిల్లలు తల్లిదండ్రులకు పూలు చల్లి గ్రాండ్ వెల్కం చెబుతారు. సంతోషంగా కిందకు దిగి దీపని హత్తుకుని ముద్దాడతారు. తర్వాత కార్తీక్ దీపల మధ్యకు వచ్చిన రౌడీ.. కార్తీక్ చేతిని దీప చేతికి కలుపుతూ.. ‘మీరిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్సే కదా..’ అంటుంది. కార్తీక్ అవునంటాడు. ఆ తర్వాత శౌర్య ‘నువ్వే మా నాన్నవని తెలిసినప్పుడు, హిమ నా చెల్లి అని తెలిసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు నాన్నా.. ఏదో వెలితిగా ఉండేది.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అంటు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని తాను తెలుసుకున్న నిజం గురించి చెప్పి దీపను క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇంతలో సౌందర్య శుభవార్తనే అని అడగ్గా మీరందరూ పండగ చేసుకునే వార్త అనడంతో సౌందర్య భాగ్యం చేయించాలనుకున్న పూజ గురించి చెబుతుంది. ఈ శుభావార్త ఏదో దేవుడు ముందు చెప్పమని, అందరికి శుభం జరుగుతుందంటుంది.దీంతో కార్తీక్ కూడా అందరి ముందే చెప్పడమే కరెక్ట్ అంటాడు. అందరు ఉన్నప్పుడు చెబితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. కొంతైనా న్యాయం చేశానేమో అనిపిస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతాడు. దీంతో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప కంగారు పడుతుంది. ఇక తరువాయి భాగంలో.. దీప అదేంటో ఇప్పుడే చెప్పండి డాక్టర్ బాబుని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నేనొక తప్పు చేశాను దీపా.. అంటాడు కార్తీక్ తలదించుకుని. ‘మీరా..’ అంటుంది దీప అనుమానంగా ఆశ్చర్యంగా. ‘అవును నేనే.. అది నా నోటితో నేను చెప్పడానికి.. చాలా ఎక్స్సైజ్ చెయ్యాలి.. ప్రాక్టీస్ కావాలి.. అందుకే నాకు కొంచెం టైమ్ కావాలి.. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా..’ అంటాడు కార్తీక్ ఎమోషనల్గా రిక్వస్ట్గా. దీప ఆలోచనగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రేపే సరైన సమయం చూసి బాంబు ఎలా పెల్చాలా అని మోనిత ప్లాన్ చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : తన బిడ్డకు తండ్రి కావాలంటున్న సత్య.. ఆదిత్య ఒప్పుకుంటాడా?
సత్యను ఇంట్లోకి తెచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తూ సంబరపడిపోతుంది. ఇక సత్య తీరుపై కనకం పరోక్షంగా నిప్పులు కక్కుతుంది. ఆమెను అనరాని మాటలతో చిత్రవద చేస్తుంది. సూటి పోటి మాటలతో సత్యను బాధపెడుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ క్షణం అయినా నిజం తెలుస్తుందని భయపడిపోతుంది. మరోవైపు తన బిడ్డను అనాథగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య ఆదిత్యతో అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే30న 247వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత సీరియల్ మే30 : సత్యను ఇంటికి తీసుకొచ్చేందుకు సహకరించిన ఆదిత్యకు రుక్మిణి ధన్యవాదాలు తెలుపుతుంది. తన మనసుకు కష్టం కలుగుతుందని తెలిసి దేవుడమ్మకు ఇష్టం లేకపోయినా సత్యను ఇంటికి రానిచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అంటూ పొంగిపోతుంది. ఇక సత్యను ఇంట్లోకి తేవడం ఏమాత్రం ఇష్టం లేని కనకం సత్యను పరోక్షంగా ఆడిపోసుకుంటుంది. కొంచెం కూడా సిగ్గూ, మానం, మర్యాద లేని బతుకులు అని నిందలేస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని దేవుడమ్మ భర్త ప్రశ్నించగా..వేరే బయట అడుక్కునే వాళ్ల గురించి అని బదులిస్తుంది. కానీ అక్కడున్న వారందికి ఆమె సత్యనే అంటుంది అని అర్థమైపోయింది. ఇలాంటి వారు బతకడం కంటే చావడం మేలని సూటిపోటి మాటలతో సత్యను బాధపెడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల నిస్సహాయ స్థితిలో కుమిలిపోతుంది. నిజం చెబితే రుక్మిణి, చెప్పకపోతే సత్య జీవితాలు నాశనం అవుతున్నాయంటూ బాధపడుతుంటుంది. ఇక మరోవైపు కనకం అన్న మాటలను తలచుకొని సత్య బాధపడుతుంది. ఈలోగా అక్కడికి ఆదిత్య చేరుకుంటాడు. కనకం అన్న మాటలను సీరియస్గా తీసుకోవద్దని అంటాడు. అయితే తాను బాధపడుతుంది కనకం అన్నందుకు కాదని, తన బిడ్డకు తండ్రి లేని వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. తన బిడ్డను అనాథగా ఈ లోకానికి చూపించలేనని చెప్తుంది. మరి సత్య మనసులో ఏముందో ఆదిత్య తెలుసుకుంటాడా? సత్య బిడ్డకు తండ్రి స్థానాన్ని ఆదిత్య తీసుకోగలడా అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: అత్తకు తులసి స్ట్రాంగ్ వార్నింగ్!
తన ఇంటితో అన్ని బంధాలు తెగదెంచుకున్నాక నందు మొదటిసారి మళ్లీ తన ఇంటికి చేరాడు. అయితే అతడు వచ్చింది ఆమె మీద ప్రేమతోనో, ఏదో పని మీదో కాదు! తులసి మీద కోపంతో. తులసి తనను మోసం చేస్తుందన్న భ్రమలో ఉన్న నందు పూటుగా తాగి నానా రచ్చ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? నందు తిరిగి లాస్య ఇంటికి వెళ్లాడా? లేదా? అనేది తెలియాంటే ఇది చదివేయండి.. నందు పూటుగా తాగి లాస్య ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. తన కష్టార్జితంతో దివ్య ఫీజు కడదామనుకుంటే నువ్వు డబ్బులిచ్చి తనను అసమర్థుడిలా నిలబెట్టావని కోపంతో ఊగిపోయాడు. అలా వీళ్లిద్దరి మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. తాగిన మైకంలో ఏదేదో వాగిన నందు చివరికి అక్కడే నిద్రలోకి జారుకున్నాడు.దీంతో అతడిని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పింది తులసి. మరోవైపు నందును పంపించమంటూ లాస్య ఇంట్లోకి రాగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తులసి చెడామడా తిట్టేసింది. మరోవైపు మగత నిద్రలోకి జారుకున్న నందు.. తన మీద తులసికి భయం, గౌరవం, ప్రేమా ఏవీ లేవని మైకంలో మాట్లాడుతుండగా విన్న తులసి బాధతో తల్లడిల్లిపోయింది. నిన్ను ఎప్పటికీ నమ్మను అంటుంటే విలవిల్లాడిపోయింది. తన ప్రేమ ఎన్నటికీ అర్థమవుతుందోనని నిట్టూర్పు విడిచింది. ఇక తెల్లారిన తర్వాత నందు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అనసూయ తన కొడుక్కి కనీసం టీ, కాఫీ కూడా ఇవ్వడం లేదని తులసి మీద ఆగ్రహించింది. దీనిపై తులసి మాట్లాడుతూ.. అతడు ఈ ఇంటి మనిషి కాడని, తను కాఫీ ఇస్తే తీసుకోడని అభిప్రాయపడింది. ఆమె అనుకున్నట్లుగానే నందు కూడా తనకేవీ అక్కర్లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక నందు తల్లి అనసూయ కూడా లాస్య ఇంటికే వచ్చేస్తానని అడిగింది. కానీ ఆమెకు ఎక్కడ సపర్యలు చేయాల్సి వస్తుందోనని లాస్య అందుకు నిరాకరించింది. తులసి మీద పగ తీర్చుకున్న తర్వాతే ఈ ఇంటికి వచ్చేయమని సలహా ఇచ్చింది. అది కూడా కరెక్టే అంటూ తిరిగి తన ఇంటికి చేరిన అనసూయకు చుక్కెదురైంది. ఇక్కడి వార్తలను అక్కడికి మోసుకెళ్లిన అత్త మీద ఫైర్ అయింది తులసి. కొడుకును చూసి రావొచ్చు అని చెప్పాను కానీ, తన వ్యక్తిగత విషయాలు అక్కడ చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగనుందో చూడాలి. చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన రకుల్.. కారణం ఇదేనట! -
Devatha : సత్యను తనతో ఇంటికి తీసుకెళ్లిన రుక్మిణి
రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్లడానికి భాగ్యమ్మ ఇంటికి వెళ్తుంది. వద్దని కమల ఎంత చెప్పినా రుక్మిణి వినిపించుకోదు. మరోవైపు తన వ్యూహాం అమలవుతున్నందుకు సత్య మురిసిపోతుంది. పైకి మాత్రం వద్దని నటిస్తూ లోలోపల సంబరపడిపోతుంది. ఇక సత్యను చూడగానే కనకం మండిపోతుంది. తనను ఇంట్లోకి రానివచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే29న 246వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడమ్మ ఇంట్లోకి ఎలా అయినా వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, ఇక బతకడమే వ్యర్థమని డ్రామాలు ఆడుతుంది. అదే సమయంలో అక్కడికి రుక్మిణి వస్తుంది. నువ్వు చచ్చి ఇంక ఎంత మందిని చంపుతావాంటూ సత్యపై కోప్పడుతుంది. సత్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చానని చెప్తుంది. అయితే సత్యపై ఇప్పటికే దేవుడమ్మకు చాలా కోపం ఉందని, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని కమల వారిస్తుంది. అయినప్పటికీ రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక సత్యను రుక్మిణి ఇంట్లోకి తెస్తుండగా కనకం అడ్డుపడుతుంది. దేవుడమ్మ ఇంట్లో లేని సమయంలో సత్యను తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్తుంది. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని, నందాను తీసుకొచ్చి మోసం చేసిందని ఇలాంటి వ్యక్తిని లోపలికి తేవద్దని మందలిస్తుంది. దీంతో ఆదిత్య అడ్డుపడి తన తల్లి ఊళ్లోకి రాగానే తానే సంజాయషీ చెప్పుకుంటానని చెప్తాడు. సత్య గురించి తప్పుగా మాట్లాడొద్దని కనకంతో వాదిస్తాడు. ఇక సత్యను లోపలికి తీసుకెళ్లమని రుక్మిణికి చెప్పడంతో ఆమె సత్యను ఇంట్లోకి తీసుకెళ్లుంది. ఆదిత్య విషయం ముందే తెలియడంతో కనకం మండిపోతుంది. త్వరలోనే ఈ నిజం తెలిసి మీరంతా గుండె పగిలి ఏడుస్తారని తనలో తానే అనుకుంటుంది. ఇక సత్యను ఇంట్లోకి రానిచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను దేవుడిలా ప్రశంసిస్తుంది. -
karthika Deepam: మోనిత దీప చావు కోరుకుందని కార్తీక్తో చెప్పబోయిన భారతి
కార్తీకదీపం మే 29: దీప ఉన్న ఐసీయూ గది ముందు నిలబడి కార్తీక్ నువ్వు బతకాలి దీప అని మనసులో అనుకుంటు దీనంగా చూస్తుంటాడు. ఇంతలో దీప పల్స్ రేట్ పడిపోవడం ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. అది చూసి కంగారుగా వెళ్లి డాక్టర్ భారతి, గోవర్థన్లను తీసుకువస్తాడు. దీంతో భారతి దీపను చెక్ చేస్తుంటే ఏమైంది.. ఏమైందని అడగుతూ ఆడుగుతుంటాడు. భారతి కార్తీక్ను బయటకు వెళ్లమని చెబుతుంది. ఇక ఆ తర్వాత బయట దిగులుగా ఉన్న కార్తీక్ భారతి వచ్చి దీప కోలుకుందనే శుభవార్త వినిపిస్తుంది. దీపను చూసేందుకు గదిలోకి వెళ్లిన కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెబుతాడా లేదా అనేది నేటి(మే 29) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. బయట దిగులుగా ఉన్న కార్తీక్ దగ్గరికి డాక్టర్ భారతి వచ్చి దీప సేఫ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అతడి మొహంలో చిరునవ్వు వస్తుంది. వెంటనే దీపను చూడటానికి వెళతానని కదలబోతుండగా భారతి కార్తీక్ అని పిలిచి ఆగిపోతుంది. మనసులోనే మోనిత నిజస్వరూపం చెప్పాలి.. ఆమె దీప చావు కోరుకుందని చెప్పేస్తా అనుకుంటుంది. కానీ ఇప్పుడే ఇంత ఆనందంలోనే ఉన్న కార్తీక్ ఈ విషయం చెప్పి మెంటల్గా డిస్టర్బ్ చేయడం ఎందుకనుకుంటుంది. కానీ ఎప్పటికైనా మోనిత డెంజర్ అనే విషయం కార్తీక్కు చెప్పి తీరాలని ఆలోచిస్తుంటే. ఇంతలో కార్తీక్ ఏంటని అడగడంతో.. దీప సృహలోకి వచ్చింది. ఇప్పుడు నీతో పాటు నడిచి వచ్చేలా ఉందని భారతి అనడంతో కార్తీక్ సంతోషంగా అవునా అంటు దీప గదికి వెళ్లబోతుంటే ఇంతతో ఆదిత్య క్యారేజ్ తీసుకుని వస్తాడు. ‘అరే.. ఆదిత్య మీ వదిన సృహలోకి వచ్చిందట.. చూసొస్తాను’ అంటూ పరుగుతీస్తాడు. కార్తీక్ దీప గదిలోకి ఆమెనే చూస్తూ.. దీప తలని నిమురుతాడు. ఆ తర్వాత పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ‘ఏది నా చదువు? ఏది నా సంస్కారం.. ఎక్కడో నన్ను నేను పొగొట్టుకున్నాను.. నన్ను నేను వెతుక్కునే సరికి పదేళ్లు పట్టింది.. ఈ పదేళ్లలో నువ్వు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నావ్.. నేను అందరానంత పాతాళానికి జారిపోతూనే ఉన్నాను.. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి.. ఇది అన్నపూర్ణమ్మ చెయ్యి.. వంటలక్కా అని ఈసడించుకున్నాను.. ఏది నాకు పాప పరిహారం’ అని చేతిని ముద్దాడతాడు. అలాగే ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు. మన బిడ్డల పుట్టుకని కూడా అవమానించాను. వీటన్నింటికీ క్షమాపణ చెప్పుకోవాలి. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను’ అంటు కన్నీరు పెట్టుకని దీప చేయిని నిమురుతాడు. కార్తీక్ స్పర్శతో కళ్లు తెరిచిన దీప కార్తీక్ మాట్లాడాక, పిల్లల గురించి ఆరా తీస్తుంది. ఆ తర్వాత దీప మోనిత గురించి అడుగుతుంది. అప్పుడే వెళ్లిపోయిందని కార్తీక్ చెప్పడంతో నిజమేనా డాక్టర్ బాబు. లేకపోతే. నేనేమైనా అనుకుంటానని చెబుతున్నారా అని దీప అంటుంది. ‘నేను దాచింది నీ ప్రాణాంతమైన జబ్బు గురించి మాత్రమే. .అంతకు మించి నేను ఏ అబద్దం లేదు. ఏం ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో రేపు ఉదయం నిన్ను డిశ్చార్జ్ చేస్తారు, మన ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని బుగ్గమీద ప్రేమగా తట్టుతాడు. కార్తీక్ స్పర్శ తగిలిన వెంటనే దీప తన బుగ్గని తడుముకుంటూ ‘ఈ మత్తులో ఇలా అనిపిస్తుందా.. లేక ఇది నిజమేనా.. డాక్టర్ బాబు ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకులా మాట్లాడుతున్నప్పుడు ఎటూ చూడకుండా నా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతున్నారు.. ఇక నుంచి జాలి చూపిస్తున్నారా అని అస్సలు అడగను’ అనుకుంటుంది దీప మనసులో.. మరోవైపు మోనిత టాబ్లెట్స్ వేసుకుంటుంది. ప్రియమణి ఈ టాబ్లెట్ ఎందుకని ఆరా తీయగా నిజం చెప్పించే టాబ్లెట్ అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత నిన్ను ఒక్కటి అడుగతాడు నిజాయితిగా నిజం చెప్పు అని కార్తీక్ మంచివాడా చెడ్డవాడా. అని అడుగుతుంది. తండ్రిగా, కొడుగ్గా, భర్తగా కార్తీకయ్య బంగారం లాంటోడని, ప్రియుడిగా మాత్రం చెడ్డొడు అంటుంది ప్రియమణి. దీంతో మోనిత కోపంగా చూడటంతో అంటే మిమ్మల్ని కరివేపాకులా చూస్తాడు కదమ్మా అందుకే అలా అన్నానని అనగా.. నువ్వు సూపర్ ప్రియమణి.. నాకు చాలా ప్రశ్నలకు జవాబు దొరికేలా చేశావ్ కీప్ ఇట్ అప్.. వెళ్లు వెళ్లి పని చూసుకో అంటుంది మోనిత. మనసులో నువ్వు భయపడుతూ చెప్పినా నిజమే చెప్పావు ప్రియమణి. కార్తీక్ తన కుటుంబం గురించి తప్పా.. ఈ మోనిత గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి ఇప్పుడు నేను కార్తీక్ విషయంలో చేస్తున్న పని ఏ మాత్రం తప్పు కాదని అర్ధమైంది అనుకుంటుంది. కార్తీక్ హాస్పిటల్ చైర్లో నిద్రపోతుంటే.. ఆదిత్య వచ్చి నిద్రలేపుతాడు. అయ్యో ఈ రోజు 8 గంటలకే దీప డిశ్చార్జ్ కదా.. నిద్రపట్టేసింది.. అంటూ కంగారుపడుతుంటే.. ‘అదంతా నేను చూసుకుంటాను.. నువ్వు వదిన దగ్గరకు వెళ్లు’ అంటాడు ఆదిత్య. అక్కడ దీప ఇంటికి వస్తుందని సౌందర్య దేవుడికి పూజా చేసి దండంపెట్టుకుంటుంది. ఇంతలో పిల్లలు అమ్మ ఎప్పుడొస్తుంది అనడంతో.. ‘స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకోండి.. అమ్మ వచ్చేస్తుంది’ అని నచ్చజెప్పి పంపించి.. దేవుడికి థాంక్స్ చెబుతుంది. ‘ఇక మీదట కార్తీక్ దీపలు సంతోషంగా ఉండాలని వేడుకుంటుంది. ఇక దీప లేచి బెడ్ మీద కూర్చుంటుంది. కార్తీక్ దీప రూమ్లోకి వెళ్తాడు. మొదటిసారి కార్తీక్ దీప తన భార్య స్థానంలో ఇంటికి తీసుకువెళ్లబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరగనుందో సోమవారం నాటి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్య-ఆదిత్యల ప్రేమ విషయాన్ని కనకంతో చెప్పేసిన నందా
రుక్మిణి సహాయంతో దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకోసం భాగ్యమ్మ వద్ద మొసలి కన్నీళ్లు కారుస్తుంది. త్వరలోనే తన ప్లాన్ సక్సెస్ కానుందని సంతోషపడిపోతుంటుంది. మరోవైపు ఆదిత్యపై కోపంతో రగిలిపోయిన నందా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని కనకంతో చెప్పేస్తాడు. మరి నిజం తెలిసిన కనకం ఏం చేస్తుంది? ఆదిత్య-సత్యల విషయం అందరికి తెలిసిపోతుందా? లాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే28న 245వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణిని అడ్డు పెట్టుకొని ఎలా అయినా దేవుడమ్మ ఇంట్లోకి ప్రేవేశించాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే భాగ్యమ్మతో తన జీవితం ఇలా అయ్యిందంటూ నటిస్తూ కన్నీళ్లు కారుస్తుంది. ఇది చూసిన భాగ్యమ్మ చలించినపోయి రుక్మిణికి ఫోన్ చేసి సత్య పరిస్థితి గురించి చెబుతుంది. ఇలానే వదిలేస్తే సత్య మనకు బతకదని బాధపడుతుంది. భాగ్యమ్మ మాట్లాడుతుండటాన్ని గమనించిన సత్య త్వరలోనే ప్లాన్ సక్సెస్ అవుతుందని సంబరపడిపోతుంటుంది. మరోవైపు సత్యను ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని రుక్మిణి ఆదిత్యను బతిమాలుతుంది. దేవుడమ్మను ఒప్పించే బాధ్యత నీదేనని చెప్పి ఆదిత్య కాళ్లు పట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే తనను కొట్టినందుకు ఆదిత్యపై నందా పగతో రగిలిపోతాడు. ఆదిత్య-సత్యల బండారం బయటపెట్టి ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కనకంకు ఫోన్ చేసి సత్య కడపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని చెప్పేస్తాడు. దీంతో షాకైన కనకం ఆదిత్య ఇంత కథ నడిపించాడా అని ఆశ్చర్యపోతుంది. దీన్నే అస్త్రంగా మార్చుకొని దేవుడమ్మపై తాను పెత్తనం చెలాయించాలని భావిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యకు నందా ఫోన్ చేస్తాడు. మీ ఇంట్లో ఒకరికి నిజం చెప్పేసానని, ఇక రుక్మిణికి నిజం తెలియకుండా జాగ్రత్త పడమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో ఈ నిజాన్ని నందా ఎవరికి చెప్పాడో తెలియక ఆదిత్య కంగారుపడతాడు. ఆదిత్య గురించి కనకం అందరికి చెప్పేస్తుందా? దేవుడమ్మకు ఈ నిజం తెలియనుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: కార్తీక్ స్పర్శతో కళ్లు తెరిచిన దీప
కార్తీకదీపం మే 28: కార్తీక్, మోనితతో నా భార్య బతకాలి అంటూ దీప మీద ప్రేమ, కన్సర్న్ చూపించడంతో మోనిత తట్టుకోలేపోతుంది. దాంతో తాను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీపకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనని మత్తలోకి వెళ్లకుండా మెలకువతో ఉండమని చెబుతారు. మరోవైపు సౌందర్య బయట కూర్చోని దీప అరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది. మరి దీప ఆరోగ్యం బాగావుతుందా, కార్తీక్ ప్రవర్తనతో రగిలిపోతున్న మోనిత ఏం చేయనుందో నేటి ఎపోసిడ్(మే 28) ఇక్కడ చదవండి.. కార్తీక్, సౌందర్య దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటుండగా.. డాక్టర్ భారతి వచ్చి ఫార్మాలిటీస్ మరిచిపోయాను.. సైన్ చెయ్యి అనడంతో కార్తీక్ సైన్ చేస్తాడు. అది చూసి దీపకు ఏమౌంతుందోనంటూ భయపడుతున్న సౌందర్యకు.. దానికి ఏం కాదు మమ్మీ అంటు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు కార్తీక్. అప్పటికే పిల్లలు దీప కోసం కంగారుపడుతుంటే ఆదిత్య వారికి ఓదార్పు మాటలు చెబుతుండగా.. సౌందర్య ఇంటికి రావడంతో నానమ్మ అంటు హిమ, శౌర్య దగ్గరకి వెళ్లి పట్టుకుని ఏడుస్తారు. అమ్మకు ఏమైనా అవుతుందని భయపడుతున్నారా, అక్కడ దానికి ఏం కాలేదు రెండు రోజుల్లో ఇంటికి వస్తుందంటూ మనసులో భయపడతూనే పిల్లలకు ధైర్యం చెబుతుంది. అది గమనించిన ఆదిత్య పిల్లలు మాలతితో వెళ్లగానే ఏంటి వదిన పరిస్థితి బాగాలేదా అని అడగ్గా అవునని తల ఊపుతుంది, దీప ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తుంది. ఐసీయూలో పడుకుని ఉన్న దీపను కార్తీక్ బయట డోర్ నుంచి చూస్తూ.. ‘నువ్వు బాగుండాలి దీపా.. నీకేం కాకూడదు.. క్షేమంగా బయటికి రావాలి. ఇక నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను దీపా.. కష్టాలే లేని నీ స్వప్నలోకాన్ని నీకు అందిస్తాను’ అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దీపకు పల్స్ పడిపోయి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. దీంతో కార్తీక్ కంగారుగా భారతి దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘భారతి.. గోవర్ధన్... దీపా పల్స్రేట్ పడిపోతుంది.. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది’ అని కంగారుగా పడుతుండటంతో ‘వాట్?’ అంటూ గోవర్ధన్తో పాటు భారతి కంగారుపడుతూ.. దీప ఉన్న ఐసీయూలోకి పరుగుతీస్తారు. ‘‘భారతి దీపను చెక్ చేస్తుంటే మధ్యలో కార్తీక్ ఏమైంది.. ఏమైంది అంటూ ఆందోళన పడుతుంటాడు. దీంతో భారతి డాక్టర్ గోవర్ధన్తో కార్తీక్ని ఐసీయూ నుంచి బయటికి తీసుకెళ్లమని చెబుతుంది. ఇదిలా ఉండగా హాస్పిటల్లో జరిగిదంతా తలుచుకుంటూ మోనిత కోపంతో మండిపోతుంది. అదే సమయంలో ప్రియమణి భోజనం తెస్తుంది. కార్తీక్ దీపల గురించి ఆరా తియ్యడంతో ఆ ప్లేట్ విసిరి కొట్టి.. క్లీన్ చెయ్ అంటూ ముందు గదిలోకి వస్తుంది మోనిత. ‘దీప అనారోగ్యం కార్తీక్లో ఇంత మార్పుకు కారణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.. ఇన్నాళ్లు దీపకు దూరంగా ఉంటే ఏదో ఒకరోజు నాకు దగ్గర కాకపోతాడా అని ఆశతో ఉండేదాన్ని. కానీ ఈ రోజుతో అది అడియాశేనని తేలిపోయింది. ప్రేమగా కార్తీక్ని నా కార్తీక్ అనుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది.. నా కార్తీక్ని నాకు దూరం చేసిన ఆ దీపని మాత్రం కార్తీక్కి దగ్గర అవ్వనివ్వను.. అలాగే ఆ దీపని అస్సలు ఉండనివ్వను. కార్తీక్ దీపలు కలిసి సంతోషంగా ఎలా ఉంటారో నేనూ చూస్తా, ఇప్పుడే కాదు.. ఇంకో 100 ఏళ్లు అయినా మిమ్మల్ని కలవనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది.. ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను’ అంటు ఉన్మాదంగా ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన సౌందర్య.. కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ అనుమానమే లేదు పెద్దోడిలో మార్పు వచ్చింది. దీపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ పదేళ్లుగా రాని మార్పు ఈ రెండు రోజుల్లో ఎలా వచ్చింది? ఏం జరిగి ఉంటుంది? అని ఆలోచిస్తుంది. ఏమైతేనేం వాడిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు దీప చూస్తుందో లేదా అంతా నీదే భారం స్వామి అని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర కార్తీక్ దీప గురించి బాధపడుతూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి.. నువ్వు మంచివాడివి కార్తీక్.. నీకు ఆ దేవుడు అన్యాయం చేయడు, దీప సేఫ్ అనడంతో ఒక్కసారిగా కార్తీక్ ప్రాణాలు లేచోస్తాయి. దీంతో నేటి ఎపిపోడ్ పూర్తిఅవుతుంది. తరువాయి భాగం.. సృహలో లేని దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి.. తల నిమురుతూ.. ‘రెండే రెండు రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండరు అనిపించేలా.. మనం ఉందాం..’ అంటాడు. వెంటనే దీప పక్కనే కూర్చుని.. దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని.. ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు.. క్షమించరాని ఘోరమైన అపరాదం.. వీటన్నింటికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి.. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను..’ అంటూ దీప చేతుల్ని ముద్దాడుతూ ఏడుస్తుండగా, ఆ స్పర్శకు దీప కళ్లు తెరిచి చూస్తుంది. -
Intinti Gruhalakshmi: తులసి కాళ్ల మీద పడేలా చేస్తా!
ఇన్నాళ్లు సహనానికి మారుపేరుగా ఉన్న తులసి తన విశ్వరూపం చూపిస్తోంది. లాస్యను ఒక చీడపురుగులా చూస్తూ ఆమె పొగరు అణిచేలా చేస్తోంది. తులసి ఇలా రెచ్చిపోయి మాట్లాడటం, తనను ఒక పాచికపుల్లలా చూడటం సహించలేకపోయిన లాస్య ఎదురుదెబ్బ కొట్టాలని పగతో రగిలిపోతోంది. మరి నేటి(మే 28) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. నందు మర్చిపోయిన డాక్యుమెంట్లను తీసుకువచ్చిన లాస్యకు చీవాట్లు పెట్టింది తులసి. లాస్యను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన అనసూయ నోరు మూయించాడు నందు తండ్రి. లాస్యది జనాల మధ్య బతకడానికి అర్హత లేని పుట్టుక అని నిందించాడు. సిగ్గు లేని జన్మలు అంటూ చీదరించుకోవడంతో లాస్య ఒళ్లు భగభగ మండిపోయింది. ఇక మీదట ఇంట్లో వాళ్లు తులసి చెప్పినట్లే నడుచుకోవాలని, లేదంటే లాస్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. ఏదైనా అవసరమైతే తన భర్త నందు రావాలి కానీ నువ్వు మాత్రం ఇంట్లోకి వస్తే మరింత హీనంగా చూస్తామని తులసి వార్నింగ్ ఇవ్వడంతో లాస్య మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. మరోవైపు తులసి, నందుతో సత్యనారాయణ వ్రతం చేయించేందుకు తులసి తల్లి ఆమె ఇంటికి బయలు దేరింది. ఇంతలో ఆటో పాడవటంతో నడుచుకుంటూ వస్తున్న ఆమెను నందు కారులో ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటి లోపలికి మాత్రం అడుగు పెట్టకుండా అక్కడే బయట ఉండిపోయాడు. దీంతో అయోమయానికి లోనైన ఆమె అల్లుడు ఇంట్లోకి రావడం లేదేంటని కూతురిని ప్రశ్నించింది. అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య మనింట్లోకి పద నందూ అంటూ మాట్లాడటంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఇక తన అక్కకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాడు తులసి తమ్ముడు. నందు మీద పోలీసు కేసు పెడదామంటూ తులసి మీద ఒత్తిడి తెచ్చాడు. తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇష్టం లేని తులసి వద్దంటూ అతడిని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆవేశంతో ఊగిపోయిన అతడు నందు ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. విడాకులు మంజూరవకముందు ఇలా వేరొకరితో ఉండటం చట్టరీత్యా నేరమని, ఇందుకుగానూ పోలీసు కేసు పెడతానని బెదిరించాడు. అప్పుడు వాళ్లే నిన్ను కాలర్ పట్టుకుని తులసక్క కాళ్ల మీద పడేస్తారని చెప్పాడు. మరి అతడు నిజంగానే నందు మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాడా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: NTR 31: ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఎంతంటే.. -
Devatha : నందాను చితకబాదిన ఆదిత్య..కనకంకు ఫోన్ చేసిన నందా
కనకంకి నందా ఫోన్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆదిత్యతో తానింకా టచ్లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో ఎందుకు నందాతో మాట్లాడుతున్నావంటూ ఇంట్లో వాళ్లు నిలదీయడంతో ఆదిత్య కంగారుపడుతుంటాడు. అది గమనించిన కనకం దీని వెనక ఏదో మతలబు ఉందని గ్రహిస్తుంది. ఇక నందాను చితకబాదిన ఆదిత్య ఇంకోసారి తనను ఇబ్బంది పెడితే చంపేస్తానని నందాను బెదిరిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే27న 244వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య పరిస్థితి తలుచుకొని ఆదిత్య దిగాలుగా ఉంటాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఇలా ఎందుకు ఉన్నావంటూ ఆదిత్యను వాళ్ల నాన్న అడుగుతాడు. సత్య పరిస్థితి ఇలా అయిపోవడంతో రుక్మిణి బాధపడుతుందని అందుకే దీన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నా అని ఆదిత్య బదులిస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే తాను డబ్బులు డిమాండ్ చేస్తే మొదటిసారి ఆదిత్య నో అనడంతో నందా ఆశ్చర్యపోతాడు. తన పొగరును ఎలా అయినా దించాలన ఉద్దేశంతో ఏదో ఒక పథకం రచించాలని అనుకుంటాడు. ఇందుకు కనకం అయితే సరిగ్గా సరిపోతుందని, ఆమెకు ఫోన్ చేస్తాడు. దేవుడమ్మకు ఉన్న విలువ నీకు లేదని రెచ్చగొడుతూ, మరోవైపు తాను ఆదిత్యతతో ఇంకా టచ్లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో కనకం వచ్చి ఆదిత్యను ఈ విషయం గురించి ప్రశ్నించగా, అదేం లేదని, దాటవేసే ప్రయత్నం చేస్తాడు. తను చేసిన తప్పుకు బాధపడతున్నాడని, ఇందుకు దేవుడమ్మకు క్షమాపణలు చెప్పమని చెప్పాడని, అంతే తప్పా తనతో నాకేం మాటలు లేవని చెప్తాడు. అయితే ఆదిత్య తడపాటును గమనించిన కనకం ఇందులో ఏదో మతలబు ఉందని , అది తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక ఆదిత్య చెప్పిన చోటుకు వెళ్లిన నందా అక్కడ ఆదిత్య డబ్బు తీసుకురాకపోగా, వెంట పెద్ద కర్ర తేవడం చూసి షాకవుతాడు. అయితే అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆదిత్య నందాను కొడతాడు. ఇంకోసారి తన గురించి కానీ, సత్య గురించి కాని ఆలోచిస్తే తన అంతు చూస్తానని బెదిరిస్తాడు. -
karthika Deepam: ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి? నా భార్య బతకాలి..
కార్తీకదీపం మే 27: కార్తీక్ దీపతో సరదాగా మాట్లాడటం, నిన్ను బతికించుకోవడం భర్తగా నా కనీస బాధ్యత అని అనడంతో అది విన్న మోనిత కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్ దీప ఆరోగ్యం గురించి దిగులు పడుతుంటాడు. ఇక అక్కడే హాస్పిటల్లో కార్తీక్కు ఏమైందంటూ ఆలోచిస్తున్న మోనిత ఏం చేయబోతుంది, కార్తీక్ దీపతో నిజం తెలిసిన విషయం చెబుతాడో లేదో నేటి(మే 27) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ను సౌందర్య ఓదారుస్తు అది నిన్ను చివరి క్షణాలంటూ.. నన్ను నమ్మానని చెప్పండి అని అడుగుతుంటే ఎందుకురా నోరు మెదపలేదని అడగ్గా కార్తీక్ ఏమో నోరుకు ఎదో అడ్డుపడినట్లు అయ్యింది అంటాడు. నువ్వు నమ్మానని ఒక్క మాట చెబితే ఆ మాటలతో అది ధైర్యం తెచ్చుకుని మరణంతో కూడా పోరాడి తిరిగోచ్చేది కదరా ఇది నువ్వు ఓ డాక్టర్ బాబుగా కాదు డాక్టర్లా చెప్పు అని సౌందర్య అనగా.. కార్తీక్ అవునన్నట్లు తల ఊపుతాడు. అయిన దానికి ఏం కాదు మమ్మీ.. అది ఎవరూ దీప బతికేస్తుంది.. అది బతకాలి.. బతుకుతుంది అంటాడు కార్తీక్. ఇంతలో మురళీ కృష్ణ యాపిల్ పండ్లు తీసుకువచ్చి సౌందర్య, కార్తీక్కు తినమని ఇస్తాడు. కార్తీక్ అవి తీసుకుని సౌందర్యకు ఒకటి ఇచ్చి, మరోకటి మీరు ఏం తినలేదు కదా మామయ్య ఇది మీరు తీసుకోండి అంటు ఆ యాపిల్ను మురళీ కృష్ణకు ఇస్తాడు. ఇక అది విన్న సౌందర్య షాక్ అవుతుంది. ఏం అన్నాడు వాడు అని మురళీ కృష్ణను అడగ్గా నోరరా మామయ్య అన్నాడమ్మా అనగానే సౌందర్య సంతోషంతో కార్తీక్ను చూస్తుండిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ మోనిత కార్తీక్ ఏంటి దీపతో అల మాట్లాడాడు. అంటే కార్తీక్ ఇప్పటి దాకా నా మీద చూపించింది ప్రేమ కాదు అనుకుంటుంది. కనీసం విజయనగరం నుంచి పెళ్లాం, పిల్లలను విమానంలో తీసుకొచ్చినప్పుడైనా నాకు సిగ్గు ఉండాలి కదా? లేదు నేను కార్తీక్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను చేసిన దరిద్రగొట్టు పనులన్నీ ఇంకే ఆడది చెయ్యదు.. ఇంత కథ నడిపినా ఇన్నేళ్లకు కూడా నా బతుక్కి మోక్షం లేదు.. చావాలనిపిస్తోంది అంటూ తనలోనే తానే మాట్లాడుకుంటుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడగడంతో.. దీప గురించే అని కవర్ చేస్తుంది మోనిత. అంటే.. భారతి ఏమైనా చెప్పిందా అని కంగారుగా అడగ్గా భారతి నాకు చెప్పడం ఏంటీ? దీప గురించి అంటుంది మోనిత. నా భార్య గురించి నాకు చెబితే నేను తట్టుకోలేనని నీతో ఏమైనా చెప్పిందా? అని అడుగుతున్నాను మోనితా.. చెప్పి ఉంటే నిజం చెప్పు.. అవసరం అయితే స్పెషల్ డాక్టర్స్ని పిలిపిస్తాను అని కార్తీక్ అనడంతో మోనిత ఇంకా కోపంతో రగిలిపోతుంది. మొగుడితో చెప్పకుండా నాతో ఎందుకు చెబుతుందని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత మోనిత నువ్వు నిజంగా బాధపడుతున్నావా? పిల్లలు బాధపడతారని బాధపడుతున్నావా అని వెటకారంగా అనడంతో.. ‘పిల్లల గురించి కాదు.. లోకం గురించి కాదు.. భర్తగా ఇది నా బాధ్యత అని కూడా కాదు.. దీప బతకాలి.. బతికి తీరాలి.. ఇన్నాళ్లు దీప ఎన్నో కష్టాలు పడింది.. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటే నాకేంటీ? ఐ డోంట్ కేర్..నా భార్య బతకాలి..దట్స్ ఆల్’ అని అంటాడు కార్తీక్ ఆవేశంగా అంటాడు. అది విన్న మోనిత ‘ఇది జాలి కాదు.. మానవత్వం కాదు..మరేదో ఉంది..’ అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత మోనిత నేను వెళతాను అనగానే కార్తీక్ మంచిది అని ఇచ్చిన సమాధానాన్ని మోనిత ఊహించలేకపోతుంది. దీంతో ఆమో మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోతాయి. వెంటనే కార్తీక్ ఉండొచ్చు కదా.. భారతికి తోడుగా అనగా నువ్వు ఉన్నావ్గా ఫ్రెండ్గా అనుకుంటు అక్కడ నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు డాక్టర్ భారతి దీపకు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఇంజక్షన్ ఇచ్చాక మత్తుగా ఉంటుంది కానీ పడుకోవద్దని చెబుతుంది. ఇంజక్షన్ ఇవ్వగానే దీప మత్తు రావడంతో పడుకుంటుండగా డాక్టర్ భారతి దీపతో పడుకోవద్దని లేపుతుంది. ఆ తర్వాత సౌందర్య, కార్తీక్లు అక్కడికి వస్తారు. దీపతో ధైర్యంగా ఉండు.. నిద్ర అసలు పోకుడదంటుంటే దీప సరే అన్నట్లు నవ్వుతూ తల ఊపుతుంది. సౌందర్య కూడా చెప్పడంతో ఆమెనే చూస్తూ దీప చిరునవ్వు చిందిస్తుంది. నాకు ధైర్యం చెప్పడం కాదే నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యలను మీరు వెళ్లండి నేను చూసుకుంటా అని చెప్పి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యతో నువ్వు ఇంటికెళ్లు మమ్మీ నేను ఉంటానంటే, నువ్వే వెళ్లరా ఫ్రెష్ అయ్యి కాస్తా తిని రమ్మనగా అది ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళతాను మమ్మీ.. ఇక్కడే ఉంటానని అంటాడు కార్తీక్. -
తులసి నేను తాళి కట్టిన భార్య: లాస్యకు నందు ఝలక్
తులసితో విడాకులు మంజూరు కాకముందే లాస్యతో వేరు కాపురం పెట్టాడు నందు. తన ఇంటి ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగాడు. ఈ క్రమంలో భార్య ఉద్యోగం చేయబోతుందని తెలిసి సహించలేకపోయాడు. అలా అని ఆమె దగ్గరకు వెళ్లి కుదరదని చెప్పలేకపోయాడు. మరి నేటి(మే 27) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే చదివేయండి.. నన్నే మెడపట్టుకుని బయటకు గెంటేస్తుందా? అంటూ ప్రతీకారంతో రగిలిపోయింది లాస్య. తనకు జరిగిన అవమానం వల్ల ఇప్పుడు ఏకంగా కురుక్షేత్రమే జరగబోతుందని, అందుకు సిద్ధంగా ఉండమంటూ తులసికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ యుద్ధంలో ఓడేందుకు సిద్ధంగా ఉండమంటూ తులసి రివర్స్ కౌంటరిచ్చింది. మరోవైపు రోహిత్ దగ్గర తులసి తిరిగి ఉద్యోగంలో చేరుతుందన్న విషయం తెలిసి నందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె ఉద్యోగం చేస్తే నీకేంటని లాస్య నిలదీయగా తులసి తను తాళి కట్టిన భార్య అని స్పష్టం చేశాడు. ఆమెతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు తను నీ భార్య అని గుర్తు రాలేదా? అని లాస్య తిరిగి ప్రశ్నించింది. నీ మనసులో భార్య స్థానంలో ఇంకా తులసే ఉందంటూ అలక బూనింది. దీంతో నందు అలాంటిదేమీ లేదంటూ లాస్యను ఊరడించే ప్రయత్నం చేశాడు. మరోవైపు అభి తన దగ్గర డబ్బులు లేకే బయటకు తీసుకెళ్లడం లేదని, ఏమీ కొనివ్వలేకపోతున్నాని అంకితతో చెప్పాడు. ఈ మాటలు విన్న అంకిత తల్లి తన దగ్గర డబ్బుందని, దాన్ని తీసుకుని బయట తిరిగి రండని సూచించింది. నీ డబ్బుతో నా కూతురిని ఏమీ ఉద్ధరించలేవని నానామాటలు అంది. నువ్వు సంపాదించేదానితో కూతురికి కనీసం నెయిల్ పాలిష్ కూడా కొనలేవని సూటిపోటి మాటలతో అతడిని ఛిద్రం చేస్తూ డబ్బు చేతిలో పెట్టింది. ఇన్ని అవమానాలు పడాల్సి వస్తున్నందుకు అభి కోపంతో రగిలిపోయాడు. ఇక తులసి, నందుతో వ్రతం చేయించేందుకు తులసి తల్లి నేరుగా ఇంటికి వచ్చింది. ఇక్కడ తన కూతురి కాపురం చిన్నాభిన్నమైందన్న విషయం తెలుసుకున్న ఆమె ఏం చేయనుంది అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: 'పుష్ప' ఐటెం సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ? -
Devatha : రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం..స్మశానం నుంచి వచ్చావంటూ..
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యేనంటూ నందా ఓ ఫోటోను పంపిస్తాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ వెంటనే ఇవ్వకపోతే నిజాన్ని బయటకు చెబుతానంటూ బెదిరిస్తాడు. అయితే వాటికి లొంగని ఆదిత్య తనను నేరుగా కలిస్తే సమాధానం ఇస్తానని ఘాటుగా స్పందిస్తాడు. మరోవైపు సత్య ఇంటికి వెళ్లొచ్చిన రుక్మిణిని దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే26న 243వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను చూసి వాళ్ల పుటట్టింటి నుంచి తిరిగొచ్చిన రుక్మిణిని గుమ్మం వద్దే దేవుడమ్మ అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రుక్మిణి తలపై నీళ్లు పోసి ఇప్పుడు వెళ్లు లోపలికి అని చెబుతుంది. ఇక దేవుడమ్మ తీరుతో అందరూ షాకవుతారు. సత్యపై చేసిన తప్పుకు ఇంతలా శిక్షించడం అవసరమా అని కనకం ప్రశ్నించగా, సత్య చేసింది తప్పు కాదు నేరం అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే నందా తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ పార్టీ చేసుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యే అంటూ వాళ్లిద్దరు దిగిన ఫోటోను నేరుగా ఆదిత్యకే పంపిస్తాడు. అర్జెంటుగా 2 లక్షల రూపాయలు కావాలని, లేదంటే నిజాన్ని అందరికి చెబుతానని బెదిరిస్తాడు. అయితే నందా బెదిరింపులకు లొంగని ఆదిత్య తననే డైరెక్ట్గా కలిస్తే నీ బెదిరింపులకు ఫుల్స్టాప్ పెడతానని చెబుతాడు. ఇక సీన్ కట్ చేస్తే..రుక్మిణి భయం భయంగా ఉంటే దేవుడమ్మ తనను దగ్గరికి తీసుకుంటుంది. తన చేతులతో స్వయంగా జుడ వేస్తానని చెప్పి ప్రేమతో లాలించడం చూసి కనకం షాకావుతుంది. ఇదేంటని అడగ్గా తన కోపం కేవలం సత్య మీదే అని, రుక్మిణి మీద కాదని బదులిస్తుంది. ఇక మాట మధ్యలో రంగాను తీసుకొస్తే తనను క్షమిస్తావా అని దేవుడమ్మ ప్రశ్నించగా కనకం ఆలోచనలో పడుతుంది. -
Intinti Gruhalakshmi: అత్త నోరు మూయించిన తులసి
కట్టుకున్న భర్త తన చెంతకు వస్తాడన్న తులసి కల కలగానే మిగిలిపోయింది. మధ్యలో వచ్చిన లాస్య.. తన జిత్తులమారి ప్లాన్లతో నందును ఎగరేసుకుపోయింది. తులసి పేరు చెప్తేనే పూనకం వచ్చేలా నందును తన వైపు తిప్పుకుంది. లాస్యను ఇంటి నుంచి పంపించాలనుకుంటే ఆమె కొంగు పట్టుకుని భర్త కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అయోమయంలో పడిపోయింది తులసి. కానీ ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యంతో ఎదురు చెప్పడం ప్రారంభించిన తులసి తిరిగి ఉద్యోగంలో చేరబోతోంది. మరి నేటి (మే 26) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. "నేను అన్నం తినకపోతే అమ్మ అల్లాడిపోయేది, నాకు దెబ్బ తగిలితే అమ్మకు కన్నీళ్లొచ్చేవి.. అప్పుడు అమ్మ ఇంత ఓవరాక్షన్ చేస్తుందేంటి అనుకున్నా.. కానీ ఇప్పుడర్థమవుతోంది అదే అసలైన ప్రేమ అని, అది నాకు కావాలనిపిస్తోంది.." అంటూ అభి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రారమ్మని అమ్మ ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోలేదని పశ్చాత్తాపపడ్డాడు. ఓ వైపు కడుపులో ఆకలి మెలివేస్తుంటే కన్నీళ్లు దిగమింగుకుంటూ మంచినీళ్లతో సరిపెట్టుకున్నాడు. తన దగ్గర మొసలి కన్నీళ్లు కారుద్దామనుకున్న భాగ్య నోరు మూసుకునేలా చేసింది తులసి. తనను చూస్తే చాలా బాధగా ఉందన్న భాగ్య మాటలకు మధ్యలోనే అడ్డుపడింది. ఎవరెలాంటివారో తనకు తెలుసని, జరుగుతున్నదానికి ఎక్కువ సంతోషపడుతున్నట్లున్నావ్ అని చెప్పడంతో భాగ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అనంతరం తన మామయ్య దగ్గరికి వెళ్లిన తులసి ఇంటిని నడపాలంటే తను ఉద్యోగం చేయాలని అందుకోసం ఆయన అనుమతి తీసుకుంది. ఆర్థికంగా బలపడితేనే అనుకున్నవి చేయగలవని, కాబట్టి నిశ్చింతగా జాబ్ చేయమంటూ ధైర్యం నూరిపోశాడు. నా కొడుకు నీ ప్రేమను ఎలాగో గుర్తించలేకపోయాడు, కానీ ఇప్పుడు నీ గెలుపుతో అతడిని నీవైపు తిప్పుకో అని సూచించాడు. ఇక శృతి తిరిగి ఇంట్లోకి రావడంతో నందు తల్లి నిప్పులు చెరిగింది. అయినవాళ్లను ఆమడ దూరంలో కూర్చోబెట్టడం, కానివాళ్లను కుర్చీలో కూర్చోబెట్టడం మీకు అలవాటే కదూ అంటూ నిప్పులు చెరిగింది. అయితే ఆమె నోటికి అడ్డుకట్ట వేస్తూ.. శృతి తన మనిషి అని, ఆమెను ఏమన్నా ఊరుకునేది లేదని లాస్య అత్తకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమెను కిమ్మనకుండా ఉండిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు చూసి శృతి ఒక్కసారిగా షాకైంది. మరోవైపు నందు, లాస్య తులసి ఇంటెదురుగా ఓ కొత్తిల్లు అద్దెకు తీసుకుని దిగారు. ఇక ఇప్పటి నుంచి తులసికి అందరినీ దూరం చేస్తూ చివరకు ఏకాకిగా మార్చుతానని లాస్య గట్టి ప్లాన్లో ఉంది. మరోవైపు తన కొడుకు అభితో పాటు, భర్త నందును ఎలాగైనా ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉంది తులసి. మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు? ఎవరు ఏకాకిగా మారుతారు? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చదవండి: RRR Movie: ఫైట్ సీన్కి కన్నీళ్లొస్తాయి! మహేష్బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్! -
Karthika Deepam: దీపకు స్లోపాయిజన్ ఇచ్చారు అనగానే..
కార్తీకదీపం సీరియల్.. దీప ఆరోగ్యం దిగజారిపోవడంతో కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తాడు. ఆ విషయం తెలుసుకుని మోనిత ఆస్పత్రికి వచ్చిన మోనిత ఎలాంటి ప్లాన్తో ఉందో తెలియదు. మరోవైపు ఎలాగైనా దీపను బతికించుకోవాలని చూస్తున్న డాక్టర్ బాబు ప్రయత్నం తిరుతుందా లేదంటే మోనిత కొత్తగా దీపపై ఎమైనా పన్నాగాలు పన్ననుందా అనేది తెలుసుకోవాలంటే నేటి(మే 26) ఎపిసోడ్ ఇక్కడ చదివేయండి.. కార్తీక్, డాక్టర్ భారతి, డాక్టర్ గోవర్థన్లు మాట్లాడుకుంటుంటే మోనిత అక్కడకు వస్తుంది. వారిని పలకరించినప్పటికీ ముగ్గురు మోనితను పట్టించుకోకుండా వారు సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. దీంతో ‘హాలో.. నేను కూడా డాక్టర్నే, నన్న కాస్త గుర్తించండి. నాతో కూడా డిస్కషన్ చేయోచ్చు’ అని మోనిత అంటుంది. దీంతో భారతి మొదటి నుంచి చెప్పలేము.. దీపకు పదేళ్ల క్రితం ఎవరో స్లోపాయిజన్ ఇంజెక్ట్ చేశారు అనగానే మోనిత ఒక్కసారిగా కంగుతింటుంది. అది ఇన్నాళ్లుగా మెల్లిమెల్లిగా ప్రతి టిష్యును డ్యామెజ్ చేసుకుంటు.. ఒక్కో ఆర్గాన్ పనిచేయకుంగా చేస్తూ వస్తోంది. ఆ డ్రగ్ బయటకు వెళ్లే అవకాశం లేదు అందుకే బ్లడ్ ప్యూరిఫై చేయాల్సి వచ్చింది. దానికి డయాలసీస్ తప్ప వేరే మార్గం లేదు’ అని భారతి వివరిస్తుంది. అలాగే డాక్టర్ గోవర్ధన్ కూడా దీప ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటాడు. మరోవైపు పిల్లలు(హిమ, శౌర్య) ఇంటి దగ్గర దిగులుగా ఉంటారు. వారణాసి వాళ్లకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత వారణాసితో అమ్మకు ఏంకాదు కదా.. ఏం కాదమ్మా.. అక్కడ ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, వాళ్లు అమ్మకు ఏం కాకుండా చూస్తారు. మీ డాడి కూడా డాక్టరే కదా అని వారికి సర్ది చెబుతాడు. ఇక హిమ ఇక్కడే ఉంటే అమ్మ గుర్తోస్తుంది నానమ్మ వాళ్ల ఇంటికి వెళదాం.. వారణాసి మమ్మల్ని అక్కడ దీంపుతావా అని అడుగుతుంది. శౌర్య కూడా అవును మనం ఇప్పుడు ఇక్కడ కంటే ఆదిత్య బాబాయ్, పిన్నితో ఉండటమే కరెక్ట్ అని అక్కడి వెళ్లతారు. ఆస్పత్రి దగ్గర మోనిత, భారతిలు దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. దీపను ఇప్పుడు ఎలా ఉంది అని భారతి అడగ్గానే ఇంటికి ఎప్పుడు వెళ్లోచ్చు రేపా, ఎల్లుండా అని అనగా.. గుడ్ ఇలా ధైర్యంగా ఉండాలి అంటుంది భారతి. ఆ తర్వాత దీప నా భర్తను చూడాలని ఉంది, ఆయన్ని పిలవండి అని భారతికి చెబుతుంది. ఆ తర్వాత మోనిత పలకరిస్తూ ఎలా ఉన్నావ్ దీప అనగానే నన్ను ఇలాంటివి ఏం చేస్తాయి, నీలాంటి మహమ్మారే ఏం చేయలేకపోయింది అంటూ మోనితకు కౌంటర్ వేస్తుంది దీప. ఆ తర్వాత నాకు తెలుసు నేను లేకపోతే నా భర్తను పెళ్లి చేసుకుంటావని, నీకు ఆ అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను ఉండగా నా భర్తను చేసుకునే ధైర్యం నువ్వు చేయవు అంటుంది దీప. మోనిత కార్తీక్ వస్తున్నట్లు గమనించి.. ‘నువ్వు బతకాలి దీప. నిండు నూరేళ్లు బతికి నీ భర్త, పిల్లలతో హాయిగా ఉండాలి’ అంటు దొంగ ఏడుపు ఏడుస్తుంది. కార్తీక్ రాగానే గెట్ అవుట్ దీప నా భర్తతో మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత మోనిత బయటకు వెళ్లి డోర్ నుంచి వాళ్లను గమనిస్తుంది. ఇక కార్తీక్, దీపలు ఒకరిని ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ చెప్పు వంటలక్కా అని పిలవగానే దీప నవ్వుతుంది. ఇలా నవ్వుతూ ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి దీప అంటు కాస్త సరదాగా మాట్లాడుతాడు. నువ్వు మీ డార్లీంగ్ అత్తయ్యాతో షాపింగ్ అని తిరగాలి, పిల్లలకు రకరకాల వంటలు వండిపెట్టాలి. దొసకాయ పచ్చడి పిల్లలకే కాదు కాలనీ మొత్తం పంచాలంటూ దీప కార్తీక్తో మాట్లాడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఇక నాకు ఏమైన అయితే డాక్టర్ బాబు అనగానే స్టుపిడ్ నీకు ఏం కాదు ఇంకోసారి అలా మాట్లాడకు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లి సౌందర్య పక్కన కూర్చుంటాడు. బయట సౌందర్య భుజం మీద తల వాల్చగానే సౌందర్యతో అది చివరి క్షణాలు అంటూ ఇప్పటికైనా నమ్మనని చెప్పండి అని చేతిలో చెయ్యేసి అంత ధీనంగా అడిగినప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదారా, ఏం మాట్లాడకుండ అలా మౌనంగా ఉండిపోయావు అని అడుగుతుంది. ఆ తర్వాత తరువాయి భాగంలో కార్తీక్ దీప రూం బయట నిలుచుని నీకు ఏం కావద్దు నువ్వు బ్రతకాలి దీప అని మనసులో అంటుండగా దీప పల్స్రేట్ పడిపోతుంది. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. వెంటనే కార్తీక్ డాక్టర్ భారతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి దీప పరిస్థితి గురించి చెబుతాడు. వెంటనే వాళ్లు అక్కడికి వెళ్లి చెక్ చేస్తుంటారు. చదవండి: కార్తీకదీపం: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు -
Devatha : స్వార్థంగా ఆలోచిస్తున్న సత్య.. రుక్మిణిని అడ్డు పెట్టుకొని..
సత్యను చూడటానికి రుక్మిణి దేవుడమ్మకు చెప్పెకుండా వాళ్లింటికి వెళ్తుంది. నిజం తెలిసిన దేవుడమ్మ రుక్మిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది. రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే25న 242వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను ఎలా కలవాలో తెలియక రుక్మిణి మదనపడుతుంటుంది. దేవుడమ్మను అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమవుతుంది. ఈలోగా కనకం వచ్చి దేవుడమ్మకు తెలియకుండా వెళ్లి వచ్చేయమని సలహా ఇస్తుంది. అప్పటివరకు ఇంట్లో తాను మ్యానెజ్ చేస్తానని చెప్పి రుక్మిణిని వాళ్లింటికి పంపిస్తుంది. ఇక సత్యను చూడగానే రుక్మిణి కన్నీటి పర్యంతమవుతుంది. సత్యను ఇలా ముభావంగా ఉండొద్దని ఎప్పటికప్పుడు భోజనం తిని మందులు వేసుకోవాలని చెప్తుంది. ఇక తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది. రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటుంది. మరోవైపు రుక్మిణి ఇంట్లో లేదన్న నిజం దేవుడమ్మకు తెలిసిపోతుంది. భాగ్యమ్మకు ఫోన్ చేసి కనుక్కోగా రుక్మిణి అక్కడే ఉందని చెప్పడంతో దేవుడమ్మ కోప్పడుతుంది. అయితే రుక్మిణి తప్పేం ఉండకపోవచ్చని, భయం వల్ల తను అలా చేసిందేమో అని ఆదిత్య రుక్మిణిని వెనకేసుకొని వస్తాడు. -
karthika Deepam: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు
కార్తీకదీపం మే 25: దీప టాబ్లెట్ వేసుకున్న మరు క్షణంలో కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో సౌందర్య, పిల్లలు కంగారు పడిపోతుంటారు. తల్లికి ఏమైందోనని శౌర్య, హిమలు భయంతో ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్, మురళీ కృష్ణ ఇంటికి రాగానే పిల్లల ఏడుపు వినిపించడంతో కంగారు పడుతూ ఇంట్లోకి వస్తారు. అక్కడ దీప జీవచ్చవంలా పడి ఉండటం చూసి మురళీ కృష్ణ షాక్ అవుతాడు. కార్తీక్ దీపకు నీళ్లు తాగించగా అవి బయటకు వచ్చేస్తాయి. అలా షాక్లో దీప వంకే చూస్తుండిపోతూ.. ‘కనీసం ఆ దేవుడు నాకు క్షమణలు కోరే అవకాశం కూడా ఇవ్వడం లేదేంటి దీప. నాకు నిజం తెలిసిందని నీకు చెబితే అదే నిన్ను సంజీవినిలా బ్రతికేంచేదని’ కార్తీక్ మనసులో అనుకుంటూ దీపను దగ్గరగా పట్టుకుని హత్తుకుంటాడు. ఇక పిల్లలు ఏడుస్తుంటే అమ్మకు ఏం కాదు మీరు ఊరుకొండమ్మా అని చెప్పి సౌందర్యతో.. మమ్మీ పిల్లలను దగ్గరికి తీసుకో అంటాడు. మురళీ కృష్ణ కూడా అమ్మ దీపా అంటు బాధపడుతుంటే నన్ను నమ్మండి దీపకు ఏంకాదు ఎలాగైనా తనని బ్రతికించుకుంటానని ధైర్యం చెబుతాడు. వెంటనే ఫోన్ తీసి డాక్టర్ గోవర్ధన్ నెంబర్ ఉంటుందని దానికి కాల్ చేసి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పు మమ్మీ అని సౌందర్యకు ఫోన్ ఇస్తాడు. అలాగే డాక్టర్ భారతికి కూడా ఫోన్ చేసి చెప్పిన హాస్పిటల్కు రమ్మని చెప్పమంటాడు. ఇక దీపను హాస్పిటల్కు తీసుకేళ్లి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తుంటే నీకు ఏంకాదు ఎలాగైనా బ్రతికించుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండు దీప అంటుంది సౌందర్య. అలాగే మురళీ కృష్ణ కూడా ఆ దేవుడు నీ వైపు ఉన్నాడమ్మా నీకు ఏం కాదు అంటాడు. దీప కార్తీక్ వంక చూస్తు దగ్గరగా రమ్మనంటు సైగ చేస్తుంది. దీంతో కార్తీక్ దగ్గరగా వచ్చి దీప చేయిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ‘ఇవి నాకు చివరి క్షణాలని నాకు అర్థమవుతుంది డాక్టర్ బాబు... నేను వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త.. ఇప్పటికైనా నన్ను నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు హాయిగా కళ్లు మూస్తాను’ అని అంటుండగా డాక్టర్ వచ్చి పెషేంట్ కండీషన్ తెలియదా ఇంక ఇక్కడే ఉంచారేంటని హడవుడి చేస్తాడు. మరోవైపు మోనిత తన హాస్పిటల్కు వెళ్లడానికి రెడీ అవుతుంటే ప్రియమణి కాఫీ తీసుకువస్తుంది. కాఫీ తెమ్మని చెప్పిన అరగంటకు తెస్తావా నీకు బద్దకంగా బాగా పెరిగిపోయిందే అంటుంది మోనిత. దీంతో ప్రియమణి.. బద్దకం కాదమ్మా, పని ఎక్కువై అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా అంటుంది ప్రియమణి. ఆ కాఫీ తాగి మోనిత హాస్పిటల్కు బయలుదేరబోతుంటే డాకర్ భారతి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో మోనిత తెగ ఆనందపడుతూ.. ఫొన్ అవునా!.. వస్తున్న వెంటనే బయలుదేరుతున్నా అంటు బాధపడిపోతున్నట్లు నమ్మిస్తుంది. ‘దీపమ్మ ఆస్పత్రిలో చేరిందనగానే మీ మొహంలో ఆనందం కనిపించిందమ్మ. దయ చేసి దీపమ్మను చంపడం లాంటివి చేయకండి’ అని ప్రియమణి మోనితతో అనగానే నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనే లేదే నువ్వు అన్నాకే వచ్చింది. చూస్తా అంటు వెళ్లిపోతుంది. మరోవైపు ఆదిత్య ఏమైంది అమ్మ రాగానే వదిన ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయింది.. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదని కంగారు పడుతూ అందరికి ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో చిరాకుపడుతుంటాడు. మురళీ కృష్ణ నా కూతురికి ఏమైందమ్మా ఏదైనా ప్రాణాంతక రోగమా అనగానే.. సౌందర్య ఏడుస్తూ దానికి ఏం కాదు, ఇక్కడ నా కొడుకు ఉన్నాడు దీపను ఎలాగైనా బ్రతికించుకుంటాం... ఈ హాస్పిటల్ నుంచి సంతోషంగా నా కోడల్ని తీసుకెళ్తాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో మోనిత అక్కడకు వస్తుంది. రేపటి ఎపిసోడ్లో దీప, మోనితలు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు నా ప్రాణం పోగానే ఇక్కడే నా భర్తతో తాళి కట్టించుకునేందుకు ఎదురు చూస్తున్నావని తెలుసు అంటుండగా... డాక్టర్ బాబు అక్కడికి వస్తాడు. గెట్ అవుట్ మోనిత నా భర్తతో నేను మాట్లాడాలి అంటుంది దీప. -
Intinti Gruhalakshmi: తులసిని ఏకాకిని చేసే ప్లాన్లో లాస్య!
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో నందు ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది. లాస్య కోసం నందు ఇల్లు వదిలేసి వెళ్లిపోవడంతో తులసి అయోమయంలో పడిపోయింది. దివ్య కూడా తన తండ్రి మళ్లీ ఇంటికి వస్తాడా? లేదా? అని కంగారుపడుతోంది. మరి వీరి సమస్యలకు పరిష్కారం దొరికేనా? లేదా ఈ సమస్యలు ఇంకా పెద్దవిగా మారనున్నాయా? అసలు నేటి(మే 25వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. అంకిత తనను బయటకు తీసుకెళ్లమని మారాం చేస్తే అభి ఒప్పుకోలేదు. తనకు ఓపిక లేదని, రోజంతా పని చేసొచ్చి అలిపోయినందున బయటకు తీసుకెళ్లలేనని చెప్పాడు. దీంతో తన కోరిక కూడా తీర్చడం చేతకాదంటూ అంకిత గొడవ మొదలు పెట్టింది. 'నీ తల్లి కోసం రోజంతా గొడ్డులా కష్టపడాలి, వచ్చాక కూతురిని షికారుకు తీసుకెళ్లాలి' అని అభి అసహనం వ్యక్తం చేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. ఇక ఎలాగో బయటకెళ్లి అక్కడే భోజనం చేస్తామని అనుకున్న అంకిత రాత్రికి ఏమీ వండిపెట్టలేదు. అసలే ఆకలితో ఉన్న అభి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే అక్కడంతా ఖాళీ గిన్నెలే దర్శనమిచ్చాయి. ఎందుకు వంట సిద్ధం చేయలేదని నిలదీస్తే.. బయటకు వెళ్దాం అనుకుంటే వద్దన్నావ్, అందుకే వండలేదు, ఈ ఒక్కపూటకు నీళ్లు తాగి అడ్జస్ట్ అయిపో అని భార్య దురుసుగా బదులిచ్చింది. దీంతో అభికి తన తల్లి తులసి గుర్తొచ్చింది. తనకు గోరుముద్దలు తినిపించే తల్లికి అనవసరంగా దూరమయ్యానే అని అమ్మను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినందుకు నందు, లాస్య ఆవేశంతో అట్టుడికిపోయారు. జీవితంలో మర్చిపోలేని అవమానం చేసిన లాస్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని మనసులోనే ప్రతిజ్ఞ చేసింది లాస్య. అటు నందు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇన్నాళ్లూ తన వెనకే ఉంటూ గోతులు తీసిందని మండిపడ్డాడు నందు. తన కూతురు ముందు కూడా తల దించుకునేలా చేసిందని ఆక్రోశించాడు. ఇదే అదును అని భావించిన లాస్య మరో ప్లాన్కు తెరదీసింది. మనం అనుక్షణం సంతోషంగా ఉంటూ తులసి కుమిలిపోయేలా చేయాలని, అందులో భాగంగా అదే ఇంటి ముందు మరో ఇల్లును అద్దెకు తీసుకుని దిగుదామని సలహా ఇచ్చింది. అన్నట్లుగానే రేపటి ఎపిసోడ్లో నందు నివాసం ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగుతున్నారు. అంతేకాదు, ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్కరినీ తులసికి దూరం చేసి ఆమెను ఏకాకిగా మారుస్తానని సవాలు విసిరింది లాస్య. మరి ఆమె ఎత్తులను తులసి ఎలా చిత్తు చేస్తుందో చూడాలి.. చదవండి: Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను! -
Devatha : ఆదిత్య జీవితంలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న సత్య
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రుక్మిణి భావిస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో ప్రస్తావించగా, తన గురించి ఏమైనా తెలిసిందేమోనని ఆదిత్య కంగారు పడతాడు. ఇక ఇప్పటివరకు తాను చేసిన త్యాగాల వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని భావించిన సత్య ఈ చీత్కారాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. అందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. సత్యకు ఏదైతే నిజం తెలియకూడదో అది తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణితో చెబుతుంది. సత్య దగ్గరకు వెళ్తానని రుక్మిణి దేవుడమ్మకు చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా?ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే24న 241వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య పరిస్థితి గురించి రుక్మిణి బాధపడుతుంటుంది. తనకు అన్యాయం జరిగిందని మదనపడుతుంటుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో తెలుసుకోవాలనుకుంటుంది. ఈలోగా ఆదిత్య అక్కడకు రావడంతో ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్తుంది. దీంతో తన పేరు చెప్పిందేమోనని ఆదిత్య కంగారు పడిపోతుంటాడు. సత్య ఏమైనా చెప్పిందా అని ఆతృతగా అడుగుతాడు. ఇక సీన్కట్ చేస్తే సత్యను అలా ఇంటి నుంచి వెళ్లగొట్టడం పట్ల కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తొందరపడ్డవేమో అని అడగ్గా సత్య గురించి మరింత నీచంగా మాట్లాడుతుంది దేవుడమ్మ. ఇక తన పుట్టబోయే బిడ్డను ఈ సమాజం ఎలా స్వీకరిస్తుందో అని సత్య ఆలోచిస్తుంటుంది. ఈ ఛీత్కారాలకు, అవమానాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. ఇప్పటివరకు తాను చేసిన త్యాగాలు చాలని, ఇకపై తన జీవితం గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఆదిత్యతోనే తాను ఉండాలని, మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని భావిస్తుంది. ఇక సత్యకు తన తల్లిదండ్రులు ఎలా చనిపోయారో అన్న నిజం తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణికి చెబుతుంది. దీంతో షాక్ అయిన రుక్మిణి సత్య ఇప్పుడు మరింత కుంగిపోతుందంటూ బాధపడుతుంటుంది. ఇలాంటి సమయంలో సత్య పక్కన తను ఉండటం ఉత్తమమని, వెంటనే సత్య దగ్గరికి వెళ్లాలని భావిస్తుంది. అయితే ఈ విషయాన్ని దేవుడమ్మతో చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా? సత్య ఆదిత్య జీవితంలోకి తిరిగి వచ్చేస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచింది
కార్తీకదీపం మే 24: సౌందర్య దీపతో మాట్లాడుతుంటే మధ్యలో శౌర్య, హిమ వచ్చి.. దీపకు ముద్దులు పెడతారు. ‘ఏంటమ్మా’ అంటే దీప అడగ్గా నాన్నమ్మ మాకో కథ చెప్పిందమ్మ. అందులో ఇద్దరుంటారు. వాళ్లు ఎవరో కాదు నువ్వు.. నాన్నా.. మీరెంత మంచివాళ్లో నాన్నమ్మ మాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ముద్దు పెడుతున్నామంటు వారు మురిసిపోతుంటారు. అది వినగానే దీప కాస్త సంతోషంగా నవ్వుతుంది. తర్వాత హిమ నాన్నమ్మా మాకు అమ్మ కూడా ఓ కథ చెప్పింది. ఆవు పులి కథ. అది వింటే మాకు చాలా ఏడుపొచ్చింది అని దీప చెప్పిన కథను సౌందర్యకు వివరిస్తుంటారు. దీంతో ఆ కథ దీపను ఉద్దేశించే చెప్పిందని తెలుసుకుని, కొన్నిసార్లు పులి చెడ్డది కాదమ్మా.. ఆవులోని అమ్మదనాన్ని, ఆ కమ్మదనాన్ని తెలుసుకుంది. బిడ్డలకి త్లలిని దూరం చేయదు, ఎప్పటికీ దూరం చేయదంటూ భావోద్వేగంతో చెబుతుంది సౌందర్య. మరోవైపు ప్రియమణి వంటలో ఉప్పు లేకుండా మోనితకి పెడుతుంది. అది తిని ఇందులో ఉప్పలేదని అడగ్గానే.. దానికి కావాలనే వేయలేదమ్మా.. మీరు కనిపెడతారా లేదా టెస్ట్ చేశా అంటు మోనితకు ప్రియమణి షాకిస్తుంది. దీంతో మోనిత చిరాకుతో తిట్టిపోస్తూ అసహనం చూపిస్తుంటే... ఈ తిట్లన్ని నా మీద కోపంతో కాదమ్మా, కార్తీక్ బాబు ఈ మధ్య ఇటు రావట్లేదనే కదా.. కార్తీక్ అయ్య నీ దగ్గరకు సలహాల కోసం.. బాధ చెప్పుకోవడం కోసం మాత్రమే వస్తాడమ్మా.. మీరే నోరు తెరిచి మీ మనసులో ఉన్నది చెప్పాలి.. వచ్చినప్పుడే మాట్లాడండి.. పోట్లాడండి.. రానప్పుడు మాత్రం ఇలా నీరసంగా కూర్చోకండి’ అని అక్కడ నుంచి వెళ్లగానే.. మోనిత తనలో తను నవ్వుకుంటుంది. ‘పిచ్చి ప్రియమణీ నేను సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా? చెవులు పగిలిపోయే సౌండ్ వినిపించాలని’ అంటూ పకపకా నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప ఇంటికి బయలుదేరిన మురళీ కృష్ణ స్కూటీ పెట్రోల్ అయిపోవడంతో మధ్యలో ఆగిపోతుంది. స్కూటీని తోసుకుంటూ వెళుతుంటే మధ్యలో కార్తీక్ చూసి కారు ఆపుతాడు. మురళీ కృష్ణ అలసిపోయి తూలి పడిపోబోతుండగా.. అప్పుడే కార్తీక్ స్కూటీని పట్టుకుని సాయం చేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన్ని అవమానించిన సన్నివేశాలను తలుచుకుంటూ చిన్నబోతాడు కార్తీక్. ‘బాబు మీరా.. మీ దగ్గరికే బయలుదేరాను బాబు.. పెట్రోల్ చూసుకోకుండా వచ్చాను.. పెట్రోల్ పోయించుకుని వస్తాను’ అంటూ స్కూటీ పట్టుకుని కదలబోతాడు మురళీ కృష్ణ. కార్తీక్ వెంటనే బండి సైడ్కి పెట్టండంటు స్కూటీని పక్కకు తీసుకెళ్లి పార్క్ చేస్తాడు. వారణాసికి చెప్పి పెట్రోల్ పోయించి తీసుకుర్మమని చెప్తా అంటాడు. అలా అయితే నేను ఎలా రావాలి బాబు అని అడగ్గానే మన కారులో వేళదామనడంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. వెంటనే కార్తీక్ మురళీ కృష్ణ రెండు చేతుల్ని పట్టుకుని మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచిందని క్షమాపణలు కోరతాడు. షాక్లో ఉన్న మురళీ కృష్ణ తన చేతుల్ని వెనక్కి లాక్కుని ఏంటిది బాబు.. అనగా.. ఏం లేదు.. రండి మామయ్యా అని పిలుస్తాడు. దీంతో మురళీ కృష్ణ అయోమయంగా చూస్తూ.. ‘మీరు.. నన్ను.. మామయ్యా అని..’ అంటూ కన్నీళ్లుపెట్టుకునేసరికి.. ‘నేను మీ పెద్ద అల్లుడ్ని మామయ్యా.. రండి’ అంటూ కారులోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇస్తాడు. ‘బాబూ.. దీప.. బాగానే ఉంది కదా’ అని మురళీ కృష్ణ అగడంతో.. ‘బాగుంది.. బాగుంటుంది. నేను ఉండగా దీపకు ఏం కాదు.. కానివ్వను అంటాడు. దీంతో మురళీ కృష్ణ ‘దీప ఆరోగ్యానికి ప్రమాదామా బాబు’ అని అడగ్గా.. దీప ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది.. నా మాట నమ్మండి అని నచ్చజెప్పి కారు ఎక్కమంటాడు. దాంతో మురళీ కృష్ణ.. ‘ఏంటి ఈయన ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? నా కూతురు సంతోషంగా ఉంటుంది అంటున్నాడు’ అని ఆలోచించుకుంటూ ఉండగా.. కార్తీక్.. ‘మామయ్యా ఎక్కండి’ అని మరోసారి పిలుస్తాడు. ఇద్దరు కలిసి ఇంటికి బయటుదేరుతారు. ఇదిలా ఉండగా.. సౌందర్య దీపని పిలిచి టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. దీప వేసుకుని.. తన పవిత్రతని నిరూపించుకోలేనందుకు బాధపడుతూ సోఫాలోకి పడిపోతూ సృహ కోల్పోతుంది. కట్ చేస్తే దీపను హాస్పిటల్కు తీసుకువెళ్లిన సీన్ను తరువాయి భాగంలో చూపిస్తారు. దీప ఇదే తన చివరి క్షణం అన్నట్లుగా కార్తీక్తో మాట్లాడుతూ.. ఇప్పటికైన నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు ప్రశాంతంగా వెళ్లిపోతానంటూ కళ్లుమూస్తుంది. -
Intinti Gruhalakshmi: తులసి మీద పగతో రగిలిపోతున్న నందు!
మమతల కోవెల కలహాలతో విలవిల్లాడుతోంది. చిరునవ్వుకు చోటు లేకుండా గొడవలతో చిగురుటాకులా వణికిపోతోంది. చివరికి ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. నందు తన కుటుంబం కన్నా లాస్యే ఎక్కువ అంటూ ఆమెతో వెళ్లిపోయాడు. అందుకు గల కారణమేంటి? అసలు నేటి(మే 24) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. సహనానికి మారుపేరుగా ఉండే తులసి ఈరోజు ఉగ్రరూపం చూపించింది. తను కిమ్మనకుండా కూర్చుంటే సమస్య మరింత పెద్దదవుతుందని గ్రహించిన ఆమె కాళికా అవతారం ఎత్తింది. పామును చేరదీసి పాలు పోస్తే అది విషం కక్కుతుందని తెలిసినా నిన్ను ఇంట్లో ఉంచి ఆదరించానని లాస్య మీద ఫైర్ అయింది. భార్యాభర్తల మధ్యలోకి వచ్చిన నిన్ను వేరే పేరుతో పిలుస్తారని ఆమెను చీదరించుకుంది. మీరు బరితెగించింది, తాను భరించింది ఇక చాలు అని నందుకు తులసి తేల్చి చెప్పింది. సహనం చచ్చిపోయిందని, ఓపిక నశించిందని ఇంకా భరించడం తన వల్ల కాదని కుండ బద్ధలు కొట్టింది. లాస్య ఇంటి గడప బయట ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. అయినా సమస్యను తోసిపడేస్తే ఎవరికీ ఏ దిగులూ ఉండదంటూ తులసి ఏకంగా లాస్య చేయి పట్టుకుని ఆమెను ఇంటి బయటకు గెంటేసింది. ఊహించని పరిణామానికి షాకైన నందు లాస్యతోనే తన సంతోషమంటూ ఆమెతో పాటు వెళ్లిపోతానని హెచ్చరించాడు. అయినప్పటికీ వెనక్కు తగ్గని తులసి ఏదేమైనా లాస్య మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నందు, లాస్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. దివ్యను కూడా వెంటరమ్మని కోరాడు, కానీ ఆమె అందుకు నిరాకరించింది. మీరు లాస్యతో ఉంటే చూడలేనని వెనకడుగు వేసింది. ఇక అయినవాళ్లెవరూ తనకు మద్దతుగా లేరని అర్థమైన నందు లాస్యను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయాడు. దీంతో నందు తల్లి అనసూయ ఆవేశంతో తులసిని నానా మాటలు అంది. తన కొడుకు ఇల్లొదిలి వెళ్లడానికి కారణం నువ్వే అంటూ తులసిని నిందించింది. నీ తల్లి పెంపకం ఇలా తగలడింది కాబట్టే ఇలా తయారయ్యావని విరుచుకుపడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చింది. కొడుకును దారిలో పెట్టడం చేతకాదు కానీ వేరేవాళ్ల పెంపకం గురించి మాట్లాడతారేంటని చురకలు అంటించింది. దీంతో అనసూయ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. మరోవైపు తులసి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయారు నందు, లాస్య. తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయంచుకున్నారు. అందులో భాగంగా నందు నివాసం ముందు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దిగుదామని లాస్య చెప్పిన ప్లాన్కు నందు సై అన్నాడు. ఇంతకింతా అనుభవించేలా చేస్తానని పగతో రగలిపోతున్నాడు. మరి తర్వాత ఏం జరగనుందన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: Radhe Shyam: లవ్ సాంగ్ కోసం ముంబైలో సెట్ -
Devatha : నిజం తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోతానన్న సత్య
సత్యను వెతకడానికి వెళ్లిన ఆదిత్యపై దేవుడమ్మ మండిపడుతుంది. తన మాటను కాదని సత్య కోసం వెళ్లడం ఏంటని నిలదీస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు ఎవరో చెప్పమని సత్య భాగ్యమ్మని ప్రశ్నిస్తుంది. తన అమ్మానాన్నలు ఎలా చనిపోయారో చెప్పాలని భాగ్యమ్మను కోరుతుంది. ఇక చేసేదేమీ లేక భాగ్యమ్మ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య తల్లిదండ్రుల చావుకు రుక్మిణి అని, అయితే అది తెలియక చేసిన తప్పని భాగ్యమ్మ చెప్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే22న 240వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ దేవుడమ్మ ఆదిత్యని నిలదీస్తుంది. తన మాటంటే లెక్కలేదా అంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇక సత్య-రుక్మిణి జీవితం ఇలా అవ్వడానికి తానే కారణమని, తనే సరైన నిర్ణయం తీసుకొని ఉంటే సత్యకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆదిత్య తనను తాను శిక్షించుకుంటాడు. ఇక తన జన్మరహస్యం గురించి నందా చెప్పిన నిజాలను తలుచుకొని సత్య బాధపడుతుంది. మరోవైపు తన బిడ్డను ఈ సమాజం ఎలా స్వాగతిస్తుందో అని కుమిలిపోతుంటుంది. తండ్రి ఎవరో తెలియకుండా తాను పెంచగలనా అని తనను తానే ప్రశ్నించుకుంటుంది. సీన్కట్ చేస్తే.. ఊరిలో వాళ్లు సైతం సత్యకు జరిగిన అవమానంపై మాట్లాడటం సత్య వింటుంది. భాగ్యమ్మ దగ్గరకు వచ్చి తాను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతానని, అప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురుకావని చెప్తుంది. భాగ్యమ్మ అందుకు అడ్డు చెబుతుండటంతో తన జన్మరహస్యం గురించి చెప్పమని సత్య నిలదీస్తుంది. దీంతో సత్య తన కన్నకూతురు కాదన్న నిజాన్ని చెప్తుంది. అంతేకాకుండా సత్య తల్లిదండ్రులు చనిపోవడానికి గత కారణాలను సైతం బయపెడుతుంది. ఇక ఈ నిజం తనకు తెలుసని రుక్మిణితో చెప్పొద్దని సత్య కోరుతుంది. నిజం తెలుసు కాబట్టి ఈ అవమానాలు భరించలేక సత్య ఊరు విడిచి వెళ్తుందా లేదా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్
సౌందర్య పిల్లపై కోపపడుతుంది. నా కొడుకు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాడని ఎలా అనుకున్నారే అంటు కాస్త కోపం చూపిస్తుంది. దీంతో హిమ, శౌర్యలు సారీ చెబుతారు. ఆ తర్వాత పిల్లలు నాన్న, అమ్మ ఇద్దరు అసలు సరిగా ఉండటం లేదని చెప్పడంతో సౌందర్య పిల్లలకు అర్థమయ్యే భాషలో వారి మధ్య ఉన్న సమస్య గురించి వివరిస్తుంది. మీ అమ్మకు నాన్నకు మధ్యలో కాలుష్యం ఉందని, అది తొలగిపోతే అంతా సంతోషమే అంటు చెప్పు కొస్తుంది. తర్వాత పిల్లల్ని గుండెలకు హత్తుకుని. ‘మీ అమ్మని ఎంత ఖర్చు అయినా సరే బతికించుకుని తీరాలి’ అని తనలో తనే అనుకుంటు కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్.. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ.. డాక్టర్ చెప్పిన నిజం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. మీరు అబద్దం అనేది నిజం.. మీరు నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే కావాల్సింది నా మీద నమ్మకమని దీప వాదించిన మాటలను, దీప నిప్పురా.. విహారీకి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక దీప తప్పు లేనట్లే కదా అన్న సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటూ కారు సడన్గా ఆపేస్తాడు. ఏడుస్తూ కారు దగ్గర దీప, అమ్మ ఎన్ని చెప్పిన నేను వినలేదు అంటూ పశ్చాత్తాప పడుతాడు కార్తీక్. దీప ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పటి తర్వాత తనకు ఇద్దరు కవలలు పుట్టారనే నిజం తెలుసుకున్న దీప, ఆ విషయాన్ని కార్తీక్తో సంతోషంగా చెప్పుకుంటుంది. వారిని నీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొమ్మని వారిని అనాథలను చేయకండంటు కార్తీక్ కాళ్లు పట్టుకుని ఏడ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ ‘విహారి గాడితో ఇద్దరు పిల్లలను కని, వాడిని అన్న అని పిలిచేంతగా దిగాజారావా.. నీతి మాలిన దానా.. అవతలికి పో’ అంటు దీపను కాలితో తన్నిన ఆ సన్నివేశాన్ని తలచుకుంటు కుమిలిపోతాడు. అంతేగాక ‘మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ.. నువ్వు ఎంత చెప్పినా నమ్మకుండా దీపకు నరకం చూపించాను మమ్మీ.. చిత్రవధ చేశాను.. గాయపడిన మనసుకు మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు గాయం చేశాను.. నిజంగా దీపా భూదేవి లాంటిదే మమ్మీ.. అది దీప కాబట్టి.. ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తోనే ఉంది. మారతానన్న నమ్మకంతోనే ఉంది’ అని ఏడుస్తూ చాలా మదనపడతాడు. ‘ఎంతో మంది పతివ్రతలు శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేశారు.. అది ఒక్కసారే.. కానీ నేను పదేళ్లగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా డాక్టర బాబు’ అని దీప అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు కార్తీక్. ‘దీపా.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందని.. ఆ రోజు నీకంటే నేనే ఎక్కువ బాధపడతానని ఎన్నో సార్లు అన్నావ్.. అది నిజం దీపా.. నాకు నిజం తెలిసింది. కానీ ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చేస్తుంది. నా అహంకారాన్ని బూడిద చేస్తోంది. నేను తప్పు చేశాను.. ఘోరమైన పాపం చేశాను.. అమానుషంగా ప్రవర్తించాను.. నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయివాళ్లలా చూశాను.. నీ మాతృత్వాన్ని చాలా అవమానించాను.. ఏం చేస్తే.. ఈ పాపనికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది? నా చదువు, నా సంస్కారం, నా సర్వస్వం ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని లోలోపల విలపిస్తాడు. ఇవన్ని నన్ను పేదవాడ్ని చేశాయి దీప, ఉత్త చేతులతో నీ ముందు నిలబడతాను వస్తున్నాను దీపా.. నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ కార్తీక్ కారు స్టార్ట్ చేసి బయలుదేరతాడు. ఇక తరువాయి భాగంలో దీప కళ్లు తిరగిపడిపోవడం, తాను చనిపోతే డాక్టర్ బాబు మోనితను పెళ్లి చేసుకుంటాడా అత్తయ్యా అని దీప భయపడుతుంది. చిన్నప్పుడు నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అత్తయ్యా.. నా బిడ్డలకు ఆ నరకం వద్దు అంటునే సోఫాలో కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, పిల్లలు, సౌందర్య, మురళీ కృష్ణ దీపను లేపే ప్రయత్నం చేస్తారు. కానీ దీప లేవదు, కార్తీక్ నీళ్లు తాగించిన ఆ నీరు బయటకు రావడంతో కార్తీక్ షాకవుతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సత్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లిన ఆదిత్య
సత్య గురించి కంగారు పడుతున్న రుక్మిణిని కనకం ఓదారుస్తుంది. సత్యకి ఏమీ కాదంటూ ధైర్యం చెప్తుంది. మరోవైపు సత్యను వెతకడానికి ఆదిత్య వెళ్తాడు. సత్యను ఒప్పించి వాళ్లింటో దిగబెడతాడు. ఇక సత్యను చూసి భాగ్యమ్మ సంతోషడినా దేవుడమ్మ చేసిన పనికి మాత్రం అసహనం వ్యక్తం చేస్తుంది. తన బిడ్డను అవమానించారంటూ బాధపడుతుంది. దేవుడమ్మని దేవతలా కొలిచామని, అలాంటిది తమకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఆదిత్యను నిలదీస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే21న 239వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య గురించి రుక్మిణి కంగారు పడుతుంటుంది. తన చెల్లి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని మధనపడుతుండగా కనకం వచ్చి రుక్మిణికి ధైర్యం చెప్తుంది. ఇక సత్యను ఒప్పించి వాళ్లింటికి తీసుకెళ్తాడు ఆదిత్య. సత్యను చూడగానే భాగ్యమ్మ సంతోషపడుతుంది. కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది. మరోవైపు సత్యను ఇంతలా అవమానం చేసిన దేవుడమ్మపై గుర్రుమంటుంది భాగ్యమ్మ. ఎందుకు ఎంత పెద్ద శిక్ష వేశారంటూ ఆదిత్యను నిలదీస్తుంది. ఆ ఇంటికి తీసుకెళ్తా అని దేవుడమ్మే తన కూతుర్ని తీసుకెళ్లిందని, ఇప్పుడు ఇంట్లోంచి గెంటేసిందంని భాదపడుతుంది. ఇక దేవుడమ్మ చేసిన పనికి ఆదిత్య తన వైపు నుంచి భాగ్యమ్మను క్షమాపణ కోరతాడు. సీన్ కట్ చేస్తే సత్యను సేఫ్గా ఇంట్లో దిగబెట్టి వచ్చనని ఆదిత్య రుక్మిణితో చెప్తుండగా దేవుడమ్మ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇంకా సత్యపై జాలి చూపించాల్సిన అవసరం ఏముందంటౌ ఆదిత్యపై విరుచుకుపడుతుంది. మరి దేవుడమ్మ ప్రశ్నలకు ఆదిత్య ఏం సమాధానం చెప్తాడో తర్వాతి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం, పశ్చాతాప పడుతున్న కార్తీక్
కార్తీకదీపం మే 21: సౌందర్య దీపని ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మీ ఇద్దరు ఒకరినినొకరు సరిగ అర్థం చేసుకోవడం లేదని, మిమ్మల్ని అలా వదిలేస్తే మీరే తేల్చుకుంటారనుకొని నేను, మీ మామయ్య ఇంటినుంచి వెళ్లిపోయాం, చివరకు ఇదా నువ్వు తేల్చుకుంది. ఏంటే నా కొడుకు నీకు అవసరం లేదని ఇక్కడకు వచ్చావా అంటు సౌందర్య దీప మీద చిటపటలాడుతుంది. దీంతో దీప ఏ స్త్రీ భర్తను చివరి వరకు వద్దనుకొదు అత్తయ్య అంటుంది. మరేంటి ఇది.. నువ్వు ఇక్కడకు ఎవరు అవసరం లేదని వచ్చావా అనగానే, దీప దీనంగా సౌందర్య వైపు తిరగి ఏడుస్తూ ఆమో కాళ్లపై పడుతుంది. మీ లాంటి పుణ్య స్త్రీలు మనసారా దీవిస్తే అది జరుగుతుంది అత్తయ్యా, నేను నిండు నూరేళ్లు జీవించాలని మనసారా దీవించండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. అది తెలిసి సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. సోఫాలో కూర్చుని గతంలో కార్తీక్తో దీపకు నిజం చెప్పు అంటూ తను చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత వాడు నాతో చెప్పనని చెప్పి, నీతో చెప్పాడా అంటుంది. అంటే మీకు కూడా తెలుసా అని దీప అనగానే తెలుసు అంటూ వణుకుతున్న గొంతుతో సమాధానం ఇస్తుంది. నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమమైపోతారు అత్తయ్య అంటు దీప సౌందర్య ఒళ్లో తల పెట్టి ఏడుస్తుంది. దీంతో వాడు(కార్తీక్) నిన్ను పెళ్లి చేసుకుని డాక్టర్ బాబు కాలేదే, నిన్ను కాపాడుకోవడానికే వాడు డాక్టర్ అయ్యాడు, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాడు అంటు దీపను ఒదారుస్తుంది. లేదు అత్తయ్యా.. ఆయన నాకు వైద్యం చేయిస్తారు.. అది నిజమే కానీ నేను బతకాలి కదా? ఒకవేళ నా పవిత్రత రుజువు చేసుకోకుండానే చచ్చిపోతానా అత్తయ్య అంటూ దీప కుమిలిపోతుంది. మరోవైపు మోనిత ‘ప్రియమణి అన్నట్లుగా కార్తీక్ దీపని పసిపాపలా చూసుకుంటున్నాడా? నన్ను అవైడ్ చేస్తున్నాడా?.. అంటే దీపకి విహారీకి సంబంధం అంటగట్టి నేను విజయం సాధించాననుకుంటే.. ఇప్పుడు ఆ సంగతే మరిచిపోయి. దీప చచ్చిపోతుందని తెలియగానే.. చేరదీసి సేవ చేస్తున్నాడా? ఇదంతా చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను కార్తీక్.. నా కళ్లల్లో నిప్పులు పోసుకుంటాను.. నిన్ను నావాడ్ని చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను.. నాప్రేమ నిజం.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే పుట్టాను అన్నదీ నిజం.. చూస్తా.. ఎలా రాకుండా ఉంటావో చూస్తాను.. ఎంతకాలం దీప దగ్గరే ఉంటావో చూస్తాను..’ అని తనలో తనే రగిలిపోతుంది. దీప సర్జరీ విషయమై కార్తీక్ హాస్పిటల్కు వెళతాడు. అక్కడ ఈ విషయమై డాక్టర్తో మాట్లాడుతుండగా తులసి(విహారి భార్య) రిపోర్ట్స్ చూస్తు ఏడుస్తూ వెళుతుంది. ఆవిడకు ఏమైందని కార్తీక్ అడగడంతో డాక్టర్ అసలు విషయం చెప్తాడు. వారికి పిల్లలు పుట్టరని ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే చెప్పానని, అయినా నన్ను నమ్మకుండ ఎక్కడెక్కడో టెస్టులు చెయించుకున్నారంటాడు ఆ డాక్టర్. చివరకు అమెరికా వెళ్లి కూడా పరీక్షలు చేయించుకున్నారంటాడు. అక్కడ కూడా లాభం లేకపోయే సరికి ఏవో చెట్ల మందులు వాడారు.. మళ్లీ టెస్టు చేయించుకుంది. అవే రిజల్ట్స్ వచ్చాయని ఆ డాక్టర్ కార్తీక్తో చెబుతాడు. దీంతో కార్తీక్ లోపం ఎవరీలో ఉందని తడబడుతూ అడగ్గా.. ఆవిడ భర్తలోనే అని చెప్తాడు డాక్టర్. దీంతో కార్తీక్ గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది. వెంటనే దీపను బిడ్డలకు తను తండ్రి కాదని, అంతేగాక పలుమార్లు తులసితో అసభ్యంగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీపకు సీరియస్ అవుతుంది. నేను పోతే ఆయన మోనితని పెళ్లి చేసుకుంటారా అత్తయ్యా? అని కుమిలిపోతుంది. రేపటి భాగంలో కార్తీక్ ‘నేను తప్పు చేశాను దీప నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయి వాళ్లలానే చూశాను’ అంటు పశ్చాత్తాపంతో కూలబడిపోతాడు. మరోవైపు దీప ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింతో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: ఇంటిని వల్లకాడుగా మార్చనున్న లాస్య!
విడాకుల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో మాధవి దంపతులు తులసికి క్షమాపణలు చెప్పారు. తమ మూలంగా నీ మీద ద్వేషం పెరిగిందంటూ దిగులు చెందారు. ఇప్పుడు నందు మనల్ని నమ్మే పరిస్థితిలో లేడని, అతడిని ఎలా దారికి తెచ్చుకుంటావని ఆవేదని చెందారు. కష్టాలు, కన్నీళ్లతోనే సహజీవనం చేసిన తులసికి చేజారిన పరిస్థితిని ఎలా దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకుంది. మరి నేటి(మే 21వ) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. మాధవి ఆడిన విడాకుల నాటకం బయటపడటంతో నందు తులసికి విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. ఇంకా విడాకులైనా మంజూరు కాకముందే లాస్యను నెత్తిన ఎక్కించుకుని తిరుగుతున్నాడు. ఆమె కోసం ఇంటివాళ్లనే ఎదిరిస్తున్నాడు. మరోవైపు తన పాచిక పారడంతో మరింత రెచ్చిపోయిన లాస్య నందు ఎదుట మొసలి కన్నీళ్లు కార్చింది. మీ ఇంట్లో వాళ్లు నన్ను పురుగులా చూస్తారని, అవి నేను భరించలేనని ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఏం చేయాలో చెప్పమని నందు ఆమెకు లొంగిపోయాడు. ఇదే అదునుగా భావించిన లాస్య.. తనను ఇంటి కోడలిగా చేయమని పరోక్షంగా సూచించింది. అది అర్థమైన నందు.. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి లాస్యకు ఇంటి సర్వాధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది లాస్య ఆధ్వర్యంలోనే జరగాలని ఆదేశించాడు. ఎవరేం చేయాలన్నా లాస్య అనుమతి తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పాడు. ఇకపై ఈ ఇంట్లో కోడలి స్థానం, తన భార్య స్థానం కూడా లాస్యదే అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. తనకిచ్చే విలువను లాస్యకు కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పాడు. తన భార్య స్థానంలో తులసి ఉండదని నందు కుండ బద్ధలు కొట్టాడు. ఇక ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అన్నయ్య అభికి ఫోన్కు చేసి జరిగిందంతా చెప్తూ ఏడ్చేసింది. ఇంతలో ప్రేమ్ వచ్చి దివ్యను మందలించాడు. సమస్యను చూసి పారిపోయేవాడికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్ అని మండిపడ్డాడు. భార్య మాటలు విని అమ్మను అపార్థం చేసుకున్నవాడికేం తెలుస్తుందని నిందించాడు. అతడి మాటలు విన్న అభికి నోట మాట రాక కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా దుఃఖాన్ని దిగమింగుకుని తనను తాను తమాయించుకున్నాడు. ప్రేమ్ మాటలతో అభిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. మరోపక్క జిత్తులమారి లాస్య తన అసలు రంగును చూపించేందుకు రెడీ అవుతోంది. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని ఈ ఇంటి నుంచే కాదు, ఏకంగా ఈ లోకం నుంచే పంపించేస్తానని తులసికి వార్నింగ్ ఇచ్చింది. కళకళలాడుతున్న ఇల్లు వల్లకాడు చేయాలనుకుంటున్న లాస్య ఆలోచనకు తులసి బెంబేలెత్తింది. ముందుగా నందు తండ్రి మీద గురి పెట్టిన లాస్య అతడికి పాలల్లో మోతాదుకు మించి ఎక్కువగా బీపీ ట్యాబ్లెట్లు వేసిచ్చింది. దీంతో అతడు గుండెనొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇది చూసిన తులసి తన మామయ్యను రక్షించుకుంటుందా? లాస్యకు ఎలా బుద్ధి చెప్తుంది? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా? -
Karthika Deepam: డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్
కార్తీకదీపం మే 20 : కార్తీక్, దీపకు టిఫిన్ పెట్టి టాబ్లెట్ ఇస్తాడు. ఆ తర్వాత వారణాసిని పిలిచి బయట హోటల్ నుంచి డైలీ క్యారెజ్ తీసుకురమ్మంటాడు. దీంతో దీప ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఓపిక వచ్చింది నేనే చేస్తాను మీరు బయట ఫుడ్ తినలేరు కదా డాక్టర్ బాబు అంటుంది. దీంతో కార్తీక్ నన్ను పరాయి వాడిలా చూడకు, మీతోనే ఉంటున్నా కదా మీలాగే నేను ఉంటాను అంటాడు. ఇదిలా ఉండగా తనతో ప్రియమణి ‘పదహారేళ్లు కాదు కదా నూట పదహారేళ్లు వచ్చినా మీకు కార్తీక్ అయ్యకు పెళ్లి జరగదు’ అన్న మాటలను తలుచుకుంటుంది మోనిత. వెంటనే నవ్వుకుంటూ ఈ మోనిత అంటే పూర్తిగా నీకు తెలియదు ప్రియమణీ. నువ్వు చూసింది నాణానికి ఒకవైపే. రెండోవైపు నీకు తెలియదని మనసులో అనుకుంటుంది. నేను చదువులో ఫస్ట్.. గేమ్స్లో ఫస్ట్.. కుట్రలు చేయడంలో కూడా ఫస్టే అలాంటిది పదహారేళ్లుగా కార్తీక్ని ప్రేమిస్తున్న లవ్లో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతాను? నా లెక్కలు నాకున్నాయి. నా అంచనాలు నాకున్నాయి. నేను ప్రయోగించే పద్దతులు నాకున్నాయి. ఇంక కార్తీక్తో నా పెళ్లి ఖాయం అని అనుకుని నవ్వుకుంటుంది. మరోవైపు మురళీ కృష్ణ, భాగ్యంలు దీప ఇంటికి నేను వెళతానంటే నేను వెళతానని అని వాదించుకుంటారు. మురళీ కృష్ణ వెళ్లి ఏడుస్తూ ఇంకా దీపలో బాధ పెంచుతాడని భాగ్యం వద్దు తానే వెళతానడంతో.. నువ్వు వెళ్లి సమస్యను పరిష్కరించకపోగా ఇంకా పెద్దది చేస్తావని మురళీ కృష్ణ అంటాడు. ఇక చివరకు ఇద్దరం వెళ్లొద్దని చెప్పుకుని మనసులో ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లాలనుకుంటారు. ఇక శౌర్య, హిమలు అమ్మ ఎందుకు అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నాన్న బాగానే చూసుకుంటున్నాడు కదా అయినా ఎందుకు డల్గా ఉంటుందని అనుమాన పడుతుంటారు. నాన్న మనం లేనప్పుడు అమ్మను తిడుతున్నాడా? అలా అయితే మనం ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోరు కదా అని మాట్లాడుకుంటారు. ఏదో జరుగుతోంది అదేంటో నేను తెలుసుకుంటానని శౌర్య, హిమతో అంటుంది. ఏం తెలుసుకుంటావు అని అనగానే, నేను ఆ రహస్యాలను ఈజీగా తెలుసుకోగలను, నాన్న మా నాన్నే అన్న నిజం తెలుసుకోలేదు, నువ్వు మా అమ్మ కూతురివే అనే నిజం కూడా నీకంటే మొదట నేనే తెలుసుకున్నాను, అన్ని తెలుసుకున్న దాన్ని ఇది తెలుకోలేనా అంటుంది శౌర్య. అయితే అదేంటో తొందరగా కనిపెట్టు మనం నానమ్మకు చెబుతాం అంటుంది హిమ. కార్తీక్కు దీప కాఫీ తీసుకువస్తుంది. ఏంటి నిన్ను పెట్టొద్దన్నాను కదా అని వారించే లోపు మీరు పెట్టిందే డాక్టర్ బాబు ఫ్లాస్క్లో ఉన్నది పోసుకొచ్చాను అంటుంది. ఆ తర్వాత కాఫీ గ్లాసు తీసుకుని తాగతూ.. కాసేపు ఆగి మజ్జిగ తాగు చేసిపెట్టాను అంటాడు. దాంతో దీప మజ్జిగ నేను చేసుకోలేనా డాక్టర్ బాబు. మజ్జిగ చేసినా చచ్చిపోతానా అనడంతో నవ్వు ఇబ్బంది పడకూడదని చేసిపెట్టానని, అయినా నువ్వు పదే పదే చావు గురించి మాట్లాడకు అని అంటాడు కార్తీక్. మీరు ఆ మాట ఒక్కసారే చెప్పారు, కానీ చచ్చిపోయేది నేను కదా విని వదిలేయలేను అంటుంది దీప. నువ్వు అంత బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రేపో ఎల్లుండో నీకో చిన్న సర్జరీ చేస్తారు అది అయిన వెంటనే ఇంటికి పంపించేస్తారు. మందులు వాడుతూ జాగ్రత్తగా ఉంటే చాలంటాడు కార్తీక్. దీంతో మీరే దగ్గరుండి సర్జరీ చేయిస్తారా? డాక్టర్ బాబు అంటుంది, అవును అయినా అదేం ప్రశ్న అని కార్తీక్ అనగానే.. నిజం చెప్పండి డాక్టర్ బాబు ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నారా అంటుంది దీప. చాలు అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకు అంటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మోనిత ధీనంగా కూర్చుని ఉంటే.. ప్రియమణి వచ్చి ఏంటమ్మా ఏదో జరుగుతోందని అర్థమవుతుంది అంటుంది. వెంటనే మోనిత ఏంటీ అనగడంతో కార్తీక్ అయ్య దీపమ్మని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చిన్నారిపాపలా చూసుకుంటుంటే. మీరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు అనుకున్నా అని అడుగుతుంది. మీ కడుపు బగ్గున మండిపోతుంది అనుకున్నా.. అలాంటిది ఏం జరగకుండా మీరు కూర్చున్నారంటే ఇదంతా నాకు మింగుడు పడటం లేదు అంటుంది. నువ్వు మాట్లాడేవన్నీ నిజలే ప్రియమణీ ఏదో జరుగుతుంది, అదే ఏంటని ప్రియమని అడగ్గా, అదే నిజం అంటుంది మోనిత, అదే ఏం నిజమనగానే మోనిత ‘కార్తీక్ నా కాళ్ల దగ్గరికి వచ్చే’ నిజం అంటు సిరీయస్గా అంటుంది మోనిత. దీంతో ప్రియమని భపడుతూ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉందంటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా సౌందర్య దీప దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి ఎందుకు వచ్చేశావ్ అని దీపకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత సౌందర్య వంకే ధీనంగా, బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ డాక్టర్ ద్వారా అసలు నిజంగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సత్య తల్లిదండ్రుల చావుకు కారణం ఎవరో రివీల్ చేసిన నందా
సత్యకు తన జన్మరహస్యం చెప్పి నందా షాకిస్తాడు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఎవరో కూడా చెప్తాడు. మరోవైపు సత్యకు బ్రెయిన్ వాష్ చేశానని, ఇప్పుడు మొత్తం తను చెప్పిందే వింటుందని ఆదిత్యతో చెప్పి మరో ప్లాన్ వేసే పనిలో ఉన్నాడు నందా. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళఉ వెళ్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే20నన 238వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేయడంతో సత్య రోడ్డున పడుతుంది. తన పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లి భాగ్యమ్మకు ముఖం చూపించుకోలేక బాధపడుతుంది. ఇది గమనించిన నందా అక్కడికి చేరుకొని సత్యతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు. అయితే నందాను సత్య ఛీదరించుకుంటుండంతో ఎలాగైనా సత్య పొగరును అణచివేయాలని బావిస్తాడు. సత్య జన్మరహస్యం గురించి బయటపెట్టేస్తాడు. తన కన్నతల్లి భాగ్యమ్మ కాదన్న నిజాన్ని తనకు తెలుసని చెప్తాడు. అంతేకాకుండా సత్య తల్లిదండ్రుల చావుకు కారణం కూడా భాగ్యమ్మ కుటుంబసభ్యులే అని చెప్పి సత్యకి ఊహించని షాకిస్తాడు. అయితే నిజమో కాదో అని ఆలోచిస్తుండగానే కావాలంటే మీ ఇంటికి వెళ్లి కనుక్కోపో అని నందా అని అంటాడు. మొత్తంగా సత్యను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తను చెప్పింది వినేటట్లు డ్రామా క్రియేట్ చేస్తాడు. ఇక సీన్కట్ చేస్తే సత్య ఇంకా ఇంటికి చేరుకోలేదని తెలిసి రుక్మిణి కంగారు పడుతుంటుంది. సత్యకు ఏమవుతుందో అని భయపడిపోతుంటుంది. వెంటనే సత్యను వెతకాలని భర్త ఆదిత్యను కోరుతుంది. ఇక ఆదిత్య బయటకు వెళ్తుండగా నందా ఫోన్ చేసి సత్య ఇప్పుడు తన దగ్గరే ఉందని, తను చెప్పినట్లు వింటుందని చెప్పడంతో ఆదిత్య షాకవుతాడు. సత్యను ఏం చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Intinti Gruhalakshmi: ఇంటి కోడలిగా లాస్య!
నేటి(మే 20) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందునుంచీ ఊహించినట్లుగానే మాధవి విడాకులు ఉట్టి డ్రామా అని తేలింది. తులసి జీవితం బాగుచేసేందుకు, నందులో మార్పు కోసం చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. వీరి ప్లాన్ను లాస్య తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇదంతా తులసే దగ్గరుండి చేయించిందని చెప్తూ ఆమెను అన్యాయంగా ఇరికించింది. ఇది నిజమని నందును నమ్మించి అతడిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరి ఈరోజు ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సీక్రెట్గా ఓ చోట కలుసుకున్న మాధవి దంపతులు ఒక్కసారిగా పడీపడీ నవ్వుకున్నారు. వాళ్ల నటనను అందరూ నమ్మేశారని సంతోషించారు. ఏదైతేనేం, తులసి దంపతులు మళ్లీ కలిసిపోతారు అని సంబరపడ్డారు. దీనికి కారణమైన లాస్యను కూడా అన్నయ్య మనసులో లేకుండా చేయాలని రగిలిపోయింది మాధవి. అయితే వీరిని ఫాలో అయి వచ్చిన భాగ్య వీరి బండారం బయటపెట్టేందుకు వారి మాటలను సీక్రెట్గా వీడియో తీసింది. దీన్ని లాస్యకు చూపించడంతో ఆమె దానికి మరింత మసాలా కలిపి తులసిని ఓడించాలనుకుంది. వారి విడాకుల నాటకానికి రచన, దర్శకత్వం అన్నీ తులసే అని నమ్మిస్తే నందు తన భార్యను జీవితంలో నమ్మడని ఆలోచించింది. అనుకున్నట్లుగానే నందును ఈజీగా నమ్మించింది లాస్య. ఈ విషయం నిజంగా తనకు తెలియదని, తనకు ఈ ప్లాన్తో ఎటువంటి సంబంధం లేదని తులసి మొత్తుకున్నా నందు ఆమె మాటలను చెవికెక్కించుకోలేదు. అందరూ కలిసి తనను మోసం చేశారని మండిపడ్డాడు. తులసితో చేతులు కలిపి తనను వెర్రివాడిని చేశారని ఆవేదన చెందాడు. ఇక జీవితంలో తులసిని నమ్మేది లేదని తేల్చి చెప్పాడు. లాస్యే తనకు సర్వస్వం అన్నట్లుగా మారిపోయాడు. ఇకపై ఇంటి సర్వాధికారాలు లాస్యకు ఇద్దాం అనుకుంటున్నానని నందు చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఇంటి కోడలి స్థానం లాస్యదే అని తెగేసి చెప్పడంతో తులసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ బాధతో కుమిలిపోతే తనకు ఒరిగేదేమీ లేదనుకున్న తులసి రేపటి ఎపిసోడ్లో తిరగబడనున్నట్లు తెలుస్తోంది. మరి తులసి తన స్థానం కోసం పోరాడుతుందా? బాధతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Intinti Gruhalakshmi: లాస్యను గెంటేసిన తులసి -
Karthika Deepam: తల్లిపై దిగులు పెంచుకున్న శౌర్య, హిమ
కార్తీకదీపం మే 19: దీప డాక్టర్ బాబును కార్తీక్ అని పిలుస్తుంది. ఇది కూడా తన పదేళ్ల కోరిక అని మిమ్మల్ని ఎప్పుడైన కార్తీక్ అని పిలవాలనిపించేది డాక్టర్ బాబు అని చెబుతుంది. అంతేగాక వారం, పది రోజుల్లో పోయేదాన్ని ఇప్పుడే ఇలాగే మీ ఒడిలో తలపెటుకుని కన్నుమూయాలనుంది అంటూ ఏమోషనల్ అవుతుంది. దీంతో కార్తీక్.. డాక్టర్లు, మందులు ఉన్నవి మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తుండటానికి కాదు అని అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి స్నానం చేసి వస్తే టిఫిన్ పెడతాను, ఆ తర్వాత టాబ్లెట్ ఇస్తా అంటూ దీప చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ తీసుకుని వెళతాడు. ఆ తర్వాత డాక్టర్ బాబు తనను చేతితో తాకడానికి కూడా ఆలోచిస్తున్నాడంటే.. ఇదంత తన మీద ప్రేమతో కాదని జాలితో చేస్తున్నాడనుకుంటుంది. ఆ తర్వాత దీప స్నానానికి వెళ్లడంతో కార్తీక్ పిల్లలతో కలిసి టిఫిన్ చేస్తాడు. ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటే శౌర్య, హిమలు మమ్మీ కూడా మనతో కలిసి టిఫిన్ చేస్తే బాగుండు అనుకుంటారు. అమ్మ రోజు పొద్దున్నే లేచి ఇళ్లు ఉడిచి, ముగ్గు పెట్టి మాకోసం టిఫిన్ తయారు చేసి అప్పడు లేపేది. ఇలా అమ్మను ఎప్పుడు చూడలేదంటు దిగులు పడుతుంటారు పిల్లలు. దీంతో కార్తీక్ మమ్మీకి ఏం కాలేదు కాస్తా నిరసంగా ఉందంతే. టాబ్లెట్స్ వేసుకుని, కొన్ని రోజులు వంట దగ్గరికి రాకుండ ఉంటే చాలు అంటాడు. దీంతో హిమ అయితే మాకు ఇప్పుడు నువ్వు వంట పనుల్లో కొంచం సాయం చేస్తే చాలు, పెద్దాయ్యాక మాకెవరి సాయం లేకుండా మేమే వంట చేస్తామని కార్తీక్తో అంటుంది. అంతేగాక అప్పుడు అమ్మను కుర్చోబెట్టి తనకు ఇష్టమైనవన్ని చేసి పెడతామని, అమ్మకు నచ్చిన సినిమాలు, పుస్తకాలు కొనిపెడతామంటూ ఇద్దరూ అంటుంటే.. కార్తీక్ దీప బతకదు అని డాక్టర్ భారతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత చాలా హుషారుగా కనిపిస్తుంది. ప్రియమణి టీ తీసుకురావడానికి ముందే మోనిత లేచి స్నానం చేసి దేవుడికి దీపం ముట్టిస్తుంది. అది తెలుసుకుని ప్రియమణి షాక్ అవుతుంది. మీరేంటి దీపం ముట్టించడమేంటి అమ్మగారు.. అలా మీరు దేవుళ్లను ఇరకాటంలో పెడితే ఏలా అమ్మగారు అంటు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. ఎప్పటికైనా చేయాలి కదా ప్రియమణి.. రేపు కార్తీక్ని పెళ్లి చేసుకున్నాక పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ కప్పుతో కార్తీక్ను లేపాలి కదా అంటు మురిసిపోతుంది. ప్రియమణి కారు కడుగుతుంటే, మోనిత టీ తాగుతూ బయటకు వస్తుంది. ఆడవాళ్లు ఇలా కారు కడగడం మొదటిసారి చూస్తున్నానని మోనిత అనగానే.. ఆడవాళ్లతో కారు కడిగించే వాళ్లను కూడా నేను ఇప్పుడే చూస్తున్నా అంటుంది. నా దగ్గర పని చేస్తే వాళ్లు ప్రపంచంలో ఎక్కడైన బతుకుతారంటూ మోనిత గర్వంగా చెబుతుంది. హా.. నేను పెళ్లి చేసుకుని వెళ్లాక మీకు ఎలాంటి పనివాళ్లు దొరుకుతారో చూస్తా అంటుంది ప్రియమణి. దీంతో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోను అన్నావ్ కదే అని అంటుంది మోనిత. అప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు చేసుకుంటా అంటుంది. నా పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి చేసుకునేది లేదు అనగానే ప్రియమణి.. ఏంటమ్మా మీ పెళ్లి అయ్యాకా నేను చేసుకోవాలా.. అప్పటికి నా వయసు కూడా అయిపోతుంది.. మీ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా, కార్తీక్ అయ్య దీపమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి.. దీపా పాపా అంటూ మందులు పట్టుకుని ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటే..మీ పదహారేళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా మీ పెళ్లి మాత్రం జరగదు అని వాదిస్తుంది . ప్రియమణి మాటలకు మోనిత రగిలిపోతుంది. అయినప్పటికీ కోపాన్ని ఆపుకుంటు ఈ టైంలో అసలు కోపం తెచ్చుకోవద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అని మనసులో అనుకుంటుంది. ఇక దీప స్నానం చేసి రెడీ అయ్యి రాగానే కార్తీక్ టిఫిన్ పెట్టి, టాబ్లెట్స్ ఇస్తాడు. ఆ తర్వాత దీప ఇదంతా నా మీద ప్రేమతో కాకుండా జాలితో చేస్తున్నారు కదా డాక్టర్ బాబు అని అడుగుతుంది. దీంతో నేటి ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సంతోషంలో మునిగితేలుతున్న రంగా-బంతి
సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలిసి రంగా తెగ సంబంరపడిపోతాడు. ఇన్నాళ్లకు తను అనుకున్నది సాధ్యమైదంటూ ఆనందంలో మునిగితేలతాడు. ఇంక ఇంటికి రమ్మని దేవుడమ్మ అడిగినా రంగా అందుకు ఒప్పుకోడు. ఇక సత్య పరిస్థితి తెలుసుకున్న భాగ్యమ్మ నిట్టూర్చింది. తన కుటుంబానికే ఇలా ఎందుకు అవుతుదని బాధపడిపోతుంది. సత్యను రోడ్డుపై చూసిన నందా అక్కడికి వచ్చి మళ్లీ తన బుద్ది చూపించుకున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సత్యతో తిట్లు తింటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే19న 237వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలుసుకున్న రంగా ఎంతో సంతోషపడతాడు. తను అనుకున్నది నిజం అయిందంటూ తన ఆనందాన్ని బంతితో పంచుకుంటాడు. దేవుడమ్మ తన దగ్గరికి వచ్చి తలదించేకునే రోజు దగ్గర్లోనే ఉందని అంటుంబగా దేవుడమ్మ నుంచి రంగాకు ఫోన్ వస్తుంది. కనకం వచ్చిందని, వెంటనే ఇంటికి రావాలని కోరుతుంది. అయితే రంగా మాత్రం చాలా దురుసుగా మాట్లాడుతూ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని, తనకిష్టం వచ్చిందే చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సీన్ కట్ చేస్తే సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి పంపిందన్న నిజం తెలిసి భాగ్యమ్మ తట్టుకోలేకపోయింది. ఏం పాపం చేశామని నా బిడ్డలకు ఆ దేవుడు శిక్ష వేస్తున్నాడంటూ కుంగిపోతుంది. ఇక టైం బాగోలేక ఇలాంటి గతి పట్టిందని నందా అనుకుంటుండగా రోడ్డుపై సత్య కనిపిస్తుంది. దీంతో షాకైన నందా నిన్ను కూడా గెంటేసిందా అంటూ సత్యతో సెటైరికల్గా మాట్లాడతాడు. నిన్ను భార్యగా ఫిక్సయ్యానని, తనతో పాటు వచ్చేయమని నందా సత్యను కోరతాడు. దీంతో గట్టి సమాధానం చెప్పిన సత్య నీ వల్లే ఇలా రోడ్డు మీదకి వచ్చానని బాధపడుతుంది. ఇంత జరిగినా బుద్ది మార్చుకోని నందా సత్య పొగరుని దింగాలని ప్లాన్ చేస్తుంటాడు. అదేంటో తెలియాల్సి ఉంది. -
Intinti Gruhalakshmi: వాటే ట్విస్ట్, లాస్యను గెంటేసిన తులసి
విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న మోహన్ మనసు ఎలా మార్చాలా? అని నందు ఫ్యామిలీ మల్లగుల్లాలు పడుతోంది. కానీ వీరి ఆలోచనకు భిన్నంగా మాధవి కూడా విడాకులకై సై అనడం గమనార్హం. మరి వీరి మనసు మార్చేదెవరు? విడాకులను అడ్డుకున్నారా? అందుకోసం ఏం చేశారు? అనేది తెలియాలంటే నేటి(మే19) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్ స్టోరీ చదివేయాల్సిందే! భవిష్యత్తు అల్లకల్లోలం అవుతుందని తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మాధవి. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయే తప్ప సమస్యకు మాత్రం మంచి పరిష్కారం దొరకలేదు. ఆర్తనాదాన్ని కూడా అల్లరే అనుకునేవారికి మన గుండె ఘోష అర్థం కాదంటూ తులసి మాధవిని ఊరుకోబెట్టింది. తనను వద్దనుకున్న వ్యక్తిని పట్టుకుని వేలాడుతూ ఉండటం వల్ల లాభం లేదని భావించిన మాధవి విడాకుల పత్రం మీద సంతకం పెట్టింది. తనకు విడాకులు మంజూరైన వెంటనే తులసి, తాను ఇంటి నుంచి వెళ్లిపోతామని నిర్ణయం తీసుకుంది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈ ఇంట్లో బతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో అందరూ షాక్కు గురయ్యారు. ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలపై నందు కలత చెందాడు. ఈ సమయంలో ప్రేమ్ తండ్రి దగ్గరకు వెళ్లి వీటన్నింటికీ కారణం నువ్వే అని నిందించాడు. మీ వల్లే రెండు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకపోతే జీవితాంతం బాధపడతారని హెచ్చరించాడు. దీంతో నందు ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లాస్య కాల్ చేసిందంటూ భాగ్య ఫోన్ తీసుకెళ్లడంతో నందు చిరాకు ప్రదర్శించాడు. ఫోన్ చేసింది సీఎం, పీఎం కాదు కదా, తర్వాత చేస్తానంటూ చిర్రుబుర్రులాడాడు. తన ఫోన్ కాల్ పట్టించుకోకపోవడమేంటి? అని లాస్యకు ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. మన ప్లాన్ మనకే తిప్పికొట్టేలా ఉందని కంగారుపడిపోయింది. వీలైనంత త్వరగా తిరిగి ఇంట్లో అడుగుపెట్టాల్సిందేనని డిసైడ్ అయింది. చెల్లెలి జీవితం ఏమైపోతుందోనన్న ఆలోచనలతో నందుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మాధవి కూడా తెగదెంపులు చేసుకోవడానికే రెడీ అయిందని తెగ బాధపడ్డాడు. తాను చేసిన తప్పే తన చెల్లెలి రూపంలో వచ్చి వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోందని దిగులు చెందాడు. తులసి జీవితంలో నిప్పులు పోయడానికి ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య. తన భార్య స్థానం లాస్యదేనని నందు తేల్చి చెప్పడంతో సహించలేకపోయింది. లాస్య చేయి పట్టుకుని బయటకు గెంటేసింది. దీంతో రేపటి ఎపిసోడ్ రసవత్తరంగా మారనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: Intinti Gruhalakshmi: లాస్యను పక్కన పడేసిన నందు! -
Devatha : ఇంట్లోంచి వెళ్లిపోయిన సత్య అఘాయిత్యం చేసుకుంటుందా?
సత్యను దేవుడమ్మ ఇంట్లొంచి గెంటేస్తుంది. రుక్మిణి ఎంత బతిమాలినా దేవుడమ్మ కరగదు. ఇక తనకు న్యాయం జరిగేవరకు ఆ ఇంట్లోనే ఉంటానని కనకం దేవుడమ్మకి చెప్తుంది. ఇక సత్య-నందాల విషయం ఇంత వరకు పసిగట్టలేకపోయిన ఆదిత్యను తిట్టిన దేవుడమ్మ అతడి అసమర్థను ఎత్తిచూపుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే18న 236వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేస్తుంది. అనుకోని పరిణామంతో షాక్ అయిన రుక్మిణి సత్యను ఇంట్లోంచి పంపించొద్దని దేవుడమ్మను వేడుకుంటుంది. అయినా సరే దేవుడమ్మ కరగదు సరి కదా ఇలానే చేస్తు నువ్వు కూడా ఇంటి బయట ఉంటావ్ అంటూ రుక్మిణిని హెచ్చరిస్తుంది. ఇక సత్య-నందాలు చేసిన తప్పుతో ఇంట్లోంచి రెండు శవాలు వెళ్లిపోయాయని, అందరూ తలంటు స్నానం చేయాలని ఇంట్లో వాళ్లని ఆదేశిస్తుంది దేవుడమ్మ. సీన్కట్ చేస్తే తనకు జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చెబుతావంటూ కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్తుంది. ఇక సత్యను ఇంట్లోంచి పంపించడం పట్ల రుక్మిణి చాలా బాధపడుతుంది. ఎలా అయినా దేవుడమ్మను క్షమించమని చెప్పమని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. అయితే సత్య పేరు ఎత్తగానే దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ తనతో పాటే కలిసి చదువుకున్నా వాళ్ల మానసిక స్థితి ఏంటో తెలుసుకోలేకపోవడం నీ అసమర్థత అంటూ ఆదిత్య లోపాలను ఎత్తిచూపుతుంది. -
Karthika Deepam: దీప పదేళ్ల కోరిక తీర్చిన డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 18: దీప శ్రీరాంనగర్ బస్తీలో కార్తీక్తో కలిసి ఉందని తెలిసి మొరళీ కృష్ణ సంతోష్తిస్తాడు. దీప ఎక్కడికి వెళ్లలేదు, ఈ ఊర్లోనే.. అదే ఇంట్లో ఉందంటూ భాగ్యంతో చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తాడు. దీంతో భాగ్యం దానికి ఇంత ఆత్మగౌరం ఎందుకండి, డాక్టర్ బాబే కదా ఇంటికి తీసుకు వచ్చింది హాయిగా అత్తింట్లో ఉండకుండా దానికి ఇదేం పిచ్చి అంటుంది. దీంతో మొరళీ కృష్ణ.. డాక్టర్ బాబులో ఇంకా అనుమానం అలాగే ఉందని, తల్లికి కోడలిగా, పిల్లలకు తల్లి అవరమని ఇంకా దాని ఆరోగ్యం గురించి ఆలోచించి తీసుకువచ్చాడని, అత్తింట్లోనే ఓ అతిథిగా ఉండటమంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది భాగ్యం అని మురళీ కృష్ణ అంటాడు. అవునండి మీరు చెప్పింది కూడా నిజమే.. కానీ దీప ఎప్పుడు ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే డాక్టర్ బాబు కూడా ఎన్నాళ్లని ఓపిక పడతాడని, ఇలా చేస్తే విసుగొచ్చి ఆ మోనిత దగ్గరికి వెళ్లిపోతే, ఆమెనే పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అంటుంది. దీంతో మురళీ కృష్ణ కూడా నిజమేనంటు ఆలోచిస్తాడు. అంతేగాక దీప, కార్తీక్లు ఎప్పుడెప్పుడు విడిపోతారాని ఎదురు చూస్తుంది ఆ మోనిత అంటు గుర్తు చేస్తాడు. అందుకే ఈసారి వెళ్లినప్పడు దీపతో అత్తింట్లో సర్ధుకునిపోవాలని కాస్తా గట్టిగా చెప్పండని అంటుంది భాగ్యం. ఇదిలా ఉండగా కార్తీక్ దీప గురించి ఆలోచిస్తుంటాడు. దీప తప్పు చేసిందో లేదో పక్కన పెడితే మనిషిగా తనను హ్యాపీగా చూసుకోవాలని, దీప రక్షించుకోవాలని అనుకుంటాడు. అందుకు దీపను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. ఇక తెల్లారినా దీప లేవకపోవడంతో పిల్లలు (శౌర్య, హిమ) రెడీ అయ్యి కార్తీక్ కోసం టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలోకి వెలతారు. శౌర్య దోశ వేస్తుంటే హిమ పక్కనే ఉండి చూస్తుంటుంది. అంతేగాక ఇంకా చట్నీ కూడా చేయాలి ఏం చేద్దామని అడుగుతుంది శౌర్యను. ఇదిలా ఉండగ పెనం మీద వేసిన దోవ దానికి అతుక్కుపోయి మాడిపోతుంది. శౌర్య దాన్ని తీసేందుకు కాస్త బలం ఉపయోగించడంతో దోశ ఎగిరి నెలపై పడుతుంది. దీంతో పిల్లలు అయ్యో అని అరవగానే కార్తీక్ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వంటగదిలో శౌర్య, హిమలను చూసి ఏమైంది అలా అరిచారని అడగడంతో అమ్మ ఇంకా లేవలేదని, మీకు పొద్దున్నే టిఫిన్ చేసే అలవాటు కదా మీ కోసం దోశ చేసిపెడదామని వచ్చామని చెప్పగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నా పిల్లలు నాకోసం టిఫిన్ చేస్తారా, ఏం అక్కర్లేదు మీ చిట్టి చేతులకు గాయాలైతే ఈ నాన్న తట్టుకుంటాడా అంటాడు. మీరు వెళ్లండి ఈ రోజు నేను టిఫిన్ చేస్తా అనగానే.. పిల్లలు సరే నాన్న నువ్వు దోశలు వేయి మేం చట్నీకి అవసరమైనవి రెడీ చేస్తామంటారు. ఇక కార్తీక్ దోశలు వేసి దీప కోసం కాఫీ తీసుకుని వెళతాడు. దీపను లేపి కాఫీ చేతికిస్తాడు. లేచారా డాక్టర్ బాబు రాత్రి దోశల పిండి రుబ్బి పెట్టాను టీఫిన్ వేస్తా అనేలోపు.. కార్తీక్ నేనే దోశలు వేశాను. అందరి కోసం వేశాను, దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టాను, నువ్వు స్నానం చేసి టిఫిన్ చేశాక టాబ్లెట్స్ ఇస్తా అంటాడు. ఇక అక్కడ నుంచి బయటకు వస్తుంటే దీప డాక్టర్ బాబు అని పిలిచి కూర్చోమంటుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉందని, ఒకే గ్లాస్లో మీతో కాఫీ పంచుకోవాలని పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. పెళ్లైన కొత్తలో మీకు చెబుదామంటే భయం, ఇక దూరమయ్యాక అడిగే అవకాశం రాలేదు. ఇప్పుడు ఎలాగు వెళ్లిపోతున్నాను కదా అందుకే అడుగుతున్న అని కార్తీక్తో అంటుంది దీప. వెంటనే దీప చేతిలోని కాఫీ గ్లాస్ తీసుకుని కొంచం తాగి దీపకు ఇస్తాడు కార్తీక్. అది తాగి దీప మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: లాస్యను పక్కన పడేసిన నందు!
మాధవి పుట్టింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నందు ఇంట్లో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆమె కన్నీళ్లను చూడలేక సతమతమవుతున్నారు ఇంటిసభ్యులు. దీనికి పరిష్కారం వెతికేందుకు ఇంటిల్లిపాది ఆలోచిస్తుంటే విడాకులకే సై అంటున్నాడు మోహన్. ఈ క్రమంలో అతడు విడాకుల పత్రాలు తీసుకుంటూ నేరుగా నందు ఇంటికే వచ్చాడు. ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుంటే లేపని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని ప్రశ్నిస్తూ అందరి నోరు మూయించాడు. ఈ క్రమంలో నేటి(మే 18) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మాధవి సంతకం కోసం నందు ఇంట్లో అడుగు పెట్టాడు మోహన్. నువ్వు నా కూతురికి ద్రోహం చేస్తుంటే కడుపు రగిలిపోతుందని అతడిని తిట్టిపోసింది గయ్యాళి అత్త. ఆమె మాటలకు అసహనం వ్యక్తం చేసిన మోహన్ మరి ఇదే స్థానంలో మీ కోడలు ఉన్నప్పుడు ఇంత కోపం రాలేదేంటని అడిగాడున్. అయినా వాదనలు అనవసరమని 24 గంటల్లో సంతకం పెట్టు అంటూ విడాకుల పేపర్ను ఆమె చేతిలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తనకు విడాకులు తథ్యమేనా అని భయపడిపోయిన మాధవి కన్నీరుమున్నీరుగా విలపించింది. కట్టుకున్న భర్త తనను వద్దంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలిసిన తులసికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. దీంతో తన చెల్లెలిని ఓదార్చడానికి వెళ్లిన నందుకు భంగపాటు ఎదురైంది. నువ్వు చేస్తుంది కూడా తప్పే అంటూ కాళికా అవతారం ఎత్తింది. విడాకుల విషయంలో నీ చెల్లెలికి ఒక న్యాయం, నీ భార్యకు ఒక న్యాయమా అని సూటిగా ప్రశ్నించింది. ఈ మాటలు విని నందు తల్లి అగ్గి మీద గుగ్గిలమైంది. నీ మొగుడిని హద్దుల్లో పెట్టుకోవడం చేతకాక నా కొడుకును అంటావేంటి అని నందు తల్లి మాధవి మీద విరుచుకుపడింది. నా భర్త, అన్నయ్య ఇద్దరూ చేస్తున్న తప్పు ఒకటే కదా అని గుర్తు చేసింది. అసలు నీ వల్లే అన్నయ్య ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడంటూ తల్లిని ఏకిపారేసింది మాధవి. మరోవైపు ఫారిన్ వెళ్తున్నందుకు అంకిత సంతోషపడుతుంటే అభి మాత్రం లోలోపలే ఉడికిపోయాడు. నీ వల్ల మనసు చంపుకుని, మీ తల్లిదండ్రుల ముందు తల దించుకుంటున్నాను అని ఆవేదన చెందాడు. మన కోసమే ఇదంతా చేశానన్న అంకిత మాటలకు మధ్యలోనే అడ్డు చెప్తూ కేవలం నీ సంతోషం కోసమే ఫారిన్కు వెళ్లడానికి ఒప్పుకున్నానని తేల్చి చెప్పాడు. దీంతో దిగులు చెందిన అంకిత తను తప్పు చేశానా అని మథనడపడటం ప్రారంభించింది. ఇదిలా వుంటే నందులో మార్పుకు పునాది పడినట్లు కనిపిస్తోంది. లాస్య ఫోన్ కాల్ను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఎటువైపు సాగుతుంది? లాస్య దీన్ని ఎలా అడ్డుకుంటుంది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: కోలివుడ్లో విషాదం: నటుడు, దర్శకుడి సతీమణి మృతి -
Intinti Gruhalakshmi: మాధవి విడాకుల నాటకం! లాస్యకు చుక్కలే?
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా మారిది లాస్య పరిస్థితి. తను ఏ లక్ష్యంతో నందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందో అది నెరవేరేలా కనిపించడం లేదు. పైగా నందు సోదరి మాధవి సడన్గా ఇంట్లోకి వచ్చేయడంతో ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తన భర్త వదిలేయాలనుకుంటున్నాడంటూ మాధవి ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావిస్తోంది లాస్య. మరి నేటి(మే 17) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. మొన్నటివరకు దివ్యను ఎలా చదివించాలన్న టెన్షన్తో మథనపడిపోయిన నందుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. తన సోదరి మాధవి జీవితం అర్థం కాని ప్రశ్నలా మారిపోతుందేమోనని కలవరపడుతున్నాడు. ఎలాగైనా ఆమె జీవితం చక్కదిద్దాలని ప్రయత్నించాడు. మాధవి భర్త మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వేలెత్తి చూపాడు. తనను విడిచిపెడితే అస్సలు బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. కానీ మరో ఆడదాని కోసం కట్టుకున్న భార్యను వదిలేసుకునేందుకు సిద్ధపడ్డ నందు తనకు నీతులు చెప్పే అర్హత లేదని మోహన్ విమర్శించాడు. మోహన్ మాత్రం విడాకులకే మొగ్గు చూపడం గమనార్హం. పైగా విడాకుల ఆలోచన మనసులోకి రావడానికి మాత్రం నందునే కారణమని చెప్పాడు. పక్కవారికి నీతులు చెప్పేముందు తన తప్పొప్పుల గురించి ఆలోచించుకోమని హితవు పలికాడు. అతడి ధోరణితో ఖంగు తిన్న నందు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన లాస్య.. మాధవి ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావించింది. ఎందుకైనా మంచిది, ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండమని భాగ్యకు మరీ మరీ చెప్పింది. అక్కడ మాధవి కూడా తన భర్త ఎవరిని చూసి ప్రేరణ పొందుతున్నారో అని పరోక్షంగా నందును విమర్శించింది. ఎవరిని చూసి ఇలా భార్యను వదిలేస్తానంటున్నాడో అని అతడికి చురకలంటించింది. దీన్నిబట్టి మాధవి దంపతులు నందులో మార్పు తీసుకురావడానికి విడాకుల నాటకం ఆడుతున్నారా? లేదా నిజంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నారా? అనేది తేలాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: Intinti Gruhalakshmi: తులసి సాయం, లాస్య మొసలి కన్నీళ్లు -
Devatha : సత్యను కొట్టిన దేవుడమ్మ..ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశం
నందాను ఇంట్లోంచి గెంటేస్తారు. ఇదే అవకాశం అన్నట్లు దేవుడమ్మ తప్పులను ఎత్తిచూపుతూ దారుణంగా అవమానిస్తుంది రాజేశ్వరి. దీంతో సత్యను లాగి కొట్టిన దేవుడమ్మ తనను మోసం చేసినందుకు సత్యపై మండిపడుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే17న 235వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా అసలు నైజాన్ని రుక్మిణి బయటపెడుతుంది. దీంతో నందాను తన కళ్లముందు నుంచి వెళ్లకపోతే చంపేస్తానని దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే అక్కడ్నుంచి జారుకుంటాడు నందా. సరిగ్గా అదే సమయానికి రాజేశ్వరి అక్కడికి వస్తుంది. గతంలో తన కుటుంబంలో ఇలాంటి తప్పే జరిగితే మోసం చేసినవాడు సహా కుటుంబం మొత్తాన్ని ఊరు నుంచి వెళ్లగొట్టిన దేవుడమ్మ ఇప్పుడేం న్యాయం చేస్తుందంటూ ప్రశ్నిస్తుంది. నందా గురించి ముందే తెలిసినా సత్య డ్రామాలు ఆడిందా అంటూ దేవుడమ్మ మనసులో విషాన్ని నూరిపోస్తుంది. పెద్దరికం తెలియని నువ్వు ఊళ్లో అందరికి నీతులు చెప్తావా అంటూ దేవుడమ్మను దారుణంగా అవమానిస్తుంది. దీంతో కోపంతో ఊగిపోయిన దేవుడమ్మ సత్యపై చేయిచేసుకుంటుంది. కన్నబిడ్డలా చూసుకున్న తనను మోసం చేశావంటూ సత్యపై మండిపడుతుంది. ఎవరో అనామకుడిని ఇంటికి తెచ్చి ఇంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించిందంటూ ఫైర్ అవుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. అయితే నందా తప్పు చేస్తే తన చెల్లిని ఎందుకు శిక్షిస్తున్నారంటూ రుక్మిణి అడ్డుచెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ వినిపించుకోందు. సత్య చేసింది మోసం కాదు, నేరమని ఘాటుగా బదులిస్తుంది. సత్య కూడా క్షమించమని దేవుడమ్మను వేడుకున్నా ఆమె మాత్రం కరగదు సరి కదా సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీళ్లేదని ఆఙ్ఞాపిస్తుంది. -
karthika Deepam: ఈ దేవుడే కాదు.. ఆ దేవుడు కూడా దగా చేశాడు: దీప
కార్తీకదీపం మే 17: నువ్వు ఇలానే బాధపడుతుంటే పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు పిల్లలు తట్టుకుంటారా అని కార్తీక్ దీపతో అంటాడు. గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను భయపడకంటూ కార్తీక్ దీపకు ధైర్యం చెబుతుంటే.. కనీసం ఇప్పుడైన నన్ను ముట్టుకోవాలనిపించడం లేదా డాక్టర్ బాబు అని అంటుంది. ఇక కార్తీక్ అదేంలేదు ఏదో ఆలోచిస్తున్నానంటూ దీప భుజం తట్టగా.. కార్తీక్ చేతిని దీప తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత.. ‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగానే ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుది వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు’ అంటు దీప భావోద్యేగానికి లోనవుతుంది. ఆ తర్వాత లేచి బెడ్రూంకి వెళ్లిపోతుంది. మరోవైపు దీపకు ఏదో జరిగినట్లు మురళీ కృష్ణకు పీడకల రావడంతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు. అలాగే షాక్లో ఉండిపోయిన మురళీ కృష్ణకు భాగ్యం నీళ్లు తాగించి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఏమైందయ్యా అని ఆమె అడగ్గా.. ఇలా దీప గురించి కల వచ్చిందిని చెప్తాడు. ‘నా వల్ల కాదు. నా కూతురి కోసం బాధపడుతూ ఇక్కడే ఉండలేను’ అంటాడు. వెంటనే దీపను వెతకడానికి బయలుదేరుతానంటూ మురళీ కృష్ణ కదులుతుండగా.. భాగ్యం.. ‘ఆగండి కోడలును వెతకడానికి కోట్లు ఖర్చపెట్టైనా వాళ్ల అత్తగారు వెతుకుతారు. కానీ, నీకేమైనా అయితే నేను ఒంటరి దాన్నిఅవుతాను‘అంటూ మురళీ కృష్ణను ఆపుతుంది. ఆ తర్వాత దీప ఫోన్ చేస్తానంటూ భాగ్యం ఫొన్ తీసుకుని దీప నంబర్కు కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్, దీపలకు మెలకువ వస్తుంది. అర్థరాత్రి తండ్రి నుంచి కాల్ రావడంతో నాన్నకు ఏమయినా అయిందేమో మా పిన్ని చేస్తున్నట్టుంది ఫోన్ ఎత్తండి డాక్టర్ బాబు అంటుంది దీప. కార్తీక్ ఫొన్ లిఫ్ట్ చేసి హాలో అనడంతో.. భాగ్యం ఎవరో మగ గొంతు వినిపిస్తుందయ్యా అంటుంది. ఆ తర్వాత మురళీ కృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. హాలో నేను కార్తీక్ అని చెప్పడంతో అతడికి ఒక్కసారిగా ప్రాణం లేచస్తుంది. ఇక దీప దగ్గరే ఉన్నారా అనగా అవునంటాడు. దీప ఎక్కడుందో చెప్పి.. మీ నాన్నతో మాట్లాడమని దీపకు ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప ఫోన్ తీసుకుని ‘ధగా పడ్డావని ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయావమ్మా అని మురళీ కృష్ణ అనడంతో. ‘అవును నాన్నా ఈ దేవుడే కాదు.. నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడని’ మనసులో అనుకుంటుంది. అంత కష్టపడటం దేనికమ్మా.. మనంటికి రామ్మా.. నీకోసం నీ పుట్టింటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటాడు మురళీ కృష్ణ. అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది దీప. వెంటనే మురళీ కృష్ణ.. ‘సరే ఈ రాత్రికి ఆ మాటలెందుకులే ప్రశాంతంగా పడుకోమ్మా అనగానే దీప.. ఇక నుంచి నాకు అంతా ప్రశాంతతే నాన్న’ అని మనసులోనే అనుకుంటుంది దీప. చాలా సంతోషం తల్లీ నువ్వు ప్రశాంతంగా ఉండటమే కావాలి అంటు ఫొన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : నందాను ఇంట్లోంచి గెంటేసిన రుక్మిణి
నందా నిజస్వరూపం గురించి పూస గుచ్చినట్లు వివరించిన సత్య. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరు అని ప్రశ్నించిన రుక్మిణి. నందాను ఇంట్లోంచి బయటకు గెంటేసిన రుక్మిణి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 234వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా బండారం బయటపడింది. ఇన్ని రోజులుగా నందా పెడుతున్న టార్చర్ గురించి సత్య రుక్మిణితో చెబుతుంది. తామిద్దరికీ ఏ సంబంధం లేదని, అనుకోని పరిస్థితుల్లో నందా తనకు కనపించాడని, తన అనుమతి లేకుండానే నందా తన లైఫ్లోకి వచ్చాడని బయటపెట్టేస్తుంది. అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు అన్న నిజాన్ని మాత్రం చెప్పదు. ఇక నందా గురించి తెలుసుకున్న రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. నందా తలకు కొడవలి పెట్టి తాను చెప్పినట్లుగా ఓ పేపర్లో రాయమని చెప్తుంది రుక్మిణి. ఊహించని పరిణామంతో షాకైన నందా రుక్మిణి చెప్పినట్లు చేస్తాడు. ఇక నందాను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంటే దేవుడమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఏం జరిగిందంటూ ప్రశ్నించగా నందా బండారం మొత్తం బయపెట్టేస్తుంది రుక్మిణి. సత్య కోసం 2 లక్షలు పెట్టి నగ తెచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించాడని, అది గిల్టు నగ అని తేలిపోయి, నందా చరిత్ర బయటపడిందని వివరిస్తుంది. సత్యని ఢోకా చేయడానికి ఇక్కడకి వచ్చాడని, తనకున్న అప్పులు తీర్చుకునేందుకు ఈ పథకం రచించినట్లు వివరిస్తుంది. ఒక నందా అసలు స్వరూపం తెలుసుకన్న దేవుడమ్మ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కోపంతో నందా సత్య-ఆదిత్యల ప్రేమ విషయం బయటకు చెప్పేస్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తేలనుంది. -
Karthika Deepam: హిమ దూరంగా వెళ్లిపోతావా అనగానే ఉలిక్కి పడ్డ దీప
కార్తీకదీపం మే 15: దీప పడుకొకుండా ఆలోచిస్తుంటే.. అమ్మా! నాన్న మమ్మల్ని పంపించమంటే పంపిస్తావా అని హిమ అడుగుతుంది. దీంతో దీప, లేదు అన్నట్లు తల ఊపుతుంది. మరెందుకమ్మ మమ్మల్ని అక్కడే వదిలేసి వచ్చావు, విజయనగరం వెళ్లినట్టు ఈసారి అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా అని హిమ అనగానే దీప ఉలిక్కిపడుతుంది. దూరంగా.. ఎక్కడికో వెళ్లిపోతానంటుంది.. మీ అందరిని వదిలేసి దూరంగా ఎప్పటికీ తిరిగి రాని చోటుకు అంటూ దీప మనసులోనే ఆవేదన చెందుతుంది. ఇక కార్తీక్తో మాట్లాడి సౌర్య బెడ్రూంకి వస్తుంది. ఏంటి ఇంకా పడుకోలేదా అని అడుగుతుండగా.. హిమ నిద్ర పట్టకుంటే సౌర్యకు కథ చెప్పేదానివట కదామ్మా, ఈ రోజు ఎందుకో నిద్ర రావడం లేదు కథ చెప్పమని అడుగుతుంది. దీంతో సౌర్య, హిమలు కలిసి దీపను కథ చెప్పమని మారాం చేస్తారు. దీప ఆవు-దూడ కథ పేరుతో తనను ఉద్దేశిస్తూ చెబుతుంది. ఓ ఆవు అడవి గుండా వెళుతుంటే దానికి పెద్దపులి ఎదురవుతుంది. దీంతో ఆవు భయపడుతుందని, అది చచ్చిపోతానని కాదు, తల్లి లేకపోతే దూడ తల్లిలేనిది అవుతుదని చెబుతుంది. దీంతో ఆవు పెద్దపులితో ‘నేను నీకు ఆహారం కావడం కోసమే పుట్టానని నాకు ఇప్పుడే అర్థమైంది. అలాగే అవుతాను కానీ నా ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా అని అడగడంతో పులి సరేనంటుందని చెబుతుంటే హాల్ నుంచి కార్తీక్ కథ వింటు ధీనంగా చూస్తుంటాడు. ఇక దీప ‘ఆవు పులితో.. నాకో బిడ్డ ఉంది. తోటి దూడలతో ఆడుకుంటూ ఈ అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుంటుంది. పసిబిడ్డ ఆకలితో ఉంటుంది. నేను వెళ్లి దాని కడుపునిండా పాలిచ్చి. తోటి దూడలతో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి వస్తానంటూ పులిని ఆవు వెడుకుంటుంది. అది విని కరిగిపోయిన పులి మళ్లీ రావాలని చెప్పి పంపిస్తుంది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. ఆఖరిసారి కదా తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. కడుపు నిండా పాలిచ్చింది.. జాగ్రత్తలు చెప్పింది. మందతో వెళ్లినప్పుడు విడిగా వెళ్లొద్దు అని చెప్పింది. అందరితోనూ ప్రేమగా ఉండాలని చెప్పింది. అమ్మ లేదని దిగులు పడొద్దు, నేను ఇంకెప్పటికీ తిరిగి రానంటూ ఆవు, దూడకు చెప్పి వెళ్లిపోతుంది’ అని చెబుతూ దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆవు తిరిగి రావడంతో పులి దాని నిజాయితికి మెచ్చుకుని వదిలేస్తుందని చెబుతంది దీప. అలాగే ఈ కాలంలో అలా వదిలేస్తుందా’ అని దీప అన్న మాటలు కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంటాయి. దీప మనసులో పులిలా పొంచి ఉన్న మృత్యువు.. ఈ అమ్మని జాలి తలిచి వదిలేయకపోతే.. మీరేమైపోతారు అమ్మా అంటు సౌర్య, హిమలను హత్తుకుంటుంది. ఇక మొరళి కృష్ణ కూతురు కనిపించడంలేదనే బాధలో మద్యం తాగుతుంటాడు. దీంతో భాగ్యం వచ్చి ఈ సారి దీప కనిపిస్తే పిల్లలను, దాన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం అంటూ మురళీ కృష్ణకు ధైర్యం చెబుతుంది. మరోవైపు దీప మెట్ల దగ్గర కూర్చోని తాను చిన్నతనంలో సవతి తల్లితో పడిన బాధలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే కార్తీక్ పక్కనే కూర్చుని ఊరుకో అంటూ ఓదారుస్తాడు. దీంతో దీప ‘ఎందుకో ఈ గమ్యం లేని ప్రయాణం.. ఎందుకో.. ఈ పుట్టుక చావు’ అంటూ వైరాగ్యంతో మాట్లాడుతుంటే కార్తీక్ దీపనే జాలిగా చూస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. చదవండి: karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప డాక్టర్ బాబుకు హీరో చాన్స్ అలా మిస్సయిందట.. -
karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప
కార్తీకదీపం మే 14: కార్తీక్ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ దీపతో టాబ్లెట్స్ వేసుకో, బాగా విశ్రాంతి తీసుకో జాగ్రత్తగా ఉండని చెబుతూ బయలుదేరుతాడు. దీంతో దీప నన్ను భార్యగా చూడనప్పుడు నా జీవితానికి ఎందుకు అడ్డుపడుతున్నారని కార్తీక్ను నిలదీస్తుంది. దీనికి కార్తీక్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే అడ్డుకుని నాకు సమధానం కావాలంటుంది. కార్తీక్ చెప్పకుండా దాటేస్తుంటే ఇలా నన్ను బాధపెట్టెకంటే ఒక్కసారిగా చంపేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది దీప. అంతేగాక కార్తీక్ చేతులను పట్టుకుని చంపేయండి, చంపేయండి అంటూ అరుస్తుంది. దీంతో కార్తీక్ తన చేతులను విడిపించుకుని.. భావోద్యేగంతో అసలు విషయం బయట పెడతాడు. ‘నిన్ను ఎవరూ చంపనవసరం లేదే.. నువ్వే చావబోతున్నావంటూ’ విలపిస్తాడు. దీంతో దీప అయోమయంగా చూస్తూ నేను చావడం ఏంటి, అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన చెందుతుంది. సమయానికి మందులు వేసుకోవాలి, మంట సెగ తగలనివ్వకూడదు, ఆవిరి పీల్చకూడదు అలాగే ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి, ఇప్పటికే చావు అంచులదాక వెళ్లావు అంటూ దీపను హెచ్చరిస్తాడు కార్తీక్. అలా షాక్లో ఉండిపోయన దీప... అయినా నేను శారీరకంగానే చచ్చిపోతున్నాను, మానసికంగా మీరు చంపేస్తూనే ఉన్నారు కదా అంటుండగా.. కార్తీక్ నీ పేరులోని దీపం వేడి కూడా నిన్ను కాల్చేసి చంపేస్తుందే అని అంటాడు. అలా కార్తీక్ మాట్లాడుతుంటే దీప అత్తింట్లో తనతో డాక్టర్బాబు ప్రవర్తించి తీరు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత దీపతో మన ఇంటికి వెళదాం పదా అని అడుగుతుంగా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులు జోడించి అడుగుతుంది దీప. దీంతో బయటక వెళ్లిపోతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనితకు నిద్ర పట్టక సతమతవుతుంది. ‘ఎందుకు నేను ఒంటరిదానిలా ఫీలవుతున్నా.. కార్తీక్ మళ్లీ దీప ఇంటికి వెళ్లాడనా, లేక కార్తీక్, భారతిలు ఎలాగైన దీపను బతికిస్తారనా’ అని తనలో తనే అనుకుంటుంది. ఇక కార్తీక్ నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఎన్నో సార్లు అవమానించాడు, దీప వాళ్లు అవమానించేలా మాట్లాడినా ఏం అనకుండా చూసేవాడు. ఇక నుంచి కార్తీక్ అసలు నాఅంతట నేను ఫోన్ చేయను, ఎలాగైనా కార్తీక్ నా చూట్టు తిరిగేలా చేసుకుని, నా వాణ్ణి చేసుకుంటానంటూ తనని తాను సముదాయించుకుని పడుకుంటుంది. ఇక దీప ఇంట్లోనే హాల్లో కార్తీక్ సోఫాలో పడుకుని ఉండగా జరిగిందంతా గుర్తు రావడంతో నిద్ర నుంచి లేస్తాడు. ఇంతలో వాటర్ కోసం అటు వచ్చిన సౌర్య కార్తీక్ను చూసి నిద్ర పట్టలేదా నాన్న అని అడుగుతుంది. అవును రౌడి అంటూ.. ఇక్కడ నన్ను సడెన్గా చూసి భయం వేయలేదా అడగ్గా.. రౌడీని కదా వేయలేదంటుంది. ఇక మీ అమ్మ పడుకుందా అని అడుగుతాడు కార్తీక్, దానికి సౌర్య లేదు నాన్న కూర్చోని ఆలోచిస్తూనే ఉందని చెబుతుంది. ఇంతలో బెడ్రూంలో హిమ, దీపలు పడుకుని ఉంటారు. హిమ అమ్మ ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఉండకుండా ఏ సౌకర్యాలు లేని ఈ ఇంటికి వచ్చేసింది. అక్కడ అయితే కొత్త బెడ్షిట్స్, కొత్త బెడ్లు ఇంట్లో పనివాళ్లు ఉంటారు అక్కడ ఉండక.. ఎందుకు పాత బెడ్లు, పాత బెడిషిట్ ఉన్న ఈ ఇంటికి తిరిగి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇటూ కార్తీక్ సౌర్యతో సర్లే వెళ్లి పడుకో ఎలాగోలా ఇక్కడే పడుకుంటానని, మీ అమ్మతో నేను ఇక్కడే ఉన్నట్లు చెప్పకు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : నందా గురించి రుక్మిణితో నిజం చెప్పేసిన సత్య
నందా-సత్యలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వచ్చిన రుక్మిణి, కనకం. సత్య సీమంతానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దేవుడమ్మ. మరోవైపు నందా ఆగడాలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సత్య. నందా నిజస్వరూపాన్ని బయటపెట్టిన సత్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 233వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం వేసిన మాస్టర్ ప్లాన్తో నందా-సత్యలు దొరికిపోతారు. వాళ్లు చెప్పే సమాధానాలు ఒక్కటీ మ్యాచ్ కాకపోవడంతో సత్య-నందాలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వస్తారు. దీంతో నిజం ఎలా అయినా బయటపెట్టి సత్య జీవితాన్ని కాపాడాలని అనుకుంటారు. సీన్ కట్చేస్తే ఈశ్వర్ ప్రసాద్కు కాల్ చేసిన దేవుడమ్మ తాను త్వరలోనే ఇంటికి వస్తున్నానని ఈలోగా సత్య సీమంతానికి కావల్సిన ఏర్పాటు చేయాలని చెప్తుంది. దీంతో ఫంక్షన్ హాలు సహా అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని ఈశ్వర్ ప్రసాద్ మిగతా కుటుంబసభ్యులకు చెప్తాడు. ఇక సత్య కోసం ఒక నగను బహుమతిగా ఇచ్చిన నందా, సత్యపై ప్రేమ ఒలకొబోస్తూ దీని ధర 2 లక్షలు ఉంటుందని బిల్డప్ ఇస్తాడు. దీంతో సత్యపై నందాకు ఎంతో ప్రేమ ఉందని, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని రుక్మిణి కనకంతో అంటుంది. అయితే నందా ఇచ్చిన నగను చూస్తుండగా అనుకోకుండా కిందపడి విరిగిపోతుంది. నగను తదేకంగా పరిశీలించిన కనకం ఇది గిల్టు నగ అని తేల్చేస్తుంది. దీంతో నందాపై కోపంతో రగిలిపోయిన రుక్మిణి అసలు ఈ నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సత్యను అడుగుతుంది. అయితే అప్పటికే సత్య ఆత్మహత్యయత్నినికి ప్రయత్నించిదని తెలుసుకున్న రుక్మిణి సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నిలదీస్తుంది. నందాపై రుక్మిణికున్న అనుమానాలను పటాపంచులు చేస్తూ నందా గురించి నిజాలు బయటపెట్టేసింది సత్య. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నందా కారణం కాదని, అసలు తామిద్దరికి ఎటువంటి సంబంధం లేదన్న నిజాన్ని బట్టబయలు చేసేస్తుంది. దీంతో మరి నీ కడుపుతో పెరగుతున్న బిడ్డకు తండ్రెవరు అని రుక్మిణి నిలదీస్తుంది. మరి సత్య నిజం చెప్పేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Intinti Gruhalakshmi: నందు ఇంట్లో కలకలం, మరొకరు ఆత్మహత్యాయత్నం
లాస్య ప్లాన్ బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి అల్లకల్లోలం సృష్టించాలనుకుంది. అనుకున్నట్లుగా వరుస సమస్యలు కూడా వచ్చిపడ్డాయి. కానీ వాటన్నింటిని చాకచక్యంగా దాటుకుంటూ ముందుకు సాగుతోంది తులసి కుటుంబం. దీంతో త్వరలోనే తానేంటో చూపిస్తానని మంగమ్మ శపథం చేస్తోంది లాస్య. మరి నేటి(మే 14) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. నా చదువుకు డబ్బులు కూర్చింది నువ్వే కదా అని దివ్య తన తల్లిని అడిగింది. అందుకు తులసి అవునని తలూపడంతో దీన్నెందుకు దాచిపెట్టడం? ఈ మంచి విషయాన్ని అందరికీ చెప్తానని మారాం చేసింది. దీంతో ఆందోళన పడ్డ తులసి.. చేసిన పని అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, దీనికి ఫలితం దక్కితే అంతే చాలు అని చెప్పి కూతురిని ఆప్యాయంగా హత్తుకుంది. తన కలలు నిజమవుతుండటంతో దివ్య గాల్లో తేలుతోంది. తన కూతురు సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోయాడు నందు. తన చదువు కోసం సాయపడ్డ ఇంటి సభ్యులందరికీ (తులసితో సహా) థ్యాంక్స్ చెప్పాడు. ఈ సంతోషాన్ని చిన్నాభిన్నం చేసేందుకు లాస్య తులసికి ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నీకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికేనంటూ తులసిని హెచ్చరించింది. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడని తులసి.. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే పెళ్లి రోజున ఆయనను బయటకు తీసుకెళ్లి మనసారా మాట్లాడేలా చేశాను. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే ఇంత చేసిన నేను.. నువ్వు ఆయన పక్కన లేనప్పుడు ఇంకెంత చేస్తానో ఊహించలేవు అని రివర్స్ కౌంటరిచ్చింది. ఇదేమీ పెద్దగా పట్టించుకోని లాస్య.. త్వరలోనే నిన్ను గెంటేస్తానని తులసికి సవాలు విసిరి ఫోన్ పెట్టేసింది. మరోవైపు అభి తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం ఇంటర్వ్యూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రయత్నాన్ని అంకిత అడ్డుకుంది. అమ్మ చెప్పినట్లు ఫారిన్కు వెళ్లి అక్కడ ఇంకా చదవుకుని డాక్టర్స్గా స్థిరపడదాం అని సూచించింది. కానీ మీ అమ్మ ఇచ్చే డబ్బుతో ముందడుగు వేయలేనని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య అగ్గి రాజుకోవడంతో అభి ఆవేశంలో అంకిత మీద చేయి చేసుకోబోయాడు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే అభి తన మీద చేయెత్తడం తట్టుకోలేకపోయిన అంకిత కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అంకిత తల్లి.. ఇదే సరైన సమయమని, ఫారిన్కు వెళ్దామని అభిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయమని సూచించింది. దీంతో అమ్మ సలహాను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది అంకిత. ఇక దివ్య సమస్య పరిష్కారం అయిందనుకుంటున్న తరుణంలో నందు ఇంట్లో మరో కొత్త సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. తన భర్త విడాకులు అడుగుతున్నాడంటూ నందు సోదరి ఉరేసుకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరి ఆమె సమస్యను నందు దంపతులు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం -
Devatha: కనకం మాస్టర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సత్య-నందా
నందా ప్రవర్తనపై కనకం,రుక్మిణి సహా ఈశ్వర్ ప్రసాద్కు కూడా అనుమానం కలుగుతుంది. రాజేశ్వరితో నందా ఫోన్ మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. సత్య-నందాలు నిజంగానే ప్రేమికులా అన్న విషయం తెలుసుకోవడానికి కనకం ఓ మాస్టర్ ప్లాన్ను రచిస్తుంది. ఇందులో సత్య-నందాలు బొక్కబోర్లాపడతారు... ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 232వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-నందాల పెళ్లి విషయంపై ఆదిత్య సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి ముహూర్తం ఎలా పెట్టారంటూ ఫైర్ అవుతాడు. దీనికి పెళ్లి నాది కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని నందాను ఆదిత్య అడగ్గా, ఈశ్వర్ ప్రసాద్ కల్పించుకొని ఆదిత్యకు బాధ్యత ఉంటుంది కదా అని నందాకు సర్దిచెప్తాడు. ఇక నందా వాలకంపై కనకంతో పాటు రుక్మిణి సైతం అనుమానం వ్యక్తం చేస్తుంది. కనకంతో కలిసి నందా ఎలాంటి వాడన్నది ఆదిత్యను అడుగుతుంది. అయితే సూటిగా చెప్పకుండా నందా కొంచెం వేరేలా ఉంటాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు అంటూ అతడిపై అనుమానం వచ్చేలా మాట్లాడుతాడు. ఇక దేవుడమ్మ భర్త ఈశ్వర్ ప్రసాద్కు కూడా నందా ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఈ విషయం వెంటనే దేవుడమ్మతో చెప్పాలనుకుంటాడు. కానీ వేరే ఊరు వెళ్లిన ఆమెకి ఇప్పుడు ఈ విషయాలు చెప్పి ఎందుకు బాధపెట్టడం అని ఫోన్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే నందా రాజేశ్వరితో మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. అయితే ఆ రాజేశ్వరి దేవుడమ్మ శత్రువేనా, కాదా అన్నది ఎలా తెలుసుకోవాలని అని కనకంను అడుగుతుంది. దీంతో నందా చూపు, మాటతీరు అంతా తేడాగా ఉందని, అసలు అతను చెప్పేవన్నీ అబద్దాలేమో అని కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ఎలా అయినా నందా బండారం బయట పెట్టాలని రుక్మిణి- కనకం నిర్ణయించుకుంటారు. ఇందుకోసం కనకం ఓ మాస్టర్ ప్లాన్ను రచించింది. దీని ప్రకారం కనకం సత్యతో, రుక్మిణి నందా దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడ కలిశారు? మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? ఏ గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకున్నారు వంటి ప్రశ్నలను అడగుతారు. ఇక్కడే సత్య-నందాలు దొరికిపోయారు. ఇద్దరూ వేరు వేరు సమాధానాలు చెప్తారు. దీంతో రుక్మిని-కనకంల అనుమానం మరింత బలపడుతుంది. మరి వీళ్ల తర్వాతి ప్లాన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. -
Intinti Gruhalakshmi: తులసి సాయం, లాస్య మొసలి కన్నీళ్లు
గత కొద్దిరోజులుగా తులసి ఇంట్లో దివ్య టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. దివ్యను ఎలా చదివించాలి? తన మెడిసన్ ఫీజు ఎలా కట్టాలి? అన్నదాని మీదే అందరూ మల్లగుల్లాలు పడ్డారు. కానీ కుటుంబం అంటే సంతోషాలను మాత్రమే కాదు బాధలను కూడా పంచుకునేది అని నిరూపిస్తూ అందరూ చేతులు కలిపారు.. తలా ఇంత పోగు చేసి నందు చేతిలో పెట్టారు. దీంతో తన కళ్లను తనే నమ్మలేకపోయిన నందు దివ్య చదువుకు ఇక ఎలాంటి ఆటంకం లేదన్న విషయం అర్థమై సంతోషంలో మునిగి తేలాడు. మరి నేటి ఇంటింటి గృహలక్ష్మి(మే 13) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. దివ్యను చదివించాలన్న తాపత్రయానికి తులసి సంతోషించింది. కానీ అందుకోసం నందు కారు అమ్మేయడానికి రెడీ అవడం మాత్రం అస్సలు మింగుడుపడలేదు. దీంతో తను మొదట్లో ఉద్యోగం చేరినప్పుడు ఇచ్చిన చెక్ను బయటకు తీసింది. అది ఇప్పుడు అక్కరకు వస్తుందని భావించి కొడుకు చేతికి అందించింది. ఇది చూసిన నందు తండ్రి తన పెన్షన్ డబ్బు లక్ష రూపాయలు ఇస్తానని ముందుకొచ్చాడు. అలాగే తులసి కొడుకు కూడా తన ఆఫీస్లో ఎంతో కొంత అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను అని చెప్పాడు. అలా అందరూ కలిసి సమకూర్చిన డబ్బును నందుకు ఇచ్చి దివ్య మెడిసిన్ విద్యకు మార్గం సుగమం చేశారు. ఇక దివ్య ప్రాబ్లమ్ క్లియర్ కావడంతో నందు మనసు మళ్లీ లాస్య వైపు మళ్లింది. ఆమెకు ఫోన్ చేసి.. ఇంకా ఎన్నాళ్లు దూరంగా ఉంటావు, అంత పాపం ఏం చేశాను? అని నిలదీశాడు. దీంతో లాస్య.. నువ్వు నీ కుటుంబ సభ్యులతోనే ఆనందంగా ఉంటావు. అందుకే అక్కడనుంచి వచ్చేశాను అని చెప్పింది. నువ్వు నాతోనే, నా పక్కనే ఉండాలని నందు అభ్యర్థించాడు. కానీ అది జరిగి తీరదని, తులసి నన్ను అవమానిస్తూ, చీదరించుకుంటూ ఉంటుందని, పైగా మనల్ని దూరం చేస్తోందని చెప్తూ మొసలి కన్నీళ్లు కార్చింది. కాబట్టి ఇకపై నీతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పేసింది. దీంతో నందుకు అప్పటివరకు పడ్డ ఆనందం అంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. కానీ లాస్య నందును వదిలేసే ప్రసక్తే లేదు. కేవలం అతడి సంతోషాన్ని పోగొట్టేందుకు గుండెల్లో దిగులు పుట్టేందుకు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మరి వీరి సంతోషాన్ని కాలరాసేందుకు లాస్య ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూడాలి! చదవండి: క్షేమంగా ఇంటికి చేరుకున్న దివ్య, లాస్య మరో ప్లాన్! -
Devatha : నందా నిజ స్వరూపం కనకం తెలుసుకుంటుందా?
నందా ప్రవర్తనపై ఓ కన్నేసిన ఉంచాలని రుక్మిణి డిసైడ్ అవుతుంది. ఇక నందా చరిత్ర తెలుసుకోవాలని కనకం ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు వారం రోజుల్లో తాను సత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికి షాకిస్తాడు నందా..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 231వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా ప్రవర్తనపై కనకం అనుమానం నిజమై ఉంటుందా అని రుక్మిణి ఆలోచిస్తుంటుంది. ఇదే విషయాన్ని భర్త ఆదిత్యతో అడిగి తెలుసుకుంటుంది. ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు కదా నందా నిజంగానే మంచివాడా అని అడుగుతుంది. దీంతో ఇదే మంచి ఛాన్స్ అనుకున్న ఆదిత్య నందా గురించి ఇంక్వ్యైరీ చేయాలని, అతని గురించి తనకూ పెద్దగా తెలియదని చెప్తాడు. ఒకవేళ పెళ్లి తర్వాత నందా మంచివాడు కాదని తెలిస్తేఘేమీ చేయలేమని, సత్య జీవితం నాశనం అవుతుందని హెచ్చరిస్తాడు. కాబట్టి నందా ఎలాంటి వాడో తెలుసుకోవాలని, ఆ తర్వాతే పెళ్లి చేయాలని చెప్తాడు. దీనికి సరేనన్న రుక్మిణి ఇప్పట్నుంచి నందాపై ఓ కన్నేసి ఉంచుతానని చెప్తుంది. ఇక నందా తీరుపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అతడి వివరాలు కనుక్కోవాలని ఆరాట పడుతుంది. ఎంత ఆస్తి ఉంది? ఎక్కడి నుంచి వచ్చాడు వంటి ప్రశ్నలను అడుగుతుంది. దీంతో తన గుట్టు రట్టవుతుందే అని భయపడిన నందా టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కనకం మాత్రం అదే విధంగా తన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో తనపై కనకంకి అనుమానం వచ్చిందని గ్రహించిన నందా ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే నందా-సత్యలు ఇప్పటివరకు ప్రేమగా ఉండటం చూడలేదని, ఇందులో ఏదో రహస్యం దాగుందని కనకం కనిపెడుతుంది. అదేంటో కనిపెట్టాలని ప్లాన్లు వేస్తుంది. మరోవైపు సత్య పక్కన నందా కూర్చోబోతుండగా ఖుర్చీని పక్కకు లాగి తాను కూర్చుంటుంది. పెళ్లి కాకుండా పక్కపక్కన కూర్చోవద్దని చెప్తుంది. దీంతో ఒళ్లు మండిన నందా.. మీరేం కంగారు పడకండి అని, మరో వారం రోజుల్లో తమ పెళ్లి ఉందని చెప్పి అందరికి షాకిస్తాడు. దీనిపై మిగతా కుటుంబసభ్యులు ఎలా రియాక్ట్ అవుతారా? అసలు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
karthika Deepam: నిజం చేప్పిన దీప, హడలేత్తిపోయిన మోనిత!
కార్తీకదీపం మే 12: దీప తండ్రి మురళీ కృష్ణ కార్తీక్ నా కూతురికి పిల్లలకు తల్లి అవసరం ఉంటుందని తెలిసి కూడా వెళ్లిందంటే అర్థమేంటని నిలదిస్తాడు. నా కూతురి ఒక బొమ్మల చూశారని, దానిలో ఆశలు రేపి మనసుతో ఆడుకున్నారంటాడు. నేను భర్తగా నిన్ను ఇంటికి తీసుకేళ్లున్నానని నీ కూతురితో చెప్పలేదుకదా అని కార్తీక్ అనగా.. మరి మా మ్మ-నాన్నలకు కోడలిగా తీసుకేళ్తున్న అని మీరు కూడా చెప్పలేదు కదా అంటాడు మొరళీ కృష్ణ. ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. ఆమెను చూడాగానే.. ఆహా పాపి చిరాయివని ఊరికే అన్నారా తలుచుకున్న లేకపోయిన తగలబుడుతుందంటూ కౌంటర్ వేస్తాడు మురళీ కృష్ణ. దీప దొరికిందా కార్తీక్ అని మోనిత అడగ్గానే.. ఏమ్మా దీప అత్తాగారింటి నుంచి వెళ్లిపోయిందని నీకు తెలుసా అనగా కార్తీక్ చెప్పాడని చెబుతుంది. దీంతో ఓహో.. నా కూతురు వెళ్లిపోతే నాతో చెప్పకుండ నీకు ఫోన్ చేసి చెప్పాడా అంటూ వ్యంగ్యంగా అంటాడు మురళీ కృష్ణ. దీంతో మోనితా మరీ మీ కూతురు నేను వెళ్లిపోతున్నానని మీతో అయినా చెప్పొచ్చు కదా అంటుంది. చెప్పదమ్మా నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ.. విలువ లేని చోటుకి అస్సలు వెళ్లదు నీ..లా అంటూ సమాధానం ఇస్తాడు. మరీ నీ కూతురు కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా వెళ్లిపోవడం కరెక్టా అని మోనితా ప్రశ్నించగా.. అది తప్పే మొగుడితో చెప్పకుండా వెళ్లడం, అది భార్యభర్తల సమస్య.. మరీ నువ్వేందుకు ఆ కుటుంబ సమస్యల్లో తలదూరుస్తున్నావు మాటిమాటి అని మోనితను అవమానించేలా మాట్లాడుతుంటాడు అయన. దీంతో కార్తీక్.. ఏం మాట్లాడుతున్నారు కూతురు కనిపించడంలేదనే ఆవేశంలో మాట్లాడుతన్నారనుకున్న కొంచం మర్యాదగా మాట్లాడండి అంటాడు. అలాగే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మందులు వేసుకొమ్మని చెప్పడం కూడా తప్పేనా అంటుండగా... దానికి మొరళీ కృష్ణ.. చెప్పడం తప్పు కాదు చెప్పే పద్దతి తప్పు.. అంటు శ్రీరామ నవమి రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఆ రోజు మీ స్నేహితురాలు మోనిత కాకుండా మీరు కానీ, మీ అమ్మతో కానీ టాబ్లెట్ ఇప్పిస్తే మారు మాట్లాడకుండా వేసుకునేది నా కూతురు అంటాడు. ఆ టబ్లెట్ మోనిత ఇస్తే ఏమైంది అని కార్తీక్ అడగ్గా.. తన చేతితో వేస్తే అమృతం కూడా విషయం అవుతుందంటాడు. అందుకే నా కూతురు కళ్లు తిరిగి పడిపోయింది అంటాడు ఆయన. ఇక వెంటనే మోనిత మాట్లాడుతూ.. మీ కుటుంబ విషయాల్లో కలుగజేసుకోవద్దని చెప్పిన మీకు నా గురించి అవమానం మాట్లాడే ఆర్హత కూడా లేదు. నేను ఒక డాక్టర్ని అన్న విషయం మర్చిపోకండి అంటుంది. అయితే దీప మీ ఇంటిక రాలేదా అని కార్తీక్ అడగ్గా.. రాలేదు, రాదు కూడా అది మనసు విరిగి వెళ్లింది, ఆ విజయనగరంలోనే దాని పని అది చేసుకుంటు ఉండేది అక్కనుంచి దాన్ని తీసుకు వచ్చి గుండెలో చిచ్చురేపారని మురళీ కృష్ణ అసహనం వ్యక్తం చేస్తాడు. దీనికి కార్తీక్ అవును బాగానే ఉండేంది, టిఫీన్లకు పప్పులు రుబ్బుతూ, బాగానే ఉండేది, మరీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. మధ్యలో మోనిత ఈ పెద్దాయనతో ఇక్కడ ఎందుకు మాటలు దీప ఎక్కడికి వెళ్లిందో వెతుకుదాం పదా అంటుంది. మరోవైపు దీప పోయ్యి దగ్గర పిండి వంటలు చేస్తూ ఉంటుంది. సరోజక్కతో ఈ దీప మళ్లీ వంటలక్కగా మారింది అంటూ నవ్వుకుంటుంది. ఇంతలో కార్తీక్, మోనితలు అక్కడి వస్తారు. సరోజక్క చూసి దీప డాక్టర్ బాబు వచ్చాడు అని సైగా చేస్తుంది. ఏదో ఆర్డర్ ఇచ్చిపోడానికి వచ్చినట్లున్నారని, ఏం కావాలో కనుక్కొని అడ్వాన్స్ తీసుకుని పంపించు అనగానే.. మోనిత దీపా... అంటూ పలకరిస్తుంది. ఒకేసారి అగ్రహంతో ఊగిపోయిన దీప పొయ్యిలోని మండే కట్టెతీసుకుని మోనితను ఇక్కడ నుంచి నడవవే.. ఇదంతా నీ వల్లే కదా నేను చస్తే నా మొగుడ్ని కట్టుకుందామని గుంట కాడి నక్కల ఎదురు చూస్తూ నాకు టాబ్లెట్ మార్చి ఇచ్చి కళ్లు తిరిగిపడిపోయేలా చేశావ్ అనగానే, మోనిత హడలెత్తిపోతుంది. విన్నావు కదా కార్తీక్ నేను వెళుతున్నా అంటూ మెల్లిగా జారుకుంటుంది మోనితా. ఆ తర్వాత దీప డాక్టర్ బాబుతో మీతో వచ్చింది వెళ్లింది కదా ఇంకేందుకు ఇక్కడున్నారు వెళ్లండి అనగానే.. పొయ్యిలో నీళ్లు పోసి దీపను లోపలికి పదా అంటూ లాక్కెళ్లి విచిత్రంగా ప్రవర్తిస్తాడు కార్తీక్. అది చూసి దీప ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, దీపకు కార్తీ నిజం చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసొడ్లో తెలుసుకుందాం. -
Intinti Gruhalakshmi: దివ్య క్షేమం, లాస్య మరో ప్లాన్!
మెడిసిన్ చదవలేనేమోనన్న భయంతో తనకు తెలియకుండానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది దివ్య. ఏదో మైకంలో ఆత్మహత్యకు యత్నించడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం లాంటివి చేస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఆమెను ఎలా ఓదార్చాలో, డిప్రెషన్లో నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు దివ్య తల్లిదండ్రులు. మరి నేటి(మే 12) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో వారు దివ్య కోసం ఏం చేశారు? తనను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారా? అనేది తెలియాలంటే దీన్ని చదివేయండి.. కన్నకూతురును కంటిపాపలా చూసుకునే నందుకు దివ్య అదృశ్యమవడం అశనిపాతంలా మారింది. తనను జాగ్రత్తగా చూసుకోనందుకు తులసి మీద రంకెలు వేసిన అతడు పోలీస్ స్టేషన్లోనూ సహనాన్ని కోల్పోయాడు. తన కూతురు ఎవరితోనో లేచిపోయిందంటూ చులకనగా మాట్లాడిన ఇన్స్పెక్టర్ మీద నిప్పులు చెరిగాడు. ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అందరి ముందు తనను అవమానించిన నందును అరెస్ట్ చేసి లాకప్లో వేశారు. ఈ విషయం తెలిసిన తులసి మరింత షాక్కు గురైంది. పరుగుపరుగున పోలీస్ స్టేషన్కు వెళ్లి అతడిని వదిలేయండి అంటూ ఇన్స్పెక్టర్ను చేతులెత్తి వేడుకుంది. దీంతో రవ్వంత కరిగిపోయిన అతడు నందు సారీ చెప్తే వదిలేస్తానని మెలిక పెట్టాడు. సారీ చెప్పడం కష్టమే అయినప్పటికీ తప్పదంటూ, ఈ ఒక్కసారికి సారీ చెప్పేయమని కొడుకు వేడుకున్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో తనను తాను తమాయించుకున్న నందు క్షమించమని చెప్పి అక్కడ నుంచి బయటపడ్డాడు. మరోవైపు దివ్య తనకు తెలియకుండానే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తించిన బంధువు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను చూడగానే ఇంటివాళ్లకు పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. కన్నకూతురు కళ్లెదురుగా కనిపించడంతో సంతోషపడిపోయారు నందు దంపతులు. అయితే నందు తల్లి మాత్రం దివ్యకు మాయదారి రోగం వచ్చిందంటూ ఆడిపోసుకుంది. ఇది నచ్చని నందు తన కూతురును అలా అనొద్దంటూ హెచ్చరించాడు. మొత్తానికి దివ్య క్షేమంగా ఇల్లు చేరింది. కానీ అక్కడ లాస్య మరో ఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కాన్ఫరెన్స్ కాల్లో తులసిని ఇరికించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అయిందా? బెడిసి కొట్టిందా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే? -
karthika Deepam: పిల్లలకు తల్లి అవసరమా..
కార్తీకదీపం మే 11: డాక్టర్ భారతీ మోనితతో ‘భార్యభర్తలను విడదీయాలనుకోవడం అన్యాయమని, నిది నిజమైన ప్రేమ కాదు. ఉన్మాదం. కార్తీక్ను ప్రేమిస్తే ప్రేమించావ్.. కానీ నీకు సాయం కాదు కదా మద్దతు కూడా ఇవ్వను’ హెచ్చరించి వెళుతుంది. ఆ తర్వాత మోనిత జరిగిదంతా గుర్తుచేసుకుంటూ కోపంతో రగిలిపోతుంది. హెల్ప్ చేయకుంటే చేయకు నాకు నేను హెల్ప్ చేసుకుంటాను. ఎప్పటికీ దీపను కార్తీక్తో కలవనివ్వను, సుఖంగా కాపురం చేసుకొనివ్వను అంటూ తన క్రూరత్వాన్ని చూపిస్తుంది. ఇదిలా ఉండగ ఆదిత్య, శ్రావ్యలు మేడపైన కూర్చుని ఇంట్లో అసలు ఏం జరుగుతుంది. నువ్వు ఏం చేయట్లేదేంటి ఆదిత్య అంటుంది శ్రావ్య. సడెన్గా అత్తయ్య, మామయ్య ఎక్కడికి వెళ్లారు, అంత అర్జెంటుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది అంటుంది శ్రావ్య. అలాగే ఈమధ్య అత్తయ్య బావగారికే సపోర్టు చేస్తూ మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే ఇంకేదో ఉందంటూ ఇంట్లో సమస్యల గురించి మాట్లాడుకుంటుంటారు. ఈలోపు హిమ, సౌర్యలు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరులేరేంటని అడుగుతారు. అమ్మ ఎక్కడికి వెళ్లింది, ఇంట్లో కనిపించడం లేదని అడగడంతో శ్రావ్య, ఆదిత్యలు కంగారు పడుతూ కిందికి వెళ్లి దీప కోసం వెతుకుతుంటారు. ఇంతలో కార్తీక్ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడు. వదిన ఇంట్లో కనిపించడం లేదు అన్నయ్య అంటాడు ఆదిత్య. దీంతో కార్తీక్ కనిపించకుంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటాడు. నువ్వు ఆస్పత్రికి తీసుకేళ్లావేమో అనుకున్నాము అని ఆదిత్య అంటుండగా సౌర్య, హిమా కార్తీక్ని చూసి ఏడుస్తూ వస్తారు. అమ్మ లేదు డాడీ అని చెప్పగానే కార్తీక్ మీరు ఏం టెన్షన్ పడకండి ఎక్కడికి వెళుతుంది మిమ్మల్ని వదిలి అంటూ ఓదారుస్తాడు. మీరు పిల్లల్ని చూసుకోండి దీపను నేను తీసుకుని వస్తానంటూ కార్తీక్ అంటుండగా ఆదిత్య నీకు తెలుసా వదిన ఎక్కడికి వెళ్లిందో అని ప్రశ్నిస్తాడు. పిల్లల్ని వదిలి మీ వదిన ఎక్కడికి వెళుతుంది రా చెప్పింది చేయ్ అంటాడు. ఇక కార్తీక్, దీపను వేతికే పనిలో ఉండగా మోనిత కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ భారతిని తీసుకురానా దీపకు నచ్చజెపుతుందని అంటుతుంది. దీంతో కార్తీక్ నేను బయట ఉన్నాను ఇప్పుడు అవసరం లేదని విసుగ్గా అంటాడు. దీంతో.. దీప మళ్లీ తట్టాబుట్ట సర్దేసిందా అంటుంది మోనిత. కార్తీక్ షాకై నీకేలా తెలుసని అనగా.. గెస్ చేశా అంటుంది మోనిత. దీంతో కార్తీక్ ఫోన్ కట్ వెళ్తుండగా మధ్యలో దీప తండ్రి మురళీ కృష్ణ ఎదురు పడతాడు. కార్తీక్ మురళీకృష్ణతో మీ అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పగానే మీ ఇంట్లో లేదు.. అవును అని కార్తీక్ అంటుండగా.. మా ఇంట్లో కూడా లేదు అంటాడు మురళీకృష్ణ. వెతకడానికి బయలుదేరారా అని అడుగుతూ.. ఎక్కడ దొరుకుతుందని బయలుదేరారని మురళీకృష్ణ ప్రశ్నిస్తూ.. మీ ఇంట్లో పొగుట్టుకున్న దాన్ని లోకంలో ఎక్కడని వెతికి పట్టుకుందామనుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మా అమ్మాయి పిచ్చిది పదేళ్ల క్రితం పొగొట్టుకున్నదాన్ని మళ్లీ పదేళ్ల తర్వాత మీ ఇంట్లో వెతుక్కుందామని వచ్చింది అని అనగా.. అది మీ అమ్మాయి అమాయకత్వం అంటాడు కార్తీక్. మరీ మీదీ అని మురళీకృష్ణ అడగ్గా.. నాకేం సంబంధం లేదంటూ.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాంటి ఆలోచన కూడా లేకుండా వెళ్లిపోయింది అంటాడు. అయితే పిల్లలకు తల్లి అవరమా అని మురళీ కృష్ణ అనగానే అదేం ప్రశ్న అంటాడు కార్తీక్. మరీ నా కూతురికి తెలియదా తల్లి లేకుంటే పిల్లలు తల్లడిల్లుతారని, అయినా వెళ్లిందంటే అర్థమేంటి అని ప్రశ్నించగా.. అది మీ కూతురి మూర్ఖత్వం అంటాడు కార్తీక్. చేసిందంత మీరు చేసి దాన్ని దోషిని చేస్తారేంటి అంటూ కార్తీక్ని మురళీకృష్ణ నిలదిస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha Serial: నందా చెంప చెళ్లుమనిపించిన సత్య
నందా-సత్యల తీరుపై కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్మిణితో కూడా చెప్తుంది. మరోవైపు నందా ప్రవర్తనతో విసిగిపోయిన సత్య అతడి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అంతు చూస్తానంటూ నందా రివేంజ్ ప్లాన్ చేయాలని చూస్తాడు..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 230వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్య ఇచ్చిన 10 లక్షల రూపాల చెక్కును నందా తీసుకుంటాడు. అయితే ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే అని, తనకు ఊర్లో ఉన్న 5ఎకరాల పొలం రాసివ్వాలని డిమాండ్ చేస్తాడు. నందా ఇలా ప్లేటు మార్చడంతో షాకైన ఆదిత్య ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటాడు. ఇక నందా ప్రవర్తనపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అదే విషయాన్ని రుక్మిణితో ప్రస్తావిస్తుంది. నందా వాలకం చాలా అనుమానంగా ఉందని, అసలు అతని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారా అని ప్రశ్నిస్తుంది. దీంతో రుక్మిణికి కూడా అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచిది నందాపై ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే.. నందా తీరుతో కుమిలిపోతున్న సత్య తన గదిలో అంటించిన చిన్ననాటి నందా ఫోటోలను చింపి పారేస్తుంది. అదే సమయంలో రుక్మిణి అక్కడికి రావడం గమనించిన నందా.. సత్య నిద్ర పోతుందని అబద్దం చెప్పి రుక్మిణిని అక్కడ్నుంచి పంపిస్తాడు. ఇక తన బెడ్పై నందా ఉండటం చూసి సత్య మరింత కోపంతో ఊగిపోతుంటుంది. నందా చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో నీ అంతు చూస్తానని నందా వార్నింగ్ ఇస్తాడు. ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతూ తనను చాలా అవమానించారని, ఇక నిజాన్ని అందరికి చెప్పి వెళ్లిపోతానని నందా అంటాడు. సరిగ్గా ఇదే సమయానికి అక్కడికి వచ్చిన కనకం ఏంటా నిజం? ఎక్కడికి వెళ్తావు అని ఆరాతీస్తుంది. దీంతో బయటకు తీసుకెళ్తా అంటే సత్య రావడం లేదని, అందుకే నందా ఫీల్ అవుతున్నాడని ఆదిత్య కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ నందా తీరుపై కనకం మనసులో మాత్రం అనుమానం అలానే ఉంటుంది. ఇక నందా శని ఎప్పుడు విరగడవుతుందా అని ఆదిత్య తల పట్టుకుంటాడు. -
Intinti Gruhalakshmi: పోలీస్ కాలర్ పట్టుకున్న నందు
నందు కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలన్న లాస్య పాచిక పారింది. దివ్య ఆత్మహత్యకు యత్నించడం, ఆమె చదువుకు ఫీజు కడదాం అని వెళ్తుంటే శశికళ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు దివ్య కనిపించకుండా పోవడం.. అన్నీ ఆమెకు కలిసొస్తున్నాయి. మొత్తానికి నందు ఇంట్లో ఆనందానికి స్థానం లేకుండా పోయిందని తెగ సంతోషించింది. అసలు దివ్య ఎలా అదృశ్యమైంది? ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం నందు, తులసి ఏం చేశారు? అన్న విషయాలు నేటి(మే 11) ఎపిసోడ్లో చదివేయండి.. తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే దివ్యను చదివించడం కోసం పక్కనపెట్టిన డబ్బును శశికళ గద్దలాగా తన్నుకుపోయింది. దీంతో తన కూతురి ముఖంలో సంతోషం, భవిష్యత్తుకు ధీమా కల్పించేందుకు ఏం చేయాలా? అని మల్లగుల్లాలు పడ్డాడు నందు. తన దగ్గర అంత డబ్బు కూడా లేదే? అని తల పట్టుకున్నాడు. ఇంతలో తన కారును అమ్మేయాలన్న మెరుపులాంటి ఆలోచన మెదడులో కదిలింది. అంతే.. ఎప్పటినుంచో తన కారులాంటి మోడల్ను కొనాలని తెగ ఆసక్తి చూపిస్తున్న స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడు కూడా కొనడానికి అంగీకారం తెలపడంతో మెడిసిన్ ఫీజు కట్టొచ్చని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈ విషయం తెలియక దివ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ముందు రోజు తల్లి ఒడిలో నిద్రపోయిన ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోవడంతో ఇంటిల్లిపాది కంగారు పడిపోయింది. దివ్యను ఆమాత్రం చూసుకోలేవా? అని నందు, అతడి తల్లి తులసిని ఏకిపారేశారు. వయసొస్తే సరిపోదని కాస్త బుర్ర కూడా ఎదగాలని ఆమెను నిందించారు. ఇలా గొడవపడితే సమస్యకు పరిష్కారం దొరకదని నందు తండ్రి సూచించడంతో అందరూ ఆమెను వెతకడం మొదలు పెట్టారు. కానీ భాగ్య మాత్రం వీరి ఆందోళనను పోగొట్టాల్సింది పోయి, వారి టెన్షన్ను రెట్టింపు చేసేలా మాట్లాడింది. దివ్య చావడానికి వెళ్లిపోయి ఉంటుందిలే, అలాంటి వాళ్ల కోసం ఎందుకు వెతకడం అంటూ నోటికొచ్చినట్లు వాగింది. తన కూతురి గురించి దురుసుగా మాట్లాడిన భాగ్య మీద చెయ్యి చేసుకోబోయిన నందు తర్వాత తనను తాను తమాయించుకున్నాడు. ఛీ కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని భాగ్య ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ పూస గుచ్చినట్లు లాస్యకు ఫోన్లో చేరవేసింది భాగ్య. దివ్య బకెట్ తన్నేసిందంటే నీకు లైన్ క్లియర్ అంటూ మరో పథకాన్ని రచించమమని చెప్పకనే చెప్పింది. ఇదే కనక జరిగితే దివ్యతో పాటు, లాస్య కూడా నందు జీవితంలో దూరమవుతుందని విషాన్ని చిమ్మింది. మరోవైపు తన కూతురు కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్కు వెళ్లిన నందుకు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఫిర్యాదును తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్న పోలీస్ మీద నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీస్.. నీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుందని చులకనగా మాట్లాడాడు. ఆ మాటలను సహించలేకపోయిన నందు ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసాఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు అతడిని స్టేషన్లో బందీని చేశారు. మరి అతడిని తులసి విడిపించుకుంటుందా? భర్త, కూతురు కోసం తులసి ఏం చేయనుందనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కరోనా -
Devatha : నందాకు 10 లక్షల చెక్ ఇచ్చిన ఆదిత్య
నందా-సత్యల సఖ్యతపై రుక్మిణి అనుమానం వ్యక్తం చేస్తుంది. సత్యను విడచి వెళ్లాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. 10 లక్షల రూపాయల చెక్కును కూడా అందిస్తాడు. మరి నందా ఆ డబ్బులను తీసుకొని వెళ్లిపోతాడా? నందాపై అనుమానం వచ్చిన కనకం ఏం చేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత ఎపిసోడ్ 229వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. అత్యమ్మ లేకపోతే ఇళ్లంతా బోసిపోయిందని రుక్మిణి ఆదిత్యతో అంటుండగా నందా ఎంటర్ అయ్యాడు. కావాలని మాట కలుపుదామని ట్రై చేసి రుక్మిణి ముందు బుక్కవుతాడు. మీరు లేకపోతే కూడా ఇళ్లంతా ఇలాగే ఉంటుందని,అన్నయ్య(ఆదిత్య)కు కూడా ఏమీ తోచదని రుక్మిణిని ఉద్దేశించి అంటాడు. సత్య కూడా ఏదో పొగొట్టుకున్నట్లు ఉంటుందని చెప్తాడు. అయితే సత్య, నువ్వు మాట్లాడునుకేది ఈ ఇంట్లో ఇంత వరకు చూడలేదు అని రుక్మిణి అనుమానం వ్యక్తం చేయగా, దేవాలయం లాంటి ఈ ఇంట్లో పెళ్లి కాకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అని యాక్టింగ్ చేస్తాడు నందా. తానెక్కడ దొరికిపోతానో అని కంగారు పడతాడు. రుక్మిణికి అనుమానం మొదలైందని, త్వరలోనే నీ గుట్టు రట్టవుతుందని ఆదిత్య నందాకు వార్నింగ్ ఇస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇంట్లోనే మాట్లాడమని, బయటకు వెళ్లొద్దని రుక్మిణి సత్యతో అంటుంది. ఇక నందా గురించి ఆలోచిస్తూ తన జీవితం నాశనమైపోయిందంని భాదపడుతుంటుంది సత్య. ఇక నందా ఎలాంటివాడో తెలుసుకోవాలని కనకం ఆదిత్యను ప్రశ్నలడుగుతుంటుంది. కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవాడు అంటూ ఎంక్వైరీ చేయగా, కూల్గా అక్కడ్నుంచి తప్పించుకుంటాడు ఆదిత్య. సీన్ కట్ చేస్తే.. మాట్లాడాలని చెప్పి సత్య, నందాను టెర్రస్ మీదకి పిలుస్తాడు ఆదిత్య. ఈ డ్రామాలు ఆపేసి సత్యని వదిలేయాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. ఇందుకు 10 లక్షల రూపాయల చెక్కును అందిస్తాడు. ఇది చూసిన నందా నీ ప్రేమ గొప్పది..నీ మనసు గొప్పదంటూ ఆదిత్యను ప్రశంసిస్తాడు. ఇక వచ్చిన రోజే ఈ చెక్కు ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదని, ఇకపై మీకు కనిపించకుండా వెళ్లిపోతానని నందా ఆదిత్యతో అంటాడు. -
Intinti Gruhalakshmi: దివ్య మిస్సింగ్, షాక్లో తులసి!
లాస్యను తన భర్తకు దూరం చేయాలన్న తులసి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. మరోవైపు జరిగే ప్రతి విషయానికి తులసిని దోషిగా నిరూపించాలన్న లాస్య ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా వర్కవుట్ అవుతోంది. మెడిసిన్ చదవాలన్న దివ్య కలకు ఆదిలోనే అడ్డంకులు సృష్టించింది. శశికళను రంగంలోకి దింపి తను అనుకున్నది జరిగేలా చూసుకుంది. తులసి మీద నందుకు ద్వేషం కలిగేలా చేసి, ఆ ఇంటిని రణరంగంగా మలిచాకే మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెడతానని ఫిక్సయింది లాస్య. మరి నేటి(మే 10) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏం జరిగిందో చదివేయండి.. కన్నకూతురును చదివించి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలనుకున్నాడు నందు. కానీ ఆ డబ్బులు దివ్య చదువుకు ఖర్చవడం లాస్య, భాగ్యలకు అస్సలు ఇష్టం లేదు. దీంతో వీరిని ఎలా ఆపాలా అని పన్నాగం పన్ని శశికళను రంగంలోకి దింపారు. డబ్బు కోసం ప్రాణాలను సైతం తీసే ఆమెను నందు ఇంటికి ఉసిగొల్పారు. సరిగ్గా అప్పుడే మెడిసిన్ ఫీజు కట్టేందుకు వెళ్తున్న నందు ఆమెను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. తన అప్పు, వడ్డీని తీర్చడం పక్కనపెట్టి బిడ్డ చదువుకు డబ్బులు ఖర్చుపెట్టబోతున్నాడని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది శశికళ. నాకు వడ్డీ ఇవ్వాలన్న సంగతి గుర్తులేదా? అని నిలదీసింది. ఇప్పుడు కూతురి మెడిసిన్ సీటుకు ఫీజు కట్టాలని, తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కాస్త ఆలస్యంగా ముట్టజెప్తానని నందు అభ్యర్థించాడు. కానీ ఆమె ఏదీ చెవికెక్కించుకోలేదు. డబ్బులిస్తేనే గడప దాటుతావు, లేదంటే ఈడనే శవంలా మారుతావు అని గన్ ఎక్కుపెట్టి బెదిరించింది. దీంతో భయపడిపోయిన నందు చేసేదేం లేక, ఆమెకు ఎదురు తిరగలేక ఆమెకివ్వాలసిన డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక లాస్య పాచిక పారడంతో ఆమె కన్నా భాగ్య ఎక్కువగా సంతోషపడిపోయింది. అంతేకాగు, నువ్వు లేకపోతే బావగారు ఎంత కష్టపడుతున్నారో తెలిసొచ్చేలా చేస్తానని లాస్యకు హామీ ఇచ్చింది. ఇదిలా వుంటే తన భర్త తల దించుకోవడం ఎప్పుడూ చూడలేదని విలవిల్లాడిపోయింది తులసి. అది కూడా ఓ ఆడదాని ముందు తల దించాల్సిన పరిస్థితి రావడమేంటని ఆవేదన చెందింది. మరోవైపు దివ్య తన మెడికల్ సీటు పోయినట్లేనని దిగులు పడింది. తన కలలు కళ్ల ముందే కూలిపోతున్నాయని డిప్రెషన్కు లోనైంది. కూతురి మనసులోని భావాలు అర్థమైన తులసి.. ఆఖరు నిమిషం వరకు ఓపిక పట్టమ్మా అని బుజ్జగించింది. తన ఒడిలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. కానీ తెల్లారేసరికి దివ్య కనిపించకుండా పోయింది. దీంతో నందు మరోసారి తులసి మీద నిప్పులు చెరిగాడు. కూతురును చూసుకునే బాధ్యత కూడా లేదా? అని చీవాట్లు పెట్టాడు. మరి దివ్య ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! -
karthika Deepam: మోనిత గుట్టు తెలుసుకున్న భారతి
కార్తీకదీపం 10 మే: సౌందర్య సలహా మేరకు కార్తీక్ అసలు నిజం దీపకు చెప్పాలని నిర్ణయించుకుని డాక్టర్ భారతిని తన క్లినిక్కు పిలుస్తాడు. భారతితో దీపకు అసలు నిజం చెప్పే సమయం వచ్చిందనడంతో ఆమె షాక్ అవుతుంది. ఒక పెషేంట్తో స్వయంగా బ్రతకని చెప్పడం ప్రమాదం. డాక్టరుగా ఆ పని నువ్వు నేను ఇద్దరం చేయలేం అంటుంది. పెషేంట్ టెన్షనతో నరాలు చిట్లిపోతాయి, తట్టుకొలేరు దానివల్ల ఇంకా ప్రమాదమని భారతి కార్తీక్తో అంటుంది. కానీ దీప వినడం లేదు ఎంత వద్దని చెప్పినా పట్టుబట్టి వంటగదిలోనే ఉంటుంది. వంటచేస్తానంటోందని కార్తీక్ చెప్పడంతో.. అయితే చెప్పాల్సిందే అంటుంది భారతి. దీంతో కార్తీక్ ఈ విషయం నువ్వే దీపతో చెప్పాలనడంతో భారతి కంగుతింటుంది. దీపతో నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడమే కరెక్ట్ కార్తీక్ అంటుంది భారతి. నువ్వు చెప్తేనే ఇన్నాళ్లు నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం దీప అర్థం చేసుకుందుటుందని, దీంతో మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయని భారతి కార్తీక్తో చెబుతుంది. ఇక అక్కడి నుంచి భారతి మోనిత ఇంటికి వెళుతుంది. దానికంటే ముందు మోనిత సీరియస్గా దీప రీపోర్ట్స్ చూసి, ఆ తర్వాత అక్కడే ఓ పక్కన పెడుతుంది. భారతి రాగానే మోనితతో తలనొప్పిగా ఉందని, టీ కావాలంటుంది. ఒకే ఇప్పుడే తెస్తానంటూ టీ తీసుకురావడానికి వెళ్తుంది మోనిత. ఆ తర్వాత భారతి పాపం ఇన్నాళ్లు మోనిత ఒంటరిగా ఉండటమంటే గ్రేట్ అంటు మనసులో అనుకుటుండగా.. ఇంతలో ఎదురుగా ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ భారతి కంట పడతాయి. అవి వెళ్లి చూసేసరికి ఏంటి నా హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయని అనుకుంటు రిపోర్ట్స్తెరిచి చూసేసరికి భారతి షాక్ అవుతుంది. ‘దీప రీపోర్ట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, మరో కాపి తీసుకుని ఉంటుందా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా, ఈ రెడ్ మార్స్ ఏంటి, దీప వెనక మోనితా ఎమైనా కుట్ర చేస్తోందా’ అనుకుంటూ మోనితా రావడం గమనించి మళ్లీ అక్కడే పెట్టెస్తోంది. ఇక మోనిత టీ ఇవ్వగానే ఆలోచనలో పడుతుంది భారతి. ఏమైంది చెప్పు అంటూ భారతి నుంచి కార్తీక్ పిలిచిన విషయం గురించి ఆరా తీస్తుంది మోనిత. దీంతో భారతి.. కార్తీక్ తన భార్య ఆరోగ్యంపై బాగా దిగులు పెంచుకున్నాడు. అంటూ జరిగిన విషయం చెబుతుంది. దీంతో నువ్వు నా ప్రేమకు సపోర్టు చేయకుండా భార్యభర్తులు ఇద్దరూ కలిసే సలహాలు ఇస్తావేంటని భారతిపై మోనిత మండిపడుతుంది. దీంతో ‘భార్య భర్త విషయం ప్రతిసారి నీతో మాట్లాడే కుసంస్కారం నాకు లేదని, ఇక నుంచి నీ ప్రేమకు నేను సాయం కాదు కదా కనీసం మద్దతు కూడా ఇవ్వనంటుంది. అంతేగాక దీప రిపోర్ట్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయని నిలదీస్తుంది. నీది ప్రేమ కాదు, ఉన్మామని, ఆ ఉన్మాదనం వల్ల నీకే ప్రమాదం జాగ్రత్త’ అంటూ మోనితను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది భారతి. దీప తిరిగి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. మళ్లీ డబ్బావాలాగా మారడం కాకుండా పెళ్లిళ్లకు, శుభాకార్యాలకు వంటలు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. -
Devatha serial : సత్యని ఘోరంగా అవమానించిన కనకం
దేవడమ్మపై కనకం చిర్రుబుర్రలాడుతూనే ఉంటుంది. తనకు అన్యాయం జరగడానికి దేవడమ్మే కారణమంటూ దెప్పిపొడుస్తుంది. మరోవైపు పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని అనరాని మాటతో అవమానిస్తుంటుంది. కనకంను తన ట్రాప్లోకి ఎలా తెచ్చుకోవాలా అని నందా ఆలోచిస్తుంటాడు..ఇలా దేవుడమ్మ సీరియల్ నేడు (మే8న) 228వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. పుట్టింటి నుంచి రావడం రావడంతోనే దేవుడమ్మపై ఆడిపోసుకుంటుంది రంగా భార్య కనకం. ఆ తర్వాత దేవుడమ్మ ఇంటికి వెళ్లి పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని సూటిపోటి మాటలు అంటుండగా, రుక్మిణి వాదిస్తుంది. ఏదైనా ఉంటే తన అత్మమ్మ దేవుడమ్మతో చేసుకోవాలని, అనవరంగా తమతో గొడవలు పెట్టుకోవద్దని ఘాటుగా బదులిచ్చింది. దీంతో చేయాల్సిన తప్పులు చేసి ఇది తప్పు అంటే మాత్రం రోషం పొడుచుకొచ్చిందా అంటూ మరోసారి సత్య-రుక్మిణిలపై విరుచుకుపడుతుంది. సీన్ కట్ చేస్తే సత్య సీమంతం తంతు తర్వాత ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తన బతుకు అగమ్యగోచరంగా మారుతుందని ఆదిత్య నందాకి వార్నింగ్ ఇస్తాడు. ఆడిన డ్రామాలు చాలని నందాపై ఫైరవుతాడు. సత్యని ఇంతలా ఇబ్బందిపెడుతున్నావని తెలిస్తే తన తల్లి దేవుడమ్మ నిన్ను బతకనియ్యదు అని నందాతో చెప్తాడు. అయితే ఆదిత్య బెదిరింపులకు లొంగని నందా తనతో పెట్టుకుంటే అసలు నిజాన్ని ఊరి పెద్ద మనుషులకు చెప్పి పరువుతీస్తానని హెచ్చరిస్తాడు. సీన్ కట్ చేస్తే తన తల్లి దేవుడమ్మపై నిందలు వేయొద్దని ఆదిత్య తన పిన్ని కనకంతో వాదిస్తాడు. తప్పు బాబాయి చేస్తే తన తల్లిని అనడం ఏంటని ప్రశ్నిస్తాడు. సత్యని ఇంటికి తెచ్చినందుకు ఏదో ఆస్తులు కరిగిస్తుందంటూ తన తల్లిపై లేనిపోని ఆబంఢాలు వేయొద్దని చెప్తాడు. అయితే పెళ్లి చేసినప్పుడు ఉన్న బాధ్యత ఇప్పుడు కూడా నిలబెట్టుకోవాలని, తన భర్త రంగా వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, ఇందుకు ఒక రకంగా కారణం దేవుడమ్మే అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కనకం. సీన్ కట్ చేస్తే కనకంతో ఎలా మాట కలపాలా అని నందా ఆలోచిస్తుండగా కనకం స్వయంగా వచ్చి అతని వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. దీంతో నిజాలు బయటపడతాయో అని తెలివిగా మీకు చాలా అన్యాయం జరిగింది ఆంటీ అంటూ టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. -
karthika Deepam: కార్తీక్కు సౌందర్య ట్విస్ట్, షాక్లో డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 8: దీప మొండితనం చూసి కార్తీక్ అసహనం కోల్పోతాడు. ‘అందరిని బద్ద శత్రువుల్లానే చూస్తోంది. ఏం కోరుకుంటుందో, ఇంకా ఏం ఆశిస్తుందో నాకు తెలియదు. పిల్లల కోసం ఓపిక పడుతున్నాను. వారి మొహం చూసి భరిస్తున్నానని.. ఇంకా నన్ను రెచ్చగొడితే..’ అంటూ ఆగిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో దీప సౌందర్యను నిలదీస్తుంది. మీ సుపుత్రుడు మీరు బాగానే ఉన్నారు మధ్యలో నేనే అక్కరకు రాని చుట్టంలా ఉన్నానంటు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక సౌందర్య కార్తీక్ దగ్గరికి వెళ్లీ.. దీపకు నిజం చెప్పే సమయం వచ్చింది పెద్దడో అంటుంది. అదేంటని కార్తీక్ షాక్ అవుతాడు. అవును కార్తీక్ దానికి నిజం చెప్పాల్సిందే.ఇంట్లో వాళ్లందరిని శత్రువల్లా చూస్తోంది. అసలు విషయం చెప్తే తప్పా అర్థం చేసుకునేలా లేదంటుంది. అలాగే ఈ విషయం దీపకు చెప్పే బాధ్యత కూడా నిదేనని, తను చెప్పలేనంటూ.. దీప ఆత్మగౌరవం చూసి అత్తగా కంటే తల్లిగా దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నువ్వు ఇక బతకవే అని చెప్పే ధైర్యం నాకు లేదురా అంటు కన్నీటి పర్యంతరం అవుతుంది. అంతేగాక కార్తీక్కు మరో ట్వీస్ట్ ఇస్తుంది. నేను, మీ నాన్న కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నామని చెప్పడంతో కార్తీక్ మరోసారి షాక్ అవుతాడు. ఇలాంటి సమయంలో ఏంటి మమ్మీ ఈ నిర్ణయమని అడగ్గా.. తప్పదు వెళ్లాల్సిందేనంటూ ఇళ్లు, ఇంటి ఇల్లాలు జాగ్రత్త అని బెబుతుంది. దీంతో కార్తీక్ సౌందర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప నేను ఏం చెప్పిన నమ్మదు.. సో డాక్టర్ భారతితోనే చెప్పిస్తా అని అనుకుంటాడు.ఇదిలా ఉండగా..మోనితా మరో ప్లాన్తో డాక్టర్ భారతీ దగ్గరకు వెళుతుంది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో కార్తీక్ భారతికి ఫోన్ చేస్తాడు. మోనిత అక్కడే ఉండి కూడా తను వచ్చినట్లు కార్తీక్కి చెప్పోద్దని చెబుతుంది. ఇక భారతి ఫొన్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ క్లీనిక్ నుంచి బయలుదేరావా? అని అడుగుతాడు. ఇప్పడే బయలుదేరబోతున్నానంటుంది భారతి. అయితే నా క్లీనిక్ దారి మధ్యలోనే కదా నువ్వు వస్తే నీతో ఓ విషయం చెప్పాలంటాడు. దానికి భారతి అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టెస్తుంది. ఇలా కార్తీక్ దీపకి అసలు విషయం చెప్పి తనన కాపాడుకొవాలని చూస్తుంటే మరోవైపు దీప బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ వంటలక్కగా మారిపోతుంది. మరి తనని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకువస్తాడా, అసలు సౌందర్య, ఆనందరావులు ఎందుకు ఇంటి నుంచి దూరంగా వెళుతున్నారనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సత్య అంటే నీకు మస్తు ప్రేమ కదా పెనిమిటి : రుక్మిణి
సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో ఆదిత్య తెలుసుకుంటాడు. మరోవైపు బంతితో కలిసి రంగా వెళ్లిపోయడన్న విషయం తెలిసి రంగా భార్య ఊరు వచ్చి దేవుడమ్మపై నిందలు వేస్తుంది.. ఇలా దేవత సీరియల్ నేడు (మే7న)227వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియక ఆదిత్య టెన్షన్ పడుతుంటాడ. ఏమైందని రుక్మిణి అడగ్గా..ఏమీ లేదు..స్టడీస్ గురించి ఆలోచిస్తున్నానంటూ అబద్దం చెప్తాడు. ఇక సత్య ఎక్కడికి వెళ్లింది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు అంటూ అభిమానం చూపిస్తుంటాడు. దీనికి ఒకింత షాక్ అయిన రుక్మిణి..సత్య అంటే నీకు మస్తు ప్రేమ కదా అని అమాయకంగా అడుగుతుంది. మీ చెల్లెలు అంటే ఈ ఇంటి మనిషి కంటే అందుకే అంటూ ఆదిత్య తడుముకుంటూ సమాధానం చెప్తాడు. ఇక రంగా బంతితో కలిసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడన్న విషయాన్ని రుక్మిణి తన మామ ఈశ్వర్ ప్రసాద్తో చెప్పగా పరువు తీసాడంటూ రంగాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నందాను సత్య లైఫ్ నుంచి ఎలా తప్పించాలో తెలియక తీవ్రంగా మధనపడుతుంటాడు. ఇంతలో నందా వచ్చి బయటకు వెళ్లాలి కారు తాళాలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. మొదట ఇవ్వనని భీష్మించుకున్న ఆదిత్య సడెన్గా రుక్మిణి వచ్చేసరికి కాస్త తగ్గుతాడు. ఇక భార్య కూడా నందాకు సపోర్ట్ చేయడంతో కారు తాళాలు ఇస్తాడు. మంచి ముహూర్తంలో సత్య మెడలో తాళి కడతానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే.. నందా ఎక్కడికి తీసుకెళ్లాడు ఏం చేశాడు అన్న వివరాలను సత్యని అడిగి తెలుసుకుంటాడు ఆదిత్య. తనను భార్యలా ఫీల్ అవొద్దని నందాకు వార్నింగ్ ఇవ్వమని ఆదిత్య సత్యని కోరతాడు. నేను ప్రేమించింది ఇతన్నే..నా బిడ్డకు తండ్రి ఇతనే అనే పరిచయం చేసిన నందాను ఇప్పడు కాదు అని ఎలా చెప్పగలను? ఏమని చెప్పగలనంటూ సత్య బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే బంతితో రంగా వెళ్లిపోయాడన్న నిజం తెలిసి రంగా భార్య ఊరికి చేరుకుంటుంది. పిన్నిని పలకరించడానికి వెళ్లిన ఆదిత్యతో దేవుడమ్మపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటుంది. -
Intinti Gruhalakshmi: నందు ప్రయత్నానికి శశికళ ఆటంకం!
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో దివ్య ఆత్మహత్యాయత్నం నందుకు తన భాధ్యతను గుర్తు చేసుకుంది. కన్న కూతురు ఈ పరిస్థికి రావడానికి కారణం ఏంటో అర్థం కాక సైకియాట్రిస్ట్ను పిలిపించారు. ఆమె ముందు కూర్చున్న దివ్య తనకు ఈ మధ్య ఓ కల తరచూ వస్తోందని చెప్పింది. అందులో అమ్మానాన్న విడిపోతున్నట్లు కనిపిస్తున్నారని, తాను ఒంటరిని అయిపోతున్నానని వాపోయింది. ఆమె అసలు బాధ అర్థమైన డాక్టర్.. మీ దగ్గరే శాశ్వత పరిష్కారం ఉందంటూ నందు దంపతులకు చెప్పి వెళ్లిపోతుంది. మరి నేటి(మే 7) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. తన బిడ్డకు అప్పుడే ఇన్ని కష్టాలా అని బాధపడ్డ తులసి, తన కూతురును ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ ఆమెకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసింది. చదువు ఒకటే లోకం కాకూడదని, అన్నింటిలో ఉండాలని సూచించింది. మనోధైర్యం ఉంటే ఎలాగైనా బతికేయొచ్చంటూ మంచి మాటలు చెప్తూ నిద్ర పుచ్చింది. అనంతరం ఆ గదిలోకి వెళ్లిన నందు తండ్రిగా తాను ఫెయిల్ అయ్యానని, అందుకు క్షమించంటూ వేడుకుని విలపించాడు. ఇంతలో అక్కడో డైరీ కనిపించడంతో దాన్ని తీసి చదవడం మొదలు పెట్టాడు. "డాడీ చాలా మంచివాడు.. కానీ ఈ మధ్య అతడిలో చాలా మార్పులొస్తున్నాయి. అవేవీ నచ్చడం లేదు. ఆయన ఎప్పటిలాగా ఉంటే ఎంత బాగుండో! ఆయన ప్రాముఖ్యతనిచ్చే మనుషులు మారిపోయారు. ఇది ఇంకా బాధగా అనిపిస్తోంది. అమ్మను నాన్నెందుకు దూరం పెడుతున్నారు? వీళ్లిద్దరూ కలిసుంటే ఎంత బాగుంటుంది. మరోవైపు నాన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటిది నన్ను మెడిసిన్ చదివించేందుకు డబ్బులు కట్టమని ఎలా అడుగుతాను. నాన్నను కష్టపెట్టకూడదు. అందుకే డాక్టర్ కోర్స్ వదిలేద్దాం అనుకుంటున్నా.." అని డైరీలో రాసుకుంది. ఇది చదివిన నందు ఆనంద భాష్పాలు కార్చాడు. తనంటే దివ్యకు అంత ఇష్టమా? అని సంతోషించాడు. రెక్కలు ముక్కలు చేసుకునైనా డాక్టర్ కోర్సు చదివిస్తాను అని ఆ క్షణమే భీష్మించుకుంటాడు. కేవలం అలా అని ఊరుకోలేదు. ఇంట్లో ఉన్న డబ్బులను కోర్సు కోసం కట్టేందుకు దివ్యను తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు శశికళ రంగంలోకి దిగింది. ఏకంగా నందు మీదకే గన్ పెట్టి బెదిరించింది. మరి ఆమె ప్రయత్నాన్ని తులసి ఎలా అడ్డుకుంది? దివ్య మెడిసిన్ సీటు ఫీజు కట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: మా నాన్న పిచ్చి వల్ల ఆస్తి పోయింది: అనసూయ సినీ కవి ఆత్రేయ అసలు పేరు తెలుసా?