telugu students
-
ఈసారి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)–2025 తొలి సెషన్ పరీక్షలో రాజస్తాన్కు చెందిన ఆయూస్ సింఘాల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్–2025 తొలి సెషన్ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ విద్యార్థులే ఉన్నారు. ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్ఈసారి జేఈఈ మెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. 99 స్కోర్ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ –2025 తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99 స్కోర్తో టాపర్గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్గా నిలిచారు. ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
అడ్వాన్స్డ్లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్ఎస్డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్గా ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్కు రెండు, ఐఐటీ బాంబే జోన్కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్లో 99.99 పర్సెంటెల్తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్డ్లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్డ్లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో మనోళ్ల మెరుపులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్డ్కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్గా నిలిచారు.అదే జోన్కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్ఎస్డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. పెరిగిన కటాఫ్ జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్ ఈసారి పెరిగింది. జనరల్ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్ కటాఫ్ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్ 93.2 పర్సంటైల్కు చేరింది. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 109గా, రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ షురూ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్డ్లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు. -
ఎవరు..ఎప్పుడు దాడి చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హౌస్అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే.... అనుమానంగా చూస్తున్నారు... ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎంబసీ హెల్ప్లైన్ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్లో లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు. కిర్గిస్తాన్లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్యాకుమార్ బుధవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్లైన్ నంబర్ 0555710041కు ఫోన్ చేసిసంప్రదించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్డౌన్ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి, చార్జీలు తగ్గించాలి. – రాధ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడుగు బయట పెట్టాలంటే భయం.. కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు. – ఉషారాణి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని -
మెయిన్లోనూ మనోళ్లు టాప్ గేర్లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్తోనే ఈ ర్యాంకు సాధించాను. -
విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్ఫాల్స్కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?) కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు -
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
-
మహాబలిపురం బీచ్లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్తో టాపర్గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడులు -
మన పిల్లలకు అండగా నిలుద్దాం
సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్లైన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా info@apnrts.com, helpline@apnrts.com కు మెయిల్ చేయాలని చెప్పారు. నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్టాప్, మొబైల్లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్టైమ్ జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు వెన్నక్కి పంపిస్తున్న అధికారులు
-
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్రెడ్డి (ఏపీ) -
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
-
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్కు తెలుగు విద్యార్థులు
మణిపూర్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది. చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం సీఎంకు ధన్యవాదాలు మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఫలించిన సీఎం జగన్ యత్నం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ వెంకటాచలం/దేవరాపల్లి: మణిపూర్లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానంలో హైదరాబాద్కు, మరో విమానంలో కోల్కతాకు తీసుకు వచ్చి, అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 9.35 గంటలకు మొదటి విమానం (IMF HYD 0935/1235108 ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ బయలుదేరనుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం (IMF CCU 1110/122049 ఆంధ్రప్రదేశ్) 11.10 గంటలకు కోల్కతా బయలుదేరనుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విషయం తెలియగానే ముమ్మర కసరత్తు మణిపూర్లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్కు సహాయం కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ చేసి వివరాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారం మేరకు మణిపూర్లోని నిట్, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 157 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మణిపూర్లోని తెలుగు విద్యార్థులున్న కాలేజీల్లో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్గా అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చి, వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థులను విద్యాలయాల నుంచి ఎయిర్పోర్టుకు సురక్షితంగా చేర్చేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్కు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్కు కూడా లేఖ రాశారు. మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని, విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక విమానం ఏర్పాటు కాగానే విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను సోమవారం నుంచి కొన్ని గంటల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 8 వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించింది. చురుగ్గా ఏర్పాట్లు : మంత్రి బొత్స మణిపూర్ నుంచి రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆదివారం సాయంత్రం ఆయన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అక్కడ మన విద్యార్థుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి అండగా నిలిచేందుకు కో ఆర్డినేటర్లను పంపామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ లైన్ (88009 25668, 98719 99055) ఏర్పాటు చేశామన్నారు. విమానాశ్రయానికి వచ్చేశా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తాను ఇంటికి బయలుదేరారని, ప్రస్తుతం క్షేమంగా మణిపూర్లోని విమానాశ్రయానికి చేరుకున్నానని మణిపూర్లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడుకు చెందిన విద్యార్థి కల్యాణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తండ్రి బి.ముసలయ్యకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. కాగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ అనే విద్యార్థి మణిపూర్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. మణిపూర్లోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాడు. తాను చదువుతున్న కళాశాలకు సమీపంలో ఆందోళనకారులు భవనాలకు నిప్పు అంటించారని, ఓ జంటను హతమార్చారని స్థానిక విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపాడు. తనతో పాటు యలమంచిలికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి కౌషిక్, మరో 25 మంది ఉన్నారన్నారు. తమను వెంటనే ఏపీకి తరలించే ఏర్పాటు చేయాలని కోరాడు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
బనశంకరి: వాయువేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు మడివాళ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కంటి వెలుగులు అవుతారనుకున్న కుటుంబాల ఆశలు చిదిమిపోయాయి. ఒకే హాస్టల్లో స్నేహితులు వివరాలు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ చెందిన కార్తీక్ (23), బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోరమంగలలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భగీరథరెడ్డి (17) బెంగళూరులో ఒక ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతూ అదే ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. డివైడర్ను ఢీకొని మళ్లీ బస్సును మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్ తన కారులో భగీరథరెడ్డి కలిసి బయలుదేరారు. కారులో వేగంగా వెళ్తూ సిల్క్బోర్డు సమీపంలో రోడ్డు డివైడరును అదుపుతప్పి ఢీకొని దూసుకెళ్లి అవత ల లేన్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అంతలోగా ఇద్దరు మృతిచెందారు. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మడివాళ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్ను బస్టాప్లో దింపేందుకు వెళ్తుండగా.. -
ఐఐటీల ప్రవేశాల్లో తెలుగు విద్యార్థులు భేష్!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు గణనీయ సంఖ్యలో సీట్లు కొల్లగొట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సక్సెస్ రేటును పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ టాప్–5 రాష్ట్రాల్లో ఉండటం విశేషం. భర్తీ అయిన మొత్తం 16,635 సీట్లలో 18.5 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. సక్సెస్ రేటులో ముందు వరుసలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. కాగా మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉండగా నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భర్తీ అయిన మొత్తం సీట్లలో సగానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల విద్యార్థులకే దక్కడం విశేషం. అగ్రస్థానంలో రాజస్థాన్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లో సీట్లను కైవసం చేసుకున్న విద్యార్థుల్లో 15 శాతం సక్సెస్ రేట్తో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరైన 13,801 మందిలో 2,184 మంది ఐఐటీల్లో చేరారు. రాజస్థాన్ తర్వాత సక్సెస్ రేటులో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 16,341 మంది అడ్వాన్స్డ్కు హాజరు కాగా 1,747 మంది (సక్సెస్ రేటు 10.69) ఐఐటీల్లో సీట్లు సాధించారు. సక్సెస్ రేటులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీ నుంచి 14,364 మంది పరీక్షరాయగా 1,428 మంది ఐఐటీల్లో ప్రవేశం పొందారు. సక్సెస్ రేటు పరంగా నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచి 22,807 మంది పరీక్ష రాయగా 2,131 మంది ఐఐటీల్లో చేరారు. ఐదో స్థానంలో నిలిచిన తెలంగాణ నుంచి 17,891 మంది హాజరు కాగా 1,644 మందికి (సక్సెస్ రేటు 9.18) సీట్లు లభించాయి. ఐఐటీలన్నీ హౌస్ఫుల్.. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కొత్త ఐఐటీలు మినహా ప్రముఖ ఐఐటీలన్నింటిలో సీట్లు పూర్తిగా నిండాయి. ప్రముఖ ఐఐటీల్లో అయితే మొత్తం సీట్ల కంటే అదనంగా సీట్లను కేటాయించడం విశేషం. తమ సంస్థల్లో చేరడానికి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైతే అదనంగా సీట్లు కేటాయించుకునేలా ఆయా ఐఐటీలకు స్వయంప్రతిపత్తి ఉంది. దీంతో పలు సంస్థలు అదనపు ప్రవేశాలు కల్పించాయి. 2022–23 విద్యాసంవత్సరానికి ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నట్టు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 1,567 సీట్లు మహిళల కోసం సూపర్ న్యూమరరీ కోటాలో కేటాయించారు. కాగా ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత మొత్తం సీట్లు 16,598 మించి ప్రవేశాలు ఉండడం విశేషం. ఐఐటీ బాంబే విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 16,635 సీట్లు భర్తీ అయ్యాయి. మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించిన సీట్లు 1,567తోపాటు ఇతర కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా మరో 1,743 సీట్లు దక్కాయి. ప్రముఖ ఐఐటీల్లో అదనంగా సీట్ల కేటాయింపు.. విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఐఐటీ బాంబేలో 1,360 సీట్లుండగా ఆ సంస్థ 1,371 మందికి ప్రవేశాలు కల్పించింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో మొత్తం సీట్లు 1,209 కాగా 1,215 మందిని చేర్చుకుంది. ఐఐటీ ఖరగ్పూర్లో 1,869 సీట్లు ఉండగా 1,875 సీట్లు కేటాయించింది. వీటితోపాటు ఐఐటీ మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, రూర్కీ, తిరుపతి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, ఇండోర్ వంటి చోట్ల కూడా మొత్తం సీట్లకు మించి భర్తీ చేశారు. అలాగే డ్యూయెల్ డిగ్రీలకు సంబంధించి 102 సీట్లు కూడా భర్తీ అయినట్టు ఐఐటీ బాంబే గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ జోధ్పూర్, రోపార్, ధార్వాడ్, జమ్మూ, వారణాసి, ధన్బాద్ల్లో మాత్రమే స్వల్పంగా సీట్లు మిగిలాయి. ఐఐటీ బాంబే వైపే టాపర్ల మొగ్గు.. కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ 1,000 ర్యాంకులు సాధించినవారిలో ఏకంగా 246 మంది ఐఐటీ బాంబేను ఎంచుకోవడం విశేషం. ఆ తర్వాత 210 మంది అభ్యర్థులతో ఐఐటీ ఢిల్లీ నిలిచింది. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్డ్ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్డ్లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్డ్లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్లో 4వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరతా. యూఎస్లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్డ్లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో 101వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్లో చదివాను. జేఈఈ అడ్వాన్స్డ్లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్చేసిన ఎన్టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. మెరుగైన విద్యకు బాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్జీటీ, ఇద్దరు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు. -
జేఈఈ మెయిన్ తొలి విడత.. మనోళ్లే టాపర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా ఇతర జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జరిగిన జేఈఈ మెయిన్– 2022 మొదటి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. రాష్ట్రానికి చెందిన జాస్తి యశ్వంత్ వీవీఎస్, అనికెత్ చటోపాధ్యాయ, ధీరజ్ కురుకుండ, రూపేష్ బియానీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొయ్యన సుహాస్, పెనికలపాటి రవికిషోర్, పోలిశెట్టి కార్తికేయ నూటికి నూరు ఎన్టీఏ స్కోర్ సాధించారు. హరియాణా, జార్ఖండ్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, కర్ణాటక, యూపీకి చెందిన ఒక్కో విద్యార్థి కూడా టాపర్లు గా ఎంపికయ్యారు. మొత్తం 14 మంది విద్యార్థులు టాప్ స్కోర్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అన్ని కేటగిరీల్లోనూ... అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏపీ విద్యార్థి పి.రవి కిషోర్ టాపర్గా నిలవగా ఎస్సీ విభాగంలో ఏపీ విద్యార్థి డి. జాన్ జోసెఫ్ 99.99 పర్సంటైల్తో మొదటి స్థానంలో సాధించాడు. ఓబీసీ కోటాలో 99.99 పర్సంటైల్తో ఏపీ విద్యార్థి సనపాల జస్వంత్ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే అమ్మాయిల విభాగంలో ఏపీ విద్యార్థినులు టాప్–10లో 5 స్థానాలు సాధించారు. పేపర్ కఠినంగా ఉన్నా... జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జూన్ 24 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 588 కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షకు 8,72,432 మంది దరఖాస్తు చేసుకోగా 7.69 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లపాటు నాలుగు విడతలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ను ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో రెండు విడతలుగా జరుగుతోంది. తొలి విడత ఫలితాలు విడుదలవగా రెండో విడత పరీక్ష ఈ నెల 24 నుంచి 30 వరకు జరగనుంది. గత రెండేళ్లుగా సరైన తర్ఫీదు లేకపోవడం, రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను 70 శాతానికి కుదించినా, ఎన్టీఏ మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకపోవడంతో ఈసారి పరీక్ష కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తొలి విడతలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని గణితశాస్త్ర నిపుణుడు ఎంఎన్ రావు తెలిపారు. తొలి విడత మెయిన్స్ రాయలేకపోయిన వారు లేదా తొలి విడతలో వచ్చిన తమ స్కోర్ను మెరుగుపరుచుకోవాలనుకొనే విద్యార్థులు రెండో విడత జేఈఈ మెయిన్స్ రాసుకోవచ్చు. రెండు విడతల పరీక్ష పూర్తయ్యాకే ఎన్టీఏ ర్యాంకులు విడుదల చేయనుంది. సత్తా చాటిన ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు... జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫిలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. మొత్తం 581 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాయగా వారిలో 35 మంది విద్యార్థులు 90 పర్సంటైల్ సాధించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెజారిటీ విద్యార్థులకు 40 కంటే ఎక్కువ పర్సంటైల్ వచ్చిందన్నారు. మరోవైపు మొత్తం 60 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 23 మంది అర్హులయ్యారు. భరత్కుమార్ అనే విద్యార్థి 92.01 పర్సంటైల్ సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. కాగా, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్కు చెందిన గజవాడ శ్రీనివాస్–శ్రీదేవి దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడైన భరత్ 99.764 పర్సంటైల్ సాధించాడు. ఎన్టీఏ స్కోర్ అంటే... ఈ పరీక్షలో విద్యార్థులకు ప్రకటించిన ఎన్టీఏ స్కోర్, వారికి వచ్చిన మార్కుల శాతం రెండూ ఒకటి కావని ఓ ఎన్టీఏ ఉన్నతాధికారి తెలిపారు. ఒక విడతలో పరీక్ష రాసిన విద్యార్థులందరి సాపేక్ష ప్రతిభా ప్రదర్శన ఆధారంగా స్కోర్ కేటాయిస్తామని... ఇందుకోసం విద్యార్థులు సాధించే మార్కులను 100 నుంచి 0 మధ్య ఉండే స్కేల్కు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్కుమార్రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్కుమార్రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్కుమార్రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్కు చెందిన ఆమె హైదరాబాద్లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్లో ఇన్కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్కుమార్రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేసింది. సివిల్స్లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్కుమార్రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్కుమార్రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
సివిల్స్లో తెలుగు మెరుపులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: సివిల్ సర్వీసెస్లో ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్–2021 తుది ఫలితాలను సోమవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్ సర్వీసెస్కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి సివిల్స్కు హాజరైనవారే ఉన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా టాప్–100 ర్యాంకర్లలో 11 మంది ఇక్కడి వారే నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కొందరు అభ్యర్థులు కూడా రాష్ట్రం తరఫున ఎంపికైనవారి జాబితాలో ఉన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువగా.. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుని.. ఇక్కడి నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరైనవారు కూడా పెద్ద సంఖ్యలోనే ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సా«ధించిన అభ్యర్థులకు హైదరాబాద్తో సంబంధం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులూ మంచి ర్యాంకులు సాధించారు. వ్యవసాయం చేసేవారు, హౌజ్ కీపింగ్ వంటి చిన్న ఉద్యోగం చేసే వారి పిల్లలకు ఉత్తమ ర్యాంకులు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ర్యాంకర్ల మనోగతం అసలు ఊహించలేదు.. సివిల్స్లో ఇంటర్వ్యూ పూర్తయ్యాక మంచి ర్యాంక్ వస్తుందనుకున్నా.. కానీ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు.’’అని సివిల్స్లో 15వ ర్యాంకు సాధించిన చల్లపల్లె యశ్వంత్కుమార్రెడ్డి చెప్పారు. ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగోట్లపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్ తండ్రి పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి, కర్నూలులో సీటీవోగా పనిచేస్తూ సివిల్స్కు సిద్ధమయ్యారు. 2020 సివిల్స్లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. దానికి శిక్షణ తీసుకుంటూనే.. మరోసారి సివిల్స్ రాసి 15వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు కదిలించాయి హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన వి.సంజన సింహ సివిల్స్ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్లో 207వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికైన ఆమె.. ఆదాయపన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాశారు. అఫీషియల్ ట్రిప్లో భాగంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె.. ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ‘‘దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు టాప్–5లో ఉండటం కదిలించింది. ఐఏఎస్ అధికారిగా రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటా’’ అని చెప్పారు. రెండేళ్లు పాపకు దూరంగా ఉండి.. ‘‘ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్ కోసం సిద్ధమయ్యాను. అప్పటికే ఉద్యోగం ఉండి, స్థిరపడ్డ జీవితంలో.. చిన్న పాపకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఏమిటన్న ప్రశ్నలు అనేక మంది నుంచి ఎదురయ్యాయి. ఎంతో బాధ అనిపించింది. కానీ నా భర్త ఎంతగానో ప్రోత్సహించారు’’ అని సివిల్స్ 56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి చెప్పారు. ఆమె భర్త విజయ్కుమార్ చౌహాన్ హైదరాబాద్లో సీటీఓగా పనిచేస్తున్నారు. 2019లో సివిల్స్ 613వ ర్యాంకు రాగా డానిక్స్లో డిప్యూటీ కలెక్టర్గా చేరిన ఆమె.. మరోసారి సివిల్స్ రాసి 56వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ కావాలని ఉంది ‘‘నాకు ఐపీఎస్ కావాలని కోరిక. ర్యాంకును బట్టి ఐఏఎస్ వచ్చినా స్వీకరిస్తా. అటు ఉద్యోగం చేస్తూనే.. రోజూ ఎనిమిది గంటల పాటు సివిల్స్కు ప్రిపేరై మంచి ర్యాంకు సాధించా’’ అని 161వ ర్యాంకర్ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన ఆమె తండ్రి సంజీవరెడ్డి వరంగల్ జిల్లా సహకార అధికారిగా, తల్లి వినోద సంస్కృత లెక్చరర్గా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన చైతన్య.. 2016లో రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ఏఈగా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే ఆరోసారి సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. మంచి పోస్టింగ్ కోసం పట్టుదలతో.. ‘‘2017 నుంచి వరుసగా సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2019లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గుజరాత్లోని వదోదరలో శిక్షణలో ఉన్నాను. మంచి పోస్టింగ్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ ప్రిపేర్ అయి 488 ర్యాంక్ సాధించాను. ఈ దిశగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు’’ అని నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లికి చెందిన సంతోష్కుమార్రెడ్డి చెప్పారు. స్వీపర్ బిడ్డ కాబోయే కలెక్టర్ తండ్రి ఐలయ్య వ్యవసాయకూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు సరిగా గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలగా చదివి సివిల్స్లో 117వ ర్యాంకు సాధించాడు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్. ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజీలోనే చదివిన నరేశ్ మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. చెన్నైలోనే మూడేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి.. తర్వాత సివిల్స్కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. 2019లో 782వ ర్యాంకుతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్కు ఎంపికయ్యాడు. గుజరాత్లోని వదోదరాలో ట్రైనింగ్ పొందుతూ.. మళ్లీ సివిల్స్ రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. నరేశ్ సివిల్స్లో మంచి ర్యాంకు సాధించడంతో సంబురంలో మునిగిన తండ్రి ఐలయ్య.. కుమారుడిని తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఎక్కించుకొని కాలనీ అంతా తిరుగుతూ తన కుమారుడు ఐఏఎస్ సాధించాడంటూ మురిసిపోయాడు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. మాది నిజామాబాద్ జిల్లా. నిర్దేశించుకున్న లక్ష్యంపై పట్టువదలకుండా కృషి చేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్లో 136వ ర్యాంకు సాధించా. అమ్మ పద్మ కామారెడ్డి కలెక్టరేట్లో పేఅండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమె ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తా.. – అరుగుల స్నేహ, 136వ ర్యాంకర్ తల్లిదండ్రుల స్ఫూర్తితో.. మాది జగిత్యాల బీర్పూర్ మండలం చర్లపల్లి. తండ్రి బాషానాయక్ వ్యవసాయం చేస్తూ.. కష్టపడి నన్ను చదివించారు. తల్లి యమున మినీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో కçష్టపడి చదివాను. – గుగ్లావత్ శరత్నాయక్, 374వ ర్యాంకు ప్రణాళిక బద్ధంగా చదివి.. నేను బీటెక్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో ప్రణాళికాబద్ధంగా చదివి.. నాలుగో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. – ఉప్పులూరి చైతన్య, 470వ ర్యాంకర్ పరిశోధనలు కావాలి దేశానికి శాస్త్రవేత్తలు కూడా అవసరం. చాలా మంది సివిల్స్, ఇతర ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తాను. – గడ్డం సుధీర్కుమార్, 69వ ర్యాంకర్ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. ‘‘పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్కు సిద్ధమయ్యాను. మా ఇంట్లో అందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో నేను సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించాను. – అనన్యప్రియ, 544వ ర్యాంకర్, హైదరాబాద్ ఎంతో సంతోషంగా ఉంది.. ఐఏఎస్ లక్ష్యంగా గట్టిగా కృషి చేశా. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశముంది. ఏదొచ్చినా పేద ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఐపీఎస్ వస్తే నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ర్యాంకు సాధించా. – ముత్యపు పవిత్ర, 608 ర్యాంకర్ -
ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు పూర్తి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తయింది. తాజాగా వచ్చిన 89 మంది విద్యార్థులతో ఇప్పటివరకు 689 మందిని రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా ఇళ్లకు చేర్చింది. ఈ విషయాన్ని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి ‘సాక్షి’కి తెలిపారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్లో సుమారు 770 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చిక్కుకున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ఢిల్లీ, ముంబైలకు తీసుకొచ్చి అక్కడి నుంచి వారి స్వస్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. విదేశాల్లో వసతి ఏర్పాట్లతోపాటు సొంత ఖర్చులతో స్వస్థలాలకు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు విడుదల చేసింది. ఉక్రెయిన్ నుంచి హంగేరీ చేరుకున్న విద్యార్థుల తరలింపు దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్కుమార్, వెంకట్ మేడపాటి .. ఇందుకు సహకరించిన స్థానిక భారత అసోసియేషన్ల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, తెలుగు అసోసియేషన్ల ప్రతినిధులతో బుడాపెస్ట్లోని టెక్నికుం, సెయింట్ ఇస్టివన్లో సమావేశమై వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే వారిని స్థానిక ఎంబసీ సహకారంతో వెనక్కి తీసుకొస్తామని వెంకట్ చెప్పారు. కొంతమంది విద్యార్థులు సొంతంగా స్వరాష్ట్రానికి చేరుకున్నారని, మరికొందరు రష్యా, ఆస్ట్రేలియాల్లోని వారి బంధువుల ఇళ్లకు చేరుకున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఇంకా ఎవరైనా ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులుంటే ఆ వివరాలను తెలిపితే క్షేమంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
తరలివస్తున్న తెలుగు విద్యార్థులు
గన్నవరం: ఉక్రెయిన్ నుంచి శనివారం రాష్ట్రానికి చెందిన మరో 17 మంది విద్యార్థులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, డిప్యూటీ తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు. వీరంతా పోలండ్, రొమేనియా దేశాల బోర్డర్ నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబయి, ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. విద్యార్థులు రాధిక, నేహఫాతిమా, అడప లిఖిల్ తదితరులు మాట్లాడుతూ ఉక్రెయిన్లో తామంతా సుమారు 30 గంటల పాటు ఆహారం, తాగునీరు లేకుండా గడిపామని చెప్పారు. అతి కష్టంగా రైలు ప్రయాణం చేసి, మరో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ బోర్డర్కు చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్రాల అధికారులు తమను అన్ని వసతుల మధ్య ఇక్కడికి తీసుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తెలుగు విద్యార్థులు -
Ukraine Crisis: ఢిల్లీ చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులు..
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి వేలసంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 83 మంది, తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు తరలి వచ్చారు. ఢిల్లీలో వీరికి స్వాగతం పలికిన ఏపీ తెలంగాణ అధికారులు అక్కడే వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆనంతరం వీరందరిని స్వస్థలాలకు పంపనున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్.. భారతీయుల తరలింపులో సమస్యలు! ఇక ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 450 మంది విద్యార్థులు భారత్కు చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇంకా ఉక్రెయిన్లో 350 వరకు తెలుగు విద్యార్ధులు ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఇండియా చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ.. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు. -
ఒక్కసారిగా ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి
-
కేంద్రం, ఏపీ ప్రభుత్వం సాయంతో క్షేమంగా వచ్చామన్నా విద్యార్థులు
-
ఉక్రెయిన్ నుంచి మరో 14 మంది తెలుగు విద్యార్థుల రాక
సాక్షి ముంబై: ఉక్రెయిన్లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకువస్తున్న మరో ప్రత్యేక విమానం గురువారం ఉదయం ముంబైకి చేరుకుంది. వందకుపైగా విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోగా వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు డాక్టర్ ఎ.శరత్ (పంచాయితీ రాజ్ కమిషనర్), లాల్శంకర్ చవాన్ (ఐపీఎస్)తోపాటు ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజ్ అన్నివిధాలా సహకారమందించారు. నవీముంబైలోని తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడి, ఎన్జీఓ సంస్థ పదాధికారులు కూరపాటి నరేష్, దోర్నాల రాజు, సురేష్కూడా విమానాశ్రయానికి వచ్చి విద్యార్థులను కలిశారు. ముంబైకి వచ్చిన తెలంగాణ విద్యార్థులు: అభిజిత్సింగ్ నేగి (హైదరాబాద్), గోపగల్ల ప్రణయ్ (హైదరాబాద్), ఎం.ఈసాద్అలీ బేగ్ (హైదరాబాద్), పాటిల్ అక్షయ్ విజయ్కుమార్ (హైదరాబాద్), డి.పవన్కళ్యాణ్ (హైదరాబాద్), కె.సిద్దువినాయక్ (హైదరాబాద్), బి.కార్తీక్ నాయక్ (నిజామాబాద్), కె.సొలొమొన్∙రాజ్ (కరీంనగర్), ఐ.కార్తికేయ (హైదరాబాద్) -
తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది. ఆపరేషన్ గంగ గత ఏడు రోజులుగా ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్ శేఖరప్ప ఉక్రెయిన్లోని ఖర్కీవ్లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. (చదవండి: Ukraine War: ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’ ) -
వారిని నేరుగా విజయవాడకు తరలించండి
సాక్షి, న్యూఢిల్లీ/మద్దికెర/చీమకుర్తి/చిలమత్తూరు/గన్నవరం: ఉక్రెయిన్ నుంచి స్లోవేకియా చేరుకోనున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్ని నేరుగా విజయవాడకు తరలించాలని కేంద్ర విదేశాంగ శాఖకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్ మంగళవారం లేఖ రాశారు. తెలుగు విద్యార్థులు ఇప్పటివరకు ఢిల్లీ, ముంబైలకు వచ్చి అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు చేరుకుంటున్నారని.. కానీ, అలా కాకుండా.. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులందరినీ ఒకే విమానంలో విజయవాడకు తరలించాలని కోరారు. తద్వారా విద్యార్థులు వారివారి స్వస్థలాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. రైలులో 900 మంది విద్యార్థులు హంగేరీకి తరలింపు ఇక భారత్కు చెందిన మరో 900 మంది విద్యార్థులను ఉక్రెయిన్లోని జపరోజ్జియా నుంచి 1,400 కి.మీ. దూరంలోని హంగేరీ దేశానికి అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన సాయితేజ అనే విద్యార్థి మంగళవారం తన తల్లిదండ్రులు ధనుంజయ, పద్మావతిలకు ఈ సమాచారం ఇచ్చారు. హంగేరీ నుంచి ఢిల్లీ లేదా ముంబై చేరుకునేందుకు అధికారులు విమాన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీఎం కార్యాలయ తక్షణ స్పందన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పుణ్యవతి, శ్రీనివాసులు కుమారుడు కదిరిసాని అరవింద్ గౌడ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోగా.. ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అరవింద్ విషయాన్ని తల్లి పుణ్యవతి సోమవారం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కార్యాలయ అధికారులు వేగంగా స్పందించారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రావడానికి వీలుగా ఏర్పాట్లుచేయించారు. ఫలితంగా అరవింద్ ఇప్పటికే రుమేనియాకు చేరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా సమాచారం అందిందని పుణ్యవతి చెబుతూ సర్కారు స్పందించిన తీరుపై హర్షం వ్యక్తంచేశారు. 17మంది తెలుగు విద్యార్థులు రాక మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి మంగళవారం 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఏపీ వారు కాగా, 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల అధికారులు తెలిపారు. ఆయా విద్యార్థులకు భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు వారు వివరించారు. విజయవాడకు చేరుకున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్లు నత్తల జగన్మోహన్రావు, సరళాదేవి దంపతుల కుమారుడు నత్తల సుధేష్ క్షేమంగా తన ఇంటికి చేరుకున్నారు. అధికారులు సురక్షితంగా ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేర్చినట్లు సుధేష్ తెలిపారు. కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, మరో ఇరువురు విద్యార్థినులు మంగళవారం రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీకి వచ్చిన తూర్పు గో దావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన ఎ.అంజనీకుమారి, ప్రకా శం జిల్లా చీరాలకు చెందిన వై.అఖిల వేర్వేరు విమానాల్లో ఇక్కడికి చేరుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వీరిరువురినీ ప్రభుత్వ వాహనంలో అధికారులు ఇంటికి పంపించారు. అఖిల, అంజనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో ఆహారం, నీరు దొరకని పరిస్ధితి నెలకొందని.. అతికష్టం మీద నడుచుకుంటూ రొమేనియా బోర్డర్కు వచ్చామన్నారు. తమను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
రెండ్రోజుల్లో అందరినీ తీసుకొస్తాం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రెండ్రోజుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఈ విషయమై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించింది. కంట్రోల్ రూమ్, హెల్ప్లైన్, కన్సల్టెన్సీల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్లో రాష్ట్రానికి చెందిన 615 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలిందని టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడామని.. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక విమానాల్లో వీరందరినీ స్వదేశానికి తీసుకువస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు. వీరిని ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల నుంచి ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని కూడా మార్చి రెండులోగా తీసుకురానున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను పోలండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సహకారంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5 వర్సిటీల్లోనే అధికంగా విద్యార్థులు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లోని 14 విశ్వవిద్యాలయాల్లో చేరారని.. ఇందులో అత్యధికంగా ఐదు విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. మరోవైపు.. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న జఫోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చుట్టపక్కలే స్వల్పంగా బాంబుదాడులు జరిగినట్లు తేలిందని కృష్ణబాబు తెలిపారు. అలాగే, కైవ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూఏఎఫ్ఎం, ఓడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్టెసా ఓఓ బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఉన్నారన్నారు. ఇక విశాఖపట్నం నుంచి 95 మంది, కృష్ణా జిల్లా నుంచి 89 మంది, తూర్పు గోదావరి నుంచి 70 మంది విద్యార్థులు వెళ్లగా, అత్యల్పంగా విజయనగరం నుంచి 11 మంది, శ్రీకాకుళం నుంచి 12, కర్నూలు నుంచి 20 మంది వెళ్లారు. -
ఢిల్లీకి మరో 25మంది రాక
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/గన్నవరం: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 25 మంది విద్యార్థులు సోమవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 11మంది కాగా.. తెలంగాణకు చెందిన వారు 14 మంది ఉన్నారు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్ ఉద్యోగులు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. స్వస్థలాలు చేరుకునేందుకు ఏర్పాట్లుచేశారు. రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఒంగోలుకు చెందిన నట్ల సుధేశ్ మోహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తహసీల్దార్ నరసింహారావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధేశ్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అక్కడే అన్నీ వదిలేసి రావల్సి వచ్చిందని, పరిస్థితులు చక్కబడ్డాక కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ నిర్ణయం తీసుకునే వరకూ ఎదురుచూడాల్సిందేనన్నారు. తనను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుధేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ విద్యార్థుల కోసం కేంద్రం హెల్ప్లైన్ ఇక ఉక్రెయిన్లో ఇప్పటికీ ఉండిపోయిన విద్యార్థుల వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటుచేసిందని, ఏపీకి చెందిన ఆ విద్యార్థులు, ఇతర పౌరుల వివరాలు తెలియజేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ సీఎం జగన్కు సోమవారం లేఖ రాశారు. ఉక్రెయిన్కు చుట్టూ ఉన్న దేశాల్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశామని, విద్యార్థులు ఆ దేశంలోని భారత ఎంబసీలను కూడా ఈ–మెయిల్ లేదా ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం వద్ద నిర్ధిష్ట సమాచారం ఉంటే తన కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని ముఖ్యమంత్రిని కోరారు. తెలుగు విద్యార్థులు, పౌరుల పట్ల ఆందోళన చెందవద్దని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదిస్తే వెంటనే తమ బృందాలు సహాయం చేస్తాయని జయశంకర్ పేర్కొన్నారు. -
బంకర్లో ఓ తెలుగమ్మాయి కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్లోని మైకోలివ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పీ అండ్ టీ కాలనీ వాసి మద్దెల గీతానంద కోసం ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి పెట్రోమోలియా బ్లాక్ సీ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఈమె ప్రస్తుతం బంకర్లో తలదాచుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నట్లు తండ్రి గంగారాం ‘సాక్షి’కి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్లో ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు గీత హాజరుకావాల్సి ఉంది. అయితే యుద్ధ మేఘాలు అలుముకోవడంతో నెల రోజుల క్రితమే ఆమెను తల్లిదండ్రులు తక్షణం తిరిగి వచ్చేయాల్సిందిగా పదేపదే కోరారు. కానీ యూనివర్సిటీ వర్గాలు యుద్ధం రాదని చెప్తూ గీతానందతో పాటు ఇతర విద్యార్థులనూ అడ్డుకున్నారు. సరిహద్దులకు 1,500 కిమీ దూరంలో.. కీవ్లో ఉన్న విద్యార్థులను పోలెండ్కు తరలించి అక్కడ నుంచి భారత్కు తీసుకువస్తున్నారు. అయితే ఉక్రెయిన్కు తూర్పు భాగంలో ఉన్న మైకోలివ్ ఈ సరిహద్దుకు 1,500 కి.మీ దూరంలో ఉంది. కాస్త సమీపంలో ఉన్న హంగేరీ లేదా రొమేనియాల నుంచి వీరిని తరలించేందుకు అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు వంద మంది భారతీయ విద్యార్థులపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. వీరిలో గీత ఒక్కరే తెలుగు యువతి కావడం గమనార్హం. యుద్ధం మొదలైన నాటి నుంచీ గీతతో పాటు సహ విద్యార్థులూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు దుకాణాలను లూటీ చేస్తున్నాయని, దీంతో సోమవారం నుంచి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి ఐదు నిమిషాలకు ఓ పేలుడు వినిపిస్తోంది. కరెంట్, ఆహారంతో పాటు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేవు. ఆహారం, నీరు కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం మా దగ్గర ఏమీ లేవు. ఎవరైనా స్పందించి ఆదుకోకపోతే కనీసం సరిహద్దులకూ చేరుకోలేం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎంబసీ వర్గాలు పట్టించుకోవాలి. – తల్లిదండ్రులకు పంపిన సెల్ఫీ వీడియోలో గీత తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి అంధుడినైన నేను నా జీవితం మొత్తం దివ్యాంగుల సేవలోనే గడిపా. ఇప్పుడు నా కుమార్తె ఉక్రెయిన్లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్ రాజధాని, దాని చుట్టుపక్కల మినహా ఇతర ప్రాంతాలపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. ఇప్పటికైనా స్పందించి అక్కడున్న వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారిని రప్పించడానికి ప్రయత్నించాలి. – గంగారాం, గీత తండ్రి -
గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్విగ్న వాతావరణం
సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్ నుంచి ఏపీకి విద్యార్థులు చేరుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విద్యార్థులు కావ్యశ్రీ, సాయి ప్రవీణ్ విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఏపీ విద్యార్థులకు నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఉక్రెయిన్ పెయిన్: తప్పెవరిదైనా మారింది కీవ్ నగరం.. శ్మశాన నిశ్శబ్దం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు కు చెందిన విద్యార్థినులు సుష్మ, సుదర్శన ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుండి రొమేనియా మీదుగా ముంబై చేరుకుని అక్కడి నుండి నేరుగా రాజమండ్రి చేరుకున్నామని విద్యార్థులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే తాము తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకోగలిగామని సంతోష వ్యక్తం చేశారు. తాము బోర్డర్కు దగ్గరగా ఉండటం వల్ల వెంటనే రాగలిగామంటున్నారు. ఉక్రెయిన్ యూనివర్సిటీల్లో అనేక మంది తెలుగు, ఇండియన్ విద్యార్థులు ఉన్నారని వారందరికీ కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నామని తెలిపారు. -
బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
సాక్షి, న్యూఢిల్లీ: బుకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. విద్యార్థులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్కు అధికారులు తరలించారు. వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ భవన్లో వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. సురక్షితంగా భారత్కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 219 ముందితో తొలి విమానం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు.. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు: విద్యార్థులు ‘‘పశ్చిమ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. రొమేనియా సరిహద్దు దాటి, బస్సులో బుకారెస్ట్ విమానాశ్రయం చేరుకున్నాం. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు. మా యూనివర్సిటీ అధికారులు ఆందోళన వద్దని, పరీక్షలు రాసిన తర్వాత వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. మేము టికెట్లు బుక్ చేసుకుని కూడా ఉపయోగం లేకపోయింది. అక్కడి వాతావరణం బావుంటుంది. ప్రజలు బావుంటారు. అలాంటి దేశంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. యుద్ధం మొదలైందన్న వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత్పై కాలుమోపడం ఆనందంగా ఉంది. ఢిల్లీ నుంచి మా ఇంటికి చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారని’’ విద్యార్థులు అన్నారు. -
ఉక్రెయిన్లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు..
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి పగలూ తేడా లేకుండా బాంబుల మోతలు.. సైరన్ల హెచ్చరికలు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ.. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నాం’. అని ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినితియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయమే అక్కడి నుంచి రొమేనియాకు చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రొమేనియా సహా పోలెండ్, హంగేరీ తదితర దేశాలకు జనం తరలి వెళ్లడంతో రాకపోకలు స్తంభించాయి. ►ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో పొరుగుదేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ వాహనాల రద్దీ కారణంగా చాలా మంది రొమేనియా తదితర పొరుగు దేశాలకు చేరుకోవడం కష్టంగా మారింది. సైరన్ మోగినప్పుడు స్తంభించిన వినితియా నగరంలోని ఓ రహదారి ►ఈ క్రమంలోనే వినిత్స నుంచి రొమేనియాకు బయలుదేరిన సుమారు 300 మంది విద్యార్థులు (కొంతమంది తెలుగు వారు కూడా) చివరి క్షణంలో భారత రాయబార కార్యాలయం నుంచి అనుమతి లభించకపోవడంతో నిలిచిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ►రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నామని, తమను తక్షణమే ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి వినోద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’కి వివరించారు. సైరన్ మోగితే పరుగులే... ►వినితియా మెడికల్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు స్థానికంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మొదటి నుంచి యుద్ధ భయాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక బంకర్ ఉంటుందని, సైరన్ మోగగానే అందరు వెళ్లి అందులో తలదాచుకుంటారని వినోద్ తెలిపారు. ►మూడు రోజులుగా ఎప్పుడు బంకర్ మోగితే అప్పుడు తామంతా బంకర్లకు పరుగులు తీస్తున్నామని వాపోయారు. వినితియాకు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో బాంబుల మోత వినిపిస్తోందని, ఏ క్షణంలో తాము ఉన్న నగరానికి యుద్ధం ముంచుకొస్తుందో తెలియడం లేదని చెప్పారు. నగరంలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, పిర్జాదిగూడ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు జెప్రోజియా, వినితియా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధానికి ముందే కొందరు భారత్కు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు. కొరవడిన స్పష్టత.. భారత రాయబార కార్యాలయం ప్రకటనల్లో స్పష్టత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘మొదట అందరూ బయలుదేరాలని ప్రకటించారు. తీరా సామగ్రి సర్దుకొని వెళ్లేందుకు సిద్ధమైన అనంతరం ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ప్రకటించారు. తాము ఉన్న చోట భద్రత ఉంటే అక్కడే ఉండిపోవాలని చెబుతున్నారు. కానీ ఇలా భయం భయంగా ఎంతకాలం బతకాలి’ అని వినోద్ ఆవేదన వక్యం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, సరిహద్దు దేశాలకు చేరుకొనేందుకు అవకాశం లేక, రాత్రింబవళ్లు బంకర్లలో తలదాచుకోలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొన్నారు. -
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
సాక్షి, నెట్వర్క్ : ఉక్రెయిన్లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్లోని అపార్ట్మెంట్లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు. బస్సుల కొరతతో విడతల వారీగా.. ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు. మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు. భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి ‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్లో ఉన్నారు. -
స్వదేశానికి తెలుగు విద్యార్థులు
సాక్షి, ముంబై/అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థుల్లో కొందరు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకున్నారు. ఈ విమానంలో 10 మంది ఏపీకి చెందిన విద్యార్థులు, 15 మంది తెలంగాణ వారున్నారు. వీరి కోసం ముంబై ఎయిర్పోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున హెల్ప్డెస్క్ ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్డెస్క్ సభ్యులు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నామంటూ విద్యార్థులు ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తామంతా ఉక్రెయిన్లోని పశ్చిమ భాగంలో ఉండటంతో పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదని వారు ‘సాక్షి’కి వివరించారు. వీరున్న ప్రాంతంలో బాంబు దాడులు జరగనప్పటికీ ప్రస్తుతం నెలకొన్న యుద్ధంవల్ల తాము కొంత భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్పై దాడుల అనంతరం తమ విశ్వవిద్యాలయం అధికారులు స్వదేశానికి వెళ్లేందుకు ఎంతో సహకరించారని, అదేవిధంగా భారత రాయబార కార్యాలయం కూడా తమను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లుచేసిందని విద్యార్థులు తెలిపారు. అయితే, విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పశ్చిమం వైపున్న రొమేనియాకు బస్సుల్లో తరలించి, సుమారు ఐదారు గంటల ప్రయాణం అనంతరం అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్నట్లు వెల్లడించారు. ముంబై ఎయిర్ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఏపీ అధికారులు ఇక్కడికి చేరుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి భోజన ఏర్పాట్లుచేసింది. నవీ ముంబై తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి, అడిషనల్ కమిషనర్ (ముంబై కస్టమ్స్) మెరుగు సురేష్, అసిస్టెంట్ కమిషనర్ (కస్టమ్స్) ఎం. నాగరాజు, రవిరాజు, చంద్రశేఖర్ తదితర అధికారులతో పాటు ఎన్జీవో సంస్థకు చెందిన కూరపాటి నరేష్ తదితరులు ఏపీ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సహకరించారు. మరోవైపు.. ముంబై నుంచి ఈ విద్యార్థులను వారివారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ముంబై చేరుకున్న ఏపీ విద్యార్థులు వీరే.. కావ్యశ్రీ (విజయవాడ), కొండమర్రి ప్రవీణ్ (చిత్తూరు జిల్లా), అల్లాడి నాగ సత్య హర్షిణి (చిత్తూరు జిల్లా), రాజనాల సుష్మ (కాకినాడ), చల్లా సుదార్ సోమ (కాకినాడ), షేక్ రీను (ఆళ్లగడ్డ), జంబుగోళం పావని (తిరుపతి), దరువూరి సాయిప్రవీణ్ (గుంటూరు), వెన్నెల వర్ష (పొట్నూరు, శ్రీకాకుళం జిల్లా), గాధంశెట్టి గోపిక వర్షిణి (తిరుపతి). వీరంతా ఆదివారం వారి స్వస్థలాలకు చేరుకుంటారు. -
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కోసం ఏపీ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
-
వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం.. తమ క్షేమ సమాచారాన్ని కన్న వాళ్లకు అందించేందుకు సెల్ ఫోన్ల చార్జింగ్ కోసం, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రాణాలకు తెగించి బంకర్ల నుంచి బయటకు వచ్చి సమీపంలోని హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఖార్కీవ్లో సుమారు 50 మెట్రో స్టేషన్లు ఉంటే ఒక్కో స్టేషన్లో సుమారు 600 మంది (అన్ని దేశాల వాళ్లు) తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బంకర్లు మొత్తం నిండిపోయాయని వాపోయారు. ధ్వంసమైన భవనాలు.. రోడ్లపై మిసైళ్ల దాడుల నడుమ భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. గూగుల్ ఫామ్స్లో తమ సమాచారం పంపినా ఇప్పటివరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ నెట్వర్క్ సమస్యతో పాటు బిజీ వస్తోందని చెప్పారు. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని, ఎంబసీ అధికారులు మాత్రం బోర్డర్ వరకు వస్తే ఇండియాకి చేరుస్తామని చెబుతున్నారని.. అడుగు బయట పెట్టలేని స్థితిలో బోర్డర్కు ఎలా చేరుకోగలమని వాపోతున్నారు. స్థానిక పరిస్థితులను బయట వారికి చేరవేయకూడదంటూ నిత్యం అనౌన్స్మెంట్లు ఇస్తున్నారని, బయటకు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి అంటూ సూచనలు చేస్తున్నారన్నారు. ఖార్కీవ్ నగరంలో తణుకు, అమలాపురం, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. అమ్మా.. కంగారు పడొద్దు! నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం మేం బంకర్లలో సేఫ్గా ఉన్నాం. శుక్రవారం చాలాసేపు బాంబులు పేలాయి. ఉష్ణోగ్రత పడిపోయింది. మేం ఇండియాకి వెళ్లిపోతామంటే వర్సిటీ వాళ్లు అకడమిక్స్ పోతాయని భయపెట్టేశారు. ఇక్కడి విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వీడియోలు.. ఫొటోలు తీయకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా.. నాన్నా మీరు కంగారుపడొద్దు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందని చెబుతున్నారు. – తమలం అభిజ్ఞ, తణుకు, పశ్చిమ గోదావరి -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: తెలుగు రాష్ట్రాల హెల్ప్లైన్ నెంబర్లు ఇవే
ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడున్న ఇతర దేశాల పౌరుల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. సంక్షోభ సమయం నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉక్రెయిన్ను వీడగా.. పరిస్థితి ఇక్కడిదాకా వస్తుందని ఊహించని వాళ్లు.. ప్రత్యేకించి విద్యార్థులు తరగతుల నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిణామాల నడుమ.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సురక్షితంగా రప్పిస్తామని తల్లిదండ్రులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. ఉక్రెయిన్లో చిక్కుకున తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ సమీర్ శర్మ, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా రప్పించే విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరగా.. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వివరించారు జైశంకర్. అనంతరం ప్రత్యేక హెల్ప్లైన్లపై అధికారులకు సూచనలు చేశారు. APNRTS హెల్ప్లైన్ నెంబర్: 0863-2340678 ఏపీ హెల్ప్లైన్ వాట్సాప్ నెంబర్ +918500027678 ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు: శివ శంకర్- 9871999055 రామారావు-9871990081 సాయిబాబు- 9871999430 ఉక్రెయిన్లోని వార్ జోన్లో చిక్కుకుపోయిన పిల్లల తల్లిదండ్రులు విశాఖపట్నంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని కలిశారు. వారి సమస్యలను విని విదేశాంగ మంత్రి జైశంకర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయసాయి రెడ్డి. అంతేకాదు ఉక్రెయిన్లోని తెలుగు ప్రజలు 9871999055 & 7531904820 ద్వారా సాయం కోరవచ్చని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ ద్వారా తెలిపారు. The worried parents of children stuck in the war zone in #Ukraine met me at Circuit Guest House,Visakhapatnam. Heard their concerns & assured them of support in bringing their plight to the notice of Hon'ble CM Sri @YSJagan garu & External Affairs Minister Sri @DrSJaishankar. 1/2 pic.twitter.com/6wrkdAyFM3 — Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2022 తెలంగాణ ప్రభుత్వం: ఉక్రెయిన్లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్లో మెడిసిన్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్ హెల్ప్లైన్ నంబర్లకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏 We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest — KTR (@KTRTRS) February 25, 2022 న్యూఢిల్లీ, తెలంగాణ భవన్కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ : 7042566955 చక్రవర్తి, పీఆర్వో: 9949351270 నితిన్, ఓఎస్డీ: 9654663661 తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్ హెల్ప్ లైన్ నెంబర్లు చిట్టిబాబు, ఏఎస్వో: 040-23220603 : 9440854433 ఈమెయిల్ ఐడీ: so_nri@telangana.gov.in -
ఉక్రెయిన్ లో భారతీయ విద్యర్ధుల దయనీయ పరిస్ధితి ఇది
-
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వందలాది మంది తెలుగు విద్యార్థులు
-
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పిల్లలు ఎలా ఉన్నారో ఏమో..!
సాక్షి నెట్వర్క్ : చదువు నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకుపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ పిల్లలు అక్కడ ఎలా ఉన్నారోనని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీరు తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మా అబ్బాయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో..? శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలోని నడిమింటి సీతంనాయుడు, సరస్వతిల ఏకైక కుమారుడు కుమారస్వామి మరికొద్దిరోజుల్లో చదువు పూర్తిచేసుకుని స్వస్థలానికి వస్తాడని ఎదురుచూస్తున్న తరుణంలో ఉక్రెయిన్పై రష్యా దాడి ఆ తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమ కుమారుడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడోనని ఆందోళన చెందుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని కుమారస్వామి గురువారం ఫోన్లో తెలియజేసాడు. మా బిడ్డను క్షేమంగా తీసుకురండి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురుకు చెందిన బుద్దాల వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), హైమావతిల కుమార్తె రిషిత క్రిస్మస్ సెలవుల తర్వాత ఈనెల 7న తిరిగి ఉక్రెయిన్ వెళ్లింది. కానీ, ఇప్పుడక్కడ నెలకొన్న యుద్ధంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిషిత ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పులు జరుగుతున్నాయని, ఆ వీడియోలు చూస్తుంటే భయమేస్తోందన్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని సత్తిబాబు ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీ నుంచి సహకారం లేదు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామానికి చెందిన జోత్స్న వంశీప్రియతోపాటు అక్కడి విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని జ్యోత్స్న తల్లిదండ్రులు ఇజ్జిని షాలేమ్రాజు, సువార్త చెబుతున్నారు. తమ కుమార్తె కోసం విమాన టికెట్ బుక్చేసినప్పటికీ ఎయిర్పోర్టును మూసివేశారని, ఎలా రావాలో అర్థం కావట్లేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్శిటీ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. ఎప్పుడేం జరుగుతుందో.. ఉక్రెయిన్పై రష్యా గురువారం నుంచి బాంబుల వర్షం కురిపిస్తుండడంతో గుంటూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన వైద్య విద్యార్థి ఫహీమ్ అక్రమ్ తల్లిదండ్రులు మహబుబ్బాషా, ఫమీదా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని అక్రమ్ సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. మా బిడ్డ యూనివర్సిటీ పక్కనే యుద్ధం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విశాఖ జిల్లా రాంపురానికి చెందిన రెడ్డి నోముల సత్య శ్రీజ తల్లిదండ్రులు అర్జున్, వరలక్ష్మి తల్లడిల్లిపోతున్నారు. తమ కుమార్తె శ్రీజ చదువుతున్న యూనివర్శిటీకి దగ్గర్లోనే యుద్ధం జరుగుతోందని.. తమ కుమార్తెను ఎలాగోలా తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే, తనను స్వదేశానికి తీసుకురావాలని శ్రీజ కూడా వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. భయపడకండి.. సీఎం కృషి చేస్తున్నారు తమ కుమార్తెను ఇక్కడకు రప్పించాలంటూ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన బొమ్ము శివరామకృష్ణారెడ్డి, సదా వెంకటలక్ష్మీ దంపతులు గురువారం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఉక్రెయిన్లో ఉంటున్న యువతితో ఫోన్లో మాట్లాడి భయపడొద్దని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ఇందుకోసం కృషిచేస్తున్నారని ధైర్యం చెప్పారు. -
‘ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’
తాడేపల్లి: ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన విషయాన్ని సజ్జల తెలిపారు. ఇదే విషయంపై విదేశాంగశాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. -
మన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: ఆదిమూలాపు సురేష్
-
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమం: మంత్రి ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలాపు సురేష్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో మంత్రి ఆదిమూలాపు సురేష్ ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్ రప్పించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు.ప్రస్తుతం ఉక్రెయిన్లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. నోడల్ అధికారిగా రవి శంకర్: 9871999055. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మను సంప్రదించాల్సిన నెంబర్: 7531904820 ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ దినేష్ కుమార్: 9848460046 -
మీరక్కడ క్షేమమేనా!
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్–రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్లో ఉంటున్న తెలుగు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని భీతిల్లుతున్నారు. నిత్యం తమ వారితో ఫోన్లలో మాట్లాడుతున్నా క్షేమంగా స్వదేశానికి వచ్చేస్తే మంచిదని చెబుతున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామా? వద్దా? అనే మీమాంసలో అక్కడి తెలుగు వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. విద్య, ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన పలువురు ఉక్రెయిన్లో ఉంటున్నారు. ఏపీ నుంచి వైద్య విద్య అభ్యసించడం కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఉక్రెయిన్కు వెళ్తుంటారు. వినిచా, డ్నిప్రో, కైవ్, బోగోమోలెట్స్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. వినిచా యూనివర్సిటీలో 200 నుంచి 250 మంది, మిగిలిన యూనివర్సిటీలు కూడా కలుపుకుంటే 2 వేల మంది ఏపీ విద్యార్థులు ఉంటారని అంచనా. ప్రస్తుతం భయాందోళనలకు గురయ్యేంత పరిస్థితులు ఉక్రెయిన్లో లేవని, ప్రశాంత వాతావరణమే నెలకొందని ఉందని అక్కడి వారు చెబుతున్నారు. రష్యాకు సరిహద్దున ఉన్న నగరాల్లో కొంత ఆందోళనకర వాతావరణం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. మేం బాగానే ఉన్నాం మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు. ఉక్రెయిన్లోని వినిచా వర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులందరి వివరాలను సేకరిస్తోంది. ఆన్లైన్లో మా వివరాలను ఎంబసీకి పంపించాం. భారత్కు వెళ్లాలనుకున్న వారు వెళ్లొచ్చని అధికారులు చెప్పారు. అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. యుద్ధం అనివార్యమై ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి స్వదేశానికి చేరుస్తామని ఎంబసీ చెప్పింది. మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇంటినుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. దేశానికి తిరిగి వచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. – భానుప్రకాష్, ఉక్రెయిన్లో చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రశాంత వాతావరణమే ఉంది నేను రష్యా సరిహద్దుల్లోని సేవరో దోనెస్క్లో ఉంటాను. ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణమే ఉంది. 2014లో యుద్ధ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. అప్పటితో పోలిస్తే యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయులపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ కుమార్, తెలుగు వైద్యుడు, ఉక్రెయిన్ -
‘అడ్వాన్స్డ్’లో అదరగొట్టారు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ దెందులూరు/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్/చాగల్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–అడ్వాన్స్డ్–2021 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్–10లో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్రెడ్డి (4), పోలు లక్ష్మీసాయి లోకేష్రెడ్డి (5), మొదుళ్ల హృషికేష్రెడ్డి (10), సవరం దివాకర్ సాయి (11) ర్యాంకులను సాధించారు. రామస్వామి సంతోష్రెడ్డి ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, ఓబీసీ కేటగిరీలో గొర్లె కృష్ణ చైతన్య ఆలిండియాలో మొదటి ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను శుక్రవారం పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్కు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. జోన్లవారీగా చూస్తే.. టాప్–100 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. జోన్లవారీగా టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఐఐటీ ఖరగ్పూర్ జోన్లో బాలాజీ సిద్ధార్థ్ (126వ ర్యాంక్), పట్నాన యశ్వంత్ నారాయణ (127వ ర్యాంక్) టాప్–5లో ఉన్నారు. విద్యార్థినుల వెనుకంజ ఈసారి జేఈఈ ర్యాంకుల్లో విద్యార్థినులు వెనుకబడ్డారు. ఆలిండియా స్థాయిలో టాప్–100లో ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాప్లో నిలిచింది. తెలుగు విద్యార్థినుల విషయానికి వస్తే ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన (107వ ర్యాంకు) అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మందికి అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్కు 1,41,699 మంది హాజరుకాగా.. వారిలో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్కు 360 మార్కులకు గాను 348 మార్కులు వచ్చాయి. ఇక మహిళల్లో టాప్లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో సుమారు 7 వేల మంది ర్యాంకులు దక్కించుకున్నారని తెలుస్తోంది. 27న తొలి విడత సీట్లు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులు వెలువడడంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలొకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలొకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్ను ఇవ్వాల్సి ఉంటుంది. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ విద్యా సంస్థలన్నింటిలో మొత్తం 50,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ర్యాంకర్ల అభిప్రాయాలు కంప్యూటర్ ఇంజనీర్ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్డ్లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్రెడ్డి, ఆలిండియా ఐదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్రెడ్డి, ఆలిండియా పదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరతా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజమండ్రిలో పదో తరగతి, హైదరాబాద్లో ఇంటర్మీడియెట్ చదివాను. నాన్న బాపూజీరావు మల్లవరంలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. – ప్రగళ్లపాటి వెంకటరత్న సాయికుమార్, ఆలిండియా 21 ర్యాంకర్ ఏఐలో శాస్త్రవేత్తనవుతా.. మాది పాలకొల్లు. నాన్న త్రినాథరావు.. పారిశ్రామికవేత్త, అమ్మ మోహన కృష్ణకుమారి.. గృహిణి. అన్నయ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. నాకు తెలంగాణ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్, ఏపీఈసెట్లో 9వ ర్యాంక్, జేఈఈ మెయిన్లో 36వ ర్యాంక్ వచ్చాయి. ఐఐటీ – బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శాస్త్రవేత్తనవుతా. – సత్తి కార్తికేయ, ఆలిండియా 33వ ర్యాంకర్ సైంటిస్టుని కావాలన్నది నా కల మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు. సైంటిస్టును కావాలన్నది నా కల. మొదటి నుంచీ అమ్మానాన్న డోమ్నిక్, విజయలక్ష్మి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. సైంటిస్టుగా మానవ చరిత్రలో బయటకు రాని విషయాలను వెలికితీయాలన్నదే నా లక్ష్యం. నాసాలో సైంటిస్టుగా పనిచేస్తా. తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తా. – బొంతు మాథ్యూస్, ఎస్టీ కేటగిరీలో 44వ ర్యాంకర్ -
నాసా ‘బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్’లో తెలుగు తేజాల సత్తా
దొండపర్తి (విశాఖ దక్షిణ): చంద్రుడిపై మానవ మనుగడ కోసం చేపట్టే పరిశోధనల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్’లో ఇద్దరు తెలుగు తేజాలు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో విశాఖకు చెందిన కరణం సాయి ఆశీష్కుమార్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరు అమరేశ్వరప్రసాద్, యూఎస్కు చెందిన ప్రణవ్ ప్రసాద్లు ‘ఏఏ స్టార్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుకు టాప్ టెన్లో స్థానం దక్కింది. దీంతో వీరికి రూ.25 వేల డాలర్లు (రూ.18 లక్షలు) లభించాయి. ఫేజ్–2లో నాసాతో కలిసి రెండేళ్లపాటు పనిచేసే అవకాశం దక్కింది. చంద్రుడిపై నిర్మాణాలు, నీటి జాడల అన్వేషణ కోసం నాసా గత కొన్నేళ్లుగా పరిశోధనలు, ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మంచు (ఐస్) ఉన్నట్లు గుర్తించింది. దాన్ని మైనింగ్ ద్వారా తవ్వి తీసేందుకు గల అవకాశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించాలి ప్రకటించింది. బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన ఆశీష్కుమార్, అమరేశ్వరప్రసాద్లతోపాటు యూఎస్ నుంచి ప్రణవ్ప్రసాద్ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్ టెన్లో నిలిచి అవార్డు పొందింది. -
యూజీసీ నిబంధనల నుంచి మినహాయించాలి
సాక్షి, అమరావతి: ఢిల్లీలో టీటీడీ సహకారంతో ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్లైన్ క్యాంపస్కు యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ వివరాలివీ.. అఫిలియేషన్కు ఇబ్బందులు.. ‘ఢిల్లీలోని తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్, కె.ఎల్.రావు, సి.అన్నారావుల చొరవతో 1961లో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్లైన్ క్యాంపస్గా కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ యాక్ట్ 1922 ప్రకారం టీటీడీ చైర్మన్ నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్ ఈ కాలేజీ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. కౌన్సిల్లోని 15 మంది సభ్యుల్లో పది మందిని టీటీడీ నామినేట్ చేస్తుంది. కాలేజీ అభివృద్ధి, ఇతర అంశాలను బోర్డు పర్యవేక్షిస్తోంది. టీటీడీ ఇందుకు నిధులను అందిస్తోంది. దేశ రాజధానిలో తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ఈ కాలేజీ 2020లో ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో 14వ స్ధానంలో నిలిచింది. అయితే 2009 ఏప్రిల్ 16న యూజీసీ రాసిన లేఖలో యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిధిలో మాత్రమే ఆఫ్లైన్ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాష్ట్రాల యూనివర్శిటీ యాక్ట్ ప్రకారం వాటి భౌగోళిక పరిధుల్లో మాత్రమే క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని, ఆ పరిధికి వెలుపల ఏర్పాటు చేయడానికి వీలులేదని 2013 జూన్ 27న యూజీసీ నోటీసు జారీ చేసింది. ఈ కారణంగా ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీకి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందేందుకు యూజీసీ నిబంధనలు ఆటంకంగా మారాయి. ఫలితంగా ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల పలు ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే ఉండిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూజీసీ నిబంధనలతో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్లైన్ క్యాంపస్కు ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లీయేషన్ కల్పించేలా యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని లేఖలో సీఎం కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో రాష్ట్రం ఉన్నత విద్యలో పురోగతి సాధిస్తోందని, జాతీయ విద్యా విధానంలో నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. -
హెచ్1వీసాల పేరుతో మోసం
-
తెలుగు విద్యార్ధులను నట్టేట ముంచిన జంట..
సాక్షి, హైదరాబాద్: ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అడ్వాన్స్డ్లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సుడ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెకండ్ ర్యాంకు, ఈడబ్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్రెడ్డి (345 మార్కులు) సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్ జోన్లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో 321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్ జోన్ పరిధిలో టాప్ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. – ఆలిండియా జనరల్లో కాపెల్లి యశ్వంత్సాయి (ఏలూరు) 32వ ర్యాంకు, చిలుకూరి మణిప్రణీత్ (విజయవాడ) 47వ ర్యాంకు, కందుల యశ్వంత్ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్ ఈడబ్ల్యూఎస్ 11వ ర్యాంకు, నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్ 12, మోగంటి హర్షదీప్ ఈడబ్ల్యూఎస్ 13, వారాడ జశ్వంత్నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్కృష్ణ ఈడబ్యూఎస్ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్ ఓబీసీ 54, ఎస్.వి.సాయిసిద్దార్థ్ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్ 47, ఎస్.విష్ణువర్థన్ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్రెడ్డి ఈడబ్యూఎస్ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్ 57 ర్యాంకులను సాధించారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే... ఆలిండియా జనరల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం.. లాక్డౌన్కు ముందు విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్రెడ్డి తెలిపాడు. మెయిన్స్లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. టెన్త్ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. టెన్త్ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్పోర్టు వ్యాపారంలో ఉన్నారు. -
‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదల య్యాయి. ఇందులో తెలుగు విద్యార్థులు సత్తా చాటినా, ఆంధ్రప్రదేశ్తో పోల్చితే ఈసారి తెలం గాణ విద్యార్థులు వెనుకబడిపోయారు. టాప్– 100లోపు రెండు రాష్ట్రాల్లో కలిపి 15 మంది పైగా ఉండగా, అందులో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నుంచి టాప్– 100లో ఇద్దరి పేర్లే వెల్లడైనా.. మరో ఐదారుగురు ఉండొచ్చని పేర్కొన్నాయి. తెలంగాణలో స్థిరపడిన (మధ్యప్రదేశ్కు చెం దిన) హర్ధిక్ రాజ్పాల్ ఆరో ర్యాం కుతో టాప్ 10లో నిలువగా, మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్ 93వ ర్యాంకు సాధించారు. ఇక ఏపీ నుంచి.. ఆలిండియా ర్యాం కుల్లో జనరల్ కేటగిరీ 2వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్రెడ్డి సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర దక్కించుకున్నాడు. రాసింది తక్కువే.. అర్హులు తక్కువే.. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా, కరోనా నేపథ్యంలో వారిలో 1,60,838 మందే దరఖాస్తు చేసుకున్నారు. గతనెల 27న జరిగిన పరీక్షకు 1,50,838 మంది హాజరు కాగా, వారిలో 43,204 మంది అడ్వాన్స్డ్లో అర్హత సాధించారు. అర్హుల్లో బాలురు 36,497 మంది ఉండగా, బాలి కలు 6,707 మంది ఉన్నారు. టాప్ 500లో 140 మందే ఐఐటీ మద్రాస్ పరిధిలో టాప్–500 ర్యాంకులోపు 140 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 100లోపు 28 మంది ఉండగా, అందులో తెలుగు విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. ఇక టాప్–200లోపు 61 మంది, టాప్–300లోపు 86 మంది, టాప్–400లోపు 114 మంది, టాప్–500 ర్యాంకులోపు 140 మంది ఉన్నారు. తగ్గిన కటాఫ్ మార్కులు.. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు తగ్గాయి. గతేడాది 90 వరకు ఉండగా ఈసారి కామన్ ర్యాంకులో కటాఫ్ 69 మార్కులకు తగ్గిపోయింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో 62, ఈబ్ల్యూఎస్లో 62, ఎస్సీ, ఎస్టీలలో 34 మార్కులను జేఈఈ అడ్వాన్స్డ్లో కనీస అర్హత మార్కులుగా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఇక వికలాంగుల కోటాలో 34 మార్కులను కనీస అర్హత మార్కులుగా ప్రకటించింది. ప్రణాళికతో చదివి.. అనుకున్నది సాధించి.. మంచిర్యాలఅర్బన్ : ఉన్నత స్థానాలను చేరుకోవాలనే తపన.. కష్టపడేతత్వం ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే అని నిరూపించాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయివర్ధన్ . తల్లిదండ్రుల ప్రోత్సాహం.. పట్టుదలతో చదివి జేఈఈ అడ్వాన్ ్సడ్ ఆలిండియా ర్యాంక్ల్లో 93, ఓబీసీలో 7వ ర్యాంక్తో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు జయ, రమణారెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాయివర్ధన్ ను 8వ తరగతిలో హైదరాబాద్లోని శ్రీ చైతన్య విద్య సంస్థల్లో చేర్పించారు. 10వ తరగతిలో 9.5 మార్కులు, ఇంటర్లో 967 మార్కులు సాధించాడు. సీఈసీ (కంప్యూటర్ సైన్ ్స ఇంజనీర్) చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రణాళికాబద్ధంగా చదివితే సాధించలేనిది ఏమిలేదని సాయివర్ధన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తను ఈ ర్యాంక్ సాధించడం వెనుక కుటుంబసభ్యుల తోడ్పాటు ఎంతో ఉందన్నాడు. -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం
సాక్షి, అమరావతి: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్బర్గ్లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉన్నారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్పోర్ట్లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి. అట్లాంటాలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్ కుమార్ అన్నవరపు ప్రభుత్వానికి అగ్నిప్రమాద సమాచారం అందించారు. ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్చంద్ర.. బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీవిద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. ► సీఎం ఆదేశాలతో స్థానిక తెలుగు అసోసియేషన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టామని డాక్టర్ కుమార్ అన్నవరపు తెలిపారు. విద్యార్థులు కోల్పోయిన ధ్రువపత్రాలను వీలైనంత త్వరగా ఇప్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ► విద్యార్థులకు అవసరమైన ఇతర సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారన్నారు. ► సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, విదేశీ విద్య సమన్వయకర్తలు విద్యార్థులను ఆదుకొనే చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
కజకిస్తాన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం కజకిస్తాన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా యూనివర్సిటీలు తాత్కాలికంగా యూసివేయడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులకు రవాణా సదుపాయాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్తాన్లోని ఓ ఏజెన్సీ తెలంగాణకు పంపిస్తామని తమ వద్ద 45 వేల రూపాయలు కట్టించుకొని తర్వాత తమకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించలేదని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సొంత రాష్ట్రానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు 300 మంది విద్యార్థులు కజకిస్తాన్కు వెళ్లారు. కజకిస్తాన్ ఎయిర్పోర్టు వద్ద ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్కు చెందిన తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. (టిక్టాక్ అవుట్; స్వదేశీ పరిజ్ఞానంతో ‘పాప్-ఇన్’ యాప్) చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్! అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ -
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గందరగోళానికి గురవుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై మాట్లాడి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్లైన్ మోడ్లోకి మార్పు చేశాయి. ఈ తరుణంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది. ► ఈ పరిస్థితుల్లో తమ చదువులు, భవిష్యత్తుపై అక్కడి తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. ► వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్లోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది. ► కరోనా వైరస్ కారణంగా కోర్సులను వర్సిటీలు ఆన్లైన్ మోడ్లోకి తాత్కాలికంగా మార్పు చేశాయని, ఇందులో తమ పొరపాటు ఏమీ లేదని, రెగ్యులర్ కోర్సుల్లో చేరిన తమకు ఇబ్బంది రాకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు, వర్సిటీల ప్రెసిడెంట్లకు విద్యార్థుల ద్వారా వినతులు ఇప్పించింది. ► జార్జియాటెక్, క్లెమ్స్న్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్ వర్సిటీ, డ్యూక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టి, కింగ్స్విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువ. వినతులతో కదిలిన వర్సిటీలు 36 వర్సిటీల విద్యార్థులు అందిస్తున్న వినతులతో ఆయా వర్సిటీలు ఇప్పటికే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని విన్నవిస్తూ లేఖలు రాస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తలెత్తే సమస్యలను అందులో పొందు పరిచాయి. యూఎస్లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశం విద్యార్థులు చైనా 3,69,548 ఇండియా 2,02,014 సౌత్కొరియా 52,250 సౌదీ అరేబియా 37,080 కెనడా 26,112 వియత్నాం 24,392 తైవాన్ 23,369 జపాన్ 18,105 సీఎం జగన్ చర్యలతో ధైర్యం కరోనా వైరస్ వల్ల యూఎస్ యూనివర్సిటీలు కోర్సులను తాత్కాలికంగా ఆన్లైన్ మోడ్లోకి మార్చాయన్న కారణంతో మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలన్న ఐసీఈ ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉన్నాం. ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు ధైర్యాన్ని ఇస్తున్నాయి. – రాజేష్ అంబవరం, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంటు సైన్స్, వర్జీనియా దిక్కుతోచని స్థితిలో ఊరట ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉన్నత విద్యనభ్యసించడానికి యూఎస్లోని వర్సిటీల్లో చేరాం. కరోనా వైరస్ వల్ల మా కోర్సులను ఆన్లైన్లోకి మార్పు చేసి బోధన కొనసాగిస్తున్నాయి. మా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. వైరస్ తగ్గాక మళ్లీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలనడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తూ ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు. – నాగసాయి శశాంక్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, డీఈ, యూఎస్ -
కిర్గిస్తాన్లో వైద్య విద్యార్థుల వెతలు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో 4 వేల మంది తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్లో చిక్కుకుపోయారు. కళాశాలలు మూతపడి మూడు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లోని నాలుగు మెడికల్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భ యం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోవడం కూడా వారిని ఆందోళన కు గురిచేస్తోంది. వందేభారత్ మిషన్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా 500 మంది భారత పౌరులను ఇండియాకు తరలించి న ప్రభుత్వం.. ఈనెల 20న మరో విమానాన్ని కిర్గిస్తాన్కు నడుపుతోంది. సుమారు 14 వేల మం ది భారతీయులు స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తుండటంతో విమాన టికెట్ల ధరలు కూడా రెట్టింపయ్యాయి. సాధారణ రోజుల్లో రాకపోకల కు రూ.28వేలు ఉండగా.. ప్రస్తుతం కేవలం ఇండియాకు రావడానికే రూ.20 వేలు పలుకుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య కిర్గిస్తాన్లోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. లా క్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పుంజుకుందని అక్కడే మెడిసిన్ చదువుతు న్న వికారాబాద్ జిల్లా పెద్దేముల్కు చెందిన సంకేపల్లి హరికారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, సరైన ఆహా రం దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ‘సాక్షి’కి చెప్పారు. భారత్కు విమానాలు నడపాలని స్థానిక రాయబార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన లేదని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి జోక్యం చేసుకొని చొరవ చూపాలని కోరారు. -
తెలుగు వారిని రప్పించేందుకు సహకరించాలి
భారతదేశానికి రావడం కోసం కువైట్లో నమోదు ప్రక్రియలో మన వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తిరిగి రావాలనుకుంటున్న వలసదారుల నమోదు ప్రక్రియ, వారిని పంపించే ఏర్పాట్లు సజావుగా సాగేలా ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాల అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతదేశం వస్తున్న వలసదారుల సమాచారాన్ని (డేటా) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలకు అందించేలా చూడాలి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లతో వారి రాకకై సిద్ధంగా ఉంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరిం చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, ఆ సందర్భంగా కువైట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆ లేఖలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రావొచ్చు ► కోవిడ్19 సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి, అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాక భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చేవారి సంఖ్య మరింత పెరగొచ్చు. ► దుబాయ్లో, ఇతర దేశాల్లో భారత దౌత్యకార్యాలయాలు స్వదేశానికి తిరిగి వెళ్లే భారతీయుల సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టాయి. ఇతర రాష్ట్రాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు వలసదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అధికంగా ఉన్నారు. ► భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణ సదుపాయాలను తిరిగి ప్రారంభించాక గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వలసదారులు కొన్ని వేల మంది ఉంటారు. వీరి భద్రత, క్షేమం కోసం, క్వారంటైన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంది. ► ఏప్రిల్ 30 గడువులోగా నమోదు చేసుకోవటానికి, ఏప్రిల్ 29న కువైట్లోని మన రాయబార కార్యాలయానికి వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ నమోదు ప్రక్రియలో రాయబార కార్యాలయం వద్ద వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► గత 6 వారాలుగా వివిధ దేశాలలో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు, సందర్శకులు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ► ముఖ్యమంత్రి లేఖను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ పత్రికలకు విడుదల చేశారు. -
అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్
-
భారత విద్యార్థులకు కరోనా కష్టాలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ కోర్సు చదువుతున్న మాదిరెడ్డి స్వరూప అదే యూనివర్సిటీలో అసిస్టెంట్షిప్ ద్వారా నెలకు 800 డాలర్లు సంపాదిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో ఎంఎస్ (మెకానికల్) కోర్సు చేస్తున్న మారుపాక రమేశ్ మెకానికల్ విభాగంలో ల్యాబ్ అసిస్టెంట్గా పని చేస్తూ నెలకు 650 డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇలా సంపాదించుకుంటున్న సొమ్ముతోనే అక్కడ తాము చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చుకుంటున్నారు. గడచిన నెల రోజులుగా విశ్వవిద్యాలయాలు మూతపడటంతో వారికి అసిస్టెంట్షిప్ అందడంలేదు. స్వరూప, రమేశ్ మాత్రమే కాదు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న 50వేల మంది ఇప్పుడు నిరుద్యోగులయ్యారు. వీరుకాక మరో లక్షమంది విద్యార్థులు అనధికారికంగా వివిధ వాణిజ్య, వ్యాపారసంస్థల్లో రోజువారీ వేతనంపై పనిచేస్తుంటారు. లాక్డౌన్తో నెల రోజులుగా వారికి వేతనాలు రావడంలేదు. దీంతో ఇప్పుడు వారికి డబ్బులు పంపాల్సిన బాధ్యత భారత్లోని తల్లిదండ్రులపై పడింది. మధ్యతరగతి తల్లిదండ్రులు ఏదోలా ఇక్కడి నుంచి తమ పిల్లలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. కానీ, అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ఎంఎస్ పూర్తిచేస్తామని వెళ్లిన దాదాపు లక్షమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘మేము నలుగురం డల్లాస్లో త్రిబుల్ బెడ్రూమ్ నెలకు రూ.2,500 డాలర్లకు అద్దెకు తీసుకుని ఉంటున్నాం. వర్సిటీలో తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయాం. ఇప్పుడు ఇండియా నుంచి (తల్లిందండ్రులు) డబ్బులు పంపుతున్నారు. కానీ, మాలో ఇద్దరికి అక్కడి నుంచి డబ్బు వచ్చే ఆశ లేదు. దీంతో సాయం చేయాలని మాకు తెలిసిన వారిని అడిగాం. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం. ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా టికెట్ డబ్బులు సంపాదించుకుని ఇండియా పోదామంటే విమానాలు లేవు. శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ ఎంబసీకి ఫోన్చేసి మా బాధలు చెప్పుకున్నాం. వారు నాలుగు ఊరడించే మాటలు చెప్పారు తప్ప సహాయం చేస్తామనలేదు’ అని నల్లగొండ జిల్లారామన్నపేటకు చెందిన దేవిరెడ్డి సృజన్ వాపోయాడు. గంపెడాశలతో అమెరికా వెళ్లిన వేలాదిమంది విద్యార్థులది ఇదే పరిస్థితి. వెనక్కి పంపడం ఇప్పట్లో కష్టమే.. ‘ఇప్పటికిప్పుడు అమెరికాలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో పలువురు ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోకొంత సహాయం చేయాలని ఉన్నా లాక్డౌన్ కారణంగా సాధ్యపడటంలేదు. అమెరికాలో ఉన్న భారతీయుల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారు మాత్రమే సహాయంచేసే స్థితిలో ఉంటారు. ఇప్పుడా కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. భారీగా సహాయం చేయాల్సిన స్థితిలో ఉన్న అనేకమంది భారతీయులు న్యూయార్క్లో ఇబ్బందులు పడుతున్నారు. వారు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ప్రతినిధి సుధీర్ చెప్పారు. అమెరికాలో కరోనా కేసులు నమోదు కావడంతోనే విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయని, చాలామంది వెళ్లిపోయారని, ఉన్నవాళ్లలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరో ప్రతినిధి బాల ఇందూర్తి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల డేటాను సేకరిస్తున్నామని, ఏ మేరకు సాయం చేయగలమనేది పరిశీలిస్తున్నామని తానా ప్రతినిధి తోటకూర ప్రసాద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో ఉన్న మన విద్యార్థులను భారత్కు పంపడం ఇప్పట్లో సాధ్యపడదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం చెబుతోంది. హెచ్1బీ వీసాదారులకు కష్టకాలం అమెరికాలో లాక్డౌన్తో హెచ్1బీ వీసాపై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది ఉద్యోగాలు పోయాయి. వచ్చే రెండు నెలల్లో మరో 60వేల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. రానున్న రోజుల్లో అత్యంత అధునాతనమైన విమానాలు ఉత్పత్తిచేసే కార్యక్రమంలో భాగంగా బోయింగ్, ఎయిర్బస్సు సంస్థలు అమెరికాలోని అరడజను ఐటీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకున్నాయని, మునుముందు ఉద్యోగాలకు ఇది గడ్డుకాలమని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హెచ్1బీ వీసాదారుడు ఉద్యోగం కోల్పోయినా సరే వీసా స్టేటస్ కొనసాగించాలంటే ఫెడరల్ ప్రభుత్వానికి నెలకు వెయ్యి డాలర్ల దాకా చెల్లించాలి. లేకపోతే వీసా రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొందరు ఇప్పటిదాకా తాము పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచి తీసి చెల్లిస్తున్నారు. ‘ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుందో, విమానాలు ఎప్పుడు నడుస్తాయో తెలియదు. మొత్తం మీద మా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింద’ని బోస్టన్లో ఉంటున్న వేమిరెడ్డి నరేందర్ వాపోయాడు. అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూస్తుంటే ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. బతికుంటే బలుసాకు తినొచ్చన్న సామెత గుర్తుకు వస్తోందని డల్లాస్లో ఉంటున్న కంచనపల్లి రఘుబాబు వ్యాఖ్యానించాడు. ఉద్యోగాలు ఎలాగూ పోతాయి. వాటి గురించి ఆలోచించడం కంటే స్వదేశానికి వెళ్లి ఏదో ఒక పని చేసుకోవచ్చనే ఆలోచనలో వేలాదిమంది హెచ్1బీ వీసాదారులు ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలో గడప దాటాలంటే భయం ‘మాకు ఇప్పుడు ఉద్యోగం గురించి ఎలాంటి ఆలోచన లేదు. సరుకుల కోసం గడప దాటాలంటేనే భయపడుతున్నాం. న్యూయార్క్లో సరుకుల కోసం బయటకు వెళ్లిన ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు న్యూజెర్సీలోనూ అదే భయం. ఉన్న సరుకులతోనే వెళ్లదీసుకోవడం లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయడంతోనే మా జీవితం సాగిపోతోంది. ఇదెంతకాలమో తలచుకుంటే భయంగా ఉంది’అని న్యూజెర్సీలో ఉంటున్న బైరెడ్డి దేవిక చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు న్యూయార్క్లో 1,88,694 కేసులు నమోదు కాగా, న్యూజెర్సీలో 61,850మంది కరోన బారినపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు 11,735 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చదవండి: అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్ -
నేడు వైజాగ్కు ఇటలీ తెలుగు విద్యార్థులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఇటలీలోని తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖ చేరుకోనున్నారు. ఇటలీ నుంచి మార్చి 15, 21 తేదీల్లో ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్గా తేలింది. క్వారంటైన్ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 10న బయలుదేరారు. ఛత్తీస్గఢ్ అధికారులు వీరిని ఆపేశారు. అన్ని పత్రాలు ఉన్నాయని చూపినా వారు కదలనివ్వలేదు. స్థానికంగా ఆదివాసీ బాలికా విహార్లో వసతి కల్పించారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. కాశీ నుంచి తెలుగు రాష్ట్రాలకు యాత్రికుల తరలింపు: జీవీఎల్ లాక్డౌన్కు ముందు కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధాని కార్యాలయ అనుమతితో వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కాగా, ఏపీలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి దేశానికి తరలించడానికి విశాఖ నుంచి బెంగళూరుకు నేడు ప్రత్యేక విమానం నడపనున్నారు. -
ప్రభుత్వ చొరవతో తెలుగు విద్యార్థులకు విముక్తి..
సాక్షి, విజయవాడ : ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆగిపోయిన 33 మంది తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఆ విద్యార్థులను క్షేమంగా ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలీకృతం అయ్యాయి. విరాల్లోకి వెళితే.. ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు ఛత్తీస్గఢ్ బార్డర్లో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వారిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకు వచ్చేందుకు చొరవ చూపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబులు రంగంలోకి దిగి రాయపూర్, జగదల్పూర్ మీదుగా సోమవారం విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులను ఏపీకి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. -
తెలుగువారికి అండగా..
సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన వేలాది తెలుగు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు సహకారం అందేలా చర్యలు చేపట్టింది వర్సిటీలతో సంప్రదింపులు ► తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్న అమెరికా యూనివర్సిటీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ► యూటీ డల్లాస్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ – డెంటాన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, జార్జియా టెక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, టెక్సాస్ ఏ అండ్ ఎం కార్పస్ క్రిస్టి, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ, క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, టల్ లహస్సీ తదితర వర్సిటీల్లో మన తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ► విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు ‘సాక్షి’కి చెప్పారు. ► విద్యార్థుల్ని ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. ఏ విద్యార్థికీ ఇలాంటి ఇబ్బంది వస్తే వెంటనే ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ)ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రతి వర్సిటీలో కో–ఆర్డినేటర్లు ఉన్నారన్నారు. ► యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని, విద్యార్థులు వర్సిటీ క్యాంపస్లను వినియోగించనందున స్టైఫండ్ రూపంలో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తున్నాయన్నారు. భయమొద్దు.. మేమున్నాం తెలుగు విద్యార్థుల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం జగన్ సూచనల మేరకు విద్యార్థులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ కుమార్ అన్నవరపు, అట్లాంటా, యూఎస్ఏ email: saikumarannavarapu@gmail. com (+16786407682) ‘ఆపి’ ఆపన్న హస్తం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థుల సంరక్షణ, సహాయం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం. ‘ఆపి’ వైద్యులు సదా అందుబాటులో ఉంటారు. – డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, ‘ఆపి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జాగ్రత్తలు తీసుకున్నాం లూసియానాలోని సదరన్ వర్సిటీతో పాటు ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనవాళ్లెవరూ కరోనా బారినపడలేదు. –శ్రీనివాసరెడ్డి గవిని, సదరన్ వర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్, లూసియానా email: reddy& gavini@ subr.edu (225 771 2277) ‘నాటా’ బాసట నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో యూఎస్లోని తెలుగు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. – డాక్టర్ రాఘవరెడ్డి, అధ్యక్షుడు, నాటా ఫెలోషిప్స్ ఆపలేదు అమెరికా వర్సిటీల్లో ఫెలోషిప్స్ ఆపేశారన్నది అవాస్తవం. విద్యార్థుల క్షేమంపై మేమంతా శ్రద్ధ వహించాం. ఎలాంటి ఇబ్బందుల్లేవు. – ప్రొఫెసర్ అప్పారావు, డైరెక్టర్, క్లెమ్సెన్ యూనివర్సిటీ email: arao@clemson.edu భద్రంగా ఉన్నారు మన విద్యార్థులు భద్రంగా ఉన్నారు. ఎటువంటి అవసరమొచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. – ప్రొఫెసర్ శ్రీనివాసరావు మెంట్రెడ్డి్డ, అలబామా ఏ అండ్ ఎం యూనివర్సిటీ email: srinivasa.mentreddy@aamu.edu మేమంతా క్షేమం తెలుగు విద్యార్థులకు ఎలాంటి భయం లేదు. మేమంతా ఇక్కడ క్షేమంగా ఉన్నాం. – రవితేజ పసుమర్తి, కెన్నెస్సీ స్టేట్ వర్సిటీ విద్యార్థి, అల్ఫారెటా -
ధైర్యంగా ఉండండి
సాక్షి, అమరావతి: ‘మీరెవరూ నిబ్బరం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయ్’ అని లండన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. కోవిడ్–19 కారణంగా ఈనెల 20 నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో చివరి నిమిషంలో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు ప్రస్తుతం లండన్లోనే ఉంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఏపీకి చెందిన 29 మంది అక్కడే ఉండిపోయారు. విమానాలు నిలిపివేయడంతో తామంతా అక్కడ చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్ఆర్టీ కంట్రోల్ రూమ్, సీఐడీ ఎన్ఆర్ఐ సెల్కు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన డీజీపీ సవాంగ్ ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీల సమన్వయంతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. విద్యార్థుల గోడు ఇది.. అల్లూరి గోపాల్ అనుకోకుండా లండన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాం. ఈ నెల 20 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన చొరవతో ఇక్కడ ఐదు రోజులు మాకు ఏర్పాట్లు బాగానే చేశారు. తర్వాత కొంత ఇబ్బందిగా మారింది. తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నాః. ఆహారం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. యుగసాయి, కార్తీక్రెడ్డి, గంగిరెడ్డి ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆహారానికి ఇబ్బందిగా ఉంది. బయటకెళ్లి ఆహారం తెచ్చుకుందామంటే పోలీసులు పట్టుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వైరస్ వస్తుందనే భయం వెంటాడుతోంది. నెలనూతల కార్తీక్, మరి కొందరు విద్యార్థులు దేశంలో ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్య తెలుసుకుని స్పందించడం, వెంటనే డీజీపీ మాతో మాట్లాడటం చాలా ధైర్యాన్నిచ్చింది. కరోనా వైరస్ ప్రభావం మాపైనా పడుతుందేమోననే భయమేస్తోంది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. డీజీపీ ఏం భరోసా ఇచ్చారంటే.. ► మీరెవరూ ఆందోళన చెందొద్దు. ధైర్యంగా ఉండండి. మీ ఇబ్బందులను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాను. ► వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ► మీకు ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ అందుబాటులో ఉంటాయి. ► ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి వారితో వీడియో కాల్లో మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది లండన్లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. అక్కడ చిక్కుకున్న వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. విదేశాంగ శాఖ, హోం శాఖ అధికారులు, లండన్లోని ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు లండన్లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని వీలైనంత త్వరగా ఏపీకి పంపేలా చేస్తున్నాం. – యూరప్లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కందుల రవీందర్రెడ్డి -
లండన్లోని తెలుగు విద్యార్థులకు ఏపీ డీజీపీ భరోసా
సాక్షి, విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ లండన్ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులతో నిరంతరం అందుబాటులో ఉండాలని సీఐడీ(ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులను ఆదేశించారు. డీజీపీ స్పందనపై లండన్లోని తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’ సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్ -
రెండు రోజులుగా విమానాశ్రయంలోనే..
రణస్థలం: కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని విజృంభణకు విదేశాలకు వెళ్లిన భారతీయులంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన 400 మంది విద్యార్థులు తిరిగి దేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరి దేశాలకు వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ప్రయాణాలకు సిద్ధపడిన విద్యార్థులు విమాన సర్వీసులు రద్దయిపోవడంతో రెండు రోజులుగా మనీలా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. రణస్థలం మండలం జేఆర్ పురానికి చెందిన జి.సాయినిఖిల్, లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఎం.నరేష్ కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పడుతున్న ఇబ్బందులను ఇలా వివరించారు..(ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు) ‘ఫిలిప్పీన్స్లో మన దేశానికి చెందిన 400 మంది విద్యార్థులం ఎంబీబీఎస్ చదువుతున్నాం. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇందులో 85 మంది తెలుగు వారే. మూడు రోజుల కిందట ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్లు తీసుకుని అంతా మనీలా ఎయిర్పోర్టుకు వచ్చాం. కానీ రెండు రోజులు ఎయిర్పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సరీ్వసులు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మాకేమీ పాలు పోవడం లేదు. టికెట్ రూ. 30వేలు పెట్టి కొన్నాం. రిఫండ్ వస్తుందో రాదో తెలీడం లేదు. ఉండేందుకు వసతులు లేవు. తిరిగి రూములకు వెళ్లిపోదామంటే ఉండేందుకు డబ్బులు లేవు. ఇక్కడి ప్రభుత్వం మాకేమీ సహకరించడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి రాక కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. (తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు) ప్రభుత్వమే రప్పించాలి విమాన టికెట్లు బుక్ చేసుకొని విమానాశ్రయానికి చేరుకుంటే విమానాలు రద్దు చేస్తున్నాం, విమానాశ్రయమే మూసేస్తున్నాం అని చెబితే చదువు కోసం వెళ్లిన విద్యార్థులు ఏం చేయగలరు..? భోజనాలు కూడా దొరకడం లేదంట. ప్రభుత్వమే వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలి. – కల్యాణకుమార్ రాజా, విద్యార్థి నిఖిల్ తండ్రి ఎయిర్పోర్టులోనే పడిగాపులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మూడు రోజులు గడువిచ్చి స్వదేశాలకు వెళ్లిపొమ్మంది. ఈ లోగానే విమాన సరీ్వసులు రద్దయిపోయాయి. మనీలా విమానాశ్రయం మూసేస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. కరోనా వల్ల వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో..? ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని రప్పించాలి.– ఎం.గోవిందరావు, విద్యార్థి నరేష్ తండ్రి -
‘ఆ విద్యార్ధులను తీసుకురండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో మూడు రోజులుగా చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది మెడికల్ విద్యార్ధులను తక్షణమే స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు. తిండి, నీరు లేకుండా కటిక నేలపై నిద్రిస్తూ మనీలా ఎయిర్పోర్ట్లో తెలుగు విద్యార్ధులు పడుతున్న కష్టాలను ఆయన మంత్రికి వివరించారు. ఈ విద్యార్ధులంతా మనీలాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మనీలాలో విద్యా సంస్థలు మూసివేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులంతా మూడు రోజుల క్రితమే మనీలా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే మనీలా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు కూడా స్తంభించిపోవడంతో విద్యార్దులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేని దుర్భరమైన పరిస్థితుల్లో సహాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. రవాణా వ్యవస్థ యావత్తు నిలిచిపోవడంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి తమ హాస్టళ్ళకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మనీలా ఎయిర్పోర్ట్లో చిక్కుబడిపోయిన 70 మంది విద్యార్ధులలో 36 మంది యువతులు ఉన్నారని, టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారని మంత్రికి తెలియచేశారు. విద్యార్ధులు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్ధులు వాపోతున్నట్లు మంత్రి జైశంకర్కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మనీలాలో చిక్కుబడిపోయిన విద్యార్ధులను స్వదేశానికి రప్పించాలని విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు
సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తెలుగు విద్యార్థులు విశాఖపట్నంకు చేరుకున్నారు. కౌలాలంపూర్ నుంచి 186 మంది విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో మలేషియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. దీంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు) ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తెలుగు విద్యార్థులు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను పరిక్షీంచేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేశారు. 50మంది వైద్యులను నియమించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విమ్స్లోని ఐసోలేషన్ వార్డులకి తరలించేందుకు ఐదు అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఏ లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచనున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. -
తెలుగు విద్యార్థులకు సర్కారు అండ
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): కరోనా వైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారందరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎయిర్ ఏషియా సంస్థను సంప్రదించాలన్నారు. మరోవైపు.. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు నివేదించాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు. కౌలాలంపూర్లో విద్యార్థుల అవస్థలు అంతకుముందు.. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, అలాగే కావైట్ పట్టణంలో చదువుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది ఉన్నట్లు సమాచారం. మనీలాలో ఇప్పటివరకు 100 పాజిటివ్ కేసులు.. కావైట్లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో తమకు ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించారని అక్కడి విద్యార్థులు తెలిపారు. తమను కళాశాల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని.. లేనిపక్షంలో నిర్బంధిస్తామని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అంతేకాక.. అనుమతి లేకుండా వీధుల్లో సంచరిస్తే కాల్చివేస్తామని కూడా హెచ్చరికలు చేసిందని వాపోయారు. దీంతో వారంతా మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ, అక్కడ భారత్ వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడంతో వీరంతా ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులున్నారు. వీరంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటామా లేదా అని ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపేందుకు అంగీకరించడంతో వారంతా స్వస్థలాలకు సురక్షితంగా వచ్చేందుకు మార్గం సుగమమైంది. -
వణికిపోతున్న అమెరికా..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికా ప్రభుత్వం అక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్హౌస్ సహా (అత్యవసర సేవలు మినహా) ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టుకోరాదని సూచించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్ తన ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. వేలాది మంది ప్రయాణికులతో కిటకి టలాడే న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలిస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాల్లో ఇప్పుడు సందడి లేదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి కూడా రాకపోకలు దాదాపు తగ్గాయి. యూరోపియన్ దేశాల నుంచి విమానాలు రద్దు చేయడంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తక్కువగా కన్పిస్తున్నారు. సిలికాన్ వ్యాలీగా పేరొందిన శాన్జోస్, శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచే స్తుండటంతో రోడ్లు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. న్యూయార్క్ డౌన్టౌన్లో రాత్రి 10 గంటలయ్యే సరికి జన సంచారం తగ్గిపోతోంది. న్యూయార్క్లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు మాత్రమే తగిన జాగ్రత్తలతో విధులకు హాజరవుతున్నారు. ఇంటి బాట పడుతున్న మనోళ్లు.. అమెరికాలోని స్కూళ్లు, కాలేజీలకు నిరవధిక సెలవులు ప్రకటించడంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వేలాది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తిరుగు ముఖం పడుతున్నారు. విమాన చార్జీలు తక్కువగా ఉండటంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో భారత్కు తిరిగి వెళ్తున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. భారత్లో కోవిడ్ వైరస్ ఉన్నా అమెరికాతో పోలిస్తే తక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆ పత్రిక పేర్కొంది. వర్క్ ఫ్రం హోం వల్ల ఐటీ ఉద్యోగులు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు. కనీసం నెల రోజుల కంటే ఎక్కువ వర్క్ ఫ్రం హోం ఉంటుందని, ఈ సమయాన్ని తల్లిదండ్రులతో గడపాలని హైదరాబాద్ వచ్చినట్లు అమెజాన్ ఉద్యోగి రవికిషోర్ చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్నానని నిర్ధారించాకే ఇంటికి పంపినట్లు నూకల అనూష గుర్తుచేసుకున్నారు. జర్మనీ నుంచి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి దగ్గుతో బాధపడుతుండటంతో అతడిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రయాణాలు రద్దు చేసుకున్న భారతీయులు మార్చి 15 నుంచి జూన్ 30 వరకు అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించాలనుకున్న భారతీయులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. మార్చి 15–31 మధ్య తమ విమానాల్లో అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్లాలనుకుని టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 88 శాతం మంది రద్దు చేసుకోవడమో లేదా గడువు పెంచుకోవడమో చేశారని ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. -
చైనా నుంచి క్షేమంగా ఇంటికి..
సాక్షి, విశాఖపట్నం: చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు సొంతూళ్లకు పంపించారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యాప్తితో అల్లాడుతున్న చైనాలో శిక్షణ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నెల 3న ప్రత్యేక విమానంలో చైనా నుంచి 58 మందిని ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని అక్కడ 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. వారికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ కావడంతో మంగళవారం సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విశాఖకు చెందిన 9 మంది పీవో టీపీఎల్ ట్రైనీ విద్యార్థులు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జనవరి 23న చైనాలోని వుహాన్ నగరంలో పీవో టీపీఎల్ ట్రైనింగ్కు వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తిరిగి రప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విదేశీ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు సొంత ఇళ్లకు చేరుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచామని పరిశీలించామని, వారికి ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని జిల్లా సర్వెలెన్స్ ఆఫీసర్ పార్థసారథి తెలిపారు. మరో 14 రోజుల పాటు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు వారి స్థితుగతులు తెలుసుకుంటామన్నారు. కోలుకుంటున్న యువతి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రభుత్వ అంటు వ్యాధుల ఆస్పత్రిలో చేరిన యువతి ప్రస్తుతం కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. నగరానికి చెందిన ఓ యువతి (21) చైనా నుంచి బ్యాంకాక్ మీదుగా విశాఖ చేరుకున్నారు. ఈ క్రమంలో పలు విదేశాల్లో విమానాశ్రాయాల సమీపంలో భోజనాలు చేశారు. అలాగే, ఐస్క్రీమ్ తిన్నారని వైద్యుల విచారణలో తేలింది. విశాఖ చేరుకోగానే వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో చినవాల్తేరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేర్చారు. జలుబు లక్షణాలు కనిపించడం, చైనా నుంచి రావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ కొన్ని పరీక్షలు చేయగా ఆరోగ్యం నిలకడగానే ఉందని తేలింది. మరికొన్ని శాంపిళ్లను హైదరాబాద్ ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కరోనా వైరస్ నివారణ నోడల్ అధికారి డాక్టర్ పార్థసారథి మంగళవారం ‘సాక్షి’తోమాట్లాడుతూ ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు. చైనా నుంచి రావడం వల్లనే ముందుజాగ్రత్తగా కరోనా వార్డులో చికిత్స చేయించామన్నారు. యువతి చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా బుధవారం డిశ్చార్చిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. మరో యువతికి చికిత్స మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు చెందిన 23 ఏళ్ల యువతి చైనాలోని యుహన నగరం నుంచి మంగళవారం విశాఖ వచ్చారు. ఆమెకు జ్వరం రావడంతో పెదవాల్తేరు ప్రభుత్వఛాతి ఆస్పత్రిలో చేర్పించారు. శాంపిల్స్ హైదరాబాద్ పంపారు. ప్రస్తుతం యువతి బాగానే వుందని వైద్యులు తెలిపారు. (చదవండి: కోవిడ్కు వైద్యుడు బలి) -
టాప్ తొమ్మిదిలో ఇద్దరు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించి జేఈఈ మెయిన్ పరీక్ష పలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 9 మంది ఉండగా... ఇందులో తెలుగు విద్యార్థులు నలుగురు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రొంగల అరుణ్ సిద్దార్ధ, చాగరి కౌశల్కుమార్రెడ్డి, ఏపీకి చెందిన లంధ జితేంద్ర, తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 9,21,261 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 8,69,010 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అడ్వాన్స్లోనూ కష్టపడతా జేఈఈ మెయిన్లో వంద పర్సంటైల్ రావడం ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్లోనూ ఇదే తరహాలో కష్టపడి అత్యుత్తమ పర్సంటైల్ సాధిస్తా. బెస్ట్ ఐఐటీలో చదవడమే నా లక్ష్యం. – అరుణ్ సిద్దార్ధ ఆవిష్కరణలంటే ఇష్టం మెయిన్లో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం జేఈఈ అడ్వాన్స్పరీక్షే. ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. కానీ అడ్వాన్స్ ర్యాంకు బట్టి వచ్చే ఐఐటీలో చేరతా. కొత్త ఆవిష్కరణలంటే ఇష్టం. – చాగరి కౌశల్కుమార్రెడ్డి -
విద్యార్ధుల విషాదాంతం : ఎన్ఆర్ఐల దాతృత్వం
సాక్షి, అమరావతి/ సింధనూరు టౌన్: అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టర్నర్ఫాల్స్ను చూసేందుకు వెళ్లిన సమయంలో కౌశిక్ ఓలేటి నీటిలోకి జారిపడ్డాడు. అతన్ని రక్షించేందుకు అజయ్కుమార్ విఫలయత్నం చేసి.. అతనితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రమాద సమయంలో వారు లైఫ్ జాకెట్లను ధరించలేదని అధికారులు తెలిపారు. కాగా అమెరికాలో దుర్మరణానికి గురైన వీరి అంత్యక్రియలు చేపట్టేందుకు, మృతదేహాలను స్వస్థలానికి తరలించడం, వారి విద్యా రుణాలను తీర్చడం వంటి అవసరాలకు పెద్దమనసుతో ముందుకురావాలని వారి స్నేహితులు దాతలను కోరారు. తమకు తోచిన సాయం చేయాలని వారి సన్నిహితులు గోఫండ్మి వంటి ఫండింగ్ సైట్లలో నెటిజన్లను కోరారు. ఈ విషాద సమయంలో అందరూ స్పందించి మానవత్వం చాటాలని వారు పిలుపు ఇచ్చారు.మరోవైపు బాధిత విద్యార్ధుల కుటుంబానికి బాసటగా నిలుస్తామంటూ పలువురు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. -
తెలుగు విద్యార్థులకు అన్యాయం..
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఫెలోషిప్ ఎంపికలో తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగు పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే నేషనల్ ఫెలోషిప్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల మెరిట్ను పరిగణనలోకి తీసుకోకుండానే ఎంపిక చేసిందని ఆరోపిస్తున్నారు. 2018–19 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫెలోషిప్నకు ఎంపికైన ఓబీసీ విద్యార్థుల జాబితాను యూజీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 1,000 మందిని ఎంపిక చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 54 మంది తెలుగు వారే ఎంపికయ్యారు. మరో 13 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను కలుపుకొంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 67 మంది మాత్రమే ఎంపికయ్యారు. పరిశోధనలో మేటిగా ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారని పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో లోపం ఉందని ఆరోపిస్తున్నారు. యూజీసీ ఎంపిక కమిటీ కావాలనే తెలుగు విద్యార్థులపై వివక్ష చూపిందని పేర్కొంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? నేషనల్ ఫెలోషిప్నకు దరఖాస్తు చేసే విద్యార్థి ఎంఫిల్/పీహెచ్డీలో రిజిస్టర్ అయి ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారే ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని యూజీసీ ప్రకటించింది. ఈ అర్హతలతో పాటు విద్యార్థులకు పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా (మెరిట్) ఎంపిక చేస్తామని యూజీసీ ప్రకటించింది. అన్ని అర్హతలు కలిగి ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.25 వేల చొప్పున, తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.28 వేల చొప్పున యూజీసీ ఇస్తుంది. కంటింజెన్సీ కింద మొదటి రెండేళ్లు ఏటా కనీసంగా రూ.10 వేలు, రెండేళ్ల తర్వాత ఏటా కనీసంగా రూ.20 వేలు ఇస్తుంది. ఈ నిబంధల ప్రకారం అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐదారు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. అందులో 54 మందినే ఎంపిక చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే ఇది ముమ్మాటికి తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే. ఏ ప్లస్ గ్రేడ్ అక్రెడిటేషన్ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 7 మందినే ఎంపిక చేయడం సరికాదు. ఇక్కడ నెట్/సెట్ కలిగిన వారు వేలల్లో ఉన్నారు. పీహెచ్డీలు చేస్తున్న వారు ఉన్నారు. నాణ్యమైన పరిశోధన ఇక్కడే జరుగుతోంది. యూజీసీలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అన్యాయం చేశారు. కావాలనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించి తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. – విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెనగాని దయాకర్ -
ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు..
-
ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు..
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్ నిట్కి సెలవులు ప్రకటించడంతో.. తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. 31మంది నిట్ తెలుగు విద్యార్థులు తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో వీరిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ రిసీవ్ చేసుకున్నారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. ఢిల్లీ నుంచి తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తరలేందుకు ఏపీ భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి జమ్మూ నుంచి బయల్దేరారు. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో నిట్ విద్యార్థులు స్వరాష్ట్రాలకు పయనమయ్యారు. కాలేజీ యాజమాన్యం కూడా నాలుగు బస్సులు ఏర్పాటుచేసి విద్యార్థులను శ్రీనగర్ నుంచి జమ్మూ తరలించింది. అక్కడి నుంచి తెలుగు విద్యార్థులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ఢిల్లీలోని ఏపీ భవన్ తగిన చర్యలు చేపట్టింది. ఇక, గతరాత్రి 23మంది నిట్ తెలుగు విద్యార్థులు జమ్మూ అండమాన్ ఎక్స్ప్రెస్లో విజయవాడ బయల్దేరారు. మరో 86మంది ప్రత్యేక రైలులో జమ్ము నుంచి ఢిల్లీకి వస్తున్నారు. సోమవారం కల్లా విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకుంటారని ఏపీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది: తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా తెలుగు విద్యార్థులు సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని, తక్షణమే స్పందించి తమ ప్రయాణానికి వీలుగా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. రైలులో ప్రత్యేకంగా రెండు బోగీలు ఏర్పాటు చేసి జమ్మూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని, ప్రయాణంలో తమకు భోజన సదుపాయం కల్పించారని విద్యార్థులు తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు ఉన్నాయని, 15 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు తమ కాలేజీ యాజమాన్యం తెలిపిందని విద్యార్థులు వివరించారు. ఆగస్టు 15 కల్లా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తారనే ప్రచారం కశ్మీర్లో జరుగుతోందని, ఆర్టికల్ 35 ఏ అనేది ఏకైక గుర్తింపని అక్కడి తోటి స్టూడెంట్స్ చెబుతున్నారని, దీనిని రద్దు చేస్తే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం కనబడుతోందని, ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఇతర రాష్ట్ర విద్యార్థులందరినీ పంపించివేస్తున్నారని చెప్పారు. వీలైతే కశ్మీర్ నిట్లోని తెలుగు విద్యార్థులను జమ్మూ నిట్కి బదిలీ చేయాలని కోరుతున్నామని, కశ్మీర్లో పదే పదే ఇటువంటి పరిస్థితుల వల్ల తమ చదువులకు అంతరాయం కలుగుతోందని అన్నారు. కశ్మీర్లోని తమ నిట్ క్యాంపస్ను ఆర్మీ బేస్ క్యాంపుగా మారుస్తున్నారని తెలిసిందని, అందుకే మమ్మల్ని అక్కడి నుంచి త్వరగా ఖాళీ చేయించి పంపారని తెలిపారు. మళ్లీ తిరిగి ఎప్పుడు రావాలి అనే దానిపై మెయిల్ ద్వారా మళ్లీ సమాచారం ఇస్తామని యాజమాన్యం చెప్పిందని, ప్రస్తుతానికి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. -
స్వస్థలాలకు శ్రీనగర్ నిట్లో 130 మంది తెలుగు విద్యార్థులు
-
విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో చదువుతున్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో, రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను క్షేమంగా స్వస్థలాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావులు ప్రతి క్షణం కిషన్ రెడ్డికి సహాయంగా ఉంటున్నారు. -
విద్యార్థుల కోసం 3 బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనగర్లోని తెలుగు విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. కశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దాంతో ఎన్ఐటీ, కాలేజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిందని తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు అర్థరాత్రి వరకు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో విద్యార్థులు తమకు సాయం చేయలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ట్విట్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని సంప్రదించాలని తెలిపారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 కేటీఆర్ ట్వీట్ చేశారు. Any student/parent wanting assistance, please call our Resident Commissioner Sri Vedantam Giri at 011-2338 2041 or on his mobile +91 99682 99337 at Telangana Bhavan, New Delhi — KTR (@KTRTRS) August 3, 2019 ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్మూకశ్మీర్ నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు రావడానికి బస్సులు ఏర్పాటు చేశారని.. అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కే జోషి తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో టచ్లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారన్నారు. విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ ప్రకటించారు. -
‘తెలుగు’ వెలుగు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెం దిన గిల్లెల ఆకాశ్రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాం కును సాధించగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఆలిండియా 5వ ర్యాంకును, ఏపీకే చెందిన ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకును సాధించాడు. అలాగే టాప్– 100లో 30 ర్యాంకులను, టాప్–500లో 132 ర్యాంకులను హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని విద్యార్థులు సాధించారు. టాప్–1000 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే దాదాపు 300 మంది వరకు ఉంటారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఆలిండియా టాపర్గా మహరాష్ట్రలోని బళ్లార్పూర్కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372 మార్కులకుగాను 346 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచాడు. 2వ ర్యాంకును అలహాబాద్కు చెందిన హిమాన్షు గౌరవ్సింగ్ సాధించగా 3వ ర్యాంకును ఢిల్లీకి చెందిన అర్చిత్ బబ్నా సాధించారు. 308 మార్కులతో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే జోన్ పరిధి ప్రాంతానికి చెందిన షబ్నం సాహే బాలికల కేటగిరీలో టాపర్గా నిలిచారు. హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో టాపర్లు వీరే.. టాప్ ర్యాంకుల సాధించిన విద్యార్థుల్లో ఐఐటీ జోన్లవారీగా ఐదేసి మంది వివరాలను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. అందులో హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో గిల్లెల ఆకాశ్రెడ్డి 4వ ర్యాంకు సాధించగా 5వ ర్యాంకును బట్టేపాటి కార్తికేయ సాధించారు. కౌస్థుబ్ డీఘే 7వ ర్యాంకు సాధించగా, ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, గుంపర్తి వెంకటకృష్ణ సూర్య లిఖిత్ 13వ ర్యాంకు సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన గిల్లెల ఆకాశ్రెడ్డి హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో బాలుర కేటగిరీలో టాపర్గా నిలవగా జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించిన సూరపనేని సాయి విగ్న 44 బాలికల కేటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్లో టాపర్గా నిలిచారు. 38,705 మంది అర్హులు... ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 27వ తేదీ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.45 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా పరీక్ష రాసేందుకు 1,74,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,61,319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 38,705 మంది అడ్వాన్స్డ్లో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33,349 మంది బాలురు ఉండగా 5,336 మంది బాలికలు ఉన్నారు. ఇబ్బందులు పెట్టిన సాంకేతిక సమస్యలు... ఫలితాల వెబ్సైట్కు సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యలతో విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు వేచిచూసినా వెబ్సైట్లో ఫలితాల లింకు అందుబాటులోకి వచ్చాక సమస్యలు తలెత్తడంతో ఫలితాలు మధ్యాహ్నం చూసుకోవాలని ఐఐటీ రూర్కీ తమ వెబ్సైట్లో మెసేజ్ పెట్టింది. ఆ తరువాత మళ్లీ సమస్యలు రావడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిందండ్రులు ఊపరి పీల్చుకున్నారు. అర్హుల్లో రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్... జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఢిల్లీ ఐఐటీ జోన్ పరిధికి చెందినవారే ఉండగా రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన 38,705 మంది విద్యార్థుల్లో ఢిల్లీ జోన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన 9,477 మంది అర్హత సాధించగా ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలకు చెందిన 8,287 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో స్థానంలో ఐఐటీ బాంబే పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 6,140 మంది అర్హత సాధించారు. ఏఏటీకి దరఖాస్తులు... ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) రిజిస్ట్రేషన్లను ఐఐటీ రూర్కీ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. టాపర్ల అభిప్రాయాలు.. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా... అమ్మానాన్నల ప్రోత్సాహంతో ప్రతిరోజూ కనీసం 12 గంటలు చదివా. నా కష్టానికి ప్రతిఫలంగా మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్, ఎంటెక్ చేసి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. – ఆకాశ్రెడ్డి, జేఈఈ అడ్వాన్స్డ్ 4వ ర్యాంకర్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా.. జేఈఈ అడ్వాన్స్డ్లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తా. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా. లేదంటే ఉద్యోగం చేస్తా. – బట్టేపాటి కార్తికేయ, 5వ ర్యాంకర్ సివిల్ సర్వెంట్ కావాలని ఉంది సివిల్ సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తా. టాప్–10 లో ర్యాంకు వస్తుందనుకున్నా. అయినా మంచి ర్యాంకే వచ్చింది. ఐఐటీ బాంబేలో బీటెక్ చేస్తా. – సూర్య లిఖిత్, 13వ ర్యాంకర్ -
జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థిని కొండా రేణు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు దక్కించుకుని సత్తా చాటింది. మన రాష్ట్రానికే చెందిన బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వనాథ్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్ఫణి సాయి 19వ ర్యాంకులతో రికార్డుల మోత మోగించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలోఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. బీఈ, బీటెక్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు. మే 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్లో రెండు దఫాలుగా జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ స్కోరు సాధించిన 24 మంది విద్యార్థులు వివరాలను ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకుల వారీగా విద్యార్థుల జాబితా -
జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ జాతీయస్థాయిలో ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకే చెందిన అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వంత్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్ ఫణి సాయి 19వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండా రేణు 9వ ర్యాంకు, బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంకును సాధించారు. బీఈ, బీటెక్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్ పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,08,440 మంది విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. రెండో దఫాల్లో 608440 మంది పరీక్షలు రాయగా, అందులో 297932 మంది తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. కాగా, మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన గురుమూర్తి, పద్మ దంపతుల కుమారుడు కె.విశ్వంత్ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బట్టేపాటి కార్తికేయ హైదరాబాద్లో ఉండి చదువుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన దయానంద్, సునంద దంపతుల కుమారుడు అడెల్లి సాయికిరణ్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. మే 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 5 నుంచి దరఖాస్తుకు చివరి తేదీ మే 9 ఫీజు చెల్లింపునకు గడువు మే 10 హాల్టికెట్ల డౌన్లోడ్ మే 20నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 27 ఆన్లైన్ కీ విడుదల జూన్ 4 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 14 -
తెలుగు విద్యార్థులతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదో తరగతి తెలుగు విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. నిర్బంధ తమిళం చట్టం నుంచి తాత్కాలిక మినహాయింపు జీఓ జారీ చేయడంలో జరిగిన జాప్యం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసింది. చివరి వరకు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యవహరించి విద్యార్థులను, తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేసింది. తమిళనాడులో నివసించే లింగ్విస్టిక్ మైనార్టీ కుటుంబాలకు 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం గుదిబండలా మారింది. 2015–16 విద్యాసంవత్సరంలో ఈ చట్టం కార్యరూపం దాల్చగా పదో తరగతి చదివే ఇతర భాషల వారు విధిగా తమిళం సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్బంధ తమిళం చట్టానికి అనుగుణంగా పాఠశాలల్లో తమిళ టీచర్ల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటిని పూర్తిగా విస్మరించి చట్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసింది. దీంతో వివిధ తెలుగు సంఘాల వారు ప్రభుత్వానికి విన్నవిస్తూ న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా 2015–16 విద్యాసంవత్సరంలో తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే ఆ ఏడాది నుంచి ప్రతి విద్యాసంవత్సరంలోనూ తెలుగు విద్యార్థు ఇదే సమస్యను ఎదుర్కోవడం, మినహాయింపు తెచ్చుకోవడం తప్పలేదు. జీఓ విడుదలపై మరీ ఘోరం: అయితే ఈ ఏడాదికి సైతం మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరించింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్ జీఓ జారీపై తీవ్రస్థాయిలో జాప్యం చేశారు. మరో 48 గంటల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా ఈనెల 12న జీఓను విడుదల చేశారు. మాతృభాషలోనే పరీక్షలు రాసుకోవచ్చని మౌఖికంగా సమాచారం అందడంతో విద్యార్థులు ఆదిశగా పరీక్షకు సమాయత్తమయ్యారు. అయితే ఈ జీఓ రాష్ట్ర రాజధాని కేంద్రమైన చెన్నై మినహా అనేక జిల్లాలకు చేరలేదు. పది పరీక్షలు గురువారం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకుసమయం కేటాయించారు. తొలిరోజే లాంగ్వేజ్ 1 కింద తమిళం, తెలుగు, హిందీ తదితర (విద్యార్థులు ముందుగా ఎన్నుకున్న) సబ్జెక్టులో పరీక్ష రాయాల్సి ఉంది. తిరువళ్లూరు జిల్లాలో 520 మంది, కృష్ణగిరి జిల్లా 1,500 మంది, వేలూరు జిల్లాలో 120 మంది తెలుగు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యామంత్రి జారీచేసిన జీఓ తమకు అందలేదంటూ పరీక్షకేంద్రం నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హతాశులయ్యారు. మరో రెండుమూడు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉండగా ఇంతకూ తాము తెలుగు రాయాలా, తమిళం తప్పనిసరా తెలియక గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 11 గంటల తరువాత నిర్వాహకులు విద్యార్థుల వద్దకు వచ్చి మీరు ఏ భాష పరీక్షను రాయదలుచుకున్నారో తెలుపుతూ దరఖాస్తు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఒకింత ఉపశమనం పొందిన విద్యార్థులు దరఖాస్తులు భర్తీ చేసి ఉసూరుమంటూ పరీక్షకు హాజరయ్యారు. పది పరీక్షలు ప్రారంభం: కాగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో 3731 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్ష రాసే సమయం కేటాయించారు. కాపీయింగ్ జరక్కుండా 5,500 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పరీక్షల నిర్వహణ బృందాలు ఏర్పాటయ్యాయి. పరీక్షలు రాసే ఖైదీల కోసం పుళల్ జైల్లో ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా 27 మంది పురుష ఖైదీలు, ఇద్దరు మహిళా ఖైదీలు పరీక్షలు రాశారు. అలాగే వేలూరు జైల్లో ఆరుగురు, ఒక మహిళా ఖైదీ, కడలూరు జైల్లో 15 మంది లెక్కన మొత్తం 51 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. ఏప్రిల్ 12లోగా మూడో విడతకుగడువు: మూడో విడత కింద 6 నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 12వ తేదీలోగా ముగించాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 10, 11, 12 తరగతుల పరీక్షలు ఈనెల 29వ తేదీతో ముగుస్తున్నాయి. మూడో విడత పరీక్షలను ఏప్రిల్ 1న ప్రారంభించి 12వ తేదీలోగా ముగించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 18న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
ఫార్మింగ్టన్ యూనివర్సీటి కేసు.. కొనసాగుతున్న విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోందని తెలుగు విద్యార్థుల తరుపున వాదిస్తున్న న్యాయవ్యాది ఎడ్వర్డ్ బజూకా తెలిపారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-ATA) రమేష్ మంథన న్యాయవ్యాదిని కలిసి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో చిక్కుకున్న ఎనిమిది మంది తెలుగు విద్యార్థుల తరపున వాదించేందుకు ఆటా ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 130మంది విద్యార్థులు అరెస్టవ్వగా.. అందులో అధికంగా భారతీయులే ఉండటం విశేషం. వీరిలో 30మందిని ఇప్పటికే ఇండియాకు రప్పించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఫణి దిప్ కర్నాటికి బెయిల్ మంజూరు చేశారు. -
జేఈఈ మెయిన్లో సత్తాచాటిన తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ‘జేఈఈ మెయిన్–2019’ప్రవేశ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తెలుగు విద్యార్థులు అత్యధిక స్కోర్ సాధించారు. దేశ వ్యాప్తంగా 15 మంది మాత్రమే 100 పర్సెం టైల్ సాధించగా.. అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇందులో తెలంగాణ విద్యార్థులు నలుగురు ఉండగా, ఒకరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి. 100 పర్సెంటైల్ సాధిం చిన వారిలో తెలంగాణకు చెందిన ఆదెల్లి సాయికిరణ్ జాతీయస్థాయిలో మూడో స్థానంలో, ఇందుకూరి జయంత్ ఫణిసాయి ఏడో స్థానంలో, విశ్వనాథ్ కె 8వ స్థానంలో, బట్టెపాటి కార్తికేయ 12వ స్థానంలో నిలిచారు. ఏపీ విద్యార్థి బొజ్జా చేతన్రెడ్డి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 8 షిఫ్ట్లలో.. ఆన్లైన్లో దేశ వ్యాప్తంగా 254 పట్టణాల్లోని 467 పరీక్ష కేం ద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఏ జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించడం ఇదే తొలి సారి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,29,198 మంది దరఖాస్తు చేసుకోగా, అం దులో 8,74,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రయ్యారు. విద్యార్థులు సాధించిన మార్కులు, ఆ షిప్ట్లో పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్యతో నార్మ లైజ్ చేసి, వారి పర్సెంటైల్ స్కోర్ను ఎన్టీఏ ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 31న ఫలి తాలను వెల్లడిస్తా మని ఎన్టీఏ గతంలోనే పేర్కొన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో ముందు గానే ఫలితాలను వెల్లడించడం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్లో (బీ–ఆర్క్) ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్–2 ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. తెలుగు వారే అత్యధికం! ఈ పరీక్షలో 99.99 పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 600–700 మంది విద్యార్థులే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 99.95– 99.99 పర్సెంటైల్ వచ్చిన వారికే టాప్ 100 లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ విద్యార్థులు 30–40 మంది వరకు ఉండే అవకాశం ఉందని జేఈఈ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. 90కి పైగా పర్సెంటైల్ సాధించిన వారిలో దాదాపు 3వేల మంది వరకు తెలుగు విద్యార్థులే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పర్సెంటైల్ విషయంలో విద్యార్థుల్లో కొద్దిగా గందరగోళం ఉందని, ఫైనల్ కీ విడుదల చేయడంతోపాటు, విద్యార్థులు ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్ నుంచి తొలగించకుండా అలాగే ఉంచితే స్పష్టత ఉండేదన్నారు. టాప్ స్కోర్ ఏదైతే అదే లెక్కలోకి.. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి దశ పరీక్షలను ఈనెల్లో నిర్వహించింది. రెండో దశ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వచ్చే రెండో దఫా జేఈఈ మెయిన్ కోసం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఎన్టీఏ ప్రకటిం చింది. ఆ పరీక్షల ఫలితాలను వెల్లడించాక ఈ రెండు పరీక్షల్లో టాప్ స్కోర్ ఏదైదే దాన్నే పరి గణనలోకి తీసుకొని ప్రవేశాల కోసం ర్యాంకు లను ప్రకటిస్తామని వివరించింది. ఏప్రిల్లో జరిగే రెండో దశ జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తర్వాత టాప్ 2.56 లక్షల మందిని ఐఐ టీల్లో ప్రవేశాలకు అవసరమైన జేఈఈ అడ్వా న్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనుంది. అడ్వాన్స్డ్కు కటాఫ్ 88 పర్సెంటైల్! ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే కటాఫ్ జనరల్ కేటగిరీలో 88 పర్సెంటైల్ ఉండే అవకాశం ఉందని నిఫుణులు పేర్కొంటున్నారు. ఓబీసీ కేటగిరీలో 70 పర్సెంటైల్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో 60 పర్సెంటైల్ ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థుల అభిప్రాయాలు.. సైంటిస్ట్ కావాలన్నదే లక్ష్యం: సాయికిరణ్ న్యూక్లియర్ సైంటిస్ట్ కావాలన్నదే నాలక్ష్యం. న్యూక్లియర్ పవర్పై పరిశోధన చేస్తా. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా. జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటీ బాంబేలో చదువాలని ఉంది. అందుకు ప్రిపేర్ అవుతున్నాను. మాది సిద్ధిపేట జిల్లా గౌరారం మండలంలోని పాములపర్తి గ్రామం. సొంతంగా కంపెనీ స్థాపిస్తా: బొజ్జా చేతన్రెడ్డి బాగా చదువుకొని సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. అందుకు అవసరమైన పెట్టుబడి కోసం ముందుగా ఉద్యోగం చేస్తా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. అందుకోసమే ప్రిపేర్ అవుతున్నాను. 100 పర్సెంటైల్ వచ్చినవారు -
కలకలం
మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని మెచిగాన్ రాష్ట్రంలోని ఫార్మెంటన్హిల్స్ ప్రాంతంలో గాయపడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరిగాయని కొందరు అంటుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడని బాధితుడి తండ్రికి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది. మానుకోట జిల్లా కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయ సమీపాన ఉన్న డాక్టర్ ప ర్కాల సోమసుందర్రెడ్డి నివాసంలో పూస ఎల్లయ్య, శైలజ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి కుమారుడు సాయికృష్ణ, కుమార్తె మౌనిక ఉన్నారు. ఎల్లయ్య మానుకోట జిల్లాలోని కురవి మండలం లింగ్యాతండా ఎంపీపీఎస్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. భార్య శైలజ గృహిణి. కుమార్తె మౌనిక హైదరాబాద్లో ఎంబీఏ చదువుతోంది. కుమారుడు సాయికృష్ణ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు మానుకోట హోలీ ఏంజిల్స్ హైస్కూల్లో చదువుకున్నాడు. ఆ తార్వత హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. చేవెళ్లలోని కేఎస్రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ట్రిపుల్ఈ(ఈఈఈ) చదువుకున్నాడు. 2015 మే నెలలో చదువు పూర్తయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. అక్కడి మెచిగాన్ రాష్ట్రంలో ఉండి లారెన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ 2017 ఆగస్టులో పూర్తి చేశాడు. నెల రోజుల క్రితం మెచిగాన్ రాష్ట్రంలోని ఫార్మెంటన్హిల్స్ ప్రాంతంలోని ఆటోమోటివ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా చేరాడు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం, సాయంత్రం ఉద్యోగా>నికి వెళ్లివస్తున్నాడు. తండ్రికి అమెరికా నుంచి ఫోన్.. సాయికృష్ణ కారు ప్రమాదంలో గాయపడ్డాడని ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అమెరికా నుంచి వైద్యులు అతడి తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ విషయాన్ని ఆయన బంధువులకు, సాయికృష్ణ మిత్రులకు తెలియజేశారు. సాయికృష్ణకు రక్తం అవసరం ఉందని, అత్యవసరంగా ఆపరేషన్ కూడా చేయాలని, ఇందుకు తండ్రిగా అంగీకారం తెలపాలని వైద్యులు కోరగా ఎల్లయ్య సరే అన్నారు. శనివారం, ఆదివారం గంటకు ఒకసారి అమెరికా నుంచి సాయికృష్ణ మిత్రులు, మానుకోటకు చెందిన మరో మిత్రుడు ధార అరుణ్కుమార్ ద్వారా తండ్రికి సమాచారం ఇస్తున్నారు. ఆందోళనలో కుటుంబ సభ్యులు తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే సాయికృష్ణ తల్లి శైలజ మూడు రోజులుగా అన్నపానీయాలు మానేసి రోధిస్తూనే ఉంది. ఆమెను ఓదార్చటం ఎవరివల్ల కావటం లేదు. సా యికృష్ణకు వైద్య సహాయం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని తండ్రి ఎల్లయ్య కోరాడు. ఆమెరికా ప్రభుత్వంతో మాట్లాడి తమ కుమారుడిని ఎలాగైనా కాపాడాని వేడుకున్నారు. కుమారుడిని చూసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు.. కారు ప్రమాదంలో సాయికృష్ణ గాయపడ్డాడని అమెరికాలోని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా కొందరు అతడి సన్నిహితులు మాత్రం మానుకోటవాసిపై అమెరికాలో కాల్పులు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుస సంఘటనలు జరుగుతుండడంతో ఈ రకమైన ప్రచారం కలకలం రేపుతోంది. అసలు వాస్తవం ఏం జరిగిందనేది ఇప్పటి వరకు ఇక్కడున్న వారికెవరికీ తెలియదు. ఫండ్ రైంజింగ్ లింక్తో మీడియాకు సమాచారం.. అమెరికాలో ప్రమాదంలో గాయపడిన సాయికృష్ణ ఆపరేషన్ కోసం, మెడికల్ ఇన్సూరెన్స్ లేక వైద్య బృందం అతడి మిత్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ కలిసి కొత్తగా ఫండ్ రైజింగ్ లింక్ క్రియేట్ చేయటంతో ఆ విషయం మీడియాకు తెలిసింది. రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటాడు.. నేను, సాయికృష్ణ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇతర మిత్రులు శ్రీకాంత్, సాయి, కౌశిక్, రంజిత్ కలిసి మానుకోట హోలీ ఏంజిల్స్ హైస్కూల్లో చదువుకున్నాం. హైదరాబాద్లో ఇంటర్, చేవెళ్లలో బీటెక్ చేశాం. అనంతరం ఎంఎస్ చదవడానికి అమెరికాకు సాయికృష్ణ వెళ్లాడు. అక్కడ ఏంజరిగిందో తెలియదు కానీ.. కారు ప్రమాదమని అమెరికా నుంచి అతడి రూం చుట్టుపక్కల వారు, ఆస్పత్రి వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయికృష్ణకు ఆపరేషన్ చేసే విషయంలో మెడికల్ ఇన్సూరెన్స్ లేక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో మిత్రులంతా డబ్బుల కోసమని ఠీఠీఠీ. జౌజunఛీఝ్ఛ.ఛిౌఝతో టupఞౌట్ట ట్చజీజుటజీటజిn్చ ద్వారా ఆర్థిక సాయం అందజేయవచ్చని ఫండ్ రైజింగ్ లింక్ ప్రారంభించాం. ఆపరేషన్కు 2.50 లక్షల డాలర్లు(సుమారు 2 కోట్లు) అవసరం ఉన్నాయి. ఫండ్ రైజింగ్ లింక్ ద్వారా కేవలం ఒక్క రోజులో 1.10 లక్షల డాలర్లు(సుమారు రూ.70 లక్షలు) జమయ్యాయి. – దార అరుణ్కుమార్, మానుకోట, సాయికృష్ణ స్నేహితుడు -
అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు
-
జేఈఈ అడ్వాన్స్డ్లోనూ తెలుగు విద్యార్థుల సత్తా
-
మనోళ్లే ‘అడ్వాన్స్డ్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్–10లో ఇద్దరు, టాప్–20లో మరో ముగ్గురు తెలుగు విద్యార్థులు చోటు సంపాదించారు. జాతీయ స్థాయిలో 360 మార్కులకు నిర్వహించిన అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో.. మావూరి శివకృష్ణ మనోహర్ 319 మార్కులతో 5వ ర్యాంకు, చోడిపల్లి హేమంత్ కుమార్ 316 మార్కులతో 7, గోసుల వినాయక శ్రీవర్ధన్ 11, అయ్యపు ఫణి వెంకట వంశీనాథ్ 14, బసవరాజు జిష్ణు 15వ ర్యాంకు సాధించారు. గత నెల 20న తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ కాన్పూర్ ఆదివారం ప్రకటించింది. హరియాణాలోని పంచకులకు చెందిన విద్యార్థి ప్రణవ్ గోయల్ తొలి ర్యాంకు (337 మార్కులు) సాధించగా.. రాజస్తాన్లోని కోటాకు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు (326 మార్కులు), ఢిల్లీకి చెందిన కైలాశ్ గుప్తా మూడో ర్యాంకు సాధించారు. అర్హులు 18,138 మందే.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లోని 11,279 సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో ఈసారి బాలికలకు ప్రత్యేకంగా 800 సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి భర్తీ చేయనున్నారు. మొత్తంగా అడ్వాన్స్డ్ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరుకాగా... 18,138 మంది మాత్రమే కౌన్సెలింగ్కు అర్హత సాధించారు. ఇందులో బాలురు 16,062 మంది, బాలికలు 2,076 మంది ఉన్నారు. ఈసారి అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోవడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్డ్లో దాదాపు 50 వేల మంది అర్హత సాధించగా.. ఈసారి 18,138 మందికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఉండే కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాసు ఐఐటీల పరిధిలో గతేడాది 18 వేల మంది అర్హత సాధించగా.. అందులో తెలుగు విద్యార్థులు 12 వేల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈసారి ఈ ఐఐటీల పరిధిలో మొత్తంగా 8 వేల మందిలోపే అర్హత సాధించగా.. ఇందులో తెలుగు విద్యార్థులు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 126 మార్కులను, ఓబీసీలో 114, ఎస్సీ, ఎస్టీలకు 63 మార్కులను కటాఫ్గా నిర్ణయించారు. ఈసారి అడ్వాన్స్డ్లో అర్హత సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. టాప్–1, 2, 9 ర్యాంకర్లూ ఇక్కడ చదివినవారే.. అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్ ప్రణవ్, రెండో ర్యాంకర్ సాహిల్ జైన్, 9వ ర్యాంకు సాధించిన రాజస్థాన్ విద్యార్థి లే జైన్ ముగ్గురూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని విద్యా సంస్థల్లో చదువుకున్నవారేనని ఆయా విద్యా సంస్థలు ప్రకటించాయి. మొత్తంగా ఓపెన్ కేటగిరీ టాప్–10లో 1, 2, 5, 7, 9 ర్యాంకర్లు తెలుగు రాష్ట్రాల్లో చదివినవారేనని పేర్కొన్నాయి. కేటగిరీ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించగా.. ఆయన ఐఐటీ మద్రాసు పరిధిలో ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకర్గా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన హేమంత్కుమార్ కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్గా నిలిచారు. ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ విద్యార్థి జాటోత్ శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. హైదరాబాద్కే చెందిన శశాంక్ అచ్యుత్కు 62వ ర్యాంకు దక్కింది. ‘సూపర్–30’నుంచి 26 మంది ఉత్తీర్ణత గణితశాస్త్ర నిపుణుడు ఆనంద్కుమార్కు చెందిన ‘సూపర్–30’అకాడమీ విద్యార్థులు ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిశారు. అకాడమీ నుంచి 30 మంది పరీక్షకు హాజరుకాగా.. 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 2002లో సూపర్–30 అకాడమీని ప్రారంభించిన ఆనంద్కుమార్.. ఏటా 30 మంది పేద విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నారు. అకాడమీ నుంచి ఇప్పటివరకు 500 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడం గమనార్హం. ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జేఈఈ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 27న మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. వచ్చే నెల 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18వ తేదీన చివరి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. సొంత స్టార్టప్ పెడతా.. ‘‘సొంతంగా స్టార్టప్ స్థాపించాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే మాకు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. నేను బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తా..’’ – ప్రణవ్ అగర్వాల్, 1వ ర్యాంకర్ సివిల్స్ సాధించాలన్నదే లక్ష్యం ‘‘సివిల్స్ సాధించాలన్నదే నా లక్ష్యం. ముందుగా ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. మా నాన్న నాగరాజు బాంబేలో సీపీడబ్ల్యూడీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఎంసెట్లలోనూ మంచి ర్యాంకులు వచ్చాయి..’’ – హేమంత్కుమార్ చోడిపిల్లి, 7వ ర్యాంకర్ కొత్త ఆవిష్కరణలు చేస్తా.. ‘‘పరిశోధనలవైపు వెళ్లాలన్నదే నా లక్ష్యం. కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారిస్తా. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తాను..’’ – బి.జిష్ణు, 15వ ర్యాంకర్ ఐఏఎస్ అవుతా.. ‘‘ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. అందుకోసం సివిల్స్ రాస్తాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి.. సివిల్స్వైపు వెళతాను.’’ – జి.సాయి అభిషేక్, 31వ ర్యాంకర్ గౌలిదొడ్డి గురుకులంలో పది మందికి ఐఐటీ సీట్లు రాయదుర్గం: హైదరాబాద్ శివార్లలోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత సాధించారు. కాలేజీకి చెందిన విద్యార్థులు బి.భాస్కర్ ఎస్టీ కేటగిరిలో 449 ర్యాంకు, రమేశ్చంద్ర ఎస్సీ కేటగిరీలో 567 ర్యాంకు సాధించారు. మొత్తంగా ఈ గురుకుల కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు హాజరుకాగా.. అందులో 10 మంది ఐఐటీ సీట్లు సాధించనుండటం, వీరంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. వీరితోపాటు మరికొందరు విద్యార్థులకు ఎన్ఐటీలలో సీట్లు వచ్చే అవకాశముందని ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. -
నీట్లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్)’ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకు, వరుణ్ ముప్పిడి 685 మార్కులతో 6వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్కు చెందిన అంకడాల అనిరు«ధ్బాబు 680 మార్కు లతో 8వ ర్యాంకు సాధించారు. టాప్–50లో తెలంగాణ విద్యార్థులు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదుగురికి చోటు లభించడం గమ నార్హం. మొత్తంగా జాతీయ స్థాయిలో బిహార్ విద్యార్థిని కల్పనాకుమారి 691 మార్కులతో ఒకటో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మ 690 మార్కులతో రెండో స్థానంలో, ఢిల్లీకే చెందిన ఆరోశ్ ధమిజ, రాజస్థాన్కు చెందిన ప్రిన్స్ చౌదరిలు 686 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ, ఏపీ నుంచి 66,044 మంది.. జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మే 6న నీట్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది నీట్కు దరఖాస్తు చేసుకోగా.. 12,69,922 మంది పరీక్ష రాశారు. ఇందులో 7,14,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో 3,12,399 మంది బాలురు, 4,02,162 మంది బాలికలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఉత్తీర్ణుల్లో తెలుగు రాష్ట్రాల వారు 66,044 మంది ఉన్నారు. జూలైలో నోటిఫికేషన్ నీట్ ర్యాంకుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయాలు ప్రత్యేక మెరిట్ జాబితాలను రూపొందించుకుని.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను భర్తీ చేసుకుంటాయి. ఈ మేరకు రాష్ట్రంలో జూలైలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. 2018–19 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఎనిమిది ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు, 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,250 సీట్లు ఉన్నాయి. ఇక ఏకైక ప్రభుత్వ బీడీఎస్ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేటు కాలేజీల్లో కలిపి 1,040 సీట్లు ఉన్నాయి. భారత వైద్య విద్యా మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది. నీట్ రాసిన, ఉత్తీర్ణులైన వారి వివరాలు.. రాష్ట్రం హాజరు ఉత్తీర్ణత తెలంగాణ 44,877 30,912 ఆంధ్రప్రదేశ్ 49,253 35,732 దేశవ్యాప్తంగా 12,69,922 7,14,562 ‘నీట్’ఫలితం ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ ‘నీట్’ప్రశ్నపత్రాలు లీకయ్యాయని.. అందువల్ల ఫలితాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాల కొరత ఏర్పడిందని, అందువల్ల పేపర్లు లీకైనట్టు స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే ప్రశ్నపత్రాల పంపిణీలో తొలుత కొంత గందరగోళం నెలకొందని, వెంటనే దానిని పరిష్కరించామని.. పేపర్లు లీక్ కాలేదని సీబీఎస్ఈ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇక మే 6న పరీక్ష జరిగితే.. ఇప్పుడెందుకు పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్లను కోర్టు నిలదీసింది. ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. గరిష్ట వయోపరిమితిపై కేంద్రానికి నోటీసులు ‘నీట్’రాసే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 170 మంది విద్యార్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్రంతోపాటు, సీబీఎస్ఈ, కేరళ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జూలై 10కి వాయిదా వేసింది. కార్డియాలజిస్టు అవుతా.. ‘‘మా నాన్న కార్డియాలజిస్ట్. అమ్మ డెర్మటాలజిస్ట్. వారిద్దరూ డాక్టర్లే కావడంతో చిన్నప్పటి నుంచే నాకు కూడా డాక్టర్ కావాలనేది కోరిక. తల్లిదండ్రులు చూపిన మార్గం, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఆలిండియా రెండో ర్యాంకు సాధించగలిగా. నేను కూడా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా..’’ – రోహన్ పురోహిత్, 2వ ర్యాంకు న్యూరోసర్జన్ కావాలని ఉంది ‘‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక. జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి బిజినెస్మన్, అమ్మ ఆర్తిరెడ్డి ఎకనామిస్ట్. వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తా. భవిష్యత్తులో మంచి న్యూరోసర్జన్ కావాలనేది నా ఆశయం..’’ – వరుణ్ ముప్పిడి, 6వ ర్యాంకు మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటా.. ‘‘మాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోసమాల. అమ్మ రమాదేవి, నాన్న తేజేశ్వర్ ఇద్దరూ ఉపాధ్యాయులే. వారి ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించగలిగాను. భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరుపొందాలనేది నా లక్ష్యం..’’ – ఎ.అనిరుధ్బాబు, 8వ ర్యాంకు -
జేఈఈలోనూ తెలుగు వెలుగు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్–10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు సాధించి భేష్ అనిపించుకున్నారు. 360 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో.. 350 మార్కులతో ఆంధ్రప్రదేశ్కు చెందిన భోగి సూరజ్ కృష్ణ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. అవే 350 మార్కులతో ఏపీకి చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ 5వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన దాకారాపు భరత్ 345 మార్కులతో 8వ ర్యాంకు, తెలంగాణకు చెందిన గోసుల వినాయక శ్రీవర్ధన్ 341 మార్కులతో 10వ ర్యాంకు సాధించారు. 340 మార్కులతో తెలంగాణ విద్యార్థి జాతోతు శివతరుణ్ 14వ ర్యాంకు, ఏపీకి చెందిన పిన్నంరెడ్డి లోకేశ్రెడ్డి 15వ ర్యాంకు పొందారు. ఇవే కాకుండా టాప్–100 లోపు 35 ర్యాంకులను తెలుగు విద్యార్థులే సాధించినట్టు విద్యాసంస్థలు వెల్లడించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటకు చెందిన కొత్తపల్లి దిలీప్ 24వ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన అనిరెడ్డి అరవింద్రెడ్డి 308 మార్కులతో 157వ ర్యాంకు సాధించారు. ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులను ఎంపిక చేసేందుకు జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈనెల 8న ఆఫ్లైన్లో, 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. 10,74,319 మంది పరీక్షలకు హాజరుకాగా.. తెలంగాణ, ఏపీల నుంచి 75 వేల మంది చొప్పున హాజరయినట్టు అంచనా. అడ్వాన్స్డ్కు 2,31,024 మంది ఎంపిక ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 20న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్కు ముందుగా ప్రకటించిన ప్రకారం 2.24 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే దానికి అదనంగా 7,024 మంది కలిపి 2,31,024 మందిని ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో సమాన ర్యాంకులు రావడంతో ఈ మేరకు అదనంగా అడ్వాన్స్డ్కు ఎంపిక చేసినట్టు తెలిసింది. 21 మంది బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు జేఈఈ మెయిన్లో 21 మంది బీసీ గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో 9 మంది బాలికలు, 12 మంది బాలురు ఉన్నారని చెప్పారు. ఓబీసీలో గరిష్ట మార్కులు 73 ఓపెన్ కేటగిరీలో గరిష్ట మార్కులు 350కాగా.. అడ్వాన్స్డ్కు కనీస అర్హత మార్కులను (కటాఫ్గా) 74గా నిర్ణయించారు. ఓపెన్ కేటగిరీ అనంతరం ఓబీసీ నాన్ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీల్లో గరిష్ట అర్హత మార్కులు 73గా తేలాయి. ఇక ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో కటాఫ్ 45గా, ఎస్సీల్లో 29గా, ఎస్టీల్లో 24గా, వికలాంగుల్లో 35గా పరిగణనలోకి తీసుకున్నారు. మే 2 నుంచి అడ్వాన్స్డ్కు దరఖాస్తులు జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఐఐటీ కాన్పూర్ ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మే 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. మే 14 నుంచి 20వ తేదీ వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20న పరీక్ష జరుగుతుంది. ఫలితాలను జూన్ 10న ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించారు. ఏటేటా తగ్గిపోతున్న కటాఫ్ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ మార్కులు ఏటేటా తగ్గిపోతున్నాయి. ప్రశ్నపత్రం కఠినంగా ఉంటుండటంతోనే కటాఫ్ తగ్గిపోతోందని విద్యా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2014లో జనరల్ కటాఫ్ 115 మార్కులుగా ఉండగా.. అది ఇప్పుడు 74 మార్కులకు తగ్గింది. ఓబీసీలో 74 నుంచి 45 మార్కులకు, ఎస్సీలో 53 నుంచి 29 మార్కులకు, ఎస్టీలో 47 నుంచి 24 మార్కులకు కటాఫ్ తగ్గిపోయింది. ఇక ఈసారి టాప్ మార్కులు కూడా తగ్గిపోయాయి. 360 మార్కులకు నిర్వహించిన పరీక్షలో గతేడాది 354 టాప్ మార్కులురాగా.. ఈసారి టాప్ మార్కులు 350 మాత్రమే కావడం గమనార్హం. -
‘సాక్షి’ జేఈఈకి భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థుల కోసం ‘సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యా సంస్థలు’ సంయుక్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు 90(హైదరాబాద్లో 40, ఏపీలో 50) కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు తెలంగాణ నుంచి 10 వేల మంది, ఏపీ నుంచి మరో 10 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పోటీ పరీక్షల నిర్వహణ తీరు, ప్రశ్నపత్రం వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పొందారు. ప్రశ్నపత్రాన్ని సాక్షి విద్యా విభాగం తయారు చేసింది. పరీక్ష ‘కీ’ సోమవారం ఉదయం 11 గంటలకు ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 15న మాక్ ఎంసెట్(ఇంజనీరింగ్) ఆన్లైన్లో జరుగుతుంది. 22న మాక్ నీట్ ఆఫ్లైన్లో జరుగుతుంది. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ కో స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. -
ట్రెండ్ మారుతోంది.. అమెరికా వద్దు
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగం.. ఎంతో మంది భారతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థుల కల. దీని కోసం పాశ్చాత్య దేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగావకాశాలు, అక్కడి ప్రభుత్వ విధానాలను బట్టే ఏ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న వారి వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 1980–2000 దాకా దాదాపు రెండు దశాబ్దాలపాటు బ్రిటన్(యునైటెడ్ కింగ్డమ్)లో ఉన్నత విద్య చదివేందుకు వెళ్లి తెలుగు విద్యార్థులు భారీ సంఖ్యలో అక్కడ స్థిరపడ్డారు. 1980–90 దశకంలో ఆర్థిక వనరులున్న కుటుంబాలు తక్కువ కావడంతో ఇంగ్లండ్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లినవారి సంఖ్య తక్కువే. 1990–2000 దశకం వచ్చేసరికి అక్కడకు క్యూ కట్టిన వారి సంఖ్య భారీగా ఉండటంతో బ్రిటన్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో విదేశీయులకు అవకాశం లేకుండా కట్టడి చేయడం మొదలుపెట్టింది. దాంతో మనవాళ్ల దృష్టి అమెరికాపై పడింది. దాదాపు 15 ఏళ్ల పాటు లక్షల సంఖ్యలో తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. దీంతో అక్కడ వర్ణవివక్ష మొదలైంది. ‘బయ్ అమెరికన్–హైర్ అమెరికన్’నినాదంతో ట్రంప్ అధికారంలోకి రావడంతో తెలుగు విద్యార్థుల దృష్టి ఇతర దేశాలపై పడింది. దీంతో ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా వంటి దేశాలకు వారు తరలివెళుతున్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న తెలుగు విద్యార్థుల ట్రెండ్పై ‘సాక్షి’ప్రత్యేక కథనం. అక్కడే చదువు.. ఉద్యోగం.. ఆదిలాబాద్ జిల్లా బోథ్కు చెందిన ప్రభాకర్రెడ్డి 2004లో ఎంబీఏ కోర్సు పూర్తి చేసేందుకు లండన్ వెళ్లారు. రెండేళ్లలో కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగానే అతడిని అక్కడి ప్రభుత్వం భారత్కు తిప్పిపంపింది. అయితే ప్రభాకర్రెడ్డి లండన్ వెళ్లింది చదువు పేరులో అక్కడ ఉద్యోగం సంపాదించడానికే. దానికి నేపథ్యం అంతకు ముందు 15 ఏళ్ల నుంచి బ్రిటన్లో మాస్టర్స్ విద్యను అభ్యసించేందుకు వెళ్లిన బోథ్ పరిసర ప్రాంతాల యువకులు అక్కడే ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడటమే. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా వేలాది మంది యూకేకు వెళ్లి స్థిరపడ్డారు. 1990 దశకం మొదట్లో మొదలైన ఈ వలసలు పదేళ్ల పాటు అంటే 2000 సంవత్సరం వరకూ సాగాయి. అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఇలా వేలాది మందికి బ్రిటన్ ఆశ్రయం ఇచ్చింది. ఆ భరోసాతోనే ఆ తర్వాత ఐదేళ్లు కూడా వేలాది మంది తెలుగు విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోసం యూకే బాటపట్టారు. కానీ, అందులో 80 శాతం మందిని ఆ దేశం వెనక్కి పంపింది. చదువుకోవడానికి కాకుండా ఉద్యోగాల కోసమే వస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన బ్రిటన్ 2005లో తన పాలసీని సమీక్షించి వలసవాద విధానాలను కట్టుదిట్టం చేసింది. ఫలితంగా గత 13 ఏళ్లలో యూకే వెళ్లి మాస్టర్స్ చేసిన వారు సంఖ్య వందల్లోకి వచ్చింది. 2005 నుంచి అమెరికా వైపు.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రవికుమార్ యూకే వెళ్లడం వల్ల ఫలితం లేదని గ్రహించి 2005లో ఇంజనీరింగ్లో పోస్ట్రుగాడ్యుయేషన్ చేయడానికి అమెరికా బాట పట్టారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. రవికుమార్ను ఆదర్శంగా తీసుకుని అమలాపురం, దాని పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 5,000 మంది అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని కె.సతీష్కుమార్ అతని ఆరుగురు ఇంజనీరింగ్ స్నేహితులు అమెరికాలో ఎంఎస్ డిగ్రీ కోసం 2016 ఆగస్ట్లో టెక్సాస్కు వెళ్లారు. అయితే డల్లాస్ విమానాశ్రయంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ ఆరుగురిని విచారించి.. వారు చేరబోయే విశ్వవిద్యాలయాలకు అనుమతి లేదంటూ భారత్కు తిప్పిపంపారు. అంతే ఒక్కసారిగా అమెరికా వెళ్లాలనుకున్న విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు 15 ఏళ్ల పాటు అమెరికాలో విద్య కోసం వెళ్లిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. యూకేలో వలసవాద విధానాలు కట్టుదిట్టం కావడంతో 2001–2002 నుంచే ఉన్నత విద్య కోసం అమెరికాకు వలసలు పెరిగాయి. 2002లో 15,550 మంది అమెరికా వెళితే 2015కు వచ్చేసరికి ఆ సంఖ్య 2.25 లక్షలకు పెరిగింది. అంటే 15 ఏళ్లలో 15 రెట్లు పెరిగిందన్నమాట. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య దాదాపు 40 శాతం. ఈ నేపథ్యంలో భారతీయ సాంకేతిక నిపుణుల వల్ల అమెరికాలో నిరుద్యోగం ఎక్కువైందన్న ప్రచారం సాగడంతో 2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ‘బయ్ అమెరికన్–హైర్ అమెరికన్’నినాదంతో అనూహ్యంగా ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఆయన వలసవాద విధానాన్ని కఠినతరం చేసేందుకు అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఇప్పుడవన్నీ చట్టసభల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో గత రెండేళ్లలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సంఖ్య 40 శాతం తగ్గింది. రారమ్మంటున్న ఇతర దేశాలు.. మహమ్మద్ షబ్బీర్ హైదరాబాద్ వాసి. ఇక్కడ ఇంజనీరింగ్ చదివి 2014లో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత మూడేళ్లలో షబ్బీర్ తన నలుగురు సోదరులతో పాటు సమీప బంధువులు పది మందిని అక్కడికి తీసుకువెళ్లారు. ఇప్పుడు వారిలో అత్యధికులు శాశ్వత నివాస హోదా కూడా పొందారు. షబ్బీర్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది చూపు ఇప్పుడు ఆస్ట్రేలియాపై పడింది. యూఎస్ తన విధానాలను కఠినతరం చేస్తున్నట్లు ప్రచారం కావడంతోనే తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2015లో ఉన్నత విద్య కోసం 6,500 మంది ఆస్ట్రేలియా వెళితే 2017 సెస్టెంబర్ వచ్చేసరికి ఆ సంఖ్య 39,000కు పెరిగింది. వచ్చే సెప్టెంబర్లో మొదలయ్యే విద్యా సంవత్సరానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య 50,000 దాటుతుందని విదేశీ విద్యా కన్సల్టెన్సీ సంస్థలు చెపుతున్నాయి. ఒక్క ఆస్ట్రేలియానే కాదు న్యూజిలాండ్, కెనడా, మలేషియా వంటి దేశాలకూ విద్యార్థులు క్యూ కడుతున్నారు. అమెరికా మాదిరిగా కెనడా ఇప్పటిదాకా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. పైపెచ్చు అమెరికాతో పోలిస్తే కెనడాలో అతి తక్కువ కాలంలోనే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. ప్రతిభావంతుల చాయిస్ అమెరికానే.. ‘జీఆర్ఈ, టోఫెల్లో మంచి స్కోర్ రావడంతో పాటు తమ మీద తమకు నమ్మకం ఉన్నవారు ఇప్పటికీ అమెరికాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం ముఖ్యం అనుకునే వారే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి దేశాలకు వెళుతున్నారు. అలాంటి వారి సంఖ్య ఈ రెండేళ్లలో 150 శాతం పెరిగింది. అదే సమయంలో అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రెండేళ్ల క్రితం వరకు మా దగ్గరకు సలహా కోసం వచ్చిన వారిలో 90 శాతం మంది అమెరికానే కోరుకునే వారు. ఇప్పుడు వారి సంఖ్య 50 శాతానికి తగ్గింది’అని అమీర్పేటలో గత నాలుగు దశాబ్దాలుగా విదేశీ విద్య కన్సల్టెన్సీ సర్వీసు నడుపుతున్న నాగేశ్వరరెడ్డి చెప్పారు. ‘అమెరికాకు వెళ్లే విద్యార్థులు తగ్గినా 320–325 జీఆర్ఈ స్కోర్ వచ్చినా అక్కడి టాప్ రేటెడ్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు దక్కడం లేదు. 2010–2014 మధ్య 305–310 స్కోరు వస్తే టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేవి. ఇప్పుడు అదే వర్సిటీల్లో 320–325 వచ్చినా సీట్లు లేదు. విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా వెళ్లడానికి ఇది కూడా ఒక కారణం’అని ఆయన విశ్లేషించారు. -
ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
► సముద్రపు అలలకు బలైపోయిన శివకాంత్రెడ్డి, అశోక్కుమార్ హైదరాబాద్, రైల్వే కోడూరు అర్బన్: వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మంగళవారం మృతి చెందారు. సముద్రంలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడడానికి వెళ్లి.. అవే రాకాసి అల లకు బలయ్యారు. మంగళవారం సాయం త్రం 7.30కి జరిగిన ఈ ఘటనలో రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుం ట్లూరుకు చెందిన శివకాంత్రెడ్డి, ఏపీ లోని వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెంది న మారుకుట్టి అశోక్కుమార్ మరణించారు. వాలీబాల్ ఆడుతూ.. ఉక్రెయిన్లోని జిప్రోజియా స్టేట్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివేందుకు శివకాంత్రెడ్డి, అశోక్కుమార్లు నాలుగేళ్ల క్రితం వెళ్లారు. వారికి సహచర విద్యార్థులుగా మన దేశానికే చెందిన అభిలాశ్, ముఖేశ్ తోడయ్యారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వీరంతా మంగళవారం సాయంత్రం అక్కడి ఓ బీచ్కు వెళ్లారు. అక్కడ సరదాగా వాలీబాల్ ఆడుతుండగా.. ముఖేశ్, అభిలాష్లు నీటిలోకి దిగారు. కానీ ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలు వారిని సముద్రంలోకి లాక్కెళుతుండడంతో.. కేకలు వేశారు. అది విన్న శివకాంత్రెడ్డి, అశోక్లు వారిని కాపాడేందుకు నీటిలో కి వెళ్లారు. ఒకరిని ఒడ్డుకు తీసుకువచ్చి వది లేశారు. మరొకరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో సముద్రపు అలలు శివకాంత్రెడ్డి, అశోక్లను లోనికి లాక్కెళ్లాయి. దీంతో అందరూ రక్షించాలంటూ కేకలు వేయడంతో... సమీపంలోనే ఉన్న కొంతమంది వచ్చి నీటిలోంచి బయటికి తీసుకువచ్చారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే శివకాంత్రెడ్డి, అశోక్కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శోకసంద్రంలో కుటుంబాలు కుంట్లూరుకు చెందిన పిన్నెంటి జంగారెడ్డి, పద్మల కుమారుడు శివకాంత్రెడ్డి. డాక్టరై తిరిగి వస్తాడనుకున్న కుమారుడు మరణించడంతో శివకాంత్రెడ్డి కుటుంబం శోక సంద్రం లో మునిగిపోయింది. కాలేజీకి సెలవులు రావడంతో జూన్ 28న ఇంటికి వచ్చిన శివకాంత్రెడ్డి ఈ నెల 1న తిరిగి ఉక్రెయిన్కు వెళ్లా డు. 20 రోజులు కాకుండానే సముద్రం అలలకు బలయ్యాడు. శివకాంత్రెడ్డి మృతదేహం శనివారం స్వదేశానికి రానున్నట్లు బంధువులు తెలిపారు. ఏపీ రైల్వేకోడూరు లోని శ్రీరాంనగర్ వాసి శివాంజనేయులు, నాగమణి కుమారుడు అశోక్కుమార్. అశోక్తోపాటు అతని సోదరి దివ్యతేజ ఉక్రెయిన్లోనే ఎంబీబీఎస్ చదువుతున్నారు. అశోక్ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అతని మృతదేహం త్వరలో స్వస్థలానికి రానున్నట్లు బంధువులు తెలిపారు. -
నిన్న దాడి..నేడు ప్రశాంతంగా పరీక్ష!
-
తెలుగు అభ్యర్థులపై దాడులు
-
కర్ణాటకలో తెలుగు అభ్యర్థులపై దాడులు
-
తెలుగు అభ్యర్థులపై దాడులు
కర్ణాటక బ్యాంకింగ్ పరీక్ష సందర్భంగా స్థానిక అభ్యర్థుల రచ్చ సాక్షి, బెంగళూరు/నంద్యాల: కర్ణాటకలో బ్యాంకింగ్ పరీక్షలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. స్థానికేతరులు పరీక్ష రాయడాన్ని నిరసిస్తూ కన్నడ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలను తన్నుకుపోతున్నారంటూ బెంగళూరు, హుబ్లీ, గుల్బార్గాతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల రచ్చరచ్చ చేశారు. కన్నడ సంఘాలు కూడా స్థానిక అభ్యర్థులకు మద్దతు తెలపడంతో వారు మరింతగా రెచ్చిపోయారు. తెలుగు విద్యార్థులపై దాడి చేసి హాల్ టికెట్లను చించివేశారు. దీంతో తెలుగు విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. బెంగళూరు తప్ప మిగిలిన చోట్ల పోలీసుల రక్షణ మధ్య పరీక్ష యథావిధిగా జరిగింది. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. కర్ణాటకలోని గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పోస్టుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్(ఐబీపీఎస్) నిర్వహించే పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. బెంగళూరుతో పాటు హుబ్లీ, గుల్బర్గా, కేజీఎఫ్ తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కన్నడ వచ్చిన వారు మాత్రమే ఆ రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షలు రాయాలన్న నిబంధనను ఎత్తివేయడంతో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ముందుగానే సమాచారమందుకున్న కన్నడ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికేతరులను అడ్డగించారు. ముఖ్యంగా తెలుగు అభ్యర్థులు.. తమకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కన్నడ సంఘాలు పరీక్షా కేంద్రాలకు చేరుకుని స్థానిక అభ్యర్థులకు మద్దతు పలికాయి. దీంతో వారు రెచ్చిపోయి తెలుగు అభ్యర్థులపై దాడి చేశారు. చేతికి చిక్కిన వారందరి హాల్టికెట్లను లాక్కొని చించేశారు. హుబ్లీ– ధార్వాడాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 800 మంది అభ్యర్థులు వచ్చారు. దీంతో సలీం అనే స్థానికఅభ్యర్థి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇతర తెలుగు వాళ్లను అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా∙స్థలానికి చేరుకొని సలీంను అదుపులోకి తీసుకున్నారు. లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం భద్రతా బలగాల రక్షణలో పరీక్ష యథావిధిగా జరిగింది. వెనుతిరిగిన 8వేల మంది! మరోవైపు బెంగళూరు శివార్లలోని ఉల్లాలలో ఉన్న ఎస్జేఎం ఇన్ఫోటెక్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి స్థానికులు, కన్నడ సంఘాల నాయకులు చేరుకొని నిరసనకు దిగారు. పరీక్ష జరగనివ్వ బోమని అడ్డుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు కూడా విఫలమవ్వడంతో శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. దీంతో స్థానికేతరులు తీవ్ర ఆవేదనతో వెనుతిరిగారు. అలాగే కోలారు జిల్లా కేజీఎఫ్లోని డాక్టర్ టి.తిమ్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద కూడా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి. సమాచారమందుకున్న ఆ జిల్లా ఎస్పీ లోకేశ్ కుమార్ అదనపు బలగాలను రంగంలోకి దించి పరీక్ష సజావుగా జరిగేలా చూశారు. వివిధ ప్రాంతాల్లో బ్యాంక్ పరీక్షలకు శిక్షణ తీసుకున్న వారితో పాటు సొంతంగా సన్నద్ధమై కర్ణాటక వెళ్లిన దాదాపు 20 వేల మంది తెలుగు అభ్యర్థుల్లో శనివారం 8 వేల మంది వరకు పరీక్ష రాయలేకపోయినట్లు నంద్యాలకు చెందిన గురురాఘవేంద్ర కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్కు చెందిన వారే మూడు వేల మంది వరకు పరీక్ష రాయలేకపోయారని వివరించారు. ఈ పరీక్ష మళ్లీ నిర్వహిస్తామంటూ ఐబీపీఎస్ నుంచి అభ్యర్థులకు మెయిల్ వచ్చినట్టు ఆయన తెలిపారు. ఏడాది కష్టం వృథా అయ్యింది ఏడాదిగా పడ్డ కష్టం వృథా అయ్యింది. ఐబీపీఎస్ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో ఉద్యోగం వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన భాషను ఆరు నెలల్లోపు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధమయ్యే పరీక్ష రాసేందుకు వచ్చాం. ముందుగా మనమంతా భారతీయులం.. ఆ తర్వాతే తెలుగు వాళ్లం, కన్నడిగులం. ఈ విధంగా దాడి చేయడం సరికాదు. ఆదివారమైనా పరీక్ష జరగనిస్తారో.. లేదో అనుమానమే. – ప్రియాంక, తెలుగు అభ్యర్థి కన్నడిగులకే దక్కాలి కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలి. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడుతాం. కర్ణాటకలోని బ్యాంకింగ్ పరీక్షలకు తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా నంద్యాలలోని కోచింగ్ సెంటర్లకు చెందినవారే అధికంగా ఉంటున్నారు. వారిని పంపించొద్దని అక్కడి కోచింగ్ సెంటర్లను హెచ్చరించినా వినలేదు. అందుకే తెలుగు వాళ్లను అడ్డుకున్నాం. – కుమారస్వామి, కన్నడ సంఘాల ప్రతినిధి తెలుగు ఉద్యోగార్థులపై దాడులు శోచనీయం -ట్వీటర్లో వైఎస్ జగన్ -
కన్నడిగుల దాడిపై ఏపీ సర్కార్ ఆందోళన
సాక్షి, అమరావతి : కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై కన్నడ సంఘాల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సమన్వయ కమిటీ సమావేశంలో శనివారం ఈ అంశంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కర్ణాటక డీజీపీ, సీఎస్లతో మాట్లాడాలని సీఎంవో అధికారి సతీష్ చంద్రకు సూచించారు. తెలుగు విద్యార్థుల రక్షణకు కర్ణాటక సర్కార్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా కర్ణాటకలో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక రీజనల్ లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ...పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ దినేష్ కుమార్ ... కర్ణాటక సీఎస్, డీజీపీతో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి
-
తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో శనివారం అక్కడ ఆందోళన నెలకొంది. కర్ణాటక రీజనల్ లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని వారు ఆరోపించారు. పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు. విద్యార్థుల హాల్ టికెట్లను చించేసి వీరంగం సృష్టించారు. బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల వద్ద కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కన్నడిగుల తీరుతో తెలుగు విద్యార్థులు హుబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నడ సంఘాల ఆందోళనతో పరీక్ష ను రద్దు చేశారు. కాగా తమ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్ పరీక్షలు రాయడానికి వీల్లేదని తెలుగు అభ్యర్థులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇంతకముందే బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. కర్ణాటకలో పరీక్షలు రాసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సిద్ధమయ్యారు. కానీ కన్నడ సంఘాలు తమను పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. -
నీట్లో మెరిశారు
జిల్లాలో పలువురికి ర్యాంకులు కడప ఎడ్యుకేషన్: ఇటీవల నీట్ ఫలితాల్లో దేశవ్యాప్త ర్యాంకులు సాధించిన వారికి తాజాగా ఆదివారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇందులో రాయచోటికి చెందిన ప్రైవేటు వైద్యుడు చంద్రశేఖర్రెడ్డి కుమార్తె సాయిచందన ఏపీనీట్లో 12వ ర్యాంకు సాధించగా కడపకు చెందిన పశువైద్యుడు డాక్టర్ శ్రీధర్లింగారెడ్డి,దీపికల కుమారుడు సాయిప్రణవ్రెడ్డి 69వ ర్యాంకు, రైల్వేకోడూరుకు చెందిన నర్సరీ యజమాని చల్లా నాగేంద్ర, స్వర్ణలతల కుమారుడు చల్లా దినేష్ 86వ ర్యాంకును, చిన్నమండెంకు చెందిన రైతు వెంకటరామిరెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు విççష్ణువర్థన్రెడ్డి 399, కోటింగురువాయపల్లె గ్రామానికి చెందిన కోరా నారాయణరెడ్డి రుక్మిణమ్మల కుమారుడు కోరా వాసుదేవరెడ్డి 77వ ర్యాంకు, జమ్మలమడుగుకు చెందిన వై.రామచంద్రారెడ్డి, తల్లి శ్రీదేవిల కుమారై వై.దివ్యప్రీతి 317 ర్యాంకు, పులివెందులకు చెందిన టీచర్ రామానాయుడు, నాగరత్నమ్మల ద్వితీయ కూమార్తె సూదినేని పూజిత 598 ర్యాంకు పొందారు. అలాగే కడప నగరానికి చెందిన పశువైద్యుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి,దీపికల కుమార్తె సాయిలహరి 1172వ ర్యాంకు, వల్లూరు మండలం బోరెడ్డిపల్లెకు చెందిన మోపూరి చంద్ర ఓబుల్రెడ్డి, అనసూయమ్మల కుమార్తె మోపూరి ధన్వికారెడ్డి 1892 వ ర్యాంకును సాధించింది. -
మనోళ్ల కష్టం ‘నీట్’పాలైందా?
నీట్ పరీక్షలో మన విద్యార్థులు నష్టపోయారా? - ప్రాంతీయ భాషల్లో సులువుగా ప్రశ్నపత్రం.. ఇంగ్లిష్లో కఠినం - హిందీ, ఇతర ప్రాంతీయ భాషా విద్యార్థులకు కలిసొచ్చిన పరీక్ష - అందుకే వారికి మెరుగైన ర్యాంకులు - మనోళ్లు తెలుగులో రాసింది 5 శాతం మందే.. 95 శాతం మంది ఇంగ్లిష్లోనే.. - దెబ్బతీసిన నెగెటివ్ మార్కులు - నీట్కు తగ్గట్టుగా మారని ఇంటర్ విద్య సాక్షి, హైదరాబాద్: నీట్లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందా? ప్రాంతీయ భాషలో పేపర్ ఈజీగా వచ్చినా మనోళ్లకు అవగాహన లేక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదా? ఇంగ్లిష్లో పరీక్ష రాసి నష్టపోయారా? అన్ని జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటే మన విద్యార్థులు అందుకే నీట్లో టాప్–10లో నిలబడలేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు నిపుణులు! తెలంగాణ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు నీట్ రాయగా.. వారిలో ఎందరు అర్హత సాధించారన్న లెక్కలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ పరీక్షలో మనోళ్లకు రావాల్సిన స్థాయిలో ర్యాంకులు రాలేదన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎంసెట్ రాసిన విద్యార్థులను నీట్కు తగ్గట్టుగా సిద్ధం చేయలేకపోవడం, ఇంగ్లిష్లో ప్రశ్నప్రతం కఠినంగా రావడం, రాష్ట్రం నుంచి పరీక్ష రాసినవారిలో 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సన్నద్ధత ఏది? వైద్య ప్రవేశాలకు నీట్ తప్పనిసరి చేయడంతో గతేడాది నుంచి ఎంసెట్ బదులు అదే పరీక్షను నిర్వహిస్తున్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు గతంలో ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) ఉండేది. ఆ పరీక్షను మన విద్యార్థులు రాసేవారు కాదు. ఎంసెట్ రాసేవారు ఏఐపీఎంటీ రాయడానికి వీల్లేదు. దీంతో మన విద్యార్థులెవరూ ఏఐపీఎంటీ రాసేవారు కాదు. కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థులు 15 ఏళ్లుగా ఆ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు. ఏఐపీఎంటీ స్థానంలోనే ఇప్పుడు నీట్ వచ్చింది. కానీ ఈ పరీక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. అందుకు అనుగుణంగా ఇంటర్ విద్యను తీర్చిదిద్దలేదు. సీబీఎస్ఈ సిలబస్ను మార్చి తెలంగాణలో అదనంగా మరికొంత సిలబస్ చేర్చి విద్యార్థులపై భారం మోపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రాధాన్యం కాదు. రెండో ఏడాది పరీక్షనే ఇంటర్ బోర్డు నిర్వహిస్తుంది. కానీ మన రాష్ట్రంలో రెండేళ్ల పరీక్షలూ కీలకమే. దీంతో విద్యార్థులు నీట్పై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ కోర్సు కాలం ఎక్కువ. మే నెల మాత్రమే వారికి సెలవులుంటాయి. మన రాష్ట్రంలో మాత్రం రెండున్నర నెలల సెలవులున్నాయి. నెగెటివ్ మార్కులతో నష్టం.. ఎంసెట్లో నెగెటివ్ మార్కులు లేవు. కానీ నీట్లో ఉంటాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. అయితే ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే.. ఐదు మార్కులు పోతాయి. దీంతో సరైన ఆన్సర్ రాసినా తప్పుడు ఆన్సర్తో ఎక్కువగా నష్టపోయారని చెబుతున్నారు. ఇక ప్రాంతీయ భాషల్లో నీట్ పేపర్ ఈజీగా వచ్చింది. దీంతో గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు సహా అనేక ఇతర రాష్ట్రాలు లాభపడ్డాయి. హిందీలో కూడా నీట్ సులువుగానే వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో 95 శాతం మంది విద్యార్థులు నీట్ను ఇంగ్లిషులోనే రాశారు. తెలుగు భాషలో పేపర్ కాస్త సులువుగానే వచ్చినా కేవలం 5 శాతం మందే రాయడం, వారికి సరైన గైడెన్స్ లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. నేషనల్ పూల్తో ప్రయోజనమే కానీ.. ప్రస్తుతం నీట్ ద్వారా ర్యాంకులు పొందిన తెలుగు విద్యార్థులు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో మాత్రమే సీట్లు పొందడానికి వీలుంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య సీట్లు సాధించాలంటే నేషనల్ మెడికల్ సీట్ల పూల్లో చేరాల్సి ఉంటుంది. అందులో చేరాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. అలా చేరితే నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం సీట్లను జాతీయ మెడికల్ సీట్ల పూల్ తీసుకుంటుంది. అలా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సీట్లకు నీట్ ద్వారా కేటాయిస్తుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, తెలుగు రాష్ట్రాలు మాత్రమే నేషనల్ పూల్లో లేవు. తెలంగాణ నేషనల్ పూల్లో చేరాలంటే 371డి ఆర్టికల్కు సవరణ చేయాలి. అందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. నేషనల్ పూల్లో చేరితే రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్ విద్యలో సంస్కరణలు తేకుండా చేరితే అన్యాయం జరుగుతుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. నేషనల్ పూల్లో చేరితే ప్రభుత్వ కాలేజీల్లో నిర్దేశిత సీట్లతోపాటు ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లల్లో 15 శాతం సీట్లు కూడా జాతీయ పూల్లోకి వెళ్తాయి. ఔను నష్టపోయాం నీట్లో నెగెటివ్ మార్కుల వల్ల మన విద్యార్థులు నష్టపోయారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రం సులువుగా ఉండటం కూడా మన విద్యార్థులకు నష్టంగా పరిణమించింది. తెలంగాణలో 1450 ర్యాంకు వరకు జనరల్ కేటగిరీలో ర్యాంకు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు రావొచ్చు. 480 మార్కులు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో, 440 మార్కులొస్తే ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో సీటు రావొచ్చు. 400 మార్కులొస్తే బీ కేటగిరీలో సీటు దక్కొచ్చు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, హైదరాబాద్ రాష్ట్ర స్థాయి ర్యాంకులే కీలకం నీట్ ద్వారా అర్హత పొందిన విద్యార్థుల ర్యాంకులను కేంద్రం త్వరలో ప్రకటించనుంది. నేషనల్ పూల్లో మనం లేనందున మన సీట్లల్లో మన విద్యార్థులే చేరతారు. అందువల్ల నీట్లో మన విద్యార్థులు తక్కువ సామర్థ్యం చూపినా మనకు వచ్చే నష్టం పెద్దగా ఉండదు. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, ఎన్నారై కేటగిరీ సీట్లల్లో మాత్రం నీట్లో అర్హత పొందిన విద్యార్థులు ఎవరైనా వచ్చి చేరవచ్చు. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య వర్సిటీ -
'నీట్'లో ఏపీ టాపర్గా సత్తా చాటిన మాన్విత
-
నీట్లో మెరిశారు
తెలుగు రాష్ట్రాల నుంచి 15 శాతం మందికి అర్హత సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–2017లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10లో మెరవకపోయినా టాప్–100 ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు 30 మంది వరకు ఉన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసినవారిలో 15 శాతానికిపైగా అర్హత సాధించారు. ఇక పంజాబ్కు చెందిన 18 ఏళ్ల కుర్రోడు నవదీప్సింగ్ నీట్లో దుమ్మురేపాడు. ముక్తసర్కు చెందిన ఈ విద్యార్థి 720 మార్కులకుగాను 99.9 పర్సంటైల్తో 697 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన అర్చిత్ గుప్తా రెండు, అదే రాష్ట్రానికి చెందిన మనీశ్ ముల్చందానీ మూడో ర్యాంకు సాధించారు. అర్చిత్ గుప్తా ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలోనూ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. మే 7న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. మొత్తంగా పరీక్షలో అర్హత సాధించిన వారిలో బాలికలే ముందంజలో ఉన్నారు. అమ్మాయిలు 3,45,313 మంది, అబ్బాయిలు 2,66,221 మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా పరీక్షకు 11,38,890 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6,11,539 మంది అర్హత సాధించారు. 9.13 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనూ.. 1.20 లక్షల మంది విద్యార్థులు హిందీ మీడియంలో నీట్ పరీక్ష రాశారు. భారత వైద్య మండలి(ఎంసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో 470 మెడికల్ కాలేజీల్లో సుమారు 65,170 ఎంబీబీఎస్ సీట్లు, 308 డెంటల్ కాలేజీల్లో సుమారు 25,730 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈసారి నీట్ పరీక్షలో ఐదుగురు ట్రాన్స్జెండర్స్ (లింగమార్పిడి చేయించుకున్నవారు) అర్హత సాధించారు. పరీక్షకు ఎనిమిది మంది హాజరుకాగా.. వారిలో ఐదుగురు అర్హత పొందారు. గతేడాది తొమ్మిది మంది హాజరైతే.. ముగ్గురు ట్రాన్స్జెండర్స్ అర్హత సాధించారు. రాష్ట్ర ర్యాంకులు వచ్చాకే కన్వీనర్ కోటాలో ప్రవేశాలు ప్రస్తుతం సీబీఎస్ఈ జాతీయ స్థాయి ర్యాంకు లను మాత్రమే ప్రకటించింది. తెలంగాణ, ఏపీ లకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇచ్చాకే ఇరు రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలను చేపట్టనున్నారు. త్వరలోనే ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రక టించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 371 డి పరిధిలో ఉన్నందున ఇక్కడి కన్వీనర్ కోటా సీట్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు మాత్రమే చేరే వీలుంది. ఇతర రాష్ట్ర విద్యార్థులను కన్వీనర్ కోటాలో తీసుకోరు. తెలంగాణ నుంచి టాప్–100లో 13 మంది నీట్కు తెలంగాణ నుంచి 43,200 మంది, ఏపీ నుంచి 66 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15 శాతానికిపైగా విద్యార్థులు ర్యాంకులను సాధించారు. టాప్–100 ర్యాంకుల్లో 30 మంది వరకు ర్యాంకులను సాధించినట్టు విద్యాసంస్థలు అంచనా వేస్తున్నాయి. టాప్–100లో తెలంగాణకు చెందినవారు 13 మంది ఉన్నారు. టాప్ ర్యాంక్ ఊహించలేదు నీట్లో అర్హత సాధిస్తానని ఊహించా. అయితే ఫస్ట్ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తా. మా నాన్న ప్రభుత్వ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. – నవదీప్, ఫస్ట్ ర్యాంకర్ ఎయిమ్స్లో చదువుతా వైద్య వృత్తి అంటే నాకెంతో గౌరవం. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాను. ప్రతి రోజూ 14 గంటల పాటు కష్టపడి చదివాను. తొలిసారిగా నీట్ రాశాను. 12వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతాను. – అర్నవ్ త్రినాథ్ ఉస్మానియాలో చేరుతా ఎనిమిదో తరగతి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆ మేరకు కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే 98వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తాను. నాన్న విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. – సాయి సౌగంద్ కార్డియాలజిస్టు అవుతా మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న చిరు వ్యాపారి. గతేడాది కూడా మెడికల్ ఎంట్రన్స్ రాశాను. ర్యాంకు వచ్చింది కానీ వయసు తక్కువగా ఉండటంతో చేరలేకపోయాను. దీంతో ఈ ఏడాది కూడా రాశాను. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 24వ ర్యాంకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎయిమ్స్లో చదవాలని ఉంది. భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ కావాలని కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు ప్రత్యేక ప్రణాళికతో చదవటం వల్లే ర్యాంకు లభించింది. – ఎం.దీపిక ఎయిమ్స్లో చేరుతా అమ్మా, నాన్న ఇద్దరూ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆ మేరకు కష్టపడి చదివాను. టెన్త్లో 9.8 శాతం మార్కులు, ఇంటర్లో 986 మార్కులు సాధించాను. ఏపీ ఎంసెట్లో 4వ ర్యాంకు, టీఎస్ఎంసెట్లో 27వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్లో చదవాలని అనుకుంటున్నా. కార్డియాలజీ పూర్తి చేసి, భవిష్యత్తులో హృద్రోగ చిన్నారులకు చికిత్సలు అందిస్తా. – ఎస్.నిఖిల్ చౌదరి న్యూరో ఫిజీషియన్ అవుతా వైద్య కోర్సులో మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి, అధ్యాపకుల సహకారం వల్లే ఈ ర్యాంకు సాధించాను. టెన్త్లో 10/10 మార్కులు సాధించాను. ఇంటర్లో 978 మార్కులు వచ్చాయి. అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లే కావడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు కూడా డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఎయిమ్స్లో కానీ, సీఎంసీలో కానీ చేరుతాను. భవిష్యత్తులో న్యూరోఫిజీషియన్గా సేవలు అందిస్తా. – ప్రీతి నీట్ కటాఫ్ 131 సాక్షి, హైదరాబాద్: నీట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కటాఫ్ మార్కును నిర్ధారించారు. మొత్తం 720 మార్కులకు గాను జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు 697. 50 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 131 అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి విశ్లేషించారు. గతేడాది కటాఫ్ మార్కు 140గా ఉందన్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో 40 పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 107గా నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. ఓబీసీల్లో 107 మార్కులుగా ఉండొచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఓసీ కేటగిరీలో 5.43 లక్షలు, ఓబీసీలో 47,382, ఎస్సీలో 14,599, ఎస్టీలో 6,018 మంది నీట్లో అర్హత సాధించారని వెల్లడించారు. తాము నోటిఫికేషన్ జారీ చేశాక దరఖాస్తు చేసుకున్న వారి ఆధారంగా రాష్ట్రస్థాయి ర్యాంకులు ఖరారవుతాయన్నారు. మరో 15 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందన్నారు. ఈసారి కామన్ కౌన్సెలింగ్ ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ కలపి ప్రభుత్వమే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇందుకు కాళోజీ వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సహజంగా నోటిఫికేషన్ విడుదలకు ముందు ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్పై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ తర్వాతే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
'నీట్'లో తెలుగు తేజాలు
- తొలిసారి జాతీయ పరీక్షలో మెరిసిన అమ్మాయిలు - 14వ ర్యాంకు సాధించి ఏపీలో టాపర్గా నిలిచిన వైఎస్సార్ జిల్లా విద్యార్థిని తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత పొందినవారు 15% టాప్–10లో లేకున్నా టాప్ –100లో ఉన్నవారు 30 సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–2017లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్షలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తొలి ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటం విశేషం. 2017 –18 విద్యా సంవత్సరానికి మే 7న నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 66 వేల మంది, తెలంగాణ నుంచి 44 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. 43 రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూసిన విద్యార్థుల ఉత్కంఠకు ఎట్టకేలకు శుక్రవారంతో తెరపడింది. పలు కోర్టు కేసులతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో టాప్ వంద ర్యాంకుల్లో 23 మంది (మరికొందరు ఉండే అవకాశం ఉంది) ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం విశేషం. ఆల్ ఇండియా 12వ ర్యాంకును హైదరాబాద్కు చెందిన లక్ష్మిశెట్టి ఆర్నవ్త్రినాథ్ సొంతం చేసుకోగా, కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంజనీర్గా పనిచేస్తున్న నర్రెడ్డి నవనీశ్వర్రెడ్డి కూతురు నర్రెడ్డి మాన్విత 14వ ర్యాంకు సాధించడం గమనార్హం. సికింద్రాబాద్కు చెందిన మంగని దీపిక 24వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్కు చెందిన అడుసుమిల్లి వెంకట హేమంత్ 30వ ర్యాంకు సాధించారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో తాజాగా వెల్లడైన ఫలితాలు జాతీయ స్థాయిలోనివి మాత్రమే. రాష్ట్ర స్థాయి ర్యాంకులు నిర్ణయించేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశముందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 27లోగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో (నేషనల్ పూల్లో) 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లు పొందడానికి అందరికీ హక్కు ఉంటుంది. అయితే ఆర్టికల్ 371డి నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ము కాశ్మీర్లకు ఇది వర్తించదు. దీంతో ఈ ప్రాంతాల్లోని మొత్తం సీట్లు అక్కడి విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో మాన్వితకు మొదటి ర్యాంకు నీట్ జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలదే హవా కొనసాగింది. మొదటి వంద ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ఉండగా అందులో 12 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. తొలి 56 ర్యాంకుల్లో 9 మంది అమ్మాయిలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి ర్యాంకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మాన్విత సొంతం చేసుకుంది. తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంజనీర్గా పని చేస్తున్నారు. మాన్వితకు జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రాగా, రాష్ట్రంలో మొదటి ర్యాంకు దక్కించుకోనుంది. 500 మార్కులు దాటితేనే అవకాశం తాజాగా వెల్లడైన నీట్ ఫలితాల సరళిని బట్టి 500 మార్కులు దాటితేనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 1,850 సీట్లుండగా, ప్రైవేటు కశాళాలల్లో 2 వేల పైచిలుకు ఉన్నాయి. ఇందులో వెయ్యి సీట్లు కన్వీనర్ కోటాగా వస్తాయి. అంటే మొత్తం 2,850 సీట్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు లెక్క. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే కనీసం 500 మార్కులు అధిగమిస్తేనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఒక్కోసారి పర్సంటైల్ను బట్టి ర్యాంకులు మారే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. టాప్ 100లో ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు పేరు ర్యాంకు ఊరు లక్ష్మిశెట్టి ఆర్నవ్ త్రినాథ్ 12 హైదరాబాద్ నర్రెడ్డి మాన్విత 14 ప్రొద్దుటూరు మంగని దీపిక 24 హైదరాబాద్ అడుసుమిల్లి వెంకట హేమంత్ 30 హైదరాబాద్ ఆలేటి అఖిల 32 హైదరాబాద్ పావులూరి సాయి శ్వేత 36 విశాఖపట్నం జంబుల అనూషారెడ్డి 38 హైదరాబాద్ ఫణి శ్రీలాస్య 51 నెల్లూరు అంకిత దాస్ 52 విశాఖపట్నం పారుపతి వర్షారెడ్డి 54 –––– కొప్పురావూరి ప్రీతి 56 హైదరాబాద్ సాధినేని నిఖిల్ చౌదరి 57 కూకట్పల్లి గాలివీడు మనోజ్పవన్రెడ్డి 59 హిందూపురం తెలుగు నీరజ్ పవన్రెడ్డి 70 తాడిపత్రి దేవళ్ల మన్సీ దినేష్ 72 సికింద్రాబాద్ డొక్కు వంశీకృష్ణ 73 రేపల్లె (గుంటూరు) విశ్వనాథుని చైతన్యగోపాల్ 74 చల్లపల్లి (కృష్ణాజిల్లా) వేణిగళ్ల శరణ్కుమార్ 86 హైదరాబాద్ కెవీఎన్వీఎస్ నేస్తంరెడ్డి 89 కాకినాడ వీరమాచినేని జైత్రి 90 విజయవాడ టి.కాత్యాయని గౌడ్ 93 హైదరాబాద్ ఎన్.సాత్వికరెడ్డి 94 కాకినాడ దాసరి సాయి సౌగంథ్ 98 గద్వాల్ పర్సంటైల్, కటాఫ్ మార్కులు ఇలా కేటగిరీ పర్సంటైల్ కటాఫ్ మార్కులు అర్హత సాధించిన వారు ఓసీ 50 697–131 5,43,473 ఓబీసీ 40 130–107 47,382 ఎస్సీ 40 130–107 14,599 ఎస్టీ 40 130–107 6,018 పైన పేర్కొన్నట్టు 697 మార్కులు సాధించిన పంజాబ్కు చెందిన వనదీప్ సింగ్కు మొదటి ర్యాంకు దక్కింది. అంటే ఇతనికి 99.999908 పర్సెంటైల్ వచ్చింది. అలా చూస్తూ వచ్చినప్పుడు 131 మార్కులు వచ్చిన విద్యార్థి పర్సంటైల్ 50 అవుతుంది. కాగా.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్ పర్సంటైల్లో కూడా ఉండవచ్చు. -
నీట్ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
న్యూఢిల్లీ: అనేక వాయిదాల తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం నీట్ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష)ను 12 లక్షలమంది రాశారు. ఈసారి నీట్ ఫలితాలలో పంజాబ్లోని ముక్త్సర్కు చెందిన నవదీప్సింగ్ అనే విద్యార్థి అలిండియా టాప్ ర్యాంకు సాధించగా.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన అర్చిత్ గుప్తా రెండో ర్యాంకు సాధించాడు. మూడో ర్యాంకు కూడా ఇండోర్ విద్యార్థికే దక్కింది. ఇక తెలుగు విద్యార్థులు కూడా నీట్లో సత్తా చాటారు. కడపకు చెందిన మన్వీత కు నీట్ లో 14వ ర్యాంక్ సాధించి.. బయాలజీలో ఏపీలో టాపర్ గా నిలిచింది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఎం దీపిక ఆలిండియా 24వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈ వెబ్సైట్ లింకుల్లో నీట్ ఫలితాలను చూసుకోవచ్చు. http://cbseresults.nic.in/neet17rpx/neetJ17.htm లేదా cbseneet.nic.in. -
సాపాటు ఎటూ లేదు..
అమెరికాలో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం - ట్రంప్ రాకతో మారిన సమీకరణాలు - కొత్త ఉద్యోగాలు లేవు.. ఉన్న కొలువులకు భద్రత లేదు.. - ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్న కంపెనీలు న్యూయార్క్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి చేతిలో ఎంఎస్ పట్టా ఉంటే కొలువు వెతుక్కుంటూ వచ్చేది.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా ఉండేది కాదు.. ఇదంతా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి నెల రోజుల ముందటి పరిస్థితి! కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమా రైంది. కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ఇప్పుడక్కడ ఉద్యోగాలు లేవు. అతికొద్ది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందేవారి పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయినా.. సాధారణ వర్సిటీల్లో చదివి కన్సల్టెన్సీలపై ఆధారపడి ఉద్యోగాలు చేద్దామనుకున్న భారతీయ విద్యా ర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కిందట గ్రాడ్యుయేషన్ చదవడానికి వచ్చి పట్టా చేత పట్టుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాలను సందర్శించిన ‘సాక్షి ప్రతినిధి’ అక్కడ చదువుకుంటున్న, చదువు పూర్తి చేసిన తెలుగు విద్యార్థులతో మాట్లాడగా వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తండ్రి చేసిన అప్పులు తీరేదెలా? కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన మధుసూదన్రావు పంచాయతీరాజ్ శాఖలో చిరుద్యోగి. వేతనం గృహావసరాలు, ఇద్దరు పిల్లల చదువులకే సరిపోయింది. సొంతిల్లు కూడా కట్టుకోలేకపోయారు. అయినా బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకుని.. తన కుమార్తె అనూషను ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా పంపారు. ఆమె షికాగోలోని నార్త్ ఈస్టర్న్ ఇలినాయిస్ వర్సిటీలో ఆర్నెల్ల కింద ఎంఎస్ పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్డు రావడంతో ఉద్యోగాన్వేషణ ప్రారంభించారు. మూడు రాష్ట్రాల్లో డజనుకు పైగా ఐటీ సంస్థలకు దరఖాస్తు చేసినా.. ఏ సంస్థ నుంచీ ఇంటర్వూ్యకు పిలుపురాలేదు. కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. స్వదేశం నుంచి తండ్రి పంపే డబ్బుతోనే జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉందని, మరో రెండుమూడు నెలలు చూసి స్వదేశానికి వెళ్లి ఏదో ఉద్యోగం వెతుక్కుంటానంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా మారిపోయింది.. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన సుష్మ ఎంఎస్ చదువు, ఉద్యోగం కోసం గంపెడాశలతో అమెరికా వెళ్లారు. గతేడాది డిసెంబర్లో హూస్టన్లోని టెక్సాస్ సదరన్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి రైతు. వ్యవసాయ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.15 లక్షలు అప్పు చేసి కుమార్తెను అమెరికా పంపారు. అయితే ఎంఎస్ పూర్తి చేసి ఆరు నెలలవుతున్నా సుష్మకు ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో దిక్కుతోచని సుష్మ.. తన ఖర్చుల కోసం ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా రోజుకు (12 గంటలు) 75 డాలర్ల వేతనంతో అనధికారికంగా పనిచేస్తున్నారు. అది కూడా నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే! ఉన్న ఉద్యోగం పోయింది.. మహబూబ్నగర్ జిల్లా గండేడ్కు చెందిన మహిపాల్రెడ్డి కాలిఫోర్నియా స్టేట్ వర్సిటీలో 2014లో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అక్కడి ఒక భారత ఐటీ కంపెనీలో 65 వేల డాలర్ల వార్షిక వేతనానికి చేరారు. ఏడాది తిరిగే సరికి వేతనం 75 వేల డాలర్లకు పెరిగింది. హెచ్1బీ వీసా కూడా వచ్చింది. కానీ నెల రోజుల కింద కంపెనీ మహిపాల్రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆయన ఈ నెల 20న భారత్కు తిరిగి వచ్చేశారు. స్థానికులకే ఉద్యోగాలన్న ట్రంప్ నినాదాన్ని అందిపుచ్చుకొని భారత కంపెనీలు ఇలా టెక్నికల్ సపోర్టు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ చివరిదాకా దాదాపు 2,500 మందిని భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. తాత్కాలిక ఉద్యోగాలూ లేవు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సుధాకర్ యాదవ్ జీఆర్ఈ, టోఫెల్లో అర్హత సాధించి ఈ ఏడాది జనవరిలో నార్తర్న్ అరిజోనా వర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరారు. బ్యాంకు రుణంతో అమెరికా పయనమైన ఆయన.. వర్సిటీలో అసిస్టెంట్షిప్ లేదా ఎక్కడైనా పార్ట్టైమ్ ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు సంపాదిస్తే ఖర్చులకు సరిపోతాయని భావించారు. కానీ ట్రంప్ రాకతో అమెరికా వర్సిటీల్లోని ప్రొఫెసర్లు తమ దగ్గరి పార్ట్టైమ్ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించడం మొదలుపెట్టారు. దీంతో సుధాకర్కు పార్ట్టైమ్ ఉద్యోగం కూడా దొరకడం లేదు. -
తెలుగు విద్యార్థులకు ‘సరిహద్దు’ గండం
సాక్షి, అమరావతి: భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్లోని శ్రీనగర్ ‘నిట్’ ఇంజనీరింగ్ కళాళాల విద్యార్థుల చదువులకు ఆటంకమేర్పడింది. రెండు దేశాల సరిహద్దుల్లో నిట్ కళాశాల ఉండటం.. ఇక్కడ ఏడాదిన్నరగా ఆందోళనకర పరిస్థితులతో విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయో.. అసలు ఈ ఏడాది కళాశాల ప్రారంభమవుతుందో లేదో తెలియక ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో కళాశాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. శ్రీనగర్ నిట్ కళాశాలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 5న ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. తర్వాతి ఏడాదికి సంబంధించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభించాలి. జూలై 15న నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి తరగతులు ప్రారంభిస్తామని నిట్ యాజమాన్యం ప్రకటించింది. పది రోజుల వ్యవధిలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు రాకుండా శ్రీనగర్లోనే ఉండిపోయారు. అయితే జూలై 8న శ్రీనగర్లో బృహన్ అనే ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నిట్ యాజమాన్యం విద్యా సంవత్సర ప్రారంభ తేదీని పొడిగించింది. పైగా విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించలేదు. కళాశాల ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా తెలియక విద్యార్థులు శ్రీనగర్లోనే ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉండిపోయారు. అక్కడే ఉంటున్నారు.. శ్రీనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రావడానికి దూరం ఉండటం, చార్జీల భారం ఎక్కువనే ఉద్దేశంతో అక్కడే ఉంటున్నారని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెలాఖరుకైనా విద్యా సంవత్సరం ప్రారంభిస్తే డిసెంబర్ మొదటి వారానికి తొలి సెమిస్టర్ పూర్తయ్యేదని, ఇప్పటికీ ఆరంభం కాకపోవడంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో నిర్ణయం తాము తీసుకోలేమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈనెల 4న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమావేశం జరిగినా, శ్రీనగర్ నిట్ కళాశాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన రెట్టింపైంది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సొంత రాష్ట్రాల్లోని నిట్లో చేరే అవకాశం కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఢోకా ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కోరుతున్నారు. -
కజికిస్తాన్లో తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం
-
కజికిస్తాన్లో తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం
కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తున్న తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చిన తెలుగు విద్యార్థులు గురువారం తిరుగు పయనం అయ్యారు. అయితే వారిని యూనివర్శిటీ హాస్టళ్లోకి సిబ్బంది అనుమతించ లేదు. అడ్మిషన్ టైంలో కన్సల్టెన్సీ చెప్పిన ఫీజుకంటే రెట్టింపు చెల్లిస్తేనే లోపలికి అనుమతి అంటూ రాత్రి సమయం అని కూడా చూడకుండా యాజమాన్యం హాస్టల్ రూమ్లకు తాళాలు వేసింది. వర్షం కూడా కురవడంతో యూనివర్శిటీ బయటే చలిలో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం వరకైనా అనుమతి ఇవ్వాలని కోరినా, ఒప్పుకోకుండా దుర్భాషలాడారంటూ విద్యార్థులు(అబ్బాయిలు,అమ్మాయిలు) తమ తల్లిదండ్రులకు వాట్సాప్లో గోడువెల్లబోసుకున్నారు. పిల్లల మెసెజ్లతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కజికిస్తాన్లో ఎంబీబీఎస్ లో చేర్పించిన ఎన్ఈఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. అయితే వారు కూడా పట్టించుకోవటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 మంది తెలుగు విద్యార్థులు ఎన్ఈఓ కన్సల్టేన్సీ ద్వారా గత ఏడాది కజకిస్తాన్లో ఎంబీబీఎస్లో చేరారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి దాదాపు 50 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ నుంచి కజకిస్తాన్కు తిరిగి వెళ్లారు. -
ఐసీడబ్ల్యూఏలో మెరిసిన తెలుగు తేజాలు
- ఆలిండియా స్థాయిలో ప్రథమ, ద్వితీయసహా పలు ర్యాంకులు - ఇప్పటి వరకూ 50 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో ‘సూపర్విజ్’ రికార్డు విజయవాడ(లబ్బీపేట): ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బుధవారం విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ) ఫైనల్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఉడతా వెంకటసాయికిరణ్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించగా, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన మసాల వెంకట సాయిచరణ్ ద్వితీయ ర్యాంకుతో మెరిశాడు. రాయదుర్గానికి చెందిన ఎట్టాకుల వాసవీప్రియ నాలుగో ర్యాంక్, విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వావిలాల అనూష ఐదో ర్యాంక్, తాండూర్కు చెందిన తిరుపతి ధరణి ఏడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. వీరంతా విజయవాడలోని సూపర్విజ్లో శిక్షణ పొందినవారే. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సూపర్విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు 50లోపు 14 ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. వినూత్న కోచింగ్ విధానంతో ఎందరో విద్యార్థుల్ని అఖిల భారత స్థాయిలో ర్యాంకర్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. సూపర్విజ్ సంస్థ బుధవారం సాధించిన ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్తో ఇప్పటివరకూ కామర్స్ కోర్సుల్లో ఆలిండియా ఫస్ట్ర్యాంకులు 50 సాధించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఏ సంస్థకు ఇన్ని ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు రాలేదని, ఇదొక రికార్డని పేర్కొన్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు 50 సాధించడాన్ని పురస్కరించుకుని 2017 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే సీఏ ఫైనల్ కోర్సుకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మాస్టర్మైండ్స్ విజయదుందుభి.. గుంటూరు ఈస్ట్: 2016 జూన్లో నిర్వహించిన సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి ప్రకాష్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేట 4/12లోని సరస్వతి క్యాంపస్లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఐసీఏఐ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని, ఇంటర్లో మొత్తం 50 ర్యాంకులకుగాను మాస్టర్మైండ్స్ విద్యార్థులు 44 ర్యాంకులు సాధించి సత్తా చాటారని తెలిపారు. 40 ర్యాంకులు సాధించడం ఇది మూడోసారన్నారు. సీఎంఏ ఫైనల్లో తమ విద్యార్థులు 13 ర్యాంకులు సాధించారన్నారు. సంస్థ పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషివల్లే ర్యాంకులు సాధించామన్నారు. సంతోషంగా ఉంది... సీఏ ఫైనల్ పూర్తవడంతో ఇప్పటికే లుపిన్ కంపెనీలో రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. ఐసీడబ్ల్యూఏలో ఆలిండి యా ఫస్ట్ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించా. నా తల్లిదండ్రులు చిల్లర దుకాణం నిర్వహిస్తూ కష్టమంటే ఏమిటో తెలియకుండా నన్ను చదివించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ర్యాంక్ సాధించా. అందుకు సూపర్విజ్ టెక్నిక్స్ ఎంతగానో దోహదం చేశాయి. - వెంకటసాయికిరణ్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ పారిశ్రామికవేత్తనవుతా మంచి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది నాలక్ష్యం. ప్రస్తు తం ఐసీడబ్ల్యూఏ ఆలిండి యా రెండో ర్యాంక్ సాధిం చా. ఈ ఏడాది నవంబర్లో సీఏ ఫైనల్స్కు హాజరవుతా. అనంతరం మంచి కంపెనీలో కొద్దికాలం ఉద్యోగం చేస్తా. నా తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు తీరాక ఎంబీఏ చేసి మంచి కంపెనీ స్థాపించి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది కోరిక. ఆ లక్ష్యం నెరవేరేవరకూ కృషిచేస్తా. - మసాల వెంకటసాయిచరణ్ ఆలిండియా రెండో ర్యాంకర్ -
తెలుగుకు మెలిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్బంధ తమిళం నుంచి విముక్తి కోరుతున్న తెలుగు విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్న ముసుగులో ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే నిర్బంధ తమిళం నుంచి వెసులుబాటు ఉంటుందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు పలుభాషా ప్రజల సమ్మేళనంగా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఉద్యోగరీత్యా వస్తూ పోయే వాళ్లూ ఉన్నారు. అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో తమిళనాడులో తెలుగువారే అధికశాతం స్థిరపడిపోయారు. ఆంధ్రప్రదేశ్గా వేరుపడినా తమిళనాడులోనే కొనసాగారు. ఇలా తమిళం తరువాత అధికశాతం ఉన్న తెలుగువారికి 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్బంధ తమిళ చట్టం ఆశనిపాతమైంది. మాతృభాషపై మమకారం చంపుకుని తమిళభాషను నేర్చుకోవాలన్న ఈ చట్టంపై తెలుగుతోపాటు ఇతర మైనార్టీ భాషల వారంతా మండిపడ్డారు. గత 10 చట్టపరమైన పోరు సాగిస్తూనే ఉన్నారు. 2006లో తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం గత 2015-16 విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులంతా తమిళంలోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో అవిశ్రాంత పోరుతో ఎట్టకేలకూ దిగివచ్చిన ప్రభుత్వం గత విద్యాసంవత్సరం వరకు తెలుగు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి వచ్చే ఏడాది మాటేమిటి: దినగండం నూరేళ్లాయుష్షులా మారిన నిర్బంధ తమిళ చట్టం నుండి ఈ విద్యాసంవత్సరంలో మినహాయింపు లభించేనా అనే ప్రశ్న మళ్లీ ఉత్పన్నమైంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తుండగా పది పరీక్షల్లో తెలుగా, తమిళమా అనే అంశంపై విద్యార్థులోల్లో ఆయోమయం నెలకొంది. ఈ అయోమయానికి ప్రభుత్వం తెరదించుతూ రానునున్న పది పరీక్షల్లో తమిళంకు బదులుగా తెలుగు పరీక్ష రాయగోరు విద్యార్దులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టు ద్వారా హామీ ఇచ్చారు. లింగ్విస్టిక్ మైనార్టీ భాషల విద్యార్దులు తమ అభీష్టాన్ని ఈనెల 20వ తేదీలోగా లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజే యాలని సూచించారు. మళ్లీ ఇదేమి మెలిక: ఇదిలా ఉండగా, ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్దులకు, ముఖ్యంగా తెలుగును ఆశించే విద్యార్దులకు పరోక్షంగా కొత్త మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వారు కోరిన భాషలో పరీక్ష రాసుకోవచ్చని ప్రకటించింది. అంటే బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు 2006 నిర్బంధ తమిళ చట్టం వర్తించదని పరోక్షంగా స్పష్టం చేసింది. అంటే నిర్బంధ తమిళం చట్టం నుండి విముక్తి కోరుతూ పోరాడుతున్న వారి గోడును పట్టించుకోకుండా ఎక్కడి నుంచో బదిలీపై రానున్న వారి పిల్లల కోసం ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. ఈ కొత్త వాదన వల్ల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న మైనార్టీ భాషల విద్యార్థుల విజ్ఞప్తులకు ప్రభుత్వం విలువ ఇస్తుందా, అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ప్రభుత్వ తాజా ధోరణిపై ముస్లీం మైనార్టీ విద్యాసంస్థలు, సంఘాలతో కలిసి కోర్టులో సవాలు చేయనున్నట్లు ఏఐటీఎఫ్, లింగ్విస్టిక్ మైనార్టీల ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు. -
మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 29 ర్యాంకులను మనోళ్లే కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులను సాధించారు. మే 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ఐఐటీ గువాహటి ఆదివారం ప్రకటించింది. జేఈఈ మెయిన్లో దేశంలోనే అత్యధిక మార్కులను సాధించిన తెలుగు విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్డ్లో మాత్రం మొదటి మూడు ర్యాంకులను సాధించలేకపోయారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన అమన్ బన్సాల్ మొదటి ర్యాంకు సాధించగా.. హరియాణా యమునానగర్కు చెందిన భవేశ్ డింగ్రా 2వ ర్యాంకు సాధించాడు. జైపూర్కే చెందిన కునాల్ గోయల్ మూడో ర్యాంకు సాధించాడు. టాప్ 10 ర్యాంకుల్లో 4, 5, 7, 8, 10 ర్యాంకులను తెలుగు విద్యార్థులు సాధించారు. వీరంతా అబ్బాయిలే కావడం గమనార్హం. ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్లో దేశంలోనే అత్యధిక మార్కులు(345) సాధించిన తాళ్లూరి సాయితేజ జేఈఈ అడ్వాన్స్డ్లో ఐదో ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్లో టాప్-5 విద్యార్థుల జాబితాలో లేని దుగ్గాని జీవితేశ్ జేఈఈ అడ్వాన్స్డ్లో నాలుగో ర్యాంకు సాధించాడు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) కేటగిరీలో జాతీయ స్థాయిలో జీవితేశ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో టాప్-20లో 8 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. ఓపెన్లో 75 మార్కులొస్తే ర్యాంకు.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 372 మార్కులకు (ఫిజిక్స్-124, కెమిస్ట్రీ-124, మ్యాథ్స్-124) నిర్వహించారు. ఇందులో ప్రతి సబ్జెక్టులో 10 శాతం మార్కులు, మొత్తంగా 372 మార్కులకు కనీసం 35 శాతం(130కిపైగా) మార్కులు వస్తేనే అడ్వాన్స్డ్లో అర్హత సాధించినట్లు పరిగణిస్తామని ఐఐటీ గువాహటి ప్రకటించింది. అయితే ర్యాంకుల ఖరారు సందర్భంగా మాత్రం ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను మార్చలేదు. కానీ మొత్తం మార్కుల్లో రావాల్సిన కనీస అర్హత మార్కులను భారీగా తగ్గించింది. ఓపెన్ కేటగిరీలో 20 శాతం మార్కులు సాధించిన వారికి ర్యాంకులను కేటాయించింది. అంటే ఓపెన్లో 75 మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటించి ర్యాంకులను కేటాయించింది. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లోనూ మొత్తం మార్కుల్లో కనీస అర్హత మార్కులను తగ్గించింది. సర్వర్ డౌన్తో తంటాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ఐఐటీ గువాహటి ముందుగానే ప్రకటించింది. తీరా ర్యాంకులు వెలువడే సమయానికి సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం కొంతసేపు వెబ్సైట్ పని చేసింది. ఆ తర్వాత మళ్లీ డౌన్ అయింది. ఎట్టకేలకు సాయంత్రానికల్లా విద్యార్థులు తమ ర్యాంకులను తెలుసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో టాప్ ర్యాంకర్లు.. ర్యాంకు పేరు ప్రాంతం 1 అమన్ బన్సాల్ జైపూర్ 2 భవేష్ డింగ్రా యమునానగర్ 3 కునాల్ గోయల్ జైపూర్ -
తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : సివిల్స్లో విజయ కేతనం ఎగురవేసిన రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజాలకు అభినందనలతో పాటు ఆయన ఆల్ ది బెస్ట్ అంటూ బుధవారం ట్విట్ చేశారు. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. -
తెలుగు వెలుగులు
సివిల్స్లో తెలంగాణ, ఏపీల నుంచి 80 మంది వరకు ఎంపిక సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-ఏ, గ్రూప్-బి తదితర అఖిల భారత సర్వీసులకు ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలను నిర్వహించింది. గత డిసెంబర్లో మెయిన్స్ రాతపరీక్షలను నిర్వహించి.. ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు చేసింది. మంగళవారం సివిల్ సర్వీసెస్-2015 ఫైనల్ ఫలితాలను వెల్లడించింది. కేటగిరీల వారీగా..: సివిల్ సర్వీసులకు జనరల్ కేటగిరీలో 499 మందిని, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ కేటగిరీలో 89 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అభ్యర్థులు వివిధ విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వారికి సర్వీసులను కేటాయించారు. అలాగే 172 మందితో రిజర్వు జాబితాను కూడా ప్రకటించారు. అందులో జనరల్ 86 మంది, ఓబీసీ 74, ఎస్సీ 8, ఎస్టీ కేటగిరీకి చెందిన నలుగురు ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి ఫెసిలిటేషన్ కౌంటర్ను యూపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఫలితాలు, నియామకాలకు సంబంధించిన వివరాలను పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా 23385271/ 23381125/ 23098543 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థుల మార్కులను 15 రోజులపాటు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గత ఏడాదిలాగే: తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్కు గత ఏడాదిలాగే ఈసారి కూడా ఎక్కువమంది ఎంపిక అయ్యారని అనలాగ్ ఐఏఎస్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్ పేర్కొన్నారు. గత ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి 70 మంది వరకు అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారని తెలిపారు. సివిల్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యుత్తమ ర్యాంక్ (14) సాధించిన కీర్తి 2013లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో హైదరాబాద్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్లో అసిస్టెంట్ కమిషనర్గా సోమవారమే విధుల్లో చేరడం విశేషం. కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్న ఆమె స్వస్థలం విశాఖ జిల్లా నర్సీపట్నం. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: సివిల్స్ విజేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘మీ జీవితాల్లో మొదలైన ఉత్సాహభరితమైన ఈ నూతన అధ్యాయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మంగళవారం ట్వీట్ చేశారు. పరీక్షల్లో విజయం సాధించలేనివారు నిరాశ చెందడం సహజమే అయినా భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిందిగా వారికి సూచించారు. ఐఏఎస్ నా కల.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి విద్యాసాగర్ నాయుడు 101వ ర్యాంకు సాధించారు. వారి కుటుంబం కొన్నేళ్ల కిందే హైదరాబాద్ మల్కాజ్గిరిలో స్థిరపడింది. తండ్రి త్యాగరాజు దక్షిణ మధ్య రైల్యేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ కావాలనేది తన కల అని, ఇప్పుడు దానిని సాధించనుండడం ఎంతో ఆనందంగా ఉందని విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రజాసేవపై మక్కువతో.. జాతీయ స్థాయిలో 180వ ర్యాంకు సాధించిన ఎడ్మ రిషాంత్రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి. ఆయన తండ్రి గోపాల్రెడ్డి. ఈయన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి సోదరుడు. వారు పదేళ్ల కింద హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్లోనే ఇంటర్ పూర్తిచేసిన రిషాంత్.. బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం ఓ బహుళ జాతి సంస్థలో నెలకు రూ.1.2 లక్షల వేతనం వచ్చే ఉద్యోగంలో చేరారు. అయితే పెదనాన్న కిష్టారెడ్డితో ఉన్న అనుబంధం రిషాంత్ను ప్రజాసేవ వైపు మళ్లించింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్కు ప్రిపేరయ్యారు. ‘‘ప్రజాసేవ చేయాలన్న పెదనాన్న స్ఫూర్తితో ముందుకు వెళ్లాను. అమ్మనాన్న ఎంతగానో ప్రోత్సహించారు. ఈ విజయం వారికి అంకితం..’’ అని రిషాంత్ పేర్కొన్నారు. రోజూ పత్రికలు చదువుతా.. దినపత్రికలను చదివితే సివిల్ సర్వీసెస్కు కావాల్సిన ఎంతో సమాచారం లభిస్తుందని 191వ ర్యాంకు సాధించిన సతీశ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఉక్మాగులూరుకు చెందిన పీఆర్కే ప్రసాద్, పి.లక్ష్మిదుర్గల కుమారుడు సతీశ్. వారి కుటుంబం హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడకు కొన్నేళ్ల కింద తరలివచ్చింది. ‘‘ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నాకు ఐఏఎస్ కావాలనే ఆలోచన వచ్చింది. కష్టంగా కాకుండా ఇష్టపడి చదివి సివిల్స్ సాధించాను. ఐఏఎస్లో చేరితే సమాజానికి పూర్తి స్థాయిలో సేవ చేయటంతో పాటు మంచి స్థాయిలో ఉండవచ్చు..’’ అని సతీశ్ పేర్కొన్నారు. అనంత ‘ప్రావీణ్య’ం పేదలకు తనవంతు సాయం చేయాలన్న తపనతో సివిల్స్కు సిద్ధమైనట్లు 82వ ర్యాంకు సాధించిన వేములేటి ప్రావీణ్య చెప్పారు. ఆమెది అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుములపల్లి. తల్లి మాలతి బెంగళూరులో చీఫ్ మెడికల్ ఆఫీసర్, తండ్రి ఓబుళరెడ్డి హెచ్ఏఎల్ బెంగ ళూర్లో ఇంజనీర్. గోవాలోని బిట్స్ పిలానీలో బీఈ పూర్తిచేసిన ప్రావీణ్య నిరుపేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని, అందుకోసం తన వేతనంలో కొంత కేటాయిస్తానని చెప్పారు. నేర్చుకున్నది వృథా పోదు విజయవాడకు చెందిన అన్నవరప్రసాద్, లక్ష్మీభ్రమరాంబ కుమారుడు సి.హెచ్.రామకృష్ణ 84వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. ‘‘ర్యాంకు వస్తుందనే చదవాల్సిన అవసరం లేదు.. చదువు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్కు ప్రిపేరవుతున్న విద్యార్థులు సాధించకపోతే జీవితమే వ్యర్థమనే ధోరణితో ఉంటున్నారు. అది సరికాదు..’’అని పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే.. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం విజయపురికాలనీకి చెందిన అదురె మంజు 291 ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి ధర్మయ్య వికలాంగుల శాఖలో అటెండర్గా పనిచేసి రిటైరయ్యారు. వారి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం జీనుగుపల్లి. ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మంజు.. ఐఏఎస్లో చేరి ప్రజాసేవ చేయాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఐఆర్ఎస్ నుంచి ఐఏఎస్! నల్లగొండ జిల్లా హేమ్లాతండా గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గుతండాకు చెందిన భూక్యా టీకం కుమారుడు భూక్యా నాగేందర్ 733వ ర్యాంకు సాధించారు. 2014లో 1,122 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. హైదరాబాద్లోని జేఎన్టీయూ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి ఐదేళ్లపాటు ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేసిన నాగేందర్ రెండేళ్లపాటు గ్రూప్-1కు శిక్షణ తీసుకుని సివిల్స్కు ఎంపికయ్యూరు. ఇప్పుడు ఐఏఎస్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఏఎస్ ధ్యేయంగా.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ పంచాయతీ పరిధిలోని గేర్ తండాకు చెందిన అడావత్ సైదులు 796వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ సివిల్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. సైదులు రెండేళ్ల కిందట సివిల్స్ రాయగా 1,174వ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ కావడమే ధ్యేయంగా శ్రమించిన ఆయన మరోమారు పరీక్ష రాసి ర్యాంక్ సాధించారు. ఈయన తండ్రి పదేళ్ల కిందటే మరణించగా తల్లి కూలినాలీ చేసి చదివించింది. అటవీ అధికారిగా పనిచేస్తూ.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన వరప్రసాదవర్మ 806వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం అటవీశాఖలో రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయన పట్టుదలగా ప్రయత్నించి సివిల్స్ సాధించారు. ఆయన తండ్రి సుబ్బారాయుడు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన ర్యాంకు ప్రకారం ఐఆర్ఎస్ ఐటీ వచ్చే అవకాశముందని వర్మ పేర్కొన్నారు. డాక్టర్ నుంచి.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి చెందిన వైద్యుడు సంజామల వెంకటేశ్వర్ 216వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి వెంకటయ్య రైతు. వెంకటేశ్వర్ ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2013లో ఎంబీబీఎస్ చేసి.. ప్రస్తుతం విశాఖపట్నంలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడూ వైద్యుడే. వెంకటేశ్వర్ 2013లో సివిల్స్ రాసి ఐఆర్ఏఎంకు, 2014లో ఐడీఈఎఫ్కు ఎంపికయ్యారు. తాజాగా 216వ ర్యాంకు సాధించారు. పట్టుదలతో ప్రయత్నించి.. విశాఖపట్నానికి చెందిన కింతాడ ప్రవళిక సివిల్స్లో 232వ ర్యాంకు సాధించారు. వారి కుటుం బం హైదరాబాద్లో స్థిరపడింది. తండ్రి విశ్వనాథం వరంగల్ జిల్లా కాజీపేట ఎస్బీహెచ్లో సీజీఎం. తల్లి హైదరాబాద్ ఎస్బీహెచ్లో క్లర్క్. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసిన ప్రవళిక.. క్యాంపస్ సెలక్షన్స్లో టీసీఎస్ సంస్థకు ఎంపికైనా ఉద్యోగంలో చేరలేదు. ఐఏఎస్ అధికారి మోహన్కందాను స్ఫూర్తిగా సివిల్స్పై దృష్టిపెట్టారు. ‘‘క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సివిల్స్కు ప్రిపేరయ్యాను’’ అని ప్రవళిక చెప్పారు. సామాన్య ఉద్యోగి నుంచి.. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో పనిచేసే సామాన్య ఉద్యోగి పి.ఉదయ్కుమార్ సివిల్స్లో 234 ర్యాంకు సాధించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. తండ్రి గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరయ్యారు. ఓయూలో బీఈ, ఈఈఈ కోర్సులు చేసిన ఉదయ్.. ఖరగ్పూర్ ఐఐటీలో ఎంబీఏ చేశారు. 2011 నుంచి హైదరాబాద్లోని భెల్లో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో సివిల్స్కు ప్రయత్నించారు. 2015లో సివిల్స్ రాసి 697 ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐపీఎస్ ట్రెయినింగ్ చేస్తూనే.. మళ్లీ సివిల్స్ పరీక్షలు రాసి 234 ర్యాంకు సాధించారు. ముచ్చటగా మూడోసారి.. నల్లగొండ పట్ణణానికి చెందిన రావిరాల మహేష్ కుమార్ 189 ర్యాంకు సాధించారు. 2011లో మెడిసిన్ పూర్తిచేసిన మహేష్ వైద్య వృత్తిని కాదని సివిల్స్ బాట పట్టారు. తొలిసారిగా 2012లో సివిల్స్ పరీక్ష రాశారు. ఆ తర్వాత వరుసగా 2013, 2014లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వె ళ్లారు. ఈసారి అకుంఠిత దీక్షతో చదివి ర్యాంకు సంపాదించారు. మహేష్ కుమార్ అన్నయ్య రఘునాథ్ డాక్టర్గా పనిచేస్తున్నారు. అన్న లాగే మహేష్ కూడా ఎంబీబీస్ చదివినా.. తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్ వైపు వెళ్లి విజయం సాధించారు. కుటుంబ సభ్యులే స్ఫూర్తి అని మహేష్ తెలిపారు. బీడీఎస్ చేసి.. సివిల్స్ వైపు కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్నకు చెందిన మద్దికుంట సిద్ధార్థ సివిల్స్లో 419వ ర్యాంకు సాధించారు. గుంటూర్ వికాస్ కాలేజీలో ఇంటర్మీడియెట్, చెన్నైలోని శ్రీరాంచంద్ర మెడికల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసిన సిద్ధార్థ.. సివిల్స్ లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు చెల్లి... ఇప్పుడు అక్క కరీంనగర్ జిల్లా ఎర్రబెల్లికి చెందిన ఎల ప్రియాంక 529 ర్యాంక్ సాధించింది. ప్రియాంక చెల్లెలు శశాంక రెండేళ్ల క్రితం ఐఏఎస్కు ఎంపికై ప్రస్తుతం ఒడిశాలో సబ్ కలెక్టర్గా విధులు నిర్వరిస్తున్నారు. నారాయణ-లోరా దంపతులకు ప్రియాంక, శశాంక కూతుళ్లు. నారాయణ ఆయుష్ విభాగంలో హైదరాబాద్లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, లోరా సీసీఎంబీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ప్రియాంక మహారాష్ట్రలోని మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ మెడికల్ కళాశాలలో 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పేదరికం, అంగ వైకల్యాన్ని జయించి.. ఒకవైపు పేదరికం, మరో వైపు అంగవైకల్యం. అయినా పట్టు వదలకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అహోరాత్రులు శ్రమించారు చామకూరి శ్రీధర్. మొదటి, రెండో ప్రయత్నంలో ఎలాంటి ర్యాంకు రాకున్నా ఈసారి పట్టుదలతో శ్రమించి 348వ ర్యాంకు సాధించారు. ఈయనది నల్లగొండ జిల్లా నూతనకల్లు మండలం మద్దిరాల గ్రామం. సోమయ్య, పద్మ దంపతుల కుమారుడైన శ్రీధర్కు మూడేళ్ల వయస్సులో పోలియో సోకడంతో కుడికాలు చచ్చుపడిపోయింది. తండ్రి సోమయ్య తాడిచెట్లు ఎక్కి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇఇఇ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్.. ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రూ.45వేల జీతంతో కూడిన ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో ఐఏఎస్ వస్తుందని వస్తుందని ఆశిస్తున్నారు. ఇంటి వద్దే చదివి.. ఆదిలాబాద్ జిల్లా ఎగ్గాం గ్రామానికి చెందిన నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే 794వ ర్యాంకు సాధించాడు. రైతు కుటుంబంలో జన్మించిన నిఖిల్ ఇంటి వద్దనే చదివి ర్యాంకు సాధించడం గమనార్హం. హైదరాబాద్లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించిన నిఖిల్.. సివిల్స్ సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలి సొంతూరికి చేరుకొని ప్రిపేర్ అయ్యారు. ‘‘సివిల్స్కు ఇంటి వద్దే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మంచి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పోలీసు అధికారుల పిల్లలకు ర్యాంకులు వరంగల్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బిరుదరాజు అశోక్రాజు కుమారుడు రోహిత్రాజు 691వ ర్యాంకు సాధించగా.. నగర అదనపు డీసీపీ యాదయ్య కుమారుడు మాల సహసూర్య 948 ర్యాంకు సాధించారు. పాలమూరు బిడ్డ ప్రతిభ.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన రవితేజయాదవ్ 694 ర్యాంకు సాధించారు. ర్యాంకును బట్టి ఐపీఎస్కు ఎంపికయ్యే ఈ అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్(మెకానికల్)ను పూర్తి చేసిన రవితేజ.. గోల్డ్మెడల్ అందుకున్నాడు. గేట్ పరీక్షలో 14వ ర్యాంకు సాధించాడు. సవిల్స్లో ‘శ్రీచైతన్య’ విజయదుందుభి సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తమ సంస్థ అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీ తెలిపింది. ఆలిండియా 2వ ర్యాంకుతోపాటు 14, 65, 101, 179, 183, 206, 225, 270, 326.. వంటి 33 సెలక్షన్లతో ప్రభంజనం సృష్టించిందని పేర్కొంది. అనితర సాధ్యమైన క్లాస్రూం ప్రోగ్రామ్స్తోతోపాటు సీనియర్ సివిల్ సర్వెంట్ల ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూ శిక్షణ అందిస్తున్నామని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు తెలిపారు. తెలుగు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ: ఆర్సీ రెడ్డి ‘‘తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు 2015 సివిల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ర్యాంకులు సాధించిన వారి నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే సర్వీసుల పరంగా ఐఏఎస్ సర్వీసులకు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య కొంత పెరగనుంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలో దాదాపు ప్రతి జిల్లా నుంచి అభ్యర్థులు ఉండటం హర్షణీయ పరిణామం’’ అని ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి పేర్కొన్నారు. -
సివిల్స్ టాపర్ టీనా దాబి
తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2015 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన యువతి టీనా దాబి దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. తన తొలి ప్రయత్నంలోనే టీనా దాబి సివిల్స్లో టాప్ ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం. 22 ఏళ్ల టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. తనకు సివిల్స్లో తొలి ర్యాంకు లభించడంపై ఆమె స్పందిస్తూ.. ఇది తాను నిజంగా గర్వపడే సమయమని చెప్పారు. జమ్మూకశ్మీర్కు చెందిన రైల్వే అధికారి అతర్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అనంత్నాగ్కు చెందిన 22 ఏళ్ల అతర్ తన రెండో ప్రయత్నంలో సివిల్స్లో విజయం సాధించాడు. 2014లో అతను తొలి ప్రయత్నంలో ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్టీఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది తన కల నిజమైన సమయమని అతన్ ఫలితాల విడుదల తర్వాత చెప్పాడు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్నీ తాను సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఇక ఢిల్లీకే చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి జస్మిత్ సింగ్ సంధు మూడో స్థానం సాధించారు. జస్మిత్ తన నాలుగో ప్రయత్నంలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. 2014లో అతను ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికైన జస్మిత్.. ప్రస్తుతం ఫరిదాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్లో శిక్షణ పొందుతున్నాడు. తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లే కారణమని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్లో 172 మంది మొత్తం 1,078 మంది అభ్యర్థులు ఈ ఏడాది సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన వారు 499 మంది, ఓబీసీలు 314, ఎస్సీ అభ్యర్థులు 176, ఎస్టీ అభ్యర్థులు 89 మంది ఉన్నారు. మరో 172 మంది అభ్యర్థులను వెయిటింగ్ లిస్ట్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో వీరికి అపాయింట్మెంట్ ఇవ్వాలని యూపీఎస్పీ సిఫారసు చేసింది. -
సివిల్స్లో.. దుమ్మురేపారు
ఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్-2015 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఢిల్లీకు చెందిన టీనా దాబి తొలి ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ రెండో ర్యాంక్ సాధించాడు. సివిల్స్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14 వర్యాంక్, హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంక్ సాధించారు. (ర్యాంకర్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మొత్తం సివిల్స్లో 1078 మంది ఈసారి ఉత్తీర్ణులయ్యారు వాళ్లలో జనరల్ 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ 89 మంది ఉన్నారు ఐఏఎస్కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 45 మంది, ఐపీఎస్కు 150మంది, కేంద్ర గ్రూప్ ఎ సర్వీసులకు 728 మంది, కేంద్ర గ్రూప్ బి సర్వీసులకు 61 మంది ఎంపికయ్యారు. ర్యాంకుల వివరాలు: ఫస్ట్ ర్యాంక్ - టీనా దాబి (ఢిల్లీ) సెకండ్ ర్యాంక్ - అమీర్ (జమ్మూ) చేకూరి కీర్తి 14 (విశాఖపట్నం) వల్లూరు క్రాంతి 65 సీహెచ్ రామకృష్ణ 84 విద్యాసాగర్ నాయుడు 101 జొన్నలగడ్డ స్నేహజ 103 (హైదరాబాద్) పోతరాజు సాయి చైతన్య 158 నివేదిత నాయుడు 159 వై.రిషాంత్ రెడ్డి 180 పసుమర్తి వీజీ సతీష్ 191 సలిజామల వెంకటేశ్వర్ 216 ప్రవల్లిక 232 ఉదయ్ కుమార్ 234 -
‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం
► ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో సందిగ్ధం ► ఎంసెట్ కచ్చితంగా నిర్వహిస్తామన్న విద్యా మండలి ► అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ‘నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్య, వైద్య శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ‘నీట్’ నుంచి ఈ ఏడాది ఎలా బయటపడాలన్న దానిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎంసెట్, ప్రైవేటు మెడ్సెట్ నోటిఫికేషన్లు జారీ చేయడం, మేలో ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు హాజరుకావాలా, లేదా అన్న సందిగ్ధంలో మునిగిపోయారు. ఎంసెట్ నిర్వహిస్తాం: పాపిరెడ్డి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉంటే మంచిదే అయినప్పటికీ..కోర్టు తీర్పు కాపీ అందకముందే ‘నీట్’పై తామేమీ వ్యాఖ్యానించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంసెట్ను నిర్వహిస్తామని.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరమైతే రివ్యూకు వెళతాం: లక్ష్మారెడ్డి ‘నీట్’పై కోర్టు తీర్పు కాపీ అందాక తదుపరి చర్యలు చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. నీట్ ద్వారానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాలన్నది మంచిదేనని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడతామని... అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోందని, వారితోనూ చర్చించి ముందుకు సాగుతామని చెప్పారు. తెలుగు మీడియంకు కష్టమే ఎంసెట్లో ప్రశ్నపత్రం ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులకు అది ప్రయోజనకరం. ఏటా ఇంటర్ పూర్తి చేసే విద్యార్థుల్లో బైపీసీ విద్యార్థులు లక్ష మంది వరకు ఉంటున్నారు. అందులో 50 శాతానికిపైగా తెలుగు మీడియంలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులే. ‘నీట్’ ఇంగ్లిషులోనే ఉండే అవకాశమున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తప్పవు. ‘నీట్’ను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు. ఈ సిలబస్కు ఇంటర్లో చదువుకునే రాష్ట్ర సిలబస్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండింటికీ సిద్ధం కావాల్సిందే! ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విద్యార్థులు ఎంసెట్తోపాటు నీట్కు కూడా సిద్ధం కావాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈసారికి తెలంగాణలో నీట్ వద్దని... వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిటిషన్ వేసినా దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే తెలియదు. విచారణకు స్వీకరించినా తుది తీర్పు ఇచ్చేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నీట్కు సిద్ధమైతేనే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. 371(డి) విషయంలో రావాల్సిన స్పష్టత! తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక చట్రంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371 (డి) ప్రకారం స్పష్టమైన విధానాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ జోన్లుగా విభజించి 371(డి)లో చేర్చారు. ఒక్కో జోన్లో ఆ జోన్ పరిధిలోని విద్యార్థులకు 85 శాతం సీట్లు, మిగతా 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో మూడు జోన్లకు చెందిన విద్యార్థులకే చెందుతాయి. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడికి రావడానికి వీల్లేదు. రాష్ట్ర విభజన చట్టం కూడా పదేళ్ల పాటు పాత ప్రవేశాల విధానమే అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్ పరిధిలోకి ఎలా వెళ్లాలి, వెళితే తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ సీట్ల భర్తీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
జేఈఈ మెయిన్లో మెరిసిన తెలుగు తేజాలు
♦ ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ ♦ జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులకు అగ్రస్థానం ♦ టాప్ మార్కులు సాధించిందీ తెలుగు విద్యార్థే సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు అగ్రస్థానం లభించింది. మొత్తంగా 360 మార్కులకుగాను తెలుగు విద్యార్థి తాళ్లూరి సాయితేజ (హాల్టికెట్ నంబర్ 20438099)కు అత్యధికంగా 345 మార్కులు రావడం విశేషం. రెండో అత్యధికమైన 340 మార్కులను కొండా విఘ్నేశ్రెడ్డి సాధించాడు. ఈ ఇద్దరు చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులే. 300 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిలో 43 మంది తమ విద్యార్థులని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రకటించగా... వారిలో 34 మంది చైతన్య టెక్నోస్కూల్లో చదువుకున్నవారే. ఈనెల 3న రాతపూర్వకంగా.. 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 1.30 లక్షల మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి 59,731 మంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడి కావడంతో ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు గౌహతి ఐఐటీ చర్యలు చేపట్టింది. మే 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని ప్రకటించింది. జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం రెండు లక్షల మందిలో తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 25 వేల మంది ఉండనున్నట్లు అంచనా. ఇది గతేడాది సుమారు 18వేలు మాత్రమే. తగ్గిన కటాఫ్ ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించిన విద్యార్థుల కటాఫ్ మార్కులను సీబీఎస్ఈ ప్రకటించింది. గతేడాది టాప్ 1.5 లక్షల మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేసి, 105 మార్కులను కటాఫ్గా ప్రకటించగా... ఈసారి టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకోవడంతో కటాఫ్ జనరల్ కేటగిరీలో 100కు తగ్గింది. ఇక ఓబీసీ-నాన్ క్రీమీలేయర్లో 70 మార్కులుగా, ఎస్సీల్లో 52 మార్కులుగా, ఎస్టీల్లో 48 మార్కులుగా కటాఫ్ను ప్రకటించింది. అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోండి విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ ఫలితాలను ప్రకటించింది. ప్రతి విద్యార్థికి ఇచ్చిన మార్కుల జాబితాలోనే కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెల్లడించింది. అందులోనే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. మే 22న జరిగే అడ్వాన్స్డ్ పరీక్ష మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలను చేపడతారు. ఇక ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ స్కోర్కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, నార్మలైజ్ చేసి తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ ర్యాంకులను జూన్ 30న, లేదా అంతకంటే ముందుగానే ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇక విద్యార్థులు తమ అర్హత పరీక్ష అయిన 12వ తరగతి వివరాల్లో ఏవైనా పొరపాట్లుంటే http://www.jeemain.nic.in వెబ్సైట్లో సవరించుకోవాలని సూచించింది. నాన్న గుర్తించిన ప్రతిభ.. మొదట్లో సాధారణ స్కూల్లో చదువు. అయినా ఆ పిల్లాడు చదువులో ఘనాపాటి. అన్ని తరగతుల్లోనూ నూటికి నూరు మార్కులు. ఐదో తరగతిలో బిడ్డ టాలెంట్ను గుర్తించిన తండ్రి మంచి స్కూల్లో చేర్పించాలని తపించాడు. ఈ క్రమంలో పేరొందిన స్కూల్లో చేర్పించడానికి ప్రవేశపరీక్ష రాయించాడు. అందులో రాష్ట్రం నుంచి నంబర్ వన్ ర్యాంకు ఆ అబ్బాయి వశమైంది. ఎస్సెస్సీ, ఇంటర్, తాజాగా జేఈఈ మెయిన్స్.. ఇలా ర్యాంకులన్నీ అతని ముంగిట మోకరిల్లాయి. ఆ అబ్బాయే జేఈఈ మెయిన్స్లో ఆలిండియా స్థాయిలో 345 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన తాళ్లూరి సాయితేజ. తండ్రి ఆనాడు సాయితేజ ప్రతిభను గుర్తించకపోయి ఉంటే.. ఇప్పుడు అతనికి ఆలిండియా స్థాయి ర్యాంకులు వచ్చేవికావేమో. తండ్రి చలపతిరావు, జయలక్ష్మిది గుంటూరు జిల్లాలోని తెనాలి వద్ద ఉన్న కూచిపూడి. తేజ పుట్టకముందే వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. కూకట్పల్లిలోని వసంత్నగర్లో వీరు నివాసం ఉంటున్నారు. చలపతిరావు ఆల్విన్ వాచ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. జయలక్ష్మి గృహిణి. ప్రస్తుతం చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ)లో ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కాలర్షిప్ పొందాడు సాయితేజ. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై) స్కాలర్షిప్కి కూడా ఎంపికయ్యాడు. అలాగే ఫిజిక్స్ ఒలింపియాడ్లోనూ సత్తా చాటాడు. డాక్టర్ ఏఎస్ రావు ఒలింపియాడ్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ‘నా కుమారుడు ఐఏఎస్గా స్థిరపడాలని అనుకున్నా. అందుకే ఐఐటీ వైపు తేజ దృష్టి మళ్లింది. ఏనాటికైనా తేజను ఐఏఎస్గా చూస్తా’ అని అతని తండ్రి చలపతిరావు చెప్పారు. నంబర్ వన్గా ఉంటానని అనుకోలేదు.. ‘‘నాన్న పడుతున్న కష్టం.. విద్యా వ్యవస్థపై ఆయనకున్న అవగాహన.. నేను అత్యుత్తమ మార్కులు సాధించడానికి దోహదపడ్డాయి. నారాయణ శ్రీచైతన్య విద్యాసంస్థల సహకారం ఎంతో ఉంది. మెయిన్స్ పరీక్ష క్లిష్టంగా అనిపించింది. బెస్ట్ స్కోర్ చేస్తానని అంచనా వేశా. అత్యుత్తమ మార్కులు వస్తాయని మాత్రం అనుకోలేదు. చివరకు ఆలిండియా స్థాయిలో బెస్ట్ స్కోర్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. అడ్వాన్స్డ్లోనూ టాప్ 10లో నిలుస్తానని నమ్మకం ఉంది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తా. ఆ తర్వాత ఎంబీఏ చేయాలనేది నా లక్ష్యం’’. - సాయితేజ, టాప్ స్కోరర్ (345/360) సైంటిస్ట్గా స్థిరపడతా.. ‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల దిశానిర్దేశంతో ఉత్తమ మార్కులు సాధించగలిగాను. పూర్తిగా సమయాన్ని చదువులకే కేటాయించే వాడిని కాదు. రోజుకు గంట ఆటలకు సమయమిచ్చా. దీంతో కాస్త ఒత్తిడి తగ్గడంతోపాటు నూతనోత్తేజం వచ్చేది. మెయిన్స్ పరీక్ష కఠినంగా అనిపించింది. కానీ పూర్థిస్థాయిలో శిక్షణ పొందడంతో.. కష్టమేమీ అనిపించలేదు. ఇస్రోలో సైంటిస్ట్గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’. - కొండా విఘ్నేష్ రెడ్డి, 340/360 సొంత కంపెనీ పెడతా.. ‘‘తల్లిదండ్రులు, కెమిస్ట్రీ అధ్యాపకురాలు సుభాషిణి సహకారంతోనే జేఈఈ మేయిన్స్లో 330 మార్కులు సాధించాను. దేశంలోనే బాలికల విభాగంలో మొదటి ర్యాంకు, ఓవరాల్గా 3వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 6వ తరగతిలో చేరాను. ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతిలో 10 పాయింట్స్ సాధించాను. ఇంటర్లో 987 మార్కులొచ్చాయి. ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్, ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో చేరాలని నా ఆకాంక్ష. భవిష్యత్తులో సొంత కంపెనీ పెట్టాలన్నది నా జీవితాశయం’’. - ఆర్. గాయత్రి (మాదాపూర్) బాలికల్లో మొదటి ర్యాంకు -
రాళ్లతో కొట్టారు: తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: శ్రీనగర్ ఎన్ఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి హిమవంత్ తన ఆవేదనను ఫోన్ ద్వారా మీడియాకు తెలియజేశాడు. ‘భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్థానికులు మాపై రాళ్లు విసిరారు. డెరైక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విషయం బయటకు చెబితే ఫెయిల్ చేస్తామని, రెండేళ్లు ఎక్స్టెండ్ చేస్తామని బెదిరించారు. మేం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుండగా.. మీడియాతో మాట్లాడాలి రండి అంటూ పోలీసులు మెయిన్ గేట్ వరకు తీసుకెళ్లి లాఠీచార్జి చేశారు. ఒక్కో విద్యార్థిపై ఐదుగురు దాడి చేశారు. దాదాపు 50 మంది విద్యార్థుల తలలు పగిలాయి. ఇక్కడ తెలుగు విద్యార్థులు 120 మందికిపైగా ఉన్నారు. వీరిలో చాలామందికి దెబ్బలు తగిలాయి. ఒక విద్యార్థి తల పగిలింది. పోలీసులు విద్యార్థులను ఒక గదిలో బంధించి కొడుతున్నారు. మా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదు. విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించడం లేదు. మీడియా సాయం కూడా అందకుండా చేస్తున్నారు. ఎవరినీ లోపలికి రానీయడం లేదు, మమ్మల్ని బయటకు వెళ్లనీయడం లేదు. ఐదుగురు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చాలామంది కాళ్లకు దెబ్బలు తగిలి నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మాకు ఇక్కడ ఎలాంటి రక్షణా లేదు. మమ్మల్ని వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ నుంచి బయటకు తీసుకెళ్లాలి. మరో ఎన్ఐటీకి మార్చాలి’ అని హిమవంత్ విజ్ఞప్తి చేశాడు. -
శ్రీనగర్లో తెలుగు విద్యార్థుల కష్టాలు
శ్రీనగర్: టి-20 ప్రపంచ కప్ సందర్భంగా శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ కారణంగా తెలుగు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది తెలుగు విద్యార్థులు నిట్లో చదువుకుంటున్నారు. వారం రోజులుగా శ్రీనగర్ నిట్లో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా భద్రత పెంచాలంటూ తెలుగు విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ విద్యార్థులు.. నాన్ లోకల్ విద్యార్థులపై దాడులకు దిగుతున్నారు. దీంతో నాన్ లోకల్ విద్యార్థులు క్యాంపస్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. టి-20 ప్రపంచ కప్లో టీమిండియాకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సెలెబ్రేషన్స్ చేసుకోగా, లోకల్ విద్యార్థులు టీమిండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతుగా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడటంతో వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్లో గొడవల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీగా భద్రత బలగాలను మోహరించారు. అయితే నాన్ లోకల్ విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిట్లో పరిస్థితిని కేంద్ర హోం శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
'విద్యార్థులపై చర్యలను ఖండిస్తున్నాం'
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులపై కఠిన చర్యలను ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమెరికాకు వెళుతున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని, కనీసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. అమెరికాలో 22 మంది తెలుగు విద్యార్థులను హింసించి వెనక్కి పంపేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తమిళనాడులో తెలుగును రెండో అధికారభాషగా లేకుండా తొలగించే ప్రయత్నం జరుగుతున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు పట్టించుకోక పోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగువారికి ఎక్కడ హాని జరిగినా స్పందిస్తామని గొప్పలు చెప్పుకున్న వారు ఇపుడు ఎందుకు మిన్నకుండి పోయారన్నారు. తక్షణం అమెరికాకు వెళ్లే విద్యార్థుల సమస్యలపైనా, తమిళనాడులో తెలుగు భాషను రెండో అధికారభాషగా రద్దు చేసే యత్నంపైనా స్పందించాలని గడికోట డిమాండ్ చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిర్వహించిన 6 భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు(పార్ట్నర్షిప్ సమ్మిట్)లకు సంబంధించి శ్వేతపత్రం ప్రకటించాలని గడికోట శ్రీకాంత్రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఈ ఆరు సదస్సుల్లో ఎన్ని లక్షల కోట్లతో ఒప్పందాలపై (ఎంఓయూలపై) సంతకాలు జరిగాయి? వాటిలో ఎన్ని వాస్తవరూపం దాల్చాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? వంటి వివరాలను ధైర్యంగా ప్రభుత్వం వెల్లడిస్తుందా? అని ప్రశ్నించారు. విశాఖ భాగస్వామ్య సదస్సును ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటివి చంద్రబాబు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారని వీటిపై ఆర్భాటం ఎక్కువ చేస్తారని అన్నారు. సదస్సులో ఒక్క రోజులోనే రూ.1.95 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు జరగ్గా అందులో రూ.1.15 లక్షల కోట్లు ఒక్క విద్యుత్ ఉత్పాదనారంగంలోనే అంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిందని ఆయన తెలిపారు. 2015 సెప్టెంబర్ 23వ తేదీ కూడా ముఖ్యమంత్రి తన చైనా పర్యటనలో ఒక చైనా కంపెనీతో పది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనా కేంద్రం నెలకొల్పడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, నాలుగు నెలలు గడిచినా అదేమైందో తెలియడం లేదని గడికోట అన్నారు. ఇలాంటి సదస్సుల్లో ఫోటోలు తీయించుకుని చేస్తున్నంత హడావుడి క్షేత్రస్థాయిలో ఆ తరువాత కనిపించదని చెప్పారు. ఇలా సదస్సులు పెట్టి పారిశ్రామిక వేత్తలను బతిమాలి ఆహ్వానించే బదులు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగరని గడికోట సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎక్కడెక్కడి పారిశ్రామివేత్తలు తలుపులు తోసుకుని ఆంధ్రప్రదేశ్లోకి మూకుమ్మడిగా వస్తారు కదా అని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారని వైఎస్సార్సీపీ తొలి నుంచీ చెబుతున్నా టీడీపీ వారు మాత్రం హేళనగా మాట్లాడారని ఆయన అన్నారు. చట్టబద్ధంగా మనకు దక్కాల్సిన ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని భాగస్వామ్య సదస్సుల్లో హోదా గురించి గాని, ప్రత్యేక హోదా గురించి గాని ఎందుకు మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదని నిలదీశారు. సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పక్కనే కూర్చో బెట్టుకున్నారు కానీ ఈ విషయమే ప్రస్తావనకు తీసుకు రాలేదన్నారు. గతంలో రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు. జనవరి 3వ తేదీన రాష్ట్రానికి వచ్చిన నీతీ ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ ఫనాతో చంద్రబాబు సమావేశమైనపుడు ఆయనతో పొగిడించుకున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏమీ చెప్పలేదన్నారు. -
'విద్యార్థులపై చర్యలను ఖండిస్తున్నాం'
-
శంషాబాద్లో 22 మంది తెలుగు విద్యార్థుల అవస్థలు
హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో 22 మంది తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 8 గంటల పాటు వారిని ఎయిర్ ఇండియా అధికారులు బంధించడంతో ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం మహముద్ అలీని విద్యార్థులు తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎయిర్ ఇండియా అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఎయిర్ ఇండియా అధికారుల నుంచి తెలుగు విద్యార్థులను మహముద్ అలీ విడిపించారు. -
ఆ ప్రభుత్వానికి మూర్ఖత్వం తగదు
తమిళనాడులో 92 వేల మంది తెలుగు విద్యార్థులకు అగచాట్లు హైకోర్టు, కేంద్ర మైనార్టీ కమిషన్ ఉత్తర్వులు తుంగలోకి: యార్లగడ్డ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళనాడు ప్రభుత్వం తెలుగు విద్యార్థుల పట్ల మూర్ఖంగా వ్యవహారిస్తోందని సాహితీవేత్త, కేంద్ర హిందీ భాషా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో జారీచేసిన ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని తెలుగు, మలయాళం, కన్నడం, ఉర్దూ భాషలకు చెందిన 2.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. తమిళనాడులో చదువుతున్న 92 వేల మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు మాతృభాషగా చదివిన విద్యార్థులు మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలో తొలి భాషగా తమిళంలోనే పరీక్షలు రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తగదన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి: కేంద్ర మైనారిటీ క మిషన్ అక్టోబరు 2015లో మాతృభాషలో పరీక్షలు రాసే విద్యార్థుల హక్కులను భంగం కలిగించవద్దని ఉత్తర్వులు ఇచ్చినా తమిళ సర్కారు పెడచెవిన పెట్టిందన్నారు. మద్రాసు హైకోర్టు సైతం ఈ ఏడాదికి విద్యార్థుల డిక్లరేషన్లు తీసుకుని పరీక్షలు రాసేలా ఆదేశించిందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: తమిళనాడు గవర్నర్ కోణిజేటి రోశయ్య తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. రాజ్యాంగ అధిపతిగా భాషా అల్పసంఖ్యాక వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి ఆర్టికల్ 50 ప్రకారం రక్షణ కల్పించాలని కోరారు. తెలుగు, అల్పసంఖ్యాక విద్యార్థుల హక్కులను కాపాడాలన్నారు. -
తెలుగు విద్యార్థులను ఆదుకోండి
సుష్మాస్వరాజ్కు కేటీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించడంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు లేఖ రాశారు. చట్టబద్ధంగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ వారు ఇచ్చిన వీసా, అనుమతి పత్రాలన్నీ ఉన్నా తెలంగాణ విద్యార్థులను వెనక్కి పంపడం వల్ల అన్యాయం జరిగిందన్నారు. అమెరికాలో విద్య కోసం విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు వారంతా అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు. అమెరికా అధికారులు విద్యార్థులతో ప్రవర్తించిన తీరుపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సుష్మను కోరారు. అవసరమైతే సుష్మాస్వరాజ్ను తాను స్వయంగా కలుస్తానని కేటీఆర్ చెప్పారు. -
అమెరికా వెళ్తున్నారా... అయితే జాగ్రత్త...
హైదరాబాద్ : ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని భావిస్తున్న విద్యార్థులు కొందరికి ఇటీవలి కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని ఏదైనా ఎయిర్ పోర్టు దిగగానే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్న సూచనలు పాటిస్తే మంచిది. ప్రధానంగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడమే కాకుండా అమెరికా ఎందుకు వెళుతున్నామన్న విషయంలో విద్యార్థినీ విద్యార్థులకు ముందు అవగాహన ఉండాలి. ఈ విషయాల్లో నిపుణులు ఏం సూచిస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం. కోర్సులపై అవగాహన ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ (ఐ 20) తో పాటు వీసా పొందిన తర్వాత ప్రధానంగా కొన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రధానంగా యూనివర్సిటీ నేపథ్యం, చదువుతున్న కాలంలో చెల్లించే ఫీజులతో పాటు విడిగా మనకు అయ్యే ఖర్చులన్నీభరించగలిగే స్థితిగతులు విద్యార్థికి ఉన్నాయని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారులకు నమ్మకం కలగాలి. అలా కాకుండా అక్కడికి వెళ్లిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు చేసి సంపాదించుకుని చదువుకుంటానని చెబితే మిమ్మల్ని వెనక్కి తిప్పిపంపిస్తారు. వీసా ఇచ్చింది చదువు కోవడానికి అయినప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేయడం అమెరికాలో నిషేధం. పోతే అమెరికాలో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధంగా సెమిస్టర్ విధానం, క్రెడిట్స్ విధానంలో విద్యనందిస్తుంటాయి. మీరు చేరబోయే కోర్చులకు సంబంధించి ఎన్ని సెమిస్టర్స్, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి వంటి విషయాల్లో యూనివర్సిటీ అధికారులతో ముందుగానే ఈ మెయిల్ ద్వారా సంప్రదించి సమగ్ర వివరాలు తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకు ఎంఎస్ చేయడానికి వెళుతున్నప్పుడు మీరు చేరిన యూనివర్సిటీ మొత్తం నాలుగు సెమిస్టర్లలో ఆ కోర్సును అందిస్తుందనుకుంటే... ఆ నాలుగు సెమిస్టర్లను ఎంతకాలంలో పూర్తి చేయాలి. దానికి ఎంత ఫీజు చెల్లిస్తున్నాం. ఫీజులు పోగా మిగిలిన ఖర్చులను ఏ విధంగా భరిస్తాం. ఆ ఖర్చులన్నీ భరించడానికి మనకు స్తోమత ఉందా... వంటి వివరాలను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు మిమ్మల్ని రకరకాల ప్రశ్నల ద్వారా ఒక అంచనాకు వస్తారు. ఇలా ప్రశ్నించే విషయంలో ఒక్కో సారి ర్యాండమ్ గా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చు. అనుమానం కలిగితే ఒక గ్రూపు మొత్తాన్ని కూడా విచారణ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అవసరమా వీసా, ఐ20, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ వంటి అడ్మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాల సర్టిఫికేట్లు ఉండాల్సిందే. అధికారులు అడిగినప్పుడు వాటన్నింటినీ చూపించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఫీజు చెల్లింపు పత్రాలు కూడా కలిగి ఉండాలి. ఎంఎస్ చేయడానికి బ్యాంకు రుణం తీసుకున్నారనుకోండి... ఆ రుణంలో మీరు యూనివర్సిటీకి చెల్లించే ఫీజుతో పాటు మీకు అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చులు కూడా కలిపే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. అందువల్ల రుణం తీసుకున్న బ్యాంకు నుంచి పూర్తి వివరాలకు సంబంధించిన పత్రాలు విద్యార్థుల వద్ద ఉంటే మంచిది. ఇంగ్లీషుపై పట్టు... సీబీపీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కొందరు విద్యార్థులు వాటిని సరిగా అర్థం చేసుకోలేక కూడా వెనక్కి తిరిగాల్సిన పరిస్థితులు ఇటీవలి కాలంలో తలెత్తాయి. విద్యార్థులు ముందుగా ఇంగ్లీషుపై పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఇంగ్లీషులో పట్టుంటే తడుముకోకుండా అధికారులకు సులభంగా సమాధానాలు చెప్పడానికి వీలవుతుంది. ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం వల్ల చాలా మంది తడుముకుంటుంటారు. దాంతో అధికారులు మరిన్ని ప్రశ్నలు వేయడం, దాంతో విద్యార్థి ఆ సమయంలో ఆందోళనకు గురికావడం, వాళ్లు మరింత రెచ్చిపోయిన విధంగా అడగడం... చివరకు నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వస్తున్న వారిలో ఎక్కువగా ప్రధానంగా కమ్యునికేషన్ స్కిల్స్, సమాధానాలు చెప్పడంలో ఆత్మవిశ్వాసం లేకపోవడం, సర్టిఫికేట్లలో వైరుధ్యాలు ఉండటమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్... ఒక యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెడితే ఆ విషయం బహిరంగంగానే ప్రకటిస్తారు. పైగా ఆ విషయాన్ని అన్ని కాన్సులేట్లకు సమాచారం ఉంటుంది. యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో ఉంటే ముందు అసలు వీసా ఇవ్వరు. ఉన్నత చదువుల కోసం ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలన్న సమస్య తలెత్తినప్పుడు విద్యార్థులకు వచ్చిన జీఆర్ఈ స్కోర్ ఆధారంగా కన్సల్టెంట్లు ఫలానా యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. ప్రాసెస్ చేస్తామని చెబుతుంటారు. లేదా స్నేహితులు చెబితేనో యూనివర్సిటీలకు దరఖాస్తు చేస్తుంటారు. అయితే దరఖాస్తు చేయడానికి ముందుగానే ఆ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో క్షుణ్ణంగా శోధించాలి. ఆ తర్వాతే ముందుకెళ్లాలి. యూనివర్సిటీల క్రెడెన్షియల్స్ ను ప్రధానం అధ్యయనం చేయాలి. ఇక్కడి నుంచి వెళుతున్న విద్యార్థులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి అమెరికాలో అనేక తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ వివరాలను సేకరించిన తర్వాత మీరు చేరబోయే కోర్సు, దాని క్రెడిట్స్ విషయంలో బాగా అధ్యయనం చేయాలి. వ్యక్తిగత నేపథ్యం మీరు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు డీ-160 లో అనేక వివరాలను పొందుపరుస్తారు. మీ ఈ మెయిల్ తో పాటు మీ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. దాని ఆధారంగా అనుమానం వచ్చినప్పుడు మీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థుల వ్యక్తిగత నేపథ్యం తెలుసుకోవడానికి ఆ వివరాలతో ఒక అంచనాకు వచ్చే అవకాశాలుంటాయి. చాటింగులు సమస్యలు తేవొద్దు ఫేస్బుక్లో చేసే కాజువల్ పోస్టులు, స్నేహితులు, బంధువులతో చాటింగ్లో తెలిసోతెలియకో చేసే వ్యాఖ్యలు.. ఒక్కోసారి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు విద్యార్థులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాము ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకముందే తమ ఉద్దేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పసిగట్టడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అమెరికాలో చదువు కోసం వస్తున్నప్పటికీ, అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్నామని ఏదో మాటమాటల్లో ఫేస్బుక్ చాటింగ్లో చేసిన వ్యాఖ్యలు, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను ఎలా బోల్తా కొట్టించాలనే విషయంలో అమెరికాలోని స్నేహితులు ఇచ్చిన తమకు సలహాలు వంటివి తమను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టించాయని, ఫేస్బుక్లో ఓరకంగా స్పందించి.. తమ ముందు మరోరకంగా సమాధానం చెప్పడాన్ని అధికారులు ఎత్తిచూపారని పలువురు విద్యార్థులు అంగీకరించారు. జాగ్రత్త వహించాల్సిందే... మీ పేరున ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కనిపించేవేనని గమనించాలి. విద్యార్థుల ప్రొఫైల్ను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి అధికారులు ఫేస్బుక్ వంటి బహిరంగ వేదికలపై విస్తృతంగా ఆధారపడుతున్నారు. ఫేస్బుక్ అనేది ఒక విద్యార్థి స్వభావానికి ముఖచిత్రమని, దీనిని వినియోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సన్నద్ధమయ్యేందుకు ముందే ఫేస్బుక్లోని తమ ఖాతాలను సమూలంగా ప్రక్షాళన చేసి.. పనికిమాలిన విషయాలను తొలగించాలని, రాజకీయ అభిప్రాయాలు, ఇతరుల పోస్టులపై పెట్టిన కామెంట్లు, చాటింగ్లు వంటి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారు అనుసరించే పేజీలు, గ్రూపులనూ పరిశీలించే అవకాశముంటుందని, కాబట్టి ఈ విషయంలో ఉద్యోగార్థులు, ఉద్యోగార్థులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. తమ విద్య, ఉద్యోగాలకు అవసరయ్యే గ్రూపులు, పేజీలతో మాత్రమే ఫేస్బుక్లో టచ్ ఉండాలని సూచిస్తున్నారు. వీసా ఉంటే చాలదు... పాస్ పోర్టులో వీసా ఉంది కదా అని అమెరికా వెళ్తామంటే అన్ని వేళలా సాధ్యం కాదు. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో అడుగుపెట్టడానికి అనుమతి లభించినట్టు కాదని అమెరికన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. ఒక విదేశీయుడిని అమెరికాలో ప్రవేశించడానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిని మంజూరు చేయడమే వీసా ప్రధాన లక్ష్యమని అమెరికన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. మీరు అమెరికాలో ఎంతకాలం ఉంటారు. ఏ పర్పస్ కోసం వెళుతున్నారు. అనుమతించాలా లేదా వంటి అన్ని అధికారాలు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కి చెందిన ఇమిగ్రేషన్ అధికారులు పర్యవేక్షిస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద (అది విమానాశ్రయం కావొచ్చు.. సీపోర్టు కావొచ్చు, ల్యాండ్ బోర్డర్ కావొచ్చు) మీ ఎంట్రీని తిరస్కరించే పూర్తి అధికారం ఇమిగ్రేషన్ అధికారికి ఉందన్న విషయాన్ని అంతా గమనించాలి. అవగాహన పెంచుకోవాలి అమెరికా చదువుకోవడమనగానే ఏదో ప్రైవేటు ఉద్యోగం చేసుకుని పూర్తి చేసుకోవచ్చన్న భావన నుంచి విద్యార్థులు బయటకు రావాలి. అమెరికాలో అడుగు పెట్టడానికి లేదా అనుమతించకుండా తిరస్కరించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీకి, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరిని వాళ్లు తిరస్కరించరు. ప్రైవేటు ఉద్యోగాలు చేయొచ్చు... యూనివర్సిటీలు మారొచ్చు... వంటి విషయాలపైన కాకుండా ఉన్నత చదువు అన్న ఆలోచన, స్పష్టతతో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ముందడుగు వేయాలి. అనవసరమైన ఇబ్బందులు పడొద్దు. ఈ విషయంలో తమ ఫోరంను సంప్రదించిన విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. - కలవల విశ్వేశ్వర్ రెడ్డి (తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్ - యూఎస్ఏ - అధ్యక్షుడు) కోర్సు క్రెడిట్స్ ఏంటో తెలుసుకోండి కొన్ని లీగల్ ఫర్స్ తో చర్చించాం. యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏ అమెరికన్ కాన్సులేట్ కూడా విసా జారీ చేయదన్న విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ప్రశ్నించిన అధికారులను ఏ విధంగా కన్విన్స్ చేశామన్నదే ముఖ్యం. ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాలతో పాటు యూనివర్సిటీ లో చేరబోయే కోర్సుకు సంబంధించిన టర్మ్, క్రెడిట్స్ పై పూర్తి అవగాహనతో సమాధానాలు చెప్పాలి. - రాం అన్నాడి (తెలంగాణ డెవలప్ మెంట్ - స్టూడెంట్స్ సర్వీసెస్ కమిటీ చైర్మన్) -
తెలుగు విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకమైంది
-
యూఎస్ కాన్సుల్ జనరల్తో కేటీఆర్ భేటీ
వీసా విషయంలో తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై చర్చ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్కు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్తో చర్చించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్ విద్యార్థులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులది అని తెలిపారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముల్లిన్స్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రైవేటు ఏజెంట్ల మోసానికి గురి కాకుండా, యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫెయిర్లను పటిష్టంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాస్తానని పేర్కొన్నారు. అమెరికాలోని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరతానని చెప్పారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల డాక్యుమెంట్లను అమెరికాలో కాకుండా ఇక్కడ తనిఖీ చేశాకే వీసాలు మంజూరు చేయాలని యూఎస్ కాన్సులేట్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అమెరికా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. -
అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్: అమెరికా దౌత్యకార్యాలయం(కాన్సులేట్) అధికారులతో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ప్రభుత్వం తిప్పిపంపిన అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వీసాలు ఇచ్చేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని కాన్సులేటు అధికారులను ఆయన ఈ సందర్భంగా కోరినట్టు తెలిసింది. దాంతో సమస్య వచ్చిన మాట వాస్తవమేనని కాన్సులేట్ అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక హైదరాబాద్ విద్యార్థులకే సమస్య రాలేదని.. వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాన్సులేట్ అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, విద్యార్థుల సమస్యలపై విదేశాంగ శాఖకు లేఖ రాస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థులపై ప్రశ్నల వర్షం
ఎయిర్పోర్టు నుంచే వెనక్కి పంపిస్తున్న అధికారులు రాయికల్: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. వారం రోజుల నుంచి విద్యార్థులపై అమెరికా అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇండియా నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు ఎయిర్పోర్టులో దిగగానే కస్టమ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (సీబీపీవో) వేస్తున్న ప్రశ్నలకు విద్యార్థులు తడబడుతూ సమాధానమిస్తుండడంతో ఎయిర్పోర్టు నుంచే తిరిగి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు కాల్వల విశ్వేశ్వర్రెడ్డి, అమెరికాలోని అటార్నీగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనితారెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఇండియా నుంచి చాలామంది వస్తున్నారని, ఇటీవల లాస్ ఏంజిల్స్లో జరిగిన ఘటనతో అమెరికా అధికారులు ప్రత్యేకదృష్టి సారించారని చెప్పారు. అమెరికాకు విద్యార్థులు ఎలా వచ్చారు? ఎందుకు వస్తున్నారనే కోణాల్లో ప్రశ్నిస్తున్నారని, అన్ని రకాలుగా ప్రశ్నించిన తర్వాతే యూనివర్సిటీలో ప్రవేశం కల్పించాలని వర్సిటీ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఏ కోర్సు చదువుతున్నారు? ఎంతకాలం ఉంటారు? బ్యాంకులో ఆస్తుల వివరాలు, అమెరికాలో ఉండడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలివ్వాలని జనితా రెడ్డి సూచించారు. తడబడొద్దు విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చేటప్పుడు అన్ని రకాల ప త్రాలను తీసుకురావాలి. అంతేకాకుండా ఎయిర్పోర్టులో సీబీపీవో అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, ధైర్యంగా సమాధానాలు ఇవ్వాలి. ఏ కొంచం సందేహం కలిగినా వెనక్కి పంపిస్తున్నారు. - జనితారెడ్డి, అమెరికాలో అటార్నీ అవగాహన కల్పిస్తున్నాం అమెరికాకు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులకు అమెరికాలోని విధివిధానాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. అమెరికాకు వచ్చే వారికి పూర్తిగా అవగాహన కల్పించాలని ఇక్కడ ఉన్న విద్యార్థులకు సూచిస్తున్నాం. - కాల్వల విశ్వేశ్వర్రెడ్డి,తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు, అమెరికా -
అమెరికాలో తెలుగు విద్యార్థులపై ప్రశ్నల వర్షం
-
అమెరికా నుంచి మళ్లీ తిప్పి పంపేశారు!
► 15 మంది విద్యార్థులు వెనక్కి.. ► ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ► తెలుగు విద్యార్థులు అనగానే వేధిస్తున్నారు ► ప్రభుత్వమే న్యాయం చేయాలి: విద్యార్థులు హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్ ఎయిర్పోర్టు నుంచి తెలుగు విద్యార్థులను అక్కడి ఎయిర్పోర్టు అధికారులు వెనక్కి పంపారు. అమెరికా నుంచి తిరుగుపయనమైన విద్యార్థుల్లో ఇప్పటికే 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం ఇటీవల 25 మంది తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లారు. అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నా తమను వెనక్కి పంపివేయడంపై బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను దర్యాప్తు చేసినట్లుగా విద్యార్థులను ప్రశ్నిస్తున్నారని వారు వాపోయారు. తెలుగు విద్యార్థులను చూడగానే ఏదో కారణంతో వేధిస్తున్నారనీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు
-
పూర్తి సన్నద్ధతతో అమెరికా రండి
తెలుగు విద్యార్థులకు సూచించిన తానా సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో అమెరికాకు రావాలని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) అధ్యక్షుడు వి.చౌదరి జంపాల సూచించారు. ఇటీవల కొందరు ఏపీ విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా స్టూడెంట్ వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యూనివర్సిటీలు, ఎయిర్లైన్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలసి ఈ సమస్యను పరిష్కరించడానికి తానా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థు ఎవరైనా స్క్రీనింగ్ ప్రాసెస్లో ఇబ్బందులు పడితే వాటిని info@tana.orgకు మెయిల్ చేయాలని తానా సూచించింది. అదేవిధంగా అమెరికాలో సురక్షితంగా ఉండడానికి అనుసరించాల్సిన నియమాలు http://www.tana.org/helplineteamsquare/safetyguidelines వెబ్సైట్లో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా షికాగోలోని ఎయిర్పోర్టులో సుమారు 20 మంది తెలుగు విద్యార్థులను సోమవారం అక్కడి అధికారులు నిలిపివేశారు. చదువుకోవడానికి అని వచ్చి తమదేశంలో పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్నారనే నేపంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు సంబంధంలేని ప్రశ్నలు అడిగి విద్యార్థులను తిరిగి పంపేస్తున్నట్టు తెలుస్తోంది. మిషిగన్లోని ఓ వర్సిటీ విద్యార్థులను కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కిపంపినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే రెండు వర్సిటీల విద్యార్థులు వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇమ్మిగ్రేషన్, ఎఫ్బీఐ అధికారుల తీరుతోనే విద్యార్థులకు ఈ సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వారు వాపోతున్నారు. ఏదో ఒక సాకుతో విద్యార్థులను యూఎస్ అధికారులు వెనక్కిపంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యూనివర్సిటీలు, ఎయిర్లైన్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలసి ఈ సమస్యను పరిష్కరించడానికి తానా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైనా స్క్రీనింగ్ ప్రాసెస్లో ఇబ్బందులు పడితే వాటిని info@tana.orgకు మెయిల్ చేయాలని తానా సూచించింది. అదేవిధంగా అమెరికాలో సురక్షితంగా ఉండడానికి అనుసరించాల్సిన నియమాలు http://www.tana.org/helplineteamsquare/safetyguidelines వెబ్సైట్లో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. -
తెలుగువారికి తమిళ నిర్భంధమా...
న్యూఢిల్లీ: తమిళనాడులో తెలుగు విద్యార్థుల పట్ల చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలోని తెలుగు సంఘాలు, ఢిల్లీలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. 9వ తేదీన ఈ ధర్నా జరగాల్సి ఉండగా, చెన్నై నగరంలో వర్ష భీభత్సం కారణంతో వాయిదా వేసినట్టు చెప్పారు. సీపీఐ నేత నారాయణ, తమిళనాడులోని తెలుగు సంఘాల నేతలతో కలిసి ఏపీభవన్లో గురువారం వైఎల్పీ విలేకరులతో మాట్లాడారు. భాషా అల్పసంఖ్యాకవర్గంగా ఉన్న తెలుగు, కన్నడ, మలయాళీ, ఉర్దూ భాష విద్యార్ధులకు అన్యాయం చేస్తూ 2006లో కరుణానిధి ప్రభుత్వం తెచ్చిన తమిళ నిర్భంధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మాతృ భాషలో చదువుకునే అవకాశం రాజ్యంగం కల్పించిందని, గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు కూడా ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నామని చెప్పారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలుగువారికి పిలుపునిచ్చారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి చెన్నైలోని బాధితులకు వారం రోజుల పాటు సరుకులు కొనుగోలు చేసుకోడానికి నగదు ఇవ్వాలని విన్నవించారు. ప్రేమలేఖలతో పని జరగదు : సీపీఐ నేత నారాయణ తమిళ నిర్భంత చట్టాన్ని రద్దుచేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమలేఖలు రాస్తే సరిపోదని, జయ ప్రభుత్వంపై అందరూ కలిసి ఒత్తిడి తేవాలని సీపీఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. తెలుగు విద్యార్థుల పట్ల వైరుధ్యం చూపడం తగదన్నారు. తమిళనాడులోని తెలుగు విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయకుండా జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్భంద చట్టాలు ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తే భావా స్వేచ్ఛకు ప్రమాదం వాటిల్లనుందన్నారు.