auction
-
ట్విట్టర్ పిట్టకు రూ.30 లక్షలు!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు. మస్క్ 2022లో ట్విట్టర్ను టేకోవర్ చేయగానే శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్కు మార్చారు. ట్విట్టర్కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది. -
రూ.1,500 కోట్లే చివరి రుణం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రుణాన్ని ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఈ అప్పును సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 27 సంవత్సరాల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 30 సంవత్సరాల కాలపరిమితితో మరో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. కాగా, ఈ రూ.1500 కోట్ల రుణంతో బహిరంగ మార్కెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.55,800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నట్టు అవుతుంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఏడాది జూలై నెలలో రూ.8 వేల కోట్లు, ఆగస్టులో రూ.6 వేల కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.5,800 కోట్లు ఆర్బీఐ ద్వారా రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మార్చి నెలలో ఇప్పటికే రూ. 5 వేల కోట్లను సమకూర్చుకుంది. ఈనెల 4న రూ.2 వేల కోట్లు, 11న రూ.3 వేల కోట్లు తీసుకున్న ప్రభుత్వం.. ఈనెల 25న మరో రూ.1,500 కోట్లు తీసుకోనుంది. షెడ్యూల్లో సగమే! అయితే, తొలి మూడు త్రైమాసికాల్లో రూ. 40వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరి త్రైమాసికంలో మరో రూ.30 వేల కోట్లు తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లోనే ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చింది. కానీ, చివరి మూడు నెలల్లో కేవలం రూ.15,300 కోట్ల రుణాలకు మాత్రమే పరిమితమైంది. అదే షెడ్యూల్ మేరకు రుణాలు తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై మరో రూ.14,700 కోట్ల రుణభారం పడేది.కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మేరకు రుణ సేకరణ జరపలేదు. ఈ విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘చివరి మూడు నెలల అవసరాలను బట్టి రూ.30 వేల కోట్లు అప్పులు అనివార్యమనే ఉద్దేశంతో ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చాం. కానీ అనివార్యం కాకపోవడంతో తీసుకోలేదు. షెడ్యూల్లో పెట్టినా అవసరమైనప్పుడు మాత్రమే బిడ్డింగ్కు వెళ్లే వెసులుబాటు ఆర్బీఐ కలి్పస్తుంది.’అని వెల్లడించారు. -
‘ట్విటర్ పిట్ట’ వేలం.. భారీ ధర పలికిన లోగో
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్(ప్రస్తుతం ‘ఎక్స్’).. ఈ పేరు వినగానే మొదటి గుర్తుకొచ్చేంది దాని ఫేమస్ బర్డ్ లోగో. అదేనండి ‘ట్విటర్ పిట్ట’. ట్విటర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్’గా మార్చి శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత బర్డ్ లోగోను తొలగించారు. ఇప్పుడా బర్డ్ లోగోను వేలానికి ఉంచగా భారీ ధర పలికింది.ట్విటర్ బర్డ్ లోగోను ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 34,375 డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు) అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. 12 అడుగులు 9 అడుగులు (3.7 మీటర్లు 2.7 మీటర్లు) కొలతలు, 560 పౌండ్ల (254 కిలోలు) బరువు ఉన్న ఈ బర్డ్ లోగో 34,375 డాలర్లకు అమ్ముడుపోయిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే కొన్నదెవరనేది మాత్రం వెల్లడించలేదు.ట్విటర్ను 2022లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అయితే, కొనుగోలు తర్వాత ప్రకటనలను నిలుపుకోవడంలో ట్విటర్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఇందులో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్లతో సహా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కితీసుకున్నారు. ట్విటర్ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలన్న లక్ష్యంతో దీన్ని ఆయన ‘ఎక్స్’గా మార్చేశారు.ట్విటర్ను ‘ఎక్స్’గా మార్చేసిన తర్వాత పాత లోగోలు, జ్ఞాపికలు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్వేర్ వంటి పలు వస్తువులను మస్క్ ఇప్పటికే వేలంలో విక్రయించేశారు. ఇలా వేలంలో భారీ ధరలు పలికిన ఇతర టెక్ వస్తువులలో యాపిల్ కంప్యూటర్ సంస్థకు చెందిన పలు వస్తువులు ఉన్నాయి. వీటిలో యాక్సెసరీస్ తో కూడిన యాపిల్ -1 కంప్యూటర్ 3,75,000 డాలర్లు, 1976 లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్కు 1,12,054 డాలర్లు, మొదటి తరం 4 జీబీ ఐఫోన్ 87,514 డాలర్లు ధర పలికాయి. -
రికార్డ్ ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్, రూ.118 కోట్లు
ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. 1950ల నాటి ఈ లెజెండరీ ఆర్టిస్టు మోడ్రన్ ఆర్ట్కు పెట్టింది పేరు.మార్చి 19న న్యూయార్క్లో జరిగిన క్రిస్టీ వేలంలో గతంతో పోలిస్తే రెట్టింపు ధర పలికింది. 2023లో ముంబైలో జరిగిన వేలంలో దాదాపు రూ.61.8 కోట్లు పలికిన పెయింటింగ్ పోలిస్తే 13.8 మిలియన్ల డాలర్లకు (రూ.118 కోట్లకు పైగా) ధర పలికింది. ఇది అత్యంత ఖరీదైన వేలంగా సరి కొత్త రికార్డును సృష్టించింది.గతంలో రికార్డు సృష్టించిన అమృతా షేర్-గిల్ 1937 నాటి "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్ కంటే హుస్సేన్ ఆర్ట్ దాదాపు రెట్టింపు ధర సాధించింది. గతంలో, హుస్సేన్ అత్యంత ఖరీదైన పెయింటింగ్, అన్టైటిల్డ్ (పునర్జన్మ) గత సంవత్సరం లండన్సుమారు రూ. 25.7 కోట్లకు అమ్ముడైంది. ఒకే కాన్వాస్లో దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో 13 ప్రత్యేకమైన చిత్రాలతో'గ్రామ తీర్థయాత్ర' పెయింటింగ్ను తీర్చిదిద్దారు హుస్సేన్. హుస్సేన్ పెయింటింగ్స్లో దీన్ని ప్రముఖంగా పేర్కొంటారు. దీనిపై క్రిస్టీస్ సౌత్ ఆసియన్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ హెడ్ నిషాద్ అవారి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన పనితనానికి కొత్త బెంచ్మార్క్ విలువను నిర్ణయించడంలో తాము భాగం కావడం ఆనందదాయకమన్నారు. ఇదొక మైలురాయి అని ప్రకటించారు.1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిందీ ఈ పెయింటింగ్. ఉక్రెయిన్లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీనిని కొనుగోలు చేశారు. ఎలియాస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోసం థొరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని ఢిల్లీలో స్థాపించారు. వోలోడార్స్కీ 1964లో దీన్ని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్కు అప్పగించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుంది.కాగా 1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు హుస్సేన్. ఇండియాలో టాప్ ఆర్టిస్ట్గా పేరు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కళాకృతులు ఆదరణ సంపాదించాయి. అయితే దేవుళ్ళు , దేవతలపై వేసిన చిత్రాలు వివాదాన్ని రేపాయి. కేసులు, హత్యా బెదిరింపుల నేపథ్యంలో విదేశాల్లో తలదాచుకున్నాడు. 2011 జూన్ 9న 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. -
ఆశా వర్కర్ కుటుంబం వెలి
సంతబోమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు తీరప్రాంత గ్రామంలో సోమవారం గ్రామ పెద్దలు దారుణ నిర్ణయానికి పాల్పడ్డారు. ఓ ఆశావర్కర్ తాము చెప్పినట్టు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని వెలివేశారు. 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు ఏం చెబితే అక్కడ అదే వేదంగా నడుస్తోంది. బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్గా 2014 నుంచి పనిచేస్తోంది.ఇటీవల గ్రామంలోని ఆశ వర్కర్, అంగన్వాడీ పోస్టులకు గ్రామ పెద్దలు వేలం నిర్వహించారు. ఆ మేరకు డబ్బులు ఇచ్చిన వారికి ఆ పోస్టులను అమ్మేశారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టును రూ.2 లక్షలకు ఓ మహిళ దక్కించుకుంది. దీంతో అప్పటి వరకూ పనిచేస్తున్న హరిదేవితో రాజీనామా చేయించారు. ఆశా వర్కర్ పోస్టునూ రూ.1.90 లక్షలకు వేలంలో అమ్మేశారు.అయితే ప్రస్తుత ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎవరూ సాయం చేయకూడదని, శుభకార్యాలకు వెళ్లకూడదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో చంద్రమ్మ మంగళవారం యూనియన్తో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 400 ఎకరాల వేలంపాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలుకు గడువు ఇచ్చింది.కాగా, భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్రావు ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు యత్నిస్తున్నారు. నాడు భూములు అమ్మొద్దని రేవంత్ సుద్దులు చెప్పారు. పీసీసీ చీఫ్గా ఒక మాట.. సీఎం రాగానే మరో మాట అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మొసలి కన్నీరు కార్చారని హరీష్రావు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను అమ్మబోంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ సర్కార్ని హరీష్రావు నిలదీశారు. -
వారి కోసం జుకర్బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్పైకి అద్భుతమైన నీలిరంగు జంప్సూట్లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్సూట్ కూడా ఇలాంటిదేనట. -
రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐ
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.ట్రెజరీ బిల్లులుట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్ వాల్యూ)కు డిస్కౌంట్ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారులకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. -
రూ. 458 కోట్ల 70ఏళ్ల నాటి బెంజ్ కారు ఇదే - ఫోటోలు
-
త్వరలో అతిపెద్ద మోటార్సైకిల్ వేలం: కనిపించనున్న అరుదైన వాహనాలు ఇవే (ఫోటోలు)
-
వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు
తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్డౌన్ వచ్చింది. బోర్ కొట్టి బ్యాట్ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్ ఆక్షన్లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.మొన్నటి ఆదివారం (డిసెంబర్ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్లో మహిళల అండర్–19 ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్–ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్లో పాకిస్తాన్ బ్యాటర్స్ రన్స్ కోసం బాల్ను బాదినప్పుడల్లా వికెట్స్ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్ను ఛేదించే బాధ్యత ఇండియన్స్ది. వికెట్కీపర్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్ పట్టుకొని క్రీజ్ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్ షాట్కు కేరింతలే. మొత్తం 44 రన్స్ చేసిందా అమ్మాయి. లాస్ట్ బంతిని భారీ సిక్స్ కొట్టి ఆట ముగించింది.కౌలాలంపూర్లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ టీమ్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ జట్టు భాగస్వామి అయ్యింది. ఒకేరోజు ఇలా కౌలాలంపూర్లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.మదురై అమ్మాయికమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్డౌన్ వచ్చి ఆమె తండ్రి గుణాలన్ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్ చెయ్ అన్నాడాయన. కమలిని బౌలింగ్ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్ చేసే పిల్లలు లేరు. కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్కింగ్స్ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్–19’లోకి తీసుకున్నారు. విమెన్స్ అండర్ 19 టి 20 కప్లో 8 మేచెస్లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్కు బాల్ని లేపితే బౌండరీ దాటాల్సిందే.తండ్రి అంటే ప్రేమకమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది. -
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ నాడిన్ డి క్లర్క్కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
మినీ వేలం: యువ క్రికెటర్కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్రౌండర్ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్రౌండర్ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నదినె డి క్లర్క్ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్తో పోటీపడీ మరీ డాటిన్ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్తో పాటు ఉక్రెయిన్కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
రైతు భూమి వేలానికి దండోరా
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్కు చెల్లించినా అప్పు తీరలేదు. ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్లో చాటింపు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు.. నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం -
రూ. 2 కోట్ల 12 లక్షలకు...
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్తో జరిగిన సిరీస్లో ఆయన ధరించిన ఈ క్యాప్పై వేలంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్మన్కు ఇదే చివరి సిరీస్ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్మన్ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం. పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్మన్ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్మన్ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది. ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్తో సిరీస్ ముగిశాక బ్రాడ్మన్ క్యాప్ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్లో భారత జట్టు వికెట్ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్ కుమార్ సేన్కు పంకజ్ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్ ఇప్పుడు వేలానికి వచ్చింది. -
సర్కారు వారి పాట!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయినవి, అసంపూర్తిగా ఉన్నవి, ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత తొమ్మిది ప్రాజెక్టులను ఎంపిక చేసింది. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ప్లాట్లకు ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఆస్తులను వేలం వేయనున్నారు. ఇందులో ఒక బీహెచ్కే నుంచి 3 బీహెచ్కే వరకు ఉన్న 760 ఫ్లాట్లు... 200 గజాల నుంచి 2,200 గజాల వరకు ఉన్న 179 ప్లాట్లు.. అసంపూర్తిగా ఉన్న 5 నుంచి 9 అంతస్తుల 6 టవర్లు (ఇళ్ల సముదాయాలు) ఉన్నాయి. అన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా (యథాతథ స్థితిలో) విక్రయించనున్నారు. తర్వాత మిగతా ప్రాజెక్టుల్లోని ఆస్తులను వేలం వేస్తారు. ఈ ఆస్తులు ఎక్కడెక్కడ? ⇒ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పూర్తయినవి, కొన్ని అసంపూర్తివి ఉన్నాయి. బండ్లగూడలో 129 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్ స్థాయిలో ఆగిపోయినవి. ఇక ఇప్పటికిప్పుడు గృహప్రవేశం చేసుకునేలా పంతొమ్మిది 2 బీహెచ్కే ఫ్లాట్లు, పదకొండు 3 బీహెచ్కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ మోడల్ ఫ్లాట్లు కావడంతో వెల్ ఫర్నిష్డ్ కావడం విశేషం. వీటికి కనీస ధర చదరపు అడుగుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. 3 బీహెచ్కే ఫ్లాట్ల ధర రూ.37.23 లక్షల నుంచి రూ.48.51 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. ఇదే తరహాలో మిగతా కేటగిరీల ఫ్లాట్ల ధరలు కూడా ఉంటాయి. ⇒ పోచారంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 255, 2 బీహెచ్కే ఫ్లాట్లు 340, 3 బీహెచ్కే ఫ్లాట్లు 6 ఉన్నాయి. బండ్లగూడ కంటే వీటి ధరలు కొంత తక్కువగా ఖరారు చేశారు. ⇒ కొన్ని ఐదు అంతస్తులు, కొన్ని 9 అంతస్తులతో అసంపూర్తిగా ఉన్న 6 టవర్లను కూడా అమ్మకానికి ఉంచారు. వీటిల్లో ఫ్లాట్లను విడివిడిగా కాకుండా.. మొత్తం భవనాలను గంపగుత్తగా వేలం వేయనున్నారు. ⇒ ఇక చందానగర్లో మూడు భారీ టవర్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన మూడు భారీ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇవి 2 వేల గజాల నుంచి 2,200 చదరపు గజాల వరకు విస్తీర్ణంతో ఉన్నాయి. వీటికి కనీస ధరను గజం రూ.40 వేలుగా నిర్ణయించారు. ⇒ 200 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. నగర శివార్లలోని బహదూర్పల్లిలో 69, తొర్రూరులో 514, భూత్పూరు సమీపంలోని పోతులమడుగులో 111, మహబూబ్నగర్ పట్టణంలో 45 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు. అప్పట్లో రూ.1,940 కోట్లు.. ఈసారి రూ.850 కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2022–23లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్వగృహ ఫ్లాట్లను వేలం వేసింది. అప్పట్లో ప్రభుత్వానికి రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తొలి దఫా వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులలో మిగిలిన ఫ్లాట్లన్నింటినీ వేలంలో ఉంచారు. ఇంతకాలం ఆ ఇళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పుడు అన్నీ అమ్ముడైతే ఈ భారం తగ్గుతుంది. ఇక గతంలో స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన స్థలాలనూ ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. అవి అమ్ముడైతే ఆ ప్రాజెక్టులు కూడా ముగిసిపోయినట్టే. -
మహిళల ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు. గత సీజన్ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథెర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు భారత్కు చెందిన స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది. -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్షోర్ మినరల్ బ్లాక్లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్షోర్ ప్రాంతాలలో మైనింగ్ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్గా ఎదగడమే లక్ష్యం ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు. ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్కతా నైట్ రైడర్స్కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే! గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్కతా నైట్ రైడర్స్. (చదవండి: -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసమే ఏ జట్టయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వెర్రిగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు రూ.27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషభ్ పంత్ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో రూ.26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా... నాలుగు సీజన్లలో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ కోసం కోల్కతా నైట్రైడర్స్ ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతి పెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు రూ.10 కోట్లకంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం. అనూహ్యాలకు వేదికగా నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే తమ రివాజును కొనసాగించింది. అర్ష్ దీప్ సింగ్, బట్లర్, కేఎల్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టొయినిస్, షమీవంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా... చహల్, జేక్ ఫ్రేజర్, ఆర్చర్, జితేశ్ శర్మ, రబాడ, నూర్, అవేశ్ ఖాన్లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది. డికాక్, మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్ను తొలిరోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరం! జిద్దా: ఐపీఎల్–2025 వేలం ఊహించిన విధంగానే కోట్లాది రూపాయల రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అత్యధిక ధరతో అందరికంటే టాపర్గా నిలిచాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ (కోల్కతా; రూ.24 కోట్ల 75 లక్షలు) నెలకొల్పిన అత్యధిక మొత్తం రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. 2024లో కెపె్టన్గా కోల్కతాను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ (రూ.26 కోట్ల 75 లక్షలు) కాస్త తేడాతో రెండో స్థానంలో నిలవగా... వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించి కోల్కతా వెనక్కి తీసుకుంది. భారత ఆటగాళ్లలో అర్ష్ దీప్ సింగ్ తన ప్రస్తుతం టీమ్ పంజాబ్ కింగ్స్కే వెళ్లగా... చహల్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాన్ కిషన్ కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ను గుజరాత్ టైటాన్స్ ఎంచుకోగా... కెరీర్ చివర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ‘హోం’ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లడం విశేషం. సోమవారం కూడా వేలం సాగనుంది. మొత్తం 577 మంది నుంచి మిగిలిన ఆటగాళ్లతో పాటు ఆదివారం అమ్ముడుపోని ఆటగాళ్లు కూడా రెండో రోజు మళ్లీ వేలంలోకి వస్తారు. పంత్ కోసం పోటీపడ్డారిలా...తొలి రోజు ఆరో ఆటగాడిగా రూ. 2 కోట్ల కనీస విలువతో పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుగా తమ ఆసక్తిని చూపించింది. వెంటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ దశలో ఆర్సీబీ వెనక్కి తగ్గగా... సన్రైజర్స్ పోటీకి సిద్ధమైంది. అలా ఇరు జట్ల మధ్య సాగిన సమరం పంత్ విలువను రూ.20 కోట్ల 75 లక్షల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో పంత్ పాత జట్టు ఢిల్లీ అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే లక్నో ఏకంగా రూ.27 కోట్ల మొత్తానికి ప్యాడిల్ ఎత్తడంతో పంత్ విలువ శిఖరానికి వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ ముందుగా... పంత్కంటే ముందు రికార్డు ధరతో శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. 2024 ఐపీఎల్లో కోల్కతాను చాంపియన్గా నిలిపిన కెప్టెన్గా అతని పేరు వచ్చింది. గతంలో ఢిల్లీ టీమ్లో శ్రేయస్ ఆడినప్పుడు కోచ్గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరఫున ముందుగా అతనిపై ఆసక్తిని ప్రదర్శించాడు. ఆపై కోల్కతా, ఢిల్లీ మధ్య పోటీ సాగగా... రూ.25 కోట్ల వద్ద ఢిల్లీ సొంతమైనట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకొచి్చన పంజాబ్ కింగ్స్ చివరకు బిడ్ను ఖాయం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ కోసం హోరాహోరీ... ఐపీఎల్లో 2021–24 మధ్య నాలుగు సీజన్ల పాటు ఆడిన కోల్కతా నైట్రైడర్స్ తరఫునే ఆడిన వెంకటేశ్ అయ్యర్ 49 ఇన్నింగ్స్లలో 137.12 స్ట్రయిక్రేట్తో 1326 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్లలో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడప్పుడు కొన్ని చెప్పుకో దగ్గ ప్రదర్శనలు ఉన్నా... ఒంటి చేత్తో మ్యాచ్ను మార్చగల విధ్వంసకర ఆటగాడైతే కాదు. కానీ అతని కోసం వేలం అసాధారణ రీతిలో సాగింది. కోల్కతా టీమ్ ముందుగా వేలం మొదలు పెట్టింది. లక్నో ముందు ఆసక్తి చూపించినా...ఆ తర్వాత ప్రధానంగా కోల్కతా, ఆర్సీబీ మధ్యే పోటీ సాగింది. ఇరు జట్లు కలిసి రూ. 20 కోట్లు దాటించాయి. కోల్కతా రూ. 23 కోట్ల 75 లక్షలకు చేర్చిన తర్వాత బెంగళూరు స్పందించలేదు. డేవిడ్ వార్నర్కు నిరాశ!పట్టించుకోని ఫ్రాంచైజీలుఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు, 184 మ్యాచ్లలో 6565 పరుగులతో అత్యధిక స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానం, ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించిన రికార్డుతో పాటు కెపె్టన్గా సన్రైజర్స్కు టైటిల్ అందించిన ఘనత! ఇలాంటి ఘనాపాటి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... అతనేమీ ఆటకు దూరమై చాలా కాలం కాలేదు. ఇటీవల టి20 వరల్డ్కప్ ఆడి చురుగ్గా ఉన్న వార్నర్లో ఇప్పటికీ ఈ ఫార్మాట్లో చెలరేగిపోగల సత్తా ఉంది.వేలంలో కొందరు అనామక ఆటగాళ్ల కోసం సాగిన పోటీ చూస్తే వార్నర్ కనీస విలువ రూ.2 కోట్లకు కూడా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అనూహ్యం. గత సీజన్లో పూర్తిగా విఫలం కావడం వేలంపై ప్రభావం చూపించి ఉండవచ్చు. తొలి రోజు 12 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తిరస్కరించగా అందులో వార్నర్, బెయిర్స్టో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆటగాళ్లు కాగా... ప్రస్తుతం భారత టెస్టు టీమ్లో ఉన్న దేవదత్ పడిక్కల్పై పెద్దగా అంచనాలు లేవు. మిగిలిన 9 మందిలో పీయూష్ చావ్లా తప్ప ఇతర ఆటగాళ్లు అనామకులే. అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాచెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశ్విన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) గుజరాత్ టైటాన్స్ బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కోల్కతా నైట్రైడర్స్ వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) మర్కండే (రూ. 30 లక్షలు) లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) ఆర్యన్ జుయాల్ (రూ.30 లక్షలు) ముంబై ఇండియన్స్ ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్వెల్ (రూ.4.20 కోట్లు) వైశాక్ విజయ్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) రాజస్తాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) కార్తికేయ (రూ.30 లక్షలు) బెంగళూరు హాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) లివింగ్స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) సన్రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) మనోహర్ (రూ.3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జిత్ సింగ్ (రూ.1.50 కోట్లు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) టాప్–20 (రూ.10 కోట్లు, అంతకుమించి) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) శ్రేయస్ (రూ.26.75 కోట్లు) వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) హాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా... ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం రూ.467.95 కోట్లను జట్లు వెచ్చించాయి. -
చరిత్ర సృష్టించిన గాజు కిటికీ
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది. 24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు. అలంకార, సౌందర్య కళల్లో లూయిస్ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు. 16 అడుగుల కళాఖండం సోమవారం న్యూయార్క్లోని సోత్బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్తోపాటు బ్రిటన్లోని లండన్, ఫ్రాన్స్లోని పారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్కు గట్టి టేప్తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్తో ఫ్రేమ్కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ 457 మంది పేర్లు చకచకా...
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి. వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు. తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్గా వ్యవహరించింది. మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. -
Pushpa The Rule: వేలం ద్వారా 'పుష్ప 2' టికెట్.?
-
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్లింక్, క్విపర్ శాట్కామ్ బ్యాండ్విడ్త్ అధికమని తెలిపింది.శాట్కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్లింక్, క్విపర్, ఇతరత్రా శాట్కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
విలువ తెలియక డోర్స్టాప్గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్పై పేపర్వెయిట్గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్గా మారుతున్నాయి. ఇటీవల వైరల్గా మారిన ఓ మీమ్కు సంబంధించి ఇలొన్మస్క్ స్పందించారు.ఎక్స్లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణమంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం. -
HIL: విక్టర్కు రూ. 40 లక్షలు
ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలవుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు సంబంధించి పురుషుల విభాగం వేలం కార్యక్రమం సోమవారం ముగిసింది. రెండో రోజు బెల్జియం స్టార్ మిడ్ఫీల్డర్ విక్టర్ వెగ్నెజ్కు అత్యధికంగా రూ. 40 లక్షలు లభించాయి. బెల్జియం జట్టులో కీలక సభ్యుడువిక్టర్ను పంజాబ్కు చెందిన సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసింది. 28 ఏళ్ల విక్టర్ బెల్జియం తరఫున ఇప్పటి వరకు 175 మ్యాచ్లు ఆడాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన బెల్జియం జట్టులో, 2018 ప్రపంచకప్ సాధించిన బెల్జియం జట్టులో విక్టర్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. మన వాళ్లకు ఎంతంటే?నెదర్లాండ్స్కు చెందిన థియరీ బ్రింక్మన్, ఆర్థుర్ వాన్ డోరెన్లను కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రూ. 38 లక్షలకు, రూ. 32 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాడు మొరాంగ్థిమ్ రబిచంద్రను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది.భారత్కే చెందిన అంగద్బీర్ సింగ్ను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 26 లక్షలకు... హైదరాబాద్ తూఫాన్స్ జట్టు రాజిందర్ను రూ. 23 లక్షలకు కైవసం చేసుకుంది. -
వేలానికి 1983 నాటి యాపిల్ ప్రోటోటైప్
ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. ఆ ప్రోటోటైప్ ద్వారానే వస్తువు పనితీరు ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత, ప్రోటోటైప్స్ నిరుపయోగమవుతాయి. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు లేదా వ్యక్తులు వేలంలో విక్రయిస్తాయి. ఆసక్తికలిగిన వారు భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటారు. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ 'మాకింతోష్ #ఎమ్001' (Apple Macintosh Prototype #M0001) ఇప్పుడు వేలానికి వచ్చిందియాపిల్ మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ అక్టోబర్ 23 వరకు న్యూయార్క్లోని బోన్హామ్స్లో వేలానికి ఉంటుంది. ఇది సుమారు 120000 డాలర్లకు (రూ. 1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన పురాతన యాపిల్ ఉత్పత్తులలో #ఎమ్001 ప్రోటోటైప్ కూడా ఒకటిగా మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది.మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ నాలుగు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ.. ఇది మంచి స్థితిలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తులను వేలంలో విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి ఓ ప్రోటోటైప్ను 150075 డాలర్లకు విక్రయించారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్కంప్యూటర్లు మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, జెఫ్ రాస్కిన్ సంతకం చేసిన 128కే మాకింతోష్ మదర్బోర్డ్ 2021లో 132049 డాలర్లకు అమ్ముడైంది. ఆ తరువాత స్టీవ్ జావ్స్ ఉపయోగించిన మాకింతోష్ ఎస్ఈ కంప్యూటర్ను 126375 డాలర్లకు వేలంలో విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు
హైదరాబాద్, సాక్షి: నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్లో గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు ఓ భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు.. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ వేలంపాటలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఎంత దక్కించుకుంటుందో అనే చర్చ నడుస్తోంది. -
వందేళ్ల తర్వాత వేలానికి
కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం.. డెన్మార్క్కు చెందిన లార్స్ఎమిల్ బ్రూన్ (ఎల్.ఇ.బ్రూన్) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్ న్యూమిస్మాటిక్ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు. వింత వీలునామా.. ‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్ డానిష్ కాయిన్ అండ్ మెడల్ కలెక్షన్ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది ముగిసిన గడువు.. వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్ బోవర్స్ తెలిపింది. బ్రూన్ కలెక్షన్ 500 మిలియన్ డానిష్ క్రోనర్ లేదా సుమారు 72.5 మిలియన్ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది. అత్యంత ఖరీదైన కింగ్ హాన్స్ నాణెం.. సెప్టెంబర్ 14 న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్లాట్.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్ హాన్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్లో, స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్హాగన్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!
మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. నిమిషాలు కరిగిపోతున్నాయంటూ బాధపడుతోంది. అంతేగాదు తనతో గడిపే కొత్త వ్యక్తులు ఉంటే రండి అంటూ తనతో స్పెండ్ చేసే సమయాన్ని వేలం పాట వేస్తుంది. ఏంటిదీ అనుకుంటున్నారా..?. నయం చేయలేని ఈ వ్యాధి తనను మింగేసేలోపే జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా వ్యక్తులతో గడపాలని కోరుకుంటోంది. ఆమె ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..!అసలేం జరిగిందంటే..32 ఏళ్ల ఎమిలీ లాహే అత్యంత అరుదైన నట్ కార్సినోమాతో బాధపడుతోంది. ఈ కేన్సర్ శరీరంలో మెడ, తల, ఊపరితిత్తుల్లో ఎక్కడైన రావొచ్చు. ఇది చికిత్సకు లొంగని కేన్సర్. అందువల్లే దీన్ని టెర్మినల్ కేన్సర్ అంటారు. అంటే తగినంతగా చికిత్స చేయలేని వ్యాధి అని అర్థం. ఆయుర్దాయం లేదని లేదా ఎక్కువ రోజుల మనుగడ సాధించని పరిస్థితి టెర్మినల్ కేన్సర్ అంటారు. దీంతో తనకు ప్రతి క్షణం విలువైనవి అంటోంది లాహే. మనిషి సాధారణంగా వర్తమానం తప్పించి భూత, భవిష్యత్తుల గురించి ఆలోచింస్తుంటాడు. కానీ ఈ వ్యాధి సదా వర్తమానంలో ఉండకపోతే క్షణాలు ఆవిరిపోతాయనే ఒక పాఠాన్నినేర్పిందని చెబుతోంది. అందుకే తన చివరి క్షణాలను కూడా ఆనందంగా జీవించాలని భావిస్తోంది. అందుకే ఆ క్షణాలను కొత్త వ్యక్తులతో గడిపేందుకు ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం తనకు అత్యంత అమూల్యమైనదని చెబుతోంది. కన్నీళ్ల తెప్పిస్తున్న లాహే మాటలన్ని అక్షర సత్యం. జీవితం క్షణభంగురం అని చెప్పకనే చెబుతోంది. అందుకు ఇప్పుడే చనిపోతాం అనుకుని జీవిస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రవర్తిస్తారేమో!. నిజానికి లాహే ఈ వ్యాధి నిర్ధారణ కాకమునుపు వరకు ప్రతి రోజు ఐదు నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తేది. మంచి జీవనశైలిని అనుసరించేది. అసలు తను ఇలాంటి వ్యాధి బారిన పడతానని భావించలేదు కూడా. తాను మొదట్లో దీర్ఘకాలిక సైనసైటిస్, తలనొప్పిని అనుభవించింది. ఆ తర్వాత చూపుని కోల్పోవడం వంటి లక్షణాలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇది కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలకు స్పందించదు. దీంతో జన్యు సంబంధిత ప్రయోగాత్మక చికిత్స చేయాలనుకున్నారు వైద్యులు. అందుకు ప్రభుత్వ మద్దతు లభించడంలో ఎదురైనా అలసత్వం ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేలా చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటోంది. ఇక్కడ కేన్సర్ తమ ప్రియమైన వారిని ఎన్నటికీ దూరం చేయలేదు. ఎందుకంటే..? వారితో గడిపే అమూల్యమైన క్షణాలు గొప్ప జ్ఞాపకాలని అందిస్తాయని భావోద్వేగంగా చెబుతోంది లాహే. . ఇక్కడ లాహే ఉద్వేగభరితమైన అనుభవం కేన్సర్ వ్యాధులపై మరింతగా పరిశోధనలు చేసే ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది. కాగా, ఆస్ట్రేలియా ఆరోగ్య సంస్థ ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50% మాత్రేమ కానీ 2010కి వచ్చేటప్పటికీ 70%గా ఉంది. చెప్పాలంటే రోగ నిర్థారణ తర్వాత బాధితులు ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. అంతేగాదు ఆస్ట్రేలియన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అరుదైన కేన్సర్లని నయం చేసేలా కొంగొత్త పరిశోధనలకు మద్దతు ఇస్తుండటం గమనార్హం. (చదవండి: దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!) -
ఈ మంగళవారం మరో రూ. 3 వేల కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. 27న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 12 వేల కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి మొత్తం రూ. 15 వేల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 22 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనుంది.రూ. 2,500 కోట్లు సర్దుబాటుసీఏజీ ద్వారా విదేశీ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్లకు సార్వత్రిక ఎన్నికల ముందే వైఎస్ జగన్ సర్కారు పరిష్కారం కనుగొంది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ ఏడాది జనవరి నుంచి సీఏజీతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఉమ్మడి ఏపీలో విదేశీ ప్రాజెక్టుల రుణాల చెల్లింపులన్నీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తూ వస్తోంది. తెలంగాణ వాటాను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రూ. 2,500 కోట్లు రావాల్సి ఉందని సీఏజీ గత జనవరిలోనే తేల్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ నుంచి రావాల్సిన ఆ నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ రూ. 2,500 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గురువారం సర్దుబాటు చేసింది. -
ప్రొ కబడ్డీ లీగ్లో 118 మంది
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్ను దక్కించుకుంది. జై భగవాన్ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్రౌండర్ గుర్దీప్ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. -
PKL: సచిన్కు రూ. 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్కు చెందిన సచిన్ తన్వర్పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది. గత సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి. చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్రౌండర్ పవన్ సెహ్రావత్తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. -
PKL Auction: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ సహా పూర్తి వివరాలు
పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ ఎడిషన్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆగష్టు 15, 16 తేదీల్లో ప్లేయర్ల వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్లో భాగమైన పన్నెండు ఫ్రాంఛైజీలు.. అంతా కలిపి 88 మంది ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.అయితే, అనూహ్య రీతిలో ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా తదితర స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొననుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా, వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పర్సులో మిగిలి ఉన్న మొత్తం, వేలం ఆరంభ సమయం, లైవ్స్ట్రీమింగ్ ఎక్కడ తదితర వివరాలు మీకోసం..పన్నెండు జట్లు ఇవేతెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యూ ముంబా, యూపీ యోధాస్.రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతెలుగు టైటాన్స్అంకిత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, సంజీవి ఎస్, నీల్, శంకర్ భీమ్రాజ్ గడాయ్, అజిత్ పాండురంగ పవార్.బెంగాల్ వారియర్స్శ్రేయాస్ ఉమర్దండ్, ఆదిత్య ఎస్ షిండే, దీపక్ అర్జున్ షిండే, మహరుద్ర గార్జే, నీల్, విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్.బెంగళూరు బుల్స్ఆదిత్య శంకర్ పవార్, అక్షిత్, అరుల్అనంతబాబు, ప్రతీక్, సౌరభ్ నందాల్, పొన్పార్తీబన్ సుబ్రమణియన్, సుశీల్, రోహిత్ కుమార్.దబాంగ్ ఢిల్లీఆశిష్, హిమ్మత్ అంతిల్, మనూ, యోగేశ్, నీల్, అన్షు మాలిక్, విక్రాంత్, నవీన్ కుమార్.గుజరాత్ జెయింట్స్నితిన్, ప్రతీక్ దహియా, రాకేశ్,బాలాజీ డి, జితేందర్ యాదవ్.హర్యానా స్టీలర్స్జయసూర్య ఎన్ఎస్, హర్దీప్, శివం అనిల్ పటారే, విశాల్ ఎస్ టాటే, జైదీప్, మోహిత్, వినయ్, రాహుల్ సేత్పాల్, ఘనశ్యామ్ రోకా మగర్.జైపూర్ పింక్ పాంథర్స్అభిజీత్ మాలిక్, అంకుశ్, అభిషేక్ కేఎస్, అర్జున్ దేశ్వాల్, రెజా మీరాఘెరిపట్నా పైరైట్స్అబినంద్ శుబాంశ్, కునాల్ మెహతా, సుధాకర్ ఎమ్, మనీశ్, అంకిత్, సందీప్ కుమార్.పుణెరి పల్టన్దదాసో శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తాత్రేయ అధావడె, వైభవ్ బాలాసాహెబ్ కాంబ్లీ, ఆదిత్య తుషార్ షిండే, ఆకాశ్ సంతోశ్ షిండే, మోహిత్ గయత్, అస్లాం ముస్తఫా ఇనాందార్, పంకజ్ మోహితే, సంకేత్ సెహ్రావత్, అబినేశ్ నదరాజన్, గౌరవ్ ఖత్రీ.తమిళ్ తలైవాస్నితేశ్ కుమార్, నితిన్ సింగ్, రొనాక్, విశాల్ చహల్, నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం. అభిషేక్, నీల్.యూ ముంబాబిట్టు, గోకులకన్నన్ ఎం, ముకిలన్ షణ్ముగం, సోంవీర్, శివం, అమీర్ మొహ్మద్ జఫార్దనేశ్, రింకూ.యూపీ యోధాస్గగన గౌడ హెచ్ఆర్, హితేశ్, శివం చౌదరి, సుమిత్, సురేందర్ గిల్, అశూ సింగ్, నీల్.ఒక్కో జట్టులో ఎంత మంది?కనీసం 18 నుంచి అత్యధిక 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండవచ్చు. ఇప్పటికి 88 మందిని ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి గనుక 212 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.ఎంత మంది విదేశీ ఆటగాళ్లు?ఒక్కో జట్టులో కనీసం రెండు, అత్యధికంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు.టీమ్ పర్సు వివరాలుఒక్కో ఫ్రాంఛైజీ రూ. 5 కోట్ల మేర పర్సు వాల్యూ కలిగి ఉంటుంది. అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం పోగా.. మిగిలిన డబ్బుతో వేలంలో పాల్గొంటాయి.సీజన్-11 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీల పర్సులో మిగిలి ఉన్న మొత్తం👉బెంగాల్ వారియర్స్'- రూ. 3.62 కోట్లు👉బెంగళూరు బుల్స్- రూ. 3.02 కోట్లు👉దబాంగ్ ఢిల్లీ- రూ. 2.66 కోట్లు👉గుజరాత్ జెయింట్స్- రూ. 4.08 కోట్లు👉హర్యానా స్టీలర్స్- రూ. 2.32 కోట్లు👉జైపూర్ పింక్ పాంథర్స్- రూ. 2.29 కోట్లు👉పట్నా పైరేట్స్- రూ. 3.59 కోట్లు👉పుణెరి పల్టన్- రూ. 2.12 కోట్లు👉తమిళ్ తలైవాస్- రూ. 2.57 కోట్లు👉తెలుగు టైటాన్స్- రూ. 3.82 కోట్లు👉యు ముంబా- 2.88 కోట్లు👉యూపీ యోధాస్- 3.16 కోట్లు.నాలుగు కేటగిరీలు👉‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు👉‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. 👉‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు👉‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధర 👉ఈ సారి వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననున్నారు.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?ఆగష్టు 15 రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం(టీవీ). డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: అర్షద్ నదీమ్పై కానుకల వర్షం.. ఘన సత్కారం -
రూ. 60 లక్షల ప్లాట్కు రూ.30 కోట్ల బిడ్!
ఉత్తర ప్రదేశ్లోని మధుర నగరంలో ప్లాట్ల వేలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ (MVDA) నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో బేస్ ధరలను మించి భారీ మొత్తానికి బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.గురువారం ప్రారంభమైన వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు బిడ్డింగ్కు వచ్చాయి. వాటిలో బృందావన్లోని రుక్మణి విహార్లో ఉన్న 300 చదరపు గజాల స్థలం అసలు ధర రూ. 60 లక్షలు. అయితే, ఈ-వేలంలో బిడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్లాటు రూ.30 కోట్లు పలికింది.వేలం ముగింపును పరిశీలించగా రూ. 60 లక్షల విలువైన ప్లాట్కు రూ. 30 కోట్లతో పాటు, మరో 288 చదరపు మీటర్ల ప్లాట్ రూ. 19.11 కోట్లు పలికింది. ఈ అసారణ బిడ్లు ఎంవీడీఏ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బిడ్డింగ్లు ఎవరు వేశారు.. ఎంత పెద్ద మొత్తంలో బిడ్ వేయడానికి కారణాలేంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. సహేతుకమైన స్థాయిలకు మించి ధరలను పెంచడం ద్వారా నిజమైన కొనుగోలుదారులను ప్లాట్లను కొనుగోలు చేయకుండా వేలం ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ఈ అధిక బిడ్లను వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
IPL 2025: రోహిత్ శర్మ కోసం ఆ జట్ల మధ్య పోటీ!
కెప్టెన్గా ఐదు ట్రోఫీలు.. ఓవరాల్గా 6628 పరుగులు... ఇందులో రెండు సెంచరీలు.. 43 హాఫ్ సెంచరీలు.. 599 ఫోర్లు.. 280 సిక్సర్లు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ ఇది. దక్కన్ చార్జర్స్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. తర్వాత ముంబై ఇండియన్స్కు మారాడు.తన అద్భుతమైన ఆట తీరుతో హిట్మ్యాన్గా ఎదిగి.. భారత జట్టు సారథిగానూ పగ్గాలు చేపట్టాడు. అయితే, గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్తో అతడి అనుబంధం బీటలు వారిందనే వార్తలు వచ్చాయి. గతేడాది రోహిత్ను కెప్టెన్గా తొలగించి.. అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంతో వీటికి బలం చేకూరింది.ఈ క్రమంలో వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో.. ఈ టీ20 వరల్డ్ప్ విన్నింగ్ కెప్టెన్ను దక్కంచుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడటం ఖాయం.ముఖ్యంగా మూడు జట్లు ఇప్పటి నుంచే రోహిత్పై కన్నేసినట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ జట్టు ఏవి? వాటికి రోహిత్ అవసరం ఎంత?!లక్నో సూపర్ జెయింట్స్అరంగేట్ర సీజన్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని ఈ జట్టు 2023లోనూ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమైంది.పద్నాలుగింట కేవలం ఏడు మ్యాచ్లు గెలిచి.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సీజన్ను ముగించింది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ, కెప్టెన్ రాహుల్ మధ్య విభేదాలు తలెత్తాయని.. రాహుల్ ఆర్సీబీ వైపు చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.ఒవకేళ అదే జరిగితే లక్నో కెప్టెన్తో పాటు.. ఓపెనర్నూ కోల్పోతుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయగల బెస్ట్ ఆప్షన్ రోహిత్ శర్మనే అవుతాడు మరి!ఢిల్లీ క్యాపిటల్స్ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జట్టును ప్రక్షాళన చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్గా రిక్కీ పాంటింగ్ను తొలగించింది. అంతేకాదు కెప్టెన్ రిషభ్ పంత్ను కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పంత్.. చెన్నై సూపర్ కింగ్స్లో చేరబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీని వీడితే.. ఆ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మ వైపే చూస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీకి రోహిత్ వస్తే బహుశా ఆ లోటు తీరొచ్చేమో!పంజాబ్ కింగ్స్ఐపీఎల్లో ఇంత వరకు ట్రోఫీని ముద్దాడని మరో జట్టు పంజాబ్ కింగ్స్. పవర్ హిట్టర్లు ఉన్నా .. ఆఖరి నిమిషంలో అవకాశాలు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటే.దీనికి ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే అని చెప్పవచ్చు. కెప్టెన్ల విషయంలో ఇక్కడ నిలకడే లేదు. ఈ ఏడాది కూడా ఇద్దరు సారథ్యం వహించారు.శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరం కాగా.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే, ఆరంభంలో బాగానే రాణించినా పంజాబ్ జట్టు.. తమ పాత కథను పునరావృతం చేస్తూ.. ఏడు విజయాలతో ఆరో స్థానానికే పరిమితమైంది.ఫలితంగా శిఖర్ ధావన్తో పాటు ఖరీదైన ఆటగాడైన సామ్ కర్రన్ను కూడా వదిలించుకోవాలని పంజాబ్ ఫ్రాంఛైజీ ఫిక్సైనట్లు వినికిడి. ఒకవేళ రోహిత్ శర్మను దక్కించుకుంటే వారికి అంతకంటే మంచి కెప్టెన్ దొరకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: 'బుమ్రా, బ్రెట్లీ కాదు.. క్రికెట్ చరిత్రలో అతడిదే బెస్ట్ యార్కర్' -
గంటా ఆస్తులు వేలానికి పెట్టిన ఇండియన్ బ్యాంక్
-
బ్యాంక్కు బురిడీ.. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు. -
అపుడు రాజును బతికించిన ఐకానిక్ తుపాకీలు : ఇపుడు వేలంలో కోట్లు
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్ను ఆక్రమించుకున్నాడు. దీంతో అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్ చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ ఈ సారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్లోని ఫోంటైన్బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్ హౌస్లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ పిస్టల్స్ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి తెలిపారు.ఈ పిస్టల్స్ స్పెషాల్టీ ఏంటి? ఈ రెండు ఐకానిక్ తుపాకులను చక్రవర్తి నెపోలియన్ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు. వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ సమాచారం ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్కోర్ట్ తుపాకీలోని పౌడర్ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట. -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: ఈసారి టెలికం స్పెక్ట్రం వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం రూ. 96,238 కోట్ల బేస్ ధరతో 800 మెగాహెట్జ్ నుంచి 26 గిగాహెట్జ్ బ్యాండ్విడ్త్లో 10 గిగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. ఏడు రౌండ్లలో 141.4 మెగాహెట్జ్ మాత్రమే అమ్ముడైంది. టెల్కోలు సుమారు రూ. 11,340.78 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేశాయి. ప్రధానంగా గడువు తీరిపోతున్న స్పెక్ట్రంను రెన్యువల్ చేసుకోవడం, కవరేజీని పెంచుకునేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లోనే కొనుగోలు చేసేందుకు టెల్కోలు ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా స్పెక్ట్రం కొనుగోలు చేసింది. తొలిరోజైన జూన్ 25న (మంగళవారం) అయిదు రౌండ్లు జరగ్గా, రెండో రోజున పెద్దగా స్పందన లేకపోవడంతో వేలం ముగిసినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.టెల్కోలు తమ సర్వీసులను కొనసాగించడంతో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు కూడా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈసారి విక్రయానికి ఉంచిన స్పెక్ట్రంలో 12 శాతానికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత వేలంలోనే టెల్కోలు గణనీయంగా స్పెక్ట్రం తీసుకోవడంతో నిర్దిష్ట బ్యాండ్లకు ఈసారి పెద్దగా డిమాండ్ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్లపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలం బ్లాక్బస్టర్గా నిల్చింది. అప్పట్లో ఏడు రోజులు సాగిన వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను టెల్కోలు కొనుగోలు చేశాయి. జియో అత్యధికంగా రూ. 88,078 కోట్లతో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది. ఎయిర్టెల్ రూ. 6,857 కోట్ల బిడ్.. భారతీఎయిర్టెల్ అత్యధికంగా రూ.6,856.76 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 3,510 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 973.6 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఎయిర్టెల్ 97 మెగాహెట్జ్, వీఐఎల్ 30 మెగాహెట్జ్, జియో ఇన్ఫోకామ్ 14.4 మెగాహెట్జ్ దక్కించుకున్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైనంత స్పెక్ట్రంను సమకూర్చుకుంటామని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.బిహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలో 1,800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. నిర్దిష్ట మార్కెట్లలో స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. -
కష్టాల గనిలో రాజేష్
-
రేపు 60 బొగ్గు బ్లాకుల వేలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ఒక బొగ్గు గని, ఒడిశాలోని 16, ఛత్తీస్గఢ్ 15, మధ్యప్రదేశ్ 15, జార్ఖండ్ 6, పశ్చి మబెంగాల్ 3, బిహార్లోని 3, మహారాష్ట్రలోని ఒక బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. ఈ నెల 21న హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమంటూ.. బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర బొగ్గు శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ వేలంలో 60 బొగ్గు బ్లాక్లను వేలం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి. 10వ రౌండ్లో మొత్తం 60 బొగ్గు గనులు ఉండగా.. అందులో 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా అన్వేషణ జరిగింది.వేలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారికి సమాన అవకాశం ఉంటుంది. సొంత వినియోగం, విక్రయం సహా వివిధ ప్రయోజనాల ను పొందవచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవు..’’అని పేర్కొంది. సులభతర వాణిజ్యం కోసం, బొగ్గు గనుల సత్వర నిర్వహణకు వీలుగా వివిధ అనుమతులు పొందేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ పోర్టల్ను రూపొందించినట్టు తెలిపింది. -
ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!
ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు. 55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్లో కుక్గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్లోని 37 నార్ఫోక్ టెర్రేస్లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.(చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
పక్షి ఈక 23.66 లక్షలు
ఒక పక్షి ఈక విలువెంత? సున్నా అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడినట్లే. న్యూజిలాండ్లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007(28,417డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్లోని వెబ్స్ వేలం కేంద్రంలో తాజాగా వేలం వేశారు. ఔత్సాహికుడొకరు సొంతం చేసుకున్నారు. ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచి్చపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. హుయిమా పక్షలు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో కనిపించినట్లు నిర్ధారణ అయ్యింది. -
స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ
మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలించింది. టెలికాం డిపార్ట్మెంట్ తాజాగా ప్రచురించిన వివరాల ప్రకారం.. రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం ధరావతు సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.టెలికమ్యూనికేషన్స్ విభాగం విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం.. భారతి ఎయిర్టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 300 కోట్ల విలువైన మనీ డిపాజిట్ను సమర్పించాయి. కంపెనీలు డిపాజిట్ చేసిన ఈఎండీ మొత్తం ఆధారంగా పాయింట్లను పొందుతాయి. ఇది వారికి కావలసిన సర్కిల్ల సంఖ్య, స్పెక్ట్రమ్ పరిమాణానికి వేలం పాడేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే వేలం దక్కించుకునేందకు అంత సామర్థ్యం ఉంటుంది.రిలయన్స్ జియో ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని స్పెక్ట్రమ్ వేలంలో చార్ట్లో ముందుంది. జియో నెట్వర్త్ రూ.2.31 లక్షల కోట్లు కాగా, ఎయిర్టెల్ నెట్వర్త్ రూ.86,260.8 కోట్లు. ఇక వొడాఫోన్ ఐడియా నెట్వర్త్ విషయానికి వస్తే రూ. 1.16 కోట్ల వద్ద ప్రతికూల జోన్లో ఉంది.జూన్ 6 నుంచి సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల పాటు కేటాయిస్తారు. దక్కించుకున్న బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ను పదేళ్ల తర్వాత సరండర్ చేసే అవకాశం ఉంటుంది. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు. -
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్కు అప్పగించారు. -
ఆ ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ సిమ్ వేలంలో..ఏకంగా అన్ని కోట్లా..!
ప్రత్యేక సీరిస్తో కూడిన నెంబర్లతో కూడిన ఫోన్ నెంబర్లకు, నంబర్ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నెంబర్ సీరీస్తో కూడిన ఫోన్లు, కార్లు సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎంత డభైనా ఖర్చుపెడతారు. అలానే ఓ ప్రత్యేక సిరీస్తో కూడిన మొబైల్ సిమ్ని వేలం వేయగా ఎన్ని కోట్లు పలికిందో వింటే కంగుతింటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆ ఫ్యాన్సీ నెంబర్ సిరీస్కి తగ్గట్టుగా ధరకు అమ్ముడుపోతే ఇది కలా నిజమా అనిపిస్తుంది. అలాంటి సన్నివేశమే ఇక్కడ చోటుచేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందంటే..?దుబాయ్ ఛారిటీ వేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ది మోస్ట్ నోబుల్ నంబర్స్ ఏడు సిరీస్తో ఉన్న ఉన్న సిమ్ 058-7777777 వేలంలో ఏకంగా ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. ఆ సిమ్ నెంబర్ సంఖ్యలోనే ధర కూడా అనూహ్యంగా పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి వేలాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ రషీద్ అల్ ముక్తూమ్ ప్రారంభించారు. దీన్ని దాదాపు రూ. 100 కోట్ల మదర్స్ ఎండోమెంట్ ప్రచారానికి మద్దుతుగా ఇలా పది నెంబర్ల ఫ్యాన్సీ కార్ల నెంబర్ ప్లేట్లు, 21 ప్రత్యేకమైన మొబైల్ నెంబర్లను వేలం వేస్తున్నారు. అయితే ఇంతవరకు వేలంలో చాలా నెంబర్లు కోట్లలో అమ్ముడుపోయినా.. ఈ 7 నెంబర్ సిరీస్తో ఉన్న సిమ్పై మాత్రం తీవ్ర ఉత్కంఠ పోటీ తలెత్తింది. ప్రారంభంలోనే రూ. 22 లక్షల నుంచి మొదలై ఏకంగా చివరి రూ. 7 కోట్లకు అమ్ముడు పోడం విశేషం. అలాగే ఈ 5 సీరిస్(054-5555555) సిమ్పై కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ సీరిస్ కూడా వేలంలో ఏకంగా రూ. 23 కోట్ల వరకు పలకడం విశేషం. మొత్తం ఈ ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన మొబైల్ నెంబర్లు వేలంలో దాదాపు రూ. 86 కోట్లు దాకా వసూలు చేశాయి. అలాగే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు కూడా ఈ వేలంలో రూ 65 కోట్లు దాక పలికాయి. గతేడాది కూడా ఇలా ఫ్యాన్సీ సిరీస్తో కూడిన నెంబర్ ప్లేట్లు ఏకంగా రూ. 124 కోట్లు పలికి దుబాయ్ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సంపద బాగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులకు పూనుకుంటారు. ఇదొక పిచ్చి, డబ్బు దుర్వినియోగం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. In Dubai, a sim card with a unique phone number was sold for AED 3.2 Million ($871,412) in auction pic.twitter.com/lYQoW2OxZj — Historic Vids (@historyinmemes) April 2, 2024 (చదవండి: ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!) -
సెక్యూరిటీ బాండ్ల వేలం.. మరో రూ.1,000 కోట్లు అప్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల తొలి అప్పు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం ఈ మేరకు రుణం తీసుకోనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్లకు పైగా నిధులను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం రూ.40వేల కోట్లకు పైగా రుణ సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా, ఆ పద్దు దాదాపు రూ.50 వేల కోట్లకు చేరడం గమనార్హం. డిసెంబర్ నుంచి రూ.13 వేల కోట్లకు పైమాటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు రూ.13 వేల కోట్లు దాటింది. డిసెంబర్ 7 నుంచి మార్చి 31 వరకు తొమ్మిది దఫాల్లో బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సమీకరించింది. గత ఏడాది డిసెంబర్ 12న రూ. 500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, ఈ ఏడాది జనవరి 16న రూ.2,000 కోట్లు, అదే నెల 23న రూ.1,000 కోట్లు, ఫిబ్రవరి ఆరో తేదీన రూ.2,000 కోట్ల రుణాలను తీసుకుంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో చివరి మాసమైన మార్చిలో నాలుగు దఫాల్లో రూ.6,718 కోట్లకు పైగా రుణాలను సమీకరించింది. మార్చి ఐదో తేదీన రూ.2,000 కోట్లు, అదే నెల 12న మరో రూ.2,000 కోట్లు, 19న రూ.1,000 కోట్లు, చివరిగా మార్చి 26న రూ.1,718 కోట్ల అప్పులు తీసుకుంది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం (జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో రూ.11,718 కోట్ల రుణం సమకూర్చుకుంది. కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.36,536.01 కోట్ల రుణాలు తీసుకుంది. ఆ తర్వాత తీసుకున్న అప్పులతో కలిపితే ఈ మొత్తం రూ.48 వేల కోట్లకు చేరడం గమనార్హం. ఈ నెలలో మరో రూ.4 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంలో రూ.16 వేల కోట్ల రుణాలను తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనున్న రుణాల వివరాలను ఆర్బీఐ మార్చి 28న వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఏప్రిల్ 2న రూ.1,000 కోట్లు, 8, 23 తేదీల్లో రెండు దఫాలుగా రూ.2 వేల కోట్ల చొప్పున ఒక్క నెలలో రూ.5 వేల కోట్లు తీసుకోనుంది. మే నెలలో 7, 14, 28 తేదీల్లో మూడు దఫాలుగా రూ.6 వేల కోట్లు, జూన్ 4వ తేదీన రూ.1000 కోట్లు, 11, 25 తేదీల్లో రెండు దఫాలుగా రూ.4 వేల కోట్లను అప్పుగా తీసుకోనుంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున రూ.5 వేల కోట్ల వరకు అప్పులను సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఒక్క నిమ్మకాయ ఖరీదు రూ.50 వేలు, స్పెషల్ ఏంటంటే?
అసలే ఎండాకాలం నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా నిమ్మకాయల ధరలు వేడిగానే ఉన్నాయి. ఒక నిమ్మకాయ పది రూపాయలంటేనే కొనుగోలుదారుడు ఓ అడుగు వెనక్కి వేస్తాడు. కానీ తమిళనాడులో మాత్రం తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇంత ధరకు అమ్ముడు పోవడానికి కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ (సుబ్రమణ్య స్వామి) దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. ఇందులో తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున బల్లెముపై ఉన్న నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఈ నిమ్మకాయను ఈ సంవత్సరం ఒక జంట రూ.50,500 కి కొనుగోలు చేశారు. ఆ తరువాత కూడా ఆయాల ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను ఉంచి పూజిస్తారు. కేవలం బిడ్డలను కనాలని చూస్తున్న వారికే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడతారని స్థానిక చెబుతున్నారు. దేవాలయాల్లోని నిమ్మకాలయలను భారీ ధరకు వేలంలో విక్రయించడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కూడా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో టెంపుల్ ఫెస్ట్లో భాగంగా ఒక నిమ్మకాయను 7600 రూపాయలకు విక్రయించారు. -
రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?
రిజర్వాయర్లు అమ్మాకానికి వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నురా? ఔను ఇది నిజం అక్కడ స్థానిక ప్రజలకు ఆ రిజర్వాయర్ తలనొప్పిగా మారిందట. అందుకని దాన్ని వేలానికి వేయాలని నిర్ణయించారు దాని యజమాని. ఏంటా రిజర్వాయర్ ? ఎందువల్ల ఇలా అమ్మకానికి పెట్టారంటే.. యూకేలోని 200 ఏళ్ల నాటి రిజర్వాయర్ దాదాపు మూడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్ పడమటి వైపు దాదాపు 900 మీటర్లు కలిగిన ఫుట్పాత్ ఉంది. ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చెత్త సమస్య ఎక్కువయ్యింది. వీటన్నింటితో విసిగిపోయిన అక్కడ స్థానిక ప్రజలు రిజర్వాయర్ తమకు తలనొప్పిగా మారిందని స్తానిక నీత్ పోర్ట్ టాల్బోట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. చెప్పాలంటే ఈ రిజర్యాయర్ మంచి బ్యూటిఫుల్ స్పాట్ కావడంతో ఇక్కడకు టూరిస్ట్లు తాకిడి బాగా ఎక్కువ, పైగా ఈ ప్రాంతం సరదాగా గడిపేందుకు, వాకింగ్కి మంచి ప్రసిద్ధి. దీంతో ఈ ప్రదేశం అంతా అత్యంత రద్దీగా మారిపోయింది. దీన్ని తట్టుకోలేక స్థానిక ప్రజలు తమ గోడుని కౌన్సిల్ వద్ద మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా టూరిస్ట్లు ఆ రిజర్యావయర్ సమీపంలోనే స్టే చేయడం స్థానికులకు మరింత సమస్యాత్మకంగా మారింది దీంతో ఈ రిజర్వాయర్ని గతేడాది నుంచి సమంత ప్రైస్ అనే వేలం సంస్థ వేలానికి ఉంచింది. గతేడాది దాదాపు రూ. 80 లక్షల వరకు పలకగా ఈ ఏడాది మాత్రం అత్యంత తక్కువ ధర రూ. 16 లక్షలు పలకడం గమనార్హం. దీనిపేరు బ్రోంబిల్ రిజర్వాయర్. ఇది స్థానిక ఉక్కు పరిశ్రమకు నీటిని సరఫరా చేయడం కోసం నిర్మించిన రిజర్వాయర్. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. సైక్లిస్టులకు, చేపలు పట్టేవాళ్లకు మంచి ప్రసిద్ధ ప్రదేశం. అయితే ఈ రిజర్వాయర్ని తొలగించడం అనేది అత్యంత రిస్క్తో కూడుకున్నది కూడా. ముఖ్యంగా చుట్టు పక్కల స్థానికులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పర్యావరణానికి ఇబ్బందిక కలగకుండా నిర్ణిత ప్రమాణాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంతేగాదు ఇలా రిజర్వాయర్లు వేలానికి వెళ్లడం అత్యంత అరుదు అని స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: స్ట్రీట్ కేప్లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా!) -
ఒక్క నిమ్మకాయ రూ.35వేలు!
తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా ఓ భక్తుడు అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్కు చెందిన ఒక భక్తుడు రూ. 35,000కు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామివారి ముందు ఉంచి పూజ చేసి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. తమకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. -
రైతుల పాలిట ‘కలప’తరువులా సర్కారు నిర్ణయం
సాక్షి, అమరావతి: జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు, ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అటవీ శాఖ పరిధిలోని యూకలిప్టస్, సరుగుడు తోటల వేలం పాటలను ప్రభుత్వం నిలిపివేసింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. రైతుల ప్రయోజనార్థం వేలం వాయిదా వేయాలని కోరగా.. అటవీ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తక్షణమే వేలాన్ని నిలిపివేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తమ అభ్యర్థనకు మంత్రులు కాకాణి, పెద్దిరెడ్డి స్పందించిన తీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో సుబాబుల్ టన్ను ధర రూ.5 వేలు, యూకలిప్టస్ ధర రూ.6 వేలకు పైగా పలికే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది రాష్ట్రంలో 1,04,985 మంది రైతులు 3,28,954 ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రూ.35 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టన్ను సుబాబుల్ రూ.4,200, యూకలిప్టస్ రూ.4,400గా ధర నిర్ణయించగా.. ఏనాడూ ఈ ధర లభించిన దాఖలాలు లేవు. గతంలో కంపెనీలు కోరుకున్న చోటకు తీసుకొస్తే కాని కొనుగోలు చేసేవారు కాదు. కటింగ్, డీ బార్కింగ్, లోడింగ్, వే బ్రిడ్జి, రవాణా చార్జీల రూపంలో టన్నుకు రూ.800కు పైగా రైతులకు ఖర్చయ్యేది. కంపెనీలు చెల్లించే మొత్తంలో ఖర్చులు పోనూ రైతులకు టన్నుకు రూ.వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది. గతంలో సరైన మార్కెటింగ్ సౌకర్యాల్లేక నష్టాలను చవిచూసిన ఈ రైతులకు గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. రైతు క్షేత్రం నుంచే కొనుగోలు ప్రభుత్వ కృషి ఫలితంగా రైతు క్షేత్రం వద్దే కొనుగోలు చేసేందుకు 20కు పైగా కంపెనీలు ముందుకొచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంపెనీలు సైతం ఏపీకి క్యూ కట్టాయి. ఈ పంట ద్వారా నమోదు చేయడమేకాకుండా, దళారీలకు చెక్పెట్టేలా క్రయ విక్రయాలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షించడం, ట్రేడర్లను ఎంచుకునే వెసులుబాటు కూడా రైతులకే కల్పించడం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడం, ఇరువురి అంగీకారంతో నిర్ధేశించిన తేదీన కోత కోయించి కలపను రైతు క్షేత్రం నుంచే తీసుకెళ్లడం వంటి చర్యల ఫలితంగా గతం కంటే మెరుగైన ధరలను రైతులు పొందగలిగారు. రైతుల అభ్యర్థనతో వేలం పాటలకు బ్రేకు ప్రస్తుతం రైతు క్షేత్రం వద్దే టన్ను సుబాబుల్కు రూ.4,500–రూ.4,800, యూకలిప్టస్కు రూ.5,000–రూ.5,500 మధ్య ధర లభిస్తోంది. ప్రస్తుతం రైతుకు దక్కే ధరలను స్థిరీకరించడమే కాకుండా మరింత పెరిగేలా చర్యలు చేపట్టింది. అటవీ శాఖ పరిధిలో 7,500 హెక్టార్లలో సుబాబుల్, యూకలిప్టస్ తోటలకు శుక్రవారం వేలం పాటలు నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. మరో 2 నెలల్లో పంట కోతకొచ్చే దశలో వేలం నిర్వహిస్తే తమకు ఆశించిన ధర దక్కదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం వేలం పాటల్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. క్షణం ఆలోచించకుండా ఆదేశాలు గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కలప గుజ్జు రైతులకు గడచిన ఐదేళ్లుగా మంచి ధర లభించేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా రైతు క్షేత్రం వద్దే టన్నుకు రూ.4,500కు పైగా ధర లభిస్తోంది. రైతుల అభ్యర్థన మేరకు వేలం పాటల్ని నిలిపి వేయాలని కోరగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షణం కూడా ఆలోచించకుండా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతు క్షేత్రం వద్ద కలపగుజ్జు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి -
టెలికం స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సేవల కోసం ఉద్దేశించిన ఎనిమిది బ్యాండ్లలో స్పెక్ట్రమ్ వేలాన్ని బేస్ ధర రూ.96,318 కోట్లపై నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ను ప్రభుత్వం వేలం వేయనుంది. దివాలా పరిష్కార చర్యల పరిధిలోకి వచి్చన కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ ఈ ఏడాదితో గడువు తీరిపోనుండగా, దీన్నీ వేలం వేస్తుంది. -
ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..
ఓ క్రీడాకారుడు ధరించిన షూ వేలంటో కనివినీ ఎరుగుని రీతీలో ధర పలికాయి. ఆ షూతోనే ఆ క్రీడాకారుడు టైటిళ్లను గెలిచుకున్నాడు. ఆ షూలు ప్రముఖ బ్రాండ్వి కావడం ఒక విశేషం అయితే క్రీడాకారుడి గెలుపులో పాత్ర షోషించడం మరో స్పెషల్టీ. దీంతో అవి వేలంలో మంచి క్రేజ్ రావడంతో వేలంలో ఇంతలా ధర పలికి అందర్నీ షాక్ గురి చేసింది. ఎవరా క్రీడాకారుడు? ఏంటా బ్రాండ్ అంటే.. బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ప్రసిద్ధ బ్రాండ్కి చెందిన ఆరు షూల జతను ధరించి ప్రతిష్టాత్మకమైన ఆరు ఎన్బీఏ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. అవి ప్రమఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండ్కి చెందినవి. సాధారణంగానే ఆ బ్రాండ్ షూలు అత్యంత ఖరీదైనవి. ఇక ఆ క్రీడాకారుడు విజయంలో పాత్ర పోషించిన ఆ షూలకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. తొలిసారిగా 1991లో ఎన్బీఏ ఫైనల్స్లో పోటీ పడుతున్న సమయంలో మైఖేల్ని పీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హాలండ్ జట్టు విజయం సాధిస్తే తాను ధరించిన ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ షూ జతను తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మైకేల్ విజయం సాధించిన తదనంతరం అతడి కోరికను తీర్చాడు. ఆ షూను హాలండ్కు బహుమతిగా ఇచ్చే ముందుకు దానిపై సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఇలా ఐదు ఛాంపియన్షిప్లో అతడు ఆ సంప్రదాయన్ని కొనసాగించాడు. ఇలా చేస్తే గెలుస్తానని మైఖేల్ సెంటిమెంట్గా ఫీలయ్యాడో ఏమో గానీ అలా హాలండ్ వద్ద ఆరు జతల షూలు ఉండటం జరిగింది. ఆయన సాధించిన ఆరు చాంపియన్ షిప్ల్లో పాత్ర వహించిన ఆ ఆరు ఎయిర్ జోర్డాన్ షూల జతను ప్రముఖ వేలం సంస్థ సోథెబిన్ శుక్రవారం వేలం వేయగా ఆ బ్రాండ్కి తగ్గ రేంజ్లోనే రికార్డు స్థాయిలో ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్రాండ్కి ఎప్పటికీ అత్యంత విలువైందని ఫ్రూవ్ చేసుకుందని పలువురు ప్రశంసించారు. ఇలా మైఖేల్ ధరించిన షూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇలానే ఎయిర్ జోర్డాన్ 13 షూ, అలాగే 1988లో ఎన్బీఏ ఛాంపియన్ గేమ్లో విజయాన్ని తెచ్చిన అదే బ్రాండ్కి చెందిన మరో రకం షూ వేలంలో రూ 18 కోట్ల ధర పలికింది. అలాగే అక్టోబర్లో నవంబర్ 1, 1984లో రూకీ సీజన్లో ఐదవ ఎన్బీఏ చాంఫీయన్ షిప్ను గెలుచుకున్నప్పుడూ ధరించిన రెడ్ అండ్ వైట్ ఎయిర్ షూ జత ఏకంగా రూ. 12 కోట్లు పలికింది. ఇప్పుడూ ఏకంగా వాటన్నింటిని తలదన్నేలా ఆ బ్రాండ్కి తగ్గట్లుగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 66 కోట్లు పలకడం విశేషం. (చదవండి: అఖండ హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!) -
కరీంనగర్ పందెం కోడి వేలంలో ట్విస్ట్..
సాక్షి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని వేలం ముందు ట్విట్ నెలకొంది. కోడి వేలం పాటను ఆపాలంటూ ఓ వ్యక్తి.. ఆర్టీసీ డిపో అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆ పందెం కోడి తనదేనని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మహేష్ అనే వ్యక్తి తెలిపాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అతడు సిరిసిల్లలోని రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు దిగి పోయానని తెలిపాడు. తన వెంట కోడి లేదన్న విషయాన్ని గ్రహించి వెంటనే బస్సు వద్దకు వెళ్లగా.. అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు చెప్పాడు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి తనదేనంటూ చెప్పాడు. అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు ఈ లోపు కోడి తనదేనంటూ ఓ వ్యక్తి రావడంతో మరి దానిని అతనికి అందిస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది. -
పందెం కోడికి ఆర్టీసీ వేలం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోడిని వేలంపాటలో దక్కించుకోవచ్చంటూ ఆర్టీసీ డిపో–2 మేనేజర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటన చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ కోడి కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం! అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు. ఇంతకీ సర్కారు వారి పాట ఎంత ఉంటుందో..? ఆ కోడి యజమాని వస్తాడా? రాడా..? ఇంతకీ వేలం పాటలో దేవుని పాట ఎంతకు మొదలవుతుంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది. -
బస్సులో కోడిపుంజు మర్చిపోయిన ప్రయాణికుడు.. అధికారులు ఏం చేశారంటే!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్లో మర్చిపోయిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే మూడు రోజులుగా కోడింపుజును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోడంతో తాజాగా అధికారులు దానిని వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కోడిపుంజును వేలం వేయనున్నట్లు, ఆసక్తిగలవారు పాల్గొనాలని కరీంనగర్-2 డిపో మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. జనవరి 9న వరంగల్ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడ వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకోగా బస్సులో కోడిపుంజు ఉండటాన్ని డ్రైవర్, కండక్టర్ గుర్తించాడు. ఓ ప్రయాణికుడు సంచిలో ఉన్న కోడిపుంజును మరిచిపోయినట్లు తెలుసుకొని దానిని కంట్రోలర్కు అప్పగించారు. కోడిపుంజును డిపోలోని 2డిపో భద్రత విభాగం ఆర్టీసీ అధికారులు ఓ జాలిలో బంధించారు. మూడు రోజుల నుంచి బస్టాండ్ డిపోలోనే కోడిపుంజు బంధీగా ఉంటుంది. అయితే పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీనంగర్-2 డిపో మేనేజర్ పేరిటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12న మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు. చదవండి: పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం? -
డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..
ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. లండన్లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం. నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు. (చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?) -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు నేడు దుబాయ్లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్కతా నైట్రైడర్స్లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో డాషింగ్ బ్యాటర్గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్లోని ఫాంటైన్బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
Macallan: విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు!
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట. -
‘టైటానిక్’ ఆఖరి డిన్నర్ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?
Titanic Dinner Menu: టైటానిక్ ఓడ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. సుమారు 110 ఏళ్ల క్రితం మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిందీ భారీ ఓడ. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. ఈ ఓడ ప్రమాద ఉదంతం గురించి పాతికేళ్ల క్రితమే హాలీవుడ్లో ఓ సినిమా సైతం వచ్చింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలిసిందే. ఆఖరి విందు టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూను ఇంగ్లండ్లో శనివారం (నవంబర్11) వేలం వేయగా 83,000 పౌండ్లు (రూ. 84.5 లక్షలు) పలికినట్లు యూకేకి చెందిన వార్తాపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. టైటానిక్ ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆఖరి విందు ఇది. ఈ ఓడ తన తొలి అట్లాంటిక్ సముద్రయానంలో 1912 ఏప్రిల్ 14న మంచుకొండను ఢీకొట్టి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు నాటిది. ఈ చారిత్రక మెనూ ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్ నుంచి న్యూయార్క్కు బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు ప్రయాణికులకు అందించిన వంటకాల గురించి తెలియజేస్తోంది. విల్ట్షైర్కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ అనే సంస్థ ఈ మెనూను వేలం వేసింది. రకరకాల వంటకాలు వేలానికి వచ్చిన టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూలో వివిధ దేశాలకు చెందిన రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్క్రీమ్ వంటి డెసర్ట్లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్ వంటి నాన్వెజ్ రుచులతో పాటు నోరూరించే వెజిటేరియన్ వంటరాలు ఇందులో ఉన్నాయి. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్ను కూడా స్థానిక డీలర్కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్లో నిమ్స్లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్పెల్లియర్లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట (ఫొటోలు)
-
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్బీ తెలిపింది. జనవరిలో సోథ్బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
చివరి రోజూ మోకిలలో అదే ఊపు.. రూ. 716 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భూముల వేలం హెచ్ఎండీఏకు కాసులుకు కురిపిస్తోంది. మోకిలలో ప్లాట్ల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివమోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడుపోయాయి. మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లు, ఫేజ్–2లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్లను ఆన్లైన్(ఈ–ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 346 ప్లాట్లకు మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. చదవండి: కాంగ్రెస్లో తీవ్ర పోటీ!.. 29 స్థానాలకు 263 దరఖాస్తులు -
ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!
ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన పింగాణీ పాత్రను ఇంగ్లండ్లోని డోర్చెస్టర్కు చెందిన ‘డ్యూక్స్ ఆక్షనీర్స్’ వేలంశాల వేలం వేసింది. వేలంశాల నిర్వాహకులు ఈ పాత్రకు మహా అయితే 100 పౌండ్ల వరకు ధర (రూ.10,565) పలకవచ్చని అంచనా వేశారు. అందువల్ల వేలంపాటను 30 పౌండ్ల (రూ.3,169)నుంచి మొదలుపెట్టారు. వేలంపాటలో వివిధ దేశాల బిడ్డర్లు పాల్గొన్నారు. నిపుణులైన బిడ్డర్లు కొందరు ఇది చైనాను పాలించిన మింగ్ వంశీకుల నాటి వస్తువని గుర్తించడంతో భారీ స్థాయిలో వేలంపాటను పెంచుకుంటూ పోయారు. చివరకు ఇంగ్లండ్కు చెందిన ఒక పురావస్తు సేకర్త దీనిని 1.04 లక్షల పౌండ్లకు (రూ.1.09 కోట్లకు) సొంతం చేసుకున్నాడు. మింగ్ వంశీకులు చైనాను 1368–1644 కాలంలో పాలించారు. వారి హయాంలో తయారైన పింగాణీ వస్తువులు అంత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రతీతి. (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
తుక్కు రేసింగ్ కారుకు వేలంలో రూ.15 కోట్లు
కాలిఫోర్నియా: 1960వ దశకంలో రేసింగ్లో పాల్గొంటుండగా మంటల్లో చిక్కుకొని తుక్కుగా మారిన ఫెరారీ కారు తాజాగా వేలంలో రూ.15 కోట్ల(1.8 మిలియన్ డాలర్లు) ధర పలికింది. ఈ ‘ఫెరారీ 500 మాండియార్ స్పైడర్ సిరీస్–1’ కారును 1954లో తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్ రేసర్ అల్బర్టో అస్కరీ 1952, 1953లో ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్షిప్లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది. రేసింగ్ డ్రైవర్ ఫ్రాంకో కోర్టెస్ 1954లో కారును కొనుగోలు చేశాడు. అనంతరం 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 1978 వరకూ పలువురి చేతులు మారుతూ వచి్చంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేసి, దాదాపు 45 ఏళ్లపాటు అలాగే కాపాడుతూ వచ్చాడు. ఇటీవల ఆర్ఎం సోథ్బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్ ట్రాక్పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు. -
హైదరాబాద్లో మరో భారీ భూ వేలంపాట
సాక్షి, హైదరాబాద్: నగరం శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు. మొకిలా మొదటి ఫేజ్లో గజానికి అత్యధిక ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలు నిర్ణయించారు. ఫెజ్ వన్లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదవండి: బుద్వేల్ భూం భూం.. -
Twitter Blue Bird Auction: ట్విటర్ వేలానికి ఉంచిన వస్తువులు ఇవే.. (ఫొటోలు)
-
ట్విటర్ పిట్టను కొంటారా?
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఎక్స్ (ట్విటర్)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్ మస్క్. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది. తాజాగా ట్విటర్లోని పాత విలువైన జ్ఞాపకాలను మస్క్ వేలానికి పెట్టనున్నారు. వీటిలో ట్విటర్ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్బోర్డ్ కూడా ఉండనుంది. ట్విటర్ను ఎక్స్ పేరిట రీబ్రాండ్ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురానుండగా వీటిలో ట్విటర్ బర్డ్ కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్ ట్విటర్ లోగో, హ్యాష్ట్యాగ్ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి ‘ట్విటర్ రీబ్రాండింగ్ : ఆన్లైన్ ఆక్షన్ ఫీచరింగ్ మెమోరాబిలియా, ఆర్ట్, ఆఫీస్ అసెట్స్ అండ్ మోర్’ అని పేరుపెట్టారు. ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్ అయిన వారి ఆయిల్ పెయింటింగ్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్ ఎల్లెన్ డిజెనెరెస్ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్ ట్వీట్ల ఆకర్షణీయమైన ఫోటో మొజాయిక్ ఉన్నాయి. 2012 నవంబర్లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ట్వీట్కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్ అప్పట్లో అత్యధిక లైక్లు పొందిన ట్వీట్గా గుర్తింపు పొందింది. ఇదీ చదవండి: ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్ వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రకారం, ప్రతి లాట్కు ప్రారంభ బిడ్ 25 డాలర్లు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్ సెప్టెంబర్ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్ బర్డ్ లోగో శాన్ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్-10లో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్ హెడ్క్వార్టర్స్పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు. 🔊 Did you miss the first #Twitter #auction? Here is your chance to participate! 👉 https://t.co/rtN7izBGPI#DontMissOut 👀 #X #TwitteRebrand #TwitterRebranding #TwitterAuction #HGP #HGPAuction $HGBL #AssetManagement #Reuse #OnlineAuction #ShoppingOnline pic.twitter.com/m5lvJjfToF — HGP Auction (@HGP_Auction) August 7, 2023 -
కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్లైన్ బిడ్డింగ్లో విక్రయించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి–శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు -
ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన కోకాపేట భూములు
-
ఎకరానికి వంద కోట్లు.. కోకాపేట వేలంలో ఆల్టైం రికార్డు!
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియ సంచలనాలకు నెలవైంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల ధరలు అంచనాలకు మించి పలికాయి. అత్యధిక ధరతో ఆల్ టైం రికార్డు నెలకొల్పడమే కాకుండా.. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డూ నెలకొన్నట్లు తెలుస్తోంది. కోకాపేట భూముల్లోని నియోపోలీస్ లే అవుట్లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్ఎండీఏ. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.75 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్తోనే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి. ఈ ప్లాట్లలోని భూముల్లో ఎకరానికి.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35 కోట్లుగా ఉంది. అయితే.. కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది. మొత్తంగా 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంది హెచ్ఎండీఏ. కానీ, సగటున రూ.73.23 కోట్లతో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది. -
మార్కెట్లోకి యాపిల్ కంపెనీ బూట్లు.. ధర వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్బుక్లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే.. ధర వింటే భయపడతారు దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్లలో ఒకటైన సోథెబీస్లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్లు, సెయిల్బోర్డ్తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి. యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి. చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు! -
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
121 ఏళ్ల పురాతన క్యాడ్బరీ చాక్లెట్ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. విశేష సమయాల కోసం ప్రత్యేకంగా.. వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్ ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్ బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే.. ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్ను తీసుకుని హెన్సన్కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు. ‘చాక్లెట్ను చిన్నారి తాకనైనా లేదు’ హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ పేర్కొన్నారు. డబ్బా తెరవగానే సువాసనలు రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే.. -
భూమిపై పెరిగే బంగారం! టేబుల్ రేటు రూ.7కోట్లు.. కుర్చీ రూ.2 కోట్లు!
‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది. నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట. ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు. ఎర్ర చందనం మార్కెట్పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది. గ్రేడ్లను బట్టి రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది. ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. – మధుసూదన్రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం ఈ డిమాండ్కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
అమెరికా మాజీ అధ్యక్షుడి లేఖ ..వేలంలో ఎంత పలికిందంటే..
యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. వేల ఏళ్ల నాటి లేఖ వేలంలో లక్ష్లల్లో అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అంతలా ఆకర్షించేంతగా ఆ లేఖలో ఏముంది. ఎవరికీ ఆడమ్స్ ఆ లేఖ రాశారు? వివరాల్లోకెళ్తే..అమెరికి రెండొవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ సంతకంతో కూడిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది ఓ టీనేజ్ వధువు రాసిన లేఖ కావడంతో మరింత విశేషం సంతరించుకుంది. ఆయన ఆ వధవుని ఆశ్వీరదిస్తూ ఓ సన్నిహితుడి మాదిరిగా మంచి విషయాలు ఆమెకు ఆ లేఖలో బోధించారు. ఆ లేఖ రాసినప్పడూ ఆయన వయసు 89 ఏళ్లు. కాగా, ఆ వధువు వయసు 19 ఏళ్లు. ఆ లేఖను మాజీ అధ్యక్షుడు ఆడమ్స్ డిసెంబర్ 14, 1824లో రాశారు ఇక ఆ లేఖలో నా స్నేహితుడు జడ్డిపీటర్స్తో వధువు 19 ఏళ్ల రాబిన్సన్ కొత్త సంబంధం ఏర్పరుచుకుంటున్నందుకు సంతోషిస్తున్నా. మీరిద్దరూ అన్ని కార్యక్రమాలను జయప్రదంగా కలిసి చేయాలి. అలాగే వధువుని ఉద్దేశిస్తూ నువ్వు ఏ మూలల నుంచి వచ్చావో వాటిని ఎప్పటికీ మరిచిపోకు అని రాశారు. ఆ లేఖ ఓ ఫ్రెండ్ షిప్ ఆల్బమ్లో ఉంది. అందులోనే ఆ యువ జంటకు సంబంధించిన జ్ఞాపకాల తాలుకా ఫోటోలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆ వధువు తన భర్తతో కలిసి ఫిలడెల్పియాకు వెళ్లడానికి సిద్ధమవుతుండటంతో..ఆమె నివాసం బ్రెయిన ట్రీ పట్టణం కావడంతో.. ఆ నేపథ్యాన్ని మరచిపోవద్దని అధ్యక్షుడ ఆడమ్స్ నూతన వధువు రాబిన్సన్కి సూచించారు. ఈ లేఖ జూన్లో రాబ్ కలెక్షన్ ద్వారా జరిగిన వేలంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి దాన్ని రూ. 32 లక్షలకు కొనుగోలు చేసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. స్వయంగా రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖ.. మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నమ్మశక్యంగా అనిపించలేదు. విచారణలో అది ఆడమ్స్ నుంచి వచ్చినదేనని నిర్ధారణ అయ్యినట్లు తెలిపారు. ఆయన రాసిన విధానం మనసుకి హత్తుకుందని వేలం నిర్వాహకుడు నాథన్ రాబ్ తెలిపారు. -
మర్చిపోయారా? లేక తొలగించారా? కన్ఫ్యూజ్ చేస్తున్న రైనా..!
-
మైక్రో బ్యాగు.. మైండ్ బ్లోయింగ్ బ్యాగు
ఈ చిత్రాల్లో ఒకదానిలో చేతి వేలిపై ఏదో ఇసుక రేణువు, మరో చిత్రంలో ఓ హ్యాండ్బ్యాగ్ కనిపిస్తున్నాయా? ఇసుక రేణువుకు, హ్యాండ్ బ్యాగ్కు సంబంధమేంటి అంటారా? సింపుల్.. రెండూ ఒకటే. ఇలాంటి విచిత్రమైన వస్తులకు పాపులర్ అయిన యూఎస్ ఆర్టిస్ట్ కలెక్టివ్ మిస్చీఫ్.. మరొక ఆఫ్బీట్ ప్రొడక్ట్తో ఫ్యాన్స్ను అలరించారు. కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగే అతి సూక్క్ష్మ పర్స్ తయారు చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్ వస్తువుల కంపెనీ మిస్చీఫ్.. ఫొటోపాలిమర్ రెసిన్తో ఈ మైక్రోస్కోపిక్ హ్యాండ్బ్యాగ్ను తయారు చేసింది. దీని పరిమాణం 700 మైక్రోమీటర్లు (అంటే మిల్లీమీటర్లో సగానికంటే ఎక్కువ). సూది రంధ్రం నుంచి సులువుగా దూరిపోగలదు. ఈ నెల 20 నుంచి దీనిని పారిస్లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఆ తర్వాత జూపిటర్ వేలం శాలలో వేలం వేయనున్నారు. -
చిట్ఫండ్ స్కాం: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. పెట్టుబడిదారుల సొమ్మును రికవరీ 61 ప్రాపర్టీలను జులై 17న వేలం ద్వారా విక్రయించ నున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 26.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. చట్టవిరుద్ధ పథకాల ద్వారా పబ్లిక్ నుంచి పెట్టుబడులను సమీకరించడంతో శారద్ గ్రూప్పై సెబీ తాజా చర్యలకు నడుం బిగించింది. గ్రూప్నకు పశ్చిమబెంగాల్లోని భూములతోపాటు.. ఇతర ఆస్తులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1వరకూ వేలం వేయనున్నట్లు వెల్లడించింది.ఈవేలం నిర్వహణలో సీ1 ఇండియా, ఆస్తుల విక్రయంలో క్విక్ఆర్ రియల్టీ.. సెబీకి సహకారాన్ని అందించనున్నాయి. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ -
ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ న్ని వదిలించుకుంటున్న పంజాబ్
-
వేలానికి 5 వేల టన్నుల ఎర్ర చందనం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దుంగల్ని వేలం వేయనుంది. ఇటీవలే 300 టన్నులు వేలం వేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 175 కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడు మరో 5 వేల టన్నులు వేలానికి సిద్ధం చేసింది. అక్రమ రవాణాదారుల నుంచి స్వాదీనం చేసుకున్న ఈ ఎర్ర చందనం నిల్వలను కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయనుంది. స్మగ్లర్ల నుంచి స్వాదీనం చేసుకున్న ఎర్ర చందనం ఏ రాష్ట్రంలో ఎంత మేర ఉన్నాయో గుర్తించి దాన్నిబట్టి వేలం కోటాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్దేశిస్తుంది. అలా మన రాష్ట్రంలో ఉన్న 8 వేల మెట్రిక్ టన్నుల దుంగల వేలానికి పదేళ్ల క్రితం అనుమతి ఇ చ్చింది. అప్పటి నుంచి విడతలవారీగా వేలం వేస్తున్నారు. చివరగా 2021 సంవత్సరంలో అప్పటికి మిగిలిపోయిన 318 మెట్రిక్ టన్నుల దుంగల్ని ఆన్లైన్లో వేలం వేశారు. ఆ తర్వాత పట్టుబడిన మరో 5,400 మెట్రిక్ టన్నుల దుంగలను తిరుపతిలోని అటవీ శాఖ సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. వీటి వేలానికి అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా రాష్ట్రం కోరుతోంది. గత డిసెంబర్లో దేశవ్యాప్తంగా 13,301 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం వేలానికి కేంద్రం అనుమతి ఇ చ్చింది. అందులో ఏపీ నుంచే 5,376 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. దీంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 300 టన్నులు ఆన్లైన్లో విక్రయించారు. మిగిలిన నిల్వల్ని వెంటనే వేలం వేయాలని భావించినప్పటికీ, ఎర్ర చందనం మార్కెట్ అంతా చైనాదే కావడం, అక్కడ కరోనా తీవ్రంగా ఉండటంతో ముందడుగు పడలేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కుదుటపడటంతో వేలానికి అధికారులు చర్యలు చేపట్టారు. చైనాలో అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు ఈసారి వేలంలో చైనా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ మధుసూదన్రెడ్డి ఇతర అధికారుల బృందం ఇటీవలే చైనాలో పర్యటించింది. అక్కడ ఎర్ర చందనానికి ఉన్న మార్కెట్, వ్యాపారులు, కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎక్కువ కంపెనీలు వేలంలో పాల్గొంటాయో అధ్యయనం చేసి ఈ బృందం ఒక ప్రణాళిక రూపొందించింది. దీనిపై సీఎం వైఎస్ జగన్తో చర్చించి ఆయన ఆమోదం తర్వాత ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో వేలం ప్రక్రియ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఎంఎస్టీసీ ద్వారా దశలవారీగా అంతర్జాతీయ ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. వేలం పూర్తయితే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని పీసీసీఎఫ్ మధుసూదన్రెడ్డి తెలిపారు. -
పగిలితే అతికించలేం.. కానీ ధర మాత్రం రూ.200 కోట్లు! ఎవరు కొన్నారంటే?
పింగాణీ గిన్నె! పగిలితే అతికించలేం. కానీ రెండు పక్షులు, ఆఫ్రికాట్ చెట్టు పెయింటింగ్ ఉన్న పింగాణీ గిన్నె వేలం పాటలో అక్షరాల 25 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. అంటే భారత కరెన్సీలో రూ.200 కోట్లు అమెరికాకు చెందిన పూరాతన వస్తువుల్ని వేలం నిర్వహించే ప్రముఖ సంస్థ సోథిబె 40 దేశాల్లో 80 ప్రాంతాల్లో కార్యకాపాలు నిర్వహిస్తుంది. అయితే ఈ కంపెనీ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో హాంకాంగ్లో ప్రత్యేకంగా ఓ వేలం పాట నిర్వహించింది. ఆ ఆక్షన్లో చైనా రాజధాని బీజింగ్లో 18 శతాబ్ధంలో అంటే? 1722-35 మధ్య యోంగ్జింగ్ రాజు చనిపోయిన కొద్ది కాలానికి 'ఫలాంగ్కాయ్,' 'ఫారిన్ కలర్స్' అని పిలిచే సంప్రదాయంలో భాగంగా సిరామిక్స్తో ఈ పింగాణీ గిన్నెను తయారు చేశారు. గిన్నె మీద రెండు పక్షులు, ఆప్రికాట్ చెట్టు బొమ్మలు యోంగ్జెంగ్ వంశానికి చెందిన రాజు పద్యం నుంచి కొన్ని పదాలు ఉన్నాయి. ఇలాంటివి రెండు గిన్నెలను తయారుచేయగా.. 19వ శతాబ్దం చివరలో షాంఘైకి చెందిన షిప్పింగ్ వ్యాపారి కెప్టెన్ చార్లెస్ ఓస్వాల్డ్ లిడ్డెల్ నుంచి వీటిని సేకరించినట్లు తెలుస్తోంది. 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా విక్రయించారు. వీటిలో లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉందని సోథెబీస్ తెలిపింది. రెండో దానిని హాంకాంగ్లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నె దశాబ్దాలుగా అనేక మంది చేతులు మారింది. వీరిలో అమెరికాకు చెందిన బార్బరా హట్టన్ సైతం వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 8న వేసిన వేలంలో ఆ గిన్నెను వ్యాపారవేత్త, కలెక్టర్ అలిస్ చెంగ్ కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. View this post on Instagram A post shared by Sotheby's (@sothebys) -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
ఈ కంప్యూటర్ మౌస్ ధర కోటిన్నర? అసలు స్టోరీ ఏమిటంటే!
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అంటే ఒక ఇన్సిపిరేషన్. ఆపిల్ కంప్యూటర్లతో, టెక్నాలజీకి విప్లవ బాటలు వేసిన స్ఫూర్తిమంతుడు స్టీవ్ జాబ్స్. అలాంటి స్టీవ్ జాబ్స్కే ప్రేరణగా నిలిచిన కంప్యూటర్ మౌస్ 147,000 పౌండ్లకు (రూ. 1,48,89,174) అమ్ముడైంది. కంప్యూటింగ్ ఐకాన్ డగ్లస్ ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన మూడు-బటన్ల మౌస్, కోడింగ్ కీసెట్ బోస్టన్-ఆధారిత ఆర్ఆర్ నిర్వహించిన వేలంలో దాని అంచనా 12వేల పౌండ్ల కంటే దాదాపు 12 రెట్ల రికార్డు ధరను దక్కించుకోవడం విశేషం. మెట్రో అందించిన రిపోర్ట్ ప్రకారం కంప్యూటర్ వాడకలో అత్యంత కీలకమైన మౌస్ రూ. 1.49 కోట్లను సాధించింది. ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన, తొలి త్రి-బటన్ కంప్యూటర్ మౌస్, (సుమారు 4″ x 2.75″ x 2.5″) దిగువన ఉన్న రెండు మెటల్ డిస్క్లను (X-యాక్సిస్, Y-యాక్సిస్కు అనుగుణంగా) వినియోగిస్తుంది. కోడింగ్ కీసెట్లోని ఐదు కీలను ఉపయోగించి మొత్తం 31 వేర్వేరు కీ ప్రెస్లను తయారు చేయవచ్చు. ఈ సెటప్ని ఉపయోగించి, వినియోగదారు తమ ఎడమ చేతితో టైప్ చేయవచ్చు. "మదర్ ఆఫ్ ఆల్ డెమోస్" దీన్ని అభివర్ణిస్తారు. ఇపుడు వాడుతున్న మౌస్లకు ఇది మాతృక. స్టీవ్ జాబ్స్ 1979లో ఒక పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినప్పుడు మౌస్ , గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ (GUI)ని చూశారు. దీన్ని ఆపరేట్ చేయడం ఎంత సులభమో గ్రహించి చాలా సంతోష పడ్డారుట. దాంతో ఆపిల్ కంప్యూటర్లకు కూడా దీనిని అనుసరించాలని భావించారు. కానీ 245-పౌండ్ల జిరాక్స్ మౌస్ పని తీరు సరిగ్గాలేకపోవడంతో 12-పౌండ్లతో వన్ బటన్ మౌస్ రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్వేలంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్స్టన్ మాట్లాడుతూ ఎంగెల్బార్ట్ ఆవిష్కరణ కంప్యూటర్ చరిత్ర పరిణామంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది. ఆధునిక జీవిత గమనాన్ని మార్చివేసిందన్నారు. SOLD! a computer mouse and coding keyset created by Doug Engelbart, as used in the 'Mother of All Demos,' sold for $178,936 @RRAuction. https://t.co/r9fz431woY#Xerox #Computer #Consign #Auction #History pic.twitter.com/f4uQZBiZJ4 — RR Auction (@RRAuction) March 17, 2023 -
లిథియం నిల్వల వేలం ప్రక్రియకు కేంద్రం సన్నద్ధం.. దక్కించుకునే లక్ ఎవరికుందో?
2023 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారీ లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నిల్వలను బయటకు తీయడానికి, శుద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుమారు 5.9 మిలియన్ టన్నుల వరకు ఉన్న లిథియం నిల్వలను బయటకు తీయడానికి వేర్వేరు లెవెల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్న దేశాల్లో భారతదేశం ఏడవ స్థానం ఆక్రమించింది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీలలో ఎక్కువ శాతం లిథియం వినియోగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లిథియం డిపాజిట్ల వేలం ప్రక్రియను 2023 జూన్లో ప్రారంభించనున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. లిథియం నిల్వల వేలం ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, వేలం ప్రక్రియలో దీనిని సొంతం చేసుకునే సంస్థలు శుద్ధి చేసే ప్రక్రియను భారతదేశంలోనే జరపాలని, ఏ కారణం చేతనూ విదేశాలకు పంపించకూడదని సంబంధిత వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది, అదే సమయంలో దేశంలో బయటపడిన లిథియం నిల్వల వల్ల 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారదేశంలో లిథియం శుద్ధి చేయడానికి కావలసిన సదుపాయాలు లేదు, భవిష్యత్తులో ఇలాంటి సదుపాయాలు దేశంలో నెలకొల్పబడతాయా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఎక్కువ లిథియం ఉన్న దేశాల్లో బొలీవియా మొదటి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో వరుసగా అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలు ఉన్నాయి, ఇటీవల ఇండియా లిథియం అయాన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం ప్రభుత్వం లిథియం వేలం ప్రక్రియను పూర్తి చేసిన తరువాత జరగాల్సిన పనులు ప్రారంభమవుతాయి. -
వందేళ్ల నాటి బైక్కి ఇంత క్రేజా.. కోట్లు పెట్టి మరీ..!
సాక్షి, ముంబై: 'హార్లే డేవిడ్సన్' ఈ పేరుకి ప్రపంచ మార్కెట్లో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అత్యంత ఖరీదైన వెహికల్ తయారీ సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం కూడా వాహనాలను తయారు చేసింది అని చాలా తక్కువమందికే తెలుసు. 1908వ సంవత్సరంలో అంటే సుమారు 110 సంవత్సరాల ముందు హార్లే డేవిడ్సన్ తయారు చేసిన ఒక వెహికల్ ఇటీవల వేలంలో అక్షరాలా రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజమే. 'ఓల్డ్ ఐస్ గోల్డ్' అంటే ఇదేనేమో.. నిజానికి ఆశ్చర్యం కలిగించే రీతిలో అమ్ముడైన ఈ 'హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్సైకిల్' అమెరికాలో లాస్ వెగాస్లో మెకమ్ వేలం ద్వారా విక్రయించారు. వేలం పాటలో ఇది 9,35,000 డాలర్లకు అమ్ముడు బోయింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 7.73 కోట్లు. ఈ రకమైన మోటార్ సైకిల్స్ని కంపెనీ 1908 లో కేవలం 450 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అందులో ఒకటే ఇటీవల వేలం పాటలో విక్రయించబడిన హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్. దాదాపు 110 సంవత్సరాల క్రితం మోటార్సైకిల్ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉండటం విశేషమే మరి. ఇందులో వీల్స్ , ఇంజిన్ బెల్ట్-పుల్లీ, మఫ్లర్ స్లీవ్, సీటు కవర్ , దాని ఆయిల్ ట్యాంక్ వంటి భాగాలను కూడా ఇందులో స్పష్టంగా చూడవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ వెహికల్స్ కంటే కూడా ఇది చాలా ఖరీదైనది స్పష్టంగా తెలుస్తోంది. -
WPL Auction 2023: అన్ సోల్డ్గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు అనూహ్య ధరలు దక్కించుకున్నారు. తొలి రౌండ్ వేలం పూర్తయ్యే సరికి అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా స్మృతి మంధాన ఉంది. స్టార్ ఓపెనర్ అయిన స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. ఈమె తర్వాత దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. మెగా వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్లు ఇప్పటివరకు లిస్టింగ్లోకి రాగా.. కర్నూలుకు చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 10 లక్షల బేస్ప్రైజ్ విభాగంలో లిస్టింగ్కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చ లేదు. వేలం ట్రెండ్ను బట్టి త్రిషకు భారీ ధర దక్కుతుందని అంతా ఊహించారు. అయితే, ఈ అమ్మాయిని జట్టులో చేర్చుకునేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వేలంలో మరో దఫా లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో చివర్లో అయినా ఏదో ఒక జట్టు ఈ అమ్మాయిని దక్కించుకోవచ్చు. 17 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన త్రిష ఇటీవల జరిగిన అండర్-19 టీ20 వరల్డ్కప్లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చింది. సీనియర్ జట్టుకు ఆడకపోవడం ఈ అమ్మాయికి మైనస్ అయ్యుండవచ్చని క్రికెట్ ఫాలోవర్స్ అనుకుంటున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష.. అండర్-19 వరల్డ్కప్-2023 ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ (24 నాటౌట్) ఆడి టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసే త్రిష.. ఫీల్డింగ్లోనూ అదరగొడుతుంది. వేలం ప్రక్రియ ఇవాళ రాత్రి వరకు సాగనుండటంతో ఏదో ఒక జట్టు త్రిషను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. కాగా, వేలంలో తొలి రౌండ్ పూర్తయ్యే సరికి త్రిషతో పాటు భారత్కు చెందిన క్రికెటర్లు తాన్యా భాటియా, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, హ్రిషిత బసు, సౌమ్య తివారి, అర్చనా దేవి, మన్నత్ కశ్యప్, నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, షబ్నమ్ షకీల్, ఫలక్ నాజ్, సోనియా మెందియా, శిఖా షాలోట్, హర్లీ గాలా అన్ సోల్డ్గా మిగిలిపోయారు. ఇప్పటివరకు కేవలం 78 మాత్రమే వేలానికి రాగా.. ఇంకా 412 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. -
మహీంద్ర ఎక్స్యూవీ 400స్పెషల్ ఎడిషన్ రూ. 1.75 కోట్లా! ఎందుకలా
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎక్స్ యూవీ400 భారీ ధర పలికింది. వన్-ఆఫ్-వన్ ఎడిషన్ను వేలం సందర్భంగా ఈ ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 1.75కోట్లకు అమ్ముడుపోయింది.హైదరాబాద్కు చెందిన రుణాకర్ కుందావరమ్ ఈ ఎక్స్క్లూజివ్ ఎడిషన్ను సొంతం చేసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఈ కారును ఆయనకు అందించారు. మహీంద్రా ఎక్స్యూవీ400 ఎక్స్ షోరూం ధర రూ. 16.99లక్షలు-రూ. 18.99లక్షలుగా ఉంది. దీనిప్రకారం ప్రారంభ ధర కన్నా.. ఎక్స్యూవీ400 ఎక్స్క్లూజివ్ ఎడిషన్ను రూ. 1.58 కోట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. ఈ నిధులను సామాజిక సేవ కోసం వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది. సాధారణ మహీంద్రా ఎక్స్యూవీ400 ఈవీతో పోలిస్తే పెద్దగా మార్పులు లేనప్పటికీ ప్రత్యేకత ఏంటంటే.. మహీంద్రా XUV400 వన్-ఆఫ్-వన్ ఎడిషన్ను ఫ్యాషన్ డిజైనర్ రిమ్జిమ్ దాదు సహకారంతో మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ రూపొందించారు. ప్రత్యేక ఎడిషన్ కారును 'రిమ్జిమ్ దాదు X బోస్' బ్యాడ్జ్ , ఆర్కిటిక్ బ్లూ థీమ్తో తీసుకొచ్చింది. స్టాండర్డ్ మహీంద్రా XUV 400 eSUV రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనికి సంబంధించి జనవరి 26 న ప్రారంభం కాగా మోడల్ ఇప్పటివరకు 15,000 బుకింగ్లను పొందింది. ఈ బుకింగ్ల డెలివరీలు దాదాపు ఏడు నెలల్లో పూర్తవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. -
ఇల్లంతా డబ్బుతో నిండిపోయింది! స్థలం లేదు.. వీలుంటే కొత్త సామాన్లు కూడా అమ్మండి!
ఇల్లంతా డబ్బుతో నిండిపోయింది! స్థలం లేదు.. వీలుంటే కొత్త సామాన్లు కూడా అమ్మండి! -
‘పాత సామాన్లు అమ్ముతాం’.. ప్రపంచ కుబేరుడా.. మజాకా!
స్టీలు సామాన్లు, బిందెల కోసం పాత సామాన్లనో, బట్టలనో ఇవ్వడం మనకు తెలిసిందే.. మనమూ ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం..అయితే.. అలాంటి పనిని ఒక ప్రపంచ కుబేరుడు చేస్తేనో..కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు మాత్రమే కాదు.. చివరికి కేఎన్ 95 మాస్కుల డబ్బాలతో సహా అమ్మకానికి పెట్టేస్తేనో..వినడానికి కొంచెం చిత్రంగా ఉంది కదా.. మరింకేం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. పదండి.. స్పేస్ ఎక్స్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొన్నప్పటి నుంచీ ఆ కంపెనీని దారిలో పెట్టడానికంటూ.. బ్లూటిక్కు డబ్బుల వసూలు నుంచి ఉద్యోగులను తొలగించడం దాకా చాలా చేశారు. ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు సామగ్రిని వదిలించుకునే పేరిట వాటినీ అమ్మకానికి పెట్టారు. ఇందుకోసం కార్పొరేట్ అసెట్ డిస్పోజల్ సంస్థ ‘హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్’కు బాధ్యత అప్పజెప్పారు. ఆ సంస్థ మొత్తం 631 సామాన్లకు సంబంధించి 27 గంటల ఆన్లైన్ సేల్ పెట్టింది. బిడ్డింగ్ విధానం ద్వారా వేలానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో నాలుగడుగుల ట్విట్టర్ పిట్ట లోగో ప్రతిమతోపాటు 10 అడుగుల ఎత్తున్న ట్విట్టర్ నియాన్ లైట్, ఎ్రస్పెసో మెషీన్లు, టీవీలు, ఓవెన్లు, టేబుళ్లు, స్పీకర్లు, కిచెన్ సామాన్లు వంటివీ ఉన్నాయి. ఆఫీసులో ఉన్న అదనపు సామగ్రిని వదిలించుకోవడం కోసమే ఇదంతా అని పైకి చెబుతున్నప్పటికీ.. శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయానికి సంబంధించిన అద్దెను మస్క్ ఇంకా కట్టలేదట. దీనిపై సంబంధిత యజమాని కేసు కూడా వేశారట. పైగా గతేడాది కాలంలో 500 మంది అడ్వటైజర్లు తమ ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపేయడంతో.. ట్విట్టర్ ఆదాయం 40 శాతం మేర తగ్గిపోయిందట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ‘పాత సామాన్ల అమ్మకం’వార్తలు కలకలం రేపాయి. అయితే, ఈ వాదనను హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రతినిధి ఖండించారు. సామగ్రి అమ్మకానికి, ట్విట్టర్ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. ఈ 27 గంటల సేల్లో అత్యధికంగా నాలుగడుగుల ట్విట్టర్ పిట్ట లోగో ప్రతిమకు రూ. 81.45 లక్షలు, పదడుగుల నియాన్ ట్విట్టర్ లోగో లైట్కు రూ. 32.5 లక్షలు వచ్చాయి. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
రిలయన్స్ గ్యాస్ వేలం నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ తమ తూర్పు ఆఫ్షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది. డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది. -
Bluefin Tuna: రెండు కోట్ల రూపాయల చేప ఇది!
ఇది బ్లూఫిన్ టూనా చేప. బరువు 212 కిలోల దాకా ఉంటుంది. గురువారం జపాన్ రాజధాని టోక్యోలోని టొయొసు మార్కెట్లో జరిగిన వేలంలో 36 మిలియన్ యెన్లు( 2,73,000 డాలర్లు).. అంటే రూ.2.25 కోట్లు పలికింది. ఆవోమోరిలోని ఒమా దగ్గర ఈ చేపను పట్టుకున్నారు. భారీ సైజులో ఉండే బ్లూఫిన్ టూనా చేప పట్టుకుని.. వేలం వేయడం ప్రతీ ఏడాది ఆనవాయితీగా వస్తోంది. 1999 నుంచి ఇది అరో గరిష్ఠ ధర. కిందటి ఏడాది 210 కేజీల దాకా బరువు ఉన్న చేపను వేలం వేస్తే.. 2,02,000 డాలర్లు వచ్చింది. 2020లో దాదాపు 300 కేజీల దాకా బరువు ఉన్న చేపను 1.8 మిలియన్ డాలర్లకు, ఇక 2019లో కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 3.1 మిలియన్ డాలర్లకు బ్లూఫిన్ చేప వేలంలో అమ్ముడు పోయింది. కరోనా ప్రభావంతోనే చేప రేటు పడిపోతూ వస్తోందని భావిస్తున్నారు. ఒమా బ్లూఫిన్ టూనాను.. బ్లాక్ డైమండ్స్గా వ్యవహరిస్తారు. ఈ భారీ చేపలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అందుకే అంతలా రేటు ఉంటుంది. జపనీస్ సూషీ చెయిన్ అయిన ‘సూషీ జన్మాయ్’ అధ్యక్షుడు కియోషి కిమురా ప్రతీ ఏడాది కొత్త సంవత్సరంలో ఆనవాయితీగా ఈ వేలం నిర్వహిస్తు వస్తున్నారు. అయితే.. ఈ ఏడాది మాత్రం లూక్సే సుషీ జింజా ఒనోడెరా చెయిన్ ఓనర్ అయిన హిరోషి ఓనోడెరా నిర్వహించారు. ఓమోటెసాండో జిల్లాలోని ఓనోడెరా రెస్టారెంట్లో దీన్ని వండి వడ్డిస్తారు. దేశంలోని అగ్రశ్రేణి చెఫ్లు మాత్రమే దీనిపై తమ పనితనం ప్రదర్శిస్తారు. -
ఈ విమానం ఎగరదు.. కానీ ధర మాత్రం కోట్లు పలుకుతోంది, ఎందుకో తెలుసా!
పాప్ ప్రపంచానికి రారాజుగా వెలుగొందిన ఎల్విస్ ప్రెస్లీకి సొంత జెట్ విమానం ఉండేది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ విమానమే! ఈ ‘జెట్స్టార్’ విమానాన్ని ఎల్విస్ 1962లో 6.85 లక్షల పౌండ్లకు (రూ.6.97 కోట్లు) కొనుగోలు చేశాడు. ఎగిరేస్థితిలో లేని ఈ విమానం ముప్పయ్యేళ్లకు పైగా న్యూమెక్సికోలోని రోజ్వెల్ ఎయిర్క్రాఫ్ట్ బోన్యార్డ్లో పడి ఉంది. ఎరుపు రంగులో ఉన్న ఈ విమానం లోపలి భాగంలోనూ ఎరుపురంగే కనిపిస్తుంది. ఎరుపు తివాచీ, ఎరుపురంగు వెల్వెట్ కుషన్లు ఉన్న ఆరు ప్రత్యేకమైన సీట్లు, బంగారు అంచులతో తీర్చిదిద్దిన ఇంటీరియర్ డిజైన్ ఈ విమానం ప్రత్యేకతలు. అంతేకాదు, ఇందులో కేసెట్ప్లేయర్, టెలివిజన్, వీసీఆర్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి వసతులూ ఉన్నాయి. పదిహేనేళ్లు వాడిన తర్వాత ఎల్విస్ దీనిని 1977లో ఒక సౌదీ అరేబియన్ కంపెనీకి అమ్మేశాడు. తర్వాత ఇది చేతులుమారి దాదాపు ముప్పయ్యేళ్ల కిందట రోజ్వెల్ ఎయిర్క్రాఫ్ట్ బోన్యార్డ్కు చేరుకుంది. ఎగిరేస్థితిలో లేకపోవడంతో దీని ఇంజన్, కాక్పిట్ వంటి భాగాలను తొలగించారు. వచ్చే జనవరిలో దీనిని వేలం వేయనున్నారు. ఎల్విస్ వాడిన విమానం కావడం వల్ల దీనికి భారీ ధరే పలకవచ్చని అనుకుంటున్నారు. -
నాలుగో రౌండ్లో 8 బొగ్గు గనులే వేలం!
న్యూఢిల్లీ: నాలుగో రౌండ్ వేలంలో 99 బొగ్గు గనులను వేలంలో ఉంచగా, కేవలం ఎనిమిది బ్లాకులను మాత్రమే విజయవంతంగా వేలం వేసినట్లు బుధవారం ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ గనులు ఉన్నాయని తెలిపారు. కాగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్సభకు ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 281 కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. చదవండి: యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్! -
165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే!
పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్ కంపెనీ తయారుచేసిన జీన్స్ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి. చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్.. -
వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్ పేపర్
న్యూయార్క్: ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన స్వహస్తాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పేపర్పై డార్విన్ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత అరుదుగా లభిస్తుంది. నేచురల్ సెలక్షన్ థియరీకి సంబంధించిన సమ్మేషన్ను ఈ ప్రతిలో రాశారు డార్విన్. దీంతో ఈ పేపర్ను ఓ ఓత్సాహికుడు రూ.7.2కోట్లకు(8.82లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్ ఫుల్ ఆటోగ్రాఫ్తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు. చదవండి: ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి.. -
అమ్మకానికి ట్విటర్ ఆఫీస్ వస్తువులు.. ఎలాన్ మస్క్ మరీ దిగజారిపోతున్నారా?
గత యాజమాన్యం ట్విటర్లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి భోజనం ఖర్చు రూ.32వేలు కాగా.. ఏడాదికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మస్క్ ట్విటర్ బాస్గా తన మార్క్ చూపించుకునేందుకు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే ట్విటర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రతి వస్తువును వేలానికి పెట్టారు. ఆ వేలం జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలోని 265 కిచెన్ అప్లయెన్సెస్, ఆఫీస్ ఫర్నీచర్ను ఆక్షన్కు.. వాటిల్లో సింక్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ వేలంలో ఒక్కో వస్తువు ప్రారంభం ధర 25డాలర్లుగా నిర్దేశించినట్లు వేలం నిర్వహించే శాన్డియోగో కేంద్రంగా ఉన్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్ వెల్లడించింది. వేలంలో ఉన్న వస్తువులు ఇవే మస్క్ వేలానికి ఉంచిన ట్విటర్ ఆఫీస్కు చెందిన వస్తువుల్లో ఆఫీస్ చైర్లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, కాఫీ గ్రైండర్లు, స్టీమ్ టిల్టింగ్ కెటిల్స్, పిజ్జా తయారు చేసుకునే వస్తువులు, ఎలక్ట్రిక్/బేకరీ ఓవెన్లు, ఫ్రీజర్లు (బార్ రిఫ్రిజిరేటర్తో సహా), మొబైల్ హీటెడ్ క్యాబినెట్లు, ఐస్ మేకింగ్ మెషీన్లు, ఫ్రయ్యర్లు, లేజర్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. రోజుకు రూ.32 కోట్ల నష్టం వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్జే) కథనం ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు మస్క్ ట్విటర్ను కొనుగోలు చేయడం..ప్రపంచ దేశాలకు దిగ్గజం కంపెనీలు ట్విటర్లో ఇచ్చే ప్రకటనల్ని నిలిపివేశాయి. దీంతో ట్విటర్ రోజు 4 మిలియన్ (రూ.32 కోట్లు) డాలర్ల నష్టం వాటిల్లినట్లు డబ్ల్యూఎస్జే తెలిపింది. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకేనా అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మస్క్ ట్విటర్ బ్లూ లాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో మాదిరిగా ఫ్రీగా కాకుండా.. ట్విటర్ సంస్థకు చెందిన క్యాంటిన్లో నచ్చిన ఫుడ్ తినాలంటే 8 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆఫీస్లో వినియోగించుకునే వస్తువుల్ని అమ్మకానికి పెట్టడంతో మస్క్ మరింత దిగజారుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే ఈవేలానికి ట్విటర్ ఆర్ధిక పరిస్థితులకు సంబంధం లేదని వేలం పనులు చూస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్కు చెందిన నిక్ డోవ్ తెలిపారు. -
వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస ధర ఎంతంటే?
ఐపీఎల్ మరో లెవల్కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్ డాక్యుమెంట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. -
డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...
ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే తెలియని వారుండరు. అతని పేరు తలుచుకుంటే గుర్తోచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. అంతా గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిపాదించిన జీవ పరిణామా సిద్ధాంతానికి సంబంధించిన ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. అదికూడా ఆయన సంతకంతో కూడిని లేఖ కావడం విశేషం. వాస్తవానికి ఆయన పరిశోధనల గురించి క్రమం తప్పకుండా ఒక ప్రతిలో నోట్ చేసి ఉండనందున ఆయనకు సంబంధించిన రచనలు ఇంత వరకు సరిగా దొరకలేదు. ఒక వేళ దొరికినా వాటిలో సాధారణంగా డార్విన్ లేదా సీహెచ్ డార్విన్ అని మాత్రమే ఉంటుంది. కానీ అతని పూర్తి పేరుతో సంతకం చేసిని లేఖ దొరకడం అత్యంత అరుదు. ఈ మేరకు డార్విన్ ఆన్లైన్గా పిలిచే డేటాబేస్ క్యూరేటర్ ప్రొఫెసర్ జాన్ వాన్ వైహే మాట్లాడుతూ అత్యంత గొప్ప శాస్త్రవేత్త సంతకంతో కూడిన ప్రతి చాలా ప్రత్యకమైనది. అది ఆన్ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ మూడవ ఎడిషన్లో భాగానికి సంబంధించిన లేఖగా పేర్కొన్నారు. ఈ లేఖ న్యూయార్క్లోని సోథెబైస్ వేలంలో సుమారు రూ. 9 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ లేఖలో డార్విన్...ఇందులో అసలు వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని వెల్లడిస్తాను. జీవులు వాటి జాతుల వర్గీకరణ వైవిద్యాలను ఆ పరిణామ సిద్ధాంతం వివరిస్తోంది. ఒక్కోసారి ఆ వర్గీకరణ కూడా తప్పుగా ఉండొచ్చు. అదీ క్రమంగా తప్పుడు సిద్ధాంతాన్ని వివరించకూడదు. జీవ సారాంశం, దాని మూలం గురించి సమగ్రంగా వివరించడం అనేది కొంచెం క్లిష్టతరమైనదిగా పేర్కొనవచ్చు. అలాగే న్యూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతం సారాంశం ఏంటనేది కచ్చితంగా వివరించలేం. కానీ న్యూటన్ తన పరిశోధనల్లో తత్వశాస్త్రంలోని అద్భుతమైన కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశాడన్నారు. (చదవండి: మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి.. కానీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉందిది. రోమ్లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వియా వెనెటోకు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవంతి పదహారో శతాబ్దం నాటిది. దీని సీలింగ్పై ఆనాటి సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు కరవాగియో చిత్రించిన మ్యూరల్స్ ఈ భవంతికి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ భవంతి విస్తీర్ణం 30 వేల చదరపు అడుగులు. ఇటలీలోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతిలో ప్రస్తుతం ప్రిన్స్ నికోలా లుదోవిసీ బోన్కాంపానీ మూడో భార్య ప్రిన్సెస్ రీటా బోన్కాంపానీ లుదోవిసీ ఉంటున్నారు. ప్రిన్స్ నికోలో మొదటి భార్య సంతానం ఆస్తి కోసం దావా వేయడంతో ఈ భవంతిని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఏడాది జనవరిలోను, ఆ తర్వాత ఏప్రిల్లోను దీనికి వేలం ప్రకటించినా, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అపర కుబేరులెవరైనా ముందుకొస్తే తప్ప ఈ భవంతిని వేలంలో అమ్మడం సాధ్యం కాదని ఇటాలియన్ అధికారులు అంటున్నారు. వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిని ఇటాలియన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రిన్సెస్ రీటా దాదాపు 40 వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక పిటిషన్ను సమర్పించారు. అయితే, ఈ భవంతి విలువ ఇటలీ సాంస్కృతిక శాఖ బడ్జెట్కు మించి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
మారడోనా 'ఫుట్బాల్'కు కళ్లు చెదిరే మొత్తం.. ఎందుకంత క్రేజ్
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గోల్. ఆనాడు మారడోనా Hand OF God Goal కొట్టిన బంతికి తాజాగా వేలంలో కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయింది. బుధవారం లండన్లో నిర్వహించిన వేలంలో ఆ బంతి అక్షరాల .19.5 కోట్ల ధరకు అమ్ముడైంది. అయితే ఇంతకాలం ఆ బంతి అప్పటి మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్ నాసర్(ట్యునీషియా) దగ్గరే ఉంది. తాజాగా వేలానికి పెట్టడంతో ఇలా భారీ ధరకు అమ్ముడుపోయింది. 1986 సాకర్ వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్లో 1986 ఫిఫా వరల్డ్కప్లో మారడోనా ధరించిన జెర్సీకి కూడా కళ్లు చేదిరే మొత్తం వచ్చి చేరింది. క్వార్టర్స్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్కు అందజేశాడు. దానిని దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టగా ఒక అజ్ఞాతవ్యక్తి సదరు జెర్సీని 71 లక్షల పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం. చదవండి: మ్యాచ్ను గెలిపించలేకపోయిన జైశ్వాల్ వీరొచిత సెంచరీ FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలం: రికార్డు ధర
న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్స్టాక్ కంపెనీ సాండల్స్ అత్యధిక ధరను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) 1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్స్టాక్ సాండిల్స్ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్ పేర్కొంది. వేలంలో వీటికి 60 వేల డాలర్ల ధర వస్తుందని భావించారు. ఈ సాండల్స్కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. అయితే ఈ సాండల్స్ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్లడించ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్ యాపిల్ ఉత్పత్తులతో ఆధునిక టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్ జాబ్స్ క్యాన్సర్తో 2011లో కన్నుమూశారు. ఇదీ చదవండి: ElonMusk బ్లూటిక్ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్ -
ఏపీ, తెలంగాణలోని బీఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ప్రపంచంలోనే ఖరీదైన బీరు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఖరీదైనవి, విలువైనవి ఎవరికైనా ఆసక్తి ఎక్కువే. అందులోనూ పురాతనమైన వైన్, షాంపైన్ ఖరీదైన లగ్జరీ డ్రింక్స్గా మందుబాబులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక బీరు బాటిల్ అంత్యంత ఖరీదైన ధరతో వార్తల్లో నిలిచింది. ఈ బీరు బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అవును ఈ బీరు బాటిల్ ధర అక్షరాలా ఐదు లక్షల డాలర్ల అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4 కోట్ల పైనే అన్నమాట. 140 సంవత్సరాల క్రితం నాటి ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’ వేలంలో అత్యంత ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చరిత్ర కెక్కింది. ఒక వ్యక్తి ఈ బీరు బాటిల్ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. అల్సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది. దీంటోల ఆల్కహాల్ 10 శాతం ఉండటమే దీని ప్రత్యేకత అట. లండన్లోని పురాతన వస్తువులు, ఆర్ట్వర్క్కి సంబంధించిన ఆంటిక్ట్రేడ్ సమాచారం ప్రకారం, ఓక్లహోమాకు చెందిన ఒక కస్టమర్ 2007లో ఈబే ఆన్లైన్ వేలంలో దీన్ని 304 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఈ బీరు బాటిల్ని స్టోర్లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ బీరు బాటిల్పైన పాత పేపర్తో లామినేటెడ్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్ని బట్టి ఈ బీరు బాటిల్ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్లుగా తెలుస్తోంది. కాగా సర్ ఎడ్వర్డ్ బెల్చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (10శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్సైట్ తెలియజేస్తోంది.ఎరేబస్, టెర్రర్ , వారి సిబ్బందిని కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాల తర్వాత బీర్ బాటిల్ కనుగొన్నారట. దురదృష్టవశాత్తు, ఇద్దరు సిబ్బందికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు. -
బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపితే తెలంగాణ రాష్ట్రానికే తగిన ఆదాయం దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్ కూడా కేటాయించకుండా ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని తెలిపారు. సింగరేణిలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టంచేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. అలాగే సింగరేణికి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే 3 బొగ్గు గనులు కేటాయించినట్లు గమనించాలని సూచించారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని, వేలం మార్గాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రాయల్టీ, ఆదాయం విషయంలో గండి పడుతోందని జోషి వెల్లడించారు. -
అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన పాత, అరిగిపోయిన చెప్పులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. 1970, 80ల కాలంలో ఆయన వేసుకున్న బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్ నిర్వాహకుడు వెల్లడించారు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! ఈ వేలం నవంబర్ 11న మొదలు కాగా, నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది. బిడ్ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్ఎఫ్టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్"ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" ను కూడా దక్కించుకోవచ్చు. (క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!) ఆయనకి ప్రత్యేకంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు, సాధారణంగా ఉంటూనే, అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టేవారని వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ వార్డ్రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. ఒక బిజినెస్ మేన్గా స్పెషల్గా కంటే కూడా సింపుల్ డిజైన్, చెప్పులు కంఫర్ట్గా ఉన్నాయో లేదో మాత్రమే ఆలోచించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట. మరోవైపు ఈ సాండిల్స్ను ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్లోని బిర్కెన్స్టాక్ హెడ్క్వార్టర్స్, న్యూయార్క్లోని సోహోలో, జర్మనీలోని కొలోన్లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో వీటిని ఉంచారు. అలాగే 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్,ఇటీవల, జర్మనీ స్టట్గార్ట్లోని ది హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్లో ఉంచడం విశేషం. (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) కాగా ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్, స్టీవ్జాబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1976లో యాపిల్ సంస్థను నెలకొల్పి కోట్లాదిమంది అభిమానులతో యాపిల్ మ్యాక్స్, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచెస్..ఇలా యాపిల్ అనే బ్రాండ్ను విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. అందుకే రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్ టెక్ లీడర్గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకం. గతంలో చార్టర్ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018 ఏడాది నిర్వహించిన ఆక్షన్లో సుమారు రూ.1.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. -
ప్రకృతి అద్భుతం.. వెల కూడా అదే రేంజ్!
జెనీవా: ప్రకృతిలోని నిజమైన అద్భుతం అది. అందుకే వెల కూడా అదే స్థాయిలో రాబట్టింది. మంగళవారం స్విట్జర్లాండ్ జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో దాదాపు రూ.231 కోట్ల ధర($28.8 millions) పలికింది ఫార్చూన్ పింక్. అత్యంత అరుదైన రత్నం ఇది. ఆసియాకు చెందిన ఒక వ్యక్తి దీనిని సొంతంచేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు క్రిస్టీస్ జ్యువెలరీ విభాగపు అధినేత మాక్స్ ఫావ్కెట్ నిరాకరించారు. అయితే.. పదిహేనేళ్ల కిందట బ్రెజిల్ గనుల్లో ఆ వజ్రాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇక ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ గనుల్లో 16వ శతాబ్ధంలో బయటపడ్డాయి. ఆపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా గనుల్లో వీటిని గుర్తించారు. న్యూయార్క్, షాంగై, సింగపూర్, తైవాన్ తర్వాత జెనీవాలో పింక్ డైమండ్స్ వేలం నిర్వహిస్తున్నారు. -
అత్యంత అరుదైన పుర్రె.. వేలంలో ఏకంగా రూ. 162 కోట్లు
వేల సంవత్సరాల క్రితం డైనోసర్ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం. టెరన్నోసారస్ రెక్స్ అనే మరో డైనోసర్ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!. ఇది డైనోసర్లో అతి పెద్ధ సరీసృపం. వీటిని టీ రెక్స్గా వ్యవహరిస్తారు కూడా. ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట. ఐతే వీటీని టెరన్నోసారస్ రెక్స్ అని ఎందుకంటారంటే..లాటిన్లో టీ రెక్స్ అంటే రాజు అని అర్థం. అతిపెద్ద థెరోపాడ్ డైనోసార్ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ టీ రెక్స్ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది. దీన్ని వేలం వేస్తే దాదాపు రూ. 162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు. వివరాల్లోకెళ్తే.....యూఎస్లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్ డైనోసర్ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు. ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు. ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ టైరన్నోసారస్ తన జాతిలో మరో టైరన్నోసారస్తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు. ఈ పుర్రెని మాక్సిమస్గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!) -
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
‘గోల్డెన్ కనరీ’ వజ్రం.. ధర రూ.123 కోట్లు.. అంచనా మాత్రమే!
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్ద పసుపు రంగు ‘గోల్డెన్ కనరీ’ వజ్రం ఇది. దుబాయ్లోని సోత్బేస్ ప్రదర్శనలో ఉంచారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్లో న్యూయార్క్లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించినపుడు దీని బరువు 890 క్యారెట్లు. తర్వాత పలుమార్లు సానబట్టి ముక్కలుగా మారింది. చివరకు 303.10 క్యారెట్లకు తగ్గించారు. అదే ఈ వజ్రం. డిసెంబర్ 7న న్యూయార్క్లో ఇది రూ.123 కోట్ల ధర పలకొచ్చని ఒక అంచనా. ఇదీ చదవండి: పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం -
అదృష్టం అంటే ఇది.. కిచెన్లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
స్వగృహ వేలం 2.0
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సర్కారు.. మరో విడత ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆస్తుల రెండో విడత వేలానికి ఏర్పాట్లు చేస్తోంది. 10 జిల్లాల పరిధిలోని 19 ప్రాంతాల్లో ఉన్న నివాస, వాణిజ్య స్థలాలతోపాటు గృహాల జాబితాలను సిద్ధం చేసింది. తొలి విడతలో 9 జిల్లాల పరిధిలోని రాజీవ్ స్వగృహ ఆస్తులను విక్రయించి, రూ.503 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సర్కారు.. ఈసారి కనీసం రూ.1,000 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో ప్రకటన రెండో విడత స్వగృహ ఆస్తుల వేలానికి ఈ నెల 11న వేలం ప్రకటన జారీ చేయనున్నారు. 14వ తేదీ నుంచే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.9 వేల కోట్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేసి దాదాపు రూ.నాలుగు వేల కోట్లను సమీకరించింది. తాజాగా రెండో విడత స్వగృహ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది. ప్లాట్లు, ఇళ్లతోపాటు ఖాళీ స్థలాలు కూడా.. ఈ–వేలంతో పాటు భౌతికంగా నేరుగానూ వేలం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, తుర్కయాంజల్, కుర్మాలగూడ, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బహదూర్పల్లి ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్లాట్లతోపాటు మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ లేఅవుట్లోని కమర్షియల్ ప్లాట్లకు హెచ్ఎండీఏ ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా చందానగర్, కవాడిపల్లిలోని ప్లాట్లకు టీఎస్ఐఐసీ ఆన్లైన్ ద్వారా వేలం జరపనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీఎస్ గావ్, మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాపూర్, పోతులమడుగు, నిజామాబాద్ జిల్లాలోని మల్లారం, కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు, నల్లగొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్లలోని ప్లాట్లు.. వికారాబాద్ జిల్లాలోని ఆలంపల్లి, గంగారాం ప్రాంతాల్లోని రెండు ఖాళీస్థలాలకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సాధారణ వేలం నిర్వహించనున్నారు. ఖమ్మం టౌన్షిప్లోని 6.9 ఎకరాల ఖాళీ స్థలానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎకరాకు రూ.3 కోట్ల కనీస ధరతో వేలం పాట చేపడతారు. నివాస ప్లాట్లకు కనీస ధర (అప్సెట్ ప్రైస్)గా చదరపు గజానికి.. జిల్లాల్లో రూ.7 వేల నుంచి రూ.12 వేలు, హెచ్ఎండీఏ/టీఎస్ఐఐసీ పరిధిలో రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖరారు చేశారు. గృహాల విషయానికి వస్తే.. చదరపు గజానికి రూ.10,500, రూ.12 వేలు కనీస ధర నిర్ణయించారు. వేలానికి అంతా సర్వ సన్నద్ధం రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, జిల్లా కలెక్టర్లు వేలానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు సీఎస్కు నివేదించారు. వేలం వేయనున్న ఆస్తుల వివరాలు, లేఅవుట్లు, సైట్ ఫోటోలు, వేలం విధానం తదితర వివరాలను సంబంధిత సంస్థ వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ఆదేశించారు. -
రికార్డ్ ధర పలికిన అరుదైన ‘పింక్’ వజ్రం.. ఎంతంటే?
హాంకాంగ్: అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర 21 మిలియన్ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదీ చదవండి: 15 నిమిషాల రైడ్కు రూ.32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్ -
వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే..
అతిలోక సుందరి, దివంగ నటి శ్రీదేవి చీరలను వేలం వేస్తున్నారు. ఆమె నటించిన ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా తనదైన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆమె. 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో నటనకు విరామం చెప్పారు.ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. చదవండి: ట్రెండింగ్లో బాయ్కాట్ ఆదిపురుష్.. ‘బాలీవుడ్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’ ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. అమెరికా వెళ్లిన ఆమె ఇంగ్లిష్ రాక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ తర్వాత ఇంగ్లిష్లో ఎంతటి ప్రావీణ్యం పొందారనేదే కథ. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే! -
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క.. దానికో సెపరేటు ఇంట్రడక్షన్ మస్టు. ఇప్పటివరకూ వచ్చిన ఏ డైనోసార్ సినిమా చూసినా దాని తర్వాతే మరెవరైనా.. అలాంటి టీ రెక్స్ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. అంటే.. డైరెక్ట్గా రాక్షసబల్లి అని కాదు.. దాని అస్థిపంజరం అన్నమాట. తొలిసారిగా ఆసియాలో ఇదిగో ఈ 43 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ ప్రపంచంలో మరో రెండు టీ రెక్స్లను మాత్రమే వేలం వేశారట. చెప్పడం మరిచాం.. దీని పేరు షెన్ అట. ఏం చూసి ఆ పేరు పెట్టారని మాత్రం అడగకండి.. మాక్కూడా తెలియదు. మీరు గానీ.. దీన్ని కొనుక్కుంటే మీకు నచ్చినట్లుగా అప్పారావ్, సుబ్బారావ్ అని మార్చేసుకోవచ్చు. నవంబర్ 30న హాంకాంగ్లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ రూ.200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగుపొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..? చదవండి: అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా? -
పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు
తమిళసినిమా: ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందుకు కారణాలు అనేకం. ప్రధాన కారణం చిత్ర కథ దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి కలం నుంచి జారువాలిన నవల పొన్నియిన్ సెల్వన్. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నవల ప్రతులను అనేక మంది అనేకసార్లు ముద్రిస్తూనే ఉన్నారు. అంతగా తమిళ ప్రజల మనసుల్లో మమేకమై పోయింది ఈ నవల. మరో విశేషం ఏంటంటే దీనిని ఎంజీఆర్ నుంచి కమలహాసన్ వరకు చిత్రంగా మలచాలని ప్రయత్నించారు. చదవండి: Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం చివరికి దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, శరత్కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మి వంటి ముఖ్య తారలు నటించారు. ఏఆర్ రెహామాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం తొలిభాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచా ర కార్యక్రమాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముంబయికి చెందిన నటి ఐశ్వర్యారాయ్ కూడా ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. చదవండి: ఓటీటీ రిలీజ్కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఇంకా చెప్పాలంటే ఆమె యూనిట్కు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిపోయారు. అదే విధంగా ఇందులో నటించిన హీరోలు ఐశ్వర్యారాయ్తో ఫొటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చిత్రంపై మరింత హైప్ను పెంచేస్తున్నాయి. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రాజుల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఇందులో నటి ఐశ్వర్యారాయ్ నందినిగానూ, త్రిష కుందవై రాణిగానూ నటించారు. ఆ పాత్రల కోసం వీరిద్దరూ ధరించిన ఆభరణాలను వేలం వేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. -
మాజీ గర్ల్ఫ్రెండ్తో ఎలాన్ మస్క్ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే?
స్పేస్ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన షేర్ చేసే పోస్ట్ల నుంచి వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల వరకు ప్రతీది వైరల్ గా మారి వార్తల్లోకెక్కుతుంది. చివరికి మస్క్ టీనేజ్ ఫొటోలను వేలం వేయగా వాటికి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే వాటి కోసం జనాలు ఎగబడి మరీ లక్షలు పోసి కొన్నారు. మస్క్ టీనేజ్ ఫోటోలకి భారీ డిమాండ్.. ఏకంగా కోటి! ఎలాన్ మస్క్పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జెన్నిఫర్ గ్విన్ అనే యువతితో డేటింగ్లో ఉన్నాడు. ఇతర ప్రేమికుల మాదిరిగానే మస్క్ కూడా వారి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఆమెకు కొన్ని ఫోటోలు, ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో లేరు, ఎవరిపనుల్లో వారు బిజిగా ఉన్నారు. తాజాగా మస్క్ మాజీ గర్ల్ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ వీళ్లకు సంబంధించిన ఫొటోలను, వస్తువులను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. అందులో 18 ఫోటోలు, మస్క్ చేతితో వ్రాసిన పుట్టినరోజు కార్డు, తనకు బహుమతిగా ఇచ్చిన బంగారు హారాన్ని ఉంచింది. బోస్టన్కు చెందిన ఓ సంస్థ వేలం వేసింది. మస్క్, జెన్నిఫర్ కలిసి ఉన్న ఫోటో ఏకంగా రూ.1.3 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోటోను రివీల్ చేయలేదు. కాగా ఇంత మొత్తానికి ఆ ఫోటో అమ్ముడువుతుందని ఎవరూ ఊహించలేదట. మస్క్ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్కు రూ. 40 లక్షలు, బర్త్డే కార్డుకు రూ.13 లక్షలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విట్టర్తో లీగల్ వార్లో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో ట్విటర్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపిన మస్క్, ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్నారు. SOLD: Elon Musk’s ex-girlfriend sold photos and mementos for more than $165,000 @RRAuction.https://t.co/NNGUJwtBDd#Auction #Consign #RemarkableResults pic.twitter.com/QTbjbefU5Q — RR Auction (@RRAuction) September 15, 2022 చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
ఇక నుంచి మీకు గిఫ్టులు ఎవరూ ఇవ్వరనుకుంటా సార్!
ఇక నుంచి మీకు గిఫ్టులు ఎవరూ ఇవ్వరనుకుంటా సార్! -
రికార్డులు బద్దలు.. రూ. 60 లక్షలు పలికిన లడ్డూ! ఎక్కడంటే..
సాక్షి, బండ్లగూడ: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో రూ. 60.83 లక్షలు పలికింది. సన్సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని ఆర్మీ దివ్యా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. | గతేడాది ఈ లడ్డూ రూ.41 లక్షలు పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు , అల్వాల్ కానాజీగూడ లడ్డూ రూ. 46 లక్షలు పలికాయి. వీటి రికార్డును బ్రేక్ చేస్తూ బండ్లగూడ జాగీర్ లడ్డూ రూ.60.83 లక్షలు పలకడం గమనార్హం. ఆర్వీ దివ్యా ట్రస్ట్కు డాక్టర్ అర్చనాసిన్హా, పూర్ణిమా దేశ్పాండే మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు. ఇదీ చదవండి: నష్టాల సాకు.. బస్సులకు బ్రేక్! -
దక్షిణాఫ్రికా టీ20 లీగ్.. వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు!
దక్షిణాఫ్రికా సరికొత్త టీ20 టోర్నీ (ఎస్ఏ20 లీగ్) వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ టోర్నీ వేలంలో 18 దేశాలకు చెందిన 500 మంది పైగా ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. ఈ ఎస్ఏ20కు సంబంధించిన వేలం సెప్టెంబర్ 19న జరగనుంది. అదే విధంగా ఈ వేలంలో సౌతాఫ్రికా నుంచి మొత్తం 17 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కాగా టోర్నీ నిభందనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ 10 మంది ప్రోటీస్ ఆటగాళ్లతో పాటు 7 మంది విదేశీ ప్లేయర్స్తో ఒప్పందం కుదర్చుకోవాలి. అదే విధంగా ప్లేయింగ్ ఎలెవన్లో ఎడుగురు స్థానికఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్స్కు అవకాశం ఇవ్వాలి. ఇక ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే మొత్తం ఆరు జట్లును ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్టౌన్, జోహెన్నెస్బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకున్నాయి. చదవండి: IPL 2023: సన్రైజర్స్ బాటలోనే పంజాబ్.. కొత్త కోచ్ ఎంపిక ఖరారు -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్తో కలిసి మైక్రోసాఫ్ట్ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్కప్లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్న్యూస్ -
మాజీ ప్రేయసితో ఎలాన్ మస్క్ ఫోటోలు, గిఫ్ట్స్ వేలం: వైరల్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ఎలాన్ మస్క్ ఫోటోలు, బహుమతుల వేలం అంశం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ పాత బహుమతులను, ఫోటోలను వేలానికిపెట్టింది. జంటగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, కార్డులు, ఇతర దాదాపు 20 అంశాలను అమ్మకానికి పెట్టడం గమనార్హం. RR వేలం వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ వేలం సెప్టెంబర్ 14న ముగియనుంది. ఫోటోలతో పాటు, తన మాజీ ప్రియుడు, బిలియనీర్ మస్క్ సంతకం చేసిన పుట్టినరోజు కార్డును కూడా విక్రయిస్తోంది, 'హ్యాపీ బర్త్ డే బూ-బూ' లవ్ ఎలోన్" అని రాసి కార్డును ఆక్షన్కిపెట్టింది. మస్క్ 20 ఏళ్ల వయసులో జంటగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్ బిల్లుఈ వేలంలో అమ్మకానికి ఉన్నాయి. అలాగే పుట్టిన రోజున గ్విన్కి మస్క్ ఇచ్చిన 14కే గోల్డ్ నెక్లెస్ను కూడా విక్రయిస్తోంది. అలాగే మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 1995లో గ్విన్కి మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ఇప్పటికే 1,300 డాలర్లకు చేరుకుంది. దీని అంచనా విలువ 10వేల డాలర్లు. ప్రస్తుతం డాలర్ బిల్పై వేలం జోరుగానే నడుస్తోంది. ఇది 5వేల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా. అయితే సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే మస్క్ ఈ వేలం వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. కాగా గ్విన్ తన సవతి కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈ వస్తువులను వేలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో అతనితో కలిసి నివసిస్తోంది. మస్క్ 1994 చివరిలో గ్విన్కి ఈ కార్డుతోపాటు బంగారు హారాన్ని ఇచ్చాడు. మస్క్ , గ్విన్ 1994-1995లో డేటింగ్ చేశారు. -
మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్కేసులో ఏముందంటే...
New Zealand police investigating the suspected murder: ఆన్లైన్ వేలంలో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉంటున్న ఒక కుంటుంబం ఒక సూట్కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్కేస్ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్తో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు. పాపం ఎంత ఆత్రుతగా ఆ సూట్ కేసు తెరిచి చూస్తే... వారికి గుండె ఆగినంత పని అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే... ఆ సూట్కేసులో ఇద్దరు చిన్నారుల మృతదేహా అవశేషాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ సూట్కేసుని పరిశీలించి నరహత్య జరిగిందేమోనన్న కోణంలో విచారించడం మొదలు పెట్టారు. మృతి చెందిన చిన్నారులిద్దరు ఐదు నుంచి 10 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని , కొంతకాలం క్రితమే చనిపోయినట్లు వెల్లడించారు. ఈ సూట్కేసులు చాలా కాలం పాలు నిల్వలో ఉన్నాయని, దీని మాన్యుఫ్యాక్చరింగ్ వివరాలు జోడించకుండా ఆన్లైన్లో అమ్మాకానికి పెట్టినట్లు తెలిపారు. ఆ పిల్లలు ఎవరనేది అధికారికంగా గుర్తించాల్సి ఉందని అన్నారు. ఆ పిల్లల కుటుంబాలకు వారు చనిపోయినట్లు బహుశా తెలియకపోవచ్చు అని అన్నారు. పిల్లలు ఎలా చనిపోయారు, ఏం జరిగింది అనే దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారించడం ప్రారంభించారు. (చదవండి: పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు.. గమ్యస్థానం దాటేసిన తర్వాత మేలుకున్నారు!) -
న్యూయార్క్లో చోళ్ల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం
చెన్నై: చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్లోని బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు. ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, నెక్లెస్లు, ఆర్మ్బ్యాండ్లు, వస్త్రాలతో రూపొందించి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
సై అంటై సై.. రెండో రోజు బిడ్లు@ రూ.1.49 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రంను కేటాయించేందుకు నిర్వహిస్తున్న వేలంలో టెల్కోలు గట్టిగా పోటీపడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. తొలి రోజున నాలుగు రౌండ్లు నిర్వహించగా, టెల్కోలు రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లను దాఖలు చేశాయి. రెండో రోజైన బుధవారం మరో అయిదు రౌండ్లు జరిగాయి. వేలం ప్రక్రియ మూడో రోజున (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
5జీ వేలం.. పోటీలో అంబానీ, అదానీ.. నువ్వా నేనాఅంటూ..
న్యూఢిల్లీ: 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. బిడ్డర్ల వ్యూహాలు, రేడియో తరంగాలకు గల డిమాండ్ బట్టి వేలం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుందని వివరించాయి. 4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సర్వీసులకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పోటీపడుతోంది. చాలా మటుకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో కనీస ధరకే బిడ్లు రావచ్చని, వేలం రెండు రోజుల పాటు జరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: Ford: భారీ షాక్.. భారత్ నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ! -
వేలంలో రూ. 3 లక్షలు పలికిన స్పెషల్ చేప.. ఎందుకో తెలుసా.?
భువనేశ్వర్: ఎన్నో ఔషధ, పోషకాలతో కూడిన క్రోకర్ చేప ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్ ఉల్లా వేసిన వలలో 32కిలోలు ఉన్న ఈ భారీ జలపుష్పం లభ్యమైంది. దీనిని చాంద్బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేయగా, ముంబైకి చెందిన ఔషధాల కంపెనీ రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే ఈ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప కూడా అంటారు. స్థానిక భాషలో తెలియా అని వ్యవహరిస్తారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్, జపాన్ దేశాల వారు దిగమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. క్రోకర్ చేప గుండెను సీ గోల్డ్గా కొనియాడతారు. దీనిని ఎయిర్ బ్లాడర్తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె శస్త్రచికిత్సలో కుట్లు వేసేందుకు వినియోగించడంతో గిరాకీ విపరీతంగా ఉంటుంది. క్రోకర్ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్సింఘ్పూర్ జిల్లా పారాదీప్ తీరంలో క్రోకర్ చేప వలకు చిక్కగా.. దీని ధర రూ.లక్షా 10 వేలకు పరిమితమైంది. ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
పందెం కోడి రూ.30 వేలు.. 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థావరంలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు శనివారం సంగారెడ్డిలోని ఎక్సైజ్ కోర్టు వేలం పాట నిర్వహించింది. ఇందులో అత్యధికంగా ఓ పందెం కోడి రూ.30 వేలు పలికింది. మొత్తం 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం లభించింది. 46 మంది వేలంపాటలో పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ శివారులో ఓ ఫాంహౌస్లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 7వ తేదీ రాత్రి కోళ్ల పందేల స్థావరంపై దాడి చేశారు. అక్కడ 22 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద రూ.13.12 లక్షల నగదు, 24 సెల్ఫోన్లు, 31 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తాను కోడిపందేల స్థావరం వద్ద లేనని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింతమనేని సోషల్ మీడియాలో బుకాయించారు. అయితే పోలీసులకు లభించిన వీడియోలను పరిశీలించగా చింతమనేని అక్కడే ఉన్నట్టు స్పష్టమైంది. పోలీసులు రావడం చూసి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించింది. పరారీలో ఉన్న ఏ1 చింతమనేనిని పట్టుకోవడం కోసం సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు మూడు బృందాలను నియమించారు. కాగా వేలం పాటలో వచ్చిన రూ.4.46 లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ హన్మంతరావు పేర్కొన్నారు. -
టెలికంలోకి అదానీ!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్ అంబానీ), ఎయిర్టెల్ (సునీల్ మిట్టల్), వొడాఫోన్ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్ ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. -
జయలలిత వస్తువులు వేలం వేయండి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించిన సీబీఐ అధికారులు సీజ్ చేసిన లక్షలాది రూపాయల ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కర్ణాటక హైకోర్టు సీజేకు బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి లేఖలు రాశారు. 2016లో జయలలిత మరణించగా, అంతకుముందు 1996లోనే అక్రమ ఆస్తుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ అధికారులు చెన్నై పోయెస్గార్డెన్లోని అత్యంత ఖరీదైన గృహోపకరణాలు, ఫర్నిచర్, దుస్తులను సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. వీటిని కర్ణాటక విధాన సౌధలోని ప్రభుత్వ ట్రెజరీలో ఉంచారని తెలిపారు. 26 ఏళ్లుగా ట్రెజరీలో ఉన్న ఈ ఆస్తులను వేలం వేసి, ఆ సొమ్మును ప్రజా సంక్షేమానికి వినియోగించాలని విన్నవించారు. చదవండి: (Maharashtra Crisis: అప్పుడు కుక్కలు, పందులు.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?) -
రాయల్ ట్వింకిల్, సిట్రస్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. రాయల్ ట్వింకిల్ స్టార్ క్లబ్ ప్రయివేట్ లిమిటెడ్, సిట్రస్ చెక్ ఇన్స్ లిమిటెడ్కు చెందిన 39 ఆస్తుల(ప్రాపర్టీలు)ను జులై 15న వేలం వేయనుంది. ఇందుకు రూ. 66.51 కోట్లను రిజర్వ్ ధరగా నిర్ణయించింది. అక్రమంగా వేల కోట్ల నిధులను సమీకరించిన ఈ కంపెనీల నుంచి సొమ్మును రికవర్ చేసేందుకు వేలాన్ని చేపడుతోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకూ వేలాన్ని నిర్వహించనున్నట్లు సెబీ నోటీసులో తెలియజేసింది. వేలంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డామన్, దాద్రా నగర్ హవేలీలలోగల ఆఫీస్ కార్యాలయాలు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు, భూములు, భవనాలు తదితర ఆస్తులను విక్రయించనుంది. 2019 నవంబర్ నుంచి 2022 మార్చి మధ్యలో 266 ప్రాపర్టీలను రూ. 1,297 కోట్ల రిజర్వ్ ధరలో వేలం వేసింది. సిట్రస్ చెక్ ఇన్స్ ద్వారా కలెక్టివ్ పెట్టుబడి పథకాల(సీఐఎస్)ను చేపట్టిన రాయల్ ట్వింకిల్ డైరెక్టర్లు, సిట్రస్ చెక్ ఇన్స్కు సెబీ 2018 డిసెంబర్లో రూ. 50 లక్షల జరిమానా విధించింది. కాగా.. 2019 డిసెంబర్లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలమేరకు ఆరు నెలల్లో 114 ప్రాపర్టీల విక్రయానికి సెబీ చర్యలు చేపట్టింది. టైమ్షేర్ హాలిడే పథకాలపేరిట రూ. 2,656 కోట్లకుపైగా అక్రమంగా సమీకరించడంతో 2015 ఆగస్ట్లో రాయల్ ట్వింకిల్, దాని నలుగురు డైరెక్టర్లపై సెబీ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. -
5జీ కమింగ్ సూన్: దాదాపు 10 రెట్ల వేగంతో
సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది. 5జీ సేవల బిడ్డర్లకు స్పెక్ట్రమ్ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్వర్క్లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్వేవ్లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు. ఎయిర్వేవ్ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్హాల్ క్యారియర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. కొత్త శకానికి నాంది 5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు.