Biometric
-
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్పోర్ట్లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్పోర్ట్ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్లైన్స్లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
మట్టి పలకల నుంచి... మైక్రోచిప్పుల దాకా...!
మైక్రోచిప్పులు, హోలోగ్రామ్లు, బయోమెట్రిక్ ఫోటోలు, బార్ కోడ్లతో నిండిన నేటి పాస్పోర్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అద్భుతాలు. ఇప్పుడు మనం చూస్తున్న పాస్ పోర్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తయారైంది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. కానీ దాని మూలాలు సహస్రాబ్దాల నాటివి. మానవ చరిత్ర ప్రారంభ యుగాల్లో ఎలాంటి సరిహద్దులు లేవు. స్వేచ్ఛా వలసలు ఉండేవి. తర్వాత ఉద్భవించిన నాగరికతలు భూమిని విభజించడమే గాక అన్వేషణ, పరిశోధనల సారాన్ని మార్చేశాయి. ఆ క్రమంలో సురక్షితంగా దేశాలు దాటేందుకు అధికారిక పత్రంగా పాస్పోర్టు పుట్టుకొచ్చింది.క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో మెసపొటేమియాలో ప్రయాణ అనుమతులకు మట్టి పలకలు వాడారు. ఒకరకంగా వీటిని అత్యంత పురాతన పాస్పోర్టులుగా చెప్పవచ్చు. పురాతన ఈజిప్టులో ప్రయాణికులు, వ్యాపారుల భద్రత కోసం అధికారిక లేఖలను ఉపయోగించారు. భారత ఉపఖండంలో ప్రయాణాలను మౌర్య సామ్రాజ్య కాలం నుంచి డాక్యుమెంట్ చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అవి నేటి ప్రయాణ అనుమతుల వంటివి కావు. కేవలం ప్రయాణికుల ప్రవర్తన తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలుగా మన్నన పొందేవి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలో ప్రయాణాలను సులభతరం చేయడానికి, రక్షణ, అధికారిక ఆమోదాన్ని తెలపడానికి శాసనాలు జారీ చేశారు.మొదటి ప్రపంచ యుద్ధంతో..యూరప్ వలసవాదులు ప్రస్తుత పాస్పోర్ట్ వ్యవస్థ రూపశిల్పులని చెప్పవచ్చు. అన్వేషణలో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా కలియదిరిగి భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లారు. 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రయాణాల్లో కొన్ని పద్ధతులు వచ్చి చేరాయి. ఆరోగ్య పరీక్షలు, కొన్ని ప్రశ్నలతో సరిహద్దులు దాటనిచ్చేవారు. అప్పటికి ప్రయాణ పత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత ప్రమాణమంటూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పాస్పోర్ట్ నియంత్రణ స్వరూపం నాటకీయంగా మారింది. సంఘర్షణ నేపథ్యం నుంచి పుట్టిన నానాజాతి సమితి శాంతి, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ప్రయాణానికి ప్రామాణిక వ్యవస్థను రూపొందించింది. 1921 నాటికి కఠినమైన వలస నియంత్రణలను విధించడానికి అమెరికా నాటి రాజకీయ అవకాశాలను ఉపయోగించుకుంది. ఎమర్జెన్సీ కోటా చట్టం, 1924 ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచి్చంది. ఇవి వలసల ప్రవాహాన్ని తగ్గించాయి. ఒకప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఉన్న పాస్పోర్టు ఆ తరువాత పాశ్చాత్య కేంద్రీకృత శక్తులు ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే నియంత్రణ సాధనంగా మారింది.మొగలుల కాలంలో.. మధ్యయుగానికి వచ్చే నాటికి ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రగతి సాధించింది. ప్రయాణాల పర్యవేక్షణ, నియంత్రణకు భారత ఉపఖండమంతటా పలు రకాల చట్టబద్ధత, ఆమోదంతో కూడిన పత్రాలు జారీ చేసేవారు. మొగల్ చక్రవర్తులతో పాటు ప్రాంతీయ పాలకులుం కూడా ప్రయాణికులకు, వ్యాపారులకు, యాత్రికులకు, దౌత్యవేత్తలకు ‘సనద్’లు, సురక్షిత ప్రవర్తన లేఖలు జారీ చేశారు. వాణిజ్య, సాంస్కృతిక మారి్పడిని ప్రోత్సహించి వారు సురక్షితంగా ప్రయాణించేలా చూశారు. శతాబ్దాల క్రితంం వెలుగు చూసిన ‘సౌఫ్ కండిక్ట్’ (సేఫ్ కండక్ట్) పాస్ను ప్రాథమిక ప్రయాణ పత్రంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రధానంగా పాలకుల మధ్య లిఖితపూర్వక ప్రతిజ్ఞ. యుద్ధ భయం లేకుండా సరిహద్దులు దాటి సురక్షితంగా ప్రయాణించేలా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వంటిది.1920 నాటి ‘పాస్పోర్ట్ తీర్మానం’ అంతర్జాతీయ ప్రయాణాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూనే, అసమానతలకు పునాది వేసిందంటారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పాస్పోర్ట్ ఉండేది కాదు. భర్తల పాస్పోర్టులోనే ఫుట్ నోట్సులో భార్య పేరు పేర్కొనేవారు. దాంతో వారు స్వతంత్రంగా సరిహద్దులను దాటలేకపోయారు. ఇవన్నీ నాటి సమాజ లింగ అసమానత, మహిళలపై వివక్షకు అద్దం పట్టేవే. ఇటీవలి దశాబ్దాల్లో పాస్పోర్ట్ ప్రపంచ రాజకీయాలు, మార్కెట్ శక్తుల ఇష్టాలకు లోబడి డిమాండ్ ఉన్న వస్తువుగా మారిపోయింది. 2016లో అమెరికాలోనే ఏకంగా 1.86 కోట్ల పాస్పోర్టులు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్ ఎంతటిదో అర్థమవుతోంది. ప్రపంచానికి ప్రవేశ ద్వారమైన పాస్పోర్ట్ కొందరికి అధికార చిహ్నం. మరికొందరికి మినహాయింపులకు సాధనం. మనం పుట్టిన దేశాన్ని బట్టి, పాస్ పోర్ట్ మనకు అత్యంత సౌలభ్యాన్ని ఇవ్వొచ్చు. లేదా విపరీతమైన బాధను కలిగించవచ్చు. -
యూపీఐ పేమెంట్స్లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
'ఫేస్ స్కాన్ చేసి.. టైమ్ సేవ్ చేస్తుంది': బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొత్త టెక్నాలజీ
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)ను నిర్వహిస్తున్న.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) దేశంలోనే మొట్ట మొదటి బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇంతకీ ఈ 'బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సర్వీస్ అంటే ఏమిటి? ఇదెలా పనిచేస్తుంది? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో..గతంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్ల వద్ద బోర్డింగ్ పాస్ను ప్రింట్ చేసి, బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిని స్కాన్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పింది.ఇప్పుడు ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తప్పా ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో.. బెంగుళూరు విమానాశ్రయానికి సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి అని పేరు వచ్చింది.ఇదెలా పనిచేస్తుందంటే?ప్రయాణికులు సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాఫ్ట్ మెషన్లో బ్యాగేజ్ డ్రాఫ్ట్ కోసం స్కాన్ ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకోవాలి.ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకుని కొనసాగించడానికి డిజియాత్ర ఐకాన్ ఎంచుకోవాలి. తరువాత ప్రయాణీకులను వారి బయోమెట్రిక్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేరుగా కెమెరాలోకి చూడమని నిర్దేశిస్తుంది.ఇది పూర్తయిన తరువాత మెషన్ ఫ్లైట్ వివరాలను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళుతున్నారో లేదో ప్రకటించమని వారిని ప్రాంప్ట్ చేస్తుంది. ప్రయాణికులు ప్రకటించిన తర్వాత.. మెషన్ ప్రయాణికుడికి బ్యాగ్ను కన్వేయర్పై ఉంచమని నిర్దేశిస్తుంది. ఇది బ్యాగేజ్ ట్యాగ్ను జత చేయమని వారిని అడుగుతుంది.బ్యాక్ వెయిట్ వేయడం కూడా పూర్తి చేసి మెషన్ స్కాన్ చేస్తుంది. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్లో ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది. ఆ తరువాత బ్యాగేజీ సంబందించిన రసీదు కూడా అందిస్తుంది.నిర్దేశించిన లగేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. చెల్లింపును పూర్తి చేయడానికి ప్రయాణికులు కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. బయోమెట్రిక్లను ఎంచుకోకూడదనుకునే వారు తమ బోర్డింగ్ పాస్ను స్కాన్ చేయడం కొనసాగించవచ్చు, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ఎంచుకోవచ్చు.బెంగుళూరు విమానాశ్రయంలో ఆటోమేటెడ్ 'సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సిస్టమ్ 2018లోనే అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండటానికి 2019లో డిజియాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని తీసుకువచ్చారు.🚨 Bengaluru airport launches India's first biometric-enabled self-bag drop facility. pic.twitter.com/qm1qhzJc1E— Indian Tech & Infra (@IndianTechGuide) June 6, 2024 -
అంగన్వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు రాష్ట్రంలో 12,315 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఆరు నెలలకోసారి వారోత్సవాలు.. మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆరి్టఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ బయోమెట్రిక్ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కారి్మకులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దురి్వనియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కారి్మకులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్లు, సీఎంఓహెచ్కు సైతం వాటాలున్నాయని కారి్మకులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్సెట్లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్తో.. ఫేషియల్ రికగి్నషన్ను మొబైల్ ఫోన్తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్లో ఫేషియల్ రికగ్నిషన్తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్తో పాటు వెబ్పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కారి్మకులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కారి్మకుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహా్వనించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్కు సిద్ధమవుతోంది. -
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్–2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధ వారం నుంచి మొదలవుతుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦ ఎ–4 సైజ్లో అడ్మిట్ కార్డును కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ♦ మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్ను సొంతంగా సమకూర్చుకోవాలి. ♦ ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది. -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
గ్రూప్-1 ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
మెడికల్ కాలేజీలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మూడు బయోమెట్రిక్ మిషన్లు, ఒక్కొక్క ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బయోమెట్రిక్తోపాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే హాజరు నమోదు చేస్తుండగా, వీటిని నేరుగా డీఎంఈకి అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇకపై వీరి పర్యవేక్షణను జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) కమాండ్ కంట్రోల్ నుంచే చేసేలా చర్యలు తీసుకుంటోంది. నేరుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఉద్యోగుల హాజరును పరిశీలించనున్నారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు హాజరైనప్పుడు ఒకసారి, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేసి, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. గత నెలలోనే ఇందుకు సంబంధించిన అధునాతన బయోమెట్రిక్ పరికరాలను బిగించి, సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు. ఉద్యోగుల వివరాలన్నింటినీ సాఫ్ట్వేర్లో నమోదు చేసి వినియోగిస్తున్నారు. ఏ సమయానికి హాజరు అవుతున్నారు అనే దానితోపాటు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరుకు చెక్ మంచిర్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది 100 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇటీవల నీట్ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్లు పొంది చేరనున్నారు. ప్రతియేటా పెరుగుతున్న మెడిసిన్ విద్యార్థులకు అనుగుణంగా, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం 130 పడకలతో కొనసాగుతోంది. నె లలో 400కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ప్రతీ రోజు 150 మందికి పైగా గర్భిణులు ఓపీకి వస్తున్నా రు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 280 పడకలతో వైద్య సేవలు అందిస్తుండగా, అన్ని విభాగాల్లో అ సోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులను నియమిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 11 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 49 మంది, సీనియర్ రెసిడెంట్లు 44, ట్యూటర్లు 4, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 16 మంది ఉండగా, ఇతర వైద్య సిబ్బంది 20 మందికి పైగా ఉన్నారు. బయోమెట్రిక్ పరికరాలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాజరు సరిగ్గా పాటించని ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సమయపాలన పాటిస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేందుకు ఇప్పటికే మూడు చోట్ల బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నాం. డీఎంఈ నుంచి హాజరును పర్యవేక్షిస్తున్నారు. ఎన్ఎంసీకి అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం లాగిన్ఐడీ వస్తే, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదును డీఎంఈతోపాటు ఢిల్లీలోని ఎన్ఎంసీ పరిశీలిస్తారు. – డాక్టర్ ఎండీ సులేమాన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఎంసెట్కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్–2023 ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరుగుతుంది. 12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుంది. రెండు సెషన్లుగా ఉండే ఈ పరీక్ష, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ రెండో విడత జరుగుతుంది. 2 రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్ ఎంసెట్ 2,05,405 మంది, అగ్రి, మెడికల్ ఎంసెట్ 1,15,361 మంది రాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 104, ఆంధ్రప్రదేశ్లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాలని ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్ తెలిపారు. పరీక్ష రాసేవారికి జేఎన్టీయూహెచ్ కొన్ని సూచనలు చేసింది. బయోమెట్రిక్ తప్పనిసరి.. ► ఎంసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే బయో మెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు. ► ఉదయం పూట ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే వారు 7.30కే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యా హ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించరు. ► విద్యార్థులు బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ (రిజర్వేషన్ కేటగిరీ కుల ధ్రువీకరణ) పత్రాలతో మాత్రమే పరీక్ష హాలులోకి రావాల్సి ఉంటుంది. ► కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, పేజీలు, సెల్ఫోన్లు, రిస్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించరు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సమస్యలొస్తే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. అవసరమైన పక్షంలో వేరే కంప్యూటర్ అందిస్తారు. ► అభ్యర్థులు ఫొటో గుర్తింపు (జిరాక్స్ కాకుండా)తో పరీక్షకు హాజరవ్వాలి. కాలేజీ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్పై, ఆన్లైన్ ఫైల్ చేసిన అప్లికేషన్పై ఇన్విజిలేటర్ ఎదురుగా సంతకం చేయాలి. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
అడ్డగోలు అడ్మిషన్లుచెల్లవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఈ ఏడాది సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెరుగైన బోధన ఉండాల్సిందే.. ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్లైన్లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్కు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఫీడ్ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. -
టాటూలు.. మెహందీలు వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్పోర్ట్ సైజు ఫొటో(ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్టికెట్పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ... సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు. -
ఆధార్ తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?
సాక్షి, అమరావతి: ‘ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్ కార్డును అదే అడ్రస్ ప్రూఫ్తో అప్డేట్ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను కూడా ఇచ్చింది. ‘ఆధార్ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూఐడీఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్డేట్ చేయకపోవచ్చు. కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్ కుమార్ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ సమయంలో ప్రతి ఆధార్ కార్డుదారుడు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్డేట్ కాని కార్డులు 1.65 కోట్లు.. 2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్ అప్డేట్ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేక క్యాంపులు ఆధార్ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
డిజి యాత్ర యాప్లో నమోదు... సేవలు ఇలా!
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రయాణం మరింత సులభతరం కానుంది. దేశీయ ప్రయాణాల కోసం ఇక టెర్మినల్లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్ నుంచే బోర్డింగ్ పాస్ను స్కాన్ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం ఎయిర్పోర్టు ఆవరణలో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డిజి యాత్ర’ పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ తరహా సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడతో పాటు హైదరాబాద్, కోల్కతా, పూణే విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. డిజి యాత్ర యాప్లో నమోదు... సేవలు ఇలా... ► డిజి యాత్ర యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ యాప్లో వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్, చిరునామా, ఫొటో, ఆధార్ ఆధారిత ధ్రువీకరణపత్రం అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారునికి డిజి యాత్ర ఐడీ వస్తుంది. దానిని వినియోగదారులు నమోదు చేసుకోవాలి. ► విమాన టికెట్ బుకింగ్ సమయంలో డిజి యాత్ర ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలి. విమాన ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్ పాస్ను కూడా యాప్లో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు సదరు విమానాశ్రయానికి చేరుతాయి. ► ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత టెర్మినల్ బయట ఈ–గేట్ వద్ద డిజి యాత్ర యాప్ను ఉపయోగించి బోర్డింగ్ పాస్ బార్కోడ్ను స్కాన్చేసి, ఫేషియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత, ప్రయాణ వివరాలు సంబంధిత ఎయిర్లైన్స్ ఆన్లైన్లో ధ్రువీకరించుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే, బోర్డింగ్ పాయింట్ల వద్ద నిరీక్షించకుండా సులభంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి ప్రవేశించవచ్చు. ట్రయల్ రన్ దశలో... ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం ట్రయల్ రన్ దశలో ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి డిజి యాత్రలో నమోదైనవారి వివరాలతో ఈ సిస్టం పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు మరింత అవగాహన కలిగించేందుకు టెర్మినల్ ఆవరణలో డిజి యాత్ర యాప్కు సంబంధించిన స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విద్యార్థుల కోసం ఆధార్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వయసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూనియర్ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుంతో అదనంగా మరో 10 రకాల ఆధార్ సేవలను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్ (ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్) అప్డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్ వివరాల నమోదు, ఆధార్ కార్డు డౌన్లోడ్ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు. -
AP: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..
సాక్షి, అమరావతి: ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేస్తోంది. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్సింగ్ భార్య ఆత్మహత్య) -
30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్’ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్! తనిఖీల్లో బండారం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయతి్నంచగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నిషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్లో హాజరుకోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచి్చనట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. (చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్) -
రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొడ్డిదారులు వెతుక్కుంటూ డుమ్మా కొడుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని బయోమెట్రిక్ విధానం తీసుకువస్తే దానికి కూడా కొందరు వైద్యులు అడ్డదారులు వెతికారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని 12 మంది వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ఇతరులచే బయోమెట్రిక్ వేయించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వేలిముద్రలతో రబ్బర్ తొడుగులను తయారు చేయించి విధులకు హాజరు కాకుండా ఇతరులచే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించినట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. దొడ్డి దారిన హాజరు వేసిన 12 మంది వైద్యులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: (ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!) -
రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్కు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోటి మంది ఆధార్కు బయోమెట్రిక్ నమోదు కాలేదని, డిసెంబర్ నెలాఖరులోపు వారందరి బయోమెట్రిక్ను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,950 ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డిసెంబర్ నెలాఖరుకు నూరు శాతం ఆధార్కు బయోమెట్రిక్ సేకరించడం సాధ్యం కాదని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మొబైల్ క్యాంపుల సమాచారాన్ని ముందుగా వలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సూచించింది. విద్యా శాఖ భాగస్వామ్యంతో పాఠశాలల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగంగా ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 200 బయోమెట్రిక్ను సేకరించాలని స్పష్టం చేసింది. ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణకు మండల, డివిజన్ వారీగా అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలని తెలిపింది. పాఠశాలలు, సచివాలయాల్లో రోజు వారీగా ఆధార్ బయోమెట్రిక్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సూచించింది. -
‘ఫేషియల్ అథంటికేషన్’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్ అథెంటికేషన్’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్ ఫోన్లు, యాప్లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్ అథంటికేషన్ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగానే అది ఆధార్కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో ఐరిస్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్వేర్ ప్రొవైడర్కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్ ఫేషియల్ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్వేర్ ప్రొవైడర్కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆధార్ బేస్డ్ ‘ఫేషియల్ అథంటికేషన్’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి. ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. ఈ రెండు విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగానికి ఆమోదం లభించింది. సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్’ ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
నేరస్తుల చుట్టూ ముద్రావలయం
సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ని ఆదేశించింది. ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది. ప్రాథమిక విధానం ఖరారు నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్సీఆర్బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్సీఆర్బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు. సీఆర్పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది. డిజిటల్ రూపంలో భద్రం నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. -
బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!
దేశంలో ఆధార్ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు లోపు ఉన్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్ఫారమ్పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం.. -
అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నడుం బిగించింది. అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేని కళాశాలలకు చెక్ పెట్టేలా చర్యలకు సంసిద్ధమైంది. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ప్రతి కాలేజీలో 25 చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), రోగుల వివరాలు, స్థితిగతులు తెలుసుకునేలా (ట్రాకింగ్) హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) అమలు చేయాలని స్పష్టం చేసింది. కళాశాలల్లోని ఈ వ్యవస్థను ఢిల్లీలోని ఎన్ఎంసీ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. లైవ్ వీడియో ఫీడ్ను కమాండ్ సెంటర్కు షేర్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఎన్ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తద్వారా ప్రతి మెడికల్ కాలేజీని నేరుగా ఎన్ఎంసీ పర్యవేక్షించనుంది. మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు.. ►బోధన సిబ్బంది,సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్ల హాజరును నమోదు చేయడానికి సమర్థవంతమైన డిజిటల్ పరిష్కారం బయోమెట్రిక్ వ్యవస్థ. అందువల్ల నేషనల్ ఇన్ఫర్మేటి క్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఈ నెల పదో తేదీలోగా అమల్లోకి తేవాలి. ►మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లోని రోగుల లోడ్, ఇతర వివరాలను పర్యవేక్షించేందుకు హెచ్ఎంఎస్ను అమలు చేయాలి. అందుకోసం ఈ–హాస్పిటల్ సాఫ్ట్వేర్ను ఎన్ఐసీ అభివృద్ధి చేసింది. ఇది ఆసుపత్రి కౌంటర్లో రోగుల నమోదును సులభతరం చేస్తుంది. మొబైల్ ఓటీపీ, ఆధార్ మొదలైన వాటి ద్వారా రోగుల స్వీయ నమోదును సులభతరం చేస్తుంది. ►వైద్య విద్యపై నియంత్రణకు, ప్రత్యేకించి కొన్ని వైద్య కళాశాలలు తనిఖీల సందర్భంగా నకిలీ ఫ్యాకల్టీలను, రోగులను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న విధానాన్ని నిరోధించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుంది. ►మెడికల్ కాలేజీల ప్రాంగణంలోని తరగతి గదులు, ఇతర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. ప్రతిదీ ట్రాక్ చేయడానికి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయా కాలేజీలన్నిటినీ పరిశీలించడానికి వీలు కలుగుతుంది. ►కాలేజీల నుంచి లైవ్ ఫీడ్, బయో మెట్రిక్ హాజరు తదితరాల పర్యవేక్షణకు, సమన్వయం చేసేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి. ►ఏఈబీఏఎస్ పోర్టల్లో ఫ్యాకల్టీ మొత్తం స్వయంగా నమోదు చేసుకోవాలి. మెడికల్ కాలేజీ నోడల్ అధికారి హాజరును పర్యవేక్షిస్తారు. ►ఈ నెలాఖరు నాటికి మెడికల్ కాలేజీలు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. -
Biometric Scan: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే!
ఈ రోజుల్లో మోసగాళ్ల చేతికి దొరికిన కొత్త ఆయుధం నకిలీ బయోమెట్రిక్. దీని ద్వారా వివిధ రకాలుగా మన వేలిముద్రలు, ముఖాలు, ఐరిస్, అరచేతి ముద్రలు.. వంటివి సేకరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్లో రికార్డ్ చేసిన వేలిముద్రను నకిలీ పద్ధతుల్లో దొంగిలించి, వాటి ద్వారా స్కామ్లకు పాల్పడుతున్నారు. వీటిలో పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నకిలీ బయోమెట్రిక్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మన దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటలైజేషన్తో (మొబైల్ డేటా లేదా డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్ల వల్ల) అందరికీ తమ గుర్తింపును కాపాడుకోవడం అతిపెద్ద సవాల్గా మారింది. వాటిలో బయోమెట్రిక్ ఒకటి. బయోమెట్రిక్ స్కాన్... స్కాన్ ఆధారంగా వ్యక్తుల అసలైన గుర్తింపును సూచిస్తుంది బయోమెట్రిక్. ప్రత్యేకమైన జీవ లక్షణాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయంగా, సమయానుకూలంగా వ్యక్తులను గుర్తించడానికి, ప్రామాణీకరించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది వ్యక్తిగత ‘ఐడీ’ కార్డ్లు, మాగ్నెటిక్ కార్డ్లు, కీ లేదా పాస్వర్డ్ల వంటి సంప్రదాయ ప్రామాణీకరణ పద్ధతులను రూపుదిద్దుతుంది. దీని ద్వారా దొంగతనం, కుట్ర లేదా నష్టం సులభంగా జరగదు. అయితే, సాధారణంగా దురాశ లేదా భయం కారణంగా ప్రజలు సులభంగా నేరగాళ్ల ఉచ్చులో పడటం వంటి సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాల కారణంగా బయోమెట్రిక్ యాక్సెస్ కోల్పోతుంది. నకిలీ బయోమెట్రిక్స్... ►ఆస్తి రిజిస్ట్రేషన్ వంటి ఆర్థికేతర లావాదేవీల కోసం మోసగాళ్లు బయోమెట్రిక్ ద్వారా ఇన్సైడర్లను ఉపయోగిస్తారు. వాటిలో నకిలీ వేలిముద్ర, అలాగే వ్యక్తి ఆధార్ కార్డ్ నంబర్ను తీసుకుంటారు ►ఎమ్–సీల్, ఫెవికాల్ ఉపయోగించి ప్రింట్ తీసుకుంటారు. ►వేలిముద్రను https://www.remove.bg/ అప్లోడ్ చేయడం, ఆపై సెల్లోఫేన్ టేప్పై ప్రింట్ చేయడం ద్వారా వేలిముద్ర కచ్చితమైన ప్రతిరూపాన్ని రూపొందించడానికి మోసగాళ్లు సులభమైన పద్ధతులను ఉపయోగిస్తారు ►అలా పొందిన వేలిముద్రలను పెద్ద సంఖ్యలో డార్క్ వెబ్లో అప్లోడ్ చేస్తారు ►వేలిముద్ర ప్రతిరూపాన్ని సృష్టించిన తర్వాత, మోసగాడు ఆధార్ కార్డ్ నంబర్ ఏదైనా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందో లేదో చెక్ చేస్తాడు. ►ఏదైనా ఆర్థిక లావాదేవీ కోసం కార్డ్ని ఉపయోగించే క్రమంలో ఇది చాలా కీలకమవుతుంది. ►బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన అధార్ నెంబర్లతో తీసుకున్న నకిలీ బయోమెట్రిక్ను మోసగాడు మైక్రో ఎటీఎమ్ లేదా ఆధార్ ఆధారిత చెల్లింపు ప్రాసెసింగ్కు మద్దతు ఇచ్చే ఏ హ్యాండిల్డ్ పరికరంలోనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలా రక్షించుకోవాలి... ►వేలిముద్రలు ఎవరైనా దొంగిలించినట్లయితే వాటిని మార్చలేరు అనేది వాస్తవం. ►ఆధార్ వ్యవస్థలో సాంకేతిక లొసుగు లేనప్పటికీ, ఇటువంటి మోసాల వల్ల మొత్తం వ్యవస్థపై వినియోగదారు నమ్మకాన్ని తగ్గిస్తుంది. ►మొబైల్, ఇమెయిల్ (రిజిస్ట్రేషన్ / కరెక్షన్స్ సమయంలో) ఆధార్తో మీ వివరాలను తక్షణమే మార్చడాన్ని సులువు చేసింది. ►ఆధార్లో నమోదు చేసిన మీ ఫోన్ లేదా ఇ–మెయిల్ కోసం వన్ టైమ్ పాస్వర్డ్తో ప్రక్రియ పూర్తవుతుంది. ►సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లకు గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ ఫోన్ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్ నంబర్ను మార్చుకున్నా మీ ఆధార్ కార్డ్ని వెంటనే అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. ►బయోమెట్రిక్స్ లాకింగ్ ఐక్యూఐ స్కాన్లు, వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్లు వంటివి ఆధార్ కార్డ్కి లింక్ చేసి ఉంటాయి. ►ఈ విషయంలో మోసం చేయడం అంత సులభం కాదు. అయినా నకిలీ బయోమెట్రిక్ కేసులు నమోదయ్యాయి. ►అందుకని, ఆధార్ ఇప్పుడు బయోమెట్రిక్ లాకింగ్ ఎంపికతో వచ్చింది. దీనిని UIDAI లేదా mAadhaar యాప్లో సెట్ చేసుకోవచ్చు. ►వర్చువల్ ‘ఐడీ’ అన్ని eKYC ధృవీకరణకు ఆధార్ నంబర్ స్థానంలో 16 అంకెల సంఖ్యను ఉపయోగించవచ్చు. ఇది అన్ని వర్చువల్ లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. ►మీరు https://myaadhaar.uidai.gov.in/ నుండి డౌన్లోడ్ చేసుకొని, మాస్క్డ్ విఐడీ ని ఎంపిక చేసుకోవచ్చు. ►మాస్క్డ్ ఆధార్ నంబర్ 12 అంకెల సంఖ్య లేకుండా షేర్ అవుతుంది (చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి). ►మాస్క్డ్ ఆధార్ ఎంపిక ప్రాథమికంగా మీ ఆధార్ను మాస్క్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ►UIDAI పోర్టల్కి లాగిన్ చేసి, మీ ప్రామాణీకరణను ధృవీకరించుకోవచ్చు. ►ఇళ్ల ముందుకు ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజల అమాయకత్వాన్ని, వారి ఆశను ఆసరా చేసుకొని పెన్షన్లు లేదా ప్రభుత్వ లబ్ధి పొందడానికి ఆధార్, వేలిముద్రలను మోసగాళ్లు సేకరిస్తుంటారు. ►అందుకని, ప్రజలు తమ వేలిముద్రలు–ఆధార్ నంబర్ ఇచ్చేముందు ప్రభుత్వ సిబ్బంది అవునో కాదో తప్పక నిజనిర్ధారణ చేసుకోవాలి. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పిల్లల ఆధార్లో వేలి ముద్రల అప్డేట్
సాక్షి, అమరావతి: పిల్లలకు ఆధార్ కార్డులో వేలి ముద్రల అప్డేట్కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మూడు వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు ఆధార్ వేలి ముద్రల అప్డేట్ వంటి సేవలను పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆధార్లో చిరునామా మార్పు, తప్పులు సరిదిద్దడం వంటి సేవలను నిర్ణీత ఫీజుతో సచివాలయాల్లోనే అందిస్తోంది. ఇలా సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 5.63 లక్షల మంది ఆధార్ సేవలు పొందారు. పిల్లలకు ఆధార్లో వేలి ముద్రలు అప్డేట్ చేయడానికి ప్రభుత్వం ప్రతి నెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెలలోనూ బుధ, గురువారాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ సాగిలి షాన్మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ వివరాల నమోదు సంస్థ యూఐడీఏఐ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 1.09 కోట్ల మందికి ఆధార్లో వారి చిన్న వయస్సు నాటి వేలి ముద్రలే నమోదై ఉన్నాయి. అత్యధిక సంక్షేమ పథకాలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారానే లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే ఆధార్ కార్డు పొందిన వారు ఆధార్లో వేలి ముద్రలను అప్డేట్ చేయించుకోవాలి. లేదంటే వేలి ముద్రలు సరిపోలక పథకాలు అందుకొనే అవకాశం కోల్పోతారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం చిన్న వయస్సులో ఆధార్ కార్డు పొంది ఉంటే.. 15 ఏళ్ల తర్వాత వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాలి. ఐదేళ్ల వయస్సు లోపే ఆధార్ కార్డు పొంది ఉంటే, ఐదేళ్లు దాటిన తర్వాత ఒక విడత, 15 ఏళ్ల తర్వాత మరో విడత వేలి ముద్రలను అప్డేట్ చేసుకోవాలి. 15 ఏళ్లు ముగిసిన వెంటనే బడి పిల్లలు ఆధార్ వివరాల్లో వేలి ముద్రలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. స్కూళ్లవారీగా అర్హులను గుర్తించి, వారికి వలంటీర్ల ద్వారా సమాచారం ఇస్తోంది. గంటకు 15 మంది వేలిముద్రలు అప్డేట్ చేసుకునేలా ముందుగానే సమయం కేటాయిస్తోంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదుతో పాటు వివిధ రకాల ఆధార్ సేవలు అందిస్తోంది. గత నెల 29వ తేదీన 827 సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, దాదాపు 30 వేల ఆధార్ సేవలు అందజేసింది. -
బయోమెట్రిక్ బదులు ఇక ‘ఫేషియల్’
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానం స్థానంలో ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు. అదే ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి. బయోమెట్రిక్కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ ఖర్చుల్లోనూ ఆదా.. ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగా, అది ఆధార్కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందన్నారు. కేంద్రం, యూఏడీ అనుమతి తప్పనిసరి ఈ రెండూ విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందలన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం. కనీసం 150 మందిపై పరిశీలన తర్వాతే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ ఈ ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలుచేస్తున్నారు. ఐదు రోజులుగా ఉద్యోగుల హాజరును ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అమలుచేస్తున్నారు. మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. -
వైద్య శాఖలో బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. దీంతో బయోమెట్రిక్ హాజరు విధానం రోజురోజుకు గాడినపడుతోంది. ప్రజారోగ్య విభాగం పరిధిలో 1,690, వైద్య విధాన పరిషత్ పరిధిలో 277, డీఎంఈ పరిధిలో 54 ఆస్పత్రులు, ఇతర సంస్థలున్నాయి. ఈ విభాగాల్లో 49,805 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రజారోగ్య విభాగంలో 65 శాతం, వైద్య విధాన పరిషత్లో 80%, డీఎంఈలో 60 శాతానికిపైగా ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100% ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు చేపట్టారు. బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో లేని చోట వెంటనే వాటిని సరఫరా చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆస్పత్రులు, డీఎంహెచ్వో, ఆర్డీ కార్యాలయాలు, ఇతర సంస్థల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు రాబడుతున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని మాస్టర్ సాఫ్ట్వేర్కు అనుసంధానించాలని యోచిస్తున్నారు. విధులకు గైర్హాజరు కాకుండా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా 12 మంది సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేస్తూ గతేడాది ఉత్తర్వులు ఇచ్చింది. పీహెచ్సీలవారీగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి సిబ్బంది కొరతకు తావివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అవసరం లేకున్నా ఏదో ఒక సాకుతో జిల్లా, ఆర్డీ కార్యాలయాలకు వెళ్తున్నట్టు చెప్పి విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదకాకాని పీహెచ్సీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. నెలలో ఒక నిర్ణీత రోజు మాత్రమే ఆస్పత్రి పని మీద జిల్లా కార్యాలయానికి వెళ్లాలని పీహెచ్సీ సిబ్బందిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నివాస్ ఆదేశించారు. -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
బయోమెట్రిక్ హాజరు లేకుంటే అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–హైదరాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అప్డేషన్ సిస్టం (ఏబీఏఎస్)ను పక్కాగా అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. నూతన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని, నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏబీఏఎస్ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. బోధన సిబ్బంది, పోస్ట్రుగాడ్యుయేషన్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం తప్పకుండా వేలిముద్రలతో కూడిన హాజరు ఇవ్వాలని తేల్చిచెప్పింది.ఏబీఏఎస్ హాజరు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలపై నెలకు రూ.20వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును రద్దు చేసేందుకు సైతం వెనుకాడబోమని జేఎన్టీయూహెచ్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
జనరల్ బోగీల్లో సీటు గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో సాధారణ బోగీల్లో ప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారా.. బోగీల వద్ద కిక్కిరిసిన జనం మధ్యలోంచి రైల్లోకి ప్రవేశించలేకపోతున్నారా.. కష్టపడి రైలెక్కినా సీటు లభించక తీవ్ర నిరాశకు గురికావలసి వస్తోందా.. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు టోకెన్ తీసుకొంటే చాలు వారికి కేటాయించిన బోగీలో, సీటులో కూర్చొని నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు. రైలెక్కే సమయంలో టోకెన్ నంబర్ ప్రకా రం ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే బయోమెట్రిక్ టోకెన్ వ్యవస్థను సికిం ద్రాబాద్ స్టేషన్లో మంగళవారం ప్రారంభించింది. దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వరరావు, సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయి తే, సీట్లు నిండిన తర్వాత వచ్చే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాలా?.. వద్దా?.. అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రయాణం ఇలా... ►అన్రిజర్వుడ్ కోచ్లలో ప్రయాణించే వారు క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం లేకుండా, ప్రయాణికులలో గందరగోళం, తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ►ఈ యంత్రంలో మొదట ప్రతి ప్రయాణికుడి పేరు, రైలు నంబరు, పీఎన్ఆర్ నంబరు, అతడు/ఆమె వెళ్లవలసిన స్టేషన్, తదితర వివరాలను నమోదు చేస్తారు. ►ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారంలో భాగంగా వారి వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్ తీసుకుంటారు. అనంతరం బయోమెట్రిక్ యంత్రం ఆటోమెటిక్గా ఒక సీరియల్ నంబరుతో టోకెన్ను అందజేస్తుంది. ►ఈ టోకెన్ నంబర్ ప్రకారం ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్లలోనే రైలు ఎక్కాలి. ►ప్రయాణికులు టోకెన్ తీసుకున్నాక కోచ్ వద్దకు ప్రయాణ సమయానికి 15 నిమిషాలు ముందుగానే చేరుకోవచ్చు. భద్రతకు భరోసా... ►ఈ టోకెన్ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా లభించనుంది. జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడి ఫొటో, వేలిముద్రలు నమోదు కానున్న దృష్ట్యా నేరాల నియంత్రణకు అవకాశం లభించనుంది. ►అత్యంత రద్దీ ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బయోమెట్రిక్ టోకెన్ యంత్రం ఏర్పా టుచేయడం పట్ల సెక్యూరిటీ విభాగం, సికింద్రాబాద్ డివిజన్ అధికారులు, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. జనరల్ కోచ్లలో ప్రయాణించే అన్రిజర్వ్డ్ ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్లాట్ఫారాల వద్ద రద్దీ నివారణకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు శాఖాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తక్షణం సచివాలయంను అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. గతంలో సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు ఉందని, అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో బయోమెట్రిక్ హాజరును నిలుపుదల చేసినట్లు మెమోలో పేర్కొన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని ఇటీవల జరిగిన కార్యదర్శులు సమావేశంలో నిర్ణయించినట్లు మెమోలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు నెలవారీ నివేదికలను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు పరికరాలు సక్రమంగా పనిచేసేలా ఐటీ శాఖతో పాటు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరును కార్యాలయానికి వచ్చినప్పుడు, కార్యాలయం నుంచి వెళ్లే సమయాల్లో వేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్, డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇక నుంచి హెఆర్ఎంఎస్లోనే సెలవులకు దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి ప్రజల నుంచి వచ్చే వినతులను రోజూ తీసుకోవాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలకు హాజరై ప్రజా వినతులను స్వీకరించాలని, అదే సమయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్ అసిస్టెంట్, వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్ రిజిష్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రేపటి నుంచే బయోమెట్రిక్ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సచివాలయాల సిబ్బందికి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు బయో మెట్రిక్ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్త సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. వేతనాల చెల్లింపుతో అనుసంధానం చేస్తూ గతంలో ఆదేశాలిచ్చారు. అలాగే గ్రామ, వార్డు వలంటీర్లు కూడా బయోమెట్రిక్ హాజరు వేయాలని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామ, వార్డు సచి వాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరుతో జీతాల అనుసంధానాన్ని నిలుపుదల చేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భరత్ గుప్త పేర్కొన్నారు. అలాగే గ్రామ, వార్డు వలంటీర్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. -
వేలిముద్రకు రూ.150
కార్తీక్ మేడ్చల్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేశాక.. ఆధార్ ఆధారిత వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వేలిముద్రలు సమర్పించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రూ.20కి రశీదు చేతిలో పెట్టిన మీసేవ నిర్వాహకుడు రూ.150 ఇవ్వాలని స్పష్టం చేశాడు. గతేడాది ఇదే మీసేవ కేంద్రంలో రూ.50 ఇచ్చానని కార్తీక్ చెప్పినా లాభం లేకపోయింది. కోవిడ్-19 తర్వాత ఇదే రేటు అని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.150 చెల్లించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఆమోదించాలంటే సదరు విద్యార్థి వేలిముద్రలను దరఖాస్తుతో అప్లోడ్ చేయాలి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ... వేలిముద్రలు అప్లోడ్ చేసే ఆప్షన్ మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చింది. దీనికి రూ.20 రుసుముగా నిర్ణయించింది. అయితే పలు మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే కొన్నిరెట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.10 కోట్లు దాటుతున్న వసూళ్లు! రాష్ట్రంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 చొప్పున బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీజు రూపంలో సర్కారు ఖజానాకు రూ. 2.6 కోట్లు జమవుతోంది. కానీ చాలాచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.50 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. సగటున రూ. 100 చార్జ్జ్ చేస్తున్నారనుకుంటే... ఈ లెక్కన ఏటా రూ.10 కోట్లకు పైగా విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు. కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై కాలేజీలోనే బయో మెట్రిక్ అప్డేషన్ కానిచ్చేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు కంప్యూటర్తో కాలేజీలోనే ఒకచోట సెటప్ ఏర్పాటు చేసి అక్కడే వేలిముద్రలు అప్డేట్ చేస్తున్నారు. అలా కాలేజీలోనే దుకాణం తెరిచి ఒ క్కో విద్యార్థికి రూ.200 చార్జ్ చేస్తున్నారు. ఇందులో కాలేజీ సిబ్బందికి సైతం వాటాలందుతున్నాయి. వేలిముద్రల స్వీకరణ ప్రక్రియను ఉచితంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. మీసేవ కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే బదులుగా కాలేజీల్లోనే ప్రత్యేకంగా ఈ సెటప్ ఏర్పాటు చేయాలని, యాజమాన్యాలు సైతం బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే దోపిడీకి ఆస్కారం ఉండదని విద్యార్థులు అంటున్నారు. అయితే మీసేవ కేంద్రాల్లో వసూళ్లపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీలోనే వేలిముద్రలిచ్చే ఆప్షన్ ఉండాలి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బయోమెట్రిక్ విధానం మీసేవ కేంద్రంలో కాకుండా కాలేజీలోనే సమర్పించేలా ఆప్షన్ ఉండాలి. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతరత్రా ఫీజులు తీసుకుంటున్నందున... ఉచితంగా వేలిముద్రలను అప్డేట్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యాలకే అప్పగించాలి. దీంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి... మీసేవ కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చే బాధ తప్పుతుంది. - సాత్విక్, బీటెక్ ఫైనలియర్, శంషాబాద్ -
ఫేస్‘బుక్'పై భారీ జరిమానా
-
ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ఫేసుబుక్ వినియోగదారుల అనుమతి లేకుండా ఫోటో ఫేస్-ట్యాగింగ్, ఇతర బయోమెట్రిక్ డేటాను ఉపయోగించడంపై 650 మిలియన్ డాలర్లు(సుమారు రూ.4,780 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్బుక్ భంగం కలిగిందంటూ అమెరికాలోని ఇల్లినాయిస్లో 2015లో దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ పిటిషన్పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. ఇల్లినాయిస్లో దాదాపు 1.6 మిలియన్ల మంది ఫేసుబుక్ వినియోగదారులు వాదనలు సమర్పించారు. విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో ఫేస్బుక్ ప్రైవసీ పాలసీ నిబంధనలను పాటించలేదని తీర్పునిచ్చారు. ఇది యూజర్ల గోప్యత భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. ఫేసుబుక్ వల్ల భంగం కలిగిన ప్రతి ఒక్కరికి 345 డాలర్ల చొప్పున మొత్తం 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడం ఇదే తొలిసారని జడ్జి డొనాటో వెల్లడించారు. పిటీషన్ వేసిన చికాగో న్యాయవాది జే ఎడెల్సన్ చికాగో ట్రిబ్యూన్తో మాట్లాడుతూ తీర్పును అప్పీల్ చేయకపోతే ఫేస్బుక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్బుక్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: రూ.299కే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
వేలి ముద్రలు పడకపోయినా రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐరిష్ యంత్రాల్లో సమస్య వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నో బయోమెట్రిక్.. ఓన్లీ హాల్టికెట్!!
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్సెట్ తదితర ఉమ్మడి ప్రవే శ పరీక్షల్లో(సెట్స్) బయోమెట్రిక్ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్ (థంబ్ ఇంప్రెషన్) విధానాన్ని తొలగించాల ని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరి కైనా కరోనా ఉంటే థంబ్ ఇంప్రెషన్(వేలి ముద్రల సేకరణ)తో వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున ఈసారి థంబ్ ఇంప్రెషన్ను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థుల హాల్టికెట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఒకరికి బదులు మరొక రు పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ను రద్దు చేస్తున్నందున హాల్టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ను తొలగించనుంది. జాతీయ స్థాయిలోనూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ను తొలగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు బయోమెట్రిక్ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్, ఆగస్టులో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్లోనూ బయోమెట్రిక్ లేకుండానే పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో హాల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండే మానిటర్పై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యార్థి ఫొటోను ఆటోమెటిక్గా తీస్తాయి. -
ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ మొదలుకానుంది. రాష్ట్రంలోని 2.81 కోట్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 3.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది. పంపిణీ కోసం రేషన్ దుకాణాలు ఉదయం, సాయంత్రం అన్ని వేళలా పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రభుత్వం రూ.1,103 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షిం చాలని పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డికి మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధి దారులు రేషన్ దుకాణాల వద్ద గుమికూడకుండా, విడతల వారీగా బియ్యం ఇచ్చే కూపన్లు అందజేస్తారు. కూపన్లు పట్టుకుని చెప్పిన సమయానికే లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకునే వరకు దుకాణాలు తెరిచే ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా తీసుకునే కార్డుదారులకు బయోమెట్రిక్ అవసరం లేదని, గడిచిన 3 నెలలుగా తీసుకోని వారికి మాత్రమే బయోమెట్రిక్ పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి చౌకధరల దుకాణం వద్ద శుభ్రత పాటించేందుకు శానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. రేషన్ బియ్యం పంపిణీపై పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంపిణీని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఇందులో సూచిం చారు. ప్రజలు గుమికూడకుండా టైమ్ స్లాట్లో ఇచ్చిన సమయానికే లబ్ధిదారులు దుకాణాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఇతరులకు కనీసం 3 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. -
లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా సరుకుల పంపిణీ సమయంలో నలుగురు చొప్పున మాత్రమే లబ్ధిదారులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల రేషన్ సరుకులను వీఆర్వో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గతంలో ఈ–పాస్ ద్వారా లబ్ధిదారుడి వేలిముద్రలు తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్ రద్దు చేసినట్లు చెప్పారు. - రేషన్ డీలర్లు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రం చేసుకునేందుకు రేషన్ షాపుల వద్ద సబ్బు/శానిటైజర్, నీళ్లు అందుబాటులో ఉంచాలి. - సబ్సిడీ సరుకుల కోసం వచ్చే కార్డుదారులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేదా ముఖానికి టవల్ కట్టుకోవాలి. - సరుకుల కోసం లబ్ధిదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 29వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు ఏప్రిల్ నెల కోటా సరుకులు పంపిణీ చేస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల వద్ద నలుగురు చొప్పున లబ్ధిదారులను విడతలవారీగా అనుమతిస్తాం. - కార్డుదారులకు బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తాం. - మార్చి 29 నుంచి ఏప్రిల్ 15 వరకు సరుకుల పంపిణీ కోసం రేషన్ షాపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి. - రేషన్ షాపుల వద్ద అత్యవసర వైద్య సేవల నంబర్లు ప్రదర్శించాలి. - ఏప్రిల్ 4వ తేదీన వలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రూ. 1,000 చొప్పున నగదు సాయం అందజేస్తాం. - ఈసారి వీఆర్వో బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. వీఆర్వోలు రేషన్ షాపుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించాం. -
వారికి వేళా పాళా లేదు!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సమయపాలన కచ్చితంగా అమలవుతున్నా... పీహెచ్సీల్లో మాత్రం అమలు కావడం లేదన్నది సుస్పష్టం. వైద్యుల నుంచి ఉద్యోగుల వరకూ అంతా కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని నిర్ణయిస్తూ ఆయా కార్యాలయాల్లో పరికరాలు ఏర్పాటు చేసినా కొన్ని పీహెచ్సీల్లో అవి మూలకు చేరాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న ఉద్యోగులు, వైద్యులు ఇష్టానుసారం వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్న చోటయినా వేళకు వస్తున్నారా... అంటే అదీ లేదు. వారు ఎప్పుడు వస్తే అప్పుడే బయోమెట్రిక్ వేసి మమ అనిపిస్తున్నారు. పనిచేస్తున్నవి 38 మాత్రమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 68 పీహెచ్సీలు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 11 సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. జిల్లాలో 68 పీహెచ్సీలలో పరికరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 38 పీహెచ్సీల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. 30 ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదు. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. కాని విధులకు ఎప్పుడు హాజరు అయితే అప్పుడే బయోమెట్రిక్ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బమోమెట్రిక్ వేయాలి. కాని 10 గంటలకు, 10.30 గంటలకు, 11 గంటలకు కూడా వేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడన్న విమర్శలున్నాయి. వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్సీల్లో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు కఠినంగా లేకే... బయోమెట్రిక్ అధారంగా జీతాలు ఇస్తామని అప్పట్లో వైద్య శాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్ హాజరు అధారంగా జీతాలు ఇచ్చినట్టయితే ఆలస్యంగా వచ్చేవారికి కచ్చితంగా వేతనంలో కోత పడుతుంది. ఈ ఉద్దేశం ఇప్పుడు నెరవేరకపోవడంతో పరికరాలు ఉన్నా... ప్రయోజనం లేకపోతోంది. పరికరాలు బాగు చేయిస్తాం 68 పీహెచ్సీలకు 38 చోట్ల బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్నాయి. 30 పీహెచ్సీల్లో పనిచేయడం లేదు. వీటిని బాగు చేయించడానికి ఇచ్చాం. పాతవి తరచూ మొరాయిస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఎస్.వి.రమణకుమారి, డీఎంహెచ్ఓ -
కాలేజీల్లో ‘ఆన్లైన్ జియో బయోమెట్రిక్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఆన్లైన్ జియో బయోమెట్రిక్’ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ అభిప్రాయపడుతోంది. విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలంటే ఈ విధానమే మేలని చెబుతోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో కమిషన్ తనిఖీలు నిర్వహిచింది. కాలేజీల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు గుర్తించింది. పలు ప్రైవేట్ కాలేజీల్లో రిజిస్టర్లలోని విద్యార్థుల సంఖ్యకు, హాజరైనట్లు నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా అక్కడున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేకపోవడాన్ని కమిషన్ పసిగట్టింది. పలు కాలేజీలు విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ, యూనివర్సిటీలకు సమర్పిస్తున్నాయి. ఆయా విద్యార్థుల పేరిట ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము కోసం హాజరులో గోల్మాల్ చేస్తున్నాయి. మరోవైపు తరగతులకు హాజరు కాకున్నా హాజరైనట్లు అటెండెన్స్ వేయడానికి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ జియో బయోమెట్రిక్ విధానంపై కమిషన్ దృష్టిపెట్టింది. దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హాజరులో మాన్యువల్గా అక్రమాలు ప్రస్తుతం పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల హాజరును మాన్యువల్గా తీసుకొని రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే నిర్దేశిత హాజరు తప్పనిసరిగా ఉండాలి. అందుకే విద్యార్థుల హాజరుపై కాలేజీలు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వం ఫీజులు రాబట్టుకుంటున్నాయి. అందుకే మాన్యువల్ విధానానికి బదులు జియో బయోమెట్రిక్ విధానాన్ని అన్ని కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాలని కమిషన్ వెల్లడించింది. విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సూచనలు - ప్రతి విద్యార్థికి సెమిస్టర్ లేదా ఆ ఏడాది మొత్తంలో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. - విద్యార్థి సంబంధిత సంవత్సరపు సబ్జెక్టుల్లో 50 శాతం వరకైనా ఉత్తీర్ణుడై ఉండాలి. అప్పుడే ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హుడవుతాడు. - విద్యార్థుల వాస్తవ హాజరును నమోదు చేసేందుకు జియో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. - జియో బయోమెట్రిక్ను 2020–21 నుంచి అమలు చేయాలి. దాన్ని ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించాలి. - కాలేజీలోని విద్యార్థుల హాజరు నమోదు సర్వర్ డేటా బేస్ను సంబంధిత యూనివర్సిటీకి, సాంఘిక సంక్షేమ శాఖకు, జ్ఞానభూమి పోర్టల్తో అనుసంధానించాలి. - జియో బయోమెట్రిక్ పరికరాలు పని చేయకుంటే ఆ రోజు కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థుల అటెండెన్స్ను రికార్డు చేసి, రిజిస్టర్ స్కాన్డ్ కాపీలను సంబంధిత వర్సిటీకి, ప్రభుత్వ విభాగానికి ఈ–మెయిల్ ద్వారా పంపించాలి. - జియో బయోమెట్రిక్ హాజరును అమలు చేయని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. -
టెక్నికల్ కళాశాలల్లో బయోమెట్రిక్
సాక్షి, సిటీబ్యూరో: జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (హైదరాబాద్)పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని వర్సిటీ భావిస్తోంది. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని గతంలోనే అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎంటెక్, ఎంఈ, ఎం–ఫార్మసీ వంటి పీజీ కోర్సులకు అధ్యాపకులతో పాటు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండగా, అదే తరహాలో బీటెక్, బీఈ, బీ–ఫార్మసీ కోర్సుల్లోనూ అమలు చేసేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమవుతోంది. అయితే, ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యంత్రాలు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని గతంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీని అనుకూలంగా తీసుకున్న కొన్ని కళాశాలలు విద్యార్థులు తరగతులకు సరిగా హాజరు కాకున్నా కాలేజీకి వస్తున్నట్టుగానే చూపుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. దీంతో త్వరలో యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఒక్కో యంత్రంలో 100 మంది ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా కళాశాలలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక యంత్రం నిర్వాహణకు నెలకు రూ.800 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. దీనివల్ల కళాశాలలపై ఆర్థిక భారం పడుతుందంటున్నారు. జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు 160, బీఫార్మసీ కళాశాలు మరో 70 ఉన్నాయి. వీటి పరిధిలో 2.70 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో యంత్రంలో 100 మంది హాజరు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2500కు పైగా బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోవాలి. దీనికోసం జేఎన్టీయూహెచ్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సహాయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యవేక్షణ మరింత సులువు విద్యార్థుల హాజరు వివరాలు జేఎన్టీయూహెచ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ–పాస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా బయోమెట్రిక్ హాజరు ద్వారా కళాశాల ప్రిన్సిపల్తో పాటు జేఎన్టీయూ, ఉన్నత విద్యామండలి అధికారుల వరకు ఆన్లైన్లో అధ్యాపకులు, విద్యార్థుల హాజరును సులువుగా పర్యవేక్షించగలరు. డాష్బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా కళాశాలల్లో నమోదవుతున్న హాజరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కళాశాలలను సందర్శించకుండానే ఏ రోజుకారోజు అక్కడి హాజరు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ పొందాలంటే ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి. కానీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరుతున్న చాలామంది విద్యార్థులు తరగతులకు సరిగ్గా హాజరు కావడం లేదు. స్కాలర్షిప్కు 75 శాతంగా చూపించేందుకు విద్యార్థులు అయాకళాశాలలు డిమాండ్ చేసిన డబ్బును మట్టుజెపుతున్నారు. ఇలా హాజరు శాతం సరిచేయటానికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పైగా(అవసరాన్ని బట్టి) వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తేప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. -
‘మీ సేవ’లో బయోమెట్రిక్ విధానం
సాక్షి, ఖమ్మం : వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకనుగుణంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలను పొందిన వారిలో ఇతరులు నిర్వహించడం, అధికంగా రుసుములు వసూలు చేయడం, పని వేళల్లో తేడాలు..ఇలా రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటికి కళ్లెం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కొన్నిచోట్ల మీసేవ కేంద్రాలను పొందిన వారు ఇతరులకు వాటి నిర్వహణను అప్పగించారు. తమది కాదన్నట్లుగా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలూ వెలుగు చూశాయి. ఇకపై ఇటువంటి వారికి కళ్లెం పడనున్నది. సరికొత్తగా బయోమెట్రిక్ నూతన విధానాన్ని అమలు చేయబోతున్నారు. మీసేవ కేంద్రం తెరవగానే నిర్వాహకుడు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. దీంతో వేరే వారు కేంద్రాలను నిర్వహించేందుకు వీలు పడదు. గతంలో ఇతరుల పేరిట నిర్వహించే దుకాణాలు ఇక మూసివేయాల్సిందే. జిల్లాలో సుమారు 30వరకు బినామీల పేర్ల మీద నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 209 మీసేవ కేంద్రాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మీ సేవ కేంద్రం యజమానితో పాటు ఒక ఆపరేటర్ బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ సేవలు అందించేలా ప్రోగ్రాం పూర్తయింది. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే మీ సేవ నిర్వాహకుడు రిజిస్టర్ చేసుకున్న సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తేనే ఆన్లైన్ సేవలు కొనసాగనున్నాయి. నూతన విధానంతో ఆపరేటర్లు పొరపాటు చేశారనే కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. తద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందడంతో పాటు బినామీలకు చెక్ పడనున్నది. పారదర్శకంగా సేవలు.. రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా సేవలను అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల మెరుగైన సేవలను అందించనున్నాం. ఇప్పటికే అన్ని మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. – దుర్గాప్రసాద్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ -
‘మీ–సేవ’లో ఏ పొరపాటు జరిగినా అతడే బాధ్యుడు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యకలాపాల సేవలకు కేంద్ర బిందువు మీ–సేవా కేంద్రాలే. విద్యుత్ బిల్లు చెల్పింపు నుంచి పాస్పోర్టు నమోదు దాకా.. రెవెన్యూ సేవలను ఇక్కడి నుంచి పొందాల్సిందే. అయితే, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏర్పాటైన ఈ కేంద్రాలు చాలావరకు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ సేవలకు ఇష్టానుసారం ఫీజులు, సర్వీస్ చార్జీల వసూలు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి దందాలకు, వసూళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టే ఏర్పాట్లు చేసింది. కేంద్రాల నిర్వహణలో ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా దానికి ఆ కేంద్రం యాజమానే (లైసెన్స్దారు) బాధ్యత వహించాలి. ఇందుకోసం మీ–సేవా కేంద్రాల నిర్వాహణలో ‘బయోమెట్రిక్’ విధానం ప్రవేశపెట్టారు. కేంద్రం యాజమాని బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే మీ–సేవా సర్వీసులు అందించేందుకు వీలవుతుంది. దీంతో హైదరాబాద్ మహా నగరంలో సగానికి పైగా బినామీల నిర్వాహణలో కొనసాగుతున్న కేంద్రాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలకు సంబంధించి వినియోగదారుల వద్ద ఇష్టానుసారం చేస్తున్న వసూళ్లకు కూడా అడ్డుకట్ట పడనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సగానికి పైగా మీ–సేవా కేంద్రాలు బినామీల నిర్వాహణలో సాగుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా 447 ఆన్లైన్ కేంద్రాలు ఉండగా, అందులో టీఎస్ ఆన్లైన్ సర్వీసులు 198, ప్రభుత్వ ఈ–సేవా సర్వీసులు 26, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) కేంద్రాలు 220 ఉన్నాయి. తాజాగా మరో 70కి పైగా కొత్త కేంద్రాలు మంజూరు చేయనున్నారు. మొత్తంమీద ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల్లో సగానికి పైగా లైసెన్స్ పొందినవారి చేతుల్లో లేనట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానంతో కేంద్రం యాజమాని తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో సదరు బినామీ నిర్వాహకులు చిక్కుల్లో పడినట్లే. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు మీ–సేవా కేంద్రాలను బయోమెట్రిక్తో అనుసంధానం చేశారు. మీ–సేవా కేంద్రం యాజమానితో పాటు ఒక ఆపరేటర్ మాత్రమే బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ సేవలు అదించేలా ప్రత్యేక ప్రోగ్రామింగ్ రూపొందించారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆన్లైన్ సేవలు ముందుకు వెళ్తాయి. కేంద్రం నిర్వాహకుడు(యాజమాని) బయోమెట్రిక్పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీ–సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. మీ–సేవా ద్వారానే అన్ని సేవలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆన్లైన్ సేవలన్నింటినీ మీ–సేవా కేంద్రాల ద్వారానే కొనసాగుతున్నాయి. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ప్రజాపంపిణీ, రిజిస్ట్రేషన్, రోడ్డు రవాణ, కార్మికశాఖ, విద్యుత్, వైద్య, విద్య, సంక్షేమ, పోలీసు, వాణిజ్య పన్ను తదితర శాఖల సేవలు మీ–సేవా ద్వారానే అందుతున్నాయి. దీంతో మీ–సేవా కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కుప్పలు తెప్పలుగా గల్లీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కొందరు ఉపాధి కోసమని మీ–సేవా కేంద్రాలను మంజూరు చేయించుకొని ఇతరులకు విక్రయించడం, లీజు, అద్దె, కమీషన్ పద్ధతిపై ఇతరులకు అప్పగించడం పరిపాటిగా మారింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు సేవలందించేందుకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు మీ–సేవా కేంద్రాల ముసుగులో అక్రమ దందా కూడా సాగుతున్న ఉదాంతాలు అనేకం వెలుగు చూశాయి. కేంద్రాల అక్రమ వసూళ్లు అధికారుల దృష్టికి వెళ్తే ఆపరేటర్లు తప్పిదం చేశారని యాజమానులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తాజగా వచ్చిన బయోమెట్రిక్ విధానంతో బినామీలు కేంద్రాలు నిర్వహించేందుకు వీలుండదు. ఆపరేటర్ వెసులుబాటునివినియోగించుకుంటే వారు చేసే అక్రమాలకు, అధిక వసూళ్లకు సదరు యాజమానే బాధ్యత వహించాలి. పారదర్శకత కోసమే.. మీ–సేవా కేంద్రాల నిర్వాహణతో పాటు పార్శదర్శకంగా సేవలందించేందుకు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చాం. దీంతో బినామీల నిర్వహణకు వీలుండదు. ప్రజలకు అందించే సేవలకు అధిక చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. చిన్నపాటి తప్పిదానికైనా కేంద్రం యాజమానే బాధ్యత వహించాలి. – రజిత, ఈ–డిస్ట్రిక్ మేనేజర్, హైదరాబాద్ -
డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: గస్తీ పేరుతో షికార్లు కొట్టే పోలీసులకు ఇకకాలం చెల్లింది. గస్తీ తిరిగే పోలీసు వాహనాలను కదలికలను గుర్తించేందుకు మొబైల్ యాప్ను చెన్నై పోలీస్ ప్రవేశపెట్టింది. దీంతో గస్తీ పేరుతో విధులకు డుమ్మా కొట్టే పోలీసులకు కళ్లెం వేసామని, ఇలాంటి పనిదొంగ పోలీసులు మొబైల్ యాప్తో సులభంగా చిక్కిపోతారని ఉన్నతాధికారులు తెలిపారు. చెన్నై నగరం, శివార్లలోని 135 పోలీస్స్టేషన్ల పరిధిలో జనాభాశాతానికి అనుగుణంగా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ఇందు కోసం ఇన్నోవా, జిప్సీ, బోలెరో తదితర 360 కార్లు, 403 ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పోలీస్స్టేషన్ ఆఫీసర్లు తమ పరిధిలో ఇప్పటికే చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్, దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, నేరస్థులు సులువుగా పారిపోయే ప్రాంతాల్లో తమకు కేటాయించిన వాహనాల్లో సంచరిస్తూ నేరాలను అరికట్టాల్సి ఉంది. ఇరుకైన ప్రాంతాల్లో గస్తీకి 250 సైకిళ్లను సైతం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే అవన్నీ పర్యవేక్షణ లోపం వల్ల పాత ఇనుప సామన్లకు వేసే స్థితికి చేరుకున్నాయి. గస్తీ తిరగాల్సిన పోలీసులు అధికారిక వాహనాలను మరుగైన ప్రదేశంలో పెట్టేసి సొంత పనులు చక్కబెట్టేందుకు వెళ్లిపోతున్నట్లు ఉన్నతాధికారులకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. మరికొందరు పోలీసులు సమీపంలోని కల్యాణ మండపాలకు చేరుకుని గురకలు పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొందరైతే పరిసరాల్లో సినిమా హాళ్లలో కూర్చుని చక్కగా ఎంజాయి చేసేస్తున్నారు. గస్తీ పోలీసుల నిర్లక్ష్య వైఖరి దొంగలకు అనువుగా మారింది. దీంతో గస్తీ వాహనాలను మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ‘మొబైల్ డేటా టెర్మినల్ సిస్టమ్’ (ఎండీటీఎస్) అనే మొబైల్ యాప్ను సిద్ధ్దం చేశారు. తొలిదశగా చెన్నై పోలీసు పరిధిలో ప్రయోగాత్మకంగా 360 నాలుగు చక్రాల వాహనాలకు మొబైల్ యాప్ ను అమర్చారు. ఈ కొత్త విధానంపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, గస్తీ విధుల్లో ఉండే పోలీసులకు స్మార్ట్ ఫోన్లను అందజేశామని, వీరంతా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ఎండీటీసీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లను చెన్నై కమిషనర్ కార్యాలయంలోని కంట్రోలు రూముతో అనుసంధానం చేశాము. దీంతో గస్తీ విధులకు డుమ్మా కొట్టే పోలీసులు సులభంగా దొరికిపోతారు. చార్జింగ్ పెట్టడం మరిచిపోయామని తప్పించుకునే వీలులేకుండా వారికి కేటాయించిన వాహనాల్లో మొబైల్ చార్జింగ్ వసతిని కూడా కల్పించాం. మొబైల్ వినియోగంలో ఉందని పేర్కొంటూ తమ సెల్ఫోన్ ద్వారా ఫొటో తీసుకుని ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ గ్రూప్లో పోస్టింగ్ పెట్టాలి. గస్తీ పోలీసులు సరిగా విధులు నిర్వర్తిస్తున్నారా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్లను నియమించాం. మొబైల్ యాప్ పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచే తగిన ఆదేశాలు జారీచేస్తూ అవసరమైన సహాయం కోసం సమీపంలోని గస్తీ వాహనాలను ఆయా ప్రదేశాలకు పంపే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు. -
తేడాలేంటో తేల్చేద్దాం...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో మరింత పారదర్శకత కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానంపై సంక్షేమ శాఖలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని అధికారులు భావించినప్పటికీ... గతంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు తీరుతో పాటు గతంలో నమోదైన హాజరు విధానంపైన విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బయోమెట్రిక్ హాజరు విశ్లేషణ కోసం వసతిగృహ సంక్షేమాధికారులకు అవగాహన కల్పించనుంది. మూడు రోజుల పాటు శిక్షణను నిర్వహించి 2019–20 విద్యా సంవత్సరంలో నమోదయ్యే రికార్డును... 2018–19 సంవత్సరంతో పాటు 2017–18 విద్యా సంవత్సరంలో నమోదైన రికార్డును సరిపోలుస్తూ విశ్లేషణ చేపట్టనుంది. వసతిగృహం వారీగా అధ్యయనం..: రాష్ట్రవ్యాప్తంగా 674 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 50వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బయోమెట్రిక్ హాజరు విశ్లేషణతో విద్యార్థుల హాజరు తీరెలా ఉందనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో వసతిగృహాన్ని యూనిట్గా తీసుకుని ప్రస్తుత హాజరు, గతంలో నమోదైన హాజరును సరిపోలుస్తారు. దీంతో హాజరులో వ్యత్యాసం స్పష్టం కానుంది. వరుసగా ఏడాది పాటు హాజరు శాతాన్ని పరిశీలిస్తే గతంలో హాజరు శాతాల వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దీంతో అక్రమాలపై స్పష్టత వస్తే సదరు అధికారిపై చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది. -
ప్రభుత్వవైద్యులకు బయోమెట్రిక్!
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులకు సమయానికి రాని ప్రభుత్వ వైద్యులకు చెక్ పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి కచ్చితంగా వచ్చేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బయోమెట్రిక్ హాజరు మిషీన్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ మేరకు అన్ని ఆ శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉన్నాయి. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు సహా అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు 1,200 వరకు ఉన్నాయి. వాటిల్లో 3 వేల మందికిపైగా వైద్యులు పనిచేస్తుంటారు. ఇతర వైద్య సిబ్బంది మరో ఐదారు వేల మంది వరకు ఉంటారు. కొన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ ఉన్నా, చాలా ఆసుపత్రుల్లో ఇంకా ఈ ఏర్పాటు చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకే వైద్యులు పీహెచ్సీకి రావాలి. సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. కొన్ని 24 గంటలూ పనిచేసేవి కూడా ఉంటాయి. లక్షలాది మంది పేద రోగులకు ఈ పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులే ఆధారం. కానీ వైద్యులు సకాలంలో రారన్న భావన నెలకొనడంతో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందుతుందన్న భరోసా కల్పించలేకపోతున్నాయి. కొన్ని పీహెచ్సీలకైతే వారంలో రెండు మూడు రోజులు కూడా వైద్యులు వచ్చే పరిస్థితి ఉండట్లేదు. మరికొన్నిసార్లు ఎవరూ రాక తాళం వేసిన సందర్భాలూ ఉన్నాయి. దీనివల్ల జబ్బు వస్తే మందు వేసే దిక్కే లేకుండా పోతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. ఎలాగైనా వైద్యులను ఆసుపత్రికి సకాలంలో రప్పించాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంది. ఉదయం 9.30 గంటలకు డాక్టర్ ఉంటారన్న నమ్మకాన్ని రోగులకు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది రేషనలైజేషన్.. వైద్యులు సకాలంలో ఆసుపత్రికి వచ్చేలా, వారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా చేయాల్సిన బాధ్యతపై గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా సర్కారులో ఉంది. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేసే పరిస్థితి లేదని సర్కారు గమనించింది. సమీప పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రి పెట్టుకొని నడుపుకొంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం కన్నా వారిని ఆకర్షించేలా ప్రోత్సాహకాలు ఇవ్వడమే మేలని భావిస్తోంది. దీనిపై త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి వైద్య సిబ్బంది ఉంటున్నారు. కొన్నింటిలో తక్కువ ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చి వైద్య సిబ్బంది హేతుబద్ధీకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇక పీహెచ్సీల్లో కేవలం ఎంబీబీఎస్ స్థాయి మెడికల్ ఆఫీసర్లే కాకుండా స్పెషలిస్టు వైద్యులను కూడా నియమించాలని భావిస్తోంది. వారానికి ఒకట్రెండు రోజులు ఆసుపత్రులకు వెళ్లేలా చూడాలని భావిస్తున్నారు. ఆస్పత్రులను ఆధునీకరించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్నిం టినీ దశలవారీగా బాగు చేయాలని వైద్య,ఆరోగ్య శాఖ భావిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు నమ్మకం కలిగేలా చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
ఇక కోర్టుల్లోనూ బయోమెట్రిక్ యంత్రాలు
లీగల్(కడప అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 కోర్టులలో రూ.9 లక్షల రూపాయల వ్యయంతో 36 బయోమెట్రిక్ యంత్రాలను ప్రారంభిస్తున్నామని, తద్వారా అధికారులు, ఉద్యోగులంతా బాధ్యతగా విధులు నిర్వహిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టు ఆవరణంలో రెండు బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని విభాగాల కోర్టులకు సంబంధించిన మెజిస్ట్రేట్లు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటల తరువాత తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ఆధారంగా ఈ యంత్రానికి అనుసంధానం చేసి ఉంటారన్నారు. తమ చేతివేలి ముద్రలను నమోదు చేయాలని, వేలి ముద్రలు అరిగిపోయిన వారికి త్వరలో కళ్లు (ఐరిష్) విధానం ద్వారా విధులకు హాజరైనట్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ యం త్రానికి ఐరిష్ యంత్రం స్క్రీన్ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగులు, సిబ్బంది పాటిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి అరుణసారిక, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస శివరాం, డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి సీఎన్ మూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్ రెడ్డి, న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐరిస్ ఆరంభమెప్పుడో..
మెదక్ అర్బన్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు ఇప్పటి వరకు ఐరిస్ యంత్రాలు చేరకపోవడంతో ఈ వి«ధానం అమలుకు నోచుకోవడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా 2.11 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం, కిరోసిన్ను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం ద్వా రా లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులు అందిస్తున్నారు. చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీల వేలిముద్రలు రావడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వేలిముద్రల ఆధారంగా వారికి సరుకులను అందించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐరిస్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఆగస్టు నెలలోనే డీలర్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ శిక్షణ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఐరిష్ విధానాన్ని అమలు చేయడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట.. రేషన్ దుకాణాలలో జరుగుతున్న అక్రమాలను అ రికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పోర్టల్ అ స్సెన్స్ సర్వీసెస్ (ఈ–పాస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని సరుకులను పంపిణీ చేస్తారు. ఈ విధానం అ మలులో లేనప్పుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోయినా వచ్చినట్లు చూపి రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ–పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పడింది. ఈ విధానంలో వేలిముద్రల సమస్య ఏర్పడటంతో దీన్ని అధిగమించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. తప్పని తిప్పలు.. ఐరిస్ విధానం అమలులో జరుగుతున్న జాప్యం తో వేలి ముద్రలు పడని వారికి ఇబ్బందులు తప్ప డం లేదు. వేలిముద్రలు పడని వారికి సరుకులు ఇ వ్వాలంటే వీఆర్వోల వేలిముద్రలు అవసరం. కా నీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ దు కాణాలకు రాలేకపోతున్నారు. వేలిముద్రలు రాని వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోం ది. ఒక్కోసారి సరుకులను కోల్పోవాల్సి వస్తోం ది. ఉన్నతాధికారులు స్పందించి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బియ్యం ఇవ్వడం లేదు మిషన్లో వేలిముద్ర పడకపోవడంతో మాకు అందాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులను ఇవ్వడం లేదు. వేలి ముద్ర ద్వారా సరుకులు అందించేందుకు వీఆర్ఓ ఎప్పుడు వస్తారో..? మాకు తెలియడం లేదు. వారు వచ్చినప్పుడు సరుకులు ఇస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అర్హులమైనా రేషన్ సరుకులు అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్కారు వెంటనే ఏదైనా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలి. – శిర్న గోదావరి, వృద్ధురాలు, మెదక్ -
హాజరు..అలంకారప్రాయం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరు కోసం ఏర్పాటు చేసిన ఆధార్ బయోమెట్రిక్ పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఉద్యోగుల సమయ పాలన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన హాజరు యంత్రాలు వినియోగంలోలేకుండా పోయాయి. ఫలితంగా నిధులు దుర్వినియోగమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరుకోసం రెండేళ్ల క్రితం మొత్తం 40 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజు కూడా పని చేయలేదు. 40 బయోమెట్రిక్ పరికరాలకు మొత్తం రూ.7.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. బయోమెట్రిక్ పరికరాలు కేవలం అలంకారప్రాయంగా గోడలకే పరిమితమయ్యాయి. రూ.లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు , విద్యార్థులు సమయపాలన పాటించడం లేదు. రీఛార్జ్ మాత్రం ఫుల్ వర్సిటీలో ఏర్పాటు చేసిన పనిచేయని బయోమెట్రిక్ పరికరాలకు మాత్రం క్రమం తప్పకుండా రీఛార్జ్ చేస్తున్నారు. ప్రతి నెలా 40 సిమ్లకు రూ.11,500 రీఛార్జ్ చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను సైతం ప్రతి నెలా విశ్వవిద్యాలయం చెల్లిస్తోంది. ఇప్పటి దాకా రీచార్జ్లకే రూ.2 లక్షలకు పైగా డబ్బులు చెల్లించి వర్సిటీ నిధులు దుర్వినియోగం చేశారు. బయోమెట్రిక్ పరికరాలకు చెల్లించిన మొత్తంతో పాటు రీఛార్జ్ నిధులు దుర్వినియోగమయ్యాయి. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐడీ కార్డులకు లక్షల్లో నిధులు మంజూరు వర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ఐడీ (వ్యక్తిగత గుర్తింపు కార్డులు )లు జారీ చేశారు. అయితే ఇందులోనూ చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూలై 10న ఐడీ కార్డులను జారీ చేశారు. 2 వేల మందికి ఐడీ కార్డులు జారీ చేయడానికి కేవలం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు ఖర్చవుతుంది. కానీ ఏకంగా రూ.4,74,144 ఐడీ కార్డులు జారీ చేసినందుకు చెల్లించారు. ఇందులోనూ మూడింతలు «అధిక మొత్తాన్ని చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐడీ కార్డుల జారీలో క్లాత్ ట్యాక్ ఒక్కొక్కటి నాణ్యత గల వస్తువు మార్కెట్లో రూ.5లు అందుబాటులో ఉండగా, రూ. 9లు చెల్లించారు. మైఫై కార్డులు రూ.7లు అందుబాటులో ఉండగా, రూ.13 చెల్లించారు. ఇలా ప్రతి వస్తువులోనూ అధిక ధరకు కోట్ చేసి స్వాహా చేశారు. ఐడీ కార్డుల ప్రింటర్కు రూ. 57 వేలు చెల్లించారు. ఇలా ప్రతి అంశంలోనూ అందినకాడికి దోచుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి వర్సిటీ నిధులను స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బయోందోళన
పశ్చిమగోదావరి, నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు మూడేళ్లుగా అమలవుతోన్న బయోమెట్రిక్ ఈ–హాజరు ప్రక్రియ నేటికీ గాడిన పడలేదు. నెల కోసారి సాప్ట్వేర్ మార్పులతో ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించినా ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. అడుగడుగునా సాంకేతిక సమస్యలతో ఈ హాజరు నమోదు ప్రక్రియపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ–హాజరు నమోదును జీతాలకు ముడిపెట్టడంతో నిత్యం గురువులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. హాజరుపై మరితం నిఘా ప్రస్తుతం జిల్లాలో అన్ని పాఠశాలల్లో ఆధార్ ఐడెంటి ఐరీస్ (ఆధార్తో అనుసంధానం ఐన నేత్ర గుర్తింపు) ట్యాబులు, లేదా దానికి అనుసంధానించిన వేలిముద్రల గుర్తింపు పరికరాలు అందించారు. ఉపాధ్యాయులు నమోదు చేసే ఈ–హాజరు పూర్తి వివరాలు సీఎం–డాష్ బోర్డుకు అనుసంధానించారు. ఐతే కొన్ని చోట్ల స్థానికంగా ఉండే ప్రాథమిక ఉపాధ్యాయులు విద్యాశాఖ అందించే ట్యాబులను ఇంటి వద్దకు పట్టుకుపోయి నిర్ధేశించిన సమయానికి ఇంటి నుండే ఈ–హాజరు వేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో తాజాగా కొత్త సాప్ట్వేర్ విద్యాశాఖ రూపొందించింది. హాజరుపై మరింత నిఘా పెట్టేందుకు ఈ–హాజరు సాప్ట్వేర్ను ఎస్ఈ–హాజరుగా ఈనెల 5వ తేదీ నవీకరించారు. పాఠశాలలకు అందించిన ఐరీస్ ట్యాబ్ల ఈ సాప్ట్వేర్తో ఉపాధ్యాయులు ఈ–హాజరును పాఠశాల పరిధిలో వేసారా లేదా వేరే చోట నుంచి వేసారా అనేది గమనించేలా జీపీఎస్కు ఈ సాప్ట్వేర్ అనుసంధానించినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చిన సాప్ట్వేర్ ప్రకారం సర్వర్ కెపాసిటీ పెంచకపోవడంతో మూడు రోజులుగా జిల్లాలోని ఉపాధ్యాయులు బయోమెట్రిక్ యంత్రాలతో గంటల కొద్ది కుస్తీపడుతున్నారు. దీనికి తోడు పాఠశాలల్లో ఉన్నవి ఎక్కువగా నాసిరకం యంత్రాలే. వాటితో ఉపాధ్యాయులు పడుతోన్న ఇబ్బందులు చూస్తే ఈ విధానం యావత్తూ గందరగోళంగా మారినట్టు అనిపిస్తోంది. నేటికీ గాడిన పడని వ్యవస్థ బయోమెట్రిక్ ఈ–హాజరు వ్యవస్త ప్రారంభించి మూడేళ్లవుతున్నా నేటికీ గాడిన పడలేదు.ఏ పాఠశాలలో చూసినా సమస్యలే సమస్యలు. వాటిని పరిష్కరించే టెక్నీషియన్లను తగిన సంఖ్యలో సిద్ధం చేయకపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యంత్రాలన్నీ స్టేట్ సర్వర్కు అనుసంధానించడం వల్ల సిమ్ కార్డుల ద్వారా సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్నాయి. వేలిముద్రని తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఏ నెట్వర్కకు సంబంధించిన సిమ్ ఐనా సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల హాజరు సకాలంలో నమోదు కావడం లేదు. సమస్యలివీ.. ఎంతసేపు చార్జింగ్ పెట్టినా డివైస్లు వెంటనే డీచార్జి అవుతున్నాయి. డివైస్లు క్యాలిటీ లేదు. సమస్య వచ్చినప్పుడు టెక్నీషయన్ ఉన్నా సాప్ట్వేర్ సమస్యలపై సరైన అవగాహన ఉన్నవారు రాష్ట్ర, జిల్లా స్థాయిలో లేదు. కొన్ని సందర్భాల్లో మొదట గ్రీన్ టిక్ రాదు, దానికోసం పది నుంచి 20 నిమిషాలు సమయం తీసుకొంటుంది. దీంతో గ్రీన్టిక్ రాని ఇష్యూని లాగిన టైమ్గా, గ్రీన్టిక్ వచ్చిన ఇష్యూని లాగవుట్ టైమ్గా పరిగణిస్తోంది. దీంతో టీచర్లు బెంబేలవుతున్నారు. చార్జింగ్ డౌన్ యంత్రాలలోని (ఈ–హాజరు) యాప్ను పదేపదే మార్పులకు గురిచేయడంవల్ల టీచర్లకు సరిగ్గా అర్థం కావడం లేదు. 8.45 నుంచి 9.30 గంటలమధ్యలో ప్రైమరీ–హైస్కూల్ టీచర్లు అందరూ ఒకేసారి పంచింగ్ చేయడం వల్ల లోడ్ పెరిగి కనెక్ట్ అవడం బాగాఆలస్యమవుతోంది. ఇలా చేస్తే ఫలితం ట్యాబుల్లో వేసిని సిమ్ల డేటా స్టోరేజ్ నెలంతా పరిపోవటం లేదు. దానిని పెంచాలి. డౌన్లోడ్ స్పీడ్ పెరగాలి. నాణ్యమైన యంత్రాలనే స్కూళ్లకు పంపిణీ చేయాలి. ఆ యంత్రంలో ఏ సమస్య వచ్చినా ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పరిస్థితిని తప్పించాలి. ప్రతి మండలంలో ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఒక టెక్నీషన్ను అందుబాటులో ఉంచాలి. కొత్త వెర్షన్లతో అవస్థలు సాప్ట్వేర్ అప్డేట్ చేసి కొత్త సాప్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతిసారీ ఐరీస్ వేసేందుకు గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తుంది. పాఠశాలకు నిర్ణీత సమయంలో వెళ్లినప్పటికీ సిగ్నల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆన్లైన్లో హాజరు నమోదు కావడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.– పరిమితి సత్తిరాజు, ఎస్జీటీ, నారాయణపురం ఉన్నతాధికారుల దృష్టికి సమస్య ఉపాధ్యాయులు ఈ–హాజరు విషయంలో జీపీఎస్ అనుసంధానిస్తూ ఎస్ఈ హాజరుగా కొత్త వెర్షన్ రాష్ట్ర ఐటీ సెల్ తీసుకొచ్చింది. ఈ సమస్య రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. రాష్ట్రమంతా ఈ సమస్య ఉన్నట్లు, ఒకటి రెండు రోజుల్లో ఈ సాంకేతిక సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
బయోమెట్రిక్నే.. ఏమారుస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: వేలిముద్రల ఆధారంగా పని చేసే బయోమెట్రిక్ విధానాలు అత్యంత భద్రమైన మార్గంగా భావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దీనిని అవలంభిస్తున్నాయి. మరోపక్క కేవలం హాజరు నమోదు తదితర పరిపాలన పరమైన అంశాల్లోనే కాకుండా, కేసులను కొలిక్కి తీసుకురావడం మొదలు నేరగాళ్లను దోషులుగా నిరూపించడం వరకు అన్నింటిలోనూ వేలిముద్రలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వరుస సవాళ్లు విసురుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఈ తరహా నకిలీ వేలిముద్రల ఉదంతాలు మూడు వెలుగులోకి వచ్చాయి. సిమ్కార్డుల టార్గెట్ కోసం సంతోష్... కరీంనగర్ జిల్లా, ధర్మారానికి చెందిన సంతోష్ కుమార్ను గత ఏడాది జూన్లో ఎస్సార్నగర్ పోలీసులు పట్టుకున్నారు. బీఎస్సీ చదువుతూ మధ్యలో మానేసిన అతను కేవలం సిమ్కార్డుల ‘టార్గెట్’ పూర్తి చేసుకునేందుకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంచలనం సృష్టించాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసిన సంతోష్ వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. తన ‘టార్గెట్’ పూర్తి చేసుకోవడానికి ఈ–కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి కావడంతో రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి నకిలీ వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. పాలిమార్ కెమికల్ను వినియోగించి వీటిని తయారు చేసేవాడు. కళాశాల్లో హాజరు కోసం రామకృష్ణ... కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమార్చాడు రామకృష్ణ. ఓ మనిషికి సంబంధించిన వేలిముద్రలను క్లోనింగ్ చేసి, అతడు అక్కడ లేకున్నా అటెండెన్స్ పడేలా చేసిన అతడిని గత నవంబర్లో పోలీసులు పట్టుకున్నారు. మరో ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు అదే కాలేజీలో ఉన్నట్లు చూపించి భారీ స్థాయిలో ఫీజు రీ–యింబర్స్మెంట్ చేసుకునేందుకు సహకరించాడు. నగర శివార్లలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కేంద్రంగా జరిగిన ఈ ఫింగర్ప్రింట్స్ క్లోనింగ్ స్కామ్ అప్పటికే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, నర్పురానికి చెందిన బొమ్మ రామకృష్ణ మరో ఇద్దరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. పుస్తకాల దుకాణాల్లో దొరికేగ్లూతో పాటు ఇథనైల్ వినైల్ ఎసిటేట్(ఈవీఏ)అనే కెమికల్ వాడి వేలిముద్రలు సృష్టించేవాడు. ఏనాటినుంచో ఈ ‘ముద్ర’.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల హాజరు కోసం కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ (సింథటిక్ ) వ్యవహారం జీహెచ్ఎంసీలో ఎంతోకాలంగా కొనసాగుతున్నా, వాటి గురించి తెలిసినవారు సైతం పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం తొమ్మిది మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్(ఎస్ఎఫ్ఏ)వద్దే 84 సింథటిక్ ఫింగర్ప్రింట్స్ లభించాయంటే..జీహెచ్ఎంసీలోని దాదాపు 950 మంది ఎస్ఎఫ్ఏల్లో ఎంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో.. ఎన్ని సింథటిక్ ఫింగర్ప్రింట్స్ చేయించి ఉంటారో అంతుపట్టడం లేదు. గతంలో ‘పరిచయం’ పేరిట పారిశుద్ధ్య కార్మికుల పేర్లు గోడల మీద రాసినప్పటికీ, వాటిల్లోని అందరూ పనిచేయడం లేరు. గ్రూపులో ఉండాల్సిన ఏడుగురిలో ముగ్గురు, నలుగురితోనే పనులు చేయిస్తున్నారు. మిగతా వారందరివీ ఇలా సింథటిక్ ఫింగర్ప్రింట్స్తో హాజరు వేసి జీతాలు కాజేస్తున్నారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రనిధులకూ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. దాదాపు ఏడాదిక్రితం నుంచే ఈ బోగస్ కార్మికుల ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూసినా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.అందువల్లే మరింతగా బరి తెగించి ఒక్కో ఎస్ఎఫ్ఏ ఎన్ని వీలైతే అన్ని సింథటిక్ ఫింగర్ప్రింట్లను వినియోగించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హాజరు పట్టికలోని కార్మికులంతా ఒకే కుటుంబానికి చెందినవారున్నారని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు దాడులు చేసిన ప్రాంతాల్లోనే కాక జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇలాంటి తంతంగం నడుస్తున్నదని చెబుతున్నారు. నాంపల్లి, ముషీరాబాద్, అంబర్పేట తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి వారిని గతంలో గుర్తించినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఈ సింథటిక్ ఫింగర్ప్రింట్స్తో అక్రమాలు జరుపుతున్న ఎస్ఎఫ్ఏలే జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లుగానూ పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తిస్థాయి విచారణలో అన్ని వివరాలూవెల్లడి కానున్నాయి. ♦ జీహెచ్ఎంసీలో .. పారిశుద్ధ్య కార్మికులు : 18,550 ♦ ఒక్కొక్కరి నెల వేతనం: రూ. 14,000 ♦ అందరి నెల వేతనం: రూ. 25,97,00,000 ♦ సంవత్సర వేతనం: రూ. 311,64, 00,000 ♦ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు: 959 ♦ ఒక్కొక్కరి నెల వేతనం: రూ. 14,500 ♦ అందరి నెల వేతనం:రూ. 1,39,05,500 ♦ సంవత్సర వేతనం:రూ. 16,68,66,000 ♦ వెరసి ఏటా చెల్లించే మొత్తం వేతనాలు:రూ. 328,32,66,000 -
ఐరిస్తోనూ ‘రేషన్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న రేషన్ సరుకులను ఇక నుంచి బయోమెట్రిక్(వేలిముద్రలు)తో పాటు ఐరిస్(కళ్ల గుర్తింపు)తోనూ ఇవ్వనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఈపోస్ (బయోమెట్రిక్) విధానం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఈ విధానంలో కొంతమందికి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళల వేలిముద్రలు చెరిగిపోవడంతో ఈపోస్ మెషిన్లు గుర్తించడం లేదు. దీంతో ప్రతినెల రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. తిరిగి వేలిముద్రలు సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అయినప్పటికీ గృహిణులు, ఇతరాత్ర పనులు చేసుకునేవారి వేలిముద్రలను ఈపోస్ గుర్తించడం సమస్యగా తయారైంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపోలని చోట ఆయా ప్రాంతాల్లోని పౌరసరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లకు అథంటికేషన్ సౌకర్యం కల్పించారు. అయితే ఈ విధానం కొన్నిచోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది. 11.09 లక్షల కుటుంబాలు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అర్బన్ పరిధులు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖకు మొత్తం 12 సర్కిళ్లకు గాను హైదరాబాద్ పరిధిలో 9 సర్కిల్స్, మేడ్చల్ జిల్లా అర్బన్ పరిధిలో 2, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక సర్కిల్ ఉన్నాయి. మొత్తం మీద ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన సుమారు 11.09 లక్షల కుటుంబాలు ఉండగా సుమారు 40లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 12లక్షలకు పైగా వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇందులో 30శాతం వరకు లబ్ధిదారులకు బయోమెట్రిక్ సమస్య ఉంది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా పౌరసరఫరాల శాఖ ఐరిస్ విధానానికి శ్రీకారం చుడుతోంది. -
విద్యాశాఖలో నిధుల వృథా!
సాక్షి, హైదరాబాద్: నెట్వర్క్ సమస్యలు, పనిచేయని మిషన్లతో పాఠశాల విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో విద్యార్థులు, టీచర్ల బయోమెట్రిక్ హాజరుకు చర్యలు చేపట్టినా ఒక్క జిల్లాలో కూడా పక్కాగా అమలుకావడం లేదు. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండాపోయింది. నిర్వహణ సంస్థ వైఫల్యంతో ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరువిధానం ఒక అడుగు ముందు కు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ప్రస్తుత లోపాలను సవరించకుండానే రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో మరో రూ.20 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ హాజరు అమలుకు కసరత్తు చేస్తుండటంతో నిధులు వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. పక్కా చర్యలు చేపట్టే ఉద్దేశంతో.. విద్యార్థులు, టీచర్ల హాజరుపై పక్కా లెక్కలు సేకరించే ఉద్దేశంతో విద్యాశాఖ 2016లో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 27 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే అందులో 12 జిల్లాల్లోని దాదాపు 7 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలుకు చర్యలు చేపట్టింది. ఆ బాధ్యతలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్కు అప్పగించింది. క్షేత్రస్థాయిలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాల ఏర్పాటు ఆధార్తో అనుసంధానం, నెట్వర్క్ లింక్ తదితర అన్ని పనులు పూర్తిచేసిన నిర్వహణ సంస్థ 2018 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ అనేక సమస్యలు ఎదురయ్యాయి. నెట్వర్క్ సమస్యలతో హాజరు నమోదు కాకపోవడం, బయోమెట్రిక్ పరికరాలు పని చేయకపోవడం సమస్యలతో పాఠశాలల్లో వాటిని ఉపయోగించే వారే లేకుండాపోయారు. దీంతో రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చేతులెత్తేస్తున్న నిర్వహణ సంస్థ బయోమెట్రిక్ హాజరుపై విద్యాశాఖ గతనెలలో సమీ క్షించింది. కమిషనర్ విజయ్కుమార్ నిర్వహణ సంస్థతో 3 గంటలపాటు సమావేశమై చర్చించారు. లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో విద్యాశాఖ పడింది. మరిన్ని పాఠశాలల్లో దీన్ని విస్తరింపజేయాలని భావి స్తున్న సమయంలో తొలి విడతలో ఏర్పాటు చేసినవే పని చేయక గందరగోళంలో పడింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈనెల 3న ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించింది. గతనెల 27వ తేదీ నాటి పరిస్థితితో పోల్చి చూస్తే.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. గత నెల 27న 1,165 స్కూళ్లనుంచి బయోమెట్రిక్ వివరాలు రాకపోగా ఈనెల 3న 908 స్కూళ్ల నుంచి వివరాలు రాలేదు. గతనెల 27న పాఠశాలకు హాజరైన 6,96,029 మంది విద్యార్థుల్లో 37,352 మంది విద్యార్థుల హాజరు మాత్రమే నమోదైంది. ఇక ఈనెల 3వ తేదీన మాత్రం 16 శాతం విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదైంది. ఇక టీచర్ల హాజరు పరిస్థితి అలాగే ఉంది. గత నెల 27న టీచర్ల హాజరు 52 శాతమే నమోదైతే ఈనెల 3న 66 శాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్ హాజరు విధానంపై ఎలా ముందుకు సాగాలన్న గందరగోళంలో విద్యాశాఖ పడింది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా జేఎన్టీయూహెచ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో నాణ్యత ప్రమాణాలు, నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్నాయా.. లేదా అన్న అంశాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు నిర్వహించి వాటి ఆధారంగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేది. కానీ ఇకపై అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలోనే కాకుండా ఏడాది మొత్తంలో ఎప్పుడైనా తనిఖీలు చేపట్టనుంది. అంతేకాదు తనిఖీల సమయంలో టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించకుండా దొరికినా.. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేకపోయినా.. అనధికారికంగా సెలవులు ఇచ్చినా, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా సెలవులు ఉన్నా కాలేజీ అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. జేఎన్టీయూ తమ పరి«ధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలను శుక్రవారం జారీ చేసింది. అందులో అనుబంధ గుర్తింపు పొందాలనుకునే కాలేజీలు అనుసరించాల్సిన నిబంధనలను పొందుపరిచింది. త్వరలో ‘అనుబంధం’నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయకపోయినా, ల్యాబ్లలో తగిన సదుపాయాలు కల్పించకపోయినా అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అఖిల భారత సాంకేతిక విదాయ మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారమే అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ఉంటుందని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని జేఎన్టీయూ వర్గాలు వెల్లడించాయి. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ కానీ బ్రాంచీల మూసివేత అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. అద్దె భవనాల్లో కాలేజీలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రతి 300 మంది విద్యార్థులకు అదనపు ల్యాబ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. కాలేజీల మూసివేతకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కోర్సులు, కాలేజీలు మూసివేసేందుకు ఎన్వోసీ పొందేందుకు యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాలేజీలు తమ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు కోర్సుల వారీ వివరాలను ఈనెల 20లోగా అందజేయాలని తెలిపింది. అటానమస్ కాలేజీలు అమలు చేస్తున్న సిలబస్ వివరాలను కూడా ఇవ్వాలని పేర్కొంది. అధ్యాపకుల వివరాలివ్వాలి కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వివరాలు ఈ నెల 17 లోగా అనుబంధ గుర్తింపు దరఖాస్తుల పోర్టల్కు అప్లోడ్ చేయాలని సూచించింది. కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని, వారి పాన్, ఆధార్ నంబర్లను ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ నంబర్ను అఫీలియేషన్ దరఖాస్తు సమయంలో అందజేయాలని వివరించింది. కాలేజీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసినపుడు అప్లోడ్ చేసిన డేటాకు, ఎఫ్ఎఫ్సీలు చేసే వెరిఫికేషన్లో వెల్లడయ్యే డేటా మధ్య అధిక వ్యత్యాసం ఉంటే ఆ కాలేజీ చేసిన అనుబంధ గుర్తింపు దరఖాస్తునే తిరస్కరించనుంది. -
పార్లమెంటు ముందుకు ఆధార్ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బయోమెట్రిక్ ఐడీ ఆధార్ చట్ట సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్లు మొదలైనవి పొందడానికి వినియోగదారులు గుర్తింపు ధృవీకరణ పత్రం కింద ఆధార్ను స్వచ్ఛందంగా మాత్రమే ఇచ్చేలా ఇందులో ప్రతిపాదనలున్నాయి. ఆధార్ ఇవ్వడానికి ఇష్టపడని వారికి బ్యాంకు ఖాతా, సిమ్ కార్డులు మొదలైన సర్వీసులు అందించకుండా ఆయా సంస్థలు నిరాకరించడానికి ఉండదు. స్వచ్ఛందంగా ఆధార్ నంబర్ ఇచ్చిన వారి బయోమెట్రిక్ వివరాలను సర్వీస్ ప్రొవైడర్లు తమ సర్వర్లలో భద్రపర్చుకోరాదు. అలాగే, ఆధార్ను దుర్వినియోగం చేసే కంపెనీలపై రూ.1 కోటిదాకా జరిమానా, నిబంధనలు ఉల్లంఘన జరిగినంత కాలం రోజుకు రూ.10 లక్షల దాకా అదనంగా పెనాల్టీ విధించేందుకు యూఐడీఏఐకి అధికారాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ప్రయోజనాల కోసం ఈ బిల్లు కింద ఆధార్ చట్టం 2016తో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002ని కూడా సవరించనున్నారు. -
యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆధార్ చట్ట సవరణల ప్రతిపాదనల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. ఒక రకంగా నియంత్రణ సంస్థ పాత్ర పోషించనుంది. బయోమెట్రిక్ ఐడీ దుర్వినియోగం చేసే వారిపైనా, నిబంధనలు ఉల్లంఘించేవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు కూడా దీనికి అధికారాలు దఖలుపడనున్నాయి. సవరణ ప్రతిపాదనల ప్రకారం.. ఆధార్ డేటాబేస్లోకి అనధికారికంగా చొరబడిన పక్షంలో 10 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా మాత్రమే ఉంది. మరోవైపు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు తీసుకునేందుకు కస్టమర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్ను ఇవ్వొచ్చు. ప్రతిపాదిత సవరణలను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కేంద్రం పార్లమెంటు ముందు ఉంచనుంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ డేటాను వినియోగించుకోవడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా సవరణలు ప్రతిపాదించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం వీటిని రూపొందించింది. -
మనిషి లేకున్నా వేలిముద్ర! ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్
సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థేనే ఏమార్చారు. ఓ మనిషికి సంబంధించిన వేలిముద్రలను క్లోనింగ్ చేసి, అతడు అక్కడ లేకున్నా అటెండెన్స్ పడేలా చేశారు. మరో ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు అదే కాలేజీలో ఉన్నట్లు చూపించి భారీ స్థాయిలో ఫీజు రీ–ఎంబర్స్మెంట్ చేసుకునేందుకు సహకరించారు. నగర శివార్లలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కేంద్రంగా జరిగిన క్లోనింగ్ దందాను తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో బీటెక్ గ్రాడ్యుయేట్ ఉండటం గమనార్హం. మరికొన్ని కళాశాలల్లోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని, జేఎన్టీయూ సహకారంతో వాటిని గుర్తిస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్లతో కలిసి బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ ప్రస్తుతం అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజినీరింగ్ కాలేజీలో ఏఓగా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేయడంతో వీరిరి పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలి. అయితే పలు కాలేజీలో దీనిని పాటించలేకపోతున్నాయి. ఫలితంగా బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. అఫిలియేటెడ్ కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరు మొత్తం బయోమెట్రిక్ ఆధారంగానే జరుగుతుంది. ఆయా కాలేజీల్లోని బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో మేనేజ్మెంట్లు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన రామకృష్ణ ఇంటర్నెట్లో వేలిముద్రలను క్లోనింగ్ విధానంపై అవగాహన పెంచుకున్నాడు. శ్రీరామ్ప్రసాద్ ఇతడితో జట్టుకట్టాడు. హైదరాబాద్లో ఉన్న కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్ప్రింట్స్ ఆర్డర్ను రామకృష్ణకు పంపిస్తాడు. గ్లూ, ఈవీఏ వినియోగించి క్లోనింగ్... ఆయా కాలేజీలు తమకు అవసరమైన విద్యార్థులు, అధ్యాపకుల డిమాండ్ను తట్టుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నాయి. ఎంటెక్ పూర్తి చేసి, వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించి తమ వద్ద అసోసియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నట్లు ఎన్రోల్ చేస్తున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.5 వేల వరకు ‘గౌరవ వేతనం’ ఇస్తున్నాయి. ఈ ‘అసోసియేట్ ప్రొఫెసర్లు’ కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కాలేజీకి వస్తారు. ఆ సందర్భంలో శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్లో లోడ్ చేస్తాడు. దీంతో పాటు ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిన్న కాగితంపై గ్లూ గన్ ద్వారా సదరు ప్రొఫెసర్తో వేలిముద్ర వేయిస్తాడు. దీనిని అందుకుంటున్న రామకృష్ణ ఆ గ్లూ వేలిముద్రపై ఇథనైల్ వినైల్ ఎసిటేట్ (ఈవీఏ) అనే కెమికల్ వేసి, కొద్ది సేపటి తర్వాత చాకచక్యంగా ఆ అచ్చు తీస్తాడు. దీంతో గ్లూ పై ఉన్న వేలిముద్ర ఈ అచ్చు మీదికి చేరుకుంటుంది. వీటిపై నిర్ణీత నెంబర్లు వేసి శ్రీరామ్కు పంపిస్తాడు. ఒక్కో బోగస్ అధ్యాపకుడి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేస్తారు. వీటిని అందుకుంటున్న ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రతి రోజూ ఈ అచ్చులను బయోమెట్రిక్ మిషన్లో వేలు పెట్టాల్సిన చోట పెడుతున్నాయి. దీంతో ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్లో నమోదు అవుతోంది. అలాగే ఇతర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వీరి వేలిముద్రలనూ ఇలానే తయారు చేసి, హాజరు చూపిస్తూ ఫీజు రీ–ఎంబర్స్మెంట్ పొందుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఆయా విద్యా సంస్థల్లోని కీలక వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతోంది. నిందితులు ఒక్కో వేలిముద్ర తయారు చేసి ఇచ్చినందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. 29 మందివి సృష్టించినవివేకానంద సంస్థ... బాటసింగారంలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ప్రిన్సిపల్ పోరెడ్డి సుదర్శన్రెడ్డి ఈ క్లోనింగ్ విషయాన్ని తమ కార్యదర్శి గోపాల్రెడ్డికి తెలిపారు. ఆయన సమ్మతించడంతో శ్రీరామ్ ద్వారా రామకృష్ణను సంప్రదించారు. తమ కళాశాల కోసం ‘ఏర్పాటు చేసుకున్న’ 29 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల వేలిముద్రలను క్లోనింగ్ చేయించారు. ఏడాదిగా వీటి ద్వారానే తమ సిబ్బంది హాజరు చూపించేస్తున్నారు. తాజాగా మరో ఐదుగురు ప్రొఫెసర్ల వేలిముద్రల క్లోనింగ్ కోసం ఆర్డర్ ఇచ్చారు. వీటిని సైతం తయారు చేసిన రామకృష్ణ నేరుగా సిటీకి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్సైలు గోవింద్ స్వామి, పి.రమేష్, జి.శ్రీనివాస్రెడ్డి, సి.వెంకటేష్లతో కూడిన ఈ టీమ్ బుధవారం సైదాబాద్ ప్రాంతంలో రామకృష్ణ, శ్రీరామ్లను పట్టుకుంది. వీరిచ్చిన సమాచారంతో సుదర్శన్రెడ్డినీ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.3 లక్షల నగదు, రెండు బయోమెట్రిక్ మిషన్లు, 29 క్లోన్డ్ వేలిముద్రలు, మరో 20 మందికి చెందిన ‘గ్లూ వేలిముద్రలు’ తదితరాలు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం ఈ కేసును సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. లోతుగా దర్యాప్తు ‘ఈ నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని యోచిస్తున్నాం. వీరి సహకారంతో ఇలాంటి వ్యవహారాలు మరికొన్ని కాలేజీల్లోనూ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే కేవలం వివేకానంద సంస్థకు సంబంధించి మాత్రమే ఆధారాలు లభించాయి. ఈ కేసులో జేఎన్టీయూ సహకారం తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తాం. పాత్ర ఉన్న అన్ని కళాశాలల వివరాలుగుర్తిస్తాం’ –అంజనీకుమార్,నగర పోలీస్ కమిషనర్ -
బడిపంతులు బయోమె'ట్రిక్'
ఈయన పేరు గురుమూర్తి. కంబదూరు మండలం ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. సమయానికి రావడం.. బయోమెట్రిక్ వేసి ఇంటిబాట పట్టడం ఈయన దినచర్య. పాఠశాల ముగిసే సమయానికి ఠంచనుగా చేరుకొని బయోమెట్రిక్ వేసి వెళ్లడంతో ఈ సారు ఉద్యోగం ముగుస్తుంది. ఇప్పటికి లెక్కలేనన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. టీడీపీ కార్యకర్తగా చెలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి నమ్మిన బంటు కావడంతోనే ఈ బడిపంతులు ఆడిందే ఆట, పాడిందే పాట. అనంతపురం కళ్యాణదుర్గం: కంబదూరు మండలం ఎగువపల్లి(వైసీ పల్లి) ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. 65 మంది విద్యార్థులు ఉన్నారు. సీనియర్ ఎస్జీటీ సుధాకర్ ఇన్చార్జి హెచ్ఎంగా వ్యవహరిస్తున్నారు. హెచ్ఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురుమూర్తి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నాడు. అంతేకాదు.. తాత్కాలికంగా వరలక్ష్మి అనే అమ్మాయిని విద్యావలంటీర్గా నియమించుకుని తన సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడు. పది నెలల క్రితం కుటుంబ సభ్యుల పేరుతో నూతిమడుగులో పెట్రోల్ బంకును దక్కించుకున్నాడు. ఈ బంకు నిర్వహణే ఇప్పుడు ఆయనకు కీలకంగా మారింది. 2018 జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు గురుమూర్తిపై ఫిర్యాదు చేసినా చర్యలు కరువయ్యాయి. ఫిర్యాదు చేసినప్పుడు రెండ్రోజులు విధులకు సక్రమంగారావడం, తిరిగి యథావిధిగా బయోమెట్రిక్ నమోదు చేసిన వెంటనే సొంత పనులకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో విద్యార్థుల చదువు అటకెక్కింది. నెలకు వేలాది రూపాయల వేతనం తీసుకునే ఉపాధ్యాయుడు బాధ్యతను విస్మరించి విధులకు ఎగనామం పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. టీడీపీ కార్యకర్తగా చెలామణి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణం. అయితే ఏకంగా టీడీపీ పార్టీ నిర్వహించే ‘గ్రామదర్శిని–గ్రామ వికాసం’ కార్యక్రమంలో పాల్గొంటూ తనకు టీడీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడు తన స్వగ్రామం నూతిమడుగులో నిర్వహించిన టీడీపీ గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. ఇదే కాదు.. నూతిమడుగులో టీడీపీ చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా ఆయన ఒక్కోసారి ప్రత్యక్షంగానూ, కొన్నిసార్లు పరోక్షంగానూ తన పాత్ర పోషిస్తుంటాడు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. విద్యావలంటీర్కు వేతనం ఇవ్వం పాఠశాలలో పనిచేస్తున్న తాతాల్కిక విద్యా వలంటీర్ వరలక్ష్మికి వేతనం ఇవ్వం. పిల్లలకు చదువు చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. బయోమెట్రిక్ నమోదు చేసి బయటికి వెళ్లిపోతున్న ఉపాధ్యాయుడు గురుమూర్తి విషయాన్ని విద్యాశాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల తల్లిదండ్రులతో మాట పడాల్సి వస్తోంది.– సుధాకర్, హెచ్ఎం = నా పేరు రమేష్, వైసీ పల్లి గ్రామం. నా కుమారుడు ధనుష్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు గురుమూర్తి పిల్లలకు చదువులు చెప్పకుండా సొంత పనులు చూసుకుంటున్నాడు. ఉన్నతాధికారులు స్పందించాలి. ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలి ఎగువపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గురుమూర్తిని నెలల తరబడి పిల్లలకు చదువు చెప్పకుండా సొంత పనులు చూసుకుంటున్నాడు. బయోమెట్రిక్ నమోదు చేయడం, వెళ్లిపోవడం.. సాయంత్రం తిరిగి పాఠశాలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేస్తున్నాడు. పిల్లల చదువు పూర్తి అధ్వానంగా మారింది. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకుని పాఠశాలలో బోధనను చక్కదిద్దాలి. – తిరుపాల్, తాజా మాజీ సర్పంచు, వైసీ పల్లి -
నేడు ఎస్సై రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని నియామక బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 339 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 1,217 పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు 1,83,482 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలపై బోర్డు ఇదివరకే అవగాహన కార్యక్రమం నిర్వహించింది. హాల్టికెట్ జారీ నిబంధనలకు లోబడి పరీక్ష నిర్వహణ జరుగుతుందని తెలిపింది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా ఇంగ్లిష్లో పేర్కొన్న ప్రశ్నను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని వివరించింది. ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రాథమిక పరీక్ష నుంచి అభ్యర్థుల తుది ఎంపిక వరకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు బోర్డు శనివారం తెలిపింది. -
రికార్డుల్లోకి నేర ‘చరిత్ర’
సాక్షి, అమరావతి: నేరం జరిగిన తీరును బట్టే ఎవరు చేశారో ఓ అంచనా వేయొచ్చు.. చిన్నపాటి క్లూ దొరికితే చాలు నేరస్తుడిని ఇట్టే పట్టేయవచ్చు.. పట్టుకున్న క్రిమినల్కు కచ్చితంగా శిక్ష పడేలా కీలక ఆధారాలు సేకరించవచ్చు.. ఆశ్చర్యంగా ఉందా? ఏపీ పోలీసులు ఇప్పుడు ఇదే తరహా కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు పోటీ పడుతున్నా.. వారికి చెక్ పెట్టడంలో పోలీసులు మాత్రం వెనుకబడుతున్న లోపాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నేర పరిశోధన, దర్యాప్తునకు దోహదం చేసే రాష్ట్రస్థాయి అధికారుల కీలక సమావేశం నిర్వహించారు. నేర ‘చరిత్ర’ను సృష్టించే ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. డీజీపీ చైర్మన్గా ఉండే రాష్ట్రస్థాయి బయోమెట్రిక్ క్రిమినల్ డేటా వ్యవస్థ(ఏపీ స్టేట్ లెవెల్ బయోమెట్రిక్ క్రిమినల్ డేటా ఇండెక్సింగ్ సిస్టమ్)కు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం నేర పరిశోధనలలో కీలకపాత్ర పోషించే పలు శాఖలను ఒకే గొడుకు కిందకు తెచ్చి ‘సమగ్ర ఫోరెన్సిక్ ఆధార సంస్థ’గా పనిచేయిస్తారు. దీనిలో భాగంగా తొలిదశలో పది వేల మంది నేరస్తుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. మలి విడతలో 50 వేల మంది నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయనున్నారు. ఏయే వివరాలు సేకరిస్తారు? రాష్ట్రంలో పలు కేసుల్లో శిక్ష పడినవారు, పలు కేసులు విచారణలో ఉన్నవాళ్లు, అరెస్టులు అయినవాళ్లు, బెయిల్పై ఉన్నవాళ్లు, అనుమానితుల పూర్తి సమాచారాన్ని బయోమెట్రిక్ క్రిమినల్ డేటాలో పొందుపరుస్తారు. ప్రధానంగా వాళ్ల వేలిముద్రలు, హస్తముద్రలు, పాదముద్రలు, సంతకాలు, చేతి వ్రాత, స్వర నమూనాలు, నడక, ఆలోచన ధోరణి, బాడీ లాంగ్వేజ్, ఫోన్ మాట్లాడే తీరు, తల వెంట్రుకలు, శరీరంపై మచ్చలు, డీఎన్ఏ తదితర అన్ని నమూనాలతోపాటు ఫొటోలు, వీడియో షాట్లు రికార్డు చేస్తారు. వారు పుట్టిన ప్రాంతం, ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, మొబైల్ నంబర్, ల్యాండ్ ఫోను నంబర్, నివాసం ఎక్కడ, కుటుంబ సభ్యుల వివరాలు, వారితో కలిసి ఉండే వారి వివరాలను వాటితో జతచేస్తారు. క్రిమినల్స్ గత నేర చరిత్ర, ప్రస్తుత స్థితిగతులు, శిక్షలు, వీడిపోయిన కేసులు, బెయిల్ ఇచ్చిన వారు, ఏఏ కేసుల్లో సాక్షిగా ఉన్నారు, డిఫెన్సు లాయర్ ఎవరు అనే వివరాలతోపాటు పోలీస్ రికార్డుల్లోని వివరాలను కూడా ఆన్లైన్ బయోగ్రఫిక్లో చేరుస్తారు. వీటిని కేసుల్లో పురోగతి, దర్యాప్తు, విచారణకు దోహదం చేసేలా ఉపయోగించుకోనున్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు వాస్తవానికి ఏపీలో ఫోరెన్సిక్ విభాగంలో పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలను బలపరిచే సరైన వ్యవస్థ లేదు. నేరస్తులను పట్టుకోవడంలోను, తగిన ఆధారాలు సేకరించడంలోను, వారికి శిక్షలు పడేలా చేయడంలోను ఘోర వైఫల్యం కన్పిస్తోంది. ఫలితంగా నేరస్తులు తప్పించుకోవడం, ఒక్కోసారి నేరం చేయనివారు కూడా బాధితులుగా మారడం జరుగుతోంది. ఇలాంటి లోపాలను ఇప్పటికే అధిగమించిన అమెరికా లాంటి దేశాలు ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేసుకుని నేరస్తులకు చెక్ పెట్టగలుగుతున్నాయి. ఇటీవల అట్లాంటాలో క్రైమ్, ఫోరెన్సిక్ ల్యాబ్లపై సదస్సుకు ఏపీ పోలీసు ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నేరాలు చేసిన వాళ్లను పట్టుకోవడం, శిక్షలు పడేలా చేయడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నామనో తెలుసుకోగలిగారు. దేశంలోను, రాష్ట్రంలోనూ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫింగర్ ప్రింట్, ఎక్సైజ్, నార్కోటిక్స్, డ్రగ్ మొదలైన వాటి ద్వారా ఎన్నో సంచలన కేసుల్లో నేరస్తుల ఆటకట్టించవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డీజీపీ అధ్యక్షతన కీలక అధికారుల సమావేశంలో ‘భిన్న విభాగాల సమూహం(మల్టీ డిపార్టుమెంటల్ వర్కింగ్ గ్రూపు)’తో ఇంటిగ్రేటెడ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(సమగ్ర ఫోరెన్సిక్ సాక్ష్యాధార వ్యవస్థ)కు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. -
డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,100కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో దీని అమలుకు చర్యలు చేపట్టనుంది. టీఎస్టీఎస్(తెలంగాణ స్టేట్టెక్నాలజీ సర్వీస్) నుంచి బయోమెట్రిక్ మిషన్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కో మిషన్కు నెలకు రూ.1,000 చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేయనుంది. ప్రతిభావంతులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు కళాశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సివిల్స్లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా 50 లేదా 100 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణనిచ్చేలా చర్యలు చేపడుతోంది. నేరుగా పోస్టుల భర్తీకి చర్యలు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు కళాశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, మిగిలిన పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకోసం నియమ నిబంధనల్లో సవరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. -
బయోమెట్రిక్ లేకపోయినా రేషన్: ఈటల
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మ్యానువల్ లేదా ఐరిస్తో వినియోగదారులకు రేషన్ సరుకులు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. మంగళవారం పౌరసరఫరాలు, తూనికల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 31 జిల్లాల తూనికలు కొలతల అధికారులకు ల్యాప్టాప్లు, వాహనాలను ఈటల, సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి, కమిషనర్ అకున్ సభర్వాల్ అందజేశారు. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, మల్టీప్లెక్స్ మోసాలను కూడా అరికడుతున్నామని ఈటల తెలిపారు. -
ఆధార్ నమోదుకు... 18,000 కేంద్రాలు ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ ఐడీ అప్డేషన్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది. ‘‘బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,000 చోట్ల ఈ సదుపాయం కల్పించారు. మిగిలిన చోట్ల కూడా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి’’ అని పాండే తెలిపారు. మొత్తం మీద 26,000 కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఖాతాలకు ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ కోరడం గమనార్హం. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 13,800 శాఖల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,000 శాఖల్లో ఇవి ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇక 13,000 పోస్టాఫీసులకు గాను 8,000 శాఖల్లో వీటిని ఏర్పాటు చేశారు’’ అని పాండే వివరించారు. లక్ష్యం మేరకు మిగిలినవి ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ విషయంలో కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. -
‘బయోమెట్రిక్’ దుర్వినియోగం!
న్యూఢిల్లీ: పౌరుల దైనందిన కార్యకలాపాలన్నింటికీ బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే ఆ సమాచారం దుర్వినియోగమయ్యే ముప్పు ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ చట్టబద్ధతపై బుధవారం జరిగిన విచారణలో గోప్యతా ఉల్లంఘనపై రాజ్యాంగ ధర్మాసనం పలు సందేహాలను లేవనెత్తింది. ప్రతి లావాదేవీకి బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరిచేయడం..వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించడానికి దారితీస్తుందని, తరువాత అది దుర్వినియోగమయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ‘కేవలం వేలిముద్రల వల్ల ఎలాంటి వివరాలు తెలియవు. కానీ ఆ సమాచారాన్ని ఇతర వివరాలతో కలిపితే అదొక సమాచార నిధిగా మారుతుంది. అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే తగిన రక్షణ వ్యవస్థ అవసరం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రతి దానికీ బయోమెట్రిక్ను తప్పనిసరి చేయడం వల్ల ఇకపై అది కేవలం గుర్తింపు సూచికకే పరిమితం కాదని జడ్జి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు ఆధార్ వివరాలను ధ్రువీకరించుకుంటున్న సంగతిని ప్రస్తావించారు. ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తరఫున హాజరైన లాయర్ రాకేశ్ ద్వివేది జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..చాలా సందర్భాల్లో ధ్రువీకరణ ఒకసారే జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు పాన్, మొబైల్ సిమ్ కొనుగోలును ఉదహరించారు. ఇప్పటికైతే ఆధార్ సమాచారాన్ని సంగ్రహించేందుకు అవకాశాలు లేవని, ఒకవేళ భవిష్యత్తులో ఆ పరిస్థితే తలెత్తితే కోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు. -
‘బయో’బాధలు..!
సాక్షి, యాదాద్రి : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జనవరి 1 నుంచి ఈ పాస్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా సరుకులు తీసుకోవాలంటే బయోమెట్రిక్ యంత్రాల్లో లబ్ధిదారుల వేలిముద్రలను తప్పనిసరి చేసింది. అయితే వయస్సు మళ్లిన వృద్ధులు, రక్తహీనత రోగులు, కష్టజీవులు, రోజువారి కూలీలు చేతి వేళ్ల రేఖలు కనిపించపోవడంతో వారి వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. జిల్లాలో ప్రతి నెలా వేలాది యూనిట్లకు ఇలాంటి సమస్య తలెత్తుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం కోటా అందడం లేదు. వీటికి తోడు సాంకేతిక సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడం కూడా వేలిముద్రలు పడకపోవడానికి కారణమవుతున్నాయి. శాపంగా మారిన ఒక్క శాతం నిబంధనఅక్రమాల నివారణ కోసం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. వేలి ముద్రలు పడని వారికి వీఆర్వోల ధ్రువీకరణ ద్వారా బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రతి రేషన్ దుకాణంలో ఒక్క శాతం మేరకే వీటిని ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో ప్రతి రేషన్ దుకాణంలో పదుల సంఖ్యలో వేలిముద్రలు పడని వారు ఉంటున్నప్పటికీ అందరికీ బియ్యం అందడం లేదు. వారందరికీ రేషన్ ఇవ్వడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. తమకు బియ్యం ఇప్పించాలని లబ్ధిదారులు రేషన్ దుకాణం, గ్రామంలోని వీఆర్వో, మండలంలోని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకుంటున్నా వారికి న్యాయం జరగడం లేదు. భువనగిరిలో 823 మంది భువనగిరి పట్టణం, మండల పరిధిలో 36 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలోని 712 మంది లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. వేలిముద్రలు పడనివారికి ఒక్క శాతం రేషన్ ఇవ్వాలన్న నిబంధన ప్రకారం కేవలం 192మందికి మాత్రమే బియ్యం అందుతున్నాయి. మిగతా 520 మందికి బియ్యం నెలనెలా అందడం లేదు. ఈపరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఉంది. అర్హులందరికీ బియ్యం ఇవ్వాలి వేలిముద్రలు పడనివారందరికీ నెలనెలా రేషన్ బియ్యం ఇవ్వాలి. ఒక్క శాతం నిబంధనతో పేదలందరికీ బియ్యం అందడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలి. –చల్లగురుగుల రఘుబాబు, మైఫ్రెండ్ సోషల్ ఆర్గనైషన్ అధ్యక్షుడు ఆధార్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి వేలిముద్రలు రానివారు తమ ఆధార్కార్డును ఆధార్ సెంటర్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వేలిముద్రలను కూడా ఆన్లైన్ చేసుకోవాలి. వేలిముద్రలు రాని వారికి వీఆర్వో ద్వారా బియ్యం, సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రేషన్షాపుకు వీఆర్వోలను కేటాయించాం. –కొప్పుల వెంకట్రెడ్డి, భువనగిరి తహసీల్దార్ -
వయోవృద్ధులకు పెన్షన్ వెసులబాటు
విజయనగరం రూరల్ : వయోవృద్ధులైన పింఛన్దారులు బయోమెట్రిక్ వేసేందుకు ఇక నుంచి ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా ప్రభుత్వం వెసులుబా టు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వినియోగదారులు సేవా కేంద్రం ఇన్చార్జి చదలవాడ ప్రసాదరావు పే ర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న వినియోగదారుల సేవా కేంద్రంలో వయోవృద్ధులతో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరా లు నిండిన వయోవృద్ధులు సబ్ట్రెజరీ అధికారికి పింఛన్ వెసులుబాటుకు దరఖాస్తు చేసుకుంటే సహాయకులను ఇంటి వద్దకే పంపించి వేలిముద్రలు తీసుకుంటారని చె ప్పారు. వేలిముద్రలు పడని వారు జీవించే ఉన్నామన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపా రు. ఈ పత్రాన్ని సహా యకులు ఇంటి వద్దకు వచ్చి తీసుకుంటారన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ యోవృద్ధులు వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స భ్యులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. -
మా నాన్న బయోమెట్రిక్ వివరాలు ఇచ్చేయండి
న్యూఢిల్లీ : ఇప్పటికే ప్రభుత్వం సేకరిస్తున్న బయోమెట్రిక్ వివరాలపై పలు వాదనలు వినపడుతుండగా.. తాజాగా ఓ అరుదైన కేసు ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అదేమిటంటే.. చనిపోయిన మా నాన్న బయోమెట్రిక్ వివరాలు యూఐడీఏఐ వెనక్కి ఇచ్చేయాలంటూ బెంగళూరుకు చెందిన ఓ మానవ వనరుల అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం. ఆధార్ కార్డు కోసం తన తండ్రి దగ్గర్నుంచి సేకరించిన బయోమెట్రిక్ వివరాలను, యూఐడీఏఐ వెనక్కి ఇచ్చేయాలంటూ సంతోష మిన్ బి అనే వ్యక్తి కోరుతున్నాడు. తన తండ్రి చనిపోయినందున యూఐడీఏఐకి ఈ డేటాతో ఎలాంటి అవసరం ఉండదని, ఒకవేళ ఆ వివరాలు యూఐడీఏఐ వద్దనే ఉంటే, వాటిని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయంటూ ఈ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. తన కేసు తరుఫున వాదనలు వినిపించడానికి ఫిర్యాదుదారునికి రెండు నిమిషాల సమయం కేటాయించింది. ఈ సమయంలో ఆధార్ స్కీమ్ ఒక అప్రకటిత ఎమర్జెన్సీగా అతను అభివర్ణించాడు. ప్రింటెడ్ ఫామ్లో తమ తండ్రి బయోమెట్రిక్ వివరాలను యూఐడీఏఐ తనకు సమర్పించేలా కోర్టు ఆదేశించాలని అతను కోరాడు. వీటిని తన భావితరాల కోసం భద్రంగా ఉంచనున్నట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా ఆధార్ స్కీమ్ను రద్దు చేయాలని కూడా కోరాడు. 2016 డిసెంబర్ 31న తన తండ్రి చనిపోయాడని, తమ చరిత్రలో అది చీకటి రోజని, అదే రోజు డిమానిటైజేషన్ ప్రక్రియ కూడా ముగిసిందంటూ చెప్పుకొచ్చాడు. తనకు కేటాయించిన రెండు నిమిషాల సమయంలో ఈ ప్రసంగాన్ని ప్రారంభించిన అతనిని మధ్యలోనే ఆపివేసిన బెంచ్... ఇక్కడ ప్రసంగాలు ఇవ్వడానికి అనుమతి లేదని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను బెంచ్ మార్చి 20కి వాయిదా వేసింది. కాగ, ఆధార్ అనుసంధానానికి గతంలో విధించిన మార్చి 31 గడువును పొడిగిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చే వరకూ అనుసంధానం తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించే వరకూ బ్యాంకింగ్, మొబైల్ సేవలు సహా పలు సేవలకు ఆధార్ను అనుసంధానించటం తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. -
బయోమెట్రిక్ హాజరు అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో దశల వారీగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెడతామన్న విద్యాశాఖ ఆచరణలో మాత్రం చేయలేకపోతోంది. రెండేళ్ల కిందటే మొదటి విడతగా 6,391 (25 శాతం) ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేదు. వాటి ఏర్పాటుకోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా సదరు సంస్థలు ముందుకు రాకపోవడంతో ఆచరణలోకి తేలేకపోయామని విద్యాశాఖ చెబుతోంది. అయితే టెండర్ల సమస్యతోపాటు నిధుల సమస్యకూడా బయోమెట్రిక్ హాజరు విధానానికి అడ్డంకిగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఎంతమేరకు చేస్తారన్నది తేలాల్సి ఉంది. అవసరమైన చోట వదిలేసి.. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు విషయంలో విద్యాశాఖ తీరు పుండు ఒక చోట, మందు మరో చోట అన్న చందంగా తయారైంది. వాస్తవానికి బయోమెట్రిక్ హాజ రు విధానం ముందుగా ప్రవేశపెట్టాల్సింది ప్రాథమిక పాఠశాలల్లో అయినప్పటికీ, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ప్రాథమిక పాఠశా లలకు టీచర్లు సరిగ్గా రాకపోవడం, వచ్చినా వెంటనే వెళ్లిపోవడం, ఇద్దరు ఉన్నచోట ఒక్కరే బడికి రావడం, ఒకరు ఒకవారం వస్తే, మరొ కరు ఇంకో వారం బడికి వస్తున్నట్లు విద్యా శాఖ సర్వేల్లోనే తేలింది. అలాంటి పరిస్థితుల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. టీచర్లే బడికి సరిగ్గా రారు అన్న అపవాదును ఎదుర్కొంటోంది. అంతేకాదు ఆ పరిస్థితుల కారణంగా తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడం లేదు. ప్రైవేటు స్కూళ్లలో చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం కలగాలంటే ముందుగా ప్రాథమిక పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాల్సి ఉంది. ఇందుకు బయోమెట్రిక్ హాజరు విధానం కొంత దోహదం చేస్తుంది. అందుకే ముందుగా ప్రాథమిక విద్య పటిష్టంకోసం వాటిల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని విద్యాశాఖకు చెందిన అధికారులే పేర్కొంటున్నారు. నిధుల సమస్య అధిగమించేనా? రెండేళ్ల కిందట 6,391 ప్రాథమిక పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాల ఏర్పాటుకు ఎస్ఎస్ఏ నిధులను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఒక్కో పరికరానికి రూ.7 వేల అంచనాతో విద్యాశాఖ రూ.4.47 కోట్లు వెచ్చించేలా ప్రణాళికలు వేసింది. మిగతా 75 శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్కు విజ్ఞప్తి చేసినా, ఆశించిన లాభం చేకూరలేదు. దీంతో నిధుల సమస్య కూడా బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించి అమలు చేస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది. -
477 మంది టీచర్లకు నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: భారీ సంఖ్యలో అయ్యోర్లకు షోకాజ్ నోటీసులు అందాయి. మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ నెల 23న బయోమెట్రిక్ వేయలేదన్న సాకుతో ఏకంగా 477 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాలో 3224 ప్రాథమిక, 366 ప్రాథమికోన్నత, 515 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 4105 పాఠశాలలు ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ యాజమాన్యాల కింద పని చేస్తున్నాయి. వీటి పరిధిలో 6,21,965 మంది విద్యార్థులు చదువుతుండగా, 14,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎస్జీటీలు 7261 మంది కాగా, స్కూల్ అసిస్టెంట్లు 7020 మంది ఉన్నారు. విశాఖ సిటీతో పాటు గ్రామీణ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ హాజరు పద్ధతి అమలు చేస్తున్నారు. నెట్వర్క్ సమస్య కారణంగా ఏజెన్సీలోని పాఠశాలల్లో అమలు కావడం లేదు. బయోమెట్రిక్ హాజరు పద్ధతి విద్యార్థులతో పాటుæ ఉపాధ్యాయులకు ప్రాణసంకటంగా మారింది. అటెండెన్స్ వేసేందుకు రోజూ నరకం చూస్తున్నారు. ఎప్పుడు నెట్వర్కు పనిచేస్తుందో.. ఎప్పుడు పనిచేయదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ పనిచేసినా వేలి ముద్రలు పడతాయో లేదో? ఐరిష్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియని దుస్థితి. ఒకే..అని వచ్చే వరకు ఒకటికి పదిసార్లు అటెండెన్స్ వేయాల్సిందే. చర్చనీయాంశమైన విద్యాశాఖ తీరు బయోమెట్రిక్ పడక ఈ నెల 23న విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 477 మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారని షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్య శాఖ కమిషనర్ టెలిఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా డీఈవో పేర్కొన్నారు. ఎందుకు గైర్హాజరయ్యారో అందుకు తగిన కారణాలతో మూడ్రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ఆ ఉత్తర్వుల్లో ఉపాధ్యాయులను ఆదేశించారు. కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిత్యం మొరాయింపు జిల్లాలో 60 శాతం బయోమెట్రిక్ మిషన్లు రోజూ మొరాయిస్తూనే ఉన్నాయి. ఎక్కువ మిషన్లు సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు చేయిద్దామనుకున్నా సాంకేతిక నిపుణులు అందుబాటులో లేని పరిస్థితి. మిషన్ల నిర్వహణ అధ్వానంగా ఉన్నాయని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మిషన్లు సరఫరా చేసిన కంపెనీలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కనీసం స్థానికంగా ఒకరిద్దరు సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ పని ఒత్తిడితో వారు సకాలంలో వీటిని మరమ్మతులు చేయలేకపోతున్నారు. నగరమంతటికి మధురవాడలో ఒకే ఒక్క మెకానిక్ ఉన్నారు. ఆయన ఇంట్లో వందలాది మిషన్లు రిపేర్ కోసం ఎదురు చూస్తున్నాయి. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే వీటిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మిషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించడం, సాంకేతిక సమస్యలు రాకుండా నెట్వర్క్ కల్పించడం వంటి చర్యలు చేపట్టకుండా బయెమెట్రిక్ పడలేదన్న సాకుతో చర్యలకు ఉపక్రమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
కూటి కష్టాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈపాస్ మిషన్స్ సిగ్నల్స్పై రేషన్ సరుకుల పంపిణీ ఆధారపడింది. ఒకప్పుడు కార్డు, డబ్బులు తీసుకెళ్తే సరుకులు అందజేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సిగ్నల్స్ ఉంటేనే సరుకులు పొందాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో సరుకులు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతోంది. ఫలితంగా పలుమార్లు కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. యంత్రాంగం చర్యల వల్ల ప్రజాధనం మిగులుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వీటిని కూడా సరిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు. సమయ పాలన ఏదీ? చాలా రేషన్ దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో విధిగా సరుకులు పంపిణీ చేయాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉండాలి. కానీ, సమయ పాలన ఎక్కడా అమలు కావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. కొందరు డీలర్లు ఉదయం పూటకే పరిమితం చేస్తున్నారు. సాయంత్రం దుకాణం తెరవడం లేదు. మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో షాపులను మూసివేయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. వేలి ముద్రల కష్టాలు బయోమెట్రిక్ విధానం మరికొందరు కార్డుదారులకు శాపంగా మారింది. వృద్ధులతో పాటు మట్టి, రాయి పని, మేస్త్రీలుగా పనిచేసే వారి వేలిముద్రలు చెరిగిపోవడం సహజం. ఇటువంటి కార్డుదారులు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ–పోస్ యంత్రాలు వీరి వేలి ముద్రలు స్వీకరించడం లేదు. రెండుతో సరి! 2014 మే నెల వరకు రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు సరఫరా చేసేవారు. ఇప్పుడు సరుకుల సంఖ్యలో భారీగా కోతపడింది. చివరకు సరుకుల సంఖ్య రెండింటికే పరిమితం కావడంపై పేద కుటుంబాలు అసంతృప్తి వ్యక్తచేస్తున్నాయి. ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు దీనికి అందనంగా చక్కెర పంపిణీ చేస్తున్నారు. మిగిలిన సరుకులను కూడా అందజేస్తే తమకు భారం తప్పుతుందని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కార్డులను మరిచారు కొత్త రేషన్కార్డులు ఇంకా అందడం లేదు. దాదాపు ఏడాదిగా దరఖాస్తు చేసేకునే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కనీసం కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక ఇప్పటికే రేషన్ పొందుతున్న వారు ఇంటర్నెట్ పత్రాలపై ఆధాపడుతున్నారు. కనీసం వీరు కూడా శాశ్వత కార్డులకు నోచుకోవడం లేదు. రేషన్కార్డులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. 15 రోజుల బెంగ ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీల్లోపే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని గత నెలలో అమలు చేశారు. సెలవులు అధికంగా రావడం వల్ల 17వ తేదీ వరకు సరుకులు అందజేసినా.. చాలా మంది వాటికి దూరమయ్యారు. ఈ నెల నుంచి నిక్కచ్చిగా 15వ తేదీ వరకే పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందడంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే సిగ్నల్స్ సరిగా ఉండడం లేదు. పొట్టకూటి కోసం కూలీలు ఉదయం వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి చేరుకుతుంటారు. ఇటువంటి వారికి పంపిణీ రోజుల కుదింపు శరాఘాతంగా మారుతోంది. కనీసం ప్రతినెలా 20వ తేదీ వరకైనా సరుకులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కోకార్డుదారునికి 18 నిమిషాలు మొయినాబాద్ (చేవెళ్ల): మొబైల్ సిగ్నల్స్ సమయానికి అందకపోవడంతో చాలా మంది రేషన్ షాపులకు రోజుల తరబడి తిరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మొయినాబాద్ మండల కేంద్రంలోని రేషన్ షాపును పరిశీలించగా.. రేషన్ తీసుకునేందుకు సుమారు యాబై మంది వరుసలో నిలిచి ఉన్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కో కార్డుదారుడు రేషన్ సరుకులు పొందడానికి 18 నిమిషాల సమయం పట్టింది. మొయినాబాద్లో 700 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే రేషన్ ఇవ్వాల్సి ఉండగా ఈ పాస్ మిషన్ను సాఫ్ట్వేర్ మార్పుకోసం తీసుకెళ్లి సోమవారం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం, మంగళవారం సరుకుల పంపిణీకి డీలర్ ప్రయత్నించగా సిగ్నల్ సరిగా రాక కేవలం 50 మంది వరకు మాత్రమే అందజేశారు. 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఆ గడువులోగా పంపిణీ ఎలా పూర్తిచేయాలో అర్థంకావడం లేదని డీలర్ పేర్కొన్నాడు. వేలి ముద్రలు పడలేదని.. నా వేలి ముద్రలు పడడం లేదని ఈ నెల బియ్యం ఇవ్వలేదు. నాకు కొడుకులు లేరు. నా భర్త కూడా చనిపోయాడు. కార్డుపై నెలకు ఇచ్చే 35 కిలోలపై ఆధారపడి బతుకుతున్నాను. ఈ నెలలో సరుకులు ఇంకా ఇవ్వలేదు. ఇస్తారో లేదో కూడా చెప్పడంలేదు. – మొదళ్ల రుక్కమ్మ, మల్కారం, శంషాబాద్. 15 రోజులే షాప్ తీస్తున్నారు కూలికి వెళ్లి తిరిగి వచ్చేలోగా దుకాణాన్ని మూసి వేస్తున్నారు. బయో మెట్రిక్ విధానం అని వేలిముద్ర తీసుకొని బియ్యాన్ని ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బియ్యం కోసం రెండు మూడు రోజులు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. – గోవింద్, కేశంపేట ఈ–పాస్ మిషన్తో ఇబ్బందులు సిగ్నల్స్ లోపం, సర్వర్ సమస్యతో ఈ పాసు మిషన్ సక్రమంగా పనిచేయడం లేదు. పైగా నిత్యం కూలి పని చేసే లబ్ధిదారుల చేతి వేలి ముద్రలు రావడం లేదు. దీంతో వారికి రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వలేక పోతున్నాం. కొంత మంది వృద్ధులకు కూడా వేలి ముద్రలు రావడం లేదు. ప్రతినెల 15వ తేదీలోపు సరుకులు ఇవ్వాలని నిబంధన. ఆ తరువాత వచ్చిన లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం కుదరదు. దీంతో లబ్ధిదారులు సరుకులు ఉండి కూడా ఎందుకు ఇవ్వవంటూ మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాతిరి సత్తయ్య, రేషన్ డీలర్, ఆరుట్ల -
రేషన్.. పరేషాన్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రేషన్ దుకాణాలకు అందజేసిన ఈపాస్ మిషన్లలో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్ సమస్యతో ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్ యంత్రాలు అందజేసిన ఒయాసిస్ కంపెనీ సెప్టెంబర్ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ను మార్పు చేయడంతో ఈపాస్ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఈ–పాస్ యంత్రాల వెనుక ఉద్దేశం.. పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్లు నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ– రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. ఇబ్బందికరంగా సరుకులకు పంపిణీకి గడువు... ప్రభుత్వం రేషన్సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ ఈ పాస్ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు. వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది రేషన్దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ అంతకంతే.. 10 రోజుల్లో 50 శాతమే ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్ దుకాణాలలో ఈ పాస్ విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే సర్వర్ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. –మసర్తి నర్సవ్వ, బుగ్గారం -
కాంట్రాక్టు రైల్వే కార్మికుల వివరాల క్రోడీకరణ
న్యూఢిల్లీ: రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలు క్రోడీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది. హౌస్ కీపింగ్, క్లీనింగ్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్ తదితర సర్వీసుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యవస్థీకృత రంగ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కుల ఉల్లంఘనపైనా దీని ద్వారా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు జనరల్ కండీషన్స్ ఆఫ్ కాంట్రాక్టు (జీసీసీ) నిబంధనలు రూపొందించింది. ఆ ప్రకారం వంతెనలు, భవనాలు, గేజ్ మార్పిడి ప్రాజెక్టులు, ఇతర సేవలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్ల నియమాలను మార్చనుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వేకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల కోసం డిజిటల్ కాంట్రాక్టు లేబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. కార్మికుల వ్యక్తిగత వివరాలు, పోలీస్ వెరిఫికేషన్, ఆరోగ్య బీమా, పీఎఫ్ రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు సమాచారం, పని వేళలు, జీతం, కార్మికుల బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. -
‘ఆసరా’.. ఆలస్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ఆధారమూ లేనివారికి సకాలంలో దక్కాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. ఒకటికాదు.. రెండుకాదు, ప్రతినెలా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పింఛన్దారులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ వరుసగా మూడు నాలుగు నెలలపాటు లబ్ధిదారులు పింఛన్ సొమ్ముకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ఒక నిర్ధిష్ట సమయమంటూ లేకపోవడంతో పింఛర్దారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఇస్తారో తెలియని సంకట స్థితిలో చిక్కుకున్నారు. జనవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము ఇంకా అందలేదు. నిధులు విడుదల కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కేవలం పింఛన్సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన పింఛన్ సొమ్ము సకాలంలో అందితేనే వారు తమ అవసరాలు తీర్చుకుంటారు. ఇది జరగపోవడంతే అప్పు తెచ్చుకుని పూట గడిపే దుస్థితి నెలకొంది. అవసరానికి అందవు.. జిల్లాలో 1.24 లక్షల మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య, వికలాంగ, వితంతువులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి 4,038 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ చేస్తున్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో బ్యాంకు ద్వారా నేరుగా పింఛన్దారుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పించన్సొమ్ము అందేది. ఆయన మరణానంతరం నిధుల విడుదలతో జాప్యం జరుగుతోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సకాలంలో పింఛన్లు అందిన దాఖలాలు లేవు. తొలుత ప్రతినెలా 11 నుంచి 14వ తేదీలోగా పింఛన్ ఇచ్చేవారు. ఇది క్రమంగా 14 నుంచి 20 తేదీకి మారింది. కొంతకాలం నుంచి ఈ తేదీలకు కూడా చరమగీతం పాడారు. ప్రస్తుతం ఫిబ్రవరిలోకి అడుగు పెట్టినా జనవరి నెల పింఛను ఇంతవరకు అందలేదు. సకాలంలో పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం తగదు ఆసరా పింఛన్లు అందజేయడంలో నిర్లక్ష్యం తగదు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగితే పట్టించుకునే వారు లేరు. సకాలంలో ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటాం. లేకుంటే అప్పు చేయక తప్పడం లేదు. టైం ప్రకారం పింఛను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కట్టెల కిష్టయ్య, వికలాంగుడు ఎప్పుడూ ఆలస్యమే సర్కారు పెన్షన్ల సొమ్ము పెంచింది కానీ.. మాకు ఆ తృప్తి లేకుండా చేస్తోంది. గతంలో పింఛన్ సొమ్ముకు ఎన్నడూ లేటు కాలేదు. ఇప్పుడు సొమ్మును పెంచినా అవసరానికి మాత్రం ఇవ్వడం లేదు. వయసు పైబడ్డాక పిల్లలను అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. పింఛనైనా వస్తుందని అనుకుంటే.. అదీ లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదు. – అంజమ్మ, వితంతు పెన్షన్దారు అప్పు జేయాల్సి వచ్చింది ప్రతినెలా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల అవసరాల నిమిత్తం అప్పు చేస్తున్నాం. రూ.వెయ్యి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం. దవాఖానకు పోదామంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరినైనా అడుగుదామంటే.. ఎవరిస్తరు బిడ్డా. ప్రభుత్వం లేటు చేయకుండా పింఛన్లు ఇస్తే మాలాంటి ముసలోల్లకు ఇబ్బంది ఉండదు. – చెర్కూరి లక్ష్మయ్య, వృద్ధుడు -
రేషన్ ఇక..బయోమెట్రిక్
బెల్లంపల్లి : రేషన్ సరకుల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా సరుకుల పంపిణీలో సాగిన అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడుతుంది. ఈ విధానంతో సరకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఫౌరసరఫరాల శాఖ భావిస్తుంది. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 200 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా నిర్ధేశించిన ప్రకారం లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అందుతున్న సరకులు నిత్యం ఏదో ఓ రూపంలో పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులు రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోకున్నా పంపిణీ చేసినట్లు రికార్డులు రాసుకోవడం, ఏదేనీ కారణంతో సరుకులు ఓ నెల తీసుకెళ్లకున్నా తీసుకున్నట్లు నమోదు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సరుకులు వంద శాతం లబ్ధిదారులకు దక్కడం లేదనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. బయోమెట్రిక్ విధానం.. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధా నం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా ఎంతో పారదర్శకంగా సరుకులను లబ్ధిదారులకు అందించాలని నిర్ధేశించింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఇకపై విధిగా రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలి ముద్ర వేస్తే కానీ సరుకులు పంపిణీ కావు. కార్డుదారు సంతకం సరిపోలితేనే సరుకులు అందిస్తారు. ఇతరులు మళ్లీ సరుకులు పంపిణీ చేయాలని అడిగినా లేదా డీలర్ చేతి వాటం ప్రదర్శించడానికి యత్నించినా కుదరని పరిస్థితులు ఉంటాయి. డీలర్లకు అవగాహన.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విధానంపై రేషన్ డీలర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. బయోమెట్రిక్ యంత్రం వినియోగంపై తహసీల్దార్ ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. యంత్రం వినియోగించే తీరు, లబ్ధిదారు వివరాల నమోదు, వేలి ముద్రలు తీసుకునే పద్ధతి, సరుకుల వివరాలను నమోదు చేసే పద్ధతి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చాలామట్టుకు డీలర్లకు ఈపాటికే బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ఆ యంత్రం వినియోగంపై డీలర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయో మెట్రిక్ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 1 నుంచే రేషన్ సరకుల పంపిణీలో బయోమెట్రిక్ విధానం రానుంది. దీనివల్ల కొంతవరకైనా సరుకుల పంపిణీలో అవకతవకలు నివారించే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. -
ఆధార్ లాక్ ఇక సులభం!
నెహ్రూనగర్ (గుంటూరు): దేశంలో ఇప్పుడు ప్రభుత్వ/ప్రైవేటు రంగాలకు సంబంధించి ఏ సర్వీసు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. మొబైల్ సిమ్ కార్డు నుంచి పాన్కార్డు వరకూ ఈ ఆధార్ ఆధారమైంది. ఈ కార్డులో పౌరుని వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. మన వ్యక్తిగత రుజువుకు ఆధార్ మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతీదానికి ఆధార్నే ఇస్తున్నాం. ఇందులో మన కంటిపాప, వేలిముద్రలు, చిరునామా వంటి వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. మీ ఆధార్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానంగా ఉందా...? అయితే మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ కల్పించింది. ఈ సమాచారం మీ కోసం. ఆధార్ అధికారిక వెబ్సైట్ ద్వారా... మీ ఆధార్ ఎలా ఎక్కడ వినియోగించారో తెలుసుకునేందుకు ఆధార్ అధికారిక వెబ్సైట్ https://resident.uidai.gov.in/ లాగిన్ అవ్వాలి. కనిపించే ముఖచిత్రంలో ఆధార్ సర్వీసెస్ అని కుడివైపు ఓ కాలం కనిపిస్తుంది. ఆ కాలం కింది భాగంలో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అని ఓ ట్యాగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే, మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే పేజీలో మీ యూఐడీ నంబరు, క్యాప్చ కోడ్ నమోదు చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత పేజీలో మీకు ఎటువంటి సమాచారం కావాలో మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ లాంటివి, ప్రస్తుత తేదీ నుంచి గరిష్టంగా ఆరు నెలల కిందట వరకు మీరు ఆధార్ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ఎంటర్ చేయాలి.. లేకుంటే మీకు ఎర్రర్ చూపించే అవకాశం ఉంది. అక్కడ వివరాలు నమోదు చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పనికోసం మీ ఆధార్ను ఇచ్చారనే వివరాలు కనిపిస్తాయి. ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు. దానికి సంబంధించిన వివరాలు మాత్రమే చూపిస్తుంది. అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు మీ ఆధార్ ఎక్కడో తప్పుగా వాడుతున్నారన్న అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానం వస్తే మీ ఆధార్, వివరాలు మీరు అనుమతిస్తేనే అవతలి వాళ్లు వాడుకునేలా చేయవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో ఆధార్ అధికారిక వైబ్సైట్లో ఆధార్ వివరాలు లాక్ చేయవచ్చు. ఏదైనా ఏజెన్సీ/సంస్థ ఆ వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అన్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
ఆధార్కు ‘బయోమెట్రిక్’ భద్రత
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తులపై ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది బయోమెట్రిక్ సంతకం చేసేలా ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త విధానం తీసుకురానుంది. పౌరుల బయోమెట్రిక్, ఇతర కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే చెప్పారు. ఈ వ్యవస్థ జనవరి కల్లా అమల్లోకిరావచ్చు. ఆధార్ దరఖాస్తు స్వీకరించగానే సంబంధిత సిబ్బంది దానిపై బయోమెట్రిక్ సంతకం చేయాలి. ఇప్పుడు అధీకృత ప్రైవేట్ ఆపరేటరే దరఖాస్తుపై సంతకం చేస్తున్నారని ఇకపైప్రభుత్వ, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది దానిపై బయోమెట్రిక్ రూపంలో కౌంటర్ సంతకం చేస్తారు. -
డిసెంబర్ నాటికి బయోమెట్రిక్
దేవరపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబ ర్ నాటికి బయోమెట్రిక్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సాంఘిక సంక్షే మ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అ న్నారు. దేవరపల్లిలోని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా ఎనిమిది పాఠశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. ఒక్కో క్క పాఠశాలకు రూ.19 కోట్లు మంజూరు చేశామన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.8,500 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. హాస్టళ్లకు రూ.200 కోట్లు, వెల్ఫేర్ వసతి గృహా లకు రూ.270 కోట్లు కేటాయించామన్నారు. హాస్టళ్లలో 1.60 లక్షల మంది, గిరిజన వసతి గృహాల్లో 80 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. వీరి ఉపకారవేతనాలు విడుదల చేశామన్నారు. చిన్నాయిగూడెంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహానికి ప్రహారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పలేమని వచ్చినా టీడీపీకి ఇబ్బంది లేదని అన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలను సడలించి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సబ్ప్లాన్ నిధులు నూరు శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల సమస్య అధికంగా ఉందని సబ్ప్లాన్ నిధుల నుంచి ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకట రమణ, పోలవరం ఏఎంసీ చైర్మన్ పాలేపల్లి రామారావు, టినర్సాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు, కొయ్యలగూడెం వైస్ ఎంపీపీ పారేపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, ఈ–ఆఫీస్ అంశాలపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో నవంబర్ 15లోగా, జిల్లా కార్యాలయాల్లో నవంబర్ 30లోగా.. డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. -
డీలర్లు పరేషాన్
అరకొర కమీషన్.. గోడౌన్లలో తక్కువ తూకాలతో బియ్యం సరఫరా.. బయోమెట్రిక్ యంత్రాల నిర్వహణ ఖర్చు.. అందని మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలకు సరఫరా చేసే బియ్యం బిల్లులు.. దుకాణా ల్లో సౌకర్యాల లేమి.. వెరసి ముప్పావలా కోడి పిల్లకు మూడు రూపాయల పందిపిల్లను దిష్టి తీసిన చందంగా మారింది చౌకదుకాణ డీలర్ల పరిస్థితి. ఫలితంగా డీలర్లకు కష్టాలు.. నష్టాలు మిగులుతున్నాయి. చిత్తూరుటౌన్: జిల్లాలోని చౌకదుకాణల డీలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చౌకదుకాణాలను నష్టాలతో నడుపుతూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దుకాణాల్లో సౌకర్యాల లేమితో కష్టాలు తప్పడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 2,970 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటికి బియ్యం సరఫరా చేయడానికి 29 మండల నిల్వ కేంద్రాలున్నాయి. ఇందులో ఏ గోదాములోనూ బయోమెట్రిక్ వేయింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో బస్తాకు 51 కిలోల బియ్యానికి బదులు డీలర్లకు 48 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. ఒక బస్తాకు 3 కిలోల వరకు డీలర్ల నష్టపోతున్నారు. అయితే డీలర్లు మాత్రం బయోమెట్రిక్ తూనికల మిషన్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. బయోమెట్రిక్ భారమూ డీలర్లదే డీలర్లకు బయోమెట్రిక్ తూనికల యంత్రాన్ని ప్రభుత్వం అందజేసింది. అయితే దాని నిర్వహణకు సంవత్సరానికి రూ.900 ఆ కంపెనీ డీలర్ల వద్ద నుంచి వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ తూనికల యంత్రానికి మూడేళ్ల ఉచిత సర్వీసు చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నా దాన్ని పాటించడం లేదు. ఈ యంత్రానికి సంబంధించిన బ్యాటరీలు కూడా డీలర్ల సొంత ఖర్చులతో మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.25 కోట్ల బకాయిలు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న బియ్యం బిల్లులు దాదాపు రూ.25 కోట్ల మేరుకు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఆ బిల్లుల ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ఆ బకాయిలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఇంతకుముందు రేషన్ షాపుల్లో వివిధ రకాల సరుకులను కార్డుదారులకు పంపింణీ చేసేవారు. ఇప్పుడు ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు ఒకటో తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీకే పరిమితమవుతున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను డీలర్లకు పంపిణీ చేసి, విలేజ్మాల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరకొర కమీషన్ చౌక దుకాణ డీలర్లు ఇంత చేసినా వారికి ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటోంది. దీంతో డీలర్లకు చౌకదుకాణం నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు డీలర్ షిప్ వదుకుంటున్నారు. కొందరు మాత్రం విధిలేక కొనసాగిస్తున్నారు. -
బోర్డింగ్ పాస్కు బై..బై..!
► ఇప్పటికే హైదరాబాద్ విమానాశ్రయంలో అమలు ► త్వరలో మరిన్ని విమానాశ్రయాలకు విస్తరణ ► సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్ పాస్ల స్థానంలో బయోమెట్రిక్తో కూడిన ఎక్స్ప్రెస్ చెక్–ఇన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని, వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెపుతున్నాయి. ఇటీవలే దేశంలోని 17 ఎయిర్పోర్ట్ల్లో హ్యాండ్బ్యాగేజ్ ట్యాగ్ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలోని 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని విమానయాన భద్రతా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాము రెండు ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో మొదటిది విమానాశ్ర యాల్లో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడమని, ప్రస్తుతం ఉన్న భద్రతా సంస్థలన్నింటినీ అనుసంధానించడం.. బయోమెట్రిక్, వీడియో ఎనలిస్టిస్ సిస్టమ్ మొదలైనవి వినియోగించడం ఇందులో భాగమన్నారు. బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకడం దీనిలో భాగమేనని, ఇటీవలే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించామని, ప్రస్తుతం అక్కడ ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ చెక్–ఇన్ విధానం అందుబాటులోకి వచ్చిం దని తెలిపారు. బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తిపలకడం అనేది టెక్నాలజీ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్ విమానాశ్రయం ఒక్కటే పూర్తిగా బయోమెట్రిక్ విధానాన్ని కలిగి ఉందని, దేశంలోని మిగిలిన ఎయిర్పోర్టుల్లోనూ దీనిని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవ వనరులను హేతుబద్ధీకరించడం తమ రెండో ప్రాజెక్టు అని సింగ్ చెప్పారు. ఎయిర్పోర్టు సెక్యూరిటీలోనే కాక ఎయిరోస్పేస్ స్టేషన్లు, న్యూక్లియర్ పవర్ప్లాంట్లు మొదలైన వాటిలో దీనిని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇటీవల ప్రవేశపెట్టిన విధానం ప్రకారం.. దేశీయ విమానయాన ప్రయాణికులు టెర్మినల్ బిల్డింగ్కు వెలుపల ఉండే సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ల నుంచి బోర్డింగ్ పాస్ ప్రింటవుట్ను తీసుకుంటారు. ఆ తర్వాత చెక్ ఇన్ ఏరియాలోకి వెళ్లకుండా నేరుగా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ లేన్లోకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి బోర్డింగ్ ఏరియాకు వెళతారు. -
బయోమెట్రిక్ బెంగ
పనొకచోట.. హాజరు మరోచోట కిలో మీటర్ల దూరం ప్రయాణం వారానికి రెండు రోజులు గైర్హాజరుగా నమోదు గ్రంథపాలకులకు అదనపు విధులు ఏలూరు (ఆర్ఆర్పేట) : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అవి సమస్యలతో సతమతమవుతున్నాయి. సిబ్బంది కొరత వెంటాడుతోంది. బయోమెట్రిక్ హాజరు తప్పని సరి చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. కిలో మీటర్ల దూరం వెళ్లి హాజరు వేయాల్సివస్తోంది. ఇతర శాఖల పనివేళలు, గ్రంథాలయాల పనివేళల్లో వ్యత్యాసం కారణంగా సిబ్బంది హాజరు వేసినా నమోదు కాని పరిస్థితి ఉంది. రోజుకు నాలుగుసార్లు హాజరు వేయాల్సి రావడం, మెషీన్లు లేకపోవడం తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడంలేదని గ్రంథపాలకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత జిల్లాలో గ్రేడ్1 లైబ్రరీలు 5, గ్రేడ్2 లైబ్రరీలు2, గ్రేడ్3 లైబ్రరీలు 65 ఉన్నాయి. వీటిలో పనిచేయడానికి 129 మంది సిబ్బంది అవసరంకాగా ప్రస్తుతం 78 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో గ్రేడ్1 లైబ్రేరియన్లు నలుగురు, గ్రేడ్2 లైబ్రేరియ¯న్ ఒకరు, గ్రేడ్3 లైబ్రేరియన్లు 42 మంది ఉన్నారు. వీరిలో 15 మంది వరకూ మహిళా లైబ్రేరియన్లు ఉన్నారు. హాజరుకు అవస్థలు బయోమెట్రిక్ హాజరు అమలుతో గ్రంథాలయాల సిబ్బంది తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. దీంతో వీరు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. ఇతర ఉద్యోగులయితే ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. గ్రంథపాలకులు మాత్రం 8 గంటలకు పాఠకులకు దినపత్రికలు, ఇతర పత్రికలు పఠనానికి అనువుగా సిద్ధం చేయాలి. దీనికి కనీసం అరగంట ముందొస్తే గానీ సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు వేయాలంటే ఇంకో అరగంట ముందే రావాల్సి వస్తోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం మినహా ఏ గ్రంథాలయంలోనూ బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా గ్రంథాలయాల సిబ్బంది పంచాయతీ కార్యాలయం లేదా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో హాజరు వేయాల్సివస్తోంది. ఈ కార్యాలయాలు గ్రంథాలయాలకు సుమారు 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజుకు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాలంటే గ్రంథపాలకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. విధుల్లో ఉన్నా లేనట్టే జిల్లాలోని పలువురు గ్రంథపాలకులు రెండు గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక పూట ఒక గ్రంథాలయం, మరో పూట మరో గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తువారు బయోమెట్రిక్ హాజరు వేయడానికి నానా హైరానా పడుతున్నారు. ఒక్కోసారి ఆయా కార్యాలయాలు తెరిచి ఉండకపోవడం, బయోమెట్రిక్ మెషీన్ అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో కార్యాలయాలు తెరిచి ఉన్నా విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలతో హాజరు వేయలేకపోతున్నారు. ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. లైబ్రరీలకు పనిదినం కావడంతో ఆదివారాల్లో హాజరు వేయలేకపోతున్నారు. శుక్రవారం లైబ్రెరీలకు సెలవు కావడంతో గ్రంథపాలకులు హాజరు వేయరు. ఈ నేపథ్యంలో వారు విధుల్లో ఉన్నా వారానికి రెండు రోజులు గైర్హాజరైనట్లు నమోదవుతోంది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. 15 రోజుల్లో మెషీన్ల ఏర్పాటు జయ్యవరపు శ్రీరామ్మూర్తి, చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ బయోమెట్రిక్ హాజరుకు గ్రంథపాలకులు ఇబ్బందులు పడడం వాస్తవమే. త్వరలోనే పర్చేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించి మెషీన్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటాం. సుమారు రూ.15 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మరో 15 రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం. -
'భయో'మెట్రిక్
- సక్రమంగా పని చేయని సర్వుర్లు - డీబీటీ ద్వారా ఎరువుల పంపిణీకి అవస్థలు - కొత్తపద్ధతి తప్పనిసరి అంటున్న వ్యవసాయశాఖ - ఆందోళనలో వ్యవసాయశాఖ సిబ్బంది ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికార్యక్రమానికీ ‘యాప్’ అంటూ ప్రభుత్వశాఖల్లో వందల కొద్దీ అందుబాటులోకి తెచ్చారు. కానీ అందుకు తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానం కల్పించక, సామర్థ్యం పెంచకపోవడంతో పథకాలు సక్రమంగా అమలుకాలేదు. తరచూ సర్వర్లు సతాయిస్తున్నాయి. స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. ఎరువుల పంపిణీలో డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి తేవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక ఎరువుల పంపిణీకి ఆటంకంగా మారింది. మరోవైపు వ్యవసాయాధికారులు తప్పనిసరిగా డీబీటీ విధానం పాటించాలని ఒత్తిడి చేస్తుండడంతో దుకాణదారులు దిక్కులు చూస్తున్నారు. - అనంతపురం అగ్రికల్చర్ జిల్లాలో విత్తన, పురుగుముందులు, ఎరువుల దుకాణాలు : 890 ఎరువులు లైసెన్సు కలిగినవి : 680 కావాల్సిన బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు : 680 వ్యవసాయశాఖ పంపిణీ చేసింది : 301 సక్రమంగా పనిచేస్తున్నవి : 60 జిల్లాకు ఈ ఖరీఫ్లో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించారు. ప్రస్తుతానికి జిల్లా అంతటా 43 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఎరువుల పంపిణీకి డీబీటీ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం ఎరువులు లైసెన్సులు కలిగిన దుకాణాలు 680 వరకు ఉన్నాయి. అందరికీ బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ కేవలం 301 మందికి మాత్రమే ఇచ్చి జిల్లా అంతటా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇచ్చిన 301 మిషన్లు పనిచేస్తున్నాయా అంటే అదీ లేదు. అందులో పని చేస్తున్నవి 60కి మించి లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 680 షాపులకు గానూ 60 షాపుల్లో డీబీటీ విధానం అమలు చేస్తున్నా అక్కడ కూడా సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలా మంది వాటిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సర్వర్లు, సాంకేతిక పరిజ్ఞానం సమస్యలు చెప్పకుండా ఎలాగోలా పనిచేసేలా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు దుకాణదారులు వాపోతున్నారు. ఆధార్ అనుసంధానం లేకుండా ఎరువులు పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఉండటంతో చాలా మంది రైతులకు సకాలంలో ఎరువులు అందే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎరువులకు అంతగా గిరాకీ లేనందున సమస్య పెద్దగా కనిపించని పరిస్థితి. జేడీఏ కార్యాలయ అధికారులేమంటున్నారంటే... త్వరలోనే అందరికీ బయోమెట్రిక్ పరికరాలు అందజేస్తామని, 4–జీ సామర్థ్యం కలిగిన సిమ్, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో పెట్టాలని ఆదేశించాం. ఇంకా పూర్తి స్థాయిలో డీబీటీ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని బదులిచ్చారు. -
వర్సిటీల్లో నియామకాలపై మరో కమిటీ
వీసీల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం - వారంలో నివేదిక, ఆ తర్వాతే తుది నిర్ణయం - విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంతోపాటు నియామకాల్లో పాటించాల్సిన విధానాలపై అధ్యయనానికి మరో కమిటీ వేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముగ్గురు వీసీలతో (ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ సీతారామారావు) ఏర్పా టు చేసిన ఈ కమిటీ నివేదిక వారంలో వస్తుందని, ఆ తర్వాతే నియామకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లతో కడియం ఆదివారం హైదరాబాద్లో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిందని, అయితే ఆ నివేదికలోని అంశాలపై మరోసారి అధ్యయనం చేసేం దుకు, నిబంధనలపై స్పష్టత కోరేందుకు మరో కమిటీని వేశామన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లలో జాప్యం వద్దు వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,550 పోస్టుల్లో మొదటి విడతలో 1,061 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా వాటి భర్తీపై నిర్ణయం తీసుకుంటామని కడియం వివరించారు. పీహెచ్డీ ప్రవేశాల్లో యుజీసీ నిబంధనల మేరకే నడుచుకోవాలని, అడ్మిషన్ల ప్రక్రియను జాప్యం చేయొద్దని వీసీలకు సూచించారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా వీసీల పని తీరు ఉండాలన్నారు. వివిధ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేం దుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించా లని ఓయూలోని నాన్ బోర్డర్లు కోరారని, దీనిపైనా చర్చించామన్నారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకే కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులను నాన్ బోర్డర్లుగా ఉండొద్దని కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు చెప్పాలని వీసీలను ఆదేశించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయొద్దు... ముఖ్యమంత్రి కేసిఆర్ విశ్వవిద్యాలయాలపై చాలా నమ్మకం పెట్టుకుని అడిగినన్ని నిధులు ఇస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీసీలు బాగా పనిచేయాలని కడియం కోరారు. కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016 సర్వే ప్రకారం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య దేశంలో మొత్తంలో చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎక్కువ మంది చేరుతున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. అయితే పరిశోధనల్లో మాత్రం వెనుకబడ్డామని, వీసీలు వాటిపై దృష్టి సారించాలన్నారు. వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన రూ. 420 కోట్లను త్వరగా ఖర్చు చేయాలన్నారు. హాజరు కోసం బయోమెట్రిక్ మెషీన్లు తప్పనిసరి విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్, డ్రగ్స్ సంస్కృతికి తావివ్వరాదని వీసీలు, రిజిస్ట్రార్లకు కడియం సూచించారు. కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పెంచేందుకు బయోమెట్రిక్ మెషీన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వర్సిటీల్లో విద్య, పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలని, గత వైభవాన్ని తీసుకురావాలన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయాలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా చేసుకునేందుకు అవకాశం ఇవ్వరాదన్నారు. -
బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్
► బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా.. ► అక్రమాలకు అడ్డుకట్ట ∙సులువుగా అధికారుల పర్యవేక్షణ ► పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం కరీంనగర్ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్ల క్రితం నుంచే బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో విద్యార్థుల హాజరు శాతంతోపాటు, అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా బీసీ వసతి గృ హాల్లోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. దీంతో వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు కళ్లెం పడనుంది. ప్రస్తుతం వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించకపోవడంతోపాటు స్థానికంగా ఉండడం లేదు. అధికా రులు పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టం వచ్చినప్పుడు వస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా వసతి గృహాల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్లుగా అమలులో ఉంది. సత్ఫలితాలు రావడంతో, ఈ విద్యా సంవత్సరం నుంచే బీసీ వసతి గృహాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆగస్టు మొదటి వారం నుంచి బయోమెట్రిక్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమున్న కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా, హాజరు శాతం ఎక్కువగా చూపించి కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్ల నిధులు కాజేసేవారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. బయోమెట్రిక్ విధానంతో వసతి గృహాల్లో ఇలాంటి అక్రమాలకు తెరపడనుంది. జిల్లాలో 1,740 మంది విద్యార్థులు.. జిల్లాలో 5 ప్రీమెట్రిక్, 2 పోస్ట్మెట్రిక్ వసతి గృహాలుండగా, గతేడాది 1600 మంది విద్యార్థులు వసతి పొందారు. వీటిలో పోస్ట్మెట్రిక్ వసతి గృహాల్లో 740 మంది, ప్రీమెట్రిక్ వసతి గృహంలో 860 మంది ఉండేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 180 మంది విద్యార్థులు చేరారు. ఇప్పుడిప్పుడే ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహాల వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు చాలా చోట్ల మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు. ప్రవేశం పొందిన విద్యార్థులు రోజుల తరబడి వసతి గృహాలకు హాజరుకాకున్నా, నిర్వాహకులు పూర్తి స్థాయిలో హాజరు శాతం నమోదు చేస్తూ నిధులు కాజేస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్లతోపాటు తప్పుడు లెక్కలు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వసతి గృహాలు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు‘మామూలు’గా వ్యవహరించడంతో అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పలువురు వార్డెన్లు విధులకు హాజరు కాకుండా, అటెండర్లు, కుక్లే వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు వసతి గృహాల్లో బయోమెట్రిక్తో పాటు కంప్యూటర్, ప్రింటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలకు తెర.. వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలుతో అక్రమాలకు తెరపడనుంది. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రతో యంత్రాన్ని ఓపెన్ చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసే ముందు, మధ్యాహ్న భోజనానికి ముందు రెండుసార్లు బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో హాజరుశాతం నమోదవుతుంది. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరగనుంది. విద్యార్థులకు అందించే భోజనం, ఇతర సామగ్రి లెక్కలు పక్కాగా ఉంటాయి. త్వరలోనే అమలు చేస్తాం.. జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బయోమెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని వసతి గృహాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విధానం అమలైతే వసతి గృహ నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరగడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. ఉన్నతాధికారులకు రోజూవారీ విద్యార్థుల హాజరుశాతం అందుబాటులో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు, ఇన్వ్ర్టర్లు అమలు చేసేందుకు నిధులు వచ్చాయి. ట్రంకు పెట్టేలు సైతం కొత్తగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. – బి.సరోజ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి -
వేలిముద్ర పడుతుందా?
► రేపటి నుంచి పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు ► 922 పాఠశాలకు యంత్రాలు పంపిణీ ► కొద్దిచోట్లే ప్రారంభమయ్యే అవకాశం నెల్లూరు(టౌన్) : పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 922 ఉన్నత, ప్రాథమికోన్నత, మోడల్ పాఠశాలలకు యంత్రాలను ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే దీనికి ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 346 ఉన్నత, 231 ప్రాథమికోన్నత, 10 మోడల్ స్కూల్స్కు ఏప్రిల్ నెలలోనే బయోమెట్రిక్ యంత్రాలను సరఫరా చేశారు. మధ్యాహ్న భోజనంలో అక్రమాలు అరికట్టేందుకు ప్రధానంగా దీనికి శ్రీకారం చుట్టారు. అయితే కొన్ని పాఠశాలకు సరఫరా చేసిన యంత్రాలు బిగించకుండానే మరమ్మత్తులకు గురయ్యాయి. వాటిని రిపేరు చేయాలని పలుమార్లు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. కొన్ని పాఠశాలల్లో వెబ్సైట్ పనిచేయకపోగా మరికొన్ని చోట్ల విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు లేక బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటుకు అంతారాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో పాఠశాలల్లో మాత్రమే యంత్రాలు పనిచేస్తున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముద్ర పడాల్సిందే.. జూలై 1వ తేదీ నుంచి పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంది. దీని ఆధారంగానే వారి హాజరును పరిగణలోకీ తీసుకోనున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేలిముద్రను తప్పనిసరిగా వేయాల్సి ఉంది. సాయంత్రం 4.45 గంటల సమయంలో బయోమెట్రిక్ యంత్రంకు రెడ్లైట్, ఐదుగంటల వరకు ఎల్లో లైటు వెలుగుతుంటుంది. ఐదుగంటల పైనే గ్రీన్ లైటు వెలుగుతుంది. ఈ సమయంలో వేలిముద్ర వేస్తేనే హాజరైనట్లు యంత్రంలో నమోదవుతుంది. ఈ హాజరును ఏ రోజుకారోజు జిల్లా డీఈఓ కార్యాలయానికి పంపుతారు. అయితే ప్రధానోపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరుతో పనిలేదని చెబుతున్నారు. కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ హజరును పరిగణలోకి తీసుకుంటుండంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం హెచ్ఎంలకు కూడా హాజరు ఉంటుందని, త్వరలో సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తారంటున్నారు. అన్ని పాఠశాలల్లో ఏర్పాటు జిల్లాలోని 922 పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తాం. ప్రస్తుతం కొన్ని యంత్రాలు మరమ్మతులకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇంటర్నెట్ పనిచేయడం లేదు. ఆ పాఠశాలల్లో కూడా సదుపాయాలు కల్పిస్తాం. – మువ్వారామలింగం, డీఈఓ -
అలంకారప్రాయంగా బయోమెట్రిక్ పరికరం
ఎస్కేయూ: వర్సిటీలోని పలు విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఆధార్తో అనుసంధానం చేసిన బయోమెట్రిక్ మిషన్లు ద్వారా హాజరు నమోదు చేయాలని ఉన్నత విద్యా మండలి గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే ప్రతి విభాగంలోనూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీంతో 2016 అక్టోబర్లో 35 బయోమెట్రిక్ పరికరాలను రూ.3.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు ఒకే సర్వర్ను అనుసంధానం చేయడంతో బయోమెట్రిక్ పరికరాలు పనిచేయలేదు. ప్రతి బయోమెట్రిక్ పరికరానికి ఏయిర్టెల్ సిమ్లను అటాచ్చేశారు. దీంతో ఇవి పనిచేసినా, చేయకున్నా ప్రతి నెలా వేలాది రూపాయలు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. 2013లోనూ బయోమెట్రిక్ పరికరాలు కొనుగోలు చేసినప్పటికీ అవి పనిచేయలేదు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేయడంతో తిరిగి గతేడాది 35 పరికరాలను కొనుగోలు చేశారు. ఇవి కూడా పనిచేయడంలేదు. -
అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అమలుకు ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల అధికారులు విధిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్ ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్ఫుట్ సబ్సిడీ మంజూరైనా అందించలేదని ఆస్పరి మండల రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చౌకదుకాణాల్లో కిరోసిన్ నిలిపేశారని, ఇకపై కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చిప్పగిరికి చెందిన కొందరు ఫోన్ ద్వారా కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడు తదితరులు పాల్గొన్నారు. -
విరాళాల వివాదంపై విచారిస్తా
♦ అరసవల్లి ఈవో, ప్రధాన అర్చకుని వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు స్పష్టీకరణ ♦ అర్చకులు పత్రికలకు ఎక్కడం ఏమిటని ప్రశ్న ♦ సిబ్బందికి, అర్చకులకు బయోమెట్రిక్ అమలు చేయాలని ఆదేశం అరసవల్లి(శ్రీకాకుళం): అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో దాతల విరాళాల సేకరణ విషయంలో ఈవో, ప్రధాన అర్చకుల మధ్య తలెత్తిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు చేపడతానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. అర్చకులు పత్రికలకు ఎక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అరసవల్లి సూర్యదేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్యామలాదేవి, అర్చకుడు ఇప్పిలి నగేష్ శర్మ తదితర బృందం ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆలయాల్లో భక్తుల తాకిడిని బట్టి అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. శ్రీకూర్మం, శ్రీముఖలింగం, గుళ్ల సీతారాంపురం దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. టీటీడీతో సంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పలు ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అర్చకుల జీతాలను ఇటీవలే పెంచామని, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దివ్యదర్శనం పేరిట జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పది వేల మందికి పైగా భక్తులు ఉచితంగా యాత్రలు చేశారన్నారు. జిల్లాలో ప్రధాన దేవాలయమైన అరసవల్లిలో భక్తుల కోసం నిత్యం ప్యూరిఫైడ్ వాటర్ను ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. నిత్యాన్నదానం పథకం ద్వారా భక్తులకు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు పెంచాలని సూచించారు. ఆలయంలో జరుగుతున్న పలు వ్యవహారాలపై ఇవోను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు పత్రికకు ఎక్కడం ఏమిటి? స్వామి సేవలో ఉండాల్సిన అర్చకులు అనవసర వ్యవహారాల్లో తలదూర్చి పత్రికలకు ఎక్కడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఆలయ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడున్న అర్చకులు, ఈవో సమక్షంలోనే ఈవ్యవహారంపై విచారించి చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. తర్వాత అధికార సిబ్బంది హాజరు, అన్నదానం, ఎఫ్డీఆర్, దాతల విరాళ నిధుల వివరాల రిజిస్టర్లను పరిశీలిస్తున్న సందర్భంలో మంత్రి తీవ్రంగా స్పందించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలిస్తున్న దాతల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు రావడంపై ఈవో శ్యామలాదేవితో మాట్లాడారు. ఇది ఎంతో ఆందోళనకరమైన అంశమని, అర్చకులు, అధికారులు సమన్వయంతో ఆలయ అభివృద్ధికి పని చేయాలని సూచించారు. దాతల వ్యవహారంలో ఎక్కడ పొరపాట్లు, అక్రమాలు జరిగినా ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆలయాల్లో అధికారులదే కీలక పాత్ర అని, పూర్తి బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా మంత్రి కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకశర్మ గైర్హాజరవ్వడంపై స్థానికంగా చర్చ జరిగింది. త్వరలో ట్రస్ట్బోర్డు నియామకం అరసవిల్లి ఆలయానికి త్వరలోనే ట్రస్ట్బోర్డును నియమిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం దేవాలయాల్లో ట్రస్ట్బోర్డుల నియామకాలు పూర్తయ్యాయని, అరసవిల్లితో పాటు మరికొన్ని దేవాలయాల్లో త్వరలోనే చేపడతామన్నారు. అలాగే ఇక్కడ మాస్టర్ప్లాన్ కూడా కచ్చితంగా అమలు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతే ఆలయ రూపురేఖలే మారిపోతాయన్నారు. అర్చకుల జీతాలకు బదులు ఆలయ భూములు ఇచ్చే విషయాలు, ఆర్జిత సేవల టిక్కెట్లలో అర్చకుల షేర్లు చెల్లింపు, నిత్యాన్నదాన పథకంలో ఏడాది వివరాల రికార్డులను తన దృష్టిలో ఉంచాలని ఆదేశించారు. అలయంలో అధికార సిబ్బంది కొరత ఉందని, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు లేరని ఈవో శ్యామలాదేవి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆలయంలో బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. స్థానికులు అవగాహనతో మెలగాలి స్థానిక ఇంద్రపుష్కరిణి వద్ద పరిస్థితి దారుణంగా ఉంందని స్థానికుడైన సూరు జనార్దనరావు మంత్రి మాణిక్యాలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికులు అవగాహనతో మెలగాలన్నారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా ముఖ్య నేతలు పైడి వేణుగోపాలం, దుప్పల రవీంద్ర బాబు, పూడి తిరుపతిరావు, కోటగిరి నారాయణ రావు, ప్రొఫెసర్ హనుమంతు ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్
♦ వచ్చే నెలలో అమల్లోకి ♦ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుంచి హాజరుని బయోమెట్రిక్ విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం ఎం.కుట్టీ గురువారం అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించారు. ఉద్యోగులందరూ కార్యాలయాల్లో విధిగా ఈ విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ విధిగా ఉదయం 9:30 గంటలకు కార్యాలయాల్లోకి రావాలని..అలాగే సాయంత్రం 6:30 గంటల వరకు కచ్చితంగా ఆఫీసుల్లో ఉండాలని పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల్లో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ విధానానికి మద్దతు తెలుపుతుండగా..మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగసంఘాల్లో ఐక్యత తీసుకురావడానికి గాను వచ్చే వారంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. -
రేపటి నుంచి ఓయూసెట్
హైదరాబాద్: ఓయూసెట్– 2017 ప్రవేశ పరీక్షలు సోమ వారం (5వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ శనివారం తెలిపారు. ఓయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వివిధ పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 13 వరకు జరిగే ప్రవేశ పరీక్షలకు నగ రంలో 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 90 వేల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షకు 20 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామన్నారు. పరీక్ష హాల్లో హాజరుకు కుడి, ఎడమ చేతి వేలిముద్రలతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
లాసెట్– 2017కు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్: ఈ నెల 27న జరిగే లాసెట్– 2017కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. అభ్యర్థులు నెట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు జరిగే ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల ప్రవేశ పరీక్షలకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు జరిగే ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. జంటనగరాల్లో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 9,200 మంది అభ్యర్థులు లాసెట్కు హాజరుకానున్నట్లు వివరించారు. హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. -
విద్యాశాఖ కార్యాలయాల్లోనూ బయెమెట్రిక్
– వచ్చే నెల 1 నుంచి ఈ–హాజరు తప్పని సరి కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రవేశ పెట్టిన బయెమెట్రిక్ ద్వారా ఈ–హాజరు నమోదు చేస్తున్నట్లుగానే, విద్యాశాఖ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ తరపున నరసింహారావు ఆర్.సీ నెంబర్ 58 బుధవారం జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంతో పాటు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీల్లోను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30వ తేదిలోపు బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసుకుని, వచ్చే నెల 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోస్టుమెట్రిక్ ఉపకారానికి బయోమెట్రిక్
- ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల్లో వేలిముద్రల హాజరే కీలకం - నేరుగా హాజరు స్వీకరించే సర్వర్తో ఈపాస్కు లింకు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరులో బయోమెట్రిక్ పద్ధతి కీలకం కానుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, అర్హతల నిర్ధారణ అంతా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థుల హాజరు ప్రక్రియ మాన్యువల్గా కొనసాగుతోంది. దీంతో కొందరు విద్యార్థులు నెలల తరబడి కాలేజీకి హాజరు కాకున్నా స్కాలర్షిప్లు కాజేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల హాజరును పూర్తిగా బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీలు తెరిచే నాటికి ఈ మిషన్లు అమర్చాలని యంత్రాంగం ఒత్తిడి పెంచుతోంది. విద్యార్థి హాజరుశాతం 75 దాటితేనే... కాలేజీ విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం దాటితేనే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు అర్హత సాధించవచ్చు. సంక్షేమ శాఖలు ఇప్పటివరకు ప్రిన్సిపాల్ ధ్రువీకరణ ఆధారంగా విద్యార్థి హాజరు శాతాన్ని పరగిణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తెస్తే ప్రిన్సిపాల్ ధ్రువీకరణ అవసరం లేదు. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల పర్యవేక్షణను సంక్షేమశాఖలు ఈపాస్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నాయి. తాజాగా బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు తీసుకోవాలని నిర్ణయించిన సర్కారు ఈ హాజరు రికార్డును ఈపాస్లో నమోదు చేసేలా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బయోమెట్రిక్ మిషన్లకు అనుసంధానంగా ఉన్న సాఫ్ట్వేర్ను ఈపాస్తో అనుసంధానం చేయనున్నారు. ఈ పద్ధతితో విద్యార్థుల హాజరుశాతం రోజూ వెబ్సైట్లో నమోదు కావడంతోపాటు ఆటోమెటిక్గా ఆయా పథకాలకు విద్యార్థి అర్హత తేలుతుందని, దీర్ఘకాలికంగా కాలేజీకి గైర్హాజరయ్యే విద్యార్థి పేరు బ్లాక్ అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కరుణాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కాలేజీలు: 6,843 ప్రైవేటు కాలేజీలు : 5,550 ప్రభుత్వ కాలేజీలు : 1,293 మొత్తం విద్యార్థుల సంఖ్య: 13.67 లక్షలు -
15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.
-
15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
- 8,792 టీచర్ పోస్టుల భర్తీ: కడియం - పాత జిల్లాల ప్రకారమే నియామకాలు - నియామక ప్రక్రియకు ఆరు నెలలు పడుతుంది - అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన - 6 వేల స్కూళ్లలో జూన్ నుంచి బయోమెట్రిక్ - ఈసారి టీచర్ల బదిలీలు లేవని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. టీచర్ల నియామకాల ప్రక్రియకు ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోగా ఇబ్బందులు తలెత్తకుండా విద్యా వలంటీర్లతో బోధన కొనసాగిస్తామని చెప్పారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో పాఠశాలలు తెరిచే మొదటి రోజు నుంచే పాఠశాలల్లో విద్యా వలంటీర్లు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో బుధవారం పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, అన్ని గురుకులాలు మొత్తంగా 6 వేల పాఠశాలల్లో వచ్చే జూన్ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెస్తాం. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈసారి మరిన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తాం. గతేడాది ఒకటో తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రారంభించిన పాఠశాలల్లో ఈసారి రెండో తరగతి ప్రారంభం అవుతుంది. ఇంగ్లిషు మీడియం బోధించేందుకు ఆసక్తి కలిగి, ముందుకు వచ్చే వారికి నెల రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున కొత్త టీచర్ల నియామకాలను పాత జిల్లాల ప్రకారమే చేపడతామని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ఉండకపోవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు మరో 15 రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించబోమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా అభ్యర్థులు టెట్లో అర్హత సాధించిన వారు ఉన్నారన్నారు. వారంతా ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో టెట్ అవసరం లేదని అన్నారు. -
అమలులోకి బయోమెట్రిక్, బార్కోడింగ్
అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మసాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాల మంజూరు ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఈ సారి బయోమెట్రిక్, బార్కోడింగ్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. బార్కోడింగ్ పరికరాలు ఇప్పటికే తెప్పించామన్నారు. త్వరలోనే బయోమెట్రిక్ పరికరాలు ఏపీఎంఐపీ కార్యాలయంతో పాటు మీసేవా కేంద్రాలు, డ్రిప్ కంపెనీల వద్ద అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అర్హులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందన్నారు. మే రెండో వారం నుంచి డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. యూనిట్లు తీసుకుని ఏడేళ్లు పూర్తయిన రైతులు రెండోసారి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు మే 5న నోటిఫికేషన్!
8 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేయాలని ఆన్లైన్ ప్రవేశాల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించింది. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమైన కమిటీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. తాత్కాలిక షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేసి, 8 నుంచి 22 వరకు దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొదటి దశ సీట్ల కేటాయింపును వచ్చే నెల 28న ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక షెడ్యూలులో కొంత మార్పు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడంతో పాటు ఆధార్ నంబర్ కూడా కచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించింది. గతేడాది ఆన్లైన్ ప్రవేశాల పరిధిలోకి రాని 45 కాలేజీలను కూడా ఈసారి ఆన్లైన్ ప్రవేశాలల్లోకి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. డిగ్రీ కాలేజీల్లోనూ కామన్ ఫీజు విధానం తీసుకురావాలని నిర్ణయించింది. -
మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను వచ్చేనెల నుంచి పూర్తిగా పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారానే ఇకపై పింఛన్ల పంపిణీ జరగాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోపే లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోస్టాఫీసులోనూ ఐరిస్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని తపాలా అధికారులను మంత్రి కోరారు. కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించడంతో పాటు, పెద్ద ఎత్తున పనులు చేపట్టేలా మహిళా సంఘాలు చొరవ చూపాలని, ఆయా సంఘాలను చైతన్య పరిచేందుకు వీవోఏలను వినియోగించుకోవాలని సూచించారు. -
ఎరువులకు బయోమెట్రిక్
- మే నెల నుంచి అమలుచేసే యోచన - రైతులకు పొంచివున్న కష్టాలు ఉదయగిరి: రైతులు ఇప్పటివరకు తమకు కావాల్సిన ఎరువులను నేరుగా ఎరువుల దుకాణానికి వెళ్లి తీసుకునే వారు. కానీ మే నెల నుంచి ఈ విధంగా కొనుగోలు చేసేందుకు వీలుకాదు. దీనికి కారణం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఎరువులు కొనుగోలు చేసే రైతు ఎరువుల వ్యాపారుల వద్దనున్న బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు, ఐరిష్ సరిపోలితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకునే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఆ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో మే నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తేవాలని యోచిస్తోంది. అమలు విదానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువులకు సబ్సిడీలు నేరుగా కంపెనీలకు చెల్లిస్తోంది. అందులో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవాలని సంకల్పించింది. ఈ క్రమంలో కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన ఎరువులను డీలర్లకు పంపిణీ చేస్తారు. గతంలో అయితే సరుకులు డీలర్లకు అందిన వెంటనే ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కంపెనీలకు అందచేసేది. ప్రస్తుత విధానంలో డీలరు నుంచి రైతు కొనుగోలు చేసిన ఎరువులకు మాత్రమే సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తుంది. దీంతో ఖచ్చితత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు తిప్పలు తప్పవా! జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల పైర్లు సాగు చేస్తారు. ఇందుకుగాను ఖరీఫ్ సీజన్లో యూరియా 34,320 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9899 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7798 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 24,699 మెట్రిక్టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 4944 మెట్రిక్ టన్నులు విని యోగిస్తారు. అదేవిధంగా రబీ సీజన్లో 4,93,589 మెట్రిక్ టన్నులు డీఏపీ, 10,583 పొటాష్ 8806, కాంప్లెక్స్ ఎరువులు 14588 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 6327 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారు. ఈ విధానం అమల్లోకొస్తే ఎరువులు కొనుగోలు రైతులకు కష్టతరంగా మారనుంది. ఇప్పటివరకు తమకు అవసరమైన ఎరువులను నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ కొత్త విధానంలో పీబీటీ, ఈ–పాస్ మిషన్లో వేలిముద్రలు వేసి ఎరువులు తీసుకోవాల్సివుంది. వేలిముద్రలు పడని వ్యక్తులకు ఐరిష్ ద్వారా ఎరువులు అందచేస్తారు. ప్రస్తుతం రైతులకు కావలసిన ఎరువులన్నీ కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలైతే లేవు. కానీ భవిష్యత్తులో ఎరువులు కొనుగోలు కూడా కోటా పద్ధతినే అనుసరించే అవకాశముంది. రైతులకు సంబంధించిన ఆధార్, వ్యవసాయ భూములతో ఖచ్చితంగా అనుసంధానం కావాల్సివుంది. ఆన్లైన్లో ఆ రైతు పేరుమీద ఉన్న భూములకు మాత్రమే ఎరువులు అందించే అవకాశముంది. రాన్రాను వ్యవసాయ అధికారులు ఒక ఎకరాకు సిఫార్సు చేసిన ఎరువులు మాత్రమే రైతులకు అందే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విధానం మంచిదే అయినప్పటికీ చిత్తశుద్ధితో అమలు ప్రక్రియపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ తరగతులు పదిహేను రోజుల క్రితం ఈ విధానం అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది వ్యవసాయాధికారులను ఎంపికచేసి విజయవాడలో మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు ఆయా వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోవున్న వ్యవసాయాధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ వ్యవసాయాధికారులు వారి పరిధిలోవున్న ఎరువుల దుకాణ యజమానులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్లో చివరి వారానికి అన్ని ఎరువుల దుకాణాలకు డీబీటీ, ఈ–పాస్ యంత్రాలను సరఫరా చేస్తారు. మే నెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానాన్ని కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఎంపిక చేసిన అధికారులతో జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు సమావేశం ఏర్పాటుచేసి ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు పలు సూచనలిచ్చారు. -
సన్నబియ్యంకుతకుత !
► పెరుగుతున్న సన్నబియ్యం ధరలు ► పది రోజుల్లోనే క్వింటాలుపై రూ.800 పెరుగుదల ► మార్కెట్లో క్వింటాలు రూ.4800 నుంచి రూ.5600 ► మిల్లర్ల వద్ద అక్రమ నిల్వలు ► పట్టించుకోని విజిలెన్స్శాఖ కడప అగ్రికల్చర్ : ఒక వైపు వర్షాభావంతో కేసీ కెనాల్కు సాగు నీరు విడుదల కాక వరిసాగుకు నోచుకోలేదు. మరోవైపు నిరుడి ధాన్యపు నిల్వలను బియ్యంగా మలచి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇక ధాన్యం పండే సూచనలు కనిపించలేదని ప్రచారం చేస్తూ వ్యాపారులు బియ్యం ధరలు అమాం తంగా పెంచేశారు. సన్నబియ్యానికి కొరత బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరను పెంచి సామాన్యులతోపాటు మధ్య తరగతి వారికి దడ పుట్టిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లోను, ప్రాజెక్టుల్లోను నీరు లేక బోసి ఉన్నాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటింది. ఏటా బోరుబావుల కింద ఎంతోకొంత వరిసాగు చేసే రైతులు ఈ ఏడాది వరిసాగు చేయలేకపోయారు. అలాగే కేసీ కెనాల్కు అధికారికంగా నీరు విడుదల కాకపోవడంతో పెద్దగా పంటసాగుకు నోచుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు ధరలను అమాంతం పెంచేశారని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం ధరలు (జిలకర్ర, సోనామసూర) ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు వాటి ధరలను వ్యాపారులు, మిల్లర్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది నుంచి బియ్యం ధరలు నెలకునెలకూ పెరగడమే గాని తగ్గడం లేదు. వారం క్రితం క్వింటాలు రూ. 4800 ఉండగా సన్నబియ్యం ధర ఇప్పుడు మార్కెట్లో రూ. 5600 ధర పలుకుతున్నాయి. ఇవి కూడా కొత్త బియ్యం 25 కి లోల బస్తా వారం క్రితం రూ.850లు ఉం డగా అదే బియ్యం ఇప్పుడు రూ.1000 పలుకుతున్నాయి. అలాగే పాత బియ్యం ధర 25కిలోల బస్తా రూ.1200 ఉండగా నేడు అదే బస్తా రూ.1400లు పలుకుతున్నాయి. పాత బి య్యమైతే ఒకరేటు, కొత్త బియ్యమైతే మరో రేటు పలుకుతుండడం విశేషం. మిల్లర్లు గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వారు గోడౌన్లపై దాడులు చేస్తే మిల్లర్ల, వ్యాపారుల బాగోతం బయటపడుతుందని వినియోగదారులు అంటున్నారు. తగ్గిన పంట సాగు.. : జిల్లాలో ఏటా ఖరీఫ్లో 91,970 ఎకరాలలో వరిసాగయ్యేది. ఈ ఏడాది వర్షాభావం వల్ల ఖరీఫ్ సీజన్ అంతా కలిపి బోరుబావుల కింద కేవలం 52,537 ఎకరాలలోనే సాగు చేశారు. ఈ సాగు కూడా సన్నబియ్యం ధరల పెరుగుదలపై ప్రభా వం చూపుతోంది. ఏటా ఖరీఫ్ సీజన్లో 1,36,155 ఎకరాల మొత్తంలో వరి పంటసాగైతే 32.67 లక్షల క్వింటాళ్ల ధా న్యం దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 52,537 ఎకరాలకుగాను 12.60 లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సన్నబియ్యం కిలో రూ. 30లకే ఒట్టిమాట.. : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనలో ఓ కూలీ బియ్యం ధరలపై ప్రస్తావించినప్పుడు బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో 30 రూపాయలకే సన్న రకాల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి మాట చెప్పారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలో తప్పని సరిగా విక్రయించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి నెల రోజులు దాటినా ఇంత వరకు అతీగతీ లేదని నిరుపేదలు, సామాన్యులు విమర్శిస్తున్నారు. బయో మెట్రిక్ పద్ధతి వచ్చినా రేషన్ బియ్యం పక్కదారి..: జిల్లాలోని రేషన్ షాపుల్లో బియ్యానికి బయోమెట్రిక్ పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తున్నా కొందరు డీలర్లు పాత కార్డులను తమ వద్ద ఉంచుకుని కార్డు రేషన్తో అవసరంలేని ఆయా కార్డుదారులను రప్పించుకుని వేలి గుర్తులను బయోమెట్రిక్లో వేయించి వారికి అంతోఇంతో ఇచ్చి వారి కోటా బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యాన్ని వ్యాపారులకు, మిల్లర్లకు అందజేస్తున్నట్లు సమాచారం. అలాగే మరి కొందరు కార్డులు రద్దు కాకుండా ఆయా కార్డుల బియ్యం, ఇతర సరుకులు డీలరే అమ్ముకునేలా వేలి గుర్తులు వేసి పోతున్నారని తెలిసింది. ఈ బియ్యాన్ని రైస్మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడం వల్లే అధిక ధరల పెరుగుదలకు కారణంగా అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. -
‘గురుకులాల్లో’ ప్రవేశాలకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7 తరగతులు, జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 16తో గడువు ముగుస్తుందని, 6, 7 తరగతులకు సంబంధించి ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు mjptbcwreis.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్సైట్లో ‘మోడల్ స్కూల్’ మెరిట్ జాబితా మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు గత నెల 26న పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ వెబ్సైట్లోకి (telanganams.cgg.gov.in) వెళ్లి పాఠశాలల వారీగా పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి ర్యాంకులను పొందవచ్చని వివరించారు. ఈ సమాచారాన్ని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్ల వద్ద కూడా పొందవచ్చని తెలిపారు. పాఠశాలల వారీగా ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలోనే ప్రిన్సిపాళ్లకు, డీఈవోలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ స్పాట్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ఇష్టానుసారం పేపర్లు దిద్ది ముందుగా వెళ్లిపోకుండా చర్యలు ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నెల 8న సంస్కృతం వంటి పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైనా, ఈ నెల 16 నుంచి ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ మూల్యాంకనంలో దాదాపు 25 వేల మంది లెక్చరర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. గతంలో మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే లెక్చరర్లు కొద్ది గంటల్లోనే తమకిచ్చిన 30 జవాబు పత్రాలను ఆదరాబాదరాగా మూల్యాంకనం చేసి నిర్ణీత సమయానికంటే ముందుగానే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అనేకమంది విద్యార్థులకు మార్కుల్లో తేడాలు వచ్చాయి. వేలమంది విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేయడంతో ఈ లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి లెక్చరర్లు తొందరగా పేపర్లు దిద్ది, ముందుగా వెళ్లిపోకుండా, నిర్ణీత సమయం వరకు ఉండేలా, నిదానంగా మూల్యాంకనం చేసేందుకు బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. -
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్లో బయోమెట్రిక్
- ప్రతి ఒక్కరూ సమయానికి హాజరుకావాల్సిందే - ఇష్టారాజ్యానికి బయోమెట్రిక్తో చెక్ - తొలిసారిగా ఈ ఏడాది నుంచి అమలు నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొలిసారిగా ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెట్టారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ విధానాన్ని అనుసంధానం చేసి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. వాల్యుయేషన్లో నకిలీ అధ్యాపకులు హాజరుకాకుండా ఉండటం, డ్యూటీ ఉన్న వాళ్లు విధులకు సమయానికి వచ్చే విధంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటున్నారు. ప్రస్తుతం మూడు యంత్రాలు ఏర్పాటు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నెల్లూరు నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలలో ఒక గదిలో మూడు బయోమెట్రిక్ యంత్రాలు బిగించారు. పరికరంలో స్పాట్ వాల్యుయేషన్కు హాజరయ్యే అధ్యాపకుల వివరాలను నమోదు చేస్తారు. అధ్యాపకులకు కేటాయించిన నంబరు ఆధారంగా ఆధార్ సంఖ్యను నమోదు చేయగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9.30ల నుంచి 10.30 గంటల లోపు వాల్యుయేషన్కు వచ్చే అధ్యాపకులు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటలలోపు వేలిముద్ర వేసి బయటకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కారణంగా 62 మంది అ«ధ్యాపకులతో సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ను దిద్దుతున్నారు. ఈనెల 17 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు పూర్తి స్థాయి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. మరో రెండు రోజుల్లో ఏడు బయోమెట్రిక్ యంత్రాలు రానున్నట్లు ఇంటర్బోర్డు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు బయోమెట్రిక్ ఆన్లైన్ విధానంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. సీనియార్టీని లెక్కల్లోకి తీసుకున్న క్రమంలో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులను పరిగణనలోకి తీసుకోవాలి. బయోమెట్రిక్ ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టు అధ్యాపకులను కలపడంతో సాంకేతిక సమస్య వస్తుందంటున్నారు. బయోమెట్రిక్ అమలు చేస్తున్నాం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్లో అక్రమాలు జరగకుండా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. స్పాట్ వాల్యుయేషన్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా బయోమెట్రిక్ విధానం ఉపయోగపడుతుంది. అనుసంధానం చేయడంతో ఉన్నతా«ధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. ృబాబూ జాకబ్, ఆర్ఐఓ -
బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్
► 23 వసతిగృహాల్లో అమలు ► వార్డెన్లు, సిబ్బంది గైర్హాజరును తగ్గించే యత్నం ► నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు ► విద్యార్థుల హాజరుశాతంపై స్పష్టత వస్తుందని అంచనా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల పనితీరు ఇకపై మెరుగుపడనుంది. అడ్డగోలు వ్యవహారాలకు కేరాఫ్గా నిలిచే హాస్టళ్లను గాడిలో పెట్టే దిశగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యోగులు, ఇతర సిబ్బంది సమయపాలన ఖచ్చితత్వం కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ.. ఈ మేరకు యూనిట్ల కొనుగోలు, అమరిక బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ శాఖకు అప్పగించింది. జిల్లాలోని 23 బీసీ హాస్టళల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. తద్వారా హాస్టళ్లలో విధులు నిర్వర్తించే వార్డెన్లు, ఇతర సిబ్బందిలో అనధికార గైర్హాజరును తగ్గించవచ్చని అంచనా వేసింది. చాలా హాస్టళ్ల వార్డెన్లువిద్యార్థుల్లేక మూతపడిన ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కొన్ని ఫంక్షన్ హాళ్లుగా రూపాంతరం చెందగా.. మరికొన్ని కొత్త కలెక్టరేట్లుగా అవతరించాయి. తాజాగా మరికొన్ని బీసీ గురుకుల పాఠశాలలుగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. విశాల ప్రాంగణం.. చక్కని మైదానం, పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మూతపడ్డాయి. దీంతో వీటిని నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థికంగా భారంగా పరిణవిుంచింది. అలాగే వదిలేస్తే భవనాలు కూడా స్థానికంగా నివాసం ఉండకుండా.. సమీప ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు చెక్! హెడ్క్వార్టర్లో వార్డెన్లు/ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో హాస్టళ్లు దారుణంగా తయారవుతున్నాయని ఫిర్యాదులందాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే డుమ్మాలు కొడుతున్నట్లు దృష్టికి వచ్చింది. ఎవరైనా తనిఖీలు వస్తే తప్పించుకోవడానికి సెలవుపత్రం ఒకటి అక్కడ ఉంచుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు వేయడానికి బయోమెట్రిక్ దోహదపడుతుందని యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు విద్యార్థుల హాజరుశాతంపై కూడా స్పష్టత వస్తుందని అంచనా వేస్తోంది. నిర్దేశిత సంఖ్యలో హాస్టళ్లలో విద్యార్థులు లేనప్పటికీ, అదనపు సంఖ్యను సృష్టించి డైట్, కాస్మొటిక్ నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పండగ వేళ విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లినప్పటికీ, హాజరుపట్టికలో మాత్రం ఎలాంటి తేడా ఉండడం లేదు. ఆ రోజు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు రికార్డులు నమోదు చేసి.. బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అన్నం వడ్డిస్తోంది. భారీ వ్యయాన్ని భరించి సన్నబియ్యం సరఫరా చేస్తుండగా.. కొందరు వార్డెన్లు ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు ఇటీవల కొన్ని సంఘటనల్లో వెలుగు చూసింది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం రాష్ట్రంలోనే తొలిసారిగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానం సత్ఫలితాలిచి్చంది. ఏకంగా 25శాతం మేర కలిసొచ్చినట్లు లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో ఇతర హాస్టళ్లకు కూడా విస్తరింపజేయాలని కలెక్టర్ రఘునందన్ రావు నిర్ణయించారు. -
ఐటీఐలకు సాంకేతిక సొబగులు!
⇒ ఇకపై ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే.. ⇒ బయోమెట్రిక్ పద్ధతిలో టీచర్లు, విద్యార్థుల హాజరు ⇒ 10 ఐటీఐలకు ఎన్సీవీటీ గుర్తింపు కోసం దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేప థ్యంలో రాష్ట్రం లోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు లో భాగంగా ఐటీఐలలో బయో మెట్రిక్ పరికరాలు అమర్చనుంది. ఇప్పటికే కొన్ని ఐటీఐ ఈ పరికరాలు వినియోగిస్తున్నప్పటికీ.. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ఐటీఐల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తీసుకోవడంతో పాటు నిర్వహణకు సంబం ధించి పలు అంశాలకు వీటిని వినియోగించుకోనుంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు.. రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటివరకు నేరుగా జరిగేది. దీంతో విద్యార్థులు సకాలంలో ప్రధాన కేంద్రాలకు హాజరు కావడంలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా వెబ్సైట్ను అభివృద్ధి చేస్తోంది. పదోతరగతి పూర్తిచేసుకుని ఐటీఐ చదవాల నుకునే విద్యార్థి నేరుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైతే సీటు కేటాయిస్తారు. కాగా, రాష్ట్రంలోని 65 ఐటీఐలకు గాను 55 ఇన్స్టిట్యూట్లకే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) గుర్తింపు ఉంది. మిగిలిన 10 ఐటీఐలకు ఎన్సీవీటీ అనుమతి కోసంఉపాధి కల్పన శాఖ దరఖాస్తు చేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వాటికి అనుమతులు వస్తాయని ఆ శాఖ కమిషనర్ కె.వై.నాయక్ పేర్కొన్నారు. -
15 ఏళ్లు దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: 15 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఆధార్ అప్డేట్ తప్పనిసరని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. 15 ఏళ్ల లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారు తిరిగి తమ ఆధార్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల వయస్సు లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. సామాజిక పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియను ఆధార్తో అనుసంధానం చేసిన కారణంగా బయోమెట్రిక్ సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వృద్ధుల బయోమెట్రిక్కు బదులు ఐరిష్ను పరిగణన లోకి తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు త్వరలో భీమ్ యాప్ను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. -
ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష
– రెండో రోజు 341 మంది గైర్హాజరు కర్నూలు: ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్ నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం తరఫున జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్గా వ్యవహరించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 7612 మంది అభ్యర్థులకు గాను, 7271 మంది ఆదివారం రోజు పరీక్షకు హాజరయ్యారు. 341 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇందుకోసం కర్నూలులో మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అభ్యర్థులను హాలులోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో బయో మెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలి ముద్రలు తీసుకొని ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఫోటోలు తీసుకొని అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్–1 మ్యాథ్స్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.0 గంటల వరకు పేపర్–2 జనరల్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఎస్ఐ ఫైనల్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల నిర్వహణలో అదనపు ఎస్పీలు శివరామ్ప్రసాద్, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్తో పాటు 14 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాలను డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. -
’భయో’త్పాతం
ఉద్యోగులను వీధుల చుట్టూ తిప్పుతున్న బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం వెళుతూ ఉపాధ్యాయిని దుర్మరణం ఇది అధికారిక హత్య అంటున్న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నేడు పెరవలిలో ఘటనా స్థలి వద్ద ధర్నా 20న కలెక్టరేట్ ముట్టడి ఏలూరు సిటీ : బయో మెట్రిక్ హాజరు విధానం ఉపాధ్యాయుల్లో భయోత్పాతం సృష్టిస్తోంది. బయో మెట్రిక్ హాజరు నమోదు కోసం వెళ్లిన బి.రత్నకుమారి అనే ఉపాధ్యాయిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉపాధ్యాయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పెరవలి మండల పరిషత్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న రత్నకుమారి గురువారం ఉదయం పాఠశాలలో విధులకు హాజరయ్యారు. అక్కడి బయోమెట్రిక్ హాజరు యంత్రం పనిచేయకపోవటంతో నరసాపురం రోడ్డులోని పాఠశాల నుంచి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పంచాయతీ సెక్రటరీ లేకపోవటంతో జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లగా.. ఇంటర్నెట్ సక్రమంగా పనిచేయలేదు. దీంతో హాజరు నమోదు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడా యంత్రం సక్రమంగా పనిచేయని కారణంగా తిరిగి జెడ్పీ ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళుతున్న రత్నకుమారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను తొలుత పెరవలి పీహెచ్సీకి.. అక్కడి నుంచి తణుకులోని ఆస్పత్రికి.. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఆస్పత్రికి తరలించారు. రత్నకుమారి అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. 55 ఏళ్ల వయసులో మహిళా ఉపాధ్యాయిని బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం వీధుల వెంట తిరుగుతూ.. ప్రమాదానికి గురై మరణించటం ఉపాధ్యాయులను కలచివేస్తోంది. అధికారులు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయో మెట్రిక్ కష్టాలు జిల్లాలోని ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, అరకొర సౌకర్యాలతో ఈ విధానాన్ని అమలు చేస్తుండటం ఉపాధ్యాయుల పాలిట శాపంలా పరిణమించింది. ఉపాధ్యాయులంతా బయోమెట్రిక్ హాజరు వేసే విషయంలో మానసికంగా నలిగిపోతున్నారు. పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయకపోవటం, యంత్రం ఉన్నా ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోవడం, ఇతర గ్రామాలు, పక్క మండలాలకు సైతం వెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానంపై జిల్లాలోని ఉపాధ్యాయులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 3,260 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరి కోసం 428 ఉన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మండల రిసోర్స్ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సక్రమంగా పనిచేయకపోవటంతో హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాలల్లోని బయోమెట్రిక్ యంత్రం పనిచేకపోతే సమీపంలోని గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా పక్క గ్రామం, పక్క మండలానికి అయినా వెళ్లి హాజరు నమోదు చేయాలనే అధికారుల ఆదేశాలతో ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు. ఉద్యమానికి సన్నద్ధం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తూ బయోమెట్రిక్ విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసేందుకు నిర్ణయించాయి. శనివారం జిల్లాలోని ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. ఉపాధ్యాయిని రత్నకుమారి ప్రమాదానికి గురైన ప్రాంతంలో భారీ ధర్నా చేపట్టేందుకు నిర్ణయించారు. మండల కేంద్రాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. 20న ఏలూరులోని కలెక్టరేట్ను ముట్టడించేందుకు సంఘాలన్నీ నిర్ణయించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకుల శుక్రవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్రాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎంబీటీఎస్ నాయకులు బి.మనోజ్కుమార్, ఆప్టా నాయకులు ధర్మరాజు, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.సుధీర్, టీఎన్యూఎస్ నాయకుడు టీవీ రామకృష్ణ, ఆర్యూపీపీ నాయకుడు రాజబాబు, ఆపస్ నాయకుడు రాజకుమార్, డీటీఎఫ్ నాయకుడు నరహరి, పీఈటీ అసోసియేషన్ నాయకుడు ఎంఎల్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అధికారిక హత్యే ఉపాధ్యాయిని రత్నకుమారి ప్రమాదంలో మరణించిన ఘటనను అధికారిక హత్యగానే చూడాలి. సక్రమంగా పనిచేయని, నాసిరకం బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేశారు. విధిగా హాజరు నమోదు చేయాలనే తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె ప్రమాదానికి గురై మరణించారు. పాలకుల వద్ద పేరు రావాలనే తాపత్రయంతో ఉపాధ్యాయుల నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు. ఈ ఘటనకు కలెక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలి. పి.జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ న్యాయం జరిగేవరకూ పోరాటం ఉపాధ్యాయుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడడం మానుకోవాలి. జిల్లాలోని ఉపాధ్యాయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాఠశాలల్లో నెట్ సౌకర్యం, నాణ్యమైన యంత్రాలు ఏర్పాటు చేయకుండా ఎలాగైనా హాజరు నమోదు చేయాలనటం దారుణం. న్యాయం జరిగే వరకూ ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉద్యమిస్తాం. జి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ బయోమెట్రిక్కు వ్యతిరేకం కాదు కానీ.. ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్ హాజరు నమోదుకు ఉపాధ్యాయులెవరూ వ్యతిరేకం కాదు. కానీ స్కూళ్లలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ యంత్రాలు, నెట్ సౌకర్యం లేకుండా విధిగా హాజరు నమోదు చేయాలనడం న్యాయం కాదు. అధికారులు వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉపాధ్యాయులపై భారాన్ని మోపుతున్నారు. డీవీఏవీ ప్రసాదరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ జిల్లా శాఖ -
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేద్దాం
- పది పరీక్షలపై డీఈఓ తాహెరా సుల్తానా - రోజుకు రెండు హైస్కూల్స్ విజిట్ - కోడ్ వల్ల బయోమెట్రిక్ తాత్కాలిక వాయిదా కర్నూలు సిటీ: వచ్చే నెల17వ తేదీ నుంచి జరుగునున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని డీఈఓ తాహెరా సూల్తానా ఎంఈఓలను ఆదేశించారు. స్థానిక ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో గురువారం డిజాస్టర్ మేనేజ్మెంట్, పదవ తరగతి పరీక్షలు, బయోమెట్రిక్ తదితర అంశాలపై డీఈఓ మండల విద్యాధికారులతో సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగహన కలిగి ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచి పదవ తరగతి పరీక్షలు నూతన విధానంలో జరుగనున్నాయని, ఈ మేరకు విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. మండల విద్యాధికారులు ప్రతి రోజు కనీసం రెండు హైస్కూళ్లను విజిట్ చేసి, అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. ఇటీవల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బయెమెట్రిక్ హాజరు గురించి వివరించారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపరు. కోడ్ ముగిసిన తరువాత దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆమె ఎంఈఓలకు సూచించారు. -
మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు!
మార్చి మొదటి లేదా రెండో వారంలో నోటిఫికేషన్ ఎన్టీఏ నేపథ్యంలో మార్కుల ఆధారంగా మిగులు సీట్లు భర్తీ ఉన్నత విద్యా మండలి యోచన.. పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ను విద్యా మండలి ఆధ్వర్యంలోనే చేపట్టాల ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిసింది. మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది తొలి సారిగా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలను కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కానీ అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో వృత్తి విద్యా కాలేజీల్లో మండలి ఆధ్వర్యంలో ప్రవే శాలు చేపడుతున్నట్లుగానే డిగ్రీలోనూ చేప ట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి ఒకటో వారం లేదా రెండో వారంలో ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రవేశాల్లో లోపాలపై అధ్యయనం యాజమాన్య కోటా సీట్ల భర్తీ, మైనారిటీ విద్యా సంస్థల్లో సొంత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ వంటి విధానాల్లో లోపాలు, సమస్యలపై వైస్ చాన్స్లర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయాలని విద్యా మండలి పాలకవర్గం భేటీలో నిర్ణయించారు. ఇక కన్సార్షియం ఆఫ్ అసోసియేషన్స్ పేరుతో సొంతంగా చేసుకుంటున్న ప్రవేశాలను నియంత్రించాల ని, పక్కాగా నిబంధనలు పాటించేలా చర్య లు చేపట్టాలని యోచిస్తున్నారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలోనే అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం, జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు చేపట్టేలా కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో... చివరకు మిగిలిపోతున్న సీట్లను మార్కుల ఆధారంగా భర్తీ చేయాలన్న అంశం చర్చకు వచ్చింది. దీనిపై మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇతర నిర్ణయాలు.. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హా జరును అమలు చేయాలని.. ప్రస్తుత రెండో సెమిస్టర్కు మినహాయింపు ఇ వ్వాలని నిర్ణయించారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలపై అన్ని వర్సిటీల మేధావులతో ఏప్రిల్లో జాతీయ సెమి నార్ నిర్వహించడంపై చర్చ జరిగింది. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ ఆవశ్యక తపై మరోసారి ప్రభు త్వానికి సిఫారసు చేయాలని, వర్సిటీల అభివృద్ధి, కోర్సు లు తదితర అంశాలపై వీసీలతో కమి టీ ఏర్పాటు చేసి, నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. -
బయోమెట్రిక్
నగరం ఇక మరింత ‘స్వచ్ఛం’! నేటి నుంచి 3 సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు వారంలోగా అన్ని సర్కిళ్లలో అమలు జీహెచ్ఎంసీ కసరత్తు పూర్తి.. నగరవ్యాప్తంగా పారిశుధ్య సేవలు మెరుగు సిటీబ్యూరో: నగరంలో వీధులు ఇకపై మరింత పరిశుభ్రంగా కనపడనున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ..పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ ద్వారా ఆధార్తో కూడిన హాజరును తప్పనిసరి చేస్తోంది. ఇప్పటి వరకు పారిశుధ్య గ్రూపుల్లో 12 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరేడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తూ, మిగతా వారి పేరిట వేతనాల చెల్లింపులు జరిగిపోయేవి. తాజా బయోమెట్రిక్ విధానంతో ఇకపై విధుల్లో లేని కార్మికులను ఉన్నట్లుగా చూపించడం కుదరదు. విధుల్లో లేకుండా కేవలం కాగితాల్లోనే ఉన్న కార్మికులకు వేతనాలు చెల్లించడమూ కుదరదు. బయోమెట్రిక్ వల్ల కచ్చితంగా ఎవరైతే ఉండాలో, వారే విధుల్లో ఉండాలి. ఒకరి పేరిట మరొకరిని చూపించడానికి కూడా కుదరదు. అంతేకాదు.. బయోమెట్రిక్ మెషిన్నే తీసుకువెళ్లి హాజరు నమోదు చేయించడమూ కుదరదు. ఏ పరిధిలో.. ఏ వీధిలో పనిచేయాల్సిన కార్మికులు, వారిపై అజమాయిషీ చెలాయించే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ తమ పరిధిలోనే ఉండాలి. అక్కడ మాత్రమే పనిచేసేలా మెషిన్లలో చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. హాజరు నమోదు కాగానే కనిపించకుండా మాయమయ్యేందుకూ కుదరదు. మొత్తం మూడు పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. అంటే.. జీహెచ్ఎంసీ రికార్డుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులంతా ఇకపై పనివేళల్లో కచ్చితంగా విధుల్లో ఉంటారు. తద్వారా వీధులు, రోడ్లు చెత్త లేకుండా శుభ్రమవుతాయి. గైర్హాజరయ్యేవారి స్థానే ఇతరులను నియమిస్తారు. అక్రమాల కట్టడికి.. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.7500 నుంచి రూ.12,500లకు పెరిగాక, బినామీ కార్మికులెక్కువయ్యారు. తమ బదులు వేరొకరిని విధుల్లో పనిచేయిస్తూ, వారికి నెలకు నాలుగైదు వేలు మాత్రమే చెల్లిస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టి వాస్తవ కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ ఈ విధానాన్ని చేపట్టింది. లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు ఎంటమాలజీ విభాగంలోని కార్మికులను కలుపుకొని మొత్తం 22 వేల మంది కార్మికులకు ఆధార్ లింకేజీతో కూడిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఉప్పల్, అంబర్పేట, కూకట్పల్లి సర్కిళ్లలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తుండగా, వారంలోగా అన్ని సర్కిళ్లలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకుగాను 1200 బయోమెట్రిక్ నమోదు యంత్రాలను టెండరు ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. సంబంధిత శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) పరిధిలో ని కార్మికులకు రోజుకు మూడు పర్యాయాలు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తారు. ఒక ప్రాంతంలోని కార్మికులకు సంబంధించిన బయోమెట్రిక్ మెషిన్ మరో ప్రాంతంలో పనిచేయకుండా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఎస్ఎఫ్ఏలను కూడా జియోట్యాగింగ్కు అనుసంధానం చేసినందున వారి పరిధిలోనే ఈ మెషిన్లు పనిచేస్తాయని అధికారులుపేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా అనలాజిక్స్ ఇండియాటెక్ అనే సంస్థ ఒక్కో మెషిన్కు నెలకు రూ.1175ల వంతున కాంట్రాక్టును దక్కించుకుంది. గతంలో ఆబిడ్స్ సర్కిల్లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పుడు అక్రమార్కుల అవినీతి దందాకు బ్రేక్ పడినప్పటికీ గత కమిషనర్ బదిలీకాగానే బయోమెట్రిక్ యంత్రాలను నేలకు విసిరికొట్టి అటకెక్కించారు. గతంలోని అక్రమాల వల్ల ఏడెనిమిదేళ్లలో దాదాపు రూ. 250 కోట్లు పక్కదారి పట్టాయి. పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్లో మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంది. -
బయోమెట్రిక్పై డైలమా!
సబ్సిడీ రుణాల ఎంపికకు నిలిపివేశామంటున్న అధికారులు ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతున్న ప్రభుత్వం నెల్లూరు(సెంట్రల్): పేదలకు ఇచ్చే సబ్సిడీ రుణాలకు సంబంధించి బయోమెట్రిక్ వాడకంపై ప్రభుత్వం డైలమాలో పడింది. 2016–17 ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాలకు తప్పకుండా బయోమెట్రిక్ వాడాలని ప్రభుత్వం ఇటీవల జీఓ 118ను విడుదల చేసింది. అయితే బయోమెట్రిక్ వినియోగంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరిగి మళ్లీ లబ్ధిదారులతో వేలిము ద్రలను తప్పకుండా వేయించే దానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయమ ని, మరోసారి తప్పకుండా వేలిముద్రలు వేయాలని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చెబుతుండడంతో అటు అధికారులు, ఇటు రుణ లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. బయోమెట్రిక్పై ఫిర్యాదులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలకు చెందిన వారికి ఆయా కార్పొరేషన్లకు సం బంధించి సబ్సిడీ రుణాలను 2016–17కు అందించనుంది. కాగా ఇంత వరకు ఎప్పు డూ లేనంతగా ఈ ఏడాదికి రుణాల పొందే వారికి తప్పకుండా బయోమెట్రిక్ వేయా లని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న చోట వయసు పై బడే కొద్దీ వేలిముద్ర సరిగా పడడం లేదని చాలా చోట్ల ఫిర్యాదులు కూడా అధికారులకు వస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో జాప్యం రుణ లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే చాలా జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడితే ఒక వేళ కొందరికి వేలిముద్రలు పడకపోయినట్లైతే మళ్లీ వారి స్థానంలో మరొకరని ఎంపిక చేయాలంటే చాలా ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో లబ్ధిదారులకు ఏ విధంగా బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రం ప్రస్తుతం ఆ విధానాన్ని నిలిపివేశామని చెబుతుతున్నారు. మండలాలోని ఎంపీడీఓల వద్ద నుంచి రుణ లబ్ధిదారుల పూర్తి సమాచారం వస్తే తిరిగి మళ్లీ బయోమెట్రిక్ పెట్టే యోచనలో ఉన్న ట్లు మరొకొందరు అధికారులు చెపుతుండటం గమనార్హం. దళితుల సంఘాల ఆగ్రహం ఎప్పుడూ లేని విధం గా ఈ సారి పేదలకు ఇచ్చే రుణాలకు బ యోమెట్రిక్ విధానం పెట్టడం ఏమిటని పలువురు దళిత సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిలిపివేశాం ఈ ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాల విషయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని జీఓ ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం అమలు చేయకుండా నిలిపివేశాం. తిరిగి ఎప్పుడు అమలు చేస్తామనేది పరిశీలీస్తున్నాం. వాటి వల్ల ఇబ్బందుల ఉన్నాయని పలువురు అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి ఎప్పుడు అనేది నిర్ణయిస్తాం. –రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
నివేదిక మారిందోచ్!
మొదటి నివేదికలో భారీ మార్పులు చక్రం తిప్పిన కొందరుఉపాధ్యాయ సంఘ నాయకులు వారు పనిచేస్తున్న బడుల్లోబయోమెట్రిక్ లేనట్టేనా! ఒత్తిళ్లకు తలొగ్గిన విద్యాశాఖ అధికారులు కలెక్టర్ దృష్టి సారిస్తే అసలు విషయాలు బట్టబయలు నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా రావడానికి, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి సర్కారు బయోమెట్రిక్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు హాజరుశాతంపై మండిపడగా పాఠశాల విద్యాశాఖ బయోమెట్రిక్ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ ప్రణాళిక కూడా రూపొందించింది. మొదటి దశలో 347 పాఠశాలల్లో బయోమెట్రిక్ను ప్రారంభించాలని నివేదికలు రూపొందించారు. ఇందులో 290 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, కస్తూర్బా 19, రెసిడెన్షియల్ స్కూల్ 4, మోడల్ స్కూల్ 9, మదర్సా 6, ఐఈఆర్సీ(ఇన్క్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్స్ 19 పాఠశాలల్లోని విద్యార్థులకు బయోమెట్రిక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికల్లో తమ పాఠశాలలు ఉండగా ఉపాధ్యాయ సంఘ నాయకులు తొలగింపజేసుకున్నట్లు సమాచారం. నివేదిక తారుమారు మొదటి దశకు సంబంధించి గత అక్టోబర్లో నివేదికను రూపొందించారు. అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు గైర్హాజరు శాతం అధికంగా ఉన్న పాఠశాలలను, కొందరు సంఘం నాయకులు పాఠశాలలకు వెళ్లకపోవడం, మరికొందరు ఉపాధ్యాయులు ఇతరాత్ర వ్యాపారల్లో నిమగ్నమై పాఠశాలలు రాలేదు. వీటి ఆధారంగా నివేదికను రూపొందించారు. డీఈవో లింగయ్య మారడంతో కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు చక్రం తిప్పారు. ఆ నివేదికలో వారు పనిచేస్తున్న పాఠశాలలు లేకుండా జాగ్రత్త పడ్డారు. మొదటి విడత నివేదికలో నవీపేట, ఆర్మూరు, నిజామాబాద్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, బాల్కొండ, సిరికొండ మండలాల్లో పనిచేస్తున్న కొందరు ప్రధాన సంఘ నాయకుల పాఠశాల పాఠశాలల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుత నివేదికలో ఈ పాఠశాలలు లేవు. నిజామాబాద్ నగరంలో వివాదాస్పదంగా ఉన్న నాలుగు పాఠశాలలను బయోమెట్రిక్కు ఎంపిక చేశారు. ఇందులో ఖలీల్వాడి, అర్సపల్లి, శివాజీనగర్, బాలికల పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అందుబాటులో లేదు. దీని వెనుక కొందరు సంఘం నాయకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. సంఘ నాయకుల ప్రమేయం అలాగే ఇద్దరు టీచర్లు ఉన్న చోట వంతులవారీగా పాఠశాలకు వెళ్తున్నట్టు తనిఖీలో తేలింది. ఇటువంటి పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొన్నింటినే చేర్చారు. మాలపల్లి, వెంగల్రావునగర్కాలనీ, కోజాకాలనీ పాఠశాలల్లో మొదట గుర్తించి.. తరువాత వెనక్కి తీసుకున్నారు. జక్రాన్పల్లి, నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అప్పటి డీఈవో ఆకస్మిక తనిఖీలు చేసినపుడు అధిక గైర్హాజరున్నట్లుగా గుర్తించారు. ఇటువంటి కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదు. అలాగే బోర్గాం (పి), దుబ్బ, దారుగల్లి పాఠశాలలు ఎంఈవోలే ఇన్చార్జీలుగా ఉన్నచోట బయోమెట్రిక్ అవసరమే లేదు. ఎంఈవోలు ఉన్న చోట గైర్హాజరు ఉండదు. మండలంలోని శివారు పాఠశాలలకు కూడా బయోమెట్రిక్కు ఎంపిక చేయలేదు. కలెక్టర్కు సమర్పించిన నివేదిక తరువాత కూడా విద్యాశాఖ కార్యాలయంలో మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలిసింది. ఈ బయోమెట్రిక్ విధానంను కలెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బయోమెట్రిక్ నుంచి తప్పించుకున్న ఉపాధ్యాయ సంఘాల నాయకుల బడుల్లో కూడా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కొందరు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవోను అడుగగా.. బయోమెట్రిక్ విధానంలో నిబంధనల ప్రకారమే కొనసాగాం. సంఘ నాయకుల ఒత్తిడి లేదు. మొదటి దశలో రాని పాఠశాలలు రెండో దశలో చేర్చుతాం. -
పెన్షన్.. టెన్షన్
పీఎఫ్ పింఛనుదారులకూ ఇబ్బందులే వేలిముద్రలు, ఐరీష్ కోసం పరుగులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : కొత్తగా ప్రవేశపెట్టిన వేలిముద్ర, ఐరీష్ వి«ధానం కారణంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ పొందుతోన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో రిటైరై ఈ పెన్షన్ తీసుకునే వారు ఏడాదికోసారి లైవ్ సర్టిఫికెట్ సమర్పించాల్సివచ్చేది. ఈ ఏడాది నుంచి ఆ విధానానికి స్వస్తి పలికి వేలిముద్రలుంటేనే పెన్షన్ వచ్చేలా మార్పు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 54 ,607 మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పటికి 23,418 మంది మాత్రమే వేలిముద్రలను నమోదు చేసుకున్నారు. వేలిముద్రలు సరిగా పడని వృద్ధులకు ఐరీష్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియని వారు లైవ్ సరిఫ్టికెట్తో ఎప్పటిలానే పంపుతున్నారు. వేలిముద్రలు వేయకుండా ధ్రువపత్రం పంపిన వారికి పెన్షన్లు ఆగిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఈ వి«ధానం గతేడాది నవంబర్ నెల నుంచి ప్రారంభించినా.. ఈ నెల నుంచి అమలుకానుంది. అంతా 60 ఏళ్లు పైబడిన వారే.. ఈపీఎస్ పొందేవారిలో అత్యధిక శాతం 60 ఏళ్లు పైబడినవారే. వేలిముద్రల నమోదు చేయించుకునేందుకు వారు ఉభయగోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరంలోని పీఎఫ్ కార్యాలయాలకు వీరు వెళుతున్నారు. పనిచేయని స్థానిక కేంద్రాలు పెన్షన్దారుల రద్దీ దృష్ట్యా, ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన మండలాల్లో వేలిముద్రల నమోదు చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులతో స్థానిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ పనిచేయక, మరికొన్ని సెంటర్లలో వేలిముద్రలు నమోదు కాక, ఇతర సాంకేతిక సమస్యలతో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. దీంతో పెన్షన్దారులను జిల్లాలోని ప్రధాన కేంద్రాలకు వెళ్లమని ఈ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లడం కష్టమని, ఈ కేంద్రాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించి ఇక్కడే వేలిముద్రల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని పెన్షన్దారులు కోరుతున్నారు. చాలా దూరం నుంచి వచ్చా.. వేలిముద్ర వేయకపోతే పెన్షన్ ఆగిపోతుందంటున్నారు. ఆరోగ్యం బాగోకపోయినా హడావుడిగా వచ్చేశాను. ఇంతదూరం రావడం కష్టంగా ఉంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. –సత్యనారాయణ, శృంగవృక్షం అందరూ నమోదు చేసుకోవాలి ఈపీఎస్ పొందేవారు కచ్చితంగా వేలిముద్ర వేసి వారి సమాచారాన్ని పొందుపర్చాలి. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఈ నెల 10వ తేదీలోగా ఈ నమోదు ప్రక్రియ పూర్తి కావాలి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి తెలియజేయవచ్చు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లేముందు ఫోన్ చేసి అక్కడ పనిచేస్తుందో లేదో తెలుసుకుని వెళ్లండి. లేనిపక్షంలో ప్రధాన కార్యాలయానికి రావాల్సిందే. –కె.గణేష్కుమార్ జానీ, రీజినల్ పీఎఫ్ కమిషనర్ ఈపీఎఫ్ వేలిముద్రల నమోదు సెంటర్ల ఫోన్ నెంబర్లు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి, మోరి 94912 40130 జగన్నాయకపూర్ 98484 92002 మమ్ముడివరప్పాడు 99496 28107 జి.రంగంపేట 77023 22084 పిఠాపురం 90595 49906 సర్పవరం, కాకినాడ 91549 62076 బండారులంక, అమలాపురం 81259 83849 చీడిగ 93468 22647 ముక్కామల 98851 62355 నెల్లి అప్పన్నసెంటర్ 99592 78659 గోకవరం 93970 80300 కొత్తపేట 91775 45958 మొల్లేరు 94408 00882 మలికిపురం 98493 81195« ధవళేశ్వరం 92461 11809 రాజమండ్రి 94401 27694 బిక్కవోలు 92915 80865 అంగర 99590 18900 వెదురుపాక 98496 56084 కొండకుదురు 89788 72722 ఇంజరము 94921 79933 తాటిపాక 99129 75759 వేమగిరి 98854 75701 రంపచోడవరం 94902 46563 -
రిజిస్ట్రేషన్లపై నిఘానేత్రం!
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు - ఏప్రిల్ 1 నుంచి అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ మరో కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. క్షేత్రస్థాయిలో జరిగే అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ‘రికార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ పేరిట సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇటువంటి విధానాన్ని అవలంబిస్తున్న మహా రాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధి కారులు ఇటీవల అధ్యయనం కూడా చేశారు. రాష్ట్రంలోనూ అటువంటి విధానాన్ని అవలం బించడం ద్వారా కొంతమేరకైనా అవకతవక లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. దీనిపై దాదాపు నెలరోజులుగా ఉన్నతాధికారులు చేస్తున్న కసరత్తు.. తాజాగా ఓ కొలిక్కి వచ్చి నట్లు తెలుస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట ప్రధానంగా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆస్తుల విక్రయదారులకు బదులు ఇతరులు హాజరు కావడం, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ చేసినది తాను కాదని విక్రేతలు చెబుతుం డడం, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్ర యించడం.. వంటి సమస్యలకు, అక్రమాలకు కొత్త విధానంతో చెక్ పెట్టవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతే గాకుండా అవినీతిని నియంత్రించేం దుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు ఉపకరిస్తుందని అవినీతి నిరోధక శాఖ పలు ప్రభుత్వ శాఖ లకు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు అన్ని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు సాంకేతిక సేవలందించే ఫెసిలిటీ మేనేజర్ నియామక టెండర్లోనూ సీసీ కెమెరాల ప్రతిపాదనను పొందుపరిచినట్లు సమా చారం. రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాల యంలో మాదిరిగా క్షేత్రస్థాయిలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఉన్న తాధికారులు నిర్ణయిం చారు. కొందరు ఉద్యోగులు కార్యాల యానికి రాకుండానే తాత్కాలిక ఉద్యోగు లతో పనులు చేయిస్తు న్నారని, సబ్ రిజిస్ట్రార్లు సైతం సమయానికి విధులకు హాజరుకావడం లేదన్న ఫిర్యా దుల నేపథ్యంలో బయోమెట్రిక్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్ట్రార్ బయోమెట్రిక్ ద్వారానే ఆమోదం తెలిపే విధంగా నూతన వ్యవస్థ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. మొదట ఇచ్చిన డాక్యుమెంట్ను రిజిస్ట్రేషన్ చేయ కుండా తరువాత వచ్చిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదని చెబుతు న్నారు. అంటే ‘తొలుత వచ్చిన వారికి తొలుత (ఫస్ట్ కమ్ ఫస్ట్)’ ప్రాతిపదికన రిజి స్ట్రేషన్లు జరిగేందుకు వీలవుతుం దంటున్నారు. -
బడిలోనూ బయోమెట్రిక్
తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు తప్పదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై తీవ్ర విమర్శలున్న నేపథ్యంలో బయోమెట్రిక్ అటెండె¯Œ్స ప్రవేశపెట్టనున్నారు. బడిలో కనీస సదుపాయాలు కల్పించకుండా, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం బయోమెట్రిక్పై దృష్టి సారించడాన్ని ఉపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కదిరి : సర్కారు బడి అనగానే ఉపాధ్యాయులు ఎప్పుడైనా వస్తారు.. ఎప్పుడైనా వెళ్తారనే అపవాదు జనంలో నాటుకుపోయింది. బడికి ఆలస్యంగా వెళ్లేవారు కొందరైతే, రాజకీయ పలుకుబడితో అసలే వెళ్లని వారూ కొందరున్నారని, వారంలో మూడు రోజులు ఒకరు వెళ్తే, మిగతా మూడురోజులు మరొకరు వెళ్తున్నారని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మరికొందరు ఉపాధ్యాయులు తమకు బదులుగా వారి స్థానంలో ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి సదరు ఎంఈఓలకు సైతం అంతోఇంతో ముట్టజెబుతున్నారన్న సమాచారాన్ని కూడా విద్యాశాఖ పసిగట్టింది. ఈ క్రమంలో అయ్యవార్లను బడికి పరిగెత్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వీడియో కాన్ఫరె¯Œ్సల ద్వారా విషయం అర్థమయ్యేలా చెప్పారు. తొలుత ప్రాథమిక పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 2017 జనవరి 2 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా తయారైంది. దీంతో సంక్రాంతిలోపు ఈ తంతు ముగించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. ఆ రోజుకు ఆధార్ వంద శాతం పూర్తయిన ప్రా«థమిక పాఠశాలలను అప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వాటిలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం జిల్లాలో 3,164 ప్రాథమిక పాఠశాలలు, 1,633 ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి మండలంలోనూ ఒక కస్తూరిబా బాలికా విద్యాలయం ఉంది. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ప్రార్థనా సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు? ఆలస్యంగా ఎందరొచ్చారు? అసలు బడికే రానివారు ఎందరు? సెలవులో ఉన్నదెవరు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ విధానం ద్వారా ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభు త్వం మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించిందని, అమలు చేయక తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక ! పాఠశాలల్లో కనీస సదుపాయాలపై దృష్టి సారించకుండా, ఉపాధ్యాయులకు న్యాయబద్దంగా చెల్లించాల్సిన 2 డీఏలు ఇవ్వకుండా బయోమెట్రిక్ ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల సమయం వృథా తప్ప మరో ప్రయోజనం లేదు. ముందుగా 10 నెలల అరియర్స్, సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం లాంటివి అమలు చేయాలని వైఎస్సార్టీఎఫ్ తరపున మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – అశోక్కుమార్రెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మిషన్లనే నమ్ముతున్నాడు చంద్రబాబునాయుడు ఉపాధ్యాయులను నమ్మడం లేదు. మిషన్లను నమ్ముతున్నాడు. ఎన్నో ఏళ్లుగా మహిళా టీచర్లతో పాటు అమ్మాయిలు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. బయోమెట్రిక్పై ఉన్న శ్రద్ధ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించడం లాంటి సమస్యలపై చూపితే సంతోషించేవాâýæ్లం. కేవలం విద్యాశాఖలో మాత్రమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలనుకోవడంలో ఆంతర్యమేమిటి?. – ఎం.శ్రీనివాసప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి గ్రామాల్లో వసతులేవీ? పనిచేసే చోటే నివాసముండటానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ అద్దెకుండాలంటే ఇల్లు ఉండాలి కదా..? బయోమెట్రిక్ సాకుతో సర్కారు బడులను రద్దు చేసి, నారాయణ వంటి పాఠశాలలను అభివృద్ధి చేయడానికే కదా?. పాఠశాలలు, గ్రామాలకు మొదట కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఎంఈఓ పోస్టులను భర్తీ చేస్తే ఎలాంటి బయోమెట్రిక్లు అవసరం లేదు. – శ్రీధర్రెడ్డి, పీఆర్టీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి -
బడిలోనూ బయోమెట్రిక్
- తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు - తప్పదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు కదిరి : సర్కారు బడి అనగానే ఉపాధ్యాయులు ఎప్పుడైనా వస్తారు.. ఎప్పుడైనా వెళ్తారనే అపవాదు జనంలో నాటుకుపోయింది. బడికి ఆలస్యంగా వెళ్లేవారు కొందరైతే, రాజకీయ పలుకుబడితో అసలే వెళ్లని వారూ కొందరున్నారని, వారంలో మూడు రోజులు ఒకరు వెళ్తే, మిగతా మూడురోజులు మరొకరు వెళ్తున్నారని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మరికొందరు ఉపాధ్యాయులు తమకు బదులుగా వారి స్థానంలో ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి సదరు ఎంఈఓలకు సైతం అంతోఇంతో ముట్టజెబుతున్నారన్న సమాచారాన్ని కూడా విద్యాశాఖ పసిగట్టింది. ఈ క్రమంలో అయ్యవార్లను బడికి పరిగెత్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా విషయం అర్థమయ్యేలా చెప్పారు. తొలుత ప్రాథమిక పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 2017 జనవరి 2 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా తయారైంది. దీంతో సంక్రాంతిలోపు ఈ తంతు ముగించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. ఆ రోజుకు ఆధార్ వంద శాతం పూర్తయిన ప్రా«థమిక పాఠశాలలను అప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వాటిలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం జిల్లాలో 3,164 ప్రాథమిక పాఠశాలలు, 1,633 ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి మండలంలోనూ ఒక కస్తూరిబా బాలికా విద్యాలయం ఉంది. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ప్రార్థనా సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు? ఆలస్యంగా ఎందరొచ్చారు? అసలు బడికే రానివారు ఎందరు? సెలవులో ఉన్నదెవరు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ విధానం ద్వారా మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. బడికి హాజరు కాకపోయినా హాజరు పట్టికలో సంతకం పెట్టడం లాంటివి ఇక కుదరవని కొందరు ఉపాధ్యాయులే అంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించిందని, అమలు చేయక తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
బాసరలో నగదు రహిత లావాదేవీలు
- ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నగదు రహిత లావాదేవీలకు నూతన సంవత్సరం ఆరంభం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచే ప్రారంభించనున్నారు. రూ. 1000, రూ.500 నోట్ల రద్దుతో బాసరలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని విభాగాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని కౌంటర్లలో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర కొరత సైతం ఈ మిషన్ల ఏర్పాటు తో తీరనుంది. కాగా, ఆలయంలో స్వీపర్, ఉద్యోగులు, అర్చకులు, ఎన్ఎంఆర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 180 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. 30 నిమిషాలు ఆలస్యమైతే గైర్హాజరుగా నమోదు అవుతుందని ఈఓ తెలిపారు. -
అవినీతిపరులకు బయోందోళనే
మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు చెక్ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ జిల్లాలో తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు జాబితా విడుదల చేసిన ప్రభుత్వం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓ పాఠశాలలో 120 మంది విద్యార్థులుంటే వారిలో 30 మంది పాఠశాలకు హాజరుకాలేదు. కానీ మధ్యాహ్న భోజనం అటెండెన్స్ రిజిష్టర్లో మాత్రం అందరూ వచ్చినట్లు నమోదు చేశారు. గైర్హాజరు పిల్లలకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని సదరు ఏజెన్సీ, హెచ్ఎం ఇద్దరూ స్వాహా చేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే..ఇలాంటి పరిస్థితి చాలా స్కూళ్లలో ఉంది. చాలా రోజులుగా ఈ అక్ర మాల తంతు జరుగుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పాఠశాలల్లో బోగస్ అటెండెన్స్కు చెక్ పెట్టేందుకు, అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం బయో మెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఎంత మంది మధ్యాహ్న భోజనం తిన్నారో.. అంత మందికి మాత్రమే బిల్లు మంజూరవుతుంది. జిల్లాలో 3783 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆయా స్కూళ్లలో 3,43,557 మంది విద్యార్థులు భోజనం తింటున్నారు. టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్ బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అమలుకు పూనుకున్నారు. వేలిముద్ర పడితేనే బిల్లు : విద్యార్థి వేలిముద్ర పడితేనే ఏజెన్సీకి బిల్లు మంజూరవుతుంది. బయో అటెండెన్స్ ఆధారంగానే ఏరోజుకారోజు ఆన్లైన్లో బిల్లు జనరేట్ అవుతుంది. నెలలో ఏ విద్యార్థి ఎన్ని రోజులు మధ్యాహ్నం భోజనం చేశాడో క్రోడీకరించి, బిల్లు పంపుతారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు ఓసారి, మధ్యాహ్నం భోజన సమయంలో మరోసారి అటెండెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం ఆలస్యమైనా కొందరు విద్యార్థులు భోజన సమయానికి వస్తారు. ఉదయం వచ్చీ మధ్యాహ్న భోజనానికి హాజరుకాని విద్యార్థులూ ఉంటారు. దీంతో రెండు పూటలా అటెండెన్స్ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆటోమేటిక్గా ఆన్లైన్ అంటెండెన్స్ తీసుకోదు. తర్వాత నమోదు చేసినా లాభం ఉండదు. ఎంతసేపూ గడువులోపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లకు సమయం కాస్త ఎక్కువగా కేటాయిస్తారు. నిన్నటి రోజు కొందరి పిల్లలు నమోదు చేయలేదు.. ఈరోజు చేస్తామంటే కుదరదు. ఏరోజుకారోజు అటెండెన్స్ వేయాలి. తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు : జిల్లాలోని 3,783 స్కూళ్లకు గాను తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూళ్లు ఉంటాయి. జాబితాను ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు పంపింది. అనంతపురం డివిజన్లో 268 పాఠశాలలు, ధర్మవరం డివిజన్లో 428, గుత్తి డివిజన్లో 447, పెనుకొండ డివిజన్లో 365 స్కూళ్లలో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్కూళ్లలో బయోమెట్రిక్ మిషన్లు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్మెంట్ చేసేందుకు, ఏజెన్సీ నిర్వాహకులు, హెచ్ఎంలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేనాటికి ఈ ప్రక్రియ పూర్తయి అమలు చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వేలిముద్రలు నమోదు చేస్తున్నాం : శామ్యూల్, డీఈఓ బయోమెట్రిక్ అమలు నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నాం. మీసేవ, ఆన్లైన్ కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లి వేలిముద్రలు నమోదు చేయిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 1,505 స్కూళ్లలో అమలు కానుంది. ముందుగా ఆయా స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే తర్వాత చెప్తాం. -
మళ్లీ పాత కథే..?
► బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఫెరుుల్ ►మళ్లీ వినిపించనున్న ఎస్సార్, ప్రెజెంట్ సార్ పదాలు ► యంత్రాలు పని చేయడం లేదా.. ఉద్దేశపూర్వకంగానా..? సిమ్లు రాలేదు.. 9హాస్టల్స్లో బయెమెట్రిక్ విధానాన్ని ఆన్లైన్కు అనుసంధానం చేసేందుకు ట్యాబ్లు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్ల్లో వేసేందుకు సిమ్ కార్డులు రాలేదు. అలాగే వీటి కోసం మూడు నెట్వర్క్ల సిమ్ కార్డులు ఇచ్చారు. ఇందులో ఎరుుర్ టెల్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ఉన్నారుు. కానీ వచ్చిన సిమ్లు మాత్రం ఐడియా, బీఎస్ఎన్ఎల్ కావడంతో ట్యాబ్ల్లో వేయలేదు. జిల్లాలోని 4 డివిజన్లలో ఒక్కో హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాల్సి ఉండగా అలా జరగలేదు. విజయనగరం కంటోన్మెంట్ : సంక్షమే హాస్టళ్లలో బయోమెట్రిక్ను అమలు చేసి తద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆశయం నెరవేర లేదు. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు హాస్టళ్లకు ఆదేశాలిచ్చినప్పటికి ఆచరణకు మాత్రం అరుుష్టత వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నారుు. 2 నెలల క్రితం జిల్లాకు 97 బయోమెట్రిక్ డివైస్లు రాగా వాటిలో 38 మెషీన్లు పనిచేయడం లేదు. మిగతా మెషీన్లకు సిమ్కార్డులు ఇవ్వలేదు. జిల్లాలో 88 బీసీ హాస్టల్స్ ఉండగా వీటిలో 28 కాలేజ్ విద్యార్థులవి. మిగిలిన 60 స్కూల్ విద్యార్థులవి. ఈ హాస్టళ్లలో హాజరును తప్పుగా చూపిస్తున్నారనే అనుమానాలు కలగడంతో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు తలచారు. దీనిలో భాగంగా కార్వే సంస్థ ద్వారా జిల్లాకు బయోమెట్రిక్ పరికరాల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ఎందుకో అమల్లోకి రాలేదు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా.. జిల్లాలోని 60 బీసీ బాలుర హాస్టల్స్కు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జిల్లాలోని 2 రెసిడెన్షియల్ స్కూళ్లకూ ఒకేసారి ఈ బయోమెట్రిక్ డివైస్లు అమర్చాలని నిర్ణరుుంచారు. చీపురుపల్లి, కోరపు కొత్తవలసల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. కానీ అక్కడ కూడా నేటికి ఈ విధానం అమలు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ మెషీన్లు, పరికరాలు వచ్చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నారుు. అన్ని కార్యాలయాలు, సంస్థల్లోనూ బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేస్తుంటే ఇక్కడే ఎందుకు పని చేయడం లేదన్న విమర్శలూ ఉన్నారుు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం. కార్వే సంస్థ ప్రతినిధులు ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే వారితో సమావేశం ఏర్పాటు చేసి డెమో నిర్వహిస్తాం. అనంతరం వాటిని ఆయా వసతి గృహాలకు తరలించి సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటాం.- సీహెచ్. హరిప్రసాద్, డీబీసీడబ్లూ ్యఓ, విజయనగరం. -
భయోమెట్రిక్
► అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు సన్నద్ధం ► అంగన్వాడీలకు రోజుకు మూడుసార్లు హాజరు ► ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన చిన్నారులకే పోషకాహారం ► ఆందోళనలో అంగన్వాడీలు ఒంగోలు టౌన్ : అంగన్వాడీలను బయోమెట్రిక్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు కొన్ని శాఖలకే పరిమితమైన బయోమెట్రిక్ విధానాన్ని తాజాగా అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచడంతో కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో బయోమెట్రిక్ రాకతో తమను మరింత మానసిక క్షోభకు గురిచేస్తారేమోనని అనేక మంది అంగన్వాడీలు వాపోతున్నారు. బయోమెట్రిక్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు మినహారుుంపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రాజెక్టుల స్థారుులో సీడీపీఓలు, జిల్లా స్థారుులో ప్రాజెక్టు డెరైక్టర్ను కలిసి బయోమెట్రిక్ విధానం వల్ల కలిగే ఇబ్బందులను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వాటి పరిధిలో 4,244 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారుు. వీటి పరిధిలో ప్రస్తుతం 31 వేల మంది గర్భిణులు, 30 వేల మంది బాలింతలు, ఆరునెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు లక్షా 27 వేల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 97 వేల మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా 25 రోజులకు సరిపడే విధంగా 3 కేజీల బియ్యం, అరకేజీ కందిపప్పు, 400 గ్రాముల వంటనూనె, వారానికి నాలుగు కోడిగుడ్లు చొప్పున అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు వారానికి నాలుగు కోడిగుడ్లు అక్కడే వండి పోషకాహారం కింద అందిస్తుంటారు. ఆందోళన కలిగిస్తున్న హాజరు విధానం... అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్న బయోమెట్రిక్లో హాజరు విధానం అంగన్వాడీలను ఆందోళనకు గురిచేస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రతిరోజూ మూడుసార్లు హాజరు విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం నాలుగు గంటలకు కచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు చిన్నారుల హాజరు తీసుకోనున్నారు. ఆ సమయానికి ఎంతమంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటే వారికి మాత్రమే పోషకాహారం అందించాలని ఆదేశాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు మాత్రం ఠంచనుగా తమకు సూచించిన సమయానికి హాజరు వేసినప్పటికీ చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం మాత్రం కష్టతరమని అంగన్వాడీలు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా చిన్నారులను సరిగ్గా తొమ్మిది గంటలకు కేంద్రాలకు తీసుకురావడం కష్టమని వాపోతున్నారు. చిన్నారులకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు... ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. అందులో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు సంబంధించి ఒకేచోట విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో విడివిడిగా ఉంటున్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకేచోటకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు అందారుు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలను ఒకచోటికి తీసుకువచ్చే కసరత్తు జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న వాటిని మరోచోటకు మార్చడం వల్ల ఆ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు కూడా కష్టంగా మారనుంది. వారిని దూర ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి బయోమెట్రిక్ ద్వారా నిత్యవసర సరుకులు అందించాల్సి ఉంటుంది. అరుుతే గర్భిణులు, బాలింతలు అంతదూరం రాలేకపోతే వారికి నిత్యవసర సరుకులు దూరం కానున్నారుు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నారు. -
బీసీ హాస్టళ్లలో రేపటి నుంచి బయోమెట్రిక్
కోవెలకుంట్ల: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. జిల్లాలో బీసీ వసతిగృహాలు 54 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ఉంటూ 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, అలాగే 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, ఒక్కో విద్యార్థికి రోజుకు 400 గ్రాముల బియ్యం అందజేస్తోంది. వీటితో విద్యార్థులకు ఉదయం, రాత్రివేâ¶ళలు(పాఠశాలలు సెలవుదినాల్లో మధ్యాహ్నాం) భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొందరు వార్డెన్లు.. బోగస్ హాజరు శాతంతో డైట్ చార్జీలు, బియ్యాన్ని స్వాహా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్ హాజరు శాతానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాస్టల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు బయెమెట్రిక్ విధానం అమలు చేయనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ప్రతిరోజు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేయాల్సి ఉంది. విద్యార్థుల వేలిముద్రలు ఆధారంగా డైట్చార్జీలు, బియ్యం కేటాయించి భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంది. అలాగే హాస్టల్లో పనిచేసే సిబ్బంది సైతం రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విధులకు డుమ్మాకొట్టే సిబ్బందికి చెక్పడనుంది. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. -
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
► ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఆర్వీ కర్ణన్ ► వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ఉట్నూర్ : సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ ఆస్పత్రి వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యం కోసం సీహెచ్సీకి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని, జ్వరాలతో వచ్చే వారికి రక్త పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు ప్రసవం కోసం వస్తే ఆస్పత్రిలోనే ప్రసవం చేయూలని, రిమ్స్కు తరలించి చేతులు దులిపేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసవం కోసం వచ్చేవారిని రిమ్స్కు రెఫర్ చేయడం మానుకోవాలని సూచించారు. పరిస్థి తి విషమిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రిలో స్త్రీ వైద్య నిపుణుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓపీ వైద్యులు ఎల్లవేళల్లో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని, వైద్యుల పనితీరు మెరుగుపర్చడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్రెడ్డి, వైద్యులు మాలతిరెడ్డి, రవి, సుందరి, సంజీవ్రెడ్డి, అవి నాష్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ వసతిగృహాల్లో బయోమెట్రిక్
► డమ్మీ హాజరుకు ఇక స్వస్తి ► జిల్లాకు చేరిన 98 యంత్రాలు ► నాలుగు చోట్ల అమలు జలుమూరు : జిల్లాలో అన్ని బీసీ వసతిగృహాల్లో ఇక బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. బోగస్ హాజరును నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఇన్నాళ్లు వసతిగృహాల్లో లేని విద్యార్థులను సైతం లెక్కల్లో చూపి నిధులను కాజేస్తుండగా దానికి ప్రభుత్వ నిర్ణయంతో బ్రేకులు పడనున్నారుు. ఇప్పటికే బయోమెట్రిక్కు సంబంధించి జిల్లాకు 99 యంత్రాలు చేరగా వీటిలో నాలుగు చోట్ల విధానం అమలు ప్రారంభమైంది. జిల్లాలో అమలు ఇలా... జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనుంది. మొత్తం 78 బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు ఉండగా నాలగవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 7675 మంది విద్యార్థులు చదువుతున్నారు. పోస్టు మెట్రిక్(కళాశాల) విద్యార్థులు వసతిగృహాలకు సంబంధించి 22 ఉండగా ఇందులో 2525 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు... ఎంత మంది ఇంటికి వెళ్తున్నారు... అనే స్పష్టత కొన్ని వసతిగృహాల్లో ఉండటంలేదు. విద్యార్థుల హజరు ప్రశ్నార్థకం కావడంతో విద్యార్థుల సంరక్షణ, సంక్షేమంపై శ్రద్ధతీసుకునేందుకు ఈ బయోమెట్రిక్ హాజరు కీలకం కానున్నది. దీంతో వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వసతిగృహాల్లో... జిల్లాలో అన్ని వసతిగృహాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి వాటి ద్వారానే విద్యార్థుల హాజరు తీసుకుంటాం. దీని వల్ల విద్యార్థుల హాజరుపై ఒక స్పష్టత వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. ఇప్పటికే శ్రీకాకుళంలో నాలుగు చోట్ల అమలు కాగా మిగిలిన చోట్ల విడతలు వారీగా అమలు చేస్తాం. -ధనుంజయరావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ, శ్రీకాకుళం -
జిల్లాలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి
ఏలూరు(సెంట్రల్)ః రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో బయోమోట్రిక్ పేరుతో వేధిస్తున్నారని ఎపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారని ఫలితంగా రోజుకు రూ. 20 నుండి 40 వరకు వారికి ఖర్చు అవుతుందన్నారు. రెండు పూటలా రెండు గంటలకు పైగా వారికి సమయం వృధా అవుతుందని ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టలేని పరిస్ధితిలో అంగన్వాడీలున్నారన్నారు. బయోమెట్రిక్ విధానానికి తమ యూనియన్ వ్యతిరేకం కాదని, ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఫ్రీ స్కూల్ను నిర్వహించేందుకు సమయం లేMýంండా ఇతర అదనపు పనులు కేటాయిస్తూ ప్రభుత్వాధికారులే అంగన్వాడీ కేంద్రాలను బలహీనపరుస్తున్నారని, ఎస్ఎంఎస్ల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ సూపర్వైజర్లు చేయాల్సిన పనులు సైతం వర్కర్లతోనే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని ఆమె ఆరోపించారు. అర్హత కలిగిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉన్న జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా అన్యాయం చేస్తున్నారని, వేతనాల పెంపు సందర్భంగా రూ. 63ను ఇంక్రిమెంట్లో కోత విధించి అంగన్వాడీలపై సవిత తల్లి ప్రేమ కనబరిచారన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబుకు ఆ వాగ్ధానం గుర్తు లేదా అని ప్రశ్నించారు. జిల్లాలోని తక్షణమే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని, లేదా ఆయా కేంద్రాల్లోనే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సుబ్బరావమ్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు డీఎన్వీడీ ప్రసాద్, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
బయోమెట్రిక్..!
• సబ్సిడీ శనగ విత్తనాల కోసం పాట్లు • భూ వివరాలు ఆన్లైన్లో ఉంటేనే విత్తనాలు • వేలిముద్రలు పడకపోతే అంతే సంగతులు • {పభుత్వ నిర్ణయంపై రైతుల ఆందోళన • సర్వర్ పని చేయక అవస్థలు • బ్యాగుల తూకంలోనూ మాయూజాలం సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీలో ప్రభుత్వం ట్రిక్స్ ప్లే చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నారుు. నిబంధనలను సాకుగా చూపి తమకు విత్తనాలు అందకుండా చేస్తోందని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. భూముల వివరాలు ఆన్లైన్లో ఉంటేనే విత్తనాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం రైతులకు మింగుడు పడటం లేదు. బయోమెట్రిక్ పద్ధతి ద్వారా విత్తనాలను పొందాలంటే భూవివరాలు ఆన్లైన్లో నమోదై ఉండాలి. సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో ఎక్కువ మొత్తంలో భూ వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో వీరికి సబ్సిడీ విత్తనాలు అందడం కష్టంగా మారింది. ఇక వేలిముద్రలు సరిపోలక పోరుునా, ఇతర సాంకేతిక సమస్యలు ఉత్పన్నైమైనా విత్తనాలు లభించే అవకాశం లేదని వ్యవసాయాధికారులే అంగీకరిస్తున్నారు. ఈ పద్దతి ద్వారా 30-40 శాతం వరకు రైతులు విత్తనాలు పొందే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది తెలిసే ప్రభుత్వం బయోమె‘ట్రిక్’కు తెరతీసిందని రైతులు చర్చించుకుంటున్నారు. పర్చూరు: శనగ పంట సాగు సీజన్ సమీపించడంతో నవంబరు 15వ తేదీ వరకు బయోమెట్రిక్ పద్ధతిలో సబ్సీడీపై విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో సబ్సీడీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులు తమకు విత్తనాలు దక్కవేమోనని ఆందోళన చెందుతున్నారు. బయోమెట్రిక్ పనిచేయక సమస్యలు తలెత్తున్నారుు. గతంలో 5 ఎకరాలు ఉంటే 125 కేజీలు ఇచ్చేవారు. ప్రస్తుతం 75 కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 కేజీలు అవసరం. కానీ ప్రభుత్వం 25 కేజీలు చొప్పున ఇస్తుంటే, మిగిలిన శనగలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయూల్సిన పరిస్థితి నెలకొంటోంది. 25 కిలోల బ్యాగులో 19 కిలోల విత్తనాలే.. పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన రైతులు తోకల సుబ్బారావు కు శనగల పంపిణీ చేయగా, అందులో 25 కేజీల బ్యాగు గాను, 19 కేజీలు మాత్రమే విత్తనాలు ఉన్నారుు. మరొక రైతు గోరంట్ల వెంకట నారాయణకు ఇచ్చిన బ్యాగుళో 22.9 కిలోలే ఉంది. ఇలా తూకం తక్కువగా రావడం వంటి సమస్యలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సరిపడా విత్తనాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పర్చూరు సబ్డివిజన్ పరిధిలో 14 వేల క్వింటాళ్లు అడుగగా, 9 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని ఏడీఏ కన్నయ్య తెలిపారు. చుక్కలంటుతున్న శనగల ధరలు... శనగ విత్తనాలకు బ్లాక్ మార్కెట్ ధరలు చుక్కలంటుతున్నాయి. నాణ్యత కలిగిన విత్తనాలంటూ క్వింటా రూ. 10 వేల వరకు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం 40 శాతం సబ్సిడీపై కిలో రూ. 59.20కు పంపిణీ చేసే శనగ విత్తనాల కోసం రైతులు పోటీ పడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా రైతులందరికీ విత్తనాలు అందజేయాలని కోరుతున్నారు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం పర్చూరు సబ్ డివిజన్ పరిధిలో సాధారణ సాగు విస్తీర్ణం సుమారుగా 15 వేల హెక్టార్లు ఉన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. పర్చూరు సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లోనే సుమారు 20 వేల హెక్టార్లలో పంట సాగవుతోంది. ఆరు నెలలుగా పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో గతేడాది కన్నా 5-6 వేల హెక్టార్లు సాగు విస్తీర్ణం పెరగ వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులందరికీ పంపిణీ చేస్తాం బయోమెట్రిక్ పద్దతి ద్వారా శనగ విత్తనాల పంపిణీలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా అర్హులందరికీ దక్కెలా చర్యలు చేపడతాం. రైతులు ఆందోళన చెందవద్దు. - శివనాగప్రసాద్, ఏవో, పర్చూరు -
వసతిగృహాల్లో బయోమెట్రిక్ విధానం
బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు భానుగుడి (కాకినాడ) : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, వార్డెన్ల గైర్వాజరును తగ్గించేందుకు త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు డి.డి.చినబాబు తెలిపారు. వసతిగృహాల్లో బయోమెట్రిక్ వి«ధానానికి సంబంధించి సోమవారం వార్డెన్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 82 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానం అమలుకానుందన్నారు. ఈ వసతిగృహాల్లో 5వేలకు మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ విధానంపై వార్డెన్లకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల, వార్డెన్ల హాజరును బయోమెట్రిక్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. -
కాలేజీల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్
- లేకపోతే అనుబంధ గుర్తింపు రద్దు - ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ కాలేజీల్లో లెక్చరర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని.. లేకపోతే ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆ కాలేజీలను వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు అనుమతించకూడదని.. వాటిలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వవద్దని తీర్మానించింది. బుధవారం హైదరాబాద్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన స్టేట్ కౌన్సిల్ ఐదో సమావేశం జరిగింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్య, సాంకేతిక విద్య, ఇంటర్ విద్య కమిషనర్లు విజయ్కుమార్, ఎంవీరెడ్డి, అశోక్, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, తెలంగాణ వర్సిటీల వీసీలు, పలువురు ప్రొఫెసర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఆ నిర్ణయాలు.. ► ఉన్నత విద్యా కాలేజీల్లో డిసెంబర్లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి బయోమెట్రిక్ విధానం అమల్లోకి తేవాలి. ► పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు త్వరలోనే వైస్ చాన్సలర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ► వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపడతారు. కొన్ని కోర్సుల పరీక్షల బాధ్యతలను ఉస్మానియాకు, మరికొన్ని కోర్సుల బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి అప్పగిస్తారు. ► ఉన్నత విద్య అభివృద్ధికి, మెరుగైన విద్యా విధానం, సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తారు. మండలి వైస్ చైర్మన్లు వెంకటాచలం, ఎస్.మల్లేశ్ వాటికి నేతృత్వం వహిస్తారు. ఒక్కో కమిటీ మూడు నాలుగు రాష్ట్రాల్లో పర్యటి ంచి.. డిసెంబర్ 15న జరిగే కౌన్సిల్ సమావేశం నాటికి నివేదికలు అందజేస్తాయి. ► ఇక ఆన్లైన్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ, అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓయూ, జేఎన్టీయూహెచ్ వీసీలు రామచంద్రం, వేణుగోపాల్రెడ్డిల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు.ఆ కమిటీ ఆన్లైన్ పరీక్షల విధానాన్ని రూపొందిస్తుంది.హా కామన్ యూనివ ర్సిటీ యాక్ట్పై మరోసారి సమీక్షిస్తారు. ప్రస్తుతమున్న కమిటీలో మరికొంత మంది వీసీలకు స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం చేసిన నాలుగు ప్రతిపాదనలపై మరోసారి చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ► ప్రైవేటు యూనివర్సిటీల చట్టంపై తుది నిర్ణయం బాధ్యతను ప్రభుత్వానికే అప్పగించారు. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
విత్తన పంపిణీకి బయోమెట్రిక్
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్కు సంబంధించి శనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని బయోమెట్రిక్ విధానంలో చేపట్టాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారి, ఏడీఏ(ఐటి) ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆధార్ బేస్డ్ బయో మెట్రిక్ విధానం ద్వారా శనగల పంపిణీకి సంబంధించి ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు, ఏఈఓలు, ఎంపీఈఓలకు కలెక్టరేట్లోని వ్యవసాయశాఖ సమావేశ మందిరం, డ్వామా హాలు, ఏడీఏ కార్యాలయాల్లో శనివారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శిక్షణ నిమత్తం కమిషనరేట్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఏడీఏ ప్రవీణ్కుమార్ విత్తన పంపిణీపై వివరించారు. ఖరీప్ సీజన్లో అనంతపురం జిల్లాలో వేరుశనగ పంపిణీని ఈ విధానంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అదే తరహాల్లో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో శనగల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన యాప్ను ఉపయోగించే విధానంపై వివరించారు. పర్మిట్లు ఇచ్చే చోట, విత్తనాలు ఇచ్చే గోదాములో చేయాల్సిన పనులు వివరించారు. నిక్ జిల్లా సాంకేతిక డైరెక్టర్ నూర్జాహాన్ యాప్ను వినియోగించే విధానంపై వివరించారు. వర్షాలు తెరిపిచ్చిన తర్వాత అంటే ఈ నెల 28, 29 నుంచి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. యాప్ ద్వారా పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు రమణారెడ్డి, నర్సిరెడ్డి, సుధాకర్, రాజశేఖర్, సీడ్స్ ఏఓ శారద తదితరులు పాల్గొన్నారు -
అన్ని పీహెచ్సీల్లో బయోమెట్రిక్ విధానం
వారంలోగా ఏర్పాటు చేయకుంటే చర్యలు తప్పవు సెప్టెంబర్ నుంచి క్లస్టర్ స్థాయి సమావేశాలు హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబర్ ఒకటి నాటికి పూర్తిస్థాయి లో బయోమెట్రిక్ హాజరు యంత్రాలు వినియోగంలో ఉండాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీహెచ్సీ వైద్యాధికారులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బయోమెట్రిక్ విషయంలో గతంలో చెప్పినప్పటికీ అధికారులు చాలావరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటì కే చాలా సమయం ఇచ్చాను.. ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అమలు బాధ్యతలు జిల్లా సమాచార అధికారి విజయ్కుమార్కు అప్పగించారు. జిల్లాలో 75శాతం పీహెచ్సీల పనితీరు మెరుగున పడిందని, మిగతా 25శాతం కూడా దారిలోకి రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పీహెచ్సీల్లోని పాత సామగ్రిని తొగించే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే సెప్టెబర్లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లాను వైద్యరంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో అందరూ భగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. -
రుణాలకూ ‘బయోమెట్రిక్’
జన్మభూమి కమిటీకి పూర్తి పెత్తనం 3 నుంచి 9 మందికి కమిటి సభ్యులు పెంపు జీఓ నంబర్ 18 జారీ ఆందోళనలో దళితులు ‘బయోమెట్రిక్’ ఈ పేరు వినని వారుండరు. ఎందుకంటే దీని వల్ల పింఛను తీసుకునే అభాగ్యులు, రేషన్ షాపుల్లో నిత్యావసరాలు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న వారే. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీ రుణాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలోనే సబ్సిడీ రుణాలకూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇది తమకు రుణాలు అందకుండా చేసేందుకేనని దళితులు విమర్శిస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): సబ్సిడీ రుణాలు పేదలకు అందకుండే చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇందులో భాగంగా రుణాల మంజూరులో బయోమెట్రిక్ విధానంలో అమల్లోకి తెచ్చింది. అంతేగాక రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలకు పూర్తి పెత్తనం కట్టబెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులున్న కిమిటీలో ఏకంగా 9 మంది ఉండేటట్లు చేసింది. మొత్తం పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. బయోమెట్రిక్తో ఇబ్బందులే ఇప్పటికే బయో మెట్రిక్ వల్ల పింఛను, రేషన్ అందక లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎస్సీ, బీసీ పేదలకు ఇచ్చే రుణాలకు సైతం బయోమెట్రిక్ పెట్టడంతో వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధంగా చంద్రబాబు పాలను చూస్తుంటే దళితులపై కక్ష సాధింపు చర్యగా తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలో వీరే... జన్మభూమి కమిటీలో మొత్తం ప్రస్తుతం నియోజక వర్గంలో 3 ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీ నాయకులే.. కాని ఇప్పుడు కొత్తగా ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, 1 ఎంపీపీ, 1 జెడ్పీటీసీలు అంతా కలిసి ఆరు మంది కాగా గతంలో ఉన్న ముగ్గరితో కలిపి మొత్తం 9 మంది కమిటీలో ఉంటారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామని చెపుతున్నా సీఎం చంద్రబాబు సర్కారు ఈ విధంగా అధికార పార్టీకి చెందిన వారిని కమిటీలో నియమిస్తే అర్హులైన అందరికి ఏ విధంగా రుణాలు వస్తాయని పలువురు విమర్శలు చేస్తున్నారు. దళితులను పూర్తిగా మోసం చేయడమే: పందిటి సుబ్బయ్య, ఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి చంద్రబాబు పాలన చూస్తుంటే ఎవరికి లేని విధంగా దళితులపై కక్ష సాధింపు చర్యలుగా చేపట్టినట్లు ఉంది. ఇచ్చే అరకొర రుణాలకు సైతం బయోమెట్రిక్ పెట్టి రుణాలను ఇవ్వకుండా చేయడానికే ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉంది. ముఖ్యంగా మాదిగలపై బాబు సర్కారు కక్ష సాధింపు చేస్తోంది. జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేయాలి: వాదనాల వెంకటరమణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల చాలా మంది అర్హులైన వారికి రుణాలు అందడం లేదు. దీనికి తోడు 9 మందిని కమిటీ సభ్యులను పెట్టడం అన్యాయం. దళితులకు ఇచ్చే రుణాలను కూడా కమిటీ సభ్యుల వద్దకు వెళ్లి అడుక్కోవాలా.. ఇది ఎక్కడి న్యాయం ..పాలకుల తీరు మారక పోతే కష్టం. -
విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరేకాదు.. మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నింటికీ వర్తింపు ఆధార్తోనూ అనుసంధానం, నిర్వహణకు ప్రత్యేక సర్వర్ చర్యలు చేపడుతున్న విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా అన్ని విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, రవాణా సదుపాయం వంటి ప్రయోజనాలకు కూడా బయోమెట్రిక్ను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిని ఆధార్తోనూ అనుసంధానం చేసి తప్పుడు సమాచారానికి ఆస్కారం లేకుండా, విద్యా ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా చూడాలని భావిస్తోంది. వీటితోపాటు అకడమిక్ అంశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంటి అన్నింటిలోనూ బయోమెట్రిక్ హాజరు, ఆధార్ అనుసంధానంతో పక్కాగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేక సర్వర్ను ఏర్పాటు చేసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) కింద తమకు ఇవ్వాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు విద్యాశాఖ లేఖ రాసింది. ఇప్పటికే పూర్తయిన 60 శాతం ఆధార్ రాష్ట్రంలో ఇప్పటికే 60 శాతానికిపైగా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించిన విద్యాశాఖ.. రెండు నెలల్లో మిగతా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికే 40 లక్షల మందికిపైగా విద్యార్థుల ఆధార్ పూర్తయింది. ఆధార్ నెంబరు లేని వారు తీసుకునేలా చర్యలు చేపట్టాలని అన్ని పాఠశాలల అధికారులు, యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో 25,561 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో మొదట 6,391 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. మిగతా 19,170 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎంత మంది విద్యార్థులకు అందాయన్నది స్పష్టంగా తెలియనుంది. విద్యార్థుల వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు మారే అవకాశం ఉన్నందునా బయోమెట్రిక్ డాటాను ఐదేళ్లకోసారి అప్డేట్ చేస్తామని విద్యాశాఖ తెలిపింది. -
అన్ని కార్యాలయాల్లో ఈ–ఆఫీస్, బయోమెట్రిక్
కలెక్టర్ భాస్కర్ ఏలూరు (మెట్రో) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్, బయోమెట్రిక్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. శనివారం ఈ–ఆఫీస్, బయోమెట్రిక్, క్లీన్ అండ్ గ్రీన్, మే ఐహెల్ప్యు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ–ఆఫీస్ విధానం ద్వారా అవినీతిరహితమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనంలో సేవలు అందించాల్సిన బాద్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద కార్యాలయ ఆవరణలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, ప్రసాదరావు పాల్గొన్నారు -
బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి
టై, బెల్ట్, ఎల్పీజీ గ్యాస్లకు నివేదిక ఇవ్వాలి ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ ఏటూరునాగారం : జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థుల బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ను సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలో డీడీ, డీటీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓలతో టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఎక్కడ వరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. ఏటీడబ్ల్యూఓ జనార్ధన్ సకాలంలో పూర్తి చేసే దిశలో ఉన్నారన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హరితహారం టార్గెట్ పూర్తి చేయాలని, ఇటీవల టార్గెట్ను మరింత పెంచిందన్నారు. దానికి తగ్గట్టుగా మొక్కలు నాటించాలన్నారు. మొక్కలు నాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే పాఠశాలల ఇన్చార్జిలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ట్రైబల్ ఇన్స్ట్యూషన్స్లో రెండు ప్రత్యేక వైద్య బృందాలతో విద్యార్థులందరికీ పరీక్షలు చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులందరికీ టై, బెల్ట్, బ్యాడ్జీలు ఎన్ని అవసరం ఉంటాయో నివేదికలను వెంటనే అందజేయాలన్నారు. విద్యార్థుల యూని ఫాంల కొలతలను కూడా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు ఎన్ని కావాల్సి ఉంటుందోనని తెలపాలన్నా రు. ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని వెల్లడించారు. ఆయన వెంట డీడీ పోచం, ఏటీడబ్ల్యూఓ జనార్ధన్ పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ హాజరుతోనే మెస్ బిల్లులు
– డీడీ యు.ప్రసాదరావు కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుతోనే ఇక నుంచి మెస్ బిల్లులు విడుదలవుతాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో సహాయ సంక్షేమాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. బయోమెట్రిక్ మిషన్లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకొని ఐరిస్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన హాస్టళ్లలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల యూనిఫాంను.. ఆయా హాస్టల్ పాయింట్లలోనే కుట్టించేందుకు అవసరమైన క్లాత్ను సహాయ సంక్షేమాధికారులు తీసుకువెళ్లాలన్నారు. ట్యూటర్లు, ప్లేట్లు, గ్లాసులు.. ఇతర అవసరమైన వస్తువుల కోసం ప్రతిపాదనలను అందించాలన్నారు. వసతి గృహాలు విలీనం అయిన దృష్ట్యా టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఎంల వివరాలను తనకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ప్రకాష్రాజు, సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్రెడ్డి, నాగభూషణం, లక్ష్మయ్య, శ్రీరామచంద్రుడు, గోవిందప్ప, జాకీర్హుసేన్ పాల్గొన్నారు. -
సమయ పాలనకు సరైన పరిష్కారం
– అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ డివైజ్లు – పంచాయతీల్లోనూ సత్వర ఏర్పాటుకు ఆదేశం – అన్ని శాఖల అధికారులకు జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ డివైజ్లు ఏర్పాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏఏ శాఖల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా ఎన్నిటికి అవసరం, గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ సిస్టమ్ అమలుతీరు తదితర అంశాలపై సమీక్షించారు. మొదటి విడత కింద 339 పంచాయతీల్లో బయోమెట్రిక్ డివైజ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు మూడు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాలు, 18 పంచాయతీల్లో మాత్రమే ప్రక్రియ పూర్తికావడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. 60 బయోమెట్రì క్ డివైజ్లు సరఫరా అయినప్పటికి 21 మాత్రమే ఏర్పాటు చేయడం తగదన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసే మిషన్లో బయోమెట్రిక్ ఇవ్వాలన్నారు. సత్వరం అన్ని పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పాలన పాదర్శకంగా ఉండటానికి, ప్రతి ఒక్కరు సమయపాలన పాటించడానికి ఇవి అత్యవసరమని తెలిపారు. ఇంతవరకు బయోమెట్రిక్ డివైజ్లు ఏర్పాటు చేసుకోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో సత్వరం ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు బయోమెట్రిక్లు ఏర్పాటు చేసుకున్నామని ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎంలు ఇక్కడే బయోమెట్రిక్లు ఇస్తారని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ తెలిపారు. అన్ని మండల సమాఖ్యల్లో ఏర్పాటు చేశామని, డీఆర్డీఏ సిబ్బంది ఇందులో వేలిముద్రలు ఇస్తారని పీడీ రామకష్ణ తెలిపారు. పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 148 బయోమెట్రిక్ డివైజ్లను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అన్ని శాఖల కార్యాలయాల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని శాఖలతో సమన్వయం చేయాలని జేడీఏను ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీఆర్ఓ గంగాధర్గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఆసరా’కు బయోమెట్రిక్ చేటు!
వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కంటిచూపు, చేతి వేళ్ల ముద్రలకు నో అయోమయంలో పింఛన్ దారులు దుబ్బాక రూరల్: బయోమెట్రిక్ సహకరించక పోవడంతో ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కంటిపాపల (ఐరిస్) నమోదు కాకపోవడంతో వారు పింఛన్ కు అర్హతను కోల్పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధులకు, అంధులకు సహకరించని కారణంగా పింఛన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఇతరులకు ప్రభుత్వం ఆసరా పింఛన్ అందిస్తోంది. ఇటీవల మీసేవ ద్వారా ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికెట్ కోసం నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హత ఉండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పింఛన్ పొందారు. బయోమెట్రిక్ నమోదుకోసం చేతి వేళ్లతోపాటు, కంటి చూపు నమోదు చేసుకోవాలి. వృద్ధులు, అంధులకు బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఆధారు కార్డు నమోదు కోసం అన్ని నమోదైతే ఇప్పుడు ఎందుకు నమోదు చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 ఏళ్లుదాటిన వారిలో చాలామందికి కంటిచూపు అంతగా కనిపించదు. కొంతమంది వికలాంగులకు సగం కంటి చూపు ఉంటుంది. సాంకేతిక సమస్య నుంచి తమను బయట పడేసి పింఛన్ వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. -
విమానాశ్రయంలో పటిష్ట భద్రత కోసం..
చెన్నైః భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ చైన్నై విమానాశ్రయంలో బయోమెట్రిక్ యాక్సెస్, బ్యాడ్జింగ్ విధానాలను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ డైరక్టర్ దీపక్ శాస్త్రి తెలిపారు. ఈ విధానం ద్వారా మొత్తం విమానాశ్రయ సిబ్బందికి ప్రత్యేక అనుమతి లభించడంతోపాటు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించే అవకాశం లేకుండా ఉంటుందని ఆయన వివరించారు. విమానాశ్రయంలో ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ల్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయంతో సిబ్బంది లోనికి ప్రవేశించేందుకు తనిఖీలు చేపడుతున్నారు. స్టాఫ్ ఐడీ కార్డును బట్టి వారు సిబ్బందిని లోనికి అనుమతిస్తున్నారు. అయితే ఇలా వ్యక్తిగత తనిఖీలకు బదులుగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల అనేక రకాలుగా ఉపయోగం ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించడంతో ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వ్యక్తుల కళ్ళు, వేలి ముద్రల ఆధారంగా ఈ బయోమెట్రిక్ గుర్తింపును ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఐడీ కార్డుల వల్ల వ్యక్తులు, వాహనాల ప్రవేశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకే బయోమెట్రిక్ పద్ధతి అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించే ప్రతి ద్వారం, ప్రవేశం వద్దా బయోమెట్రిక్ మెషీన్ ను ఏర్పాటు చేస్తామని, సిస్టమ్ అనుమతించిన తర్వాతే వీరు లోపలికి వెళ్ళగల్గుతారని, వారి కార్డు ధృవీకరణ డేటాబేస్ సర్వర్ లో నమోదవుతుందని, దీనిద్వారా ఇతరులు ప్రవేశించే అవకాశం తగ్గి భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు అనేక సందర్భాల్లో బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బయోమెట్రిక్ సిస్టమ్ భద్రతకు మరింత సహకరించగలదని అధికారులు ఆశిస్తున్నారు. -
బడిలో బయోమెట్రిక్!
♦ వేలిముద్రలతో ఉపాధ్యాయుల హాజరు నమోదు ♦ తొలిసారిగా 25శాతం పాఠశాలల్లో ఈ విధానం అమలు ♦ చర్యలకు ఉపక్రమించిన జిల్లా విద్యాశాఖ ♦ 570 పాఠశాలలను ఎంపిక చేయాలని ఎంఈఓలకు ఆదేశం ♦ నిధుల సర్దుబాటు చేయాలని కలెక్టర్కు డీఈఓ లేఖ ఉపాధ్యాయుల హాజరుపై విమర్శలకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోంది. టీచర్ల హాజరుశాతం తక్కువగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన సుప్రీంకోర్టు బృందం సైతం ఈ రకమైన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా స్వీకరించింది. ఈ క్రమంలో వీటిని అరికట్టి టీచర్ల హాజరుశాతం మెరుగుపర్చేందుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఎస్ఎస్ఏ పీడీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తొలుత జిల్లాలోని 25శాతం పాఠశాలల్లో ఈ ప్రయోగాన్ని అమలు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 2,287 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,591 ప్రాథమిక, 249 ప్రాథమికోన్నత, 447 ఉన్నత పాఠశాలలున్నాయి. ఎస్పీడీ ఆదేశాల మేరకు 2016-17 విద్యా సంవత్సరంలో 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. 37 మండలాల్లో 570 పాఠశాలల్లో ఈ ప్రయోగాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఒక్కో మండలానికి గరిష్టంగా 15పాఠశాలలను ఉంపిక చేయాల్సిందిగా డీఈఓ రమేష్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆయా పాఠశాలల ఎంపిక అనంతరం మిషన్లు కొనుగోలు చేసేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. వీటికి నిధులను సర్దుబాటు చేసేందుకు ఆయన కలెక్టర్కు లేఖ రాశారు. ఆధార్తో అనుసంధానం.. బయోమెట్రిక్ మిషన్లలో హాజరుకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వేలిముద్రలు ఇవ్వాల్సిన పనిలేదు. సదరు ఉపాధ్యాయుల ఆధార్ వివరాలను ఎంట్రీచేసి సేవ్ చేస్తే వారి వేలిముద్రలు అందులో నిక్షిప్తం అవుతాయి. ప్రస్తుతానికి ఈ మిషన్లు కొనుగోలు చేసి ఆయా పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. వాస్తవానికి ఈ మిషన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయుల హాజరు తీరు క్షణాల్లో సెంట్రల్ సర్వర్లో నిక్షిప్తమవుతుంది. కానీ చాలావరకు పీఎస్, యూపీఎస్లలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీంతో హాజరు తీరును పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. -
హాజర్..హడల్
♦ కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు కచ్చితం ♦ 75శాతం అటెండెన్స్ లేకుంటే ఫీజురీయింబర్స్మెంట్ కట్ ♦ పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల్లో టెన్షన్ ఇకపై హాజరు పక్కా.. కాబోతోంది. రిజిష్టర్లలో తప్పుడు వివరాలు, విద్యార్థుల సంఖ్యను అదనంగా చూపడం సాధ్యం కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమోట్రిక్ యంత్రాల ద్వారా అటెండెన్స్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడుతుండడంతో..ఇకపై అసలు వ్యవహారం బయటపడనుంది. నిర్దేశించిన అటెండెన్స్ లేకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం నిలిచిపోనుండడంతో ప్రైవేట్ యాజమాన్యాల్లో.. హాజరును బట్టే పోస్టులు ఉంటాయనే ఆదేశాలు ఉండడంతో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల్లో గుబులు మొదలైంది. ఖమ్మం : పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హులకే దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరును నమోదు చేయబోతున్నారు. విద్యార్థుల హాజరును బట్టే..అసలు ఎందరున్నారనేది తేలనుంది. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇకపై ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఒకేషనల్ కళాశాలల్లో కూడా పూర్తిస్థాయిలో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల సంఖ్యను బూచిగా చూపించి ఫీజు రీయింబర్స్మెంట్ కాజేసే పలు కళాశాలల యాజమాన్యాలకు మాత్రం ఇది కొరకరాని కొయ్యగా మారింది. వీటి అమలుపై ప్రభుత్వం కఠినంగానే ఉండడంతో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు భయం పట్టుకుంది. గవర్నమెంట్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య సక్రమంగా లేకపోవడంతో క్లాసులు చెప్పినా, చెప్పకపోయినా గతంలో నడిచింది. కానీ..ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను పెంచితేనే అక్కడ కళాశాల, అధ్యాపకుల పోస్టులు ఉండే పరిస్థితి నెలకొంది. పోస్టులను కాపాడుకోవాలంటే..విద్యార్థుల సంఖ్యను రిజిస్టర్లకే పరిమితం చేయకుండా హాజరుశాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులు కళాశాలకు హాజరుకాకపోయినా రిజిస్టర్లలో తప్పుడు హాజరును చూపి..ఫీజు రీయింబర్స్మెంట్ను వసూలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇకపై సక్రమంగా చదవాలనే ఉద్దేశం ఉన్న విద్యార్థులే కళాశాలలో చేరే వీలుంటుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. డిగ్రీలో ఆన్లైన్ ద్వారా ప్రవేశాల కోసం చేసిన దరఖాస్తుల్లో కనీసం 20శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని, మిగతా కోర్సుల కాలేజీల్లోనూ బయోమెట్రిక్ పెడితే అసలు హాజరుశాతం ఎంతనేది తేలనుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమర్చడం సంతోషకరం. దీంతో చదువుకోవాలనే ఆలోచన ఉన్న విద్యార్థే కళాశాలలో చేరతాడు. అధ్యాపకులకు బాధ్యత పెరుగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అర్హులైన విద్యార్థులకే అందుతాయి. 75 శాతం హాజరున్న విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంది. విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలన్నింటిలో బయెమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశాం. - ఆండ్రూస్, డీవీఈఓ -
కళాశాలల్లోబయోమెట్రిక్
♦ పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం ♦ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేవెళ్ల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సిబ్బంది, విద్యార్థుల హాజరులో మరింత పాదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నారుు. ఇవి కాకుండా ఐదు ఎరుుడెడ్, 12 ఆదర్శ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి అధ్యాపకులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతాన్ని నమోదు చేసుకున్నారు. ప్రతి కళాశాలలో 4 సీసీన కెమెరాలు, బయోమెట్రిక్ పరికరం ప్రతి జూనియర్ కళాశాలలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేవెళ్ల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గదిలో, కళాశాల ముఖద్వారం వద్ద (ఎంట్రెన్ ్స), స్టాఫ్ రూం, ఒకేషన్ లో బిల్డింగ్లో ఒకటి చొప్పున ఏర్పాటుచేశారు. భద్రత పరంగా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. సీసీ కెమెరాల పుటేజీలను ప్రిన్సిపాల్ గదిలో నుంచి పర్యవేక్షించవచ్చు. పెరగనున్న హాజరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సమయపాలన పాటించడానికి బయోమెట్రిక్ విధానం ఉపకరించనుంది. ఉదయం 9:45 గంటలకు కళాశాల ప్రారంభం కానుంది. ఆలోపే.. అంటే 9.30 నుంచి 9.40 వరకు మాత్రమే బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు నమోదుచేయాల్సి ఉంటుంది. కళాశాలల వేళలు ముగిసే సమయానికి సాయంత్రం 3.50 నిమిషాలనుంచి 4 గంటలవరకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ యంత్రం ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంటుందని ఇంటర్బోర్డు నిబంధనల్లో పొందుపరిచారు. అధ్యాపకులతోపాటుగా ఇతర సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యార్థులు కూడా బయోమెట్రిక్ పరికరంలో హాజరును నమోదుచేసుకోవాలి. విద్యార్థుల హాజరుశాతం మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రం ద్వారా అధ్యాపకులు, విద్యార్థులలో జవాబుదారీతనం, బాధ్యత మరింత పెరుగుతుంది. విద్యార్థులు హాజరుశాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రతిష్ట పెరుగుతుంది. ఇది మంచి ప్రయోగం. సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం. - ఎం.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల -
స్మార్ట్ సర్వేకు సన్నద్ధం
ఇళ్లకు ఫొటోలు, మనుషులకు బయోమెట్రిక్ వేలిముద్రలు కొత్త ఇంటి నంబర్లు, కంటిపాపల నమోదు ఆధార్ లేని వారికి వెంటనే మంజూరు బొండపల్లి, విజయనగరంలో నేటినుంచి శాంపిల్ సర్వే విజయనగరం కంటోన్మెంట్: మీ ఇంట్లో ఐదేళ్ల లోపున్న పిల్లలకు ఆధార్ నంబర్ లేదా? మీ ఇంట్లో ఇంకెవరికయినా బ్యాం కు అకౌంట్ లేదా?? అయితే నిశ్చింతగా ఉండొచ్చు. ప్రభుత్వం మంగళవారం నుంచి స్మార్ట్పల్స్ సర్వే ప్రారంభించనుంది. జూలై 6 నుంచి జరగనున్న సర్వేకు పైలట్గా జిల్లాలోని బొండపల్లి మండలంలోని ఓ గ్రామం, విజయనగరంలోని ఓ వార్డులో మంగళవారంనుంచి మొదలవుతుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బృందాలు ఇందుకోసం ఇళ్లనూ సందర్శించి మొత్తం 75 రకాల అంశాలపై సర్వే చేపడతాయి. ఇందుకోసం 31 బ్లాకులుగా విభజించి వాటికి 31 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఈ సందర్భంగా సర్వేలో బ్యాంక్ అకౌంట్ లేని వారిని గుర్తిస్తే వారికి వెంటనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, ఐదేళ్ల లోపున్న వారికి ఆధార్ సంఖ్య లేకపోతే కొత్తగా నంబర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించారు. ఈ పైలట్ సర్వే ఈ నెల 30 వరకూ ఉంటుంది. సర్వే వాస్తవాలను తెలియజేస్తుందా? జిల్లాలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమంంలో వాస్తవమయిన సర్వేను చేపడతారా అన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలు సర్వేలు చేపట్టినప్పటికీ ఒకే ఇంటి వద్ద కూచుని లేదా సర్పంచ్లు, ఎంపీటీసీల ఇళ్ల వద్ద కూచుని తెలిసిన వివరాలను రాసేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు కూడా ఇలానే ఉంటుందా లేక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సక్రమంగా చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ప్రజల్లో ఇంకా చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌకర్యాలపై ఆరా... ఈ సర్వేలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలున్నాయి? ఏయే సౌకర్యాలు లేవు. అత్యవసరంగా కావాల్సినవేమిటన్న అంశాలను పొందుపరుస్తారు. జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలనూ ట్యాబ్లలో బంధిస్తారు. వీటిని ఇంటర్నెట్కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రతీ కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు సంబంధించి వివిధ స్థాయిల్లో కుటుంబాల వివరాలున్నాయి. ఆయా వివరాలతో కలగలిపిన నూతన సర్వే అంశాలను పొందుపరచి వీటిని సిద్ధం చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా పథకాలు ప్రవేశపెడితే... వాటికి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తెలియజేసేందుకు, ఈ వివరాలు ఉపయోగపడతాయి. ఇందుకోసం కలెక్టరేట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ల విధానాన్ని అమర్చుతున్నారు. -
దగాకోరు ప్రభుత్వమిది
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పామిడి : రాష్ర్ట్రంలో దగాకోరు పాలన సాగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో శుక్రవారం చలో గుంతకల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండేళ్లయినా ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఉన్న మక్కువ బాబుకు ప్రజా సమస్యలపై లేదన్నారు. నవ నిర్మాణదీక్షలు, మహాసంకల్పం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటూనే రెండేళ్లలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు రూ.200 కోట్లు ఖర్చు చేశారన్నారు. బయోమెట్రిక్ విధానంలో విత్తన వేరుశనగ కాయల పంపిణీ చేపట్టడం వల్ల అర్హులైన రైతులకు విత్తనం అందలేదన్నారు. అన్ని పంటలకు ఫసల్ బీమాను వర్తింపజేయాలన్నారు. పామిడిలో 964మంది పేదలకు ఇళ్ల స్థలాలకు అందజేస్తామని జాబితా సిద్ధం చేసినా ఇంతవరకూ సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర ఈ నెల 20న గుంతకల్లు ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆఫీసు కార్యాలయం వద్దకు చేరుకుంటుందన్నారు. నియోజకవర్గ ప్రజాసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ కార్యదర్శి డీ శ్రీనివాసులు, సీపీఎం మండల కార్యదర్శి పీ అనిమిరెడ్డి, రైతుసంఘం మండల నాయకులు చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
తప్పదు.. టైంకు రావాలి
♦ ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ♦ పైలట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలం బషీరాబాద్ : ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా టైంకు ఆఫీసుకు రావాల్సిందే. సాయంత్రం ఇంటికి సైతం పనిగంటలు ముగిశాకే వెళ్లాలి. ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించిన అధికారులు పెలైట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలాన్ని ఎంపిక చేశారు. -
బడిని బతికిద్దాం..
♦ ఈ ఏడాది నుంచే స్కూళ్లలో బయోమెట్రిక్ ♦ 25 శాతం పాఠశాలలకు వర్తింపు ♦ బడిబాటలో ఐదు శాతం విద్యార్థుల నమోదు పెరగాలి ♦ ఆ తర్వాత రేషనలైజేషన్పై నిర్ణయం డిప్యూటీ సీఎం ప్రకటన అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ బడు లకు ఊపిరిలూదేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడికి ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ యేడు 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఈ యేడు బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చే శారు. - పాపన్నపేట పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యాప్రమాణాలే కాదు విద్యార్థుల సంఖ్యా తగ్గిపోతోందని, ఫలితంగా పాఠశాలలు మూతబడుతున్నాయంటూ ఇటీవల తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరఫున సాగర్రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో గత నెల 30న జిల్లాలోని సిద్దిపేట, నంగునూర్ మండలాల్లో మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలను సుప్రీం కోర్టు బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా బాగా పనిచేసే టీచర్లను నియమించి, బడులను మళ్లీ తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు శాతాన్ని, సమయపాలనను క్రమబద్ధం చేసి, పర్యవేక్షణను మెరుగు పరిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం శ ుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యక్తమైంది. బయోమెట్రిక్తో జవాబుదారీతనం... బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, సమయపాలన మెరుగుపడుతుందని నిజామాబాద్, వరంగల్ కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్కు రూ.7,500నుంచి రూ.8వేల వర కు ఖర్చు వస్తుందన్నారు. మొదటివిడతగా 25 శాతం బడుల్లో ఈ యేడు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తామని కడియం ప్రకటించారు. పీఎస్, యూపీఎస్లకు సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ రకంగా జిల్లాలో సుమారు 600 పాఠశాలల్లో బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. 5 శాతం అదనపు నమోదు లక్ష్యం... శుక్రవారం నుంచి ప్రారంభమైన బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా నమోదు చేయాలని డిప్యూటీ సీఎం శ్రీహరి సూచించారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులను, ఎస్ఎంసీలను, స్వచ్ఛంద సంస్థలను, ఎమ్మెల్యేలను, అవసరమై తే మంత్రులను భాగప్వాములను చేయాలని సూచిం చారు. బడిబాట కార్యాచరణను ఖరారు చేసే అధికా రం కలెక్టర్లకు అప్పగించారు. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను, జిల్లా డెవలప్మెంట్ ప్లాన్ ను జిల్లా అధికారులు రూపొందించాలని ఆదేశించారు. బడిబాట తర్వాత రేషనలైజేషన్... పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్ అంశాన్ని మెదక్ కలెక్టర్ రోనాల్డ్రోస్ ప్రస్తావించగా, బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు శాతంపై అవగాహన వస్తుందని, ఆ తర్వాతే రేషనలైజేషన్పై నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. అలాగే ప్రాథమిక స్థాయిలో స్నేహబాల పథకాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. సకాలంలో వీవీల నియామకం ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు త్వరలో విద్యా వలంటీర్లను నియమిస్తామని కడియం తెలిపారు. ఎక్కడైనా సింగిల్ టీచర్ సెలవుపై వెళ్తే సదరు పాఠశాల మూతబడకుండా వెంటనే వీవీలను అక్కడకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరి నియామకంపై కలెక్టర్లకు అధికారాలిస్తామన్నారు.