case file
-
తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై కేసు నమోదు
తిరుపతి,సాక్షి : తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఎస్వీ యూనివర్సిటీలో కేసు నమోదైంది. బాధితురాలు లక్ష్మి ఈనెల 9న ఎస్వీ యూనివర్సిటీలో కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా, ఎస్వీ యూనివర్సిటీ సీఐ రామయ్య ఎఫ్.ఐ .ఆర్ 22/2025. కింద 420,417,506 ఐపీసీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ యాక్ట్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేయడంతో పాటు,చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మహిళకు ఫ్లయింగ్ కిస్.. ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. అనుచిత హావభావాలు, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆప్కు ఓటు వేయాలని ఓటర్లు కోరారు. ఈ క్రమంలో ర్యాలీలో ఓ మహిళతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చూస్తూ సైగలు చేశారు. అనంతరం, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పందంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. తాజగా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టి తెలిపారు.दिल्ली के संगम विहार में शर्मनाक घटना!आम आदमी पार्टी के विधायक प्रत्याशी दिनेश मोहनिया ने अपने रोड शो के दौरान भाजपा चुनाव कार्यालय के बाहर रोड शो रोककर हूटिंग की और महिलाओं को गंदे-गंदे इशारे किए। pic.twitter.com/1lVYsV9gSy— Panchjanya (@epanchjanya) February 3, 2025 ఇక, ఎన్నికల్లో ర్యాలీలో దినేష్ మోహానియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. దినేష్ మోహానియా సంగం విహార్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరోసారి తన నియోజకవర్గం నుండి పోటీలో నిలిచారు.Dinesh Mohaniya’s lack of respect for women is evident in his actions during the road show. This kind of behavior reflects poorly on his leadership and party. #आप_के_चरित्र_हीन_प्रत्याशीpic.twitter.com/tL9EmmZGbK— kinal (@kinal3418) February 3, 2025మరోవైపు.. మోహానియా వివాదాలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం, తన నియోజకవర్గంలోని రోడ్డు పక్కన పండ్ల వ్యాపారిపై దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా తన వాదనను సమర్థించుకుంటూ, పండ్ల వ్యాపారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. ఎందుకంటే అతను మురుగు కాలువ ముందు తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, దీనివల్ల పౌర కార్మికుల పనికి ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. -
చిన్మయ్ కృష్ణదాస్పై కేసుల మీద కేసులు.. తాజాగా
ఢాకా : బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లోని పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్ కృష్ణదాస్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అంతకు ముందు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై నవంబర్ 27న కొత్వాలి పోలిస్ స్టేషన్లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. -
Karnataka: బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్ పుతిల పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసులు వివరాల ప్రకారం.. 2023 జూన్లో బెంగళూరు హోటల్లో బీజేపీ నాయకుడు అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు.మహిళ ఫిర్యాదు మేరకు దక్షిణ కన్నడ జిల్లాలో అరుణ్ కుమార్పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, బెదిరింపులు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన పుతిల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన కాషాయ పార్టీలో చేరారు. -
పూణే తరహాలో మరో హిట్ అండ్ రన్.. బైకర్ మృతి
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్(17) ఎస్యూవీ కారును రాంగ్ రూట్లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్పై ఉన్న నవీన్ వైష్ణవ్(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్ వైష్ణవ్ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ను అరెస్ట్ చేశారు. మైనర్ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆర్జీ కార్ ఆస్పత్రి.. మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్పై కేసు నమోదు
కోల్కతా: కోల్కతా ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై కేసు నమోదైంది. ఆర్జీ కార్ ఆస్పత్రి హత్యోదంతంలో సందీష్ ఘోష్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సందీష్ ఘోష్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయా? అన్న కోణంలో కోల్కతా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఆస్పత్రిలో సందీష్ ఘోష్ తన అధికారాన్ని ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్లో పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పరిశీలనలో ఉండగా.. తాజాగా కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. సందీష్ ఘోష్ 2021లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అవినీతి జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిట్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ప్రణబ్ కుమార్ నేతృత్వంలోని సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఆగస్టు 9న ఆర్జీ కార్లో జరిగిన దారుణంతో సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. దుర్ఘటన జరిగిన రెండు రోజులకే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడం.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోల్కతా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా సందీప్ ఘోష్ను 53 గంటల పాటు విచారించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే కోల్కతా పోలీసులు సందీప్ ఘోష్ అవినీతికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. సందీష్ ఘోష్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు ఘోష్ను మరే ఇతర వైద్య కళాశాలలో నియమించవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదు
-
ఎవరి సంతోషం కోసం మూడేళ్లకు అక్రమ కేసు?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే 2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి 2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా? టార్చర్ చేయనేలేదు రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ముందే కల గన్నారా? రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్ను, డాక్టర్ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా? చట్టపరంగానే ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆ కేసు నమోదు చేసింది. -
భూ కుంభకోణం.. సీఎం సిద్దరామయ్య భార్యపై కేసు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరొకరిపై పోలీసులకు కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ కర్ణాటక గవర్నర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ ఇతర ప్రభుత్వ, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో 2004లో అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సీఎం సతీమణి పార్వతి, మల్లికార్జున్, మరో వ్యక్తి ఈ పత్రాలను ఉపయోగించి ముడాకు చెందిన కోట్లాది రూపాయలను మోసం చేశారని ఆరోపించారు.తన ఫిర్యాదుపై పోలీసులు అంగీకారపత్రం అందించారని, కానీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినందున ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆమె చెప్పారు.తన ఫిర్యాదు మేరకు ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పోలీసులను కోరారు.కాగా 2021లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో సిద్దరామయ్య భార్య ముడా ఆర్డర్కు లబ్ధిదారుగా ఉన్నందున భూ కేటాయింపుల కుంభకోణం వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన 3.16 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించినందుకు పరిహారంగా... మైసూరులోని ప్రధాన ప్రదేశాలలో 38,284 చదరపు అడుగుల భూమిని తనకు కేటాయిచారు. మైసూరులోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకోగా.. పార్వతికి 2021లో బీజేపీ దక్షిణ మైసూర్లోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ 3, 4వ దశ లేఅవుట్లలోని సైట్లను ఆమెకు పరిహారం చెల్లించింది, ఇది కేసరే గ్రామంలోని అసలు భూమి కంటే చాలా ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి.అయితే, ఈ కేటాయింపును గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొంటూ సిద్ధరామయ్య సమర్థించారు. కేసరెలోని దేవనూరు 3వ స్టేజీ లేఅవుట్లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో విజయనగరంలో ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించాలని ముడా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. -
తిరువూరు: కొలికపూడి అరాచకం.. కేసు నమోదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదైంది. నిన్న(మంగళవారం) జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై కేసు నమోదు చేసిన ఏ.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 60 మందికిపైగా పోలీసులు గుర్తించారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. -
సౌత్ గ్లాస్ కంపెనీపై కేసు
షాద్నగర్ (హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనపై షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు పరిశ్రమ యాజమాన్యంపై 304, 336, 337, 338, 287 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి తెలిపారు. మరోవైపు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది ఇమ్మనేని రామారామా జాతీయ మానవహక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్పై చర్యకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, పేలుడు ఘటనపై నిష్ణాతులైన పోలీసు క్లూస్టీం పేలుడు సంభవించిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ల్యాబ్కు పంపించింది. ల్యాబ్ నివేదిక వచి్చన వెంటనే పోలీస్ స్టేషన్కు పంపిస్తామని క్లూస్ టీం సభ్యులు తెలిపారు. -
యడ్యూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి
బెంగళూరు: బీజేపీ సీనియర్నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మరణించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని సమాచారం. బెంగళూరు డాలర్సిటీలోని యడ్యూరప్ప ఇంటికి ఈ ఏడాది ఫిబ్రవరి2న తన కూతురుతో కలిసి వెళ్లానని, ఈ సందర్భంగా తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని మహిళ కేసు పెట్టింది. దీంతో మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్స్టేషన్లో యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళకు శ్వాససంబంధ సమస్య రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగికదాడి కేసును ప్రస్తుతం కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కేసు పెట్టిన యువతి తల్లి మరణించినప్పటికీ ఆమె స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే లైంగికదాడి ఆరోపణలను యడ్యూరప్ప అప్పట్లో ఖండించారు. -
ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల షాద్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు వేసినట్టేనంటూ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తంచేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్ కింద నమోదుచేశారు. -
అడ్డంగా దొరికిన ‘మార్గదర్శి’.. కేసు నమోదు
సాక్షి,విశాఖపట్నం: మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శి సీతంపేట అకౌట్ అసిస్టెంట్ వీ లక్షణ్రావు, ఆఫీస్ బాయ్శ్రీనులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా మంగళవారం తనిఖీల్లో మార్గదర్శి సీతంపేట బ్రాంచి నుంచి రూ. 52 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సాంబశివరావుపై కేసు నమోదుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాంబశివరావుతోపాటు మరో ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 ముద్దాయిగా ఎమ్మెల్యే సాంబశివరావు ఉన్నారు. చదవండి: దొంగ ఓట్లు... ‘పచ్చ’ నోట్లు -
కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. జరిగింది ఇదే!
సాక్షి, జనగామ: తనపై ఫిర్యాదు నమోదవ్వడంపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన కూతురు తుల్జాభవాని సంతకం ఫోర్జరీ చేయలేదని పేర్కొన్నారు. కూతురు పేరు మీదనున్న ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జాభవాని పేరుపై 125 నుంచి 150 గజాల వరకు భూమి ఉందని, అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. అయితే దీనిని తన కుమారుడు నామమాత్రంగా కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. అంతేగాని ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని చెప్పారు. సదరు ఆస్తి కూతురు పేరు మీదే ఉండటం వల్ల కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య అని.. ఏ కుంటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమేనని తెలిపారు. కూతురిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా గిట్టనివారు దీనిని వివాదంగా మార్చారని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారని, తమ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వివాదలు సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వలంటీర్పై టీడీపీ కార్యకర్తల దాడి..
వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్ షేక్ అష్రాఫ్ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్ అష్రాఫ్ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు. ఆదివారం రాత్రి వలంటీర్ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్ఖాన్ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్æపై దాడికి దిగారు. షఫీ కత్తితో దాడి చేయడంతో వలంటీర్కు గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్పై శుక్రవారం మెరైన్లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కేరళ హైకోర్టులో మోహన్ లాల్కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్లాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిపై..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోటి విద్యార్థిని దుర్భాషలా డుతూ దాడిచేసిన దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వర్సిటీకి చెందిన స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే కొట్టాడు: కాగా బండి కుమారుడిపై కేసు నమోదైన విషయం తెలిశాక...అతని చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా మంచిగానే ఉన్నామని చెప్పాడు. -
పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది. చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం) -
సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. -
మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఇలాంటి రైడ్స్ నా జీవితంలో చూడలేదు
సాక్షి, హైదరాబాద్: సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల వ్యాఖ్యలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని.. ఎవరి విధులకు అడ్డుపడలేదని చెప్పారు. వందకోట్లు బ్లాక్మనీ ఉన్నట్లు రాసి నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్ చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 'తప్పులు చూపిస్తే ఫైన్ కడతాం.. మేము దొంగలమా? ఇంత అరాచకమా?. నాకొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా మాకు చెప్పలేదు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ ఉంటాయి. ఎన్నిరైడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డిపై కేసు నమోదు అంతకుముందు, మల్లారెడ్డిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్తో ఈ కేసును దుండిగల్ పీఎస్కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్విత్ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: (మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’) -
ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియపై 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్తో కలిసి ఆమె ఆర్కేబీచ్కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ప్రియుడు రవితో కలిసి సాయిప్రియ పరారైన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం పెద్ద ఎత్తున బీచ్లో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో సాయిప్రియ భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ రామారావు వెల్లడించారు. చదవండి: (నేను రవితోనే ఉంటా..సాయిప్రియ) -
జనసేన పీఏసీ చైర్మన్, నాయకులపై కేసు నమోదు
సిద్దవటం (కడప జిల్లా): కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్పై ఈ నెల 19న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోమర్ సమక్షంలో జరిగిన దాడికి సంబంధించి.. నాదెండ్ల మనోమర్ సహా తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్తోపాటు నాగేంద్ర అనుచరులైన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 19న సిద్దవటంలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేసి చొక్కా చింపి చెప్పుతో కొట్టి అవమాన పరిచారన్నారు. బా«ధితుడి ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్, తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం) -
Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని
సాక్షి, ఏలూరు: సొంత ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోడిపందేలు నిర్వహించడం ఇబ్బందిగా మారడం.. తన ఆటలు ఇక్కడ సాగకపోవడంతో చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ వైపు రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. పఠాన్చెరు మండలంలో చింతమనేని ప్రభాకర్ వారం క్రితం కోడిపందేలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. దీంతో చింతమనేని పరారైన తరువాత చివరిగా ఆయన మొబైల్ సిగ్నల్ శంషాబాద్లో చూపించి, అక్కడ కట్ అయింది. ఇతర రాష్ట్రాలకు పరారై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చింతమనేని దౌర్జన్యకాండ ఇదే.. నిజానికి.. చింతమనేని దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, దౌర్జన్యాలకు దిగడం ద్వారా వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ► అతనిపై ఇప్పటివరకు మొత్తం 60 కేసులున్నాయి. పెదవేగి ఎంపీపీగా ఉన్నప్పుడే 10 కేసులు నమోదయ్యాయి. రెండు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి. ►గతంలో ఎస్ఐలుగా పనిచేసిన ఆనంద్రెడ్డి, మోహనరావులపై, అంగన్వాడీ కార్యకర్తలపై బూతు పురాణం, దౌర్జన్యం చేసిన ఘటనలో కేసు, తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి దాడిచేసిన కేసు వీటిల్లో ముఖ్యమైనవి. అలాగే.. ► 2010లో ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో చింతమనేనిపై తెరిచిన రౌడీషీట్ నేటికీ కొనసాగుతోంది. ► గతంలో అప్పటి రాష్ట్రమంత్రి వట్టి వసంత్కుమార్పై దాడిచేసిన కేసు కూడా ఉంది. ► చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దెందులూరు నియోజకవర్గాన్ని కోడిపందేలు, పేకాటకు అడ్డాగా మార్చేశాడు. ► 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా తన వ్యవహారశైలి మారకుండా అదే రీతిలో కొనసాగుతూ పందేలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాడు. చదవండి: (చింతమనేనిదే పందెం కోడి!) -
Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య) -
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన రాజాసింగ్పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. చదవండి: (రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే) అయితే గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
వివాదంలో సీమాన్.. 300 మంది పార్టీ నాయకులపై కేసులు
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళనాడు కోసం ప్రత్యేక జెండా ఎగుర వేయడంతో ఆయపై కేసు నమోదు చేశారు. సీమాన్కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయనపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ప్రత్యేక తమిళనాడు నినాదంతో జెండాను సిద్ధం చేయించారు. సోమవారం సేలంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు కోసం ప్రత్యేక జెండా అని ప్రకటించడంతో పాటు ఎగుర వేశారు. ఈ చర్యను అధికారులు తీవ్రంగా పరిగణించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమాన్పై మంగళవారం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమానికి హాజరైన నలుగురు మహిళలు సహా 300 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు. చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్) -
రెండేళ్ల క్రితం పెళ్లి.. పిల్లలు కాలేదని డాక్టర్ దగ్గరకెళ్తే.. తను మహిళే కాదని..
సాక్షి, గుంటూరు ఈస్ట్: మోసపూరితంగా ట్రాన్స్జెండర్తో పెళ్లిచేసి, ఆపై బెదిరింపులకు దిగిన ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతగుంటూరుకు చెందిన యువకుడికి తాడికొండకు చెందిన యువతితో 2019లో పెళ్లయింది. ఎంతకూ పిల్లలు కలగకపోవడంతో ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో యువతి మహిళ కాదని, ట్రాన్స్జెండర్ అని నిర్ధారణ అయింది. దీంతో ఇదేమిటని ప్రశ్నించిన యువకుడిని మామ, అత్త, భార్య కలిసి బెదిరించారు. దీంతో పాత గుంటూరు పోలీసులకు బుధవారం బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి) (కూతురు బాధ చూడలేఖ.. ఓ తండ్రి ఆత్మహత్య) -
పోసానిని దుర్భాషలాడుతూ దుండగుల వీరంగం
-
కార్పొరేటర్ భర్త పెండ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి,వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త పెండ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీనిపై పోలీసులు స్పందించి లిక్కర్డాన్తోపాటు కార్పొరేటర్ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు చేసి ఐదు రోజుల కావస్తున్నా కేసులో పురోగతి లేదు. పోలీసులపై రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడీలు పెరగడంతో చేసేది ఏమీలేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం.. సంపన్నులకు మరో న్యాయమా అంటూ బయట నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుల ఆచూకీ తెలిసినా వారిని అరెస్టు చేయలేక జంకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.. కేసులో పురోగతి ఏదీ..? కేసులో పురోగతి కనిపించకపోవడంతో పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిందితులకు పలుకుబడి ఉండటం, అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. 24గంటల్లోనే ఛేదించాల్సిన ఈకేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తండ్రీకొడుకులపై కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా పురోగతి లేదు. కేసుల నుంచి తండ్రీకొడుకులు బయటపడేందుకు రాజీమార్గాన్ని ఉపయోగించి బాధిత యువతిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికార పార్టీ నేతలు, వారి అనుచరులను రంగంలోకి దించి ఆ యువతి ఇంటికి వెళ్లి పలుమార్లు సయోధ్యకు యత్నిస్తున్నట్లు తెలిసింది. నెల రోజులు తిరుగుతున్నా నన్ను పట్టించుకోకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతూ దిక్కున్న చోట చెప్పుకో అనడం వల్లే పోలీసులను ఆశ్రయించానని, ప్రస్తుతం తాను చేసేది ఏమీలేదని ఆ యువతి వారితో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి తాళం.. కేసు నుంచి ఎలాగైన బయటపడాలని లిక్కర్డాన్, కార్పొరేటర్ భర్త విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తరుచుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి పలు మార్లు చర్యలు జరపడంతో విసుగెక్కిన ఆ యువతి మంగళవారం ఉదయాన్నే ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. గాలింపు ముమ్మరం.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు. బంధువుల ఇళ్లలో ఉండి బాధితురాలితో రాజీయత్నంతో పాటు బేల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల సైతం కేసును సవాలుగా స్వీకరించి ఎలాగై నిందితులను అరెస్ట్ చేయాలని పక్కా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. ఏ క్షణనైనా పట్టుకునే అవకాశం లేకపోలేదు. బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏసీపీ గిరికుమార్ను వివరణ కోరగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి.. -
సినీ నటి పాయల్ రాజపుత్ పై కేసు నమోదు
-
పాయల్ రాజ్పుత్పై కేసు నమోదు
సాక్షి, పెద్దపల్లి: సినీనటి పాయల్ రాజ్పుత్పై కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. (చదవండి: జగిత్యాలలో పాయల్ రాజ్పుత్ సందడి) -
అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు
-
సోషల్ మీడియాలో డిలీట్ చేశాం అనుకోకండి, స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే
‘సరేలే బోండాం’ ‘నువ్వూ నీ తారుడబ్బా ముఖమూ’ ‘ఉఫ్పున ఊదితే ఎగిరిపోతావ్’ ఎవరినైనా ఉద్దేశించి ఇలా బాడీ షేమింగ్ చేయడం నేరం. సోషల్ మీడియాలో చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కాని కోలకతా నటి శ్రుతి దాస్ పోలీస్ కంప్లయింట్ పెట్టింది. రంగు నలుపు అంటూ ఆమె పై చేసే వ్యంగ్య వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరాయి. మీ మిత్రులు ఇలాంటి కూతలు కూస్తుంటే మీరు హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. హేళన చేయడం ద్వారా మనిషి కొంత ఆనందం పొందుతాడు. అయితే ఆ ఆనందం వికృత స్థాయికి చేరుకుంటే ఏం చేయాలి? హేళన ద్వారా మనిషిని బాధించడం, హాస్యం పుట్టించడం ఇవాళ చాలా వ్యాపారం అయిపోయింది. టీవీలలో వస్తున్న చాలామటుకు కామెడీ షోలు స్త్రీలను, వారి రూపాలను, వారి నడవడికను, లైంగిక ప్రవర్తనలను హేళన చేసేవే. బాడీ షేమింగ్ (శరీర అవయవాలను అవమానించడం), కలరిజం (శరీర వర్ణాన్ని బట్టి కామెంట్ చేయడం) నిజానికి ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆ సంగతి తెలియక చాలామంది సోషల్ మీడియాలో విమర్శ పేరుతో హేళన చేస్తున్నారు. అలాంటి వారు ఇబ్బందుల్లో పడక తప్పదని కోలకటాలో తాజా ఘటన నిరూపించింది. అక్కడి టీవీ నటి శ్రుతి దాస్ తన రంగు తక్కువ అంటూ హేళన చేస్తున్న వారిపై కేసు పెట్టింది. ఏం జరిగింది? కోల్కటాలో టీవీ నటిగా ఉన్న శ్రుతి దాస్ గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘త్రినయని’ అనే టీవీ సీరియల్ హిట్ అయ్యింది. ‘నేను ఆ సీరియల్ దర్శకుడితో అనుబంధంలో ఉన్నాను. కాని సోషల్ మీడియాలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా రంగు గురించి ప్రస్తావన చేస్తూ నన్ను హేళన చేస్తున్నారు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో నల్లగా ఉన్నవారిని ‘కాలో’(నల్లది), ‘మోయిలా’ (మాసినది) అని హేళన చేసేవాళ్లుంటారు. విమర్శ చేయాలంటే ఏ పాయింట్ లేనప్పుడు ఇలా రంగునో రూపాన్నో ప్రవర్తననో ముందుకు తెచ్చి కామెంట్ చేసి బాగా అన్నాం అని చంకలు గుద్దుకుంటారు కొందరు. కాని అలాంటివారిని వదిలేది లేదని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే సోషల్ మీడియాలో మనం ఏదైనా కామెంట్ చేస్తే దానికి శిక్షలు పడవనుకుంటే పొరపాటు. బాధింపబడినవారు పోలీస్ కంప్లయింట్ చేస్తే అలాంటి వారిని వెంటనే చట్టపరంగా శిక్షించడానికి కేసు నమోదు అవుతుంది. కొందరు కామెంట్ చేసి ఆ తర్వాత దానిని డిలీట్ చేయవచ్చు. కాని ఈలోపు ఆ బాధితులు ఆ కామెంట్ను స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. హేళన కూడా ఒక అణచివేత సాధనమే. ఎదుటివారిని అణచివేయడానికి హేళనను ఆయుధంగా వాడుతారు. కాని అలాంటి రోజులు పోయాయి. స్త్రీలను, వృద్ధులు, వికలాంగులను, ఇంకా ఎవరినైనా గాని రూపాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, నేపథ్యాన్ని బట్టి హేళన చేస్తే, మనసు గాయపరిస్తే, అగౌరవపరిస్తే వారంతా చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ‘కాళీ మాత కూడా నల్లగానే ఉంటుంది. ఆమెను కొలుస్తాం మనం. కాని హేళన సమయంలో మాత్రం ఎదుటివారిని నల్లగా ఉన్నారని అంటాం. ఇది ఎంత తప్పో అందరూ ఆలోచించాలి’ అని శ్రుతి దాస్ అంది. ‘నలుపు నారాయణమూర్తే గాదా’ అని ఒక దేశీయగీతం ఉంది. ఏ రంగైనా ప్రకృతి దృష్టిలో ఒకటే. సంస్కారలోపం ఉన్నవారే వర్ణఅంతరాన్ని చూస్తారు. -
ఉద్యోగానికి డబ్బులు ఎదురివ్వాలా?!
‘‘మేడమ్, మా కంపెనీ లో మీకు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే మా నిబంధనలన్నీ పాటించాలి. మీకు కొన్ని పేపర్స్ పంపిస్తాం. వాటి మీద మీరు సంతకాలు చేయాలి. అలాగే, మీ జాబ్ కన్ఫర్మ్ అనడానికి మీరు మా కంపెనీ అకౌంట్లో పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలి. మీ వర్క్ పట్ల మా కంపెనీ పూర్తి సంతృప్తికరంగా ఉంటే మీకు పదిహేను రోజుల్లో మీరు చేసిన డిపాజిట్ నుంచి 50 శాతం తిరిగి మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాం’’ అంటూ వచ్చిన ఫోన్కాల్తో ఆలోచనల్లో పడిపోయింది కల్పన. కల్పనకు పెళ్లయ్యి మూడేళ్లు. భర్త వంశీతోపాటు తనూ జాబ్ చేస్తోంది. కరోనా వల్ల ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇంతలో... ‘వర్క్ఫ్రమ్ హోమ్.. ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.50,000 వరకు సంపాదించవచ్చు’ అని వచ్చిన ఆన్లైన్ లింక్ కల్పనను ఆకట్టుకుంది. ఇది తనకు వచ్చిన పనే. ఇంటినుంచే చేయవచ్చు. డబ్బు బాగానే వస్తుంది. కానీ, తన వర్క్ వాళ్లకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తూనే.. లింక్ ఓపెన్ చేసి, తన వివరాలన్నీ ఇచ్చింది. మరుసటిరోజే కంపెనీ నుంచి ఫోన్..! నమ్మకంగా రిటర్న్ ఇంకేమీ ఆలోచించకుండా పదివేలు వారు చెప్పిన అకౌంట్కు ఆన్లైన్లో పే చేసి, జాబ్లో చేరిపోయింది. సదరు కంపెనీవారు చెప్పినట్టుగా లాప్టాప్ ఏర్పాటు చేసుకుంది. కంపెనీ లింక్ నుంచే ఫైల్స్ వస్తున్నాయి. రోజూ రెండు ఫైళ్లు. వాటిని రీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. పెద్ద పనేమీ కాదు. రోజుకు మూణ్ణాలుగు గంటలు కేటాయిస్తే చాలు. పదిహేను రోజులైంది. కల్పన అకౌంట్కు వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి రూ.5000 రిటర్న్ రావడంతో ‘కంపెనీ నమ్మకమైంది, అనవసరంగా నేనే డౌట్ పడ్డాను’ అనుకుంది కల్పన. మరింత జాగ్రత్తగా కంపెనీ చెప్పిన మేరకు పనులు చేస్తూ ఉంది. తప్పులకు చెల్లించిన మూల్యం ఇంకో పది రోజుల్లో నెల జీతం వస్తుందనగా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మేడమ్, మీరు కంపెనీకి రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది’ ఫోన్ సారాంశం వినగానే డీలా పడిపోయింది కల్పన. తను చేసిన టైపింగ్లో వచ్చిన మిస్టేక్స్కి చెల్లించే మూల్యం అది. మిస్టేక్స్ జరిగితే రీ పే చేయాలని ముందే మాట్లాడుకున్నారు. అలా అని తను సంతకం కూడా చేసింది. ఎంత జాగ్రత్తగా చేసినా అలా ఎలా జరిగిందో అర్ధం కాలేదు. కల్పన పంపిన ఫైల్స్లో మార్క్ చేసి, కంపెనీ నిర్వాహకులు తిరిగి పంపిన ఫైల్స్లో మిస్టేక్స్ నిజమే. ముందే చేసుకున్న ఒప్పందం. లేదంటే లాయర్ నోటీసులు తప్పవు’ అని హెచ్చరికలు వస్తున్నాయి. కల్పనకు భయం వేసి ఆ నంబర్ను బ్లాక్ చేసింది. కాసేపటికి ఇంటర్నేషనల్ కాల్. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న కల్పనకు ‘అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోనందుకు మీ మీద కేసు ఫైల్ అయ్యింది. లాయర్ నుంచి నోటీస్ ఇష్యూ అయ్యింది’అని. కల్పనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. కోర్టులు, లాయర్లు, కేసులు.. అంటూ నిలువెల్లా భయం ఆవరించింది. ‘ఆ కంపెనీ వారితో నే రాజీ కుదుర్చుతా.. లేదంటే అనవసర సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఎంత త్వరగా పరిష్కరించుకుంటే మీకే అంత లాభం’ అనడంతో కల్పన బెంబేలెత్తిపోయింది. ఒక్కరోజు టైమ్ ఇస్తే డబ్బు చెల్లిస్తానని మాట ఇచ్చి, భర్తకు తెలియకుండా బంగారం తాకట్టు పెట్టి, ఆ డబ్బులను సదురు అకౌంట్కు సెండ్ చేసింది. ∙ వాట్సప్లోనే బెదిరింపు అంతా! సైబర్ నేరగాళ్లు తక్కువ మొత్తం నుంచే ఎక్కువ మంది దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇలా ఎత్తుగడ వేస్తున్నారు. ఉద్యోగం కోసం అంటూ ఇచ్చే లింక్స్లో వివరాలన్నీ తీసుకొని, మరో కొత్త నేరానికి పాల్పడే అవకాశాలూ ఉంటాయి. ఫ్రాడ్ చేసేవారు దాదాపుగా వాట్సప్ ఫోన్లు చేస్తారు. అంతర్జాతీయ ఫోన్ నెంబర్లు వాడుతుంటారు. వర్క్లో ఎర్రర్స్, మిస్టేక్స్ వారే సృష్టిస్తారు. ఏ తరహా ఆన్లైన్ ఉద్యోగాల్లో చేరాలనుకున్నా పేరున్న కంపెనీ, అది రిజిస్టర్ అయిన సంవత్సరం.. వంటి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ క్రెడిబులిటీ ముఖ్యం మా దగ్గర ఇలాంటి కేసులు ఫైల్ కాలేదు. కానీ, ఏ మార్గాల్లో డబ్బులు రాబట్టాలనే విషయమ్మీదే సైబర్ నేరగాళ్ల ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. ఇంటి వద్ద ఉండి ఆన్లైన్ వర్క్ చేసినా సదరు కంపెనీకి పని చేసినట్టు ఆధారాలు ఉండాలి. ఆ కంపెనీ గురించి తెలిసినవారి ద్వారా పూర్తి వివరాలు సేకరించుకోవాలి. జాబ్ కాంట్రాక్ట్ ఫైల్ తీసుకోవాలి. అలా ఇవ్వలేదంటే అది ఫేక్. కేసు ఫైల్ చేశామనో, ఫలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నామనో బెదిరింపుల ద్వారా డబ్బులు లాగడం, ఇతర వేధింపులకు గురిచేస్తున్నారనిఅనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
రిసెప్షన్ ఫంక్షన్: నూతన దంపతులపై కేసు
తొగుట(దుబ్బాక): తొగుట మండలం చందాపూర్లో లాక్డౌన్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసెప్షన్ నిర్వహించిన పది మందిపై గురువారం కేసు నమోదు చేసినట్టు తొగుట ఎస్సై శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై, పోలీసులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. రిసెప్షన్ నిర్వహించుకుంటున్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేశామన్నారు. నూనె మహేశ్ (26) ఎ1, నూనె మౌనిక (25) ఎ2, టెంట్ హౌజ్ నిర్వాహకుడు నర్సెట్టి ఎల్లం (28) ఎ3, ఆత్మకూరి శ్రీనివాస్ (35) ఎ4, పాడలా విజయ (28) ఎ5, నూనె సుబధ్ర (60) ఎ6, జనగామ సుభాష్గౌడ్ ఎ7. బొడ్డు స్వామి (38) ఎ8, బొడ్డు భూమయ్య (42) ఎ9, నర్సెట్టి సురేష్ (35) ఎ10 పై క్రైం నంబర్ 82/2021 యూ/ ఎస్ 341, 186, 188, 269 మరియు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు తప్ప రిసెప్షన్, పుట్టిన రోజు ఇతర ఫంక్షన్లకు ఎలాంటి అనుమతి లేవన్నారు. లాక్డౌన్ మరియు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఫంక్షన్లు చేసుకునే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే -
‘రాధే’ పైరసీ: ముగ్గురు సోషల్ మీడియా యూజర్లపై కేసు
గతవారం ఓటీటీలో విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీప్లెక్స్లో పే పర్ వ్యూ విధానంలో విడుదలైంది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చిది. దీనిపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ పైరసీ కారులపై మండిపడ్డాడు. మూవీ పైరసీకి పాల్పడిన వారిపై సైబర్ సెల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించాడు. అంతేగాక జీ5 సంస్థ సైతం దీనిపై సెంట్రల్ సైబర్ సెల్కి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.. ఇదిలా ఉండగా ఈ మూవీ పైరసీ కేసులో గుర్తుతెలియని ముగ్గురు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు తాజాగా సైబర్ సెల్ పోలీసులు వెల్లండించారు. వీరిలో ఇద్దరు వాట్సాప్ యూజర్లు, ఒక ఫేస్బుక్ ఖాతా దారుడు ఉన్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుని ఫేస్బుక్లో డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా విక్రయించేందుకు అతడు ఆఫర్ చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాధే చిత్రం పైరసీ వెర్షన్ వివిధ ఆన్లైన్ ప్లాట్ఫాంపై లీకైన వెంటనే జీ5 నిర్మాత తమ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఇద్దరు వాట్సప్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఖాతా దారులను గుర్తించామన్నారు. ప్రస్తుతం తమ టీం మరి కొందరి ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైందని తెలిపారు. చదవండి: ‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్, సల్మాన్ ఫైర్ -
పెళ్లి బరాత్: వరుడిపై కేసు నమోదు..
సాక్షి, మెదక్: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వివాహ బరాత్ నిర్వహించినందుకు గాను వరుడితో పాటు అతని తండ్రి, డీజే సౌండ్ సిస్టం యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్లను సీజ్ చేశారు. ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు వివాహం జరగగా శనివారం రాత్రి గ్రామంలో ట్రాక్టర్తో డీజే సౌండ్ సిస్టం పెట్టి ఎక్కువ మందితో భౌతిక దూరాన్ని పాటించకుండా బరాత్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. ఈమేరకు డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్లను సీజ్చేశారు. వరుడు నర్సింహులు, వరుడి తండ్రి సాయిలు, డీజే సౌండ్ సిస్టం యజమాని ఇటిక్యాల రవిపై కేసు నమోదు చేశారు. చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా -
దేవినేని ఉమాపై సీఐడీ కేసు
సాక్షి, కర్నూలు : సీఎం వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం కర్నూలు జిల్లా లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నారాయణరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడడంతోపాటు నకిలీ వీడియోను ప్రదర్శించారని.. దాన్ని తన ట్విట్టర్లోనూ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం అనని మాటలను అన్నట్లు మార్ఫింగ్ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. చదవండి: (పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్) -
డైరెక్టర్ శంకర్పై నిర్మాతల కేసు!
‘ఇండియన్ 2’ షూటింగ్ను దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్ కెరీర్ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్ 2’లో హీరోగా నటిస్తున్న కమల్హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్ కూడా రామ్చరణ్తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్కు షాక్ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్కు డైరెక్టర్గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘ఇండియన్ 2’ బడ్జెట్ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్ తమ పిటిషన్ లో పేర్కొందని కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. -
సెకండ్వేవ్ అలర్ట్: తెలంగాణలో మళ్లీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థన స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణ: ‘సెకండ్ వేవ్’.. ఆందోళనొద్దు!) ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశంలో మళ్లీ కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. చదవండి: (అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?) -
పెళ్లికి అతిథులుగా వెళ్లి కేసుల్లో ఇరుక్కున్నారు
థానే: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో పాటు చాలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా 50 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కానీ ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ థానే జిల్లాలోని కల్యాణ్లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్ డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పెళ్లి మార్చి 10న జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని తెలియగానే కేడీఎంసీ అధికారులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారని, అప్పుడు అక్కడ 700 మంది వరకు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పెళ్లికి హాజరైనవారు మాస్కులు ధరించలేదని, భౌతికదూరం సహా ఎలాంటి కోవిడ్–19 నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. దీంతో పెళ్లి జరిపించిన రాజేశ్ మాత్రే, మహేశ్ రావూత్లపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే గత పది రోజుల్లో కరోనా నిబంధనలు పాటించని 1,131 మంది నుంచి రూ.5,64,900 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) -
అమ్మానాన్నలపై కేసు పెట్టిన పుత్రరత్నం
లండన్: అవకాశం ఇస్తే అమ్మానాన్న మీద పడి బతికేవాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది ఇది చదివితే. ఏదో కాలో చెయ్యో సరిగ్గా లేదనుకుంటే సరే. కానీ అన్నీ ఉండీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పొంది కూడా తల్లిదండ్రులపైనే భారంమోపాలని భావిస్తున్నారు నాలుగు పదులు దాటిన ఓ పుత్రరత్నం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ళ దుబాయ్కి చెందిన ఫయాజ్ సిద్దిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపై ఓ విచిత్రమైన దావా వేశారు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకి ఆర్థిక సాయం చేయాలంటూ సదరు కుమారుడు కోర్టుకెక్కారు. ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోయాలంటూ కేసుపెట్టారు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పారు సిద్దిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్టేనంటారీయన. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్దిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని కూడా చేశారు. అయితే 2011 నుంచి ఈయన నిరుద్యోగిగా ఉన్నారు. అంతేకాదు తనకి ఫస్ట్క్లాస్ రాకపోవడానికి ఆక్స్ఫర్డ్యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపై కూడా మూడేళ్ళ క్రితం దావా వేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టీచింగ్ బాగాలేదని, అది తన కెరీర్కి నష్టం చేసిందని సిద్దిఖీ వాదించారు. లండన్లోని హైడ్ పార్క్లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తమ ఫ్లాట్లో తమ కొడుకుని 20 ఏళ్ళుగా ఎటువంటి అద్దె లేకుండా ఉచితంగా ఉండనిస్తున్నామని సిద్దిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్లు చెప్పారు. అంతేకాదు సిద్దిఖీ తల్లిదండ్రులు, తమ కొడుకు బిల్లులు కట్టడమే కాకుండా, ప్రతి వారం కొంత అదనంగా పంపిస్తున్నారు. అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్దిఖీకి చేస్తోన్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తుండడంతో సదరు కుమారుడు తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నారు. మెయింటెనెన్స్ కోరుతూ సిద్దిఖీ దాఖలు చేసిన పిటిషన్ని గత ఏడాది ఫామిలీ కోర్టు తోసిపుచ్చింది. యిప్పుడది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది. -
పోలీస్స్టేషన్లో షణ్ముఖ్ రచ్చరచ్చ
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా ఒకరు గాయాలపాలైన ఘటనలో టిక్టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని ఉడ్స్ అపార్ట్మెంట్స్ నుంచి తన కారులో మద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఓ స్కూటరిస్ట్కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు షణ్ముక్ కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారు దెబ్బతిన్న విజయ్ ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే సాఫ్ట్వేర్ డెవలపర్ పేరుతో ఓ వెబ్సిరీస్లో నటించిన అతడు యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందాడు. పోలీస్స్టేషన్లో కూడా షణ్ముఖ్ రచ్చరచ్చ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఒక్కో ఎపిసోడ్కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా అంటూ దబాయించాడు. రెండు గంటల పాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం.. బిగ్బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! -
నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్
ముంబై: బాలీవుడ్ చిత్రం ‘ఎంఎస్ ధోని’ నటుడు సందీప్ నహార్(32) నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబైలోని అతడి నివాసంలో సందీప్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలీవుడ్లో కలకం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు అతడు ఫేస్బుక్లో పోస్టు చేసిన సూసైడ్ నోట్లో అతడి భార్య కాంచన, ఆమె తల్లి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే భార్య కాంచనపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని కూడా నోట్లో రాసుకొచ్చాడు. కానీ బుధవారం పోలీసులు అతడి భార్య, అత్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... సందీప్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడి భార్య కాంచన శర్మ, ఆమె తల్లి విను శర్మలపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయడం లేదా విచారించడం కానీ చేయలేదన్నారు. అయితే సందీప్ సూసైడ్ నోట్లో భార్యపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని రాశాడు కదా అని అడిగిన ప్రశ్నను పోలీసులు కొట్టిపారేశారు. కాగా సందీప్ మంగళవారం ఉదయం గోరెగావ్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ ఓ వీడియోతో పాటు సూసైడ్ నోట్ను కూడా పోస్టు చేశాడు. ‘నా భార్య కాంచనతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో సంతోషాలను, దు:ఖాలను, కష్టాలను చూశాను. అయితే వాటిన్నంటిని ఎదుర్కొన్నాను. ఇక నావల్ల కాదు. మరణించే సమయం వచ్చింది. ఇక నాకు బతకాలన్న ఆశ లేదు. ఎన్ని రోజులని చివాట్లు, ఆసహ్యానలను భరించాలి. నాకంటూ సెల్ఫ్రెస్పెక్ట్ ఉంటుంది. నా భార్య చాలా కోపిష్టి. తన స్వభావమే అంతా. రోజు పొద్దున్నే సాయంత్రం, రాత్రిళ్లు తనతో వాదించే శక్తి ఇక నాకు లేదు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘బాలీవుడ్ సినీ పరిశ్రమలో రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యా. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: భార్య వేధింపులు.. బాలీవుడ్ నటుడు ఆత్మహత్య) -
కోయిలమ్మ నటుడు అమర్ అరెస్ట్
కోయిలమ్మ సీరియల్ హీరో అమర్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతోఇటీవల స్వాతి తన భాయ్ఫ్రెండ్ కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్ -
‘కోయిలమ్మ’నటుడు అమర్పై కేసు
గచ్చిబౌలి: బోటిక్ పెట్టిన స్నేహితురాళ్లు నష్టం రావడంతో ఘర్షణ పడి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా కోయిలమ్మ సీరియల్ కథానాయకుడు అమర్పై కేసు నమోదైంది. రాయదుర్గం సీఐ ఎస్.రవీందర్ వివరాల ప్రకారం.. స్నేహితులైన శ్రీవిద్య, రష్మీదీప్ మణికొండలోని సిద్ధిసాయి కాలనీలో షాపు అద్దెకు తీసుకొని బోటిక్ పెట్టారు. నష్టం రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోగా శ్రీవిద్య బోటిక్ను నిర్వహిస్తోంది. రూ. 5 వేల విలువ చేసే కుట్టు మెషిన్ బోటిక్లో వదిలి వేశానని స్నేహితులైన స్వాతి, తేజ, బుల్లితెర నటుడు అమర్, హర్ష బుధవారం రాత్రి 8 గంటలకు మణికొండకు వెళ్లి కుట్టు మెషిన్ ఇవ్వాలని అడిగారు. ఇంటి వద్ద ఉందని చెప్పడంతో శ్రీవిద్య స్నేహితురాళ్లు అపర్ణ, లక్ష్మీలతో పాటు రష్మీకి మద్దతుగా వచ్చిన వారందరు స్ప్రింట్ రివర్ షేడ్ అపార్ట్మెంట్కు వెళ్లారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షన నెలకొంది. అసభ్యంగా దూషించి దాడికి పాల్పడ్డారని శ్రీవిద్య రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. తమను కూడా దూషించి దాడి చేశారని స్వాతి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
సాధినేని యామినిపై పోలీస్ కేసు
సాక్షి, తిరుపతి: ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు. (కరోనాతో భార్యాభర్తలు మృతి.. మరో ఆరుగురికి కూడా..) ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తాజా రాజకీయ పరిణామాలపై కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. -
బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అల్లర్లలో ముగ్గురు మరణించగా.. 200 కార్లు దగ్దమయ్యాయి. డీజే హళ్లి పోలీస్ స్టేషన్ను నాశనం చేసి తగులబెట్టారు దుండగులు. ‘పోలీసులను చంపేయండి’ అంటూ ఆయుధాలు కలిగిన నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45గంటలకు డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం బయట దాడులకు పాల్పడ్డారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో అల్లర్లు చెలరేగాయి. (రాజుకున్న రాజధాని) పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలు.. 1. రాత్రి 8:45 గంటలకు, ఐదుగురు వ్యక్తులు అర్ఫాన్, ఎస్డీపీఐకి చెందిన ముజ్జామిల్ పాషా, సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్తో పాటు 300 మంది వీధుల్లోకి వచ్చారు. వారి చేతిలో మాచెట్స్, రాడ్లు వంటి ఆయుధాలు కలిగి ఉన్నారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. 2. వారు ‘పోలీసులను చంపండి, వారిని విడిచిపెట్టవద్దు’ అని నినాదాలు చేశారు. నిరసనకారులు పోలీసులపై ఇటుకలు కూడా విసిరారు. దాడి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ తలకు గాయమైంది. 3. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ గుంపు అక్కడ నుంచి కదల్లేదు, విధ్వంసం కొనసాగింది. వారు కేజే హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్లలోని వాహనాలకు నిప్పంటించారు. అనంతరం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 4. జనసమూహాన్ని అక్కడి నంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. కాని నిరసనకారులు పోలీసులను ఉద్దేశించి ‘మిమ్మల్ని అంతం చేయకుండా ఇక్కడ నుంచి కదలం’ అని చెప్పారు. వారు బేస్మెంట్ నుంచి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి, ‘హత్య చేయాలనే ఉద్దేశ్యంతో’ పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. 5. ఎఫ్ఐఆర్లో, మూక దాడిలో చిక్కుకున్న పోలీసుల ప్రాణాలను కాపాడటానికి తాము గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక అర్ఫాన్, ముజ్జామిల్ పాషా (ఎస్డీపీఐ), సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్ కేఎస్ఆర్పీ ప్లాటూన్ల నుంచి తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపారు. వారిని అరెస్ట్ చేశాము అని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 6. సాయుధ గుంపు పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు రువ్వడంతో ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆ తర్వాత మరో 59 మంది గాయాలపాలయ్యారు 7. దుండగులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆపి ఉంచిన వాహనాలను తగలబెట్టడం ప్రారంభించగానే, ఒక పోలీసు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో నిరసనకారులు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి తలుపులు, కిటికీలు పగలగొట్టారు. పోలీసులను అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముఠా పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అనంతరం అదనపు దళాలు రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితులను అరెస్ట్ చేశారు. (అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ) కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్లో జరిగిన హింసాకాండకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. హింసాకాండకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. -
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు
సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మంది మీద హిమాచల్ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడిని మండి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ చౌదరిగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అంబులెన్స్లో శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు కాన్సా, తన్వా గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అంబులెన్స్ను అడ్డుకున్నారు. దాంతో సుమన్ చౌదరితో పాటు మిగతా వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు పోలీసులు. సుమన్ చౌదరి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఓ వైపు కాంగ్రెస్ నాయకులు కరోనాను ఓడించండి.. మానవత్వాన్ని బతికించండి అంటూ ప్రచారం చేస్తుండగా.. మరో వైపు సుమన్ చౌదరి కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
యడ్యూరప్పకు లేఖ రాసిన డీకే శివకుమార్
బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పెట్టిన ఎఫ్ఐఆర్ను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకి లేఖ రాశారు. దాంతో పాటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని తెలిపారు. పీఎం కేర్ ఫండ్స్ని ప్రధాని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (సోనియా గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు) ఈ విషయంపై బీజేపీ కార్యకర్త, అడ్వకేట్ కేవీ ప్రవీణ్ కుమార్ సోనియాపై శివమొగ్గలో ఫిర్యాదు చేశారు. దీంతో సోనియా మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక ముఖ్యమంత్రికి, హోం శాఖా మంత్రికి, డీజీపీకి, శివమొగ్గ సూపరింటెండెంట్కి లేఖలు రాశారు.సోనియా గాంధీ ఒక ఎంపీగా నిధులు సక్రమంగా వినియోగించాలని సూచిస్తూ ఆ ట్వీట్ చేశారని, కానీ బీజేపీ నేతలు దానిని తప్పుగా అర్ధం చేసుకొని కేసు నమోదు చేశారని శివ కుమార్ పేర్కొన్నారు. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) -
చైనాపై ఐసీజేలో కేసు వేయాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను సృష్టించిన చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) కేసు దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ వైరస్ను చైనా ఉద్దేశపూర్వకంగానే తయారు చేసిందని, నష్టపరిహారంగా 600 బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేయాలని పిటిషనర్ కె.కె.రమేశ్ కోరారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వందలాది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని ‘వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో రూపుదిద్దుకుంది అనేందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని ఆ పిటిషన్లో రమేశ్ వివరించారు. -
టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై కేసు
-
రజనీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశిస్తుందా?
సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతారా? ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే నటుడు రజనీకాంత్ గత జనవరిలో జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ పెరియార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో డ్రావిడ కళగం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పెరియార్ సీతారాముల చిత్ర పటాన్ని విసిరేశారని రజనీకాంత్ అన్నారు. ఈయన వ్యాఖ్యలు పెద్ద వివాదానికే దారి తీశాయి. హిందూ సంఘాలు, రజనీకాంత్ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేశారు. అయితే అందుకు రజనీకాంత్ నిరాకరించడంతో పాటు ఈ అంశంపై చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కాగా రజనీకాంత్ వ్యాఖ్యలు మతసామరస్యానికి చేటు అని మతాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయంటూ స్థానిక ట్రిప్లికేన్కు చెందిన డ్రావిడన్ విడుదలై కళగం చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి జనవరి 18వ తేదీన ట్రిప్లికేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్కమిషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. అక్కడ స్పందించకపోవడంతో ఉమాపతి చెన్నై, ఎగ్మూర్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: పార్టీ ఏర్పాటులో రజనీ మరో అడుగు కాగా ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి రోశ్విన్దురై సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు హాజరై నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలదో మతసామరస్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, ఆయనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాబట్టి రజనీకాంత్పై కేసు నమోదు చేసేలా పోలీస్కమిషనర్కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.దీంతో రజనీకాంత్ వ్మాఖ్యల వల్ల రాష్ట్రంలో గొడవలేమీ జరగలేదుగా అని న్యాయమూర్తి అడిగారు. అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదులు పెద్దగా గొడవుల జరగలేదు గానీ, పుదుచ్చేరిలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, ఇలాంటి నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఇటీవల ఢిల్లీలో అల్లర్లు జరిగాయని వివరించారు. దీంతో న్యాయమూర్తి రజనీకాంత్పై కేసు నమోదు చేయాలని గానీ, కుదరదని గానీ చెప్పకుండా సోమవారానికి విచారణను వాయిదా వేశారు. దీంతో సోమవారం న్యాయస్థానం రజనీకాంత్పై ఎలాంటి తీర్పును ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది. చదవండి: ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్ -
కశ్మీర్ నేతలకు మరోషాక్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ)లపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్–పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వారిద్దరి ఆరు నెలల ముందస్తు నిర్బంధం ముగియడానికి కొన్ని గంటల ముందు వారిపై ఈ కేసు పెట్టడం గమనార్హం. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019, ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆ ఇద్దరు నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులతో పాటు వచ్చిన మెజిస్ట్రేట్ సంబంధిత నోటీసులను వారి నివాసాల్లో ఆ ఇద్దరు నేతలకు అందించారు. ఆ ఇద్దరితో పాటు శ్రీనగర్లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
లైంగిక వేధింపులు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
లక్నో : బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే షా అలంపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగిక వేధింపులకు గురిస్తున్నాడన్న ఓ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. యూపీలోని ముబారఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షా అలం.. గత కొంత కాలంగా స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతతేకాక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని కూడా అతను బెదిరిస్తున్నారు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సీరియస్గా స్పందించిన ముబారఖ్పూర్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం యూపీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. -
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రాంమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడ్డ మంత్రి మల్లారెడ్డిని తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని సూచించారు.(ఎంపీ అర్వింద్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్) ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలని చూసిన మంత్రి మల్లారెడ్డిపై.. అలాగే టికెట్లు కొనుక్కోవాలని చూసిన అభ్యర్థులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అంటున్న కేసీఆర్, కేటీఆర్లు.. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల బలహీనతలే పెట్టుబడిగా .. డబ్బు, మద్యం , ప్రలోభాలతో టిఆర్ఎస్ ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చిన టిఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని సామ రాంమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే కాలు విరిగింది
-
పరిధి పరేషాన్
సాక్షి, సిటీబ్యూరో: రాంకోఠిలో నివాసం ఉండే కారు డ్రైవర్ శిబు తిరువ నడుపుతున్న వాహనం గత నెల 28న అర్ధరాత్రి బంజారా ఫంక్షన్హాల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేయించుకోవడానికి శిబు10 గంటల పాటు నాలుగు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ మూడు ఠాణాలకు చెందిన ఇద్దరు ఎస్సైలు సహా ఐదుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వీరిని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కేవలం ఒక్క శిబుకు మాత్రమే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. అధికారులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన పరిస్థితి మారుతుందా? ఈ పరిధుల చట్రంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న అనేక మంది బాధితులకు న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు ఏ అధికారీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్డిక్షన్లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది నగరంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు.. వీటి పరిధిలో వందకు పైగా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయితే భౌగోళికంగా ఇవన్నీ కలిసే ఉండడంతో ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు.. ఒక్కోసారి ‘గూగుల్ తల్లి’కీ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. పంజగుట్ట, బంజారాహిల్స్, హుమాయున్నగర్ ఠాణాలకు చెందిన ఐదుగురిపై వేటుకు కారణమైన శిబు తిరువ సైతం గత నెల 28న అర్ధరాత్రి మాదాపూర్ నుంచి నాంపల్లికి ప్రయాణిస్తున్నాడు. ఈ తరహా కేసులతో పాటు ఓ ప్రాంతంలో బస్సు ఎక్కిన వ్యక్తి మరో ప్రాంతంలో బస్సు దిగిన తర్వాత అదృశ్యమైనా.. రెండు మూడు ఠాణాల పరిధుల్ని దాటుతూ ప్రయాణిస్తున్న వ్యక్తి పర్సు, సెల్ఫోన్, నగలు, నగదు తస్కరణకు గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలన్నా పరిధుల సమస్య నేపథ్యంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. సాధారణంగా బాధితులు వారు ప్రయాణం ప్రారంభించిన చోట ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటారు. ప్రతి పీఎస్కూ పరిధి... న్యాయస్థానాలతో పాటు ప్రతి పోలీసుస్టేషన్కు జ్యురిస్డిక్షన్గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలా నమోదు చేసిన కేసు వివరాలను తక్షణం తాను ఏ పరిధిలోకి వస్తే ఆ న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ న్యాయవాదులకు ఇది అనుకూలంగా మారి విచారణ సమయంలోనే కేసు వీగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిత్యం పోలీసులు పరిధుల అంశానికి కీలక ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ‘ట్రావెలింగ్’ ఫిర్యాదులను స్వీకరించే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శిబు తిరువ వ్యవహారాన్ని నగర పోలీసు కమిషనర్ అంత సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు చేస్తున్నారు. నెంబర్ లేకుండా నమోదు... బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరాన్ని సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. దీని ప్రతిని పోలీసులు తమ పరిధిలోకి వచ్చే న్యాయస్థానంలో దాఖలు చేస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్ 31కి ‘వినూత్నంగా ఎంజాయ్’ చేయాలని భావించిన కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్ను హైదరాబాద్కు తీసుకొచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన ఆమెను కొండాపూర్లో టికెట్ బుక్ చేసి బస్సులో ముంబై పంపేశారు. 2014 జనవరి 2న అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడం.. 7న ‘జీరో ఎఫ్ఐఆర్’తో కేసు నమోదు కావడం జరిగాయి. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఉదంతం హైదరాబాద్లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును సీసీఎస్కు బదిలీ చేయడంతో ఇక్కడి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మోడల్పై అత్యాచారం నిజాంపేటలో జరిగినట్లు తేలడంతో హైదరాబాద్ పోలీసులు కేసును సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేసి, నిందితుల్ని అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన సైబరాబాద్ అధికారులే అభియోగపత్రాలు సైతం దాఖలు చేశారు. అన్ని కేసులకూ అవకాశం ఈ తరహా ఉదంతాల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సంబంధిత స్టేషన్కు బదిలీ చేసే ఆస్కారం అన్ని రకాలైన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ ఉంది. అయితే అది ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప... ఎక్కడా పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండట్లేదు. ముంబైలోనూ కొన్నిసార్లు అమలుకు నోచుకోవట్లేదు. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధుల పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపట్టాలి. అప్పుడు బాధితుడికి ఊరటగా ఉండటంతో పాటు పోలీసులపై సదభిప్రాయం ఏర్పడుతుంది. కేసు దర్యాప్తు, అరెస్టు తదితరాలన్నీ నేరం జరిగిన ప్రాంతం పరిధిలోకి వచ్చే పోలీసులు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత బదిలీ చేసి, బాధితుడిని ఆ ఠాణాకు పంపినా అతడు ఇబ్బందిగా భావించడు. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ఈ ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు ఎంతో అవసరం. ఈ విధానమే అమలులో ఉండి ఉంటే శిబు తిరువకు అసలు ఇబ్బంది కలిగేదే కాదు. – జైసింగ్, జన్శక్తి ఫౌండేషన్ నిర్వాహకఅధ్యక్షుడు, ముంబై -
14 ఏళ్లు.. 6 హత్యలు
కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు. -
స్విమ్మింగ్ కోచ్పై ‘రేప్’ ఆరోపణలు!
పనాజీ: గురుపూజోత్సవం రోజున దేశంలోని ప్రముఖ ఆటగాళ్లెందరో తమకు ఓనమాలు నేర్పిన శిక్షకులను స్మరించుకుంటున్న వేళ... ఒక క్రీడా గురువు ఆ బాధ్యతకు మచ్చ తెచ్చే పని చేశాడు. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక 15 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించి ఛీ కొట్టించుకున్నాడు! గోవా రాజధాని పనాజీలో ఈ ఘటన జరిగింది. బెంగాల్కు చెందిన సురజిత్ గంగూలీ అనే స్విమ్మింగ్ కోచ్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్లుగా అతను పనాజీలో కోచ్గా వ్యవహరిస్తున్నాడు. బాధిత అమ్మాయి కూడా బెంగాల్కు చెందినదే. ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో గంగూలీ నిర్వాకం తెలిసింది. సదరు అమ్మాయి ఫిర్యాదుపై కోల్కతా పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి దానిని గోవా పోలీసులకు బదిలీ చేశారు. సురజిత్పై వేర్వేరు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రేప్ (376) కూడా ఉంది. ప్రస్తుతానికి సురజిత్ మధ్యప్రదేశ్లోని భోపాల్కు వెళ్లినట్లుగా తెలిసింది. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
నటి అమలాపాల్పై ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: వివాదాలకు చిరునామాగా మారిన నటి అమలాపాల్. ఫిర్యాదులు, కేసు నమోదులు, ఆరోపణలు, విచారణలు ఈ అమ్మడికి కొత్త కాదు. తాజాగా అమలాపాల్ నటించిన ఆడై. ఈ చిత్రం ఇప్పుడు వివాదాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిత్రంలో నగ్నంగా నటించిన దృశ్యాలు, ఫస్ట్లుక్ పోస్టర్లు ఇప్పటికే వివాదంగా మారాయి. అయితే తాను నగ్నంగా నటించడాన్ని నటి అమలాపాల్ సమర్థించుకుంటోంది. ఆడై చిత్ర కథకు అలాంటి సన్నివేశం అవసరం అయ్యిందని, అయితే అవి అసభ్యంగా ఉండవని చెప్పుకుంటోంది. కానీ నగ్నంగా నటించేసి అసభ్యంగా ఉండవనడాన్ని కొందరు హర్షించడం లేదు. కాగా అమలాపాల్ నటించిన ఆడై చిత్రంలోని నగ్న దృశ్యాలు, ఆ చిత్ర పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆడై చిత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆడై చిత్రం రేపు శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ను పొందింది. దీంతో విడుదలకు డోకా లేకపోయినా, ఆ తరువాత ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందో చూడాలి. -
కొండపి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కొండపి: కొండపిలోని కామేపల్లి రోడ్డులో సోమవారం ప్రభుత్వం నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని అబాసుపాలు చేయటానికి కొండపి ఎమ్మెల్యే డీఎస్బీవీఎన్ స్వామి తన అనుచరులతో ప్రయత్నించాడని కొండపి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ వెంకయ్య అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్వామి తన అనుచరులతో వచ్చి సృష్టించిన గలాటాపై మంగళవారం ఆదర్శరైతు దివి శ్రీనివాసులు కొండపి ఎస్ఐ ప్రసాద్కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొండపి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన మంచి కార్యక్రమాన్ని సజావుగా సాగకుండా చేయటం కోసం స్వామి తన అనుచరులతో వచ్చారని ఆరోపించారు. రైతు దినోత్సవం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే స్వామి పరుషపదజాలంతో దూషించారని అన్నారు. ఇది తగదని చెప్పిన రైతుల మీదకు సైతం ఆయన అనుచరులు పైకి దూకారన్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి సంయమనం పాటించకుండా అల్లరిమూకతో వచ్చి నానాయాగి చేయటం తగదన్నారు. జిల్లా మంత్రి బాలినేని సైతం స్వామిని రైతుదినోత్సవంలొ పాల్గొనేలా చూడాలని చెప్పగా తాను పిలవటానికి వెళ్లానని, అప్పటికే గందరగోళం చేసి వెళ్లిపోయాడన్నారు. స్వామి గతంలో గ్రామాల్లో రైతుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించగా ఆరైతులు స్వామిని చూసి ఆందోళన చేశారన్నారు. ఏ ప్రోటోకాల్తో దామచర్ల సత్యను ముందు సీట్లో కూర్చొబెట్టుకుని వెనుక సీట్లో ఎమ్మెల్యే స్వామి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే స్వామి ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా ప్రభుత్వ కార్యక్రమాలను అబాసుపాలు చేయటానికి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. స్వామి తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వినర్ గోగినేని వెంకటేశ్వరరావుతో పాటు పలు గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు
రాజమహేంద్రవరం : అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు నమోదైంది. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు కథనం ప్రకారం.. శంఖవరం గ్రామంలో ఈ నెల 6వ తేదీన విజిలెన్స్ అధికారులు అంగన్ వాడీ కేంద్రం నంబర్ 03ను (ఎస్సీ పేట లో ఉన్న) తనిఖీ చేసి కేంద్రంలో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసిన సరుకులు జూలై నెలకు సంబంధించినవి ఏమీ లేకపోవడం గుర్తించారు. అంగన్ వాడీ కార్యకర్త మేడిద లక్ష్మి సరుకులను ఈ నెల 4వ తేదీన తీసుకొని పీఎఫ్ షాపులో ఉంచామని తెలిపారు. పీఎఫ్ షాపులో తనిఖీ చేసిన అధికారులు అక్కడ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించిన సరుకులు లేకపోవడం, నాలుగో తేదీన లక్ష్మి అంగన్ వాడీ కేంద్రానికి సరుకులు తీసుకువెళ్లినట్టు విచారణలో తేలడంలో ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు. శంఖవరం మండలం అంగన్వాడీ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్లో లక్ష్మిపై సెక్షన్ ఐపీసీ 406, 7 ఈసీఏ (ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు దుర్వినియోగం) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ అంగన్ వాడీ కేంద్రానికి జూలైæ నెలకు సంబంధించిన మొత్తం సరుకులు బియ్యం 130 కేజీలు, పప్పు 29 కేజీలు, ఆయిల్ ఆరు ప్యాకెట్లు, శనగలు 7.5 కేజీలు, ఉప్పు 2 ప్యాకెట్లు, ఉండాల్సి ఉండగా మేడిద లక్ష్మి ఇంటి వద్ద తక్కువగా ఉండడం గమనించారు. విచారణలో లక్ష్మి సరుకులు బయట మార్కెట్లో అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. -
ఒక్కొక్కటిగా బయటపడుతున్న పాపాలు
-
పాపం పండింది
ధనికులు, పేదలనే తేడా లేదు.. తోపుడు బండ్లు, బంగారం వ్యాపారులనే తారతమ్యం లేదు.. మనోళ్లు, పరాయోళ్లనే భేదం లేదు.. ఎవరినీ వదల్లేదు.. ఐదేళ్లపాటు ఎక్కడా అడ్డూఅదుపూ లేదు.. అందినకాడికి దోచుకున్నారు. అన్నింటా పట్టుబట్టి పన్నులు పీకారు. అధికారాన్ని అడ్డుపెట్టి అవినీతి కోటలు కట్టారు. అక్రమ కేసులు పెట్టి అరాచక పాలన సాగించారు. శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధికారం అండతో సత్తెనపల్లి, నరసరావుపేటలో ఆయన బిడ్డలు శివరామ్, విజయలక్ష్మి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. వీరి అరాచకాలను పంటిబిగువున భరించిన బాధితుల కన్నీళ్లు ఇప్పుడు మండాయి. కొత్త ప్రభుత్వమిచ్చిన ధైర్యంతో కోడెల కుటుంబంపై తిరగబడుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాలను పోలీసు మెట్ల వరకు తీసుకెళ్లి.. కేసులు కట్టిస్తున్నాయి. సాక్షి, గుంటూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల, ఆయన కొడుకు, కుమార్తెల వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులంతా ఏకమై తిరగబడుతున్నారు. బలవంతంగా వసూలు చేసిన డబ్బును వెనక్కు కక్కిస్తున్నారు. దౌర్జన్యంగా లాక్కున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని పలువురు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో కమీషన్లు దండుకున్నారని కొందరు బిల్డర్లు నరసరావుపేట పోలీసు స్టేషన్ల మెట్లెక్కారు. తమ వద్ద లాక్కున్న స్థలాలు, పొలాలను వెనక్కు ఇచ్చేయాలంటూ కొందరు కోడెల, ఆయన కొడుకు, కుమార్తెలకు మధ్యవర్తుల ద్వారా హెచ్చరికలు పంపుతున్నారు. కొందరు నేరుగా కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ కంపెనీకి, ఇళ్లకు వెళ్లి నిలదీస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లలో కోడెల కుమార్తె, కొడుకుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అధికార అహంకారంతో.. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిలు చేసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారు. కొందరు పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాలు, అక్రమ వ్యవహారాలపై బాధితులు పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో ఇంజినీర్ వేణు అనే వ్యక్తి పలువురు బిల్డర్లను బెదిరించి కోడెల కుమారుడు శివరామ్, అతని అంతరంగికుడు గుప్తాప్రసాద్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇప్పించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట –1 టౌన్ పోలీసులు 384 సెక్షన్ కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. ♦ సత్తెనపల్లి రోడ్డులో అపార్టుమెంట్లు నిర్మిస్తున్న తమను బెదిరించి రూ. 54 లక్షలు వసూలు చేశారంటూ కోడెల శివరామ్పై నలుగురు బిల్డర్లు ఫిర్యాదు చేశారు. ♦ విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్, వాచ్మెన్ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేశారని నరసరావుపేట టీడీపీ నాయకుడు కళ్యాణం రాంబాబుతోపాటు కోడెల కుమార్తె విజయలక్ష్మి, ఆమె పీఏ బొమ్మిశెట్టి శ్రీనివాసరావులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ♦ కేశానుపల్లిలో పొలం కొనుగోలు చేసిన తమను కోడెల కుమార్తె విజయలక్ష్మి బెదిరించి రూ. 15 లక్షలు వసూలు చేయడంతోపాటు మరో రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని అరవపల్లి పద్మావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ♦ రావిపాడు గ్రామానికి చెందిన పలువురికి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మి డబ్బులు వసూలు చేశారని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగేందుకు సేఫ్ కంపెనీకి వెళితే వెనక దారి నుంచి వెళ్లిపోయారని బాధితులు వాపోతున్నారు. ♦ నరసరావుపేట పట్టణంలోని ఓ టీడీపీ నాయకుడికి చెందిన బంగారం దుకాణంలో రూ. 25 లక్షలు విలువ చేసే నగలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిన కోడెల కుమార్తెపై సదరు నాయకుడు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ♦ మద్యం దుకాణాల నిర్వాహకుల నుంచి కోడెల కుమారుడు శివరామ్ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. వీరంతా ఏకమై తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ కోడెల వద్ద పంచాయతీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ♦ సత్తెనపల్లి పట్టణంలో ఓ క్లబ్ను బలవంతంగా ఆక్రమించిన కోడెల శివరామ్ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ రోజు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని తెలియగానే క్లబ్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. -
‘ఆలూ పండిస్తారా.. రూ. కోటి ఫైన్ కట్టండి’
గాంధీనగర్ : గంజాయి లాంటి పంట పండిస్తే నేరం కానీ.. బంగాళాదుంపలను పండిస్తే కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగకపోయినా మన దేశంలో మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మన ప్రజా ప్రభుత్వాలకు.. కార్పొరేట్ కంపెనీలంటేనే మక్కువ ఎక్కువ. వాటి కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటాయి.. అవసరమైతే నోటి కాడి కూడును కూడా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు వడ్డిస్తాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకటే విధానం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటు చేసుకుంది. పెప్సీకో కంపెనీ బంగాళాదుంపలు పండిస్తున్నందుకు అక్కడి రైతుల మీద కేసులు పెట్టింది. ఆ వివరాలు.. అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసు పెట్టింది. లేస్ చిప్స్ తయారు చేయడం కోసం తాము వినియోగించే ఎఫ్సీ5 రకం బంగాళాదుంపలను భారత్లో తామే రిజిస్టర్ చేయించామని పెప్సీకో పేర్కొంది. కానీ గుజరాత్కు చెందిన రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం ఆలూని పండించారంటూ వారిపై కేసులు నమోదు చేసింది. పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామజిక కార్యకర్తలు, రైతులు పెప్సీకో చర్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో 200 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సదరు కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను విత్డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సామజిక కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ.."పెప్సీకో కంపెనీ సాబర్కాంఠాలో 9 మంది రైతులపై కేసులు పెట్టింది. నలుగురు రైతుల మీద కోటి రూపాయల దావా.. మరో ఐదుగురి మీద రూ. 20 లక్షల దావా వేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి పెప్సీకో అధికారులు మాట్లాడుతూ.. ‘పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వారికి మాత్రమే ఈ రకం బంగాళాదుంపలను పండించేందుకు అనుమతిచ్చాం. సదరు రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటా. అలాంటిది ఇప్పుడు బయటి వారు కూడా ఇదే రకం బంగాళాదుంపలను పండిస్తే.. సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. వారి ప్రయోజనాలను కాపడటం కోసమే కోర్టును ఆశ్రయించాం’ అని పెప్సీకో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో సదరు కంపెనీ కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నలుగురు రైతులతో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సదరు రైతులు పండించిన పంటను కంపెనీకే అమ్మాలి.. లేదా అసలు ఈ బంగాళాదుంపలను పండిచడమే మానుకోవాలంటూ షరతులు విధించింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్సీ5 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ జనవరి 31, 2031 వరకూ ఉన్నట్లు పెప్సీకో అధికారులు తెలిపారు. -
ఓవియాపై మరో కేసు
పెరంబూరు: నటి ఓవియాపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మరో కేసు నమోదైంది. బిగ్బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన నటి ఓవియ ఇటీవల నటించిన చిత్రం 90 ఎంఎల్. మహిళా దర్శకురాలు అనితాఉదీప్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి ఓవియా విచ్చలవిడిగా నటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చిత్రంలో ఓవియా ధూమపానం చేయడం, మద్యం తాగడం, లిప్లాక్ సన్నివేశాలు, సహజీవనం లాంటి సన్నివేశాలు మన సంస్కృతి సంప్రదాయాలు మంటగలిపేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్ర దర్శకురాలు అనితాఉదీప్, కథానాయకి ఓవియాలపై ఇప్పటికే పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా తిరువేర్కాడుకు చెందిన తమిళ్వేందన్ అనే వ్యక్తి బుధవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. ఇటీవల పొల్లాచ్చిలో 100 మందికి పైగా విద్యార్థినులు అత్యాచారం, చిత్రవధకు గురయ్యారన్నాడు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సెల్ఫోన్ పరిజ్ఞానంతో ప్రేమ, పెళ్లి పేర్లతో కట్ర పన్ని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు చేసిన ఆకృత్యాలు మానవ జాతికే అవమానం అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరిగేలా సినిమాలు రూపొందించడం అంతకంటే నీచంగా పేర్కొన్నారు. గత మార్చి 1వ తేదీన అనిత ఉదీప్ దర్శకత్వంలో నటి ఓవియ ప్రధాన పాత్రలో నటించిన 90ఏఎల్ చిత్రం విడుదలైందని, ఇందులో ఓవియ సభ్యసమాజం తల దించుకునేలా నటించిందని వివరించారు. తమిళ సంస్కృతిని నాశనం చేసేవిధంగా, మహిళలను తప్పుదోవ పట్టించే విధంగా 90 ఎంఎల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు అనిత ఉదీప్, అందులో నటించిన నటి ఓవియలను అరెస్ట్ చేయాలని కోరాడు. అతని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
లారెన్స్ సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు
తమిళనాడు, పెరంబూరు: అత్తింటికి వెళ్లిన తన కొడుకు కనిపించడం లేదని శాంతి అనే మహిళ సిట్లంపాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. స్థానిక తిరుముల్లైవాయల్లో ఉదయశంకర్ అనే వ్యక్తి తన తల్లి శాంతి(68)తో కలిసి నివసిస్తున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఉదయ్శంకర్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. కాగా ఈ నెల 3వ తేదీన తన కొడుకు సిట్లంపాక్కం, ఎంపీ నగర్లో ఉన్న తన అత్తింటికి వెళ్లాడని, ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు భార్యకు నటుడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణులకు పరిచయం ఉందని తెలిపింది. తన కొడుకు ఉదయశంకర్ కనిపించకపోవడానికి ఎల్విన్ వీణు, తన కోడలు కారణం అని సందేహంగా ఉందని ఫిర్యాదులో వెల్లడించింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న సిట్లంపాక్కాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమతి లేకుండా కన్నారని కోర్టు కీడుస్తాడట..!
ముంబై : ముంబైకి చెందిన రఫేల్ సామ్యూల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. తన అనుమతి లేకుండా తనను కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు వేస్తానంటూ విచిత్ర వాదనతో ముందుకొచ్చాడు. తనను తాను యాంటీ-నటాలిస్ట్(జనాభాను తగ్గించే వ్యక్తిగా) పేర్కొన్న సామ్యూల్...‘ అన్ని దుష్పరిణామాలకు జనాభా పెరుగుదలే మూల కారణం. పిల్లల్ని కనడం ఆపండి’ అంటూ ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను ఇలా మాట్లాడటానికి కారణాలు వివరిస్తూ ఓ యూట్యూబ్ చానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ‘ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి తన అనుమతి, ప్రమేయం లేకుండానే భూమి మీదకి వస్తున్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ సొంతం కారు. పిల్లల్ని పెంచాం కదా అని తమను పోషించాలంటూ తల్లిదండ్రులు వారిని బ్లాక్మెయిల్ చేయొద్దు. అలాగే పిల్లలు కూడా నిజంగా, నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నపుడు మాత్రమే అమ్మానాన్నలను చేరదీయాలి. అంతేతప్ప మొహమాటానికి నాటకాలు ఆడాల్సిన పనిలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను కేసు వేస్తానని చెప్పినపుడు మొదట తల్లిదండ్రులు వ్యతిరేకించారని, అయితే ప్రస్తుతం తల్లి మాత్రం తనను అర్థం చేసుకుందని పేర్కొన్నాడు. అసలు ఎవరో కోరుకున్నారని పిల్లలకు జన్మనివ్వడం తప్పని, జీవితం సవాళ్లతో కూడుకున్నది కాబట్టి.. జనాభా నియంత్రణను పోత్సహించడమే తన లాంటి యాంటి నటాలిస్టుల ఎజెండా అని వ్యాఖ్యానించాడు. కాగా రఫేల్ సామ్యూల్ వాదనను కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇదేమీ చోద్యం అంటూ విమర్శిస్తున్నారు. జనాభాను నియంత్రించాలంటే ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భూపేన్ హజారికాపై వ్యాఖ్యలకు ఖర్గేపై కేసు
మోరిగావ్: అస్సాంకు చెందిన దివంగత గాయకుడు భూపేన్ హజారికాపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. భూపేన్ హజారికాకు కేంద్రం ఇటీవలే భారత రత్న ప్రకటించగా, ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్ముఖ్)కు అవార్డు ఇచ్చారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో అస్సాం ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. -
‘గ్లోబల్ ఆస్పత్రి’ ఘటనపై రెండు కేసులు
సాక్షి, సిటీబ్యూరో:లక్డీకాపూల్లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి సంబంధించి ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేసినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఈ కేసులను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంతోష్నగర్కు చెందిన షమీనా బేగం ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్ అలీ ఖాన్, బర్కత్ అలీ ఖాన్, ముజఫర్ అలీ ఖాన్లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. స్వైన్ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్ ట్రీట్మెంట్ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు, ఆస్పత్రి భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినుద్దీన్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో వైద్యులు, ఆస్పత్రులపై దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన చట్టాన్ని తొలిసారి ప్రయోగించామని, దీని ప్రకారం ఆస్తినష్టాన్ని సైతం నిందితుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. -
ఇబ్బందుల్లో సీఎం కుమార
బొమ్మనహళ్లి (బెంగళూరు): సీఎం కుమారస్వామికి వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో చెరుకు రైతుల ఆందోళన, వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పలేలా లేవు. మద్దతు ధర ప్రకటించాలని, చెరుకు ఫ్యాక్టరీల నుంచి బకాయిలు చెల్లించాలని ఆందోళనలోపాల్గొన్న మహిళను ఉద్దేశించి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదుకు ఆదేశించారు. బెళగావిలో రైతుల నిరసనలో మహిళా రైతు జయశ్రీ ఆరోపణలు చేయడంపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నావమ్మా...’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి జయశ్రీ విలపించింది. సీఎం తనను కించపరిచారని, న్యాయం చేయాలని మీడియాముఖంగా కోరింది. దాంతో కార్మిక సంక్షేమ శాఖ సుమోటోగా పరిగణించి డీజీపి నీలమణి రాజు , మానవ హక్కుల కమిషన్కు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడిన అభియోగాలపై సీఎం కుమారస్వామి పై 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పేర్కొంది.