cctv camera
-
వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. -
కాంగ్రెస్ హిమానీ హత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ వీడియో
ఢిల్లీ: హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, తాజాగా నిందితుడు హిమానీ హత్యకు గురైన రోజున ఆమె నివాసం సమీపంలో నుంచి సూటుకేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.హర్యానాలో రోహ్తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో మార్చి ఒకటో తేదీన సూట్కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం బయటపడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హిమానీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం, హిమానీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఓ సూట్కేసును పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్కేసులో ఆమె మృతదేహం ఉండటం గమనార్హం.ఈ నేపథ్యంలో హిమానీ నర్వాల్ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడు చెప్పుకొచ్చారు. అలాగే, తనను తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతోనే హత్య చేసినట్టు సచిన్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, వారిద్దరు స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందని పోలీసులు తెలిపారు.VIDEO | Himani Narwal murder case: CCTV footage - dated February 28, 2025 - shows accused Sachin carrying the black suitcase with the body stuffed in it, through a street. The CCTV visuals have been verified by the police. Sachin - a "friend" of Congress worker Himani Narwal -… pic.twitter.com/f9qvKFR5rz— Press Trust of India (@PTI_News) March 3, 2025 -
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
Wayanad: రాత్రికి రాత్రే.. భయానక దృశ్యాలు వైరల్
కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తుతో కకావికలం అయ్యింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి.. బురద ప్రవాహం గ్రామాల్ని ముంచెత్తింది. సుమారు 300 మంది మరణించగా.. వందల మంది నిరాశ్రయులయ్యారు. మరో వంద మందికి పైగా జాడ లేకుండా పోయారు. ఈ విలయం ధాటికి దెబ్బతిన్న గ్రామాలు.. అక్కడి ప్రజలూ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.CCTV footage of the devastating #Wayanadlandslide in #Kerala which occurred 20 days ago, has gone viral.The disaster claimed 231 lives, with 212 body parts recovered, while 118 people remain missing.The footage, now circulating widely, captures the catastrophic moment,… pic.twitter.com/5FV9NbgaW9— South First (@TheSouthfirst) August 19, 2024అయితే.. కొండచరియలు విరిగినపడిన సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారి బురద కలగలిసిన జలప్రవాహం ఎగిసిపడి ముంచెత్తిన దృశ్యాలు వీడియోల్లో కనిస్తున్నాయి. -
మహిళపై అత్యాచారయత్నం : వీధి కుక్క అలర్ట్...దెబ్బకి..!
ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్లో జరిగింది. మాణిక్పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. -
శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది. ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. Bangalore: The bull suddenly attacked the scooty rider. The person fell under the truck coming from the front. The truck driver immediately applied the brakes. The man narrowly escaped being hit by the tire of the truck. pic.twitter.com/Jpiei3CoIL — Mayank Arhat 𝕏 (@iMayankIndian_) April 6, 2024 -
సామర్లకోట లో లాడ్జ్ బాయ్ను చితక్కొట్టిన యువకులు
-
ఈ రైతు తెలివి మామూలుగా లేదు.. టమోట తోటకు అవే కాపాలా!
మైసూరు: ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోను, విదేశాల్లోనూ టమాటకు భారీ ధర ఉంది. కేజీ వంద రూపాయల దాకా ఉండడంతో రైతులకు కనకవర్షం కురుస్తోంది. కానీ దొంగలు రాత్రిపూట పంటను ఎత్తుకెళ్లడం అక్కడక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం రైతులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని కుప్పె గ్రామంలో నాగేష, కృష్ణ ఆనే ఇద్దరు రైతులు తమ టమాటా తోటలకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగేష 10, కృష్ణ 4 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశారు. ధర ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండుసార్లు తోటల్లో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు రైతులు వాపోయారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దొంగలను అడ్డుకుంటామని రైతులు చెబుతున్నారు. చదవండి పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్ వేసిన దొంగలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్ ధరించి బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు! దీంతో ఆ జంట సరాసరీ పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్పుత్గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్లో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. #WATCH | In a bizarre turn of events, two drunk men who were trying to rob a Delhi couple at gunpoint, handed Rs 100 to them instead. They did so when they realised that the couple only had Rs 20 with them. pic.twitter.com/9BpIp0JEFs — Daily Excelsior (@DailyExcelsior1) June 26, 2023 -
వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్లో సీసీ కెమెరా.. ఆ తర్వాత
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. సీసీకెమెరా.. పొరపాటు జరిగింది. అజంగఢ్లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
Hyd: సీసీటీవీలో అసభ్యప్రవర్తన.. చితకబాదేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు. -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్వర్డ్ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం ట్యాంక్బండ్పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
జస్ట్ మిస్....లేదంటే పాపం ఆ చిన్నారి....
ఘజీయిబాద్: ఇటీవలకాలంలో చిన్నారులపై తరుచుగా వీధికుక్కల దాడులు గురించి వింటున్నాం. మొన్నటికి మొన్న ఒక మూడేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. అంతకుముందు ఒక పదేళ్ల చిన్నారి కుక్కల దాడిలో దారుణంగా గాయపడింది. ఈ ఘటనలు మరువక మునుపే అచ్చం అలాంటి ఘటనే ఘాజియా బాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఘజియాబాద్లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో! ఒక కుక్కల గుంపు ఆ చిన్నారి వెంట పడ్డాయి. దీంతో ఆ చిన్నారి ఒక్క ఊదుటన వేగంగా పరుగుతీసి తన అపార్టమెంట్స్ కమ్యూనిటీ గేట్లోకి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కల తోక ముడిచి వెనుదిరిగాయి. జస్ట్ మిస్ లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ కుక్కల దాడి కి బలయ్యి ఉండేది. ➡स्ट्रीट डॉग के झुंड ने बच्ची पर किया हमला ➡कुत्तों के हमले की घटना CCTV में कैद ➡बच्ची चिल्लाते हुए वापस सोसायटी में घुसी ➡लेकिन एक कुत्ते ने बच्ची के पैर में काट लिया ➡बच्ची के चिल्लाने पर गार्ड दौड़कर पुहंचे ➡वैशाली की रामप्रस्था ग्रीन सोसायटी का मामला।#Ghaziabad pic.twitter.com/3Dmh0HGh6L — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 20, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యగా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్ను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆన్లైన్ లింక్ ఉండాలని, అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేసింది. అయితే, ఇందుకోసం వాడే సీసీ కెమెరాలను అద్దెకు మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. హైదరాబాద్లో పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ.. జిల్లా కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇదో సమస్యగానే అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,400 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్ వద్ద సీసీ కెమెరా ఉండాలి. అక్కడి నుంచి ఇంటర్నెట్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి లింక్ ఉంటుంది. అయితే, ప్రతీ జిల్లాలోనూ కనీసం 200 పరీక్ష కేంద్రాలుంటే, అన్ని సీసీ కెమెరాలు అద్దెకు లభించడం కష్టంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కొద్ది మొత్తంలో ఉన్నా, రోజుకు కనీసం రూ.1,500 వరకూ అద్దె అడుగుతున్నారు. వైఫై, ఇతర ఇన్స్టలేషన్ చార్జీలు అదనం. కనీసం పది రోజులు ఒక కెమెరా పరీక్ష కేంద్రంలో ఉంచినా, రూ.15 వేల వరకూ చెల్లించాలి. అయితే, మార్కెట్లో ఒక్కో కెమెరా కొనుగోలు చేసినా ఇంతకంటే తక్కువగా దొరుకుతుందని అంటున్నారు. పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టమైనప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇంత తక్కువ సమయంలో తెప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే, జిల్లా కలెక్టరేట్ అధికారులు మాత్రం తక్కువ రేటుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మాత్రం ఈ బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఏదైనా సంస్థకు ఇస్తే బాగుంటుందని, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయలేమని విద్యాశాఖకు చెప్పినట్లు తెలిసింది. అయితే, పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాకు మిగిలేదేంటి కొద్దిరోజుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, బిగింపునకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకొనే మేం రోజుకు రూ.1,500 అద్దెతో ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల తర్వాత వాటిని తొలగించినా, వాడిన వైరు, ఇతర ఉపకరణాలను ఏమీ చేసుకోలేం. అదీగాక నెట్ సౌకర్యం లేని ప్రాంతంలో తాత్కాలిక నెట్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కలుపుకొంటే మాకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. – డి.వేణు (సీసీ కెమెరాల నిర్వాహకుడు) -
మిస్టరీగా మారిన గజ ఈతగాని మృతి.. సీసీకెమెరాలో షాకింగ్ విషయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా, బైంసా గడ్డేన్న ప్రాజెక్టులో గజ ఈతగాని మృతి మిస్టరీగా మారింది. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన సాయినాథ్ శవమై తెలాడు. అయితే సాయినాథ్ డ్యామ్లోకి దూకిన సమయంలో ఆ సంఘటన సీసీ కెమెరాలలో రికారయ్యింది. ఈ సీసీ పుటేజీలో డ్యామ్లో దూకిన సాయినాథ్ కొద్ది దూరం ఈతకోట్టినట్లు రికార్డైంది. (చదవండి: వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు) ఆ తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాడు ఎలా మ్రుతిచెందాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
తల్లి, కుమార్తెలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి.. ఇనుప రాడ్తో..
న్యూఢిల్లీ: దేశ రాజాధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లికుమార్తెలపై కర్రలు, ఐరన్ రాడ్తో విచక్షణారహితంగా వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు.. ఈ సంఘటన నవంబర్ 19న, ఢిల్లీ, శాలిమార్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు.. 38 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెపై ఇనుప రాడ్డు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుల్లో మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక తమను ఇంత దారుణంగా హింసించింది ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి అనుచరులని.. అందుకే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. (చదవండి: Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు) వీడియోలో ఉన్న దాని ప్రకారం మహిళ, ఆమె కుమార్తె కారు నుంచి దిగగానే.. కొందరు వ్యక్తులు వారి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించడమే కాక ఇనుప రాడ్డు, కర్రలతో చితకబాదారు. ఇంతలో మరికొందరు వ్యక్తులు కూడా అక్కడకు చేరుకుని.. మిగతావారితో కలిసి.. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారిని చితకబాదారు. బాధితులు తమను కాపాడాల్సిందిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారరయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మంగళవారం అనగా నవంబర్ 30న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళలపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: క్యాబ్ డ్రైవర్పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని) "నవంబర్ 19 రాత్రి, ఆప్ ఎమ్మెల్యే బందన కుమారికి తెలిసిన వ్యక్తులు నాతో పాటు నా కుమార్తెపై దాడి చేశారు. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను ఎమ్మెల్యే చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి" అని ఆ మహిళ తెలిపింది. చదవండి: ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి #WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19 Based on the woman's complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said. (CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu — ANI (@ANI) December 1, 2021 -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్డ్రైవర్తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ
గాంధీనగర్: ఆరోగ్యంగా, అందంగా ఉండాలని బరువు తగ్గే వారి గురించి చదివాం.. విన్నాం. కానీ దొంగతనం చేయడం కోసం బరువు తగ్గిన వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే ఇది చదవండి. గుజరాత్కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ దొంగతనం చేయడం కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యి.. మూడు నెలల్లో 10 కేజీల బరువు తగ్గాడు. దొంగతనం అనంతరం పోలీసులకు చిక్కడంతో ఇతగాడి వెయిట్లాస్ జర్నీ బయటకు వచ్చింది. ఆ వివరాలు.. రెండేళ్ల క్రితం భోపాల్లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో నిందితుడు మోతీ సింగ్(34) పనిచేసేవాడు. ఈ క్రమంలో మరాడియా ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయి.. సీసీటీవీ కెమరాలు ఎక్కడ ఫిట్ చేశారు వంటి వివరాలన్ని మోతీ సింగ్కు పూర్తిగా తెలుసు. ఇంటి తలుపులు కూడా ఎలక్ట్రిక్వి కావడంతో వాటిని సాధారణ పద్దతుల్లో బ్రేక్ చేయడం కష్టమని అర్థం చేసుకున్నాడు మోతీ. (చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం) ఈ క్రమంలో కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాలని భావించిన మోతీ.. ఇందుకు తగ్గట్లు తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం మూడు నెలలుగా ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకున్నాడు. ఎందుకిలా అని తోటి పనివారు ప్రశ్నిస్తే.. బరువు పెరుగుతున్నాను.. అందుకే డైటింగ్ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. మరాడియా ఇంట్లో ఉన్న సీసీకెమరాలకు చిక్కకుండా మోతీ ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. అనంతరం తాను దొంగిలించిన సొత్తును ఓ హార్డ్వేర్ షాపులో 37 లక్షల రూపాయలకు విక్రయించాడు. ఇక మోతీ చర్యలు షాప్ ఎదురుగా ఉన్న సీసీకెమరాలో రికార్డయ్యాయి. మరో విశేషం ఏంటంటే ఇదే హార్డ్వేర్ షాపులో మోతీ దొంగతనానకి ముందు రంపం, తాపీని కొనుగోలు చేశాడు. వీటి సాయంతో మరాడియా ఇంటి వంటగది కిటికీని కత్తిరించి లోపలికి ప్రవేశించి తన పని కానిచ్చాడు. (చదవండి: హ్యాండ్సప్ అని గన్ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్!) అప్పటికే మరాడియా ఇంటి సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో హార్డ్వేర్ షాప్ బయట ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. మోతీ నవంబర్ 5న మరాడియా ఇంట్లో 37 లక్షల రూపాయలకు చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మోతీని అరెస్ట్ చేసే సమయంలో అతడి వద్ద ఉన్న ఇతర విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా దొంగిలించిన సొత్తే అని పోలీసులు తెలిపారు. మోతీ సెల్ ఫోన్ లొకేషన్ పోలీసులకు అతడి గురించి సమాచారం ఇచ్చింది. చివరకు మోతీ తన స్వస్థలమైన ఉదయపూర్కు పారిపోతుండగా ఎస్పీ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోతీ వద్ద నుంచి చోరీకి గురైన నగదు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి! -
చైనా షాపులో మహిళా దొంగల హల్చల్
-
వైరల్ : అది దెయ్యమా.. భూతమా..!
నేరాలు, ఘోరాల నియంత్రణకు, నిర్ధారణకు సీసీటీవీ కెమెరాలు సాయపడతాయని మనందరికీ తెలుసు. అయితే, వీవీయాన్ గోమెజ్ అనే మహిళకు మాత్రం తన ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఓ వింత ఆకారాన్ని పరిచయం చేసాయి. రోజూ ఉదయం నిద్రలేవగానే తమ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడం ఆమెకు అలవాటు. గత ఆదివారం ఉదయం కూడా ఆమె అలానే చేశారు. కానీ, ఊహించని షాక్కు గురయ్యారు. వీడియో ప్రకారం.. బిల్డింగ్ సెల్లార్ నుంచి ఓ వింత ఆకారం బయటి కొచ్చింది. ఎముకల గూడుగా ఉన్న ఆ అతి పలుచని శరీరాన్ని చూసి ఆమె భయంతో వణికిపోయారు. ‘ఆదివారం ఉదయం నిద్రలేవగానే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాను. సెల్లార్లో నుంచి ఏదో ఆకారం బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తొలుత దాని నీడ చూసి ఏదైనా జంతువు కావచ్చు అనుకున్నాను. కానీ అది భయంగొల్పే ఆకారంలో ఉంది. కారు ముందుకు వచ్చి అదోరకమైన ఆనందంతో చిందులు వేసింది. స్టన్ అయ్యాను’ అని తన ఫేస్బుక్ పేజీలో ఆ ఘటన తాలూకు అనుభవాలను చెప్పుకొచ్చారామే. ఇక ఈ వీడియోలో ఉన్న ఆ వింత జీవి గురించి ఎవరికి వారు తమవైన విశ్లేషణలు, అనుభవాలు జోడించి చెప్తున్నారు. ఇది దెయ్యమే అని ఒకరు.. ‘కాదు అంతా నాటకం కావాలనే మమ్మల్ని తప్పదోవ పట్టిస్తున్నారు. ఇది పక్కా ప్రాంక్ వీడియో’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది హ్యారీపొటర్ సినిమాలోని డాబీ మ్యాజికల్ హౌజ్లో ఉన్న జీవిగా ఉందని మరొకరు చెప్పారు. ఈ వీడియోకు 30 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. -
అక్కడ సీసీటీవీ కెమెరా ఎందుకోసం పెట్టారు?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. తన ఇంటి సరిహద్దుల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడంపై ట్విటర్లో స్పందించిన తేజస్వీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్లతో నితీశ్పై విరుచుకుపడ్డారు. నితీశ్ ప్రతిపక్ష పార్టీ నేతలపై నిఘా పెట్టడం మానుకోవాలని సూచించారు. ఆయన తన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. పట్నాలో తన ఇంటి పక్కనే నితీశ్ ఉంటుందని తేజస్వి తెలిపారు. తమ ఇళ్ల మధ్య ఉన్న సరిహద్దు గోడపై చాలా ఎత్తులో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం వెనుక అర్థమెంటని తేజస్వీ ప్రశ్నించారు. దీని ద్వారా అవతలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతోందని వాపోయారు. ఇలాంటి పనులు చేయవద్దని నితీశ్కు ఎవరైనా సూచించడని వ్యంగ్యంగా స్పందిచారు. పట్నాలో నేరాలు సంఖ్య పెరిగిపోతున్న పట్టించుకోని సీఎం.. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. పౌరులకు భద్రత కల్పించాల్సింది పోయి.. వారి గోపత్యకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. Bihar CM’s residence is surrounded by main roads from 3 sides & Leader of Opposition's residence from the fourth side. But CM felt the need for CCTV only on the wall bordering his political adversary's residence? Someone should tell him that these petty tricks will prove futile! pic.twitter.com/HISzUEW1Gr — Tejashwi Yadav (@yadavtejashwi) 15 November 2018 అలాగే నితీశ్ విలాసవంతమైన జీవితం గుడుపుతున్నాడని ఆరోపించారు. నితీశ్కు మూడు సీఎం నివాసాలు ఉంటే.. అందులో 2 పట్నాలో, ఒకటి ఢిల్లీలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటితో పాటు బిహార్ భవన్లో మరో విలాసంతమైన సూట్ ఉందని తెలిపారు. ఒక పేద రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత విలాసవంతమైన జీవితం అవసరమా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నైతికత నితీశ్కు ఉందా అని ప్రశ్నించారు. -
ఏదీ పురోగతి?
అనంతపురంలోని సాయినగర్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో ఖాతాదారుడి వద్ద నుంచి నగదు అపహరించిన కేసు దర్యాప్తు అటకెక్కింది. ఆరు నెలలు గడిచినాదర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. జేఎన్టీయూ ఎస్బీఐ బ్రాంచిలో లాకర్ తెరిచి రూ.39లక్షలు దోచుకుని వెళ్లిన కేసును 15 రోజుల్లో ఛేదించిన పోలీసులు... మెయిన్ బ్రాంచి చోరీ నిందితులను గుర్తించడంలో విఫలమయ్యారు.దర్యాప్తును పూర్తిగా అటకెక్కించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపానున్న డీఎస్పీ రెడ్డి భారత్గ్యాస్లో అటెండర్గా పనిచేస్తున్న తలారి బాలరాజు ఫిబ్రవరి 12న గ్యాస్ ఏజెన్సీ డబ్బులను ఖాతాలో జమ చేసేందుకని ఎస్బీఐ సాయినగర్ మెయిన్బ్రాంచ్కు వెళ్లాడు. రూ. 5.15 లక్షల నగదుతో క్యూలో నిల్చొని ఉన్నాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన నలుగురు దొంగలు చాకచక్యంగా బాలరాజు వద్దనున్న నగదు బ్యాగును అపహరించుకుపోయారు. క్షణాల్లోనే బాధితుడు బ్యాంకు అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే బ్యాంకు నుంచి దొంగలు ఉడాయించినట్లు సీసీ కెమెరాల ద్వారా తేలింది. దర్యాప్తులో వేగం లేదు.. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు చాలెంజింగ్గా తీసుకొని దర్యాప్తు చేసే పోలీసులు సాయినగర్ స్టేట్బ్యాంకు చోరీ కేసుపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించారు. అయినప్పటికీ వారెవరనేది గుర్తించలేకపోయారు. ఎంతటి పెద్ద నేరంలోనైనా నిందితులు ఇసుమంత క్లూ అయినా వదిలేసి పోయి ఉంటారని భావిస్తారు. జేఎన్టీయూ స్టేట్బ్యాంకు లాకర్లో నగదు దోపిడీ కేసులో కూడా ఇది నిరూపితమైంది. ఇనుప కడ్డీలను తొలగించేందుకు తెచ్చుకున్న గ్యాస్కట్టర్, సిలిండర్లను దుండగులు అక్కడే వదిలేసిపోయారు. ఎక్కడి నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిందని ఆరా తీస్తే బెంగుళూరులో తీసుకున్నట్లు తేలింది. అక్కడ నగదును ట్రాన్స్ఫర్ చేయడంతో అకౌంట్ ఖాతా ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన ప్రొఫెషనల్ ముఠాను 15 రోజుల్లోగా పట్టుకోగలిగారు. మరి సాయినగర్ స్టేట్బ్యాంకు చోరీ కేసును మాత్రం పోలీసులు ఈ స్థాయిలో చాలెంజింగ్గా తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస దర్యాప్తు కూడా చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో పట్టుకుంటాం సాయినగర్ స్టేట్బ్యాంకు చోరీ కేసులో నిందితులను హోజికుప్పం ముఠా సభ్యులుగా గుర్తించాం. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాం. అయితే వారి ఆచూకీ దొరకలేదు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది. కచ్చితంగా నిందితులను పట్టుకుంటాం. – జె.వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
నేర పరిశోధనలో ‘నేను సైతం’
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ తల్లీకుమార్తె రూ.30 లక్షలతో గత బుధవారం విజయవాడకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆటోలో రైల్వేస్టేషన్కు వస్తుండగా నగదు బ్యాగు ‘మాయమైంది’. దర్యాప్తు చేసిన గోపాలపురం పోలీసులు గురువారం ఉదయానికే ఆ బ్యాగు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ వద్దకు ‘చేరినట్లు’ గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని సోమవారం అదుపులోకి తీసుకుని రూ.28.4 లక్షలు రికవరీ చేశారు. ‘నేను సైతం’ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఇది సాధ్యమైందని నార్త్జోన్ డీసీపీ బి.సుమతి వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నగదుతో ఉన్న బ్యాగు మాయం... విజయవాడకు చెందిన సుశీల తల్లి (102) నల్లకుంటలో మనుమరాలు భాగవతుల మోహిని (50) వద్ద ఉండేది. ఈమె ఇటీవల మరణించడంతో సుశీల నగరానికి వచ్చారు. ఇక్కడ పనులు ముగించుకుని గత బుధవారం తిరుగు ప్రయాణమ య్యా రు. విజయవాడలో కుమారుడికి ఇవ్వడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసుకున్నారు. ఐదు బ్యాగులతో మోహిని, సుశీల ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. స్టేషన్కు చేరుకున్నాక చూస్తే నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. అదే ఆటోలో వెనక్కు వెళ్లి గాలించినా ఫలితం లేకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాస్రోడ్స్లో పడిపోయినట్లు గుర్తింపు... పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నల్లకుంట–సికింద్రాబాద్ స్టేషన్ మధ్య ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. 42 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ను సేకరించిన అధికారు లు విశ్లేషించారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని బావర్చీ హోటల్ వద్ద ఉన్న కెమెరాలో ఉదయం 6:28 గంటల ప్రాంతంలో బ్యాగు జారిపోవడం స్పష్టంగా రికార్డయింది. ఆ బ్యాగు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఆనుకుని ఉండటంతో ఎవరూ గమనించలేదు. 25 నిమిషాల తర్వాత అటుగా వచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ స్వీపర్ ఆ బ్యాగ్ను తీసుకున్నట్లు రికార్డ యింది. పోలీసులు గురువారం జీహెచ్ఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్ను విచారించారు. బ్యాగు తీసుకున్న వ్యక్తి కె.రాములు అని, అత నిది ఇబ్రహీంపట్నం సమీపంలోని గంగారం అంటూ చెప్పాడు. రాములు కోసం ప్రయత్నించగా ఆచూకీ లభించలేదు. సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని బవార్చీ హోటల్ ఎదురుగానే అదుపులోకి తీసుకున్నారు. డంపింగ్ యార్డ్లో రూ. 5 లక్షలు... బ్యాగులో అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో పాలుపోలేదని రాములు పోలీసులకు చెప్పాడు. అందులో రూ. 5 లక్షల్ని ముషీరాబాద్లోని డంపింగ్ యార్డ్లో పాతిపెట్టానన్నాడు. తన కుమారుడు కె.శ్రీశైలం ద్విచక్ర వాహనం ఖరీదు చేసుకోవడానికి రూ. 59,700, తన బావమరిది వి.శ్రీశైలానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇచ్చానని అంగీకరించాడు. మరో రూ. 23,40,300లు తన ఇంట్లో ఉన్నాయని వెల్లడించాడు. దీంతో డంపింగ్ యార్డ్, రాములు ఇంటి నుంచి పోలీసులు రూ. 28,40,300లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న ‘శ్రీశైలాల’ కోసం గాలిస్తున్నారు. కాగా ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుమతి కోరారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్, డీఐ కిరణ్కుమార్, ఎస్సై రామకృష్ణలతో పాటు క్రైమ్ బృందాలను అభినందించారు. వీరికి ప్రత్యేక రివార్డులు అందించారు. -
ఆ 30 లక్షలు దొరికాయ్!
సాక్షి, హైదరాబాద్ : 30 లక్షల రూపాయల మిస్సింగ్ కేసును సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు సోమవారం చేధించారు. ఈ నెల1న (బుధవారం) నల్లకుంటకు చెందిన భగవతుల మోహిని(50), ఆమె తల్లి సుశీల(85)లు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు బయల్దేరారు. మధ్యలో రూ.30 లక్షల రూపాయలున్న బ్యాగును పోగొట్టుకున్నారు. రైల్వే స్టేషన్కు వచ్చాక నగదు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో తిరిగి అదే రూటులో ఎంత వెతికినా దొరకలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్ని కోణాల్లో పరిశీలించిన వారు సీసీ కెమెరాల సాయంతో కేసును చేధించారు. వారు ప్రయాణించిన మార్గంలోని మొత్తం 42 సీసీ కెమెరా వీడియోలను పరిశీలించిన పోలీసులు.. బ్యాగ్ను మహేశ్వరానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ రాములు(48) తీసుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రూ.28 లక్షలు రికవరీ చేశారు. కేసును త్వరగా చేధించిన పోలీసులకు డీసీపీ సుమతి రివార్డులు అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా అందరూ తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. -
గురుకులాల్లో నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురుకుల సొసైటీలు చర్యలు చేపట్టాయి. ప్రతి గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. -
భద్రత శివ.. శివా..!
అది దక్షిణ కాశిగా వినుతికెక్కినపల్లవుల నాటి ఆలయం..వాయులింగక్షేత్రం.. రాహుకేత పూజలకు నిలయం.. నిత్యంవేలాది మంది భక్తుల రాక.. ఏటా రూ.వంద కోట్ల పైబడిన రాబడి..ఇదీ ముక్కంటి ఆలయప్రశస్తి్త. అలాంటి ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పర్యవేక్షించే ప్రధానభద్రతాధికారి లేరు. దీంతోఆలయ భద్రత ఆ శివయ్యకే ఎరుక. శ్రీకాళహస్తి:ముక్కంటి ఆలయానికి నాడు పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు వచ్చేవారు. ఆలయానికి వచ్చే ఆదాయం నిత్యకైంకర్యాలకే సరిపోయేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వేలాది మంది భక్తులు ముక్కంటీశును దర్శనార్థం వస్తున్నారు. దీంతో నేడు ఆలయ ఆదాయం ఏడాదికి రూ.వంద కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పదేళ్లుగా సెక్యూరిటీ పెంచారు. ఇందులో భాగంగా ఆలయ భిక్షాలగోపురం, శివయ్య, తిరుమంజనం, దక్షిణగోపుర మార్గాల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం క్రితం ఆ మెటల్ డిటెక్టర్లను తొలగించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీలు చేయడం మానేశారు. ఆలయంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాస్టర్ప్లాన్ నేపథ్యంలో దేవస్థానానికి అన్ని వైపుల దారులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆలయానిక భద్రత కరువైంది. ఆలయానికి సీఎస్ఓ కరువు శ్రీకాళహస్తి దేవస్థానానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్ఓ) కరువయ్యారు. మూడు నెలలుగా ఆలయానికి సీఎస్ఓ లేరు. దీంతో ఎవరు పడితే వారు తామే ఆలయ భద్రాతా సిబ్బందికి ఇన్చార్జి అని చెప్పుకుంటూ చెలమణి అవుతున్నారు. దేవస్థానంలో 120 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది(ఏజెన్సీల ద్వారా), 35 మంది హోంగార్డులు, 18 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పని చేస్తున్నారు. ప్రధానంగా ఆలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బం దికి డ్యూటీలు వేయడంతో పాటు ఎవరూ ఏ పాయింట్లో ఉండాలి, భక్తులతో మర్యాదపూర్వకంగా ఎలా మెలగాలి, భక్తుల సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలతోపాటు ఎవరూ ఏ ప్రాంతంలో డ్యూటీలు నిర్వహించాలన్న విషయాలను సీఎస్ఓ పర్యవేక్షించాల్సి ఉంది. ఆలయానికి సీఎస్ఓ లేకపోవడంతో పలువురు పెత్తనం చేస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. దీంతోనే ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఇదే అదునుగా భక్తులను దళారీలు మోసం చేస్తున్నారు. మరోవైపు దేవస్థానంలో పనిచేస్తున్న 35 మంది హోంగార్డులు శ్రీకాళహస్తి డీఎస్పీ కంట్రోల్లో పనిచేస్తుంటారు. ఇక 18 మంది ఎస్పీఎఫ్ ఉద్యోగులు తిరుపతిలోని వారి బ్రాంచ్ కార్యాలయ డీఎస్పీ కంట్రోల్లో పనిచేస్తున్నారు.అయితే వీరిలో పలువురు భక్తులను అడ్డదిడ్డంగా దర్శనాలు చేయించి, వారి నుంచి డబ్బులు గుంజుతున్నారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఆలయంలో ఇటీవల కాలంలో చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి భద్రత కరువైందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అభద్రతకు నిదర్శనాలివీ.. ♦ దేవస్థానంలో గతంలో హుండీలతోపాటు హుండీల లెక్కింపు సమయంలోను చోరీలు జరిగాయి. ♦ ఆలయానికి చెందిన మింట్లో నాగ పడగలను చోరీ చేశారు. ♦ పోటులో నూనె, నెయ్యి డబ్బులు సైతం చోరీకి గురయ్యాయి. ♦ బ్రహ్మగుడి వద్ద దేవస్థానానికి చెందిన కొన్ని ఆభరణాలను కొందరు తరలించే ప్రయత్నం చేయగా భక్తుల సమాచారంతో వాటిని దక్కించుకున్నారు. ♦ దేవస్థానంలో పలువురు భక్తుల పర్సులతోపాటు సింగపూర్కు చెందిన ఓ మహిళా భక్తురాలికి చెందిన డైమండ్ నెక్లస్ చోరీకి గురైంది. భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం దేవస్థానానికి సం బంధించి భద్రత విషయంలో ప్రత్యే క శ్రద్ధ చూపుతాం. ఆలయానికి త్వరలో సీఎస్ఓను ని యమిస్తాం. భక్తులతో మర్యాదగా వ్యవహరించని వారిపై చర్యలు తప్పవు. మెటల్ డిరెక్టర్ల పునరుద్ధరణ విషయంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాస్టర్ప్లాన్లో బిజీబిజీగా ఉన్నమాట వాస్తవమే. అయినా ఆలయ పరిపాలనపై ప్రత్యేక నిఘా ఉంచాం. –రామస్వామి, ఈఓ,శ్రీకాళహస్తీశ్వరాలయం -
ఆదర్శ గ్రామంగా వన్నెల్(బి)
బాల్కొండ నిజామాబాద్ : నేరాల నియంత్రణకు పోలీసులతో సహకరించడంలో మండలంలోని వన్నెల్(బి) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని సీపీ కార్తికేయ అన్నారు. గ్రామస్తులు రూ.2.7 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్లో నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులే స్వంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వన్నెల్(బి) ముందుందన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ప్రజలు అందరూ పోలీసులతో సహకరించాలన్నారు. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనలు ఉన్నాయని వివరించారు. కోర్టుల్లో పోలీసులు ప్రవేశపెడుతున్న సాక్ష్యాలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇతర గ్రామాల్లో కూడా వన్నెల్(బి) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తులను చైతన్యవంతులు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేల కృషి చేసిన బాల్కొండ ఎస్ఐ స్వామీగౌడ్ను, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, ఆర్మూర్ రూరల్ సీఐ రమణరెడ్డి, స్థానిక సర్పంచ్ తాళ్ల భూషణ్, ఎంపీటీసీ రాజు, బాల్కొండ సహకార సంఘం అధ్యక్షుడు తూర్పు రమేశ్రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ కార్యాలయం ప్రారంభం నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లా కేంద్రంలోని పోలీస్లైన్లో ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ కార్యాలయాన్ని శుక్రవారం సీపీ కార్తికేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని సిబ్బంది చక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నూతన భవనంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని చక్కగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ఎన్ఐబీ, ఏఆర్ ఏసీపీలు సీహెచ్ మహేశ్వర్, రవీందర్, ఎస్బీ సీఐ రాజశేఖర్, ఆర్ఐ శేఖర్, శైలేందర్, రాంనిరంజన్, కమ్యూనికేషన్, ఎస్ఐలు నవీన్కుమార్, ఆర్ చంద్రబోస్ పాల్గొన్నారు. -
‘మహా సంప్రోక్షణలో సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదు’
విజయనగరం టౌన్ : తిరుపతి వేంకటేశ్వరాలయంలో చేసేవి శాంతి, సంప్రోక్షణలే అయితే సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు సమతానంద స్వామి అన్నారు. కోట జంక్షన్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహో సంప్రోక్షణం పేరిట తొమ్మిది రోజుల పాటు భక్తుల దర్శనానికి నిరాకరించడం, సీసీ కెమెరాలు ఆపేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి 17 వరకూ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే కానీ, ఆ విషయాలను లక్షలాది మంది భక్తులకు సీసీల ద్వారా చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. సంప్రోక్షణ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధతో చేయాలన్నారు. ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు వెల్లువెత్తిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకుని రోజుకు 50వేల మందికి దర్శనానికి అనుమతి ఇస్తామన్నా, సీసీ కెమెరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే టీటీడీపై భక్తులకు ఎన్నో అనుమానాలున్నాయని, ఇటువంటి సమయంలో ఇలా చేస్తే ఆ అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆలయ సంప్రోక్షణ ముహూర్తం ఏ పీఠాధిపతి ధర్మాచార్యుడిని అడిగి ఖరారు చేశారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో నిఘా నేత్రం
రామాయంపేట(మెదక్): వంద మంది చేయలేని పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందంటారు. రోజురోజుకు సీసీ కెమెరాల వినియోగం పెరుగుతోంది. తాజాగా జిల్లాలో సాంఘీక సంక్షేమశాఖ అధ్వర్యలో కొనసాగుతున్న అన్ని గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు బిగించారు. గిరిపుత్రులకు మంచి భోజనంతో పాటు హాజరు శాతాన్ని పెంచడం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికిగాను ఈ సీసీ కెమెరాలను బిగించినట్లు సమాచారం. ఒక్కో హాస్టల్లో సుమారుగా రూ. 50 వేల ఖర్చుతో నాలుగు కెమరాలతో పాటు ఒక మానిటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఆరు ఎస్టీ హాస్టళ్లలో, మూడు ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కెమెరాలు బిగించిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు హాస్టళ్ల సంక్షేమాధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందుతుంది. కెమెరా కనుసన్నల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులుసైతం క్రమశిక్షణతో మెదులుతున్నారని జిల్లా పరిధిలోని ఒక హాస్టల్ సంక్షేమాధికారి తెలిపారు. హాస్టళ్లలోని ప్రధాన ద్వారం, సామగ్రి ఉంచే ప్రదేశం, భోజనం, ప్రార్థన చేసే ప్రాంతంలో, వీటిని ఏర్పాటు చేశారు. నాలుగు కెమెరాల నుంచి వచ్చే వీడియోలకు సంబంధించి సమాచారం ఒక గదిలో ఉంచిన మానిటర్(టీవీ సెట్టు)లో నిక్షిప్తమవుతుంది. దీంతో హాస్టళ్లకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటివరకు కెమెరాలు బిగించిన గిరిజిన హాస్టళ్లు రామాయంపేట, చిన్నశంకరంపేట, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, టేక్మాల్ (బాలికల హాస్టల్) ఆశ్రమ సంక్షేమ వసతి గృహం, మహమ్మదాబాద్( నర్సాపూర్) ఆశ్రమ వసతి గృహం, కౌడిపల్లి (ఆశ్రమ వసతి గృహం). -
కవల పిల్లల అపహరణపై విచారణ
భిక్కనూరు: మండల కేంద్రంలో సంచలనం కలిగించిన కవల పిల్లల అపహరణకు విఫలయత్నం పోలీసుల చొరవతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు ఎస్ఐ రాజుగౌడ్ తెల్పిన మాట్లాడుతూ మండల కేంద్రంలో రాజస్థాన్కు చెందిన రంజిత్ అనే వ్యక్తి భిక్కనూరులో స్వీటు బండిని తోలుతూ మిఠాయిలను విక్రయిస్తాడు. అదే రాష్ట్రానికి చెందిన దినేష్ స్వీటు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు రంజిత్ పిల్లలు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో చదువుతారు. దినేష్ పిల్లలు చైతన్య విద్యానికేతన్లో చదువుతున్నారు. రంజిత్ నాలుగు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లడంతో రంజిత్ భార్య రేష్మ తమ వద్ద పనిచేస్తున్న సుజాత కూతురు వెన్నెలను పిల్లలను స్కూల్ నుంచి తీసుకురమ్మని పంపించింది. వెన్నెల సాయి పబ్లిక్ స్కూల్కు వెళ్లాల్సి ఉంది. కాగా చైతన్య విద్యానికేతన్ స్కూల్కు వెళ్లి రాజస్థాన్ స్వీటు హోం పిల్లలను పంపించమని అక్కడి సిబ్బంది కోరింది. సిబ్బంది ఈ విషయాన్ని హెచ్ఎం అశోక్కు తెలిపారు. దీంతో హెచ్ఎం దినేష్కు ఫోన్ చేసి మీ పిల్లలను పంపించుమన్నారా అని అడిగారు. అదేమి లేదని దినేష్ చెప్పాడు. దీంతో అశోక్ వెన్నెలను దబాయించడంతో వెన్నెల పరిగెత్తింది. ఆదివారం ఈ విషయమై దినేష్ భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ రాజుగౌడ్ సీసీ కెమెరాలను పరిశీలించి వెన్నెలను గుర్తించి పోలీస్స్టేషన్కు ఆదివారం పిలిపించాడు. విచారించి ఎస్ఐ నిజానిజాలు తెలుసుకున్నాడు. వెన్నెల ఒక పాఠశాలకు వెళ్లే బదులు వేరే పాఠశాలకు వెళ్లడంతో ఈ సమస్య తలెత్తిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
ఆరేళ్ల చిన్నారిని ఢీ కొన్న కారు
-
సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో
ముజఫర్నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అమ్మవారి సన్నిధిలో ఇంత అపచారమా!
ఇంద్రకీలాద్రి/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలకు తీరని అవమానం జరిగింది. ఓ డార్మిటరీలో దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసి రికార్డ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనిపై సిబ్బందే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్వాకం చూసి భక్తులంతా అవాక్కవుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్ చేయడం దారుణమంటున్నారు. దీనిపై మహిళాలోకం భగ్గుమంటోంది. అమ్మవారి సన్నిధిలోనే తమకు రక్షణలేక పోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డార్మిటరీలో సీసీ కెమెరా.. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పాడి వీధిలో సీవీ రెడ్డి చారిటీస్ పేరిట కాటేజీ నిర్వహిస్తోంది. ఈ కాటేజీ మెయిన్ హాల్లో లక్ష్మి పేరిట మహిళలకు ప్రత్యేకమైన ఏసీ డార్మిటరీని ఏర్పాటు చేశారు. ఆ డార్మిటరీలో 8 మంచాలు ఉండగా, కొంత ఖాళీ స్థలం కూడా ఉంది. కాటేజీలో వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకొనే సమయంలో మహిళలకు ఏసీ డార్మిటరీని అద్దెకు ఇస్తారు. అక్కడే వారు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఆ డార్మిటరీ మొత్తం కనిపించేలా మూడు నెలల కిందట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం కాటేజీలో ఓ వివాహం జరగగా, డార్మిటరీలో పెళ్లి కుమార్తెతో పాటు మరి కొంతమంది ఆమె బంధువులు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు మిగిలిన మహిళలందరూ అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో మగవారు లగేజీని తీసుకువెళ్లేందుకు డార్మిటరీలోకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గోడకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను గుర్తించారు. సీసీ కెమెరా పని చేస్తున్నట్లుగా చిన్న లైటు వెలుగుతుండటంతో అనుమానం వచ్చి కాటేజీ కామన్ హాల్లో ఉన్న ఆలయ సిబ్బంది కార్యాలయంలోకి సదరు వ్యక్తులు వెళ్లి చూడగా అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. దీంతో పెళ్లి వారి బంధువులు ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డింగ్పై నిలదీశారు. బుకాయిస్తున్న అధికారులు.. సీసీ కెమెరాల రికార్డు అంశం విషయం రచ్చకెక్కడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈలోగా విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కార్యాలయంలోని టీవీలో రెండు కెమెరాలు పని చేస్తున్నట్లు విజవల్స్ కనిపించాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై ఇతర భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఈఈ భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చి మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఫుటేజీ రికార్డు కావడం లేదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో కెమెరాలను ఆఫ్లైన్లోకి మార్చి వెళ్లిపోయారు. మూడు నెలలుగా ఇదే తీరు... మహిళలు ఉండే కాటేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సరికాదని పలు మార్లు ఇంజనీరింగ్ సిబ్బందిని హెచ్చరించినట్లు సీవీరెడ్డి చారిటీస్ నిర్వహణ చూస్తున్న ఆలయ ఉద్యోగి మేరీ స్వరూప తెలిపారు. కెమెరాలపై ఫిర్యాదులను ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని కాటేజీలో పని చేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజవల్స్ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటని మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆటలా.. డార్మిటరీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. డార్మిటరీలో అనుమానితులు ప్రవేశకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. లోపలకు ప్రవేశించే మార్గంలో ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా! లోపల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటి?. ఇలాంటి ఘటనలు దురదృష్టం దుర్గగుడి పాలనాధికారిగా మహిళ ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జరిగిన దానిని సమర్థించుకునే కన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇంత మంది అధికారులు, పాలక మండలి సభ్యులు ఉన్నా ఆలయంలో ఏం జరుగుతోందో భక్తులు చెబితే గాని తెలుసుకోకపోవడం సరికాదు. మహిళలకు రక్షణ లేదు ఆలయాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత వరకు షాపింగ్మాల్స్, హోటల్స్లోనే ఇటువంటి ఘటనలు జరిగినట్లు విన్నాం. ఇప్పుడు ఆలయాల్లోనూ... కాటేజీల్లోనూ ఇదే తంతు అంటే ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? అధికారులు తీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విశ్రాంతి కోసమే డార్మిటరీలు: ఎం.పద్మ, దుర్గగుడి ఈవో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి కోసమే డార్మిటరీలు ఏర్పాటు చేశాం. డార్మిటరీలో బెడ్డు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నాం. కేవలం విశ్రాంతి కోసమే వాటిని వినియోగిస్తున్నాం తప్ప.. దుస్తులు మార్చుకునే స్థలంలా కాదు. మహిళల భద్రత కోసమే డార్మిటరీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. -
ఇంద్రకీలాద్రి: మహిళల గదిలో కెమెరాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
మహిళల డ్రెస్సింగ్రూంలో కెమెరాలు
-
ఎక్స్ట్రాలు చేస్తే.. ఇత్తడే!
మార్కాపురం: నేర నియంత్రణే లక్ష్యంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు ముందుకెళ్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో మొత్తం 13 పోలీసుస్టేషన్లు ఉండగా 8 పోలీసుస్టేషన్ల పరిధిలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సర్కిల్స్ ఉండగా వీటిలో మార్కాపురం పట్టణం, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పెద్దారవీడు, త్రిపురాంతకం, దోర్నాల పట్టణాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 150కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నుంచే మార్కాపురం, గిద్దలూరు పట్టణాల్లో జరిగే సంఘటనలు గమనించేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. మార్కాపురం పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 74 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా అల్లూరి పోలేరమ్మ గుడి నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు, జవహర్ నగర్ కాలనీ నుంచి నాగులవరం రోడ్డు వరకు, కంభం రోడ్డు నుంచి శ్రీనివాస థియేటర్ వరకు ప్రతి 50 అడుగులకు ఒక సీసీ కెమెరా బిగిస్తున్నారు. ఇవీ..ఉపయోగాలు ప్రధానంగా నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, ఈవ్టీజర్స్ ఆటకట్టించడం, దొంగతనాలు నివారించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్లను ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో బిగించారు. మార్కాపురం, గిద్దలూరు, దోర్నాల, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వ్యాపారం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, క్లాత్ షాపులు, బంగారు దుకాణాల వద్ద కెమెరాలు అమర్చారు. కనిపిస్తున్న ఫలితం ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలు నేరాలను నియంత్రించేందుకు, నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. నాలుగు రోజుల కిందట పుల్లలచెరువు మండలం నరజాముల తండా వద్ద కారు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. కారు నంబర్ తెలియకపోవడంతో పుల్లలచెరువు నుంచి యర్రగొండపాలెం వచ్చే రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ద్వారా కారును గుర్తించి మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్నారు. మూడు రోజుల కిందట యర్రగొండపాలెంలో ఒక వస్త్ర దుకాణానికి వెళ్లి చీరాలకు చెందిన మహిళలు 20 చీరలు దొంగిలించి వెళ్తుండగా కుంట వద్ద పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కంభం మండలం తురిమెళ్ల వద్ద ట్రాక్టర్ దొంగతనం జరగ్గా సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను కడపలో పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రిస్తున్నారు. ఆరు రకాల కెమెరాల ఏర్పాటు మార్కాపురం సబ్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇందులో 6 రకాలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్లు, వాహనాలు నడిపే వారి ముఖాలు గుర్తించే కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, పేషియల్ రికగ్నైజేషన్ వంటి రకాలు ఉన్నాయి. వీటితో పాత నేరస్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. దొంగతనాలు, అల్లర్లకు పాల్పడిన వారి వివరాలు సీసీ కెమెరాల్లో నమోదైతే స్పష్టంగా కనిపిస్తాయి. నేర నియంత్రణ సులభమవుతుంది. – రామాంజనేయులు, డీఎస్పీ, మార్కాపురం -
ఇంద్రకీలాద్రిపై ఉత్కంఠ రేపిన చిన్నారి మిస్సింగ్
సాక్షి, విజయవాడ/నరసరావుపేట టౌన్: ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్ ఉదంతం 12 గంటల పాటు ఉత్కంఠ రేపింది. చివరకు చిన్నారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అరసబలగాకు చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్యశ్రీ (4)కాగా రెండో కుమార్తె నెలల పిల్ల. నవ్యశ్రీ విజయవాడ చిట్టినగర్లోని తాతయ్య కోరగంజి కృష్ణ ఇంట్లో ఉంటోంది. పైడిరాజు దంపతులు, కృష్ణ దంపతులు ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు కొండపైన మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకున్నారు. సెల్ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది నిమిషాలు నవ్యశ్రీని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాప కనపడకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. ఆలయం వద్ద మైక్లో చెప్పించినా ఉపయోగం లేకపోవడంతో 10 గంటల ప్రాంతంలో వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్జునవీధిలోని ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తుండగా.. ఓ మహిళ చిన్నారిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో మహిళ, ఓవ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాప పదో నంబర్ ప్లాట్ఫాంపై మహిళతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో బయలుదేరిన రైళ్లు గుంటూరు వైపుగా వెళ్లడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నరసరావుపేటలో పాప ఆచూకీ ఉదయం కనకదుర్గమ్మ ఆలయంలో తప్పిపోయిన బాలిక రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట వన్టౌన్ పోలీస్స్టేషన్కు చేరింది. నరసరావుపేటకు చెందిన చల్లా సుబ్బలక్ష్మి పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాము ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనానికి వెళ్లామని, తిరిగి వస్తుండగా పాప ఏడుస్తూ కనిపించిందని తెలిపారు. పాప వివరాలు చెప్పలేకపోయిందని, తమతో పాటే వచ్చేసిందని పేర్కొన్నారు. విజయవాడలో ఎవరికి అప్పగించాలో తెలియక నరసరావుపేట పోలీసులకు పాపను అప్పగించామని తెలిపారు. పాపను రాత్రి 10 తర్వాత పోలీసులు విజయవాడకు పంపారు. అమ్మదయతోనే తమ పాప దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పాప ఆచూకీ తెలిసిందన్నారు. బయటపడ్డ భద్రత డొల్లతనం దుర్గగుడిలో 79 కెమెరాలు ఉన్నాయి. అయినా పాప తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారు. అయితే మల్లికార్జున మహామండపం వద్ద ఉన్న కెమెరా వర్షానికి పాడైపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘాట్రోడ్డు వద్ద, కొండపైన క్లోక్ రూమ్ వద్ద ఉన్న కెమెరాలు స్పష్టంగా కనపడటం లేదంటున్నారు. కీలకమైన ఈ ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయకపోయినా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మూడు కెమెరాలే పనిచేయడంలేదని అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా సగం కెమెరాలు పనికిరానివేనని సమాచారం. అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు వద్ద కెమెరాలు తప్ప మిగిలినవేవీ పనిచేయడం లేదు. అయినా అధికారులు కానీ, పాలకమండలి కానీ పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తే దేవస్థానం ఉద్యోగుల అక్రమాలు బయటపడతాయని సిబ్బంది కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
నేరాల నియంత్రణకు మూడో కన్ను
నర్సాపూర్(జి)(నిర్మల్) : నేరాల నియంత్రణకు పోలీసులు పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోనూ వీటిని ఏ ర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా రు. దీంతో గ్రామాల్లో నేరాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. పోలీసులు ఆయా గ్రామాభి వృద్ధి కమిటీలు, వ్యాపారులతో చర్చించి సీసీ కెమెరా లు ఏర్పాటు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. అనుమానితులను పట్టేయొచ్చు.. పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయడంతో అనుమానిత వ్యక్తులను పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. దీంతో నేరా ల సంఖ్య తగ్గుతోంది. వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల ని పోలీసులు వారికి సూచిస్తున్నారు. ఈ మేరకు వారికి ఆయా పోలీస్స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నారు. నిఘా నేత్రాల ఏర్పాటుతో వ్యాపార సముదాయాల్లో దొంగతనాలు జరగకుండా నివారించే వీలుంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రతీవారం అంగడి ఉంటుంది. సంతలోనూ ఎలాంటి దొంగతనాలు, అక్రమాలకు తావు లేకుండా నిఘానేత్రాలు సహకరిస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం.. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్ని కేసుల్లో సీసీ కెమెరా పుటేజీలు సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడుతున్నాయంటే సీసీ కెమెరాల ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో సీసీ కెమెరాల సాయంతో పోలీసులు కేసులను ఛేదించారు. అలాగే చైన్స్నాచింగ్ కేసుల్లో సీసీ కెమెరాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. చైన్స్నాచింగ్ చేసిన వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టివ్వడం సీసీ పుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. జాతీయరహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోనూ కీలక సాక్ష్యాలను పోలీసులు సేకరించగలుగుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. హైస్పీడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడ్, ఓవర్ లోడ్వాహనాలపై సీసీ కెమెరాల సాయంతో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వ్యాపారస్తులకు అవగాహన.. జిల్లాలో దొంగతనాలను పూర్తిగా నివారించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్లు, కాలనీలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం వ్యాపారులు, గ్రామస్తులకు సీసీ కెమెరాల వినియోగం, వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. వీటితో కలిగే లాభాలను వారికి వివరించి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా పోత్సహిస్తున్నారు. వ్యాపారులు సీసీ కెమెరాలు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుంటుండగా, గ్రామాల్లో ప్రజల నుంచి విరాళాలు, వీడీసీల సహకారంతో నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రయాణ ప్రాంగణాలు తదితర రద్దీ ప్రాంతాలు, మండల కేంద్రాల ముఖద్వారంగా ఉన్న గ్రామాల్లో సుమారు 400 వరకు సీసీ కెమెరాలు సేవలందిస్తున్నాయి. అలాగే వీటికి అదనంగా వ్యాపార సముదాయాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నాయి. కమాండ్ కంట్రోల్తో అనుసంధానం.. జిల్లాలోని నిర్మల్, భైంసా సబ్డివిజన్ పోలీస్ కార్యాలయాల్లోని కమాండ్ కంట్రోల్రూంతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. అలాగే ఆయా మండలకేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఆయా పోలీస్స్టేషన్లలోని కంట్రోల్రూంకు అనుసంధానం చేశారు. దీంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పోలీసులు తెలుసుకుని స్పందించగలుగుతున్నారు. దీంతో నేరనియంత్రణ వారికి సులువవుతోంది. ఏదేమైనా శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. -
దొంగలు బాబోయ్ దొంగలు
పార్వతీపురం : మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉదయం వేళ పట్టణం వ్యాప్తంగా కలియదిరుగుతూ ఎక్కడ తాళాలు వేసి ఇళ్లు ఉన్నాయో, ఊరికి దూరంగా ఎక్కడ ఇళ్లు ఉన్నా యో గుర్తించి రాత్రి సమయంలో పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల పార్వతీపురం పురపాలకసంఘ పరిధిలోని వైకేఎం కాలనీలో ఒకే రోజు ఏడిళ్లలో దొంగతనాలకు పాల్పడడం సంచలనం రేపింది. అలాగే ఆ సంఘటన జరిగిన రెండోరోజే మళ్లీ నర్సిపురం పంచాయతీ ఓలేటి ఫారం వద్ద తలుపులు వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగింది. రెండురోజుల కిందట 15వ వార్డు అగురవీధిలో పట్టపగలు ఉదయం 8 గంటలకే ఇంటి లో చోరీ జరిగింది. ఇలా వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకపక్క పార్థి గ్యాంగ్ తిరుగుతున్నట్లు వాట్సాప్లో విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చుక్కలు చూపిస్తున్న దొంగలు... వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నిఘా విభాగం ఎంతో అభివద్ధి చెందిన రోజుల్లో కూడా దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రాత్రి, పగలు పోలీసులు పహారా కాస్తున్నా వారి కళ్లు గప్పి మరీ దొంగలు తమ చేతికి పనిచెబుతున్నారు. పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు చెమటలు పడుతున్నాయి. ఇటీవల ఒకేరోజు వైకేఎం కాలనీలో ఏడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతోనే ఆ ప్రభావం పట్టణ ఎస్సై ఎం. రాజేష్పై పడిందని.. అందులో భాగంగానే ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ఇవ్వాలి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమీపంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి వీధుల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తిస్తాం. దీంతో వెంటనే సిబ్బంది ఆయా ప్రాంతాలకు క్షణాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో లేనప్పుడు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉంచకూడదు. – ఎం. దీపికాపాటిల్, పార్వతీపురం ఏఎస్పీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతం సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో బహుళ అంతస్తులు, గ్రూప్ హౌస్ల్లో ఉన్నవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కెమేరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై నిఘా పెడతాం. – జి.రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ . -
నేరాల నియంత్రణకు మూడో నేత్రం
జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎప్ఎల్) ఆధ్వర్యంలో భారీ వ్యయంతో తెనాలి పట్టణంలో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నేర నియంత్రణకు ముందడుగు వేసింది. తెనాలి రూరల్ : సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాల ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిఘా కెమెరాల ఏర్పాటు పూర్తికావడంతో కొద్ది రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పట్టణం, ప్రధాన కూడళ్లే కాకుండా మారుమూల గ్రామాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యనే కాకుండా శాంతి భద్రతల రక్షణ, నేరాల అదుపు వంటి బహుళ ప్రయోజనాలకు ఈ వ్యవస్థను వినియోగించుకునేందుకు పోలీసుల శాఖ ముందడుగు వేసింది. సీసీ కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలాన్లు రాసేందుకేనన్న విమర్శలున్నాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఆధునతన పరిజ్ఞానంతో కెమెరాలను ఏర్పాట చేస్తున్నారు. నేరాల నియంత్రణకు వీటిని ఎంచుకోవడం విశేషం! హైటెక్ సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్వేర్ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. రూ. వెయ్యి కోట్లతో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎప్ఎల్) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, రూ.969 కోట్లు కేటాయించింది. మేట్రిక్స్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,764 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా హెడ్క్వార్టరు, సబ్ డివిజన్ హెడ్క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కెమెరాల ఏర్పాటు పూర్తి కావచ్చింది. త్వరలో కంట్రోల్ రూమ్ల కేటాయింపులు చేపట్టనున్నారు. అడ్వాన్స్డ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్), రెడ్ లైట్ వయోలేషన్ రికగ్నిషన్(ఆర్ఎల్వీడీ), ఫస్త్రస్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్), వీడియో అనలైటిక్స్(వీఏ) వంటి నాలుగు రకాల ఆధునాతన కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి సబ్ డివిజన్లోని 10 పోలీస్స్టేషన్లకు గాను 107 కెమెరాలను కేటాయించారు. వీటిలో ఏఎన్పీఆర్ – 45, ఎఫ్ఆర్ఎస్ – 5, వీఏ – 20, ఆర్ఎల్వీడీ, సాధారణ కెమెరాలు 37 ఉన్నాయి. ఆధునిక కెమెరాల ప్రయోజనాలు ♦ ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనాల నంబర్ప్లేట్లను గుర్తిస్తాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్ నంబర్ ప్లేట్ల వివరాలను డేటాబేస్తో సరిపోల్చి, యజమాని వివరాలను తక్షణమే కంట్రోల్ రూమ్ సిబ్బందికి తెలియజేస్తుంది. అంతే కాక, నేరానికి పాల్పడి, వాహనాలపై పరారవుతున్నా వారిని గుర్తించడం సులువవుతుంది. ♦ ఆర్ఎల్వీడీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్లైట్ పడి ఉన్నా, అతిక్రమించే వారిని గుర్తించి, వాహన వివరాలను కంట్రోల్రూమ్కు చేరవేస్తాయి. ట్రాఫిక్ సిబ్బంది లేకపోయినా, చలానాలు వస్తుంటాయి, వాహనదారులు ఇక సిగ్నల్ పడితే బ్రేక్ వేయాల్సిందే. ♦ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు డేటాబేస్లోని వ్యక్తుల ముఖాలను ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉంటాయి. పరారీలో ఉన్న నేరగాళ్లు, బహిష్కృత నేరగాళ్లు, అంతకు ముందే పోలీసుల రికార్డుల్లో ఉన్న అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వంటనే ఈ కెమెరాలు కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ♦ వీఏ కెమెరాలు వీడియో రికార్డింగ్ను చేస్తుంటాయి. నెల, రెండు నెలలే కాకుండా కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిలతో నేర దర్యాప్తును చేసేందుకు వీలవుతుంది. కంట్రోల్ రూములో వీటిని పర్యవేక్షించే సీఐ స్థాయి అధికారి ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో క్లియర్ చేసే వీలుంటుంది. ఏర్పాటు సరే.. నిర్వహణ.. అధునాతన కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ఎత్తయితే, దీని నిర్వహణ తలకు మించిన భారం కానుంది. తెనాలి పట్టణంలో 2012లోనే 48 కూడళ్లలో అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం రూ. 15 లక్షలు కేటాయించి, మార్కెట్ కాంప్లెక్సులో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకూ అనుమతిచ్చింది. నేర పరిశోధనల్లో ఈ కెమెరాలూ ఉపయోగపడ్డాయి. అయితే తదనంతర కాలంలో వీటి నిర్వహణపై ఇరు శాఖలు పట్టించుకోలేదు. దీంతో కెమెరాలు నిరుపయోగమయ్యాయి. కెమెరాల దీర్ఘకాలిక నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చూడలేకపోతున్న ‘మూడో కన్ను’..
జంగంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దారుణం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకేసారి ఇద్దరు హత్యకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పంచాయతీ పరిసరాల్లోనే ఉండడంతో నేరాన్ని రికార్డు చేయలేకపోయాయి. ఆర్థికభారం కావడంతో గ్రామంలో వేరే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ కూడా నిర్వీర్యం కావడంతో నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిక్కనూరు : ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జంగంపల్లి వీడీసీ అధ్యక్షుడు అత్తెలి రమేశ్, మరో వ్యక్తి ముదాం రాములు దారుణంగా హత్యకు గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ప్రతి గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న వివాదాలే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా మారుతాయని భావించిన పోలీసు అధికారులు.. వాటిని నివారించడం కోసం ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని నియమించారు. గ్రామంలోని గోడలపై గ్రామ పోలీస్ అధికారి పేరు, ఫోన్ నంబర్ రాయించారు. ఆ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీస్ అధికారికి సమాచారం వెళ్లేది. మొదట్లో ఈ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత ఈ వ్యవస్థను పట్టించుకోవడం మానేశారు. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ నామ్కే వాస్తేగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వారు పల్లెలవైపు చూడడం లేదని తెలుస్తోంది. కొనుగోలు భారం.. నేరాల నియంత్రణకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటిని కొనుగోలు చేయడానికి పంచాయతీల వద్ద ఎలాంటి నిధులు లేవు. దాతలు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల కొనుగోలు భారం కావడంతో చాలా గ్రామాలు వీటి ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి పంచాయతీ వద్దో.. కూడళ్లలోనే ఉన్నాయి. అంతగా సీసీ కెమెరాలు లేకపోవడంతో మిగతా చోట్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోంది. గ్రామ ముఖద్వారం వద్ద లేకపోవడంతో.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో గతంలో దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో సీసీ కేమెరాలు ఉన్నాయి. కానీ గ్రామ ముఖద్వారం వద్ద ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో పోలీసులు దుండగుల ఆచూకీ కనుక్కోలేకపోయారు. జంగంపల్లిలోనూ సీసీ కెమెరాలున్నా.. గ్రామ ముఖద్వారం వద్ద ఒక్కటీ లేకపోవడంతో హంతకులను గుర్తించలేకపోయారు. అక్కరకు రాని కెమెరాలు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను సులువుగా ఛేదించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి నాణ్యమైనవి కాకపోవడంతో తరచుగా చెడిపోతూ సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో జంట హత్యలు జరిగిన ప్రదేశానికి సమీపంలో గ్రామ స్వాగత తోరణం ఉన్నప్పటికీ అక్కడ సీసీ కేమెరాలు లేవు. గ్రామపంచాయతీ సమీపంలోనే నాలుగు సీసీ కేమేరాలు ఉన్నాయి. అవి కూడా చెడిపోవడంతో ఇటీవల పోలీసుల సూచన మేరకు మరమ్మతులు చేయించారు. ఈ మరమ్మతులు చేయించిందీ హత్యకు గురైన అత్తెల్లి రమేశ్ కావడం గమనార్హం. సీసీ కెమెరాలను ప్రారంభ కార్యక్రమాల్లో పోలీసులు కనబడతారు కానీ వాటి పనితీరు ఎలా ఉందో అని మాత్రం తెలుసుకోరని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రారంభించడడమే కాదు వాటి పనితీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ ప్రజలు కోరుతున్నారు. పోలీసులకు సవాల్.. సంఘటన స్థలంలో లభించే చిన్న క్లూతోనయినా పోలీసులు నేరాన్ని ఛేదిస్తారు. జంగంపల్లి జంట హత్యల కేసులో మాత్రం హంతకులు హతుల సెల్ఫోన్లు ఎత్తుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఇద్దరిని చంపిన హంతకులు.. హతుల ఫోన్లను తీసుకుని జాతీయ రహదారి మీదుగా పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం కూడా జాతీయ రహదారి వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ హత్య కేసు మిస్టరీ కూడా ముందుకు సాగడం లేదు. భయాందోళనల్లో గ్రామస్తులు జంట హత్యలు జంగంపల్లివాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరిని కదిలించినా భయంభయంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో జంట హత్యలు కల్లోలం రేపాయని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గ్రామ శివారులో గ్రామానికి చెందిన దుమాల బాలవ్వ హత్యకు గురైంది. ఆ సంఘటన తర్వాత బుధవారం వేకువ జామున జరిగిన హత్యల సంఘటనే పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. మృతులు రమేశ్, రాములు వరుసకు బావమరుదులు అయినప్పటికీ వారి మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఏడాది క్రితం భూమి విషయంలో రమేశ్తో రాములు వాగ్వాదానికి దిగాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని గ్రామస్తులు తెలిపారు. అయితే వీరిరువురు హత్యకు మూడు రోజుల ముందు నుంచే మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బోనాలు తీసే విషయమై మాట్లాడుకుంటున్నారని తెలిసింది. ఈ ఇద్దరూ హత్యకు గురికావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. హంతకులను పట్టుకునేందుకు.. జంట హత్యల కేసుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని మరోమారు సందర్శించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రదేశాలనూ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హంతకులను పట్టుకునేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగంపల్లి పంచాయతీ వద్దనున్న సీసీ కెమెరా -
ప్రకృతిలో వికృత చేష్టలు!
పేరేచర్ల(గుంటూరు): పేరేచర్ల ప్రధాన రహదారి పక్కనే 531 ఎకరాల్లో ప్రకృతి రమణీయతను ఆకళింపు చేసుకుని ఉంది నగరవనం. ఇక్కడ ఎత్తైన కొండలు, చెట్లు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సేదదీరేందుకు ప్రభుత్వం నగరవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 నవంబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరవనానికి శంకుస్థాపన చేశారు. ఔషధ మొక్కల పెంపకం, పిల్లల పార్కు, సైక్లింగ్, ట్రెక్కింగ్, జంతుప్రదర్శనశాల తదితరాల ఏర్పాటుకు రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నగరవనం అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం చేరువవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. కొరవడిన నిఘా.. నగరవనంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. దీనికి తోడు వనంలో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కొరవడడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆకతాయితీలు ప్రకృతి రమణీయతలో వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో నగరవన వీక్షణకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక అటవీశాఖకు చెందిన అధికారులు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపిస్తారు లేకపోతే అదీ కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బోర్డుకే పరిమితమైన పిల్లల పార్కు.. నగరవనంలోకి అడుగుపెట్టగానే కొద్ది దూరంలో పిల్లల పార్కు అని కనబడుతుంది తప్ప పార్కు కనిపించదు. పిల్లల కోసం ఇంత దూరం వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని పర్యాటకులు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వారు ఆసక్తిగా తిలకించేందుకు బొమ్మలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నగరవనానికి సమీపంలోనే కొన్ని క్రషర్లు, కంపెనీలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ వనాన్ని కమ్మేస్తోంది. దీంతో పర్యాటకులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. నగరవనానికి చుట్టుపక్కల ఉన్న క్రషర్లు, కంపెనీలను వేరే చోటకి మారుస్తానని అప్పుడు అధికారులు, మంత్రులు చెప్పారు కానీ ఆచరణలో పాటించలేదు. పిల్లలను అతిగారాబం చేయకూడదు తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయకూడదు. కొంతవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి. పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా సంస్కృతీ, సంప్రదాయాలు పట్ల కాసేపు వారితో ప్రేమగా మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా తీసుకొనే కొన్ని నిర్ణయాల వలన జరిగే సంఘటనలు వారికి ఉదాహరణగా తెలియపరచాలి. అంతేకాకుండా నగరవనంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. – కాసు విజయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది ఇలాంటి వనాల్లో ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది. రూ.5 కోట్లు మంజూరు చేసి దానిని గుత్తేదార్లుకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. దీని వలన అక్కడ సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరవానికి కుటుంబ సభ్యులతో రాలేని దుస్థితి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. వనంలో నిఘానేత్రాలు ఏర్పాటు చేయాలి. – రమాదేవి, ఐద్వా నాయకురాలు -
అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నాం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్కుమార్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. గారాబంగా చూసుకున్నారు : అరుణ్ తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్ అంకుల్కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు. ఎవరా అగంతకుడు..? బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు. ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
‘కెమెరా’పురం..
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంపై ఇక నుంచి నిఘా నేత్రాలు పనిచేయనున్నాయి. అటు ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ పద్మవ్యూహం...ఇటు 122 మంది రౌడీ షీటర్లు, 178 సస్పెక్ట్ షీటర్లతో ఉండే పట్టణంలో క్రైమ్ రేటు కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో నేరాలు, ప్రమాదాల అదుపునకు పట్టణమంతా సీసీ కెమెరాలతో నిఘా అత్యవసరం. అందుకే ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ పట్టణాన్ని సీసీ కెమెరాల నిఘా కిందకు తెస్తోంది. పట్టణంలో ఎంపిక చేసిన 19 ప్రధాన కూడళ్లలో 50 సీసీ కెమెరాల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు సెంటర్, ఎర్రవంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెన, ముమ్మిడివరం గేటు సెంటర్, పేరూరు వై జంక్షన్ తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పనులు పూర్తయయ్యాయి. అంతా ఆన్లైన్లోనే.. ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలో సీసీ కెమెరాలు అమరిక పనులు జరుగుతున్నాయి. పట్టణంలో నెలకొల్పుతున్న 50 సీసీ కెమెరాలు పూర్తిగా ఆన్లైన్ విధానంతో ఆ సంస్థ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. వీటి నియంత్రణ అంతా విజయవాడలోని ఆ సంస్థకు చెందిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అక్కడి నుంచే అమలాపురం పోలీసు స్టేషన్కు అనుసంధానం అవుతుంది. పట్టణంలో ఎక్కడైనా చోరీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా... కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో గమనించి తక్షణమే అమలాపురం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తుంది. వారి సెల్ఫోన్లకు ఈ సర్వర్ అనుసంధానమై ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే అమలాపురంలో సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయనుందని ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో పాటు స్థానిక మున్సిపాలిటీ కూడా పట్టణ ముఖ్య వ్యాపార కూడళ్లలో పలు వ్యాపార సంస్థల సహకారంతో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తే పట్టణమంతా పూర్తిగా నిఘా నీడలోకి రానుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్న 19 ముఖ్య కూడళ్లు పేరూరు వై జంక్షన్, గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు సెంటరు, ముమ్మిడివరం గేటు సెంటరు, నల్ల వంతెన, ఎర్ర వంతెన ఈదరపల్లి వంతెన, సుబ్బారాయుడు చెరువు జంక్షన్, ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్, ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్గేట్, రాష్ట్ర హోం మంత్రి హౌస్ ఇన్ గేట్, ఎస్కేబీఆర్ కళాశాల, శ్రీదేవి అమ్మవారి ఆలయం, శ్రీదేవి మార్కెట్, గోల్డ్ మార్కెట్, సాకుర్రు టి.జంక్షన్, అమలాపురం రూరల్ మండలం, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–1, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–2, కనకదుర్గ ఆలయం, భటవిల్లి, అమలాపురం రూరల్ మండలం, సమనస, అమలాపురం రూరల్ మండలం. -
ఓ పల్లె.. 20 సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్ : ఉన్మాదులు రెచ్చిపోతున్నారు.. ముక్కుపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.. వీటికి తోడు దొంగల బెడద.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అడుగడుగునా పోలీసులున్న పట్టణాల్లోనే లెక్కలేనన్ని ఘోరాలు జరుగుతుంటే మరి నిఘాలేని పల్లెల పరిస్థితేంటి? అక్కడ రక్షణ మాటేమిటి? ఇదే అంశం ఆ ఊరి యువతను కునుకు లేకుండా చేసింది. పోలీసు ఔట్ పోస్టు కూడా లేని తమ ఊరి భద్రతపై వారిలో అలజడి మొదలైంది. వెంటనే స్పందించి వాట్సాప్ వేదికగా సమాచారం చేరవేశారు.. చర్చోపచర్చలు జరిపారు.. పక్షం రోజులైంది.. కట్ చేస్తే ఇప్పుడా ఊరికి 20 సీసీ కెమెరాలతో నిఘా.. ఇది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ యువత ‘నిఘా’గాథ. 4 వేల జనాభా.. సుమారు 4 వేల జనాభా ఉన్న అయినాపూర్ గ్రామం విద్యాధికులకు నిలయం. ఇక్కడి యువకులు అనేకమంది సాఫ్ట్వేర్ సహా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఇతర గ్రామాల్లో పని చేస్తున్నారు. అయితే ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తున్న అవాంఛనీయ ఘటనలతో గ్రామస్తులు ఆందోళన చెందుతుండటం.. చీకటి పడగానే తలుపులు వేసుకుంటుండటం గమనించిన ఆ ఊరి యువత ఆలోచనలో పడ్డారు. గ్రామ భద్రత విషయమై కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సతీశ్కుమార్తో చర్చించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా సీసీటీటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. వారంలో రూ.70 వేలు.. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని నేరుగా సంప్రదించడం జాప్యమవుతుందని తాము నిర్వహిస్తున్న అయినాపూర్ సన్రైజర్స్, అయినాపూర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు అందరి నుంచీ ఆమోదం లభించడంతో వెంటనే అయినాపూర్ డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విరాళాల సేకరణ మొదలెట్టారు. గ్రూపు సభ్యులు మహిపాల్రెడ్డి, వినయ్రెడ్డి, అశోక్, వూడెం జైపాల్రెడ్డి, కాయిత జైపాల్రెడ్డి, యాదగిరి, శ్రీధర్రెడ్డి, రవీందర్రెడ్డి, జిల్లా రవీందర్, మురళీధర్రెడ్డి, రఘోత్తంరెడ్డి, చెంబురెడ్డి, సంజీవ్రెడ్డి తదితరులు తొలుత విరాళాలు ఇవ్వడంతో మిగతావారు కూడా ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ.70 వేలు జమవడంతో తొలుత కొన్ని కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తొలి విడత 9 కెమెరాలు గ్రామ భద్రతపై సర్పంచ్ పబ్బోజు విజయేందర్ కూడా స్పందించారు. మరిన్ని కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న రసూలాబాద్ను కూడా కలుపుకొని 20 కెమెరాలును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తొలివిడత 9 కెమెరాలు కొనుగోలు చేసి శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సంతోశ్కుమార్లకు అందించారు. మిగిలిన కెమెరాలను మరో వారం రోజుల్లో సిద్ధం చేయనున్నారు. అలాగే ఇటీవలి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 చొప్పున నగదు బహూకరించారు. ఇలా సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి గ్రామం అయినాపూర్. -
ఇక రైలు మధ్యలో మహిళా బోగీలు
న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీలను ఇక నుంచి రైలు చివరలో కాకుండా మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బోగీలను ప్రయాణికులు తేలికగా గుర్తించేందుకు ప్రత్యేకమైన రంగును వేయనున్నట్లు తెలిపింది. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై రైల్వే బోర్డు చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అన్ని రైల్వే జోన్లను కోరింది. మహిళా బోగీల్లోకి పురుషులు ప్రవేశించకుండా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా బోగీల కిటికీలకు మెష్లు, బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చాలని పేర్కొంది. -
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1.52లక్షల విరాళం
కరీంనగర్ క్రైం : నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ చొరవతో బ్యాంక్కాలనీ, మోహర్నగర్కాలనీవాసులు రూ.1.52లక్షల విరాళాన్ని శుక్రవారం సీపీ కమలాసన్రెడ్డి సమక్షంలో అందజేశారు. ఎస్సై మాధవరావు, బ్లూకోట్ సిబ్బంది శ్రీకాంత్రెడ్డి, నరేందర్, కాలనీవాసులు మన్మోహన్రావు, సంజీవరావు, నర్సింగరావు పాల్గొన్నారు. వాహనాల వేలం వివిధ రకాల ప్రమాదాలు, సరైన ధ్రువపత్రాలు లేక పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నామని సీపీ తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం లేక్ పోలీసులు గుర్తించి ఆర్ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో దుస్తులు ధరింపజేశారు. -
ఆ ఇద్దరు ఎవరు?
నిప్పు ఉంటేనే నీడలుంటాయి... నిజానికి నిప్పు మండుతుంటేనే నీడలు కూడా ఎగసి పడుతుంటాయి. ఈ కథలో ఆ నిప్పుకు కారణమే రెండు నీడలు. ఆ నీడలు ఏమిటి? నిప్పు ఎందుకు పెట్టాయి? చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం ఏ కేసులో అయినా కీలకమైనది.ఆ అక్కాచెల్లెళ్లు రోజూ సాయంత్రం పూట గార్డెన్కు వస్తారు వాకింగ్కు. అక్క పేరు అశ్విని. చెల్లి పేరు ఉష. అక్కకు వయసు 27 ఉంటాయి. చెల్లెలికి 22. ఇద్దరూ çకబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు.కాని చాలాసార్లు అక్క పూర్తిగా నడవదు. సిమెంటు బెంచీ మీద కూలబడుతూ ఉంటుంది.‘రా.. అక్కా... నడూ’ అని పిలుస్తుంటుంది చెల్లెలు.అక్క సమాధానం చెప్పదు. ఏదో చిరాగ్గా అయిపోతుంది.‘ఎంత నడిచినా ఏం ప్రయోజనం నువ్వెళ్లు’ అంటుంది.‘నడవాలక్కా... నడిస్తేనే తగ్గుతావ్ నువ్వు’ చెల్లెలు బతిమాలుతుంది.అక్క మళ్లీ లేచి నిలబడుతుంది.వాకింగ్ చేస్తున్న ఒక ముసలావిడ రోజూ చెల్లెలితో ఒకే మాట అంటుంటుంది– ‘ఏయ్ పిల్లా.. నా కొడుకును చేసుకోవే. మంచి అందగాడు’....చెల్లెలికి ఆమెను చూస్తే భయం. అక్క వైపు భయం భయంగా చూస్తుంది.‘అదీ... అక్క పెళ్లయ్యాక’ నసుగుతుంది. ఆమె అక్కను ఎగాదిగా చూసి ‘మీ అక్క పెళ్లా... ఎప్పటికి జరిగేను’ అని వెళ్లిపోతుంది.అక్క కళ్లల్లో ఆ క్షణంలో నీళ్లు చిమ్ముతాయి. చెల్లెలు ఊరడింపుగా అంటుంది–‘అక్కా... అలా బాధ పడకు. ఏదో ఒక అబ్బాయికి నువ్వు నచ్చుతావు. అలాంటివాడు వస్తాడు. అసలు నువ్వు పట్టించుకోవుగాని వాకింగ్లో నిన్ను గమనించేవాళ్లు ఎంతమంది ఉంటారో తెలుసా?’‘నీ ముఖం నన్నెవరు చూస్తారే?’‘అయ్యో... నీకేం తక్కువక్కా... సూపర్గా ఉంటావు’చెల్లెలు నవ్వించే ప్రయత్నం చేసింది.అక్క ఆ నవ్వులో నవ్వు కలుపుతూ నిస్పృహగా నవ్వింది.2017 డిసెంబర్ నెల 6:30. విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోన్ అదే పనిగా రింగ్ అవుతోంది. ఎస్.ఐ ఫోన్ ఎత్తాడు.‘సార్... గార్డెన్లో అమ్మాయి చావుబ తుకుల్లో ఉంది. ఎవరో తగులబెట్టారు’.. వాచ్మెన్ వగరుస్తూ చెబుతున్నాడు.వెంటనే పోలీసులు హడావిడిగా సంఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసు జీప్తో పాటు 108 వెహికల్ కూడా క్షణం తేడాతో వచ్చి ఆగాయి. చుట్టూ జనం. మంటల్లో కాలి, కొనఊపిరితో పడి ఉన్న యువతి. ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకుంది.‘అక్కా.. అక్కా’ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.బర్నింగ్ వార్డ్లో ఎక్కువ సేపు కూర్చోవడం కష్టంగా ఉంటుంది. అదో రకమైన కమురు వాసన నిండి ఉంటుంది. చావుబతుకుల్లో ఉన్న వారి హాహాకారులు వినడం చాలా కష్టం. జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ముక్కులకు కర్చీఫ్ కట్టుకుని కూర్చున్నారు.‘దాహం.. దాహం’ అందా అమ్మాయి.‘నీళ్లు తర్వాత ఇస్తారు... ముందు ఏం జరిగిందో చెప్పమ్మా’అతి కష్టం మీద చెప్పడం మొదలుపెట్టింది.‘నా పేరు అశ్విని. సాయం త్రం ఐదు గంటల సమయంలో ఊరి చివరన ఉన్న గార్డెన్కి రోజులాగే వాకింగ్కి వెళ్లాను. చెల్లెలు పనిఉండి రాలేదు. సాయంత్రం ఆరున్నర వరకు అక్కడే ఉన్నాను. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు నా ముందుకొచ్చారు. వాళ్లను చూసి భయపడ్డాను. పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ, వారిద్దరిలో ఒకరు నన్ను పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ నా మీద పోసి, నిప్పంటించి పరారయ్యారు...’ చెబుతూనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది అశ్వని. పోలీస్ యంత్రాంగం ఆలోచనలో పడిపోయింది.సంఘటనా స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు దొరకలేదు.అశ్వని రాత్రి 12 గంటలకు చనిపోయింది.పోలీసులకు తెల్లవార్లూ నిద్రల్లేవు. ఆమె బతికి ఉంటే ఇంకొన్ని వివరాలు తెలిసేవి. ఇప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలమే ముఖ్యమైన క్లూగా మిగిలింది. చనిపోయే వ్యక్తి ఇచ్చే వాంగ్మూలం చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగా చూస్తే ఆమె మీద దాడి చేసిన వారు ఎవరు? అశ్వని తల్లీ, తండ్రి, చెల్లెలు ఉషతో మాట్లాడారు పోలీసులు.‘రోజులాగే గార్డెన్కి వాకింగ్కని వెళ్లింది సార్. ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు’ అంది దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లి. గార్డెన్ పరిసర ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వాకబు చేస్తే ఇద్దరు యువకులు ఆ సమయంలో గార్డెన్ నుంచి బయటకు వెళ్లారని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడంతో వాళ్లెవరో గుర్తించలేకపోయారు. కాని ఒక రిటైర్డ్ టీచర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.‘సార్... వాళ్లు నాకు తెలుసు. ఇక్కడకు దగ్గరలోనే ఉంటారు’ అని చెప్పాడు.పోలీసులు నిమిషం ఆలస్యం చేయలేదు. రవి, శ్రీకాంత్ అనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.‘సార్.. మాకేమీ తెలియదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం. బోరు కొడుతుందని రోజూ సాయంత్రం వాకింగ్కి వస్తూ ఉంటాం’ అన్నారు వాళ్లు.వయసులో ఉన్న కుర్రవాళ్లు. వీళ్లు చేస్తే అత్యాచార యత్నం చేయాలి. హత్య ఎందుకు చేశారు. వాళ్లను గట్టిగా మళ్లీ విచారించారు.‘ఎన్నిసార్లు విచారించినా అదే సమాధానం చెప్తున్నారంటే వీళ్లు ట్రైన్డ్ నేరస్తుల్లా ఉన్నారు’ అనుకున్నారు పోలీసులు. వాళ్ల నోరు విప్పించే ఆధారాల కోసం మళ్లీ అన్వేషణ సాగించారు. ఈసారి రెండు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. పగలూ రాత్రీ గార్డెన్ని జల్లెడపట్టాయి. దొరికిన ఆధారాలు ఇలా ఉన్నాయి.∙సంఘటన జరిగిన ప్రాంతంలో నేలంతా పచ్చగా ఉంది. ఒక్క మొక్క కూడా కాలలేదు. ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలింది కనుక దుండగులతో పెనుగులాట జరిగి ఉంటే మొక్కలు కాలడమో గడ్డి డిస్ట్రబ్ కావడమో జరగాలి. అలాంటి దాఖలాలు లేవు. ∙సంఘటన జరిగిన స్ధలం వద్ద రెగ్యులర్గా చాలా మంది వస్తుంటారు. దాడి జరిగి అరిచి ఉంటే ఎవరికో ఒకరికి వినిపించి ఉండాలి.∙ఎవరైనా పెట్రోల్ పోస్తే రెండువైపులా కాలిపోవాలి. కానీ ఇక్కడ ఒకవైపే కాలింది.∙అక్కడి తుప్పల్లో ఓ పెట్రోల్ బాటిల్ దొరికింది. అక్కడ కొన్ని మొక్కలు కాలినట్టుగా ఉన్నాయి. విడిచిన జత చెప్పులు దొరికాయి. అవి ఆ అమ్మాయివే. పెనుగులాట జరిగి ఉంటే చెప్పులు విడిగా అలా విడిచి పెట్టినట్టుగా ఉండవు.ఈ క్లూస్తో పోలీసులు ఈసారి ఆ యువతి ఇంటి నుంచి గార్డెన్ వరకూ గల ఆరు సీసీ పుటేజ్లను పరిశీలించారు. 5 గంటల ప్రాంతంలో ఓ యువతి ఆ ప్రాంతం గుండా వెళ్లి, పెట్రోల్ బంక్ వద్ద ఆగి, బాటిల్లో పెట్రోల్ పోయించుకున్నట్టు కనిపించింది. గార్డెన్లో దొరికిన బాటిల్, యువతి చేతిలో ఉన్న బాటిల్ మ్యాచ్ అయ్యాయి. బాటిల్పై ఉన్న వేలిముద్రలను సరిచూడగా అశ్వని వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి. ఆ బాటిల్ ఇంట్లోదే అని తల్లి నిర్థారించింది. అంటే?ఇది హత్య కాదు. ఆత్మహత్య అన్నమాట. సాధారణంగా మరణ వాంగ్మూలంలో ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ అమ్మాయి చెప్పింది. ఎందుకు? పోలీసులు ఆమె సెల్ఫోన్ గమనించారు. షాక్ అయ్యారు. అందులో కేవలం రెండు నంబర్లే ఉన్నాయి. తల్లిదీ తండ్రిది. ఇలా రెండు నంబర్లు మాత్రమే పెట్టుకుందంటే స్నేహితులు ఎవరూ లేనంత ఒంటరిగా ఉందన్న మాట. తల్లిదండ్రులను పిలిపించారు.‘సార్! అశ్వని లావుగా ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. తను ఇంట్లో పెద్ద కూతురు. తన పెళ్లి అయితేనే చెల్లెలి పెళ్లి అవుతుంది. పెళ్లి అవడం లేదని కొన్నాళ్లుగా బాధపడుతోంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. స్నేహితులు కూడా తనకెవరూ లేరు. తనకిక పెళ్లికాదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకుందంటే మా కుటుంబానికి ఏ ఇబ్బందులు వస్తాయో అనుకుని ఉంటుంది. అందుకే అలా అబద్ధం చెప్పి ఉంటుంది’ అని తండ్రి కన్నీళ్లతో అసలు సంగతి చెప్పారు.అశ్విని హంతకులు ఎవరో తెలిసింది. ఆత్మన్యూనత. డిప్రెషన్.కాని అప్రమత్తంగా లేకుంటే నిర్దోషులైన ఇద్దరు అమాయకులు ఆ వాంగ్మూలానికి బలయ్యేవారు.గౌరవం మరణాన్ని కూడా ఎంతలా శాసించిందీ! – గౌరీశంకర్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. -
ఊరికి వెళితే..
ఎండాకాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రిళ్లు చల్లని గాలికోసం ఆరుబయట నిద్రించేవాళ్లు కొందరు. పిల్లలకు పరీక్షలు పూర్తయ్యాయని విహార యాత్రలకు వెళ్లేవారు మరికొందరు. ఉద్యోగ రీత్యా బదిలీలు కావడంతో దంపతుల్లో ఒకరు వారం పాటు కొత్త ప్రదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి. కారణం ఏదైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చిన్నపాటి అప్రమత్తత అవసరం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుంది. లేకుంటే దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోతారు. చిత్తూరు అర్బన్:పోలీసులు కొత్తగా తీసుకువచ్చిన విధానమే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్). స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక నంబర్ వస్తుంది. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు యాప్లో రిక్వెస్ట్ ప్రొటెక్షన్ను క్లిక్ చేస్తే పోలీసులు ప్రత్యేక సీసీ కెమెరాలను అమరుస్తారు. ఈ కెమెరా యజమాని మొబైల్కు, జిల్లా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానవుతుంది. ఎవరైనా ఇంటి ముందు కనిపించినా, గేటు తీసినా అలారమ్ మోగుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుంటారు. బయట నిద్రిస్తే.. ఏసీలు, ఫ్యాన్లు ఉన్నా వేసవిలో చల్లటి గాలి కోసం చాలా మంది ఆరుబయట పడుకుంటూ ఉంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం టెర్రస్పై నిద్రించాలనుకుంటే తలుపులకు తప్పనిసరిగా తాళం వేయాలి. బంగారు ఆభరణాలు ధరించకూడదు. బీరువాలోని లాకర్లో భద్రపరచాలి. వీలైనంత వరకు నగలను బ్యాంకుల్లో దాచుకోవాలి. కిటికీల పక్కన చొక్కా, ప్యాంటులను తగిలించరాదు. ఒకవేళ ఉంచినా వాటిలో నగదు పెట్టకూడదు. వీలైనంత వరకు అన్ని కిటీకీలు, తలుపులు మూసివేయాలి. ఇంటి బయట బెడ్ ల్యాంపు వెలుగుతూ ఉండాలి. పడుకునేచోట పక్కనే టార్చిలైటును పెట్టుకోవాలి. ఉద్యోగస్తులు ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లోని ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మగవారు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లినప్పుడు మనకు తెలియని వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అపరిచితులు ఎవరైనా వస్తే గేటు బయట నుంచి పంపించేయాలి. తలుపులు తీయకుండానే, గ్రిల్ లోపలి నుంచే సమాధానం చెప్పాలి. పలు రకాల వస్తువులు, గిఫ్ట్ వస్తువులు అంటూ వచ్చే వారితో మాట్లాడకపోవడం ఉత్తమం. వారితో బేరసారాలు చేస్తూ కూర్చోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. మార్కెటింగ్ పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని నమ్మకూడదు. ఒకవేళ అపరిచితులు మార్కెటింగ్ పేరుతో విసిగించినా, ఇబ్బంది పెట్టినా తక్షణం 100 నంబర్కు ఫోన్ చేయా లి. లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005కు ఇంటి బయట ఉన్న వారి ఫొటో తీసి పంపాలి. సహకరించండి... వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు పోలీసుశాఖకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చోరీలు జరగవు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్లో మేమే కెమెరాలు పెట్టి దొంగల్ని పట్టుకుంటాం. ఒకవేళ వద్దనుకుంటే కంపెనీలు, సంపన్నులు వాళ్లే సొంతంగా కెమెరా పెట్టుకుని పోలీసుల కంట్రోల్ రూమ్కు కాకుండా వాళ్ల ఫోన్లకే అనుసంధానం చేసుకోండి. ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లాలంటే ఇంట్లో ఒకర్ని ఉంచండి. అలాకాకపోతే తాళం వేసిన ఇంటి బయట రాత్రుళ్లు లైట్లు వెలిగేలా చూడాలి. రెండు, మూడు జత చెప్పులను తలుపు బయట వదిలివెళ్లడం చేయాలి. ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును పెట్టకండి. సమీపంలోని పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చి సహకరించండి.– ఐ.రామకృష్ణ, డీఎస్పీ, చిత్తూరు క్రైమ్ -
నో కామెంట్ ప్లీజ్!
దురుసుగా పరుగెడితే కాలు మడత పడొచ్చు మన కాలేగా. రిపేర్ చేసుకోవచ్చు. కానీ, అదే దురుసుతో నాలుక పరిగెడితే మడత పడదుగానీ మడతలు పెట్టొచ్చు బీ కేర్ ఫుల్.. నో కామెంట్ ప్లీజ్! కాల్డేటాయే కాదు సెల్టవర్ టెక్నాలజీ కూడా నేరస్తుడిని పట్టిస్తుంది అని నిరూపించారు కాజిపేట పోలీసులు ఏసీపీ జనార్ధన్ అండ్ టీం (మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది జి. దేవేందర్, బి. సాంబయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్). నేరస్తుడికి శిక్ష పడేలా వృత్తిధర్మం నిర్వహించారు. మాట హత్యకు దారి తీయవచ్చు.మాట హంతకుణ్ణి పట్టి ఇవ్వవచ్చు కూడా.మిట్టమధ్యాహ్నం.కాజీపేట స్టేషన్.ఏసీపీ ఎదురుగా ఓ కేసు తాలూకు ఫైల్ ఉంది. ఆ ఫైల్ను చూస్తే అతనికి కోపం. చికాకు. అసహనం. ఏడాది నుంచి అది అతని టేబుల్ మీద పడి ఉంది. కేసు తేలదు. ఫైల్ క్లోజ్ కాదు. క్లోజ్ కాని ఏ ఫైల్ అయినా పోలీసు గుండెల మీద ఫిరంగే.ఇన్స్పెక్టర్ వచ్చి రొటీన్గా సెల్యూట్ చేశాడు. ఏసీపీ ఆ ఫైల్ వైపు చూపుడు వేలు ఆడించి అన్నాడు–‘ఏంటయ్యా ఇది. ఒక్క క్లూ కూడా దొరకుండా అంత పకడ్బందీగా మర్డర్ ఎలా చేశారు? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చోట దొరికి తీరాల్సిందే కదా. అసలు నేరస్తుడు ఎవరో ఇంతవరకూ పట్టుకోకపోతే ఇక మనమెందుకు. ఏం... రిజైన్ చేసి వెళ్లిపోదామా’...ఇన్స్పెక్టర్ ఏమీ అనకుండా స్టడీగా నిలుచున్నాడు.ఏసీపీ కే సు తాలూకు ఫైల్ మీద చేత్తో గట్టిగా తడుతూ మళ్లీ ఓపెన్ చేశాడు. కేస్ ఫైల్ తేదీ: 2016 సెప్టెంబరు 14. మృతుడు: పులిగిల్ల చందు. వయసు: 19 జరిగింది: హత్య. చేసినవారు: ఆధారాలు లభించలేదు. మూసేశాడు. ‘ఛాన్సే లేదు. ఏదో ఒక క్లూ దొరకాల్సిందే. ఏంటా క్లూ. సాక్ష్యాధారాలతో నేరస్తుడిని పట్టుకుతీరాలి. ఎలా?’ తనలో తనే అనుకుంటూ గట్టిగా పైకే విసుక్కున్నాడు. 2016 సెప్టెంబర్ 13.గణేష్ నిమజ్జనంలో పోలీసులకు ఊపిరి సలపనంత పనిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బృందమంతా వేయికళ్లతో పహారా కాస్తోంది. తెల్లవార్లూ నిమజ్జన హడావిడితో కంటి మీద కునుకు కూడా లేదు.మరుసటి రోజు. నిమజ్జనం సజావుగా సాగినందుకు పోలీసులు అప్పుడప్పుడే ఊపిరి తీసుకుంటున్నారు. ఇంతలో ఫోన్ మోగింది.ఎత్తి ‘హలో’ అన్నాడు కానిస్టేబుల్.అటువైపు ఎవరో అపరిచితుడు.‘భట్టుపల్లి కోటచెరువు దగ్గర ముళ్లపొదల్లో ఎవరిదో బాడీ పడి ఉందండీ. చూస్తే కుర్రాడిలా ఉన్నాడు’పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి చాలామంది పోగై ఉన్నారు. పంతొమ్మిది ఇరవై ఏళ్ల కుర్రాడి శవం పడి ఉంది. శవం పడి ఉన్న తీరు చూస్తే ఏదో ఆయుధంతో హత్య చేసినట్టు అర్థమవుతోంది.కాసేపటికి ఆ కుర్రాణ్ణి జనంలో ఎవరో గుర్తించారు.‘వీడు చందులా ఉన్నాడే’వెంటనే చందు తల్లిదండ్రులకు సమాచారం అందింది. చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి వాళ్ల దుఃఖానికి అంతులేదు. ‘మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరిపైన అయినా అనుమానం ఉందా’ పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లి ‘అయ్యా! నా బిడ్డ ఎవరితోనూ గొడవకు పోయే రకం కాదు’ ఏడుస్తూనే చెప్పింది. తల్లీదండ్రి నుంచి వివరాలు తీసుకొని, శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. చందు ఫోన్ కాల్స్ ఆధారంగా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ రోజు అతనితో ఫోన్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. దర్గా కాజీపేట సెల్ఫోన్ టవర్ల పరిధిలోని అన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ను సేకరించి, విశ్లేషించారు. అనుమానితులుగా అనిపించిన 12 మందిని విచారించారు. వారికి ఏ సంబంధం లేదని తేలింది. చందు నివసించే దర్గా కాజీపేటలో ఇరుగుపొరుగు వారినీ ప్రశ్నించారు. ‘ఆ పిల్లాడు చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు’ అని జవాబు వచ్చింది. కేసు ఇంకా క్లిష్టంగా మారింది.ఫైల్ చూస్తున్న ఏసీపీ కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. మృతుడి స్నేహితులను, ఇరుగుపొరుగును విచారించినా ఏమీ తెలియలేదు. కాల్డేటా ద్వారా కూడా ఎటువంటి క్లూ లభించలేదు.. ఇంకేమిటి దారి అనుకుంటూ ఉంటే ‘టవర్ లొకేషన్ టెక్నాలజీ’ గుర్తుకొచ్చింది.ఇన్స్పెక్టర్ని పిలిచాడు.హతుడు పడి ఉన్న చోట ఆ సమయంలో అక్కడి టెలిఫోన్ టవర్ పరిధిలో యాక్టివ్గా ఉన్న ఫోన్ నంబర్ల వివరాలను టవర్ లోకేషన్ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ యాంగిల్లో ట్రై చేద్దాం’ అన్నాడు.ఇన్స్పెక్టర్ తల ఊపాడు.పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయం రాత్రి 11 గంటలు. శవాన్ని చెరువు దగ్గర పడేశారంటే మరో అరగంట పట్టే ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న సెల్ టవర్ లోకేషన్ మ్యాప్ను టెలికాం ఆపరేటర్ల నుంచి తెప్పించారు. ఆ సమయంలో సెల్టవర్ పరిధిలో యాక్టివ్గా ఉన్న వేలాది నెంబర్లను తరచి తరచి చూశారు. అన్నింటిని వడపోయగా హత్య జరిగిన సమయంలో, సంఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి ఫోన్ సిగ్నల్ యాక్టివ్గా ఉన్నట్టు తేలింది.అతని పేరు గుగులోతు శివ.శివను విచారించారు పోలీసులు. అతను చెప్పినది విన్నాక చందూకి, గుగులోతు శివకు ఎటువంటి çశతృత్వమూ లేదని తెలిసింది. కానీ, పోలీసులకు అనుమానం పోలేదు.శివ చెప్పిన వివరాలతో వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.గుగులోతు శివ మరో యువకునితో హోండా అక్సెంట్ కారులో పదే పదే తిరగడం కనిపించింది.ఎవరా అని ఆరా తీస్తే అతని పేరు రాంకీ అని తేలింది. కాల్స్ అన్నీ వీళ్లిద్దరి మధ్య నడిచాయి.ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ‘ఎందుకు చంపారు’ అడిగారు పోలీసులు.రాంకీ వైపు చూశాడు శివ.‘ఏమిటి కారణం?’ రాంకీని అడిగారు.‘నా గర్ల్ఫ్రెండ్ను కామెంట్ చేశాడు’ అన్నాడు రాంకీ.ఒక కామెంట్ హత్య దాకా వచ్చింది. వర్థన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ దర్గా కాజీపేట లో ఉండే తన బావ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అక్కడే ఒకమ్మాయితో ప్రేమలోపడ్డాడు. 2016 సెప్టెంబరు 13న వినాయక నిమజ్జనంలో రాంకీ తన గర్ల్ఫ్రెండ్తో కలిసి డాన్స్ చేశాడు. ఆ టైంలో చందు అక్కడే ఉన్నాడు.చూసి ఊరుకుని ఉంటే బాగుండేది.అమ్మాయిని కామెంట్ చేశాడు.‘ఏంట్రా కూశావ్’ అని రాంకీ చందూ కాలర్ పట్టుకున్నాడు. ఏదో మామూలు నిమజ్జనం గొడవ అనుకున్న చుట్టుపక్కలవాళ్లు వాళ్లను విడిపించారు. కాని రాంకీ తన కోపాన్ని వీడలేదు. తన లవర్ని కామెంట్ చేసినవాడిని హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దర్గా కాజిపేటలో ఉండే ఫ్రెండ్ గుగులోతు శివ ద్వారా చందును పిలిపించాడు. ‘‘గొడవలొద్దు, అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్లా కలిసిపోదాం. పార్టీ చేసుకుందాం’’ అన్నాడు. చందు సరే అనడంతో ముగ్గురూ కలిసి వర్థన్నపేట వరకు వెళ్లారు. అక్కడ తన ఇంట్లో పదునైన ఇనుప చువ్వను చందు చూడకుండా కారులో పెట్టాడు రాంకీ. కారులోనే ముగ్గురూ మద్యం సేవించారు. చందును రెచ్చగొట్టి బాగా తాగించారు శివ, రాంకీలు. చందు మత్తులోకి వెళ్లాడు. వెంటనే ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణారహితంగా రాంకీ దాడి చేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత కారులోనే రోడ్లన్నీ తిరిగి తిరిగి చివరకు భట్టుపల్లి కోటచెరువు ముళ్ల పొదల్లో మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఇనుపచువ్వను స్వాధీనం చేసుకొని, 2017 అక్టోబరు నాటికి నిందుతులకు బేడీలు వేసి కోర్టుముందు హాజరుపరిచారు పోలీసులు. – కృష్ణ్ణగోవింద్, బ్యూరో ఇంచార్జీ, సాక్షి, వరంగల్ -
సీసీ కెమెరాల నిఘాలో స్పాట్ వాల్యుయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా గుర్తింపు కార్డును ధరించడంతో పాటు సెల్ఫోన్లు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. ఒక్కసారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయులు సాయంత్రం మూల్యాంకనం ముగిసేవరకూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం నగరంపాలెం స్టాల్ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో క్యాంప్ అధికారి, డీఈవో ఆర్.ఎస్ గంగా భవాని పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 2,100 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ నియమించింది. వీరిలో అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తాగునీరు, క్యాంటిన్, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లో నామమాత్రపు ధరకు ఆహారంతో పాటు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. గతేడాది వరకు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటినే నేరుగా ఉపాధ్యాయులకు అందిస్తూ రాగా గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా ప్రబలిన నేపథ్యంలో కూలింగ్ వాటర్ క్యాన్లు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరుకున్నఆరు లక్షల స్క్రిప్ట్లు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఆరు లక్షల స్క్రిప్ట్లు జిల్లాకు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 స్క్రిప్ట్లకు మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందని డీఈవో ఆర్.ఎస్ గంగా భవానీ చెప్పారు. స్పాట్ వాల్యుయేషన్ విధి నిర్వహణకు నియామకం పొందిన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్ చేసి పంపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విధులకు గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో శ్రమకోర్చి పరీక్షలు రాసిన ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించని రీతిలో ప్రశ్నపత్రాలకు పకడ్బందీగా మూల్యాంకనం జరపడంతో పాటు వచ్చిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్లు, కోడింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు చేçపడుతున్నట్టు చెప్పారు. -
మకాంపై మూడోకన్ను!
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో చేతివాటం ప్రదర్శించిన ‘స్టార్ చోర్’ జయేష్ రావ్జీ సెజ్పాల్ సిటీలోనూ మూడుసార్లు చోరీలు చేశాడు. అలా నగరానికి వచ్చిన ప్రతిసారీ లాడ్జీల్లోనే బస చేశాడు. కేవలం ఇక్కడే కాదు... ఎక్కడకు వెళ్లినా, ఎన్నిసార్లు పంజా విసిరేందుకు పథకం వేసినా ఇలానే చేస్తుంటాడు. కేవలం జయేష్ ఒక్కడే కాదు అనేక మంది ‘వలస నేరగాళ్లకు’ లాడ్జిలు షెల్టర్ జోన్లుగా మారుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చి మార్కెట్ పరిధిలో 55 తులాల బంగారం తస్కరించిన జిలానీ, మేవాట్ రీజియన్ నుంచి వచ్చి అటెన్షన్ డైవర్షన్లకు పాల్పడిన టట్లు బాజీ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ‘మస్కా’రాలతో అందినకాడికి దండుకుపోయిన ముఠాలను అరెస్టు చేసిన తర్వాత వారు నగరంలోని లాడ్జిల్లో బస చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయా ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జిలు, హోటళ్లపై నిఘా కట్టుదిట్టం చేయాలని నగర పోలీసు విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా సిటీలోని అన్ని లాడ్జిలు, హోటళ్లను అనుసంధానించాలని యోచిస్తోంది. వాటిలో బస చేస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు అందేలా, సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఇవి నిక్షిప్తమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భవిష్యత్తులో ఓ నేరగాడు సిటీలోని ఏదైనా లాడ్జ్/హోటల్లో దిగిన వెంటనే తమను అప్రమత్తం చేసేలా ఆధునిక హంగులు సైతం అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కొంతమేర మాన్యువల్గా... లాడ్జిలు, హోటళ్లలో బస చేసే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వాటిని సమీప పోలీసుస్టేషన్లో ఏరోజుకారోజు అందించాలనే నిబంధన అమలులోనే ఉంది. అయితే వాటి నిర్వాహకులు కస్టమర్ల వివరాలను మాన్యువల్గా నమోదు చేసుకుంటున్నారు. వీటినే ప్రతుల రూపంలో పోలీసులకు అందిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏదైనా అంశం క్రాస్చెక్ చేయాలంటే ప్రస్తుతం కష్టసాధ్యంగా ఉంది. ఈ మాన్యువల్ వ్యవహారానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. ఇందులో నగరంలోని లాడ్జిలు, హోటళ్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానిస్తారు. ఆయా చోట్ల బస చేయడానికి వచ్చే వారి వివరాలు సిబ్బంది తమ కంప్యూటర్లో నమోదు చేసిన వెంటనే అవి సర్వర్ అనుసంధానంతో పోలీసులకు చేరిపోతాయి. నిర్ణీత కాలం వీటిని భద్రంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పుడు వివరాలు చెప్పే చాన్స్ ఎక్కువే... బయటి ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని లాడ్జిల్లో బస చేస్తున్న నేరగాళ్లు తప్పుడు వివరాలు చెప్పేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వాటి నిర్వాహకులు కచ్చితంగా వినియోగదారులకు చెందిన గుర్తింపుకార్డులను పరిశీలించడంతో పాటు దాని ప్రతిని సైతం తీసుకుంటున్నారు. అయితే ఈ గుర్తింపుకార్డులే నకిలీవి అయినప్పుడు చేసేదేమీ ఉండదు. దీంతో దాదాపు ఆయా వ్యక్తులకు చెందిన పేర్లు, చిరునామాలు పక్కాగా గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసు విభాగం దగ్గర ఉన్న ‘360 డిగ్రీస్ వ్యూ’ తరహా సాఫ్ట్వేర్ వాడాలని భావిస్తున్నారు. ఇలా రికార్డైన బస చేసిన నేరగాళ్ల వివరాలు పోలీసులకు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో నిత్యం పర్యవేక్షించే ఆస్కారం ఏర్పడుతుంది. అనుమానిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై తక్షణం కన్నేసి ఉంచడానికి అనువుగా మారనుంది. నగరంలో నేరాలు చేసే ‘వలస నేరగాళ్లకు’ ఈ విధానం ద్వారా చెక్ చెప్పే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్లో ప్రత్యేక ఎనలటిక్స్ జోడించి... ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను భవిష్యత్తులో మరింత పరిపుష్టం చేయడానికీ నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఎనలటిక్స్గా పిలిచే సాఫ్ట్వేర్ను వినియోగిస్తారు. నగరానికి సంబంధించిన, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నగరంలో నేరాలు చేసిన వారి ఫొటోలు పోలీసు విభాగం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాబేస్ను అనలటిక్స్ సాయంతో లాడ్జిలు/హోటళ్లకు చెందిన ఆన్లైన్ కనెక్టివిటీతో అనుసంధానిస్తారు. ఓ పాత నేరగాడు ఏదైనా లాడ్జిలో దిగినప్పుడు దాని నిర్వాహకులు అతడి వివరాలు నమోదు చేయడంతో పాటు వెబ్క్యామ్లో ఫొటో సైతం తీస్తారు. ఈ ఫొటో పోలీసు సర్వర్లోకి వచ్చిన వెంటనే ఎనలటికల్ సాఫ్ట్వేర్ పాత నేరగాళ్ల డేటాబేస్లో సరిచూస్తుంది. సదరు వ్యక్తి నేరచరితుడైనా, వాంటెడ్గా ఉన్నా తక్షణం గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఇలా సిటీలో అడుగుపెట్టిన వెంటనే నేరగాళ్లను పట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడనుంది. గరిష్టంగా మరో మూడు నెలల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
గాడీ నెం.6768
‘మృత్యువు నుంచి తప్పించు కోలేం’ అని అంటారు. కానీ, మృత్యువుకు కారణమైనవాడిని కూడా తప్పించుకోనివ్వదు క్లూ! తప్పు జరగవచ్చు... చిన్నవి, పెద్దవి ఎలాంటి తప్పులైనా జరగవచ్చు. ఆ తప్పును ఒప్పుకోవడంలో ధైర్యం ఉంది. తప్పు నుంచి పారిపోవడంలో ఉన్నది శిక్ష. 2016 డిసెంబర్ 10. హైదరాబాద్.తెల్లవారుజాము 6 గంటలు. మనసు కీడు శంకిస్తూ ఉంది. సాధారణంగా ఉదయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆమెకు. కాని ఆరోజు తెల్లవారుజాము ఏదో దుశ్శకునంగా ఉంది. అసలే రాత్రి పడ్డ పీడకల తాలుకు కలత వదల్లేదు. ఇప్పుడు ఈ గుబులు. అవునూ... ఈయన ఇంకా రాలేదేమిటి?వాకిలిలోకి వచ్చింది. గేటువైపు చూసింది. మరో అరగంట గడిచింది. గుబులు పెరిగిపోతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. రోజూ ఐదింటికి వాకింగ్కు వెళ్లడం మామూలే. ఆరు లోపే వచ్చేస్తాడు. కొంచెం ఆలస్యం అయితే ఫోన్ చేస్తాడు. ఇవాళ రాలేదు. ఫోనూ చేయలేదు.సెల్ తీసుకొని కాల్ చేసింది. నో రెస్పాన్స్.. ఏమై ఉంటుంది?! స్నేహితులు ఎవరైనా కలిసి ఉంటారులే అని మనసుకు సర్దిచెప్పుకుంది. కాని గుబులు. పేపర్ తిరిగేసింది. గమ్మం గుండా గేటు వరకు కళ్లను అప్పగించింది. కిచెన్లోకి వెళ్లింది. అప్పటికే ఒకసారి కలిపి ఉంచిన డికాషన్ చల్లారిపోతే మళ్లీ వేడి చేసింది. ఆయన వస్తే రోజూ కలిసి కాఫీ తాగడం అలవాటు.ఇంకా రాలేదేమిటి?గుబులు పెరిగిపోతూ ఉంది.ఫోన్ రింగ్ అయ్యింది. ఈ టైమ్లో ఫోన్ చేసేదెవరు? ఈయనే అయి ఉంటుంది. సెల్ చేతిలోకి తీసుకుంది. కొత్త నెంబర్. ఇది కీడే... మనసు చెబుతూ ఉంది. వణుకుతన్న చేతిని కంట్రోల్ చేసుకుంటూ గ్రీన్ బటన్ ప్రెస్ చేసింది. అవతలి నుంచి విషయం వింటూనే ఫోన్ జారి నేలన పడింది.. రాయదుర్గం గచ్చిబౌలీ రోడ్.రోడ్డు మీద ఆయన పడి పోయి ఉన్నాడు. కళ్లద్దాలు ఒకవైపు పడి ఉన్నాయి. చెప్పులు జారిపోయాయి. పేరు దేవదానం అని పోలీసులకు అర్థమయ్యాక ఇంటికి ఫోన్ చేశారు. ‘ఎలా జరిగింది?’ ఆమె అతి కష్టం మీద అడిగింది.‘హిట్ అండ్ రన్ కావచ్చు’ అని జవాబు వచ్చింది. ఆ గుర్తు తెలియని వాహనం ఎవరిది? ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. ఓ చిన్న గోడ అడ్డు రావడంతో ఆ స్పాట్లో ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్ రికార్డు కాలేదు. రోడ్లు ఊడ్చే వాళ్ళు, పాలు పోసే వాళ్ళు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా ఫలితం లేదు. ‘మాకు తెలియదు... మేం చూళ్లేదు’ అన్నారు.కేసు మిగిలిన ‘హిట్ అండ్ రన్’ కేసుల మాదిరిగా మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే దేవదానంను హత్య చేసి ఉంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? కుటుంబసభ్యులకు ఎడతెరిపిలేని సందేహాలు.వాటిని పోలీసుల ముందుంచారు. ‘సార్... ఈ కేసులో అనఫీషియల్గా ఇన్వాల్వ్ కావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి’ అన్నారు సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు.‘ఏం అవసరం శ్యాంబాబు... లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారుగా’ అన్నాడు పై అధికారి.‘చనిపోయింది మా నాన్న సార్. నేనొక పోలీసై ఉండి అతణ్ణి పట్టుకోలేకపోతే మనసుకు కష్టంగా ఉంది. మా నాన్న కోసమే కాదు... ఇలా హిట్ అండ్ రన్ చేసితప్పించుకోవచ్చు అనుకునేవారందరికీ ఈ కేసొక గుణపాఠం కావాలి’ పట్టుదలగా అన్నారు శ్యాంబాబు.‘ఓకే... గో అహెడ్’ పర్మిషన్ దొరికింది.శ్యాంబాబు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.దేవదానం మృతదేహం దొరికిన ప్రాంతంలో ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క కనిపించింది. అది తప్ప ఇంకేమీ దొరకలేదు. ఈ కేసుకు ఇదే ముఖ్యమైన క్లూ అని శ్యాంబాబుకు అనిపించింది. దానిని పరీక్షగా చూశారు. ‘ఫోర్డ్’ అనే అక్షరాలు ఉండటం వల్ల అది ఫోర్డ్ కారుకు చెందిన మడ్గార్డ్ కుడివైపు లైనర్దిగా గుర్తించారు. దీన్ని తీసుకుని షోరూమ్కు వెళ్ళిన ఆయన దాన్ని అక్కడి మెకానిక్స్కు చూపించారు. ‘ఇది 2012 మోడల్కు చెందిన ఫోర్డ్ ఫిగో కారుది సార్’అని తేల్చారు వాళ్లు. తండ్రి మరణానికి ఈ ఫోర్డ్ ఫిగోకి లంకె ఉందని శ్యాంబాబుకు అర్థమైంది. వెంటనే గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం మార్గంలో ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. యాక్సిడెంట్ అయిన రోజు అనేక కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను సేకరించి పరిశీలించారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య వెళ్ళిన ఫోర్డ్ ఫిగో మోడల్స్పై దృష్టిపెట్టారు. ఓ సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్ మరికొంత క్లూ ఇచ్చింది.‘నెంబర్ జూమ్ చేయండి’ ఆదేశించారు శ్యాంబాబు.జూమ్ అయ్యింది.ఏపీ 10 బీసీ 6768.ఎస్. ఈ కారే అయి ఉండాలి. వెంటనే ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న అడ్రస్ దొరికింది. 2017 జనవరి 2.తన తండ్రిని చంపింది ఎంటెక్ విద్యార్థి గుత్తికొండ ప్రశాంత్కుమార్గా శ్యాంబాబు తేల్చారు. ఆ రోజు ఏమైందంటే... ప్రశాంత్ ముందురోజు రాత్రి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటికి బయల్దేరాడు. నిద్ర, మద్యం మత్తు.... ఎక్స్లేటర్ మీద అదుపులేని కాలు.. దారిలో వాకింగ్ చేస్తున్న దేవదానాన్ని ప్రశాంత్ గుర్తించలేదు. దారుణంగా యాక్సిడెంట్ చేసి ఆయన మృతికి కారకుడయ్యాడు. అయితే ఆ యాక్సిడెంట్ని ఎవరూ చూడలేదని గ్రహించి నేరుగా సికింద్రాబాద్లోని బాపుబాగ్కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తండ్రి గుత్తికొండ రమేష్ ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ తాను కూకట్పల్లి నుంచి వస్తుండగా కారు గుంతలో పడి మడ్గార్డ్ దెబ్బతిందని తల్లిదండ్రుల్ని నమ్మించాడు. కొన్ని రోజులపాటు బండిని బయటకు తీయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్ బోయిన్పల్లిలోని ఓ గ్యారేజ్లో కార్ రిపేర్ చేయించాడు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకోవడానికి కారు నెంబర్ ప్లేట్తో పాటు మడ్గార్డ్ తదితరాలను మార్చేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే బోయిన్పల్లిలోని గ్యారేజ్లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్న శ్యాంబాబు ఘటనాస్థలిలో దొరికిన లైనర్ ముక్కను దానికి అమర్చి చూడగా సరిగ్గా సరిపోయింది. ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడనేది నిరూపించడం కోసం పోలీసులు ఆ రోజు అతడు వెళ్ళిన పబ్స్లో నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు అతడు తన డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించిన బిల్లుల్నీ సేకరించారు. సాక్ష్యాల తారుమారుకు యత్నించిన ప్రశాంత్పై నమోదైన కేసులో ఆ సెక్షన్లనూ జోడించి అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. ఎవరీ దేవదానం? నాయబ్ సుబేదార్ హోదాలో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించిన దేవదానం ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. సంగ్రామ్ మెడల్, వార్ మెడల్, ‘25 ఇయర్స్ ఇండిపెండెన్స్ మెడల్’ పొందారు. పదవీ విరమణ తర్వాత రాయదుర్గంలో తన భార్యతో కలిసి నివసిస్తూ 72 ఏళ్ళ వయస్సులోనూ ఫస్ట్మ్యాన్ సెక్యూరిటీ సర్వీసెస్లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేసేవారు.. ముగ్గురు కుమారులూ ఉన్నత స్థితిలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం ఖాళీగా కూర్చోనంటూ ఉద్యోగం కొనసాగించారు. హైదరాబాద్ దర్గా ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన దేవదానం ఎప్పటిలాగే 2016 డిసెంబర్ 10 తెల్లవారుజామున వాకింగ్కు వెళ్ళారు. వాకింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆయన్ను 5.30 గంటల ప్రాంతంలో మాతా మందిర్ వద్ద ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడే రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. క్లూ కథనాలు పంపండి రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com ఇన్పుట్స్: కామేశ్, సాక్షి ప్రతినిధి -
ఏపీజీవీబీ బ్యాంక్లో చోరీ
శ్రీకాకుళం : జిల్లాలోని బూర్జ మండలం, కొల్లివలస గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుండగులు బ్యాంక్ కిటికి గ్రిల్స్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ టీవీ కెమరాలను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున బ్యాంకు కిటికి తెరిచి ఉండటం, సీసీ కెమరాలు ధ్వంసం అయి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అదించారు. విషయం తెలుసుకుని బ్యాంకు వద్దకు చేరుకున్న అధికారులు పెద్ద మొత్తంలోనే నగదు లూటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీజీవీబీ బ్యాంక్లో చోరీ
-
ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్): ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఆశ్రమాల్లో జరిగే ప్రతీ సంఘటన.. విషయం క్షణాల్లో అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీచోట ఆరు సీసీ కెమెరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ లేదా వైఫై ద్వారా నేరుగా ఆయా జిల్లాల డీటీడీవో కార్యలయాలు, అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యలయానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆశ్రమాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేక ఐపీల ద్వారా కార్యాలయాలు, అధికారులు స్మార్ట్ఫోన్లకు ప్రత్యక్షంగా వీక్షించేలా అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతరం సీసీ నిఘా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127 ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతి గృహాల్లో 1254 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తూ వసతి సౌకర్యాలు క ల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలలపై పటిష్ట పర్యవేక్షణ ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, విద్యనందించాలని ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యకు అనుగుణంగా ఆరుకు తగ్గకుండా సీసీ కెమెరాలు, డీవీఆర్, మానిటర్లను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇప్పటికే 40శాతం పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిసింది. ఆశ్రమం ప్రధాన ద్వారం, సరుకుల గది, మైదానం, వరండాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేస్తూ కార్యాలయ గదిలో టీవీలకు అనుసంధానం చేయడం ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లేదా వైఫై సాయంతో ప్రత్యే క ఐపీల ద్వారా నేరుగా డీటీడీవో కార్యాలయానికి అక్క డి నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అధికా రుల స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. మహిళా సిబ్బంది హర్షం, బాలికలకు భరోసా.. ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆశ్రమాల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు గిరిజన సంక్షేమశాఖ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా బాలికల ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నార్నూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ అనే ఉపాధ్యాయుడు గిరిజన బాలికలపై అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుతో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి, బాలికల భద్రతకు భరోసా ఏర్పడనుంది. డుమ్మా సిబ్బందికి గుబులు.. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు అంటేనే అక్రమాలకు నిలయమని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా చా లా మంది సిబ్బంది ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం కంటే హెచ్డబ్ల్యూవో (వార్డెన్)లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూ పిస్తుంటారు. ఇందుకోసం ఉన్నతా«ధికారులపై రాజకీయంగా, ఇతర రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి హెచ్డబ్ల్యూవోలుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులకు పెట్టే మెనూలో కోత పెట్టి బి య్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టిస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడిన సం దర్భాలున్నాయి. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది వంతులవారీగా ఆశ్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సంఘటనలున్నాయి. జిల్లాలో ఓ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ నెలల తరబడి వి ధులకు హాజరు కాకుండా రిజిష్టర్లో వేరే సిబ్బందితో తన సంతకం పెట్టిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సిబ్బంది తరచూ ఆశ్రమాలకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాలు, వ్యవసాయం లాంటి పనులు చేసుకుంటున్నారు. అధికా రులకు తెలిసిన పైరవీలు, రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో సీసీ నిఘా ఏర్పాటు కావడంతో ఆశ్రమాల్లో చోటు చేసుకునే అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో విధులకు ఎగనామం పెట్టే సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యం నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో సీసీల ఏర్పాటు ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందనుంది. సీసీల నిఘాతో గిరిజన విద్యార్థులకు అన్ని రకాలుగా మేలు జరగనుంది. – పోషం, గిరిజన సంక్షేమశాఖ, డీటీడీవో, ఐటీడీఏ జిల్లాలవారీగా ఆశ్రమ పాఠశాలలు జిల్లా పేరు ఆశ్రమ, వసతి గృహాలు విద్యార్థులు ఆదిలాబాద్ 54 19,706 కుమురంభీం 46 12,327 మంచిర్యాల 17 3,359 నిర్మల్ 17 4,940 -
కఠిన పరీక్ష
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది. కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్తోపాటు డిపార్టుమెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంట్పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆందోళనలో ఇన్విజిరేటర్లు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి. ఈ ఏడాది 35,737 మంది ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ -
మహిళలకు మరింత రక్షణ
సంగారెడ్డి క్రైం: ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే మహిళల రక్షణ కోసం సంగారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘‘మై వెహికల్ ఈజ్ సేఫ్’’పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని ఆటోలన్నింటికీ ప్రత్యేకంగా ఓ బార్కోడ్ కేటాయించారు. స్మార్ట్ఫోన్తో ఆ బార్కోడ్ను స్కాన్ చేస్తే క్షణాల్లో డ్రైవర్కు సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆటో ఎక్కిన మరుక్షణమే కోడ్ను స్కాన్ చేసి ఆ వివరాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరికైనా ముందు జాగ్రత్తగా పంపించుకోవచ్చు. దీని సాయంతో డ్రైవర్లు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా పోలీసులు వారిని సులువుగా గుర్తించి అదుపులోకి తీసుకునే వీలుంటుంది. గత సంఘటనల నేపథ్యంలోనే.. పల్లె జనం, ముఖ్యంగా మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆకతాయిలు గతంలో పలు అఘాయిత్యాలకు పాల్పడిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నేరాల నియంత్రణకు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆటోవాలాల్లో బాధ్యతను, భయాన్ని నింపేందుకు ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్ కేటాయించి అతని పూర్తి వివరాలు సేకరించింది. అక్రమాలు అరికట్టేందుకే.. ఆటోలో ప్రయాణించేటప్పుడు మీ వస్తువులు మర్చిపోయినా, మిమ్మల్ని వేధింపులకు గురి చేసినా, మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా స్కాన్ చేసిన కోడ్ నుంచి వచ్చిన వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. జిల్లాలో మొత్తం 4,000 ఆటోలు ఉండగా పోలీసులు ఇప్పటికే 2,200 ఆటోల వివరాలను సేకరించారు. ఒక్క సంగారెడ్డి పట్టణంలోనే 1,600 ్డఆటోలను గుర్తించారు. వాటన్నింటికీ కోడ్తో కూడిన బోర్డులను అమర్చారు. ప్రయాణికులను చేరవేసే టాటా సుమోలు, తుపాన్లాంటి వాహనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఆటో ముందు, వెనుక కోడ్తో కూడిన స్టిక్కర్లు ఆటో ముందు అద్దానికి ప్రింట్ మిర్రర్ స్టిక్కర్ అతికిస్తారు. అలాగే ఆటో వెనకాల సైతం ఓ స్టిక్కర్ ఉంటుంది. వీటిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఆటోను ఎవరైనా నేరం చేయడానికి ఉపయోగిస్తే జిల్లావ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నేరానికి పాల్పడిన డ్రైవర్ వివరాలను సులువుగా గుర్తించవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. డ్రైవర్ సీటు వెనకాల ‘మై వెహికల్ ఈజ్ సేఫ్’అనే క్యాప్షన్తో యూవీ ప్రింటెడ్ బోర్డు ఉంటుంది, దీనిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్, ఆటో డ్రైవర్ పేరు, అడ్రస్ ఉంటాయి. ఆటోలో ప్రయాణించే వారి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ప్లేస్టోర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆటో వివరాలతో పాటు, డ్రైవర్, ఓనర్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆటోడ్రైవర్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. దర్యాప్తులో పోలీసులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సురక్షిత ప్రయాణానికి భరోసా పోలీసులు చేపట్టిన ఈ చర్య ప్రయాణికులకు ఎంతో భరోసా కల్పిస్తుంది. గతంలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణం చేయడానికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. –దేవవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంగారెడ్డి -
జిల్లా అంతటా సీసీ కెమెరాలు
కృష్ణాజిల్లా, నూజివీడు : ప్రజల భద్రతా అవసరాల రీత్యా జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో ఇప్పటివరకు 936 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరు నాటికి మరో వెయ్యి ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి చెప్పారు. నూజివీడులోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పట్టణాల్లో పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ఏర్పాటు కోసం వ్యాపారస్తులు, దాతల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా వీటిని ఏర్పాటు చేస్తామని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కచ్ఛితంగా ఆధారాలు లభిస్తాయని, ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు వాహనదారులకు పోలీసులే రసీదులు రాసి జరిమానాలు విధించేవారని, ఇక నుంచి త్వరలోనే ఈ–చలానా విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ఈ–చలానా ఇచ్చిన తరువాత వాహనదారుడే నేరుగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే విజయవాడలో ఈ విధానం ఉందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, అవనిగడ్డ, నందిగామల్లో ఈ–చలానా విధానాన్ని అమలు చేస్తామన్నారు. చిలకలపూడి, అవనిగడ్డ, మైలవరం, కైకలూరు పోలీసుస్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసింగ్ను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లో ప్రజల నుంచి ఎక్కువ సివిల్ తగాదాలకు సంబంధించిన సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. పొలాలకు సంబంధించిన తగాదాలు, భార్యభర్తల గొడవలు తదితర సంబంధిత సమస్యలు ఉంటున్నాయన్నారు. కేసులను సెటిల్మెంట్ చేసే బ్యాచ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జిల్లా నుంచి బయటకు పంపించి వేస్తామని అన్నారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్కుమార్లు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సుల్తానాబాద్(పెద్దపల్లి): మార్చి 15 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. ఉదయం 9:15 నిముషాల నుంచి 12:15 వరకు పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 20 నిమిషాల ముందే హాజరు కావల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 500 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా, 49మంది సూపరింటెండెంట్లు, మూడు ష్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్లో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఇద్దరు కానిస్టేబుళ్లు, డీఈవోతో ప్రత్యేక టీం, స్టేట్ పరిశీలకుల టీం, ఫస్ట్ ఏయిడ్ కోసం ఏఎన్ఎంల టీం సైతం కేంద్రాల వద్ద ఉంటారని తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 47 రెగ్యులర్ సెంటర్లు, 2 ప్రైవేట్ సెంటర్లలో 10,307 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా పరీక్షల ఇన్చార్జి హన్మంతు తెలిపారు. 105 సర్కారు, ప్రైవేటు, ఆదర్శ పాఠశాలలు 7, కేజీబీవీ 7, గురుకుల వసతి గృహాలు 6, మైనారిటీ హైస్కూల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు సిఫారసు చేసినట్టు డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు సైతం తెరిచి ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు లేనట్టే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని స్థానిక అధికారులు తెలిపారు. గత సంవత్సరం ధర్మారం మండలం మల్లాపూర్ ప్రభుత్వ హైస్కూల్లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆదేశాలు వచ్చినా సీసీ కెమెరాలు 9 రోజుల్లో ఏర్పాటు చేయడం కష్టమే. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటికీ అందలేదు. పరీక్షలు పకడ్బందీగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇవ్వద్దని కమిషనర్ కిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. – వెంకటేశ్వర్రావు, డీఈవో, పెద్దపల్లి -
దేవుడికే శఠగోపం పెట్టాడు
-
దేవుడికే శఠగోపం పెట్టాడు
ఢిల్లీ: గుడిలో ఉన్న దేవుడికే రక్షణ లేకుండా పోయింది. మరీ సామాన్య మానవుడి పరిస్థితి తలచుకుంటే భయమేస్తోంది. ఓ వ్యక్తి మాస్క్ ధరించి ఇటీవల సాయి బాబా గుడిలో దేవుడి వస్తువులను దొంగతనం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకంది. మాస్క్ ధరించిన వ్యక్తి గుడిలో దర్జాగా తిరుగుతూ విలువైన వస్తువలను ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో అతనిలో ఎలాంటి భయమూ, బెణుకు కనిపించలేదు. ఆ దృశ్యాలన్ని ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
చౌటుప్పల్ (మునుగోడు) : వాళ్లంతా విద్యార్థులు. చదువుకోవాల్సిన వారు జల్సాలకు అలవాటుపడ్డారు. విందులు, వినోదాల పేరిట బలాదూర్ తిరుగుతున్నారు. కల్లు, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ చోరీ జరిగిన దుకాణంలో ఉన్న సీసీకెమెరాలకు చిక్కడంతో వీరి భాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేష్ వెల్లడించారు. సంస్థాన్నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ(17), మేకల ప్రశాంత్(15), కొప్పు వినోద్(15)లు చదువుకుంటున్నారు. రామకృష్ణ నారాయణపురంలో ఇంటర్ చదువుతుండగా మిగతా ఇద్దరు నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ హైస్కూల్లో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సులువైన మార్గం దొంగతనమేనని భావించారు. ముందస్తుగా రెక్కీ.. దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్న ఈ ముగ్గురు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించారు. తరచుగా సినిమాలు చూసేందుకు చౌటుప్పల్కు వచ్చే వీరు ఇక్కడే దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న అనుకూలమైన దుకాణాల కోసం అన్వేషణ చేశారు. చిన్నకొండూరు చౌరస్తా వద్ద ఉన్న ఎంఎం మొబైల్ దుకాణాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా దుకాణంలోకి రెండుసార్లు వెళ్లి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారు. రాత్రి తొమ్మిదిన్నరకు దుకాణం బంద్ కాగానే వెనక భాగం నుంచి పై అంతస్తు మీదుగా లోనికి ప్రవేశించారు. దుకాణంలోని విలువైన 20సెల్ఫోన్లు, 35వేల నగదు, ల్యాప్టాప్ను ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టించిన సీసీకెమెరాలు మొబైల్ షాపులో దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల చిత్రాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. కెమెరాలు ఉన్న విషయాన్ని అలస్యంగా గుర్తించిన సదరు దొంగలు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేశాలు మార్చారు. కానీ అప్పటికే రికార్డయిన వీరి చిత్రాలు పోలీసులకు పెద్ద ఆధారంగా లభించాయి. సీసీఫూటేజీలను వివిధ స్టేషన్లకు పంపించి ఎంక్వైరీ చేసిన పోలీసులకు వీరి వివరాలు లభించాయి. చోరీసొత్తుతో విందులు, వినోదాలు సెల్ఫోను షాపులో ఎత్తుకెళ్లిన నగదుతో ఈ ముగ్గురు విందులు, వినోదాలు చేసుకున్నారు. సహచర మిత్రులను పిలిచి పార్టీలు ఇచ్చారు. 35వేలల్లో 15వేలను ఖర్చు చేశారు. వాహన తనిఖీల్లో .. మండలంలోని దామెర గ్రామం వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు ముగ్గురు బైక్పై చౌటుప్పల్ వైపు వస్తున్నారు. పోలీసులను చూడగానే బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద 2లక్షల రూపాయల విలువైన 20 సెల్ఫోన్లు, 20వేల నగదు, ఒక ల్యాప్టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను అమ్మేందుకు వీలు కాకపోవడంతో చిల్లాపురం గ్రామంలోని తమ బావి వద్ద ఉన్న గుట్టలో ఇంత కాలం దాచిపెట్టారు.ఎలాగైన అమ్మాలని తీసుకువస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. వీరు మైనర్లు కావడంతో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్లగొండలోని బాల నేరస్తుల న్యాయస్థానానికి తరలించారు. సమావేశంలో సీఐ ఏ.వెంకటయ్య, ఎస్సైలు చిల్లా సాయిలు, నవీన్బాబు, సిబ్బంది ఉన్నారు. -
సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు
ఒంగోలు: ఇంటర్మీడియెట్ పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.మనోహర్బాబు తెలిపారు. తన ఛాంబర్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 ప్రభుత్వ, 12 ఎయిడెడ్, 3 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 53 ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది జూనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,675 మంది, ఒకేషనల్ విభాగంలో 1,110 మంది, సీనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,941 మంది, ఒకేషనల్ విభాగంలో 988 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థి 8:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ, తపాలాశాఖ, విద్యాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. పటిష్ట నిఘాలో పరీక్షలు.. ప్రతి పరీక్షా కేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్ రూంలో ఒకటి, వరండాలో రెండు లేక మూడు, పరీక్షా గదిలోను ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది మార్కాపురంలో గౌతమి జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండేదని, ఈ ఏడాది అక్కడ తొలగించి మెరుగైన వసతులు ఉన్న ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది అదనంగా సీఎస్పురంలో రత్నం జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సెంటర్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఉంటుందని, సెంటర్ల వద్ద జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు విధిగా మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. అశ్రద్ధ వహిస్తే చర్యలు.. పరీక్షల నిర్వహణలో ఏమాత్రం ఆశ్రద్ధగా ఉన్నా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్ఐఓ పి.మనోహర్బాబు పేర్కొన్నారు. స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేటు సెంటర్ల ప్రిన్సిపాళ్లు, డీఈసీ సభ్యులు, హైపవర్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో కేవలం డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద మాత్రమే మొబైల్ ఉండాలని, మిగిలిన ఏ ఒక్కరి వద్ద సెల్ఫోన్ ఉండరాదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. విద్యుత్కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖాధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. అదే విధంగా పోలీసుస్టేషన్ వద్ద నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లేందుకు, జవాబు పత్రాలను తపాలాశాఖకు చేర్చేవరకు పోలీసు బందో బస్తు ఉంటుందన్నారు. మాల్ప్రాక్టీస్, వి ద్యార్థులు చిట్టీలు తీసుకుని రావడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గూగుల్ ప్లే స్టోర్లో సెంటర్ లొకేటర్.. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో సూచించే ఐపీఈ సెంటర్ లొకేటర్ అనే యాప్ను గూగుల్ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏ వాహనంలో వెళ్లేందుకు ఎలాంటి మార్గం ఉందనేది కూడా సులువుగా తెలుసుకోవచ్చన్నారు. యాప్లో సెంటర్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, మరో 5 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. తనతో పాటు హైపవర్ కమిటీ, డీఈసీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పరీక్షల విధులలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. -
గిరిజన హాస్టళ్లలో ‘సీసీ’ నిఘా
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల భద్రతతో పాటు నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను బిగిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేస్తుండగా, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో కూడా ఈ నెలాఖరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఎనిమిది హాస్టళ్లు ఉండగా నాలుగు ప్రీ మెట్రిక్, నాలుగు పోస్ట్మెట్రిక్ హాస్టలున్నాయి. వీటిలో దాదాపు 950కి పైగా మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే విద్యార్థులతో పాటు వార్డెన్, వర్కర్ల కదలికలు గమనించడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. ఇటీవల జిల్లాలో ఎస్సీ హాస్టళ్లలో సన్న బియ్యం తరలింపు వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీ కెమెరాలే అధికారులకు ఆధా రాలయ్యాయి. ఈ నేపథ్యంలో బియ్యం, సరుకులు పక్కదారి పట్టించినా, లారీల్లోంచి బియ్యం బస్తాల ను లెక్క ప్రకారమే దింపుతున్నారా అనే విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డయిన పుటేజీల ద్వారా తెలిసిపోనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే కిచెన్, స్టోర్ రూం, గ్రౌండ్, హాస్టల్ ఎంట్రెన్స్ ఇలా దాదాపు ఒక్కో హాస్టల్లో 7–8 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సీసీ కెమెరాలు చేరుకోగ, ఈ నెలాఖరులోగా పోస్ట్మెట్రిక్ హాస్టళ్లకు కూడా సీసీ కెమెరాలు రానున్నాయి. కంప్యూటర్లు, బయోమెట్రిక్ విధానం... విద్యార్థుల హాజరు శాతాన్ని రోజు వారీగా నమోదు చేసేందుకు ఈ గిరిజన హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్లో హాజరు శాతాన్ని నమోదు చేసి వార్డెన్లు అధికారుల కు పంపాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థుల రాకు న్నా వారి పేరిట రేషన్ను డ్రా చేసేందుకు వీలుపడదు. దీంతో అక్రమాలను అడ్డుకట్ట పడనుంది. అలాగే కంప్యూటర్లను కూడా ప్రతీ హాస్టల్కు సరఫరా కానున్నాయి. బయోమెట్రిక్ను కంప్యూటర్కు అనుసంధానం చేయడంతో పాలు బిల్లులను తయా రు చేయడానికి ఉపయోగపడనున్నాయి. కంప్యూటర్లను కూడా రాష్ట్ర శాఖనే సరఫరా చేయనుంది. పారదర్శకత ఏర్పడుతుంది.. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలతో కంప్యూటర్లు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు కానున్నాయి. హాస్టళ్లకు భద్రతతో పాటు నిఘా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయాల వల్ల హాస్టళ్లలో పారదర్శకత ఏర్పడుతుంది. – సంధ్యారాణి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి -
అష్ట దిగ్బంధం
గద్వాల క్రైం : ‘సార్! కొత్త బస్టాండ్ వద్ద బైక్ నిలిపి పక్కనే ఉన్న దుకాణంలో మందులు తీసుకుని వచ్చేసరికి అక్కడ వాహనం కనిపించలేదు..’ ‘అయ్యా! ఇంట్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు...’ మరో బాధితుడు. ‘ఓ సారో..ఒక్కగానొక్క కుమార్తె రెండు రోజులుగా కనిపించడం లేదు, యాడికి బోయిందో తెలియదు, ఎలాగైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని అప్పగించండి..’ అంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు.. సదరు ఎస్ఐ సరే.. సరే రెండు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాం.. అం టూ సమాధానం వస్తుంది. ఇక కేసు దర్యాప్తులో భా గంగా సీసీ కెమెరాల కంట్రోల్ విభాగంలోని పర్యవేక్షకుడు వద్దకు సమాచారం.. సిబ్బంది గంటల తరబడి అక్కడే ఉండి అన్ని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా క్షుణంగా గుర్తించి నిందితులను ఛేదించి బాధితులకు న్యాయం చేస్తారు.. సార్! గాంధీచౌక్లో ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు..’ అంటూ ఓ వాహనదారుడు ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడు.. ఇలాం టి తరుణంలో సీసీ కెమెరాల పర్యేవేక్షకుడి సాయం కోసం అక్కడ సమస్యపై కంట్రోలర్ విభాగానికి ఫోన్ చేసి ఎంత మేర ట్రాఫిక్ జాం అయిందని వెంటనే కంట్రోల్ రూంకు వెళ్లి సూచనలు ఇవ్వు.. ఉన్నతాధికారులు సీసీ కెమెరాల మానిటర్కు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన మొబైల్లో ఇంటర్నెట్ లింకు ఆధారంగా నిక్షిప్తం చేసుకున్నది అనుసంధానమై నేరుగా సీసీ కంట్రోలర్ సిబ్బంది ఉన్న చోటు నుంచి సమస్యలపై నేరుగా చూసి చెప్పవచ్చు. ఇలా జిల్లాలో పోలీసు శాఖ టెక్నాలజీని వినియోగించడంలో ముందుంది. జిల్లా కేంద్రంలో 55సీసీ కెమెరాలు గద్వాల పట్టణంలోని 55సీసీ కెమెరాల దృశ్యమాలికలను మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా చూసుకునేలా సాంకేతిక విప్లవంతో నాంది పలికింది. సీసీ కెమెరాల విభాగంలో పర్యవేక్షకుడు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలోనూ అరచేతిలో ఉన్న మొబైల్ సాయంతో ఏ ప్రాంతంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు తతెత్తినప్పుడు వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇక సీసీ కెమెరాల విభాగం సీఐ కార్యాలయంలోని ప్రత్యేక భవనంలో పర్యవేక్షకుడు నిత్యం మానిటరింగ్ చేస్తూ పట్టణంలో జరిగిన పలు సంఘటనలపై దృష్టి సారించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు. పరుగులకు చెక్ పట్టణంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని నిందితులు ఉన్నట్లు సమాచారం వస్తే ఉన్నతాధికారులు గతంలో వెంటనే సీసీ కెమెరాల కంట్రోలర్కు సమాచారం అందించేవారు. అయితే సిబ్బంది భోజనం సమయం కావడంతో బయటకు వెళతారు. ఈ క్రమంలో తిరిగి కార్యాలయానికి రావడంలో అలస్యమవుతుంది. ఇక నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని మరోచోట ప్రత్యక్షమవుతారు. సిబ్బంది సైతం కార్యాలయానికి పరుగులు తీస్తారు. ఈలోపు నిందింతులు సునాయసంగా చేజారిపోతారు. ఇలాంటి వాటికి కొత్త విధానంతో చెక్ పెట్టినట్టే. సిబ్బంది ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ లింకు ఆధారంగా తన అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిందితులు ఎటు వెళ్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయొచ్చు. దీంతో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షణాల్లో కేసులను ఛేదించి బాధితులకు ఊరట కల్పించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఇదే విషయమై ఇటీటల పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం, డీజీపీ సైతం ఎస్పీ విజయ్కుమార్ను అభినందించారు. ఇక మొబైల్ యాప్కు సంబంధించి ఇంటర్నెట్ లింకు ద్వారా కెమెరాల అనుసంధానంతో పట్టణంలో మరింత నిఘా పెట్టేందుకు వివిధ సీసీ కెమెరాల పాయింట్లు వీక్షించే సిబ్బందికి ఇటీవలే హైదరాబాద్లో శిక్షణకు పంపించి ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రోత్సహించారు. శాంతిæభద్రతల పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు పోలీసులంటే జావాబుదారీగా ఉండాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిబ్బంది పెట్రోలింగ్, ట్రాఫిక్ తదితర విధులను ఎంత మేర చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఎక్కడ ఏం జరిగినా ఈ కొత్త పరిజ్ఞానంతో చెక్ పెట్టొచ్చంటున్నారు. నిరంతర నిఘా జిల్లాలో విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని నిలువరించి ప్రజలకు జావాబుదారీగా ఉండాలనేది మా సంకల్పం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ కేసులు, సమస్యలను ఎక్కడి నుంచైనా సులువుగా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాప్తో సీసీ కెమెరాలను సిబ్బంది పరిశీలించి తగు వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం అంది స్తారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవుతారు. – ఎస్.ఎం.విజయ్కుమార్, ఎస్పీ, గద్వాల -
నిఘాపై నీలినీడలు!
మహబూబ్నగర్ క్రైం : ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కలెక్టరేట్లో వాహనం పెడితే భద్రంగా ఉంటుందని భావించి తన బైక్ను కలెక్టరేట్లో పెట్టి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రాంతంలో బైక్ లేదు. చివరకు అంతట గాలించిన దొరకలేదు చివరకు ఎవరో అపహరించారని గుర్తించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒక్కటే కాదు పట్టణంలో బైక్ దొంగతనాల దగ్గర నుంచి ఇళ్ల చోరీల వరకు ప్రతి ఒక్కటి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల అడ్డుకట్టకు చర్యలు కరవవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. వాటి సాయంతో నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు తత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదైన సందర్భాలున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆకతాయిలు ఆగడాలు సృష్టిస్తూ పోలీసులకు చిక్కకుండాపోతున్నారు. మహిళలపై జరిగే ఎన్నో వేధింపులు వెలుగులోకి రాకుండా పొతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు నిఘా కెమెరాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ప్రతి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సైతం సూచిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అవి అందుబాటులో రావడం లేదు. జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిని, దొంగతనాలకు పాల్పడిన వారి గుర్తించి సొమ్ములను రికవరీ చేసిన కొన్ని సందర్భాలున్నాయి. కెమెరాల ఏర్పాటులో జాప్యం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి ఎదుట, అవంతి హోటల్ సమీపంలో, న్యూటౌన్ పంచవటి హోటల్ నుంచి సుభాష్ చంద్రభోస్ విగ్రహాం వరకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ఎదుట, బస్టాండ్లో, కలెక్టరెట్లో, అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ చౌరస్తాలో, పాత బస్టాండ్లో, క్లాక్టవర్, ఆకుల చౌరస్తా, వన్టౌన్ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బండమీదిపల్లి శివారు, కోయిలకొండ ఎక్స్రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వితరణ కోసం వెంపర్లాట జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. భద్రతా చర్యల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యంగా పోలీసులు భావిస్తున్నా వితరణ కోసం వెంపర్లాడుతున్నారు. పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ముందుకొస్తే వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపిక చేసిన ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నామంటున్నారు. పోలీసుల సూచనల మేరకు వ్యాపారుల ఎవరికి వారు దుకాణాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం లేకుండాపోతుంది. -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. తూప్రాన్ సబ్డివిజన్లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు అదుపు
కొత్తకోట: సమాజంలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములుకావాలని.. అప్పుడే వందశాతం నేరాలు అదుపు చేయవచ్చని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్లో ఆదివారం ఆమె సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలను ఎస్పీ వివరించారు. వీటిని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్టణవాసులు, వ్యాపారులు, వివిధ కులసంఘాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు సహకరించడం అభినందనీయమన్నారు. ఇటీవల పట్టణ కేంద్రాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతుండటం మూలంగా వాటిని అరికట్టడానికి పట్టణంలో 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగలను గుర్తించడమే కాకుండా.. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి ఇన్సూరెన్స్ కల్పించడం, అమ్మాయిలను రాగింగ్ చేసే వారిని గుర్తించడంతోపాటు ఇతర చట్టవ్యతిరేక సంఘటనలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోచ్చని తెలిపారు. పట్టణంలో సీసీల ఏర్పాటుకు కృషి చేసిన కొత్తకోట సీఐ సోమ్నారాయణŠసింగ్, ఎస్ఐ రవికాంత్రావును అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్రెడ్డి, జెడ్పీటీసీ డా. పీజే బాబు, ఎంపీపీ గుంత మౌనిక, కొత్తకోట సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, కొత్తకోట సింగల్విండో చైర్మన్ సురేంద్రనాథ్రెడ్డి, ఆయా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పల్లెలపై సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్) : నేరాల నియంత్రణ కోసం గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టేందుకు పొలీసుశాఖ సన్నాహాలు ప్రారంభించింది. గ్రామం మొదలుకొని మండల, జిల్లాస్థాయి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ అభివృద్ధి, పొలీసుశాఖ, వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీనిధులు నుంచి కొంత మొత్తం సేకరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు యోచిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నిఘా... గ్రామస్థాయిలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా గ్రామాల్లో చోటు చేసుకోనే సంఘటనలు అందులో నిక్షిప్తం అవుతాయి. దాడులు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిఘా నేత్రాలను గ్రామానికి సంబంధించిన పోలీస్స్టేషన్లో కంట్రోల్రూంకు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. తద్వారా ఎమైనా సంఘటనలు చోటుచేసుకుంటే సత్వరం స్పందించే అవకాశం ఉంటుంది. అలాగే నేరస్తుల గుర్తింపు, కేసుల విచారణలో ఇవి దోహదపడుతాయి. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు పోలీసు శాఖ ఇప్పటికే మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. వీటి మాదిరిగానే గ్రామాల్లో సైతం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో 70 మండలాలు, 866 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 1,756 రెవెన్యూ గ్రామాలు, 3,680 అనుసంధాన గ్రామాలతో పాటు 6,49,888 గృహ సముదాయాలు, 27,41,239 జనాభా ఉంది. ఈమేరకు ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు, మండల కేంద్రాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 500, జిల్లా కేంద్రాల్లో 1000 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గ్రామస్థాయిలో ఈ విధానం అమలు జరిగితే నేరాలు, దొంగతనాలు చాలావరకు అదుపులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు. -
గ్రామాల్లో సీసీ కెమెరాలు!
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. ప్రతీ చిన్న ఘటన కూడా వాటిలో నిక్షిప్తమవుతోంది. కిడ్నాపులు, దాడులు, బాంబుపేలుళ్లు, రోడ్డు ప్రమాదాల్లో నేరస్తులను పట్టుకునేందుకు వీలవుతుంది. గ్రామ అభివృద్ధి నిధులు, పోలీస్ శాఖ , వ్యాపారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ నిధుల నుంచి కొంత మొత్తాన్ని సేకరించి ప్రతీ గ్రామంలో కనీసం 5 నుంచి 10, మండల కేంద్రాల్లో 30, పట్టణాల్లో కనీసం 50, జిల్లా కేంద్రాల్లో 1,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ ప్రతిపాదనలు చేసింది. -
పోలీసులకు సవాల్
దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశామని పోలీస్ శాఖ పేర్కొంటుండగా.. ఎంత నిఘా ఉన్నా మమ్మల్నెవరూ ఆపలేరన్నట్లు చోరులు రెచ్చిపోతున్నారు. మొన్న వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరగ్గా.. నిన్న ఏకంగా జేసీ ఇంటి తాళాలే బద్ధలయ్యాయి. వరుస ఘటనలు పట్టణవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో జరిగిన వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. రెండు రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో గల వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. చోరులు అత్యంత విలువైన పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ సంఘటన మరిచిపోకముందే ఆదివారం రాత్రి అశోక్నగర్ కాలనీలో నివాసం ఉండేజాయింట్ కలెక్టర్ సత్తయ్య ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. అయితే జేసీ ఇంట్లో ఎలాంటి వస్తువులు, నగదు పోలేదని తెలుస్తోంది. తాళాలు పగులగొట్టిన విషయమై జేసీ సీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలో పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కామారెడ్డి మండలం గర్గుల్లో, రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో చోరీలు జరిగాయి. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు రోజుల్లో రెండు సంఘటనలు జరిగాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. నిత్యం బీట్ కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ జీపులు కూడా పట్టణంలో తిరుగుతున్నప్పటికీ దొంగలు రెచ్చిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దబజార్కు సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి దొంగలు దర్జాగా వెళ్లి విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీలు, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. రూ. కోటి విలువ చేసే విగ్రహాలు ఎత్తుకెళ్లిన సంఘటన పోలీసులకు సవాల్గా మారింది. ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే జేసీ నివసిస్తున్న ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఆదివారం సెలవు కావడంతో జేసీ హైదరాబాద్కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లంతా వెతికారు. వారికి ఎలాంటి డబ్బులు, సామగ్రి దొరకలేదని తెలుస్తోంది. ఈ రెండు సంఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణవాసుల్లో భయం... ఇంటికి తాళం వేసి ఎటు వెళ్లాలన్నా పట్టణ ప్రజలు భయపడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు.. పగటిపూట తిరిగి, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. బంధువుల ఇళ్లకో, ఇతర పనుల రీత్యానో ఇంటికి తాళాలు వేసి వెళ్తే గ్యారంటీ లేకుండాపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైన్స్నాచింగ్ సంఘటనలు ఎక్కువగా జరిగేవి. చైన్స్నాచర్లు పోలీసులకు చిక్కడంతో అవి కొంతమేర తగ్గాయి. వరుసగా జరిగిన రెండు చోరీలు పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దొంగతనాలు జరుగకుండా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. దొంగతనాలు జరుగకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో బంగారం, నగదు ఉంచి తాళాలు వేసి ఎటూ వెళ్లవద్దు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ఎ.శ్రీధర్కుమార్, ఎస్హెచ్వో, కామారెడ్డి -
20 లక్షల మంది భక్తులు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి. జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు ‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’. -
భద్రత కట్టుదిట్టం..!
ఇకపై కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల లోపలికి వెళ్లాలంటే అర్జీదారులు కాస్త ఇబ్బంది పడాల్సిందే. దరఖాస్తుదారులు ఎవరైనా సరే తమ వెంట తెచ్చుకున్న వస్తువులు, పత్రాలను ఆయా కార్యాలయాల బయట పోలీస్ సిబ్బందికి చూపించాకే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, జగిత్యాల : సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకు వచ్చి పురుగుల మందు తాగడం.. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం వంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టడానికి పోలీస్ బాస్ భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓ క్యాబిన్ ఏర్పాటుచేశారు. ఇందులో ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ హోంగార్డుకు విధులు కేటాయించారు. వీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఆర్జీదారులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారిపై దృష్టిపెట్టనున్నారు. ఎవరైన పురుగుల మందు డబ్బాలు.. కిరోసిన్తో వస్తే వారిని బయటే అడ్డుకుని వెంట తీసుకొచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటారు. కేవలం ఫిర్యాదుదారుడిని లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. మరోపక్క.. ఇప్పటికే ప్రతి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భవనంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నలుగురైదుగురు పోలీసులకు విధులు కేటాయిస్తున్నారు. అయితే.. ఇకపై ప్రతి సోమవారం వారి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపై కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయం వద్ద నలుగురు.. కలెక్టరేట్లో మరో నలుగురు.. మొత్తం ఎనిమిది మంది హోంగార్డులను నియమించి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ‘నిఘా’ ఏదీ..? ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల ఆత్మహత్యాయత్నాల వెనక దళారులు ఉన్నట్లు కలెక్టర్ శరత్ ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పథకాల్లో పెరుగుతున్న దళారుల ప్రమేయంపై సీరియస్ అయ్యారు. అనర్హులకూ లబ్ధి చేకూరుస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ భవనం, పరిసర ప్రాంతాల్లోనూ బాధితులు, వారి వెంట వచ్చి వెళ్లే వారిని గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్యాం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘ ఐఎంఏ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సాంకేతిక సిబ్బంది వచ్చి కెమెరాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. -
అచ్చంపేటలో భారీ చోరీ
సాక్షి, అచ్చంపేట: గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అచ్చంపేటలోని ఓనగల దుకాణంలో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకుపోయారు. వెళ్తూ వెళ్తూ తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమెరాల హార్డ్డిస్క్ను సైతం ఎత్తుకెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట ఆలీ ఆభరణాల దుకాణంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ వెనుకపైపు ఉన్న తలుపు పగలకొట్టి లోపలకి ప్రవేశించిన దొంగలు, సుమారు యాభైలక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు పెద్దమెత్తంలో నగదును దోచుకెళ్లారు. పారిపోతూ పోలీసులకు పట్టుపడకుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించారు. దుకాణం భద్రతకోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల హార్డ్డిస్క్ను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తలుపు తెరచి చూసిన యజమానులు విషయం అర్థమై అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అలరించే అడవి అందాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలో అలరించే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కాగజ్నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకు నెలవు. డివిజన్లోని అడవులలో ప్రవహించే ప్రాణహిత నది, పెద్ద వాగు (బీబ్రానది) అందాలు పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మనసును దోస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. మరికొన్ని చిత్రాలను అధికారులు ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాలను కాగజ్నగర్ అటవీ అధికారుల వద్ద నుంచి ‘సాక్షి’ సేకరించింది. -
రైళ్లలో 12 లక్షల సీసీటీవీ కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణానుభూతులను కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలోనే 11,000 రైళ్లు, 8500 రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే శాఖ కసరత్తు సాగిస్తోంది. 2018-19 రైల్వే బడ్జెట్లో దీనికోసం రూ 3000 కోట్లతో నిధి ఏర్పాటు కానుంది. రైల్వేల ప్రణాళిక ప్రకారం ప్రతి కోచ్లో ఎనిమిది సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నుంచి అన్ని ప్రదేశాలను కవర్ చేసేలా నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 395 స్టేషన్లు, 50 రైళ్లలో సీసీటీవీ వ్యవస్థ అందుబాటులో ఉంది. రాబోయే రెండేళ్లలో రాజధాని, శతాబ్ధి, దురంతో సహా అన్ని ఎక్స్ప్రెస్, ప్రీమియర్ రైళ్లలో ఆధునిక నిఘా వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా ఈ కార్యక్రమానికి భారీగా నిధులు సమీకరించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో రానున్న రైల్వే బడ్జెట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. -
మాటలు కలిపి.. మత్తులో దించి
మొయినాబాద్(చేవేళ్ల): అమ్మలా ఉన్నావంటూ మాయమాటలతో వృద్ధురాలిని బుట్టలో వేసుకున్న ఓ కి‘లేడీ’ మద్యం తాగించి బంగారు, వెండి నగలు కాజే సింది. ఒక్క రోజులోనే నిఘానేత్రానికి చి క్కిన ఈ పాత నేరస్తురాలిని పోలీసులు శ నివారం రిమాండ్కు తరలించారు. మొ యినాబాద్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, మొయినాబాద్ సీఐ సు నీత వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన చాంద్బీ(45) గత కొంతకాలంగా నగ రంలోని బార్కాస్ బండ్లగూడ గౌస్నగర్ లో నివాసముంటుంది. పరిసర ప్రాంతా ల్లో బిక్షాటన చేస్తూ అమాయక మహిళలను మాయమాటలతో బుట్టలో వేసుకు ని దొంగతనాలకు పాల్పడుతుంది. కాగా ఈ నెల 18న మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వృ ద్ధురాలు బుచ్చమ్మ(65) మొయినాబాద్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. కూరగాయలు కొనుక్కుని తిరిగి వెళ్తుండగా ఒంటిపై నగలతో చాంద్బీ కంట పడింది. చాంద్బీ ఆమె వద్దకెళ్లి నీవు మా అమ్మలా ఉన్నావంటూ మాటలు కలిపింది. మాయ మాటలతో బుట్టలో పడిసేంది. చనువుగా వ్యవహరింస్తూ మద్యం సేవించేందుకు తీసుకెళ్లింది. సురంగల్ రోడ్డులో ఉన్న మద్యం షాపు వద్దకు తీసుకెళ్లి విస్కీ క్వార్టర్, ఒక బీరు బాటిల్ తీసుకుంది. రెండూ కలిపి వృద్ధురాలికి తాగించింది. మద్యం మత్తులో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి తులంన్నర బంగారు గుండ్లు, అర తులం బంగారు కమ్మలు, 30 తులాల వెండి నడుము వడ్డానం తీసుకుని పారిపోయింది. తేరుకున్న తరువాత బుచ్చమ్మ మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టించిన నిఘానేత్రం... కేసు విచారణలో భాగంగా పోలీసులు వృద్ధురాలు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ పరిసరాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఓ మహిళ మద్యం సీసాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వృద్ధురాలు నగలు దోచుకుంది ఆ మహిళే అని గుర్తించిన పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా ఈ నెల 19న శుక్రవారం మొయినాబాద్లో కనిపించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకుని చాంద్బీని శనివారం రిమాండ్కు తరలించారు. జైలు నుంచి వచ్చిన 45 రోజులకే తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న చాంద్బీ జైలు నుంచి వచ్చిన 45 రోజులకే మళ్లీ దొంగతనానికి పాల్పడింది. గతంలో చాంద్బీ రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సలాంను ఏసీపీ అశోక్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని.. ప్రతి గ్రామంలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఏసీపీ కోరారు. సమావేశంలో సీఐ సునీత, ఎస్సై రాందాస్నాయక్, కానిస్టేబుల్ కవిత ఉన్నారు. -
టెన్త్ పరీక్షలకు 5.6 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వేగవంతం చేసింది. పరీక్ష రాసేందుకు 5,60,395 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరి కోసం 2,500కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. కేంద్రాల్లో అవసరమైన బెంచీలు, సదుపాయాల, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అధికారులతో సమీక్షించారు. అన్ని సదుపాయాలుండేలా చూడాలని, లోపాలేమైనా ఉంటే తెలపాలని ఆదేశించారు. ఫర్నీచర్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ సూచించింది. సీసీ కెమెరాల ఏర్పాటు..: పరీక్షల ఏర్పాట్లలో భాగంగా సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ కిషన్ ఉన్నతాధికారులతో చర్చించారు. గతేడాది మాల్ ప్రాక్టీస్ ఆరోపణలున్న జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు హాజరయ్యేందు కు 11,109 ఉన్నత పాఠశాలలకు చెందిన 5,04,545 మంది రెగ్యులర్ విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఒకసారి ఫెయిలైన ప్రైవేటు విద్యార్థులు 35,864 మంది హాజరుకానుండగా, వొకేషనల్ విద్యార్థులు 19,986 మంది హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. తత్కాల్ కింద ఫీజు చెల్లించేందుకు ఇంకా సమయం ఉన్నందున సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. పరీక్ష కేంద్రాలుగా ప్రైవేటు విద్యా సంస్థల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్, రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. దీంతో ఈ 2 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. రెగ్యులర్ విద్యార్థుల్లో హైదరాబాద్ జిల్లా నుంచి 69,871, రంగారెడ్డి జిల్లా నుంచి 43,427 మంది హాజరుకానున్నారు. నిజామాబాద్ జిల్లాలో 24,200, సంగారెడ్డిలో 20,807, నల్లగొండలో 20,512, మహబూబ్నగర్లో 20,063 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించారు. -
ఈసీ.. సీసీ.. ఇక ఈజీ
గుంటూరు, సత్తెనపల్లి: రిజిస్ట్రేషన్కు సంబంధించిన దస్త్రాల నకళ్లు, లావాదేవీలు తెలుసుకునేందుకు ఇన్కంబరెన్స్ (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దే పొందవచ్చు. రూ.కోట్ల ఆదాయాన్ని వదులుకొని రిజిస్ట్రేషన్స్, అండ్ స్టాంపుల శాఖ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈసీకి రూ.225, దస్తావేజుల నకళ్లకు రూ.270 చెల్లించవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్లోకి వెళ్లి registration.ap.gov.in అని టైప్ చేస్తే ఏపీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ప్రత్యేక్షమవుతుంది. వెబ్సైట్ కింది భాగంలో కుడివైపున న్యూ సర్వీస్లో ఆన్లైన్ ఈసీ, ఆన్లైన్ సీసీ, దస్త్రాల ప్రిపరేషన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే యూజర్ ఐ.డి. పాస్వర్డ్ ఆప్షన్లు వస్తాయి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందడానికి నాట్ మెంబర్ ఆప్షన్పై క్లిక్ చేసి పేరు, ఆధార్ నంబర్, అడ్రస్తో పాటు మనకు నచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. అనంతరం లాగిన్ అయ్యి మనకు కావల్సిన సర్వీస్ను ఎంచుకోవాలి. పబ్లిక్ ఆన్లైన్ సర్వీసులు.. ♦ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ కాగానే పబ్లిక్ ఆన్లైన్ పేరుతో నాలుగు సర్వీసులు కనిపిస్తాయి. దస్త్రాల రిజిస్ట్రేషన్, ఇన్కంబరెన్స్ (ఈసీ) సర్టిఫైడ్ కాపీ (దస్త్రాల నకళ్లు), రిజిస్ట్రేషన్ కావాల్సిన సర్వీస్పై క్లిక్ చేసి పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ♦ ఇన్కంబరెన్స్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ(నకళ్లు) సేవలు మాత్రం ప్రస్తుతం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల మధ్యనే పొందాలి. ♦ ఫ్రీ రిజిస్ట్రేషన్ దస్త్రాల ప్రిపరేషన్కు మాత్రం ఆధార్, పాన్కార్డు వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ♦ దస్త్రాల ప్రిపరేషన్లో ఒకమారు తయారు చేసుకున్న దస్త్రాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. -
మా మంచి పోలీస్ స్టేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు పోలీస్శాఖ సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో ఉత్తమ మోడల్ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు పొందిన పంజగుట్ట స్టేషన్ తరహాలో అన్ని స్టేషన్లను మార్చాలని భావిస్తోంది. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్తోపాటు ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 640 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్లు, అందులోని స్టేషన్ హౌస్ అధికారులకు గుర్తింపు ఉండేలా ఠాణాలకు గ్రేడింగ్ ఇచ్చేందు కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్లు, వాటిలోని సిబ్బంది పనితీరును ఏ నెలకు ఆ నెల పర్యవేక్షించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ సూచించారు. ప్రమాణాల ప్రకారం... స్టేషన్ ఎలా ఉంది.. కేసు నమోదు దగ్గరి నుంచి చార్జిషీట్ వరకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది.. బాధితులు, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు.. పెండింగ్ కేసుల క్లియరెన్స్కు తీసుకుంటున్న చర్యలేంటి.. ఇలా 40 రకాల ప్రమాణాలను స్టేషన్ల గ్రేడింగ్ కోసం అమలు చేయనున్నారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందిపై ప్రజాభిప్రాయం తెలుసుకునేలా ఫీడ్ బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించి సక్సెస్ అయిన స్టేషన్లు, అధికారులకు ప్రతి నెలా గ్రేడింగ్ ఇచ్చి ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు... మండలాలు, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాల ని ఉన్నతాధికారులు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రజాభాగస్వామ్యం కావాలని, దీనిపై సర్పంచులు, ప్రజాప్రతినిధులును కలసి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా సేకరించినా లేదా వారి ద్వారా ఏర్పాటు చేయించినా ప్రజలకు బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉన్న కమాండ్ సెంటర్కు అనుసంధానించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. పునరుద్ధరణ దిశగా విలేజ్ పోలీస్ ఆఫీసర్... గ్రామాల్లో ఓ 15 ఏళ్ల క్రితం వరకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. గ్రామంలో ఏ గొడవ జరిగినా, సమస్య వచ్చినా ముందుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న కానిస్టేబుల్ వద్దకు వచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి విస్తృతపరచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో ఉత్సాహవంతులైన యువకులతో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేయించి గ్రామ సమస్యలు, పరిష్కారాల విషయంలో వారిని భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. -
వందలు ఎరవేసి.. 25 లక్షల ఆభరణాలు చోరీ
ఖమ్మం క్రైం: కొన్ని రూ. 50 నోట్లను ఎరగా వేసి కారు డ్రైవర్ దృష్టి మళ్లించి.. రూ. 25 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మంలో సోమవారం జరిగింది. నగరానికి చెందిన గుర్రం రాధిక, ఆమె కోడలు వనజ ఓ బ్యాంక్ లాకర్లో ఉన్న తమ బంగారు ఆభరణాలను ఓ సూట్కేస్లో భద్రపరిచి కారు సీటు కింద పెట్టి.. గాంధీచౌక్లోని ఓ బంగారం షాపులోనికి వెళ్లారు. డ్రైవర్ను కారు పార్కింగ్ చేయాలని సూచించి, బంగారం భద్రపరిచిన సూట్కేçస్ను అతడికి అప్పగించారు. ఈలోపు గుర్తు తెలియని ఆగంతకుడు కారు వద్దకు వచ్చి ‘కింద రూ.50 నోట్లు పడి ఉన్నాయి.. అవి మీవేనా..?’అంటూ అడగడంతో అతను కిందకు దిగి వరుసగా పడి ఉన్న నోట్లను ఏరుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కారులోని సూట్కేసుతో పరారయ్యాడు. నోట్లు తీసుకున్నాక డ్రైవర్.. కారులో కూర్చొని సీట్ కింద ఉన్న సూట్ కేసును చూసుకోగా.. అది కనిపించలేదు. వెంట కారుదిగి చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. డ్రైవర్ వెంటనే వెళ్లి తన యజమానురాలికి విషయం చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేశ్రెడ్డి సందర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీ అయిన సూట్కేసులో బంగారం, వజ్రాల నగలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు సరిగా లేకపోవటంతో దొంగలను గుర్తు పట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. -
సుభాష్నగర్లో ‘నేను సైతం’
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులు ముందుకొచ్చారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు ఇందుకు అంగీకరించారు. కాలనీలో బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. -
సినీ ఫక్కీలో చోరీ.. ఆపై ఆధారాలు దొరక్కుండా!
సాక్షి, హైదరాబాద్: గ్రిల్స్, ఇంటి తలుపునకు వేసిన తాళాన్ని చాకచక్యంగా తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లో దాచిన బీరువా తాళాలు తీసుకుని అందులో ఉన్న 31తులాల బంగారం, రూ.2.23లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్స్పెక్టర్ రాంచంద్రారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసాచారి అనే వ్యక్తి బాకారం వెస్లీ చర్చి ఎదురుగా ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో ఆర్డర్పై బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు. మౌళాలి ఎన్ఎఫ్సి కాలనీలో ఉండే అతను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. పైన ఉన్న గదిని బ్యాచిలర్స్కు అద్దెకు ఇచ్చారు. ఇంటి ముందు ఉన్న షట్టర్లో బంగారు ఆభరణాలు తయారుచేసి బంగారు ఆభరణాలు, నగదు ఇంట్లోని బీరువాలో దాచి తాళం వేసి తాళం చెవులను ఇంట్లోనే ఒక రహస్యంగా ఉంచి తలుపులు, గ్రిల్స్కు తాళం వెళ్లేవాడు. శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిన శ్రీనివాసాచారి సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండటమేగాక, ఇంటి నిండా కారంపొడి చల్లిఉంది. తాను దాచి ఉంచిన బీరువా తాళం చెవి కనిపించలేదు. నాలుగు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి డీబీఆర్ బాక్సు సైతం కనిపించకపోవడంతో ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిక్కడపల్లి ఏసీపీ ప్రదీప్కుమార్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రాంచంద్రారెడ్డి, డిఎస్ఐ బాలరాజు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వినియోగదారులు ఆభరణాల కోసం ఇచ్చిన బంగారం, తన అమ్మమ్మ బంగారం కలిపి 31తులాలు, రూ.2.23 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారయత్నమే కారణం..
తూప్రాన్: డీసీఎంలో అత్యాచారానికి యత్నించడంతో తప్పించుకునే క్రమంలోనే వేగంగా వెళ్తున్న వాహనం నుంచి కళావతి కిందకు దూకి మృతి చెందిందని ఆమె భర్త రేగొండ, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ సమీపంలోని కరీంగూడ చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ చందన దీప్తి విచారణను వేగవంతం చేశారు. డీసీఎంను కనిపెట్టేందుకు తనిఖీలు చేపట్టారు. సోమవారం స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. పోతరాజ్పల్లిలోని వారి ఇంటికి వెళ్లి భర్త, కూతురుతో మాట్లాడారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు ఎస్పీని ప్రాథేయపడ్డారు. స్పందించిన ఎస్పీ ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కుటుంబ సభ్యులకు తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీసీఎం కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆమె వెంట తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు, సీఐ లింగేశ్వర్రావు ఉన్నారు. సీసీ కెమెరాల పరిశీలన బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. టోల్ప్లాజా వద్ద పరిశీలించగా అందులో కళావతి డీసీఎం క్యాబిన్లో కూర్చున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. కరీంగూడ చౌరస్తా వద్ద ఉన్న గోల్డెన్ దాబా సీసీ కెమెరాను పరిశీలించగా డీసీఎం వచ్చి రోడ్డు పక్కన నిలిపినట్టు, మొదట పాతబట్టల మూటను కిందికి వేసి ఎవరు దిగ కుండానే వాహనం వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. -
చిల్లర కోసం వచ్చి..
చిట్యాల (నకిరేకల్) : రూ.20వేల చిల్లర కోసం వచ్చిన ఓ వ్యక్తి.. క్యాషియర్ పొరపాటున ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన స్థానిక కెనరా బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు నూతనంగా విడుదలైన నోట్లు కావాలని తన వద్ద ఉన్న పది రెండు వేల రూపాయల నోట్లను క్యాషియర్కు ఇచ్చాడు. వాటికి చిల్లరగా క్యాషియర్ రూ.20 నోట్లనుకుని క్యాషియర్ పొరపాటును రూ.200 బెండల్ను సదరు యువకుడికి ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రూ.20వేలుపోను.. రూ.లక్షా 80 వేల తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బ్యాంకు లావాదేవీల జమ, ఖర్చుల్లో భారీ తేడాలు రావడంతో.. బ్యాంకు అధికారులు సీసీ పుటేజీలను పరిశీలించారు. పసువు రంగు చొక్కా వేసుకుని, మెడలో నల్లటి బ్యాగుతో వచ్చిన గడ్డంతో ఉన్న యువకుడు క్యాషియర్ కిష్టయ్య పొరపాటున ఇచ్చిన నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మొత్తం క్యాష్ పోవటంతో బ్యాంకు సిబ్బంది తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. -
సీసీ కెమెరాలతో నగరంపై నిరంతర నిఘా
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటిదాకా నేరాలు జరిగిన తర్వాత పోలీసులు సీన్లోకి ఎంటరయ్యేవారు! ఇకపై.. నేరం జరగకముందే రంగంలోకి దూకనున్నారు!! నగరం మొత్తాన్ని ‘కెమెరా’ కన్ను పరిధిలోకి తెచ్చి అణువణువునా నిఘా పెట్టనున్నారు. నేరం జరిగాక కేసులు, దర్యాప్తులు కాదు.. అసలు నేరమే జరగకుండా చూసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఇందుకు వేదిక కానుంది. మరో వారం రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో పని చేయడానికి 28 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరు మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తూ సిటీపై కన్నేసి ఉంచుతారు. నేరాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అక్కడున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా వేల కెమెరాలున్నాయి. వీటి ఫీడ్ను అత్యంత నిశితంగా పరిశీలించేందుకు సీసీసీలో కొందరిని ప్రత్యేకంగా నియమించనున్నారు. నేరాలు జరిగే ప్రాంతాలు, అనుమానితులు సంచరించే ప్రదేశాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీన్ని ప్రామాణికంగా చేసుకుని సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. సిటీలో పాత నేరగాళ్లు, వాంటెడ్ వ్యక్తుల్ని గుర్తించడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ను నగర పోలీసు విభాగం సమీకరించుకుంది. నిందితులు, దోషులు, వాంటెడ్ వ్యక్తుల ఫొటోలు నిక్షిప్తమై ఉన్న సర్వర్తో ఈ సాఫ్ట్వేర్ను అనుసంధానించారు. అలాగే నగరవ్యాప్తంగా ఉండే కెమెరాలన్నీ ఈ సర్వర్తో అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా సిటీలో ఏ సీసీకెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే.. సాఫ్ట్వేర్ ద్వారా సర్వర్ తక్షణమే గుర్తించి సీసీసీలో ఉండే కంప్యూటర్ తెరపై పాప్అప్ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. దీంతో వారి కదలికపై పోలీసులు మరింత నిఘా పెడతారు. పోలీసులు మెగాపిక్సల్ ఫొటోగ్రాఫిక్ (ఎంపీపీ) కెమెరాలను నగరంలో అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా ఒక కెమెరా నుంచి గరిష్టంగా 64 ఫ్రేముల్లో దృశ్యాలను స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి కెమెరాలు నగరవ్యాప్తంగా 28 జంక్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటిసాయంతో ఆ ప్రాంతం పరిధిలోని వాహనాలు, వ్యక్తుల వివరాలను స్పష్టంగా ఫొటోల రూపంలోనూ భద్రపరచడం సాధ్యం కానుంది. దేశంలో నగరమే టాప్ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో దేశంలోనే హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014 జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు సిటీలో 1.8 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1.6 లక్షల కెమెరాలను ప్రజలు, వ్యాపార,వాణిజ్య వర్గాలు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లతో అనుసంధానమై ఉంటాయి. మిగిలిన 20 వేల కెమెరాలను ప్రభుత్వ నిధులతో పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఈ 20 వేల కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉంటాయి. దేశంలో హైదరాబాద్ తర్వాత ముంబైలో అత్యధికంగా 6 వేల కెమెరాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరంగా బీజింగ్కు రికార్డు ఉంది. ప్రపంచంలో ఏ నగరంలో ఎన్ని కెమెరాలు? బీజింగ్: 4.7 లక్షలు లండన్: 4.2 లక్షలు చికాగో: 1.7 లక్షలు న్యూయార్క్: 1.5 లక్షలు హైదరాబాద్: 1.8 లక్షలు ఢిల్లీ: 4,074 ముంబై: 6,000 బెంగళూరు: 1,100 చెన్నై: 500 కోల్కతా: 1,000 -
మరింత నిఘాలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: కలెక్టరేట్లో నిఘా మరింత పెరిగిపోయింది. గతంలో ఎనిమిది సీసీ కెమేరాలు ఉండగా, తాజాగా మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ చాంబర్ ముందు, జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్, కలెక్టరేట్ కారిడార్, విజిటర్స్ కూర్చునేచోట, కలెక్టరేట్లోని సెక్షన్లకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, కలెక్టరేట్ బయట వాహనాల పార్కింగ్ వద్ద రెండు సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. తాజాగా సీసీ కెమేరాల ఏర్పాటుకు మరో అడుగు వేశారు. కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ మొత్తం సీసీ కెమేరాల నిఘాలోకి వచ్చేసినట్లయింది. కలెక్టరేట్లోని 16 సీసీ కెమేరాలను ఆపరేట్ చేసేందుకు రెండు డిజిటట్ వీడియో రికార్డులు ఏర్పాటు చేశారు. ఈ రెండూ సెన్సార్ మోడ్లో పనిచేయనున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో డిజిటల్ వీడియో రికార్డులు ఉన్నాయి. ఎవరు వస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు..? కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపరచడంతోపాటు కలెక్టరేట్లోకి తరచూ ఎవరు వస్తున్నారు, వచ్చినవారు ఏ సెక్షన్లలోకి వెళ్తున్నారు, ఆ సెక్షన్లలో ఎవరిని ఎక్కువగా కలుస్తున్నారన్న దానిపై కూడా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది. కలెక్టరేట్కు నిత్యం వచ్చేవారి కదలికలపై కూడా నిఘా పెట్టనున్నారు. అదేవిధంగా కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉన్న సమయంలో విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్ను కలిసేందుకు ఎవరు వస్తున్నారన్నది కూడా సీసీ కెమేరాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అంతేగాకుండా కలెక్టరేట్ కారిడార్లో ఎవరు తిరుగుతున్నా కూడా సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. పదహారు సీసీ కెమేరాలతో కలెక్టరేట్లో నిఘా మరింత పెంచడం ద్వారా ప్రతిఒక్కరి కదలికలను తెలుసుకోనున్నారు. ఏ టు హెచ్ అలర్ట్... కలెక్టరేట్లో ఏ సెక్షన్ నుంచి హెచ్ సెక్షన్ల వరకు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సెక్షన్లలో పనిచేసేవారు మరింత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్ కీలకమైనదే. ప్రతి సెక్షన్లో సంబంధిత సూపరింటెండెంట్తో పాటు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగానికే గుండెకాయ అయిన కలెక్టరేట్ పనితీరును మరింత మెరుగుపరిచి ఇతర శాఖలకు ఆదర్శంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా కలెక్టరేట్ నుంచే ఈ–ఆఫీసు విధానాన్ని ప్రారంభించారు. ఈ–ఆఫీసు అమల్లోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్కు సంబంధించిన ఫైళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరుగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేసే సిబ్బంది మరింత అప్రమత్తం కానున్నారు. -
ఈ కెమెరాలకు చిక్కారో ఇక అంతే
మాస్కో : ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనడానికి ఆయా దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా ఆయా సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దర్యాప్తు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతోంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన ఫలితాలు రావడం లేదని మాస్కో కొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తు బృందాలు తీవ్రవాదులను, క్రిమినల్స్ ను గుర్తించడానికి పోలీసులు సాధారణంగా సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తుంటారు. సీసీ ఫుటేజీల సమాచారంలో అనేక సందర్భాల్లో క్రిమినల్స్ ను గుర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే జన బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట కూడళ్లలో సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు, లేదా తీవ్రవాదులు ప్రధానంగా ఎయిర్ పోర్టుల నుంచి వెలుపలికి వస్తున్న సందర్భాలను విశ్లేషించాల్సిన సమయాల్లో సీసీ ఫుటేజీతో అంత స్పష్టత రావడం లేదని మాస్కో ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు సీసీ కెమెరాల్లో ప్రధానంగా మునుషుల ముఖాలను సులభంగా (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ) గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనుమానిత వ్యక్తి ముఖాన్ని ఇట్టే తెలిపే ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఇప్పుడు మాస్కో విరివిగా ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మాస్కో నగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,70,000 వేల ఇలాంటి సర్వెలెన్స్ కెమెరాలను అమర్చాలని నిర్ణయించింది. మాస్కో సెక్యూరిటీ నెట్ వర్క్ 2012 నుంచి మిలియన్ల కొద్ది వీడియో పుటేజీలను కలిగి ఉంది. అయితే ఈ ఫుటేజీతో క్రిమినల్స్ ను గుర్తించడం సాధ్యమయ్యేపని కాదని కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ సెక్యూరిటీ కెమెరాలను వినియోగించడం ప్రారంభించిందని, దీనివల్ల ఆయా నేరాల దర్యాప్తులో ఎంతో పురోగతి ఉంటుందని 'జిన్హువా' కథనం. తీవ్రవాదంపై పోరులో భాగంగా ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల రష్యా ఇప్పటికే అనేక చిక్కుముడులను విప్పిందని, ఈ ఏడాది మొదటి అర్థభాగంలో తీవ్రవాదులు దాడులకు ప్రయత్నించిన దాదాపు 12 సందర్భాలను ముందస్తుగా గుర్తించి నిరోధించగలిగిందని రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం పేర్కొంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని రష్యాకు ఎన్ టెక్ లాబ్ అనే స్టార్టప్ కంపెనీ సమకూర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తుల ముఖాలను కచ్చితంగా గుర్తించగలుగుతున్నాయని యూఎస్ కామర్స్ డిపార్ట్ మెంట్, యునివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు సర్టిఫై కూడా చేసినట్టు రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ నివేదిక పేర్కొంది. ఇలా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన సెక్యూరిటీ కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చిన రెండు నెలల్లోనే టెర్రరిస్టుల వాంటెడ్ జాబితాలో ఉన్న ఆరుగురు తీవ్రవాదులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. అయితే, ఈ టెక్నాలజీ సెక్యూరిటీ కెమెరాల ఖర్చు ఎక్కువగా ఉన్నందున కేవలం అతిముఖ్యమైన ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అమర్చుతున్నారు. -
ప్రతి పులికీ ఓ లెక్కుంది!
కారడవుల్లో సీసీ కెమెరాలు.. నీటి మడుగుల వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్.. సీసీఎంబీలో పెంటిక పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా పులుల లెక్కింపు.. తెలంగాణలో తొలిసారి గణన సాక్షి, హైదరాబాద్ :పులులుండేది నట్టడవిలో.. ఎక్కడ తిరుగుతాయో.. ఎప్పుడు పొదల్లోంచి బయటకొస్తాయో ఎవ్వరికీ తెలియదు! అయినా నల్లమలలో ఇన్ని పులులున్నాయి.. కవ్వాల్ అడవుల్లో అన్ని పులులు ఉన్నాయి.. ముడుమలై జంగల్లో ఇన్ని ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ఎలా చెబుతారు? సహజంగా అందరికీ కలిగే ప్రశ్నే ఇది! కానీ పులుల గణన అత్యంత పక్కాగా, పూర్తి శాస్త్రీయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రతి నాలుగేళ్లకోసారి వారం రోజులపాటు అన్ని రాష్ట్రాల్లో పులులను లెక్కిస్తారు. చివరిసారిగా 2014 జనవరిలో లెక్కించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటిసారి తెలంగాణలో కూడా పులులను గణించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పులులను ఎలా లెక్కిస్తారు? అందుకు ఏ విధానాలను అనుసరిస్తారో ఓసారి చూద్దాం.. ఈసారి ఫేజ్–4 మానిటరింగ్.. దేశవ్యాప్తంగా ఏడురోజులపాటు ఏకకాలంలో పులుల గణన చేపడతారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు (మాంసాహారులు), మరో మూడు రోజులు శాకాహార జంతువుల వివరాలు సేకరిస్తారు. ఇంతకుముందు పాదముద్రల ఆధారంగా పులులను లెక్కించేవారు. ఇప్పుడు నాలుగు దశల్లో గణించేందుకు ‘ఫేజ్–4 మానిటరింగ్’ విధానాన్ని అనుసరించేందుకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది. అంటే ఛాయా చిత్రాలు, పాదముద్రలు, పెంటిక పరీక్ష, భౌతికంగా గమనించటం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. పులుల్లో పాద ముద్రలు, చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులిచారలు, పాదముద్రలు ఎట్టి పరిస్థితుల్లో వేరే పులితో సరిపోలవు. సీసీ కెమెరాలే కీలకం.. పులుల లెక్కింపులో సీసీ కెమెరాలే కీలకం. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిమాణం 2 వేల చదరపు కిలోమీటర్లు. పులుల గణన కోసం 400 చ.కి.మీ. దూరాన్ని ఒక బాక్స్గా తీసుకుంటారు. దీన్ని మళ్లీ సబ్ బాక్స్గా విభజిస్తారు. ప్రతి సబ్ బాక్స్ 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ లెక్కన 400 చ.కి.మీ.లకు 100 బాక్స్లవుతాయి. ప్రతి బాక్స్కు ఏదో ఒకచోట ఒక జత డిజిటల్ కెమెరాలను అమరుస్తారు. నేలకు ఒకటిన్నర ఫీట్ల నుంచి 2 ఫీట్ల ఎత్తులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తారు. కదిలే జంతువు వాటి సమీపంలోకి రాగానే అందులోని కెమెరా క్లిక్ మంటుంది. ఇలా ఫొటోలను సేకరించి వాటిలో నమోదైన పులుల చారలను పరిశీలిస్తారు. చారల్లో ఉండే తేడాల ఆధారంగా ఒక ఫోటోను మరో ఫోటోతో సరిపోల్చుతూ పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. ఒక ప్రాంతంలో సేకరించిన చిత్రాలన్నింటిలో ఒకే తరహా చారలు ఉంటే అక్కడ ఒకే పులి సంచరిస్తుందని, ఒకవేళ చారలు సరిపోలక పోతే రెండో పులి కూడా ఉందని నిర్ధారిస్తారు. ప్రతి పులికీ ఓ నంబర్.. గుర్తించిన ప్రతి పులికి ఒక నంబర్ ఇస్తారు. ఒకరకంగా ఆ నంబరే పులి పేరుగా అనుకోవచ్చు. ఉదాహరణకు నాగర్కర్నూలు జిల్లా మన్ననూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఒక మగ పులిని గుర్తించి దానికి టీఎంఎన్ఆర్డీ ఎం1 అనే నంబర్ కేటాయించారు. ఇందులో టీ అంటే తెలంగాణ, ఎంఎన్ఆర్ అంటే మన్ననూర్, డీ అంటే డివిజన్, ఎం అంటే మేల్, 1 అంటే ఒకటో పులి అని అర్ధం. ఇక ఈ పులి దేశంలో ఏ అడవికి వెళ్లినా వెంటనే గుర్తిస్తారు. ఇలా ఒక ఆవాసంలో ఎన్ని పులులు కనిపిస్తే అన్ని నంబర్లు కేటాయిస్తారు. పులుల లెక్కలు సేకరించేటప్పుడు రెండేళ్ల లోపు కూనలను పరిగణనలోకి తీసుకోరు. పాదముద్రలు సేకరిస్తారిలా.. పులి సాధారణంగా చదునైన దారి మీదే రాకపోకలు సాగిస్తుంది. బలంగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. దాని పాదం పడిన చోట కచ్చితంగా ముద్రలు పడుతాయి. ఏ రెండు పులుల పాదం ముద్రలు ఒకేలా ఉండవు. నీటి మడుగుల సమీపంలో చదునైన బాటపై అధికారులు పచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చిన పులి పలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. వాటి ఆధారంగా పులల సంఖ్యను నిర్ధారిస్తారు. సీసీఎంబీలో పెంటిక పరీక్ష పులులు సంచరించే ప్రాంతంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. అదే రోజు లేదా రెండు, మూడ్రోజుల కిందట విసర్జితమైన పెంటికలను మాత్రమే సేకరిస్తారు. ఇలా వరుసగా మూడు, నాలుగు రోజులపాటు 10 నుంచి 15 పెంటిక శాంపిల్స్ను సేకరించి సీసీఎంబీకి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు చేస్తారు. సేకరించిన అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్ఏలలో తేడా ఉంటే మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు. లెక్కలకు సిద్ధమవుతున్నాం: శంకరన్, వన్యప్రాణి విభాగం ప్రత్యేక అధికారి పులుల గణనకు సమాయత్తం అవుతున్నాం. గతంలో ప్రధానంగా పాద ముద్రలపై ఆధార పడేవాళ్లం. ఇప్పుడు ఫేజ్–4 మానిటరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఛాయా చిత్రాలు, పెంటికలు, పాదముద్రలు, భౌతికంగా చూడటం ద్వారా పులుల సంఖ్యను నిర్ధారిస్తాం. ఇలా గుర్తించిన పులికి ఒక నంబర్ ఇచ్చి, కేంద్ర వన్యప్రాణి విభాగానికి పంపిస్తాం. వాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న పులల గణాంకాలతో పుస్తకం ప్రచురిస్తారు. -
దొంగల ముఠా యాప్తో ఠా
ప్రొద్దుటూరు క్రైం : రాష్ట్ర వ్యాప్తంగా చోరీలను అరికట్టడానికి పోలీసులు కొత్తగా ప్రవేశ పెట్టిన ఏపీ ఎల్హెచ్ఎంఎస్ ఆండ్రాయిడ్ యాప్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లో యాప్కు విస్తృత ప్రచారం కల్పిస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ముఖ్య పట్టణాలలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. యాప్ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ఏపీ ఎల్హెచ్ఎంఎస్ అప్లికేషన్ను డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ స్క్రీన్పై రిజిస్టర్, రిక్వెస్టు పోలీసు వాచ్ అనే రెండు ఆప్షన్లు వస్తాయి. రిజిస్టర్ ఆప్షన్ను క్లిక్ చేసి అందులో సెల్ఫోన్తోపాటు ఇంటి అడ్రస్ టైప్ చేయాలి. తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కొన్ని సెకండ్లలోనే సెల్కు ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ నంబర్ను ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ ఓటీపీ అనే మెసేజ్తో పాటు అందులో ఐడీ నంబర్ వస్తుంది. ఆ నంబర్ను గుర్తుండేలా ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. ఒకటి లేదా నాలుగైదు రోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వెంటనే రిక్వెస్ట్ పోలీసు వాచ్ ఆప్షన్లోకి వెళ్లి ఐడీ నంబర్, ఎప్పుడు వెళ్తారో, ఏ తారీఖున తిరిగి వస్తారో అందులో పొందు పరచి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. వెంటనే ఈ మెసేజ్ ఏపీ ఎల్హెచ్ఎంఎస్ కంట్రోల్ రూమ్కు వెళ్తుంది. వచ్చిన మెసేజ్ ఆధారంగా సంబంధిత ఫోన్ నంబర్కు పోలీసులు మళ్లీ ఒక సారి ఫోన్ చేసి రిక్వెస్టును సరి చూస్తారు. నిర్ధారించుకున్న తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీసీ కెమెరా తీసుకొచ్చి ఇంట్లోని రహస్య ప్రాంతంలో అమరుస్తారు. ఈ కెమెరా రాత్రి, పగలు పని చేస్తుంటుంది. కెమెరా ముందు నుంచి మనిషి లేదా పిల్లి, ఎలుక లాంటివి వెళ్లినా కంట్రోల్ రూంలో అలారం మోగుతుంది. అక్కడి పోలీసులు కంట్రోల్ రూం ద్వారా సీసీ కెమెరా దృశ్యాలను చూస్తారు. ఒక వేళ ఇంట్లోకి ప్రవేశించింది మనిషి అయితే వెంటనే బీట్ పోలీసులు, సీఐ, ఎస్ఐ, డీఎస్పీకి సమాచారం అందిస్తారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి దొంగను అదుపులోకి తీసుకుంటారు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో... లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై జిల్లా పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 14,800 మంది యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ప్రొద్దుటూరులోనే 5,950 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సీసీ కెమెరాలు కావాలని ప్రొద్దుటూరుకు చెందిన 90 మంది రిక్వెస్టు పెట్టుకున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గానికి సంబంధించి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు జమాలుల్లా ఖాన్, రవి, ఎస్ం బాషా, హోంగార్డు మునీంద్ర మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐలు వెంకటశివారెడ్డి, సదాశివయ్య, ఓబులేసు, ఎస్ఐలు కూడా పర్యవేక్షిస్తున్నారు. -
గౌరీ లంకేష్ హత్యః ఆ రోజు ఏం జరిగిందంటే..
సాక్షి,బెంగళూర్: తనను కాల్చి చంపిన కిల్లర్ను జర్నలిస్ట్ గౌరీ లంకేష్ నేరుగా చూసినట్టు సీసీటీవీ ఇమేజ్లను పరిశీలించిన సిట్ వర్గాలు తెలిపాయి. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్ను గమనించింది...వెనువెంటనే దుండగుడు ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు..మొదటి బుల్లెట్ ఆమె కుడి పక్కటెముకలోకి దూసుకుపోగా, రెండవ బుల్లెట్ ఎడమ పక్కటెముకకు తాకింది. తర్వాత రెండు అడుగులు వెనకకు వేసి రూమ్లో అటూ ఇటూ పరుగెత్తిన గౌరీపై మరుక్షణమే రెండడుగులు ముందుకొచ్చిన కిల్లర్ కాల్పులు జరపగా మూడో బుల్లెట్ గురితప్పింది..నాలుగో బుల్లెట్ ఆమె వెన్నులో నుంచి దూసుకెళ్లి ఛాతీనుంచి బయటకు వచ్చిందని సిట్ వర్గాలు చెప్పాయి. నాలుగో బుల్లెట్ అనంతరం ఆమె 30 నుంచి 60 సెకన్లు మాత్రమే ప్రాణాలతో ఉండి ఉంటారని పేర్కొన్నాయి. -
పాస్వర్డ్ చిక్కుముడి
♦ గౌరిలంకేష్ హత్య కేసులో సిట్ విచారణ ♦ ఇంటి ముందున్న రెండు సీసీ కెమెరాల్లో కీలక చిత్రాలు ♦ పాస్వర్డ్ వల్ల ఆటంకాలు సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరి లంకేష్ హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగడానికి అధికారులకు రెండు సీసీ కెమెరాల పాస్వర్డ్లు అడ్డుపడుతున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గౌరిలంకేష్ను రాజరాజేశ్వరి నగరలోని ఆమె ఇంటి వద్దే దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఆమె ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాల చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తుపాకితో గురిచూసి కాల్చే సమయంలో వ్యక్తి, అతనికి సహకారం అందించినవారు కనీసం అరనిమిషం పాటు నిల్చొనే ఉంటారు. ఘటనకు ఆ సీసీ కెమెరాలు దగ్గరగా ఉండడం వల్ల చిత్రాలు స్పష్టంగా ఉంటాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆ ఫుటేజీలు బయటకు రావడం లేదని సమాచారం. మొత్తం నాలుగు కెమెరాల చిత్రాల్లో రెండింటివి చూశారు, మిగిలిన రెండింటి కెమెరాల ఫుటేజీల్లోకి వెళ్లడానికి గౌరిలంకేష్ పాస్వర్డ్ పెట్టారని, దాన్ని డీకోడ్ చేయడం పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ కీలకం ఇదిలా ఉండగా సంఘటన జరిగిన సమయం రాత్రి 7:45 నుంచి 8 గంటలు. ఆ సమయంలో బెంగళూరు వాతావరణం మబ్బులు పట్టీ చినుకులు కూడా పడుతుండటంతో సరైన వెలతురు లేదు. దుండగుల బైక్ సీసీ కెమెరాల చిత్రాల్లో కనిపిస్తున్నా రిజిస్ట్రేషన్ నెంబర్ను గుర్తించడం ఖాకీలకు కష్టసాధ్యంగా మారింది. సమస్య పరిష్కారం కోసం పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారుల సహకారం కోరినట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పాస్వర్డ్ను డీ కోడ్చేయడంతో పాటు నైట్ విజన్ డిజిటల్ టెక్నాలజీతో నంబర్ ప్లేట్పైనున్న అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆయుధం మావోయిస్టులదేనా? హత్యాస్థలంలో దొరికిన ఖాళీ తూటా (కాట్రిడ్జ్)ను చూస్తే, హత్యాయుధం 7.35 ఎంఎం పిస్టల్గా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. గతంలో లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఈ పిస్టళ్లనే పోలీసులకు అప్పజెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమికంగా ఆధారాలు మాత్రమేనని, దర్యాప్తు సాగిన కొద్ది కొత్తవిషయాలు కూడా వెలుగులోకి రావచ్చునని సిట్ బృందంలోని డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. అంత్యక్రియలకు మావోయిస్టుల హాజరు గౌరి లంకేష్కు మావోయిస్టు సానుభూతి పరులారన్న పేరున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సిరిమనే నాగరాజు వంటి అగ్రస్థాయి నాయకులు జనజీవన శ్రవంతిలోకి రావడానికి ఆమె విశేషంగా కృషి చేశారు. ఎంతోమందితో పరిచయాలూ ఉన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన గౌరిలంకేష్ అంత్యక్రియలకు దాదాపు 15 మంది మావోయిస్టులు రహస్యంగా హాజరయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఫుటేజీలతో పాటు మఫ్టీలో పోలీసులు అత్యాధునిక కెమరాలతో తీసిన వీడియో రికార్డ్స్ను పరిశీలించిన సిట్ బృందం ఈ నిర్థారణకు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ కేసు విషయమై పనిచేస్తున్న సిట్బృందంలోని దాదాపు పదిమంది గతంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసినట్లు సమాచారం. -
తెగువచూపి.. తిరగబడి..
- ఇంట్లోకి చొరబడి దోపిడీ - సాహసోపేతంగా పట్టుకునేందుకు గృహిణి విఫలయత్నం గుంటూరు ఈస్ట్: కత్తి చూపించి బెదిరించి నగలు దోపిడీ చేసిన నిందితులపై.. ఓ గృహిణి ధైర్యం చేసి ఎదురు తిరిగింది. ఒంటరిగా ఉన్నాననే భయాన్ని వీడి ఇద్దరు నిందితులపై తిరగబడింది. వెంటాడి వెంటాడి రోడ్డుపై వెళుతూ పోరాడింది. చేతికి తీవ్ర గాయమైనా పట్టించుకోకుండా నింది తులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. పాతగుంటూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ హై స్కూల్ సమీపంలో కొత్తమాసు వేణుగోపాల్, సువర్ణలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. బస్టాండ్ సమీపంలోని కృష్ణ క్లాత్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లో వేణుగోపాల్ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంట్లోనూ చీరలు, ఫాల్స్ విక్రయిస్తుంటారు. ఆగస్టు 31న ఓ వ్యక్తి, మహిళ వేణుగోపాల్ ఇంటికి వచ్చి చీర ఫాల్ కొనుగోలు చేశారు. తిరిగి సెప్టెంబర్ 2న వేణుగోపాల్ ఇంటికి వచ్చి చీరలు, ఫాల్స్ ధరలు వాకబు చేసి వెళ్లారు. మంగళవారం ఉదయం 11.15 సమయంలో సువర్ణలక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఒక చీర ఫాల్ కొనుగోలు చేశారు. మంచినీరు ఇవ్వమని అడిగారు. సువర్ణలక్ష్మి లోపలికి వెళ్లి వచ్చి మంచినీళ్లు ఇస్తే ఇద్దరూ తీసుకున్నారు. మంచినీళ్లు తాగే సాకుతో లోపలి గదిలోకి వచ్చి తలుపులు వేసి గడియపెట్టి సువర్ణ లక్ష్మిపై ఇద్దరూ దాడి చేశారు. కత్తి పొట్టపై పెట్టి మెడలో ఉన్న రెండు బంగారు చైన్లు, వాటికి ఉన్న తాళిబొట్టు, రూపు, చేతికి ఉన్న రెండు బంగారు గాజులు లాక్కున్నారు. సువర్ణలక్ష్మి ధైర్యంగా వారిని అడ్డగించి కేకలు వేసింది. ఇద్దరిలో పురుషుడు వేగంగా రోడ్డుపైకి వెళ్లి బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. సువర్ణలక్ష్మి అరుపులు విని ఆ దారిన వెళుతున్న మరో మహిళ పారిపోతున్న నిందితురాలిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు మహిళలూ బైక్ను కదలనీయకుండా విఫలయత్నం చేశారు. నిందితుడు వాహనాన్ని వేగంగా నడపటంతో ఇద్దరూ పరారయ్యారు. పెనుగులాటలో సువర్ణ లక్ష్మి చేతికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. సువర్ణలక్ష్మి నుంచి 15 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వీధిలో అనేక సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులు ఫుటేజీలో నమోదయ్యాయి. -
కోర్టుల్లో కెమెరా కన్ను!
దేశంలో చాన్నాళ్లుగా అందరూ కోరుకుంటున్నట్టు న్యాయ స్థానాల్లో క్లోజ్డ్ సర్క్యూట్(సీసీ) కెమెరాలు రాబోతున్నాయి. రాష్ట్రానికి రెండు జిల్లాలు చొప్పున ఎంచుకుని అక్కడి జిల్లా న్యాయస్థానాల్లో కెమెరాలు అమర్చాలని మొన్న మార్చిలో ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానం మొదలుకొని దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో, ట్రిబ్యునళ్లలో ఈ ఏర్పాటు చేయాలంటూ మూడు రోజుల క్రితం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ పడుతున్న కేసులపై అందరికీ ఆదుర్దా ఉంది. అయితే పరిష్కారంపై న్యాయవ్యవస్థతోసహా ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇది ఏదో ఒక్క అంశంతో ముడిపడి ఉన్న సమస్య కాదు. చాలినంతగా న్యాయమూర్తులు లేకపోవడం మొదలుకొని చీటికి మాటికీ కేసులు వేసే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి వరకూ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులు, వివిధ రంగాలకు ట్రిబ్యునళ్లు, ఫ్యామిలీ కోర్టులు, మొబైల్ కోర్టులు, న్యాయస్థానాల సంఖ్య పెంచడం... ఇలా రకరకాల విధానాల ద్వారా పెండింగ్ సమస్యను దారికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అందువల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే పెద్దగా ఎవరి దృష్టీ పడని అతి ముఖ్యమైన అంశం పారదర్శకత. కింది కోర్టుల్లో నిర్దేశించిన విధానాలను పాటించక ఇష్టానుసారం వ్యవహరించడం పెండింగ్ కేసులు కొండలా పెరిగిపోవడానికి కారణమన్న వాదన ఎప్పటినుంచో ఉంది. కేసుల విచారణ తీరు తెన్నులను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు అమరిస్తే అన్నీ పద్ధతిగా జరుగు తాయని ఇలా వాదించేవారి అభిప్రాయం. విచారణ దశలో వివిధ అంశాలను లిఖితపూర్వకంగా రికార్డు చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. అయితే కేసులో కీల కమైనవని న్యాయమూర్తి భావించి మౌఖికంగా చెప్పే విషయాలు మాత్రమే అందులోకి ఎక్కుతాయి. కేసులో ఏది న్యాయమో, ఏది కాదో నిర్ధారించేందుకు ఆ అంశాలు ఉపయోగపడతాయి తప్ప మొత్తంగా విచారణ ఎలా జరుగుతున్నదో, తరచు వాయిదా పడటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో అవి తేటతెల్లం చేయలేవు. కేసు విచారణల వార్తల్ని సేకరించేందుకు మీడియాను దాదాపు అన్ని దేశాల్లోనూ అనుమతిస్తున్నారు. అయితే దానికుండే పరిమితులు దానికున్నాయి. ఏ వ్యవస్థకైనా గోప్యతనేది అవసరమే కావొచ్చుగానీ అది మోతాదుకు మించి ఉంటే అవరోధంగా మారుతుంది. పకడ్బందీ పర్యవేక్షణ ఉన్నచోట అన్నీ సక్ర మంగా కొనసాగుతాయి. లేనిపోని జాప్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైకోర్టుల్లో పోర్టుఫోలియో జడ్జీలుండి తమ తమ పరిధుల్లోని జిల్లాల్లో ఏం జరుగుతున్నదో... కేసుల కదలిక ఎలా ఉంటున్నదో గమనిస్తుండటం, అవసరమైన సూచనలు, సల హాలు ఇవ్వడం ఇందులో భాగమే. అయితే ఇది ఎంతమాత్రమూ సరిపోదన్నది పారదర్శకత కోరుకునేవారి వాదన. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి సాగిన తీరుపై తీవ్ర విమ ర్శలు చెలరేగాయి. తీరా తుది తీర్పు వెలువడేనాటికి ఆమె కన్నుమూశారు. ఏదో ఒక సాకు చెప్పి న్యాయవాదులు వాయిదాలు కోరడం, న్యాయమూర్తులు ఉదా రంగా అనుమతులీయడం ఒక ధోరణిగా మారింది. విచారణ ప్రక్రియంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తే ఈ ధోరణి ఎంతోకొంత తగ్గుతుంది. ఆమేరకు విశ్వసనీయత పెరుగుతుంది. అయితే అదే సమయంలో కేసును విచారించే న్యాయమూర్తిపై అది ఒత్తిడి కలగజేస్తుందన్నది కూడా నిజం. సాక్ష్యమూ, చట్టమూ తప్ప ఇతరత్రా అంశాల ప్రభావమేదీ కేసుపై పడకుండా చూసుకోవడం ఆ పీఠంపై ఉన్నవారికి ప్రధానమవుతుంది. న్యాయమూర్తి మాత్రమే కాదు... కేసుకు సంబంధించిన ఇరు పక్షాల న్యాయవాదులు, కోర్టు హాల్లో ఉండే సిబ్బంది, పోలీసు అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారు. చాలా దేశాల్లో కోర్టు విచారణలను కెమెరాల్లో రికార్డు చేసే సంప్రదాయం ఉంది. అమెరికాలో 1991లో తొలిసారి ఈ విధానం ప్రవేశపెట్టినప్పుడు అటు విమ ర్శలు, ఇటు ప్రశంసలు కూడా సమానంగా వచ్చాయి. ఆన్లైన్లో లభ్యమయ్యే ఆ వీడియోల వల్ల సొంత పనులపై బయటకు వెళ్లినప్పుడు సమస్యగా మారుతున్న దని న్యాయమూర్తులు కొందరు చెప్పారు. బాధితుల పక్షం న్యాయవాదిగా ఉన్న వారికి పెద్ద ఫర్వాలేదుగానీ... వారిని ఇబ్బందులపాలు చేసినవారి తరఫున వృత్తి ధర్మంతో వాదిస్తే అది తమపై వేరే అభిప్రాయం కలగజేస్తున్నదని వాపోయిన న్యాయవాదులున్నారు. మరోపక్క తమ గురించి అందరికీ తెలిసిపోతుందని సాక్ష్యం చెప్పేవారు భయాందోళనలకు గురికావడం, తడబడటం మామూలే. ఇలాంటి కారణాలు చూపి అమెరికాలోని కొన్ని ఫెడరల్ కోర్టులు కెమెరాల ఏర్పాటును తిరస్కరించాయి. క్రిమినల్ కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే చానెళ్లు కూడా ఆ దేశంలో ఉన్నాయి. అక్కడి కోర్టు ఆఫ్ అప్పీల్స్ కెమెరాలను అంగీ కరిస్తుంటే సుప్రీంకోర్టు కాదంటున్నది. మన సుప్రీంకోర్టు మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమంటూనే ఆ రికార్డులను సమాచార హక్కు చట్టం కింద బయట పెట్టకూడదన్న ఆంక్ష విధించింది. దీనికితోడు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల అనుమతి లేనిదే ఎవరికీ రికార్డయిన భాగాలు ఇవ్వకూడదని తెలిపింది. అలాగని సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభావంపై అతి అంచనాలకు పోవడం కూడా సరికాదు. కెమెరాల ఏర్పాటు దానికదే కేసుల విచారణను వేగవంతం చేస్తుందని, అంతా పారదర్శకమవుతుందని భావించకూడదు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి తోడ్పడే అనేకానేక అంశాల్లో అదొకటి మాత్రమే. దేన్నయినా కోర్టులో పడేసి చేతులు దులుపుకునే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి అటు సాధారణ పౌరులను కోర్టు పక్షుల్ని చేస్తున్నది. ఇటు న్యాయస్థానాలను ఊపిరి సలపనీయడం లేదు. అందుకే అందరికంటే ముందు మారాల్సింది పాలనా వ్యవస్థే. అది మారితేనే ఏ కాస్తయినా ప్రయోజనం కలుగుతుంది. -
పారదర్శకమా.. పర్సంటేజీలా..!
చైర్మన్ నవీన్ మొగ్గు ఎటువైపన్న దానిపైనే అందరి నిరీక్షణ చర్చనీయాంశమైన జెడ్పీ సీసీ పోస్టింగు సీటు కోసం ఎవరి పైరవీలు వారివి భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్లో ఏ ఫైలు కదలాలన్నా, బదిలీలు కావాల్సిన చోటుకి రావాలన్నా, పెన్షన్లు, పీఎఫ్ ఫైళ్లు, ఉపాధ్యాయులు డిప్యుటేషన్లు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, జెడ్పీ నుంచి విడుదలయ్యే కోట్ల రూపాయల నిధులు, వాటి పర్సంటేజీలు, జెడ్పీ ఆస్తులు, ఆదాయాలు వీటన్నింటిపై చక్రం తిప్పే సీటు జెడ్పీలో ఏదైనా ఉందంటే అది జెడ్పీ చైర్మన్ సీసీ పదవే. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా జ్యోతుల నవీన్ ఎంపికైన తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న గత జెడ్పీ చైర్మన్ నామన సీసీ ప్రసాద్ మాతృస్థానానికి వెళ్లారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుత చైర్మన్ సీసీగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది. గతంలో వంగా గీతావిశ్వనాథ్ నుంచి సీసీగా అనేక పర్యాయాలు పనిచేసిన ప్రణాళికా విభాగానికి చెందిన హరికృష్ణ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే నామనకు సీసీగా వ్యవహరించిన ప్రసాద్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జెడ్పీలో పనిచేసి ఆర్అండ్బీకి బదిలీపై వెళ్లిన సత్యనారాయణమూర్తి సైతం ఒకే సామాజిక వర్గ సమీకరణాలతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. సామాజిక వర్గమా.. అనుభవమా..! కీలకంగా మారిన ఈ పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్గీయులకే చైర్మన్ నవీన్ కట్టబెడతారో లేక పర్సంటేజీలలో అనుభవమున్న వ్యక్తులకు ఇచ్చి కలెక్షన్లకు తెరదించుతారోనని చర్చ మొదలైంది. నవీన్ సమావేశాల్లో ఆది నుంచీ రెండేళ్ల పాలనలో జెడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని పెంచుతానని, పర్సంటేజీల పాలనకు స్వస్తి పలికి నీతి నిజాయతీలతో పీఠానికి గౌరవం తెస్తానని అంటున్నారు. ఆయన మాటలు కేవలం సమావేశాలకే పరిమితమా లేక కార్యరూపంలో పెడదారా అన్న సందేహం అందరిలో మొదలైంది. ఉద్యోగుల్లో ఉన్న యూనియన్ల దృష్ట్యా ఏ సంఘం వారికి ప్రాధాన్యం ఇస్తారో ఆయా సంఘాల సభ్యులంతా వేచి చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సందేహాలు నివృత్తి కానున్నాయి. రెండు రోజుల్లో సీసీ నియామకం జరుగుతుందని, పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని, జిల్లా పరిషత్లో గ్రీవెన్స్తో సహా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చైర్మన్ నవీన్ ప్రకటించారు. -
కరూర్ వైశ్య బ్యాంక్ దోపిడీకి యత్నం
- కిటికీ ఊచలను కోసి లోపలికి ప్రవేశంచిన దుండగులు - సీసీ కెమెరాల కేబుల్ వైర్లను కట్ చేసిన వైనం - స్ట్రాంగ్ రూం లోకి వెళ్లగానే మోగిన సైరన్..పరారైన దొంగలు - సెక్యూరిటీ గార్డు వ్యవహారంపై అనుమానం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : నగరంలోని గౌలి వీధిలో.. పాత కంట్రోల్ రూం సమీపంలో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్లో శనివారం అర్ధారాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్కు కూత వేటు దూరంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీ బంగ్లాలు, కార్యాలయాలు, రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఉన్నాయి. ఆ దారి భద్రతా వలయంలో ఉన్న వీధిలో బ్యాంక్ దోపిడీకి యత్నించడం సంచలనం రేపింది. పక్కా ప్రణాళికతోనే.. కరూర్ వైశ్య బ్యాంకులో ఆరుగురు సభ్యులు ఉన్నా దొంగల ముఠా పక్కా ప్రణాళికతో దోపిడికీ యత్నించినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకుకు ఎడమ పక్కన ఉన్న అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవనే విషయాన్ని గమనించి అటువైపు ఉన్న కిటికీ నుంచి లోపలికి ప్రవేశించాలని పథకాన్ని రచించినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి రెండు గంటల మధ్య కిటికీ గ్రిల్ను హాక్సా బ్లేడ్లతో కట్ చేసి ఇద్దరు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. అలారం వైర్లను కట్ చేసేందుకు సర్వర్ రూంలో పవర్ను నిలిపివేసేందుకు చాలా వైర్లను కట్ చేశారు. అలారం సైరన్ మోగదనుకొని స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఉదయం 6.55 గంటలైంది. ఆ సమయంలో స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సైరన్ మోగిడంతో పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా, సైరన్ మోగిన వెంటనే సెక్యూరిటీ గార్డు షాలిసాహెబ్ అప్రమత్తమై బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పార్థసారథికి ఫోన్ చేశారు. ఆయన మేనేజర్ రవితేజకు తెలియజేయడంతో వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బ్యాంకులో విలువైన పత్రాలు, డబ్బులు దొంగతనానికి గురికాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ గార్డు వ్యవహారంపై అనుమానం... సెక్యూరిటీ గార్డు షాలిసాహెబ్ రాత్రి పూట మేల్కొనాల్సి ఉండగా ఒంటి గంట సమయంలో పడుకున్నానని చెబుతున్నాడు. బ్యాంకు కిటికీ గ్రిల్ను కోస్తున్నా, లోపలికి వెళ్లి వైర్లను కట్ చేస్తున్నా అతనికి స్పృహ లేకపోవడం గమనార్హం. ఉదయం 5.30 –6 గంటల మధ్య లేచి బ్యాంక్ లోపల కొంత ప్రదేశం శుభ్రం చేసి బయట కూర్చున్నానని అధికారులకు చెప్పాడు. 6.55 గంటలకు అలారం మోగడంతో వెంటనే చుట్టుపక్కల పరిశీలించినా ఎవరూ కనిపించలేదనడం, గ్రిల్ నుంచి దొంగలు బయటకు వచ్చేది తను చూడలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాల పరిశీలిన : విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో దొంగలు డ్రిల్ మిషన్ కిట్తో పాటు గడ్డపార, పెరుగన్నం, రెండు బిస్కెట్ ప్యాకెట్లు, రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిశితంగా పరిశీలించిన కుక్కలు యూకాన్ ప్లాజా వరకు వెళ్లాయి. క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలను సేకరించింది. ప్రొఫెషనల్స్ పనే : దోపిడీ యత్నంలో ఆరుగురు ప్రొఫెషనల్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు దోపిడీల్లో వారికి అనుభవం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లోపలికి ప్రవేశించడం.. నుంచి సీసీ కెమెరాలు, సైరన్ వైర్లను కట్ చేయడం, పవర్ను డిస్కనెక్ట్ చేసిన తీరు అందుకు నిదర్శనం. అంతేగాక కిటికీలు, తలుపులు, వైర్లు, లాకర్లు, స్ట్రాంగ్ రూంలను కట్ చేయడం, పగలగొట్టడానికి అత్యాధునిక డ్రిల్ మిషన్లు, కటింగ్ బ్లేడ్లతో కూడిన కిట్ను వాడారని ఆధారాలను బట్టి అర్థమవుతోంది. -
వ్యర్థాల విడుదలపై సీసీ కెమెరాలతో నిఘా
♦ పీసీబీ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ ♦ పోలీస్ శాఖ నుంచి పీసీబీకి 100 మంది అధికారులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశ్రామిక వ్యర్థాలను నాలాల్లోకి విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో సమీక్షించారు. అక్రమంగా వ్యర్థాల డంపింగ్ నిఘా కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జీడిమెట్ల, బాలానగర్ పారిశ్రామికవాడల్లో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామ న్నారు. పరిశ్రమల వ్యర్థాల అక్రమ డంపింగ్ను అరికట్టేం దుకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీస్ శాఖ నుంచి 100 మంది అధికారు లను డిప్యూటేషన్పై నియమించుకో వాలని పీసీబీకి సూచించారు. ఈ మేరకు డిప్యుటేషన్ కోరుతూ ప్రతిపాదనలు పంపిస్తే హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాస్తానని చెప్పారు. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు, విడుదలయ్యే వ్యర్థాల పరిమాణం, వ్యర్థాల రవాణాకు వినియోగిస్తున్న వాహనాలు తదితర వివరాలతో ఓ నివేదికను తయారు చేయాలని పీసీబీని కోరారు. కాలుష్యవ్యర్థాల నిర్వహణలో విఫలమవుతున్న శాఖలకు పీసీబీ నుంచి నోటీసులు జారీ చేయాలని కోరారు. సంగారెడ్డి, పటాన్చెరు, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో కాలుష్య వ్యర్థాలను బోరు గుంతల్లో విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక బృందాలతో తనిఖీలు జరిపి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ తరహాలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పోలేపల్లి సెజ్లోని రెండు కంపెనీలను మూసివేస్తున్నామని పీసీబీ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు. చెరువుల్లో నురగపై నివేదిక ఇవ్వండి చెరువుల నుంచి వస్తున్న నురగపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేటీఆర్ కోరారు. పారిశ్రా మిక వ్యర్థాలపై కట్టడి లేకపోవడంతో ఈ సమస్య కొనసాగుతుందన్నారు. నగరంలోని చెరువులు, హుస్సే న్సాగర్ సుందరీకరణపై సమీక్షించారు. హుస్సేన్ సాగర్లోకి మురికి నీరు చేరకుండా 90% విజయం సాధించామన్నారు. వినాయక నిమజ్జనానికి 25 మినీ కొలనులను అభివృద్ధి చేశామన్నారు. -
దొంగతనం ‘చూసి’ నేర్చుకుంది!
‘బ్యాగ్ దొంగ’గా మారిన పీజీ విద్యార్థిని - ఓ చోరీ చూసి దొంగతనాలు నేర్చుకున్న యువతి - రద్దీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్ - గత ఆరు నెలల్లో 3 దొంగతనాలు - అరెస్టు చేసిన ఎస్సార్నగర్ పోలీసులు హైదరాబాద్: ఆమె పేరు అర్చన.. దూర విద్యా విధానంలో సైకాలజీలో పీజీ చేస్తోంది.. తరచూ సిటీకి వచ్చి వెళ్లే ఈమె ఓ చోరీని చూసి తానూ దొంగగా మారింది.. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని టార్గెట్ చేసుకుంది.. వారి బ్యాగుల్లోని విలువైన వస్తువులు, బంగారం తస్కరించేది.. గత ఆరు నెలల్లో మూడు దొంగతనాలు చేసింది.. చివరకు మంగళవారం ఎస్సార్నగర్ క్రైమ్ పోలీసులకు చిక్కిందని వెస్ట్జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. చోరీ చూసి అదే పని.. మెదక్కు చెందిన పి.అర్చన(27) ఉస్మానియా నుంచి దూరవిద్యలో సైకాలజీలో పీజీ చేస్తోంది. కూకట్పల్లి వివేకానంద కాలనీలో నివసించిన ఆమె ఓ ఫిజియోథెరపిస్ట్ వద్ద సహాయకురాలిగా పనిచేసింది. గత కొన్నాళ్లుగా స్వస్థలమైన మెదక్ జిల్లా నర్సాపూర్లో కుటుంబం తో కలసి ఉంటోంది. ఈమె తండ్రి ప్ర భుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా రు. సిటీకి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న అర్చనను ఓ ‘సీన్’ఆకర్షించింది. ఓ మహిళా దొంగ రద్దీ బస్సులో చోరీ చేయడం చూసి తానూ అదే పని చేయాలని నిర్ణయించుకుంది. తల్లి మందుల కోసం వచ్చి వెళ్తూ.. అర్చన తల్లికి కొన్నాళ్ల క్రితం గుండె జబ్బుకు సంబంధించిన చికిత్స జరిగింది. తల్లికి అవసరమైన మందుల కోసం అర్చన తరచుగా హైదరాబాద్కు వచ్చి వెళుతోం ది. ఇలా వచ్చినప్పుడు అదును చిక్కితే ఓ చోరీ చేస్తోం ది. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వెనుక నిల్చునే అర్చన అదును చూసుకుని వారి హ్యాండ్ బ్యాగ్ జిప్ తెరుస్తుంది. అందులోని విలువైన వస్తువులు, పర్సులు, బంగారం తీసుకుని వెంటనే బస్సు దిగిపోతోంది. కూకట్పల్లి–ఈఎస్ఐ, ఈఎస్ఐ–మైత్రీవనం, మైత్రీవనం–పంజగుట్ట మధ్య గత ఆరు నెలల్లో 3 చోరీలు చేసిన అర్చన 51.6 గ్రాముల బంగారం తస్కరించింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో.. ఏటీఎం కార్డు పోగొట్టుకున్న బాధితురాలికి.. సీసీ టీవీ దృశ్యాలను చూపించి బస్సులో ఎప్పుడైనా అనుమానితురాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. మంగళవారం అర్చనను బస్సులో చూసిన బాధితురాలు నిలదీసింది. ఓ ఆంటీ కోరడంతో ఏటీఎం కార్డు నుంచి డబ్బు డ్రా చేసి ఇచ్చానని, తనకు సంబంధం లేదని తప్పించుకోవాలని ప్రయత్నించింది. బాధితురాలు ఎస్సార్నగర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అర్చనను అదుపులోకి తీసుకున్నారు. తాను పీజీ విద్యార్థినని, తమది సంప్రదాయ కుటుంబమని, తనపై అనవసరంగా నేరం మోపుతున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి న అర్చన.. వారితో వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆధారాలు చూపడంతో చివరికి నేరం అంగీకరించింది. అర్చనను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె నుంచి 8.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కొంత.. స్నేహితునికి కొంత అర్చనకు ఎలాంటి అలవాట్లు లేవని, జల్సాలు సైతం చేయదని పోలీసులు చెప్తున్నారు. తస్కరించిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత ఇంట్లోనే ఇస్తూ.. తాను ఫిజియోథెరపీకి సంబంధించి పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులను నమ్మించింది. మిగిలిన మొత్తాన్ని ఫిజియోథెరపీ చేస్తున్న సమయంలో పరిచయమైన ఓ స్నేహితునికి ఇస్తున్నట్లు వెల్ల డైంది. అర్చన చేసిన నేరాలకు సంబంధించి ఎస్సార్నగర్ ఠాణాలో రెండు, పంజగుట్ట ఠాణాలో ఒక కేసు నమోదయ్యాయి. ఎస్సార్నగర్లో ఓ మహిళ బ్యాగ్ నుంచి అర్చన తస్కరించిన వాటిలో ఏటీఎం కార్డు సైతం ఉంది. కార్డుతో పాటే పిన్ నంబర్ ఉండటంతో.. మూసాపేటలోని ఓ ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసింది. ఏటీఎంలోని సీసీ కెమెరా ఫీడ్ ఆధారంగా అనుమానితురాలిని గుర్తించారు. -
హైస్కూల్ బాత్రూమ్ వద్ద సీసీ కెమెరా!
గొలుగొండ (నర్సీపట్నం): విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో బాత్రూమ్ల వద్ద కొంత మంది ఆకతాయిలు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కలకలంరేపింది. దీనిపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. బాత్రూమ్లకు పైకప్పు లేకపోవడంతో పైన ఉన్న చెట్టు కొమ్మకు ఆకతాయిలు సీసీ కెమెరాను అమర్చారు. చిన్న కర్ర సాయంతో సీసీ కెమెరా కనిపించకుండా చెట్టు కొమ్మలో ఆకులు చుట్టి బాత్రూమ్లపై దీన్ని ఏర్పాటు చేశారు. ఆకుల చాటు నుంచి రెడ్సిగ్నల్ రావడాన్ని గురువారం ఉదయం కొందరు విద్యార్థులు గమనించి మొదట బాంబు అని కేకలు వేశారు. ఉపాధ్యాయులు ఆ చెట్టు కొమ్మను పరిశీలించి సీసీ కెమెరాగా గుర్తించారు. అనంతరం దీనిపై కేడీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హరికృష్ట ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి అందులో మెమొరీ కార్డు లేదని, ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదని నిర్ధారించారు. కొయ్యూరు సీఐ ఉదయ్కుమార్ కూడా గురువారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షిస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. -
భద్రతకు భరోసా
నిఘా నీడలో కస్తూర్బాలు ► జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి ► జిల్లాలో 11 కస్తూర్బా విద్యాలయాలు ► త్వరలో హైదరా బాద్లోని కంట్రోల్రూంకు లింకు హుజూరాబాద్: కస్తూర్బా విద్యాలయాల్లో భద్రతతోపాటు విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. జిల్లాలోని ఎక్కువ సంఖ్యలో విద్యాలయాలు శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఆకతాయిల చేష్టలతోపాటు పాములు, పురుగుల భయం ఉండేది. దీనికి తోడు అధికా రుల అక్రమాలు సరేసరి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. జిల్లాలోని మొత్తం 11 కస్తూర్బాలు ఉండగా.. కొన్ని మండ ల కేంద్రాలకు సమీపంలో, మరికొ న్ని గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. విద్యార్థినుల భద్రతపై భరోసానిస్తూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసింది. హుజూరాబాద్: 11 కస్తూర్బా విద్యాలయాల్లో 1,760 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల బాలికలకు భద్రత మరింత పెంచేందుకు ప్రతీ పాఠశాలలో ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక కెమెరా డైనింగ్ సెక్షన్లో, ఒకటి స్టోర్రూం, మూడోది వరండాలో, మరోటి పాఠశాల ముందు బిగించారు. దీంతో పాఠశాలలోకి ఎవరు ప్రవేశించినా ముందు కెమెరాలో రికార్డు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. నాణ్యతాప్రమాణాల పెంపే లక్ష్యం.. సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతతోపాటు నాణ్యతాప్రమాణాలు కూడా పెరగనున్నాయి. ప్రధానంగా డైనింగ్ సెక్షన్లో ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు. పాఠశాల ఎదుట బిగించిన సీసీ కెమెరాతోనూ భద్రత పెరుగుతుంది. తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య.. కస్తూర్బాలో అన్ని వసతులు కల్పిస్తున్నా క్రమంగా విద్యార్థినుల సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలో కనీస వసతులు కరువవడంతో విద్యార్థినులు వెనుకడుగు వేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాప్రమాణాలను గాలికి వదిలేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్కు లింకు.. కస్తూర్బా పాఠశాలలో ఏ మూలన ఏం జరుగుతోందనే విషయాన్ని ప్రిన్సిపాల్ తన గది నుంచే చూసుకునే వీలుంది. ఇందుకు ప్రిన్సిపాల్ గదిలో మానిటర్ ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రతీ పాఠశాల నుంచి హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్కు అనుసంధానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలో ఏం జరుగుతోందనే విషయాన్ని రాజధానిలోని ఉన్నతాధికారులు క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. భద్రత ఉంటుంది.. మా పాఠశాల పట్టణానికి దూరంగా ఉండడంతో గతంలో భయంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత కల్పించినట్లుగా ఉంటుంది. బాలికలకు భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతీది రికార్డు అవుతుందనే ఆలోచనతో నేరం చేయడానికి కూడా భయపడతారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో సత్ఫలితం ఇచ్చింది. – సుప్రియ, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్, జమ్మికుంట -
ఆ నాలుగు గంటలే కీలకం
► సీసీ కెమెరాల పుటేజీ అధ్యయనం ► మూడు బృందాలుగా దర్యాప్తు.. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ ఎన్సిఎల్ కాలనీలో జరిగిన రూ. 11 లక్షల చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దొంగతనం జగినట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఆదివారం అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. ఏసీపీ అందె శ్రీనివాస్రావు, సీఐ రంగారెడ్డి, పాత నేరస్తులపై ఆరా తీశారు. సీసీఎస్, ఎస్ఓటీ, క్రైం పార్టీ పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఛీ ఛీ కెమెరాలు..
► సీసీ కెమెరాల పనితీరు అంతంత మాత్రమే ► తిరుమల భద్రతపై ఆందోళన ► హెచ్చరికలున్నా పట్టని టీటీడీ ► తాజా కిడ్నాప్తో సీసీ కెమెరాల తీరుపై అందరి దృష్టి ► కొండపై రూ.62 కోట్ల ప్రాజెక్టు ఏమైనట్టు? నిత్యం 70వేలకు పైగా భక్తులు సందర్శించే తిరుమలలో భద్రత కొరవడిందా.. నిఘా పర్యవేక్షణ లోపించిందా.. ఇక్కడున్న సీసీ కెమెరాల పని తీరు అంతంతమాత్రమేనా.. ఈ ప్రశ్నలకు తరచూ ఎదురవుతున్న సంఘటనలు ఔననే సమాధానం చెబుతున్నాయి. అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ పరిధిలో సాదాసీదా కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బుధవారం పసిబిడ్డ కిడ్నాప్ ఘటనతో వీటి డొల్ల్లతనం మరోసారి బయటపడింది. సాక్షి,తిరుమల: తిరుమలలో సీసీ కెమెరాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భద్రతలో కీలక భూమిక పోషించాల్సిన ఈ పరికరాలు మొక్కుబడిగా నిలుస్తున్నాయి. తిరుమలకు రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థల కన్ను దీనిపై ఉందని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈనేపథ్యంలోనే యువ కమాండోలతో కూడిన ఆక్టోపస్ యూనిట్ను నెలకొల్పారు. ఆర్మ్డ్ రిజర్వు బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్పీఎఫ్) సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. ఆలయం చుట్టూ ఇన్నర్సెక్యూరిటీ కార్డాన్ పూర్తి చేశారు. అటవీ మార్గాలను కలుపుతూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పనులు సర్వే దశలో ఉన్నాయి. ఈ చర్యలు బాగానే ఉన్నా భద్రత విషయంలో తరచూ ఆందోళన వ్యక్తమవుతోంది. కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితాలు మాత్రం కనిపించడంలేదు. ఆలయం, పురవీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, యాత్రిసదన్లలో ప్రస్తుతం 600 సీసీ కెమెరాలున్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇతర ప్రాంతాల్లో మరో 400 ఉన్నాయి. ఇవన్నీ ఆన్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ కెమెరా) సాంకేతిక పద్ధతుల్లో రూపొందించిన కెమెరాలే. ఇవి రికార్డు చేసే దృశ్యాలు విస్తరించాల్సి వస్తే స్పష్టత లోపిస్తోంది. వీటిపరిధి సామర్థ్యం తక్కు వ. 360 డిగ్రీల పరిధిలో ఉన్న దృశ్యాలను మాత్రమే రికార్డు చేయగలవు. రూ.62 కోట్లతో 1720 సీసీ కెమెరాల ప్రాజెక్టు ఏమైంది? రూ.62 కోట్లతో 1720 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2012లోనే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఫేసియల్ రికగ్నేషన్ సిస్టం, సస్పీషియస్ అల్లారింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నేషన్సిస్టం(ఏఎన్ఆర్పీ), సిట్యువేషన్ మేనేజ్మెంట్సిస్టంతో అనుసంధానమైన కెమెరాలు ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తిరుమల, తిరుపతిలోని అన్ని సీసీ కెమెరాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భద్రతను కట్టుదిట్టం చేయాలని సంకల్పించారు. అప్పటి ఈవో ఎల్వీ సుబ్రమణ్యం, సీవీఎస్వో జీవీజీ అశోక్కుమార్ ముంబయి, ఢిల్లీలో పర్యటించి ప్రాజెక్టును సిద్ధం చేశారు. తర్వాత ఎవరూ ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. అస్పష్టంగా చెన్నకేశవులు కిడ్నాప్ సీసీ కెమెరా దృశ్యాలు బుధవారం ఉదయం ఆలయం వద్దే ఓ జంట ఏడునెలల వయసున్న బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారు. కన్నవారి ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. సీసీ కెమెరా ఫుటేజీలో కిడ్నాప్ దృశ్యాలు గుర్తించారు. అయితే కిడ్నాప్ చేసిన జంట ఎవరు? అనేది ఆ దృశ్యాలు స్పష్టత ఇవ్వలేకపోయాయి. కిడ్నాపర్లు దర్జాగా చంటిబిడ్డను ఎత్తుకుని ఆలయం నుంచి కల్యాణకట్ట మీదుగా బస్టాండ్ వరకు నడుచుకుని వెళ్లి బస్సుద్వారా తిరుపతికి వెళ్లినట్లు తేలింది. ఈ క్రమంలో ఆలయం, రావిచెట్టు, బస్టాండ్ వద్ద మాత్రమే సీసీ కెమెరా దృశ్యాలు అస్పష్టంగా రికార్డయ్యాయి. నిందితులు ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోయారు. జనవరి 29వ తేదీన యాత్రిసదన్ 2లో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారి నవ్యశ్రీని అపహరించుకుని వెళ్లిన దృశ్యాలు కూడా ఇదే తరహాలోనే అస్పష్టంగా కనిపించాయి. అనుకోని ఘటన జరిగితే? నిందితులనెలా గుర్తిస్తారనేది భద్రతాధికారులకే తెలియాలి. -
‘యాప్’తో కాపలా..
- దొంగలకు పోలీసుల సాంకేతిక ముకుతాడు – లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్తో ఇళ్లకు భద్రత – యాప్ ఉన్న ఇంట్లోకి దొంగలు పడితే పోలీస్ స్టేషన్లో సైరన్ – సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్కు యాప్ అనుసంధానం – ఇళ్ల దొంగతనాల నివారణకు యాప్ను డౌన్లోడ్ చేసుకొండి – జిల్లా పోలీసు శాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం కర్నూలు: ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నారా... దొంగల భయంతో ఇంత కాలం హడలి పోయారా... ఏళ్లపాటు కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకు పోతారన్న భయంతో ఇబ్బంది పడ్డారా... ఇకపై అలాంటి భయమేమీ అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేటపుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడమే తరువాయి... మీరు తిరిగి ఇంటికొచ్చే వరకు ఎన్ని రోజులైనా భద్రత కల్పించే సరికొత్త కార్యక్రమానికి జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇళ్లకు భద్రత కల్పించి దొంగలకు ముకుతాడు వేసే కార్యక్రమం అమలులోకి తెస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను అమలు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు. తాళం వేసిన ఇళ్ల సమాచారం అందిన వెంటనే ఇళ్లపై యాప్తో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిఘా వేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. అనుమానితులు ఇంట్లోకి వెళితే యాప్ కెమెరా ఫొటో స్నాప్ షాట్స్, వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్కు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమెలా: ఆండ్రాయిడ్ ముబైల్లోని గూగుల్ ప్లేస్టోర్కు వెళ్లి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్తో ఇంటి అడ్రస్సుతో పాటు సెల్ నెంబరు పొందు పరిచి నివాసం ఉండే ఇంటి నుంచే రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ నెంబరుతో యూజర్ ఐడీ వస్తుంది. ఊళ్లకు కానీ, యాత్రలకు కానీ, సొంత పనులపై బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు యూజర్ ఐడీతో యాప్లోని పోలీసు రిక్వెస్ట్ వాచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన ఇళ్లపై పోలీసు రిక్వెస్ట్ వాచ్ ఉంటుంది. పలానా రోజు నుంచి పలానా రోజువరకు ఊళ్లకు వెళ్తున్నామని పోలీసులకు తెలియజేయాలి. వెళ్లే ముందు ఇంటి పరిధిలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే పోలీసులు సంబంధిత ఇంటికెళ్లి ఇంటి లోపల వైఫై కెమెరా మోడం అతికించి పెడతారు. అప్పటి నుంచి తిరిగి వచ్చే సమయం వరకు ఆ ఇళ్లు పోలీసు నిఘాలో ఉంటుంది. ఎవరైనా అనుమానితులు ఇంటిలోకి వెళితే తక్షణమే సంబంధిత స్టేషన్కు సమాచారం చేరుతుంది. బీట్ కానిస్టేబుల్ వెంటనే నిఘా ఉంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అమలుపై సంబంధిత టెక్నిషియన్లతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఎస్పీ ఆకె రవికృష్ణ ముఖ్య అతిధిగా హాజరై యాప్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు రమణమూర్తి, బాబూ ప్రసాద్, హరినాథరెడ్డి, సీఐ ములకన్న, ఈ–కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, ఎస్ఐలు, వివిధ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
నిఘా నీడలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ నిఘా నీడలో ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లు మూడు సీసీ కెమెరాలను శనివారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ వి.వినయ్చంద్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి చాంబర్ ముందు, కలెక్టరేట్లోని ఈ–సెక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఆర్ఓ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ సీసీ రూమ్ వరకు అక్కడ రాకపోకలు సాగించేవారి వివరాలు తెలుస్తూనే ఉంటాయి. కలెక్టర్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆయన తన చాంబర్లో ఉంటే ఆయనను కలిసేందుకు ఎవరు వస్తున్నారు, ఎంతమంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారనేది తెలుస్తుంది. అదేవిధంగా కలెక్టరేట్లోని ఈ–సెక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆ సెక్షన్లకు సంబంధించిన కారిడార్ మొత్తం రికార్డు అవుతూ ఉంటుంది. ఈ మూడు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటరింగ్ను జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో ఏర్పాటు చేశారు. డీఆర్ఓ తన చాంబర్లో కూర్చొని రోజువారీ తన విధులను నిర్వర్తించడంతోపాటు కలెక్టరేట్కు సంబంధించిన పర్యవేక్షణను సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ‘డబుల్’ రిజల్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా డబుల్ రిజల్ట్ రానుంది. ఇప్పటికే కలెక్టరేట్లో సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందికి సంబంధించి బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానాన్ని గమనిస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వారి పనితీరును కూడా గమనించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకల్లా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసిన సూపరింటెండెంట్లు, సిబ్బంది పనివేళల్లో మధ్యలో తమ కుర్చీల్లో లేకుండా కలెక్టరేట్ కారిడార్లో తిరుగుతుంటే ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డు కానున్నాయి. కార్యాలయ పనివేళల్లో అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్ చేయకుండా కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు దోహదపడనున్నాయి. ఇదిలా ఉంటే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలెక్టరేట్కు వచ్చే సందర్శకుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్ పరిపాలనా యంత్రాంగం తెలుసుకునే వీలు కలగనుంది. కలెక్టరేట్లోని ఉన్నతాధికారుల చాంబర్లకు ఎవరు ఎక్కువగా వస్తున్నారనే వివరాలను కూడా రికార్డు కానున్నాయి. కలెక్టరేట్లోని ఏ నుంచి హెచ్ వరకు ఉన్న సెక్షన్లల్లోకి ఇతరులు ఎవరూ వెళ్లకుండా ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. సెక్షన్లలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకుగాను ఎంట్రన్స్లో ప్రత్యేకించి ఒక అటెండర్ను కూడా ఏర్పాటు చేశారు. -
పక్కాగా లెక్క..!
►నార్త్జోన్లో ‘సెక్యూరిటీ ఆడిట్’ ►సీసీ కెమెరాలపై డీసీపీ ప్రత్యేక దృష్టి ►ప్రభుత్వ, కమ్యూనిటీతో పాటు ప్రైవేట్వీ లెక్కింపు ►జియో ట్యాగింగ్ ద్వారా ప్రదేశాల గుర్తింపు కెమెరాలు లేని చోట్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన సిటీబ్యూరో: ఉత్తరమండల పోలీసులు సెక్యూరిటీ ఆడిట్కు శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఠాణాల వారీగా ఈ ఆడిట్ నిర్వహిస్తున్నారు. సెక్టార్ల వారీగా ఉన్న ప్రైవేట్ సీసీ కెమెరాలను గుర్తిస్తూ... వాటిని జియో ట్యాగింగ్ చేయిస్తున్నారు. గత వారం రోజుల ఆడిట్ నేపథ్యంలో ఈ మండలంలో 15,563 ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ సుమతి ‘సాక్షి’కి తెలిపారు. కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రైవేట్ వాటినీ.. సిటీలో కేవలం ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలే కాకుండా వ్యక్తిగత (ప్రైవేట్) సీసీ కెమెరాలు సైతం ఉన్నాయి. పలువురు తమ ఇళ్లు, దుకాణాలు, అపార్ట్మెంట్స్లో వీటిని ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి వాటిని నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి వినియోగించుకోచ్చని నార్త్జోన్ పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న ప్రైవేట్ కెమెరాలను గుర్తించేందుకు డీసీపీ ఆడిట్ కు శ్రీకారం చుట్టారు. దీంతో ఠాణాల్లోని ఎస్సైలు నేతృత్వం వహించే సెక్టార్ల వారీగా గత నెల 23 నుంచి గణన ప్రారంభించారు. ప్రతి సెక్టార్ను ఐదు జోన్లుగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా వీటిని లెక్కిస్తున్నారు. బుధవారం వరకు జరిగిన లెక్కింపులో 15,563 ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అవసరమైన ప్రాంతాల గుర్తింపు... ఆడిట్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిబ్బంది సీసీ కెమెరాలు లేని ఇళ్లనూ గుర్తిస్తున్నారు. రెండు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఫ్లోర్లతో పాటు కీలక, సున్నిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాల అవసరాన్ని గుర్తించి నివేదికలు రూపొందిస్తున్నారు. వారం రోజుల అధ్యయనంలో నార్త్జోన్లోని 12 ఠాణాల పరిధిలో 8539 నివాస సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు వీటి ఏర్పాటు ప్రాధాన్యాలను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని వీడియోలను రూపొందించారు. మ్యాప్ మీదకు‘ప్రైవేట్ కెమెరాలు’... సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్ ద్వారా మ్యాప్ పైకి తీసుకువచ్చేందుకు నార్త్జోన్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని ప్రైవేట్ కెమెరాలు ఉన్నాయనేది మ్యాప్లో చూపించేలా రూపొందించనున్నారు. ముమ్మరంగా అవగాహన ‘ప్రైవేట్ సీసీ కెమెరాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాం. అవి లేని చోట్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం. ఓ నివాసం వద్ద ఏర్పాటు చేసుకునే కెమెరాల్లో ఒకటి ఐపీ, నైట్విజన్ టెక్నాలజీలు ఉన్నవి ఏర్పాటు చేయించాలని భావిస్తున్నాం. వీటిలో రికార్డు అయ్యే ఫీడ్ను కనీసం నెల రోజుల భద్రపరిచేలా అవగాహన కల్పించనున్నాం‘ అని పేర్కొన్నారు. –డీసీపీ సుమతి -
నిఘా నీడలో ఈరన్న క్షేత్రం
- ఉరుకుంద భక్తులకు కట్టుదిట్టమైన భద్రత - రూ.4.80 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాల ఏర్పాటు - 37 సీసీ కెమెరాలు.. 42 ఇంచుల మానిటర్ అమరిక మంత్రాలయం: ఎట్టకేలకు ఈరన్న క్షేత్రం అధికారులు మేలుకొన్నారు. భద్రత రీత్యా నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రంలో ఒక్కరి ప్రతి కదలికపై నిఘా పెంచారు. అందుకోసం రూ.4.80 లక్షలుపైగా వెచ్చించారు. భక్తుల దోపిడీ మొదలు ప్రమాదకర శక్తులను పనిపట్టేందుకు నిఘానేత్రాలు తప్పనిసరి. ఏటా శ్రావణమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసంలోని ప్రత్యేక రోజులు సోమవారం, గురువారాల్లో భక్తులు లక్షలాదిగా స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉగాది, గద్వాల పూర్ణిమ, అమావాస్య, సోమవారాల్లోనూ భక్తుల రద్దీ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా స్వామి భక్తులు ఉన్నారు. ఏటేటా ఈరన్నస్వామి భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. క్షేత్రం భద్రత రీత్యా అధికారులు నిఘాపై దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఆలయంలో 12 సీసీ కెమెరాలతో నిఘాను నెట్టుకొచ్చారు. కౌతాళం ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి సూచన మేరకు ఈవో మల్లికార్జున ప్రసాద్ నిఘా పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రూ.4.80 లక్షలు వెచ్చించి సీపీప్లస్ కంపెనీకి చెందిన 37 డిజిటల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గర్భాలయంలో 5, ధ్వజస్తంభ క్యూలైన్తో 02, క్యూలైన్ ఎదురుగా 02, టిక్కెట్ కౌంటర్ 02, క్యూలైన్ షెడ్లో 02, అన్నదాన సత్రంలో 04, ఆలయ కార్యాలయం ఎదుట 01, క్యూలైన్ ఎగ్జిట్లో 02, ఆదోని, మంత్రాలయం, ఉరకుంద గ్రామ ము«ఖద్వారాలతో 03, షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో 01, మిగతా కెమెరాలు ఆలయ ప్రాకారాలు, ఓపెన్ ప్రదేశాల్లో అమర్చారు. ఆఫీస్లో 40 ఇంచుల మానిటర్ టీవీ (నిల్వ సామర్థ్యం 12,000 జీబీ)లో కెమెరాల దృశ్యాలను అనుసంధానం చేస్తారు. కెమెరాల ప్రత్యేకత : సాధారణ కెమెరాల కంటే మెరుగైన టెక్నాలజీ డిజిటలైన్ కెమెరాలు ఇవీ. అల్యూమినియం మెటల్తో తయ్యారు చేయబడినవి. నీళ్లలో తడిచినా పనిచేయగలవు. చీకటిలోనూ చాలా క్లారిటీగా వీడియో దృశ్యాలు చిత్రీకరిస్తాయి. సాధారణ కెమెరాలు కేవలం 20 మీటర్లు దూరం వరకు మాత్రమే దృశ్యాలను కాస్త క్లారిటీగా తీయగలవు. ఇవీ మాత్రం 60 మీటర్ల మేర క్లారిటీతో వీడియో దృశ్యాలు చిత్రీకరించగలవు. అక్కడెందుకు మినహాయించారో : క్షేత్రం దర్శించిన భక్తులు దాదాపుగా తలనీలాలు సమర్పిస్తారు. కల్యాణకట్టతో భక్తులు ఏటా దోపిడీకి గురవుతున్నారు. టిక్కెట్ కాదని, గుండుకో రేటు పెట్టుకుని నిలువు దోపిడీ సాగిస్తున్నారు. అందులో అధికారులు మొదలు వాటాలు ఉన్నవే. హుండీ ఆదాయం పక్కతోవ పడుతోందని ఎన్నోసార్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. హుండీ లెక్కింపు భవనంలో పాత కెమెరాలకు పరిమితం చేశారు. భక్తులు నిలువుదోపిడీ గురవుతున్న కల్యాణకట్ట, హుండీ ఆదాయం అడ్డదారిలో పోతోందన్న ఆరోపణలు ఉన్న లెక్కింపు భవనాలను ఎందుకు విస్మరించారో తెలియని వైనం. ఏదీ ఏమైనా క్షేత్రం భద్రతకై అధికారులు చర్యలు తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతే ముఖ్యం : సుబ్రమణ్యంరెడ్డి, ఎస్ఐ, కౌతాళం భక్తుల భద్రత కోసమే క్షేత్రంలో నిఘాను పెంచాం. కల్యాణకట్టలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. శ్రావణ మాసంలో స్నానపు ఘాట్లతో భక్తులు సొమ్ము దోపిడీకి గురికాకుండా ఇప్పటికే సీసీ కెమెరాలు నిల్వ ఉంచుకున్నాం. ముఖ్యంగా భక్తుల సొమ్ము దారి మళ్లకుండా చూస్తాం. భక్తుల సొమ్ము భక్తుల సౌకర్యాలు కేటాయించాలన్నదే మా ఉద్దేశం. ఇటీవల హుండీ కౌంటింగ్ సమయంలో స్వతహాగా ఖర్చుపెట్టుకుని వీడియో గ్రాఫర్ను ఏర్పాటు చేయించాం. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎండోమెంట్ అధికారులకు లేఖలు రాశాం. మహిళా భక్తులకు బాత్రూమ్లు, భక్తులు బసచేసేందుకు డార్మిటరీలు కావాలని కోరాం. వేసవి దృష్ట్యా భక్తులకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించాం. -
మానుకోటలో మావోల సంచారం
► రామచంద్రాపురం ఉపాధి పనులపై ఆరా ►తిమ్మాపురం అడవుల్లో కదలికలు ►సీసీ కెమెరాల్లో సాయుధ వ్యక్తులు ►ఆరాతీస్తున్న నిఘా వర్గాలు వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండేవి. భద్రాచలానికి సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు రోజూ జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్ల దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. దాడుల పరంపర కొనసాగుతుండడంతో మావోయిస్టులు మన రాష్ట్రంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గూడూరు–బయ్యారం సరిహద్దు తిమ్మాపురం అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డుల్లో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు సంచరించినట్లు రికార్డు అయినట్టు తెలిసింది. మావోయిస్టుల సంచారంపై ప్రాథమిక సమాచారం అందడంతో మన రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. గూడురు–బయ్యారం ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయా అనే కోణంలో నిఘా పెంచారు. ఇటీవల జరిగిన సంఘటనలు ఇవీ.. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్త ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది. ఇల్లందు ఎమ్మెల్యేకు కొన్ని రోజుల క్రితం బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. అంతకుముందు మావోయిస్టుల పేరిట వాల్పోస్టర్ వెలిసింది. గత నెలలో గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్డబ్ల్యూస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రవికుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. అలాగే బయ్యారం మండలంలో ఉపాధి హామీ విభాగం ఫీల్డ్ అసిస్టెంట్ను పిలిపించి... పనులు జరుగుతున్న తీరుపై మావోస్టులు వివరాలు అడినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఆయుధాలు కలిగి ఉన్న ఆరుగురు వచ్చారని, ఒకరు తెలుగులో మాట్లాడారని తెలిసింది. వరుస సంఘటనల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
సీసీ కెమెరాల నిఘాలో రైల్వే స్టేషన్లు
అన్ని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు.. ఒక్క సికింద్రాబాద్లోనే వంద కెమెరాలు సాక్షి, హైదరాబాద్: రైల్వే స్టేషన్లను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి తేవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖను ఆదేశించటంతో యుద్ధప్రాతిపదికన అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 980 స్టేషన్లను ఎంపిక చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత 50 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రధాన స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నాయి. మిగతా చోట్ల లేవు. దీంతో నేరాలు జరిగినప్పుడు దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. రైల్వే స్టేషన్లలో మహిళలపై వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. ఇటీవల తమిళనాడులో రైల్వే ఫ్లాట్ఫాంపైనే ఓ యువతి హత్యకు గురైంది. ఉగ్రవాదులు కూడా రైళ్లలో ప్రయాణించడం సురక్షితంగా భావిస్తున్నారు. దోపిడీ దొంగల ఆగడాలకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ఆగంతకులకు అడ్డాలుగా ఉండరాదన్న ఉద్దేశంతో వాటిని సీసీ కెమెరాల నిఘాలోకి తెచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. వీటి ఏర్పాటుకు ‘నిర్భయ నిధి’ నుంచి డబ్బులు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో రూ. 500 కోట్లతో వీటిని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 ప్రధాన పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో తొలి విడతలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ప్లాట్ఫామ్లు, వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్, లోనికి వచ్చే అన్ని మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ స్టేషన్లో కొత్తగా వంద కెమెరాలు దేశంలోనే పరిశుభ్రమైన రెండో స్టేషన్గా తాజాగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ స్టేషన్ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్లనుంది. ప్రస్తుతం స్టేషన్లోని వివిధ ప్రాంతాల్లో 86 సీసీ కెమెరాలున్నాయి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ స్టేషన్ మరింత భద్రంగా ఉండాలంటే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల రైల్వే బోర్డుకు ప్రతిపాదన కూడా పంపారు. దీంతో ఈ ఒక్క స్టేషన్ పరిసరాల్లోనే కొత్తగా వంద కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తారు. లోనికి వచ్చే మార్గాలు సహా అన్ని విభాగాల్లో వాటిని ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాలు రికార్డు చేసే దృశ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. అందులో టీవీలపై దృశ్యాలను నిరంతరం రైల్వే పోలీసులు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా అనుమానితులపై దృష్టి సారిస్తారు. సికింద్రాబాద్కు పరిశుభ్ర స్టేషన్గా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులోనూ స్వచ్ఛంగా ఉంచేందుకు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పనితీరును ఈ కెమెరాల ద్వారా పరిశీలిస్తారు. ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా వీటి పరిధిలోకి తెస్తారు. -
ఆర్టీసీ బస్సులో చోరీ
అవుకు: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలి నుంచి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు బంగారు చైన్, నగదు అపహరించారు. కొలిమిగుండ్లకు చెందిన పోరెడ్డి చిన్నపురెడ్డి భార్య రామలక్ష్మమ్మ హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 బనగానపల్లెకు చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు తాడిపత్రి బస్సు ఎక్కింది. ఆమెతో పాటు ఇద్దరు గుర్తు తెలియని మహిళలు బస్సు ఎక్కి ఆమె పక్కనే కూర్చున్నారు. ప్రయాణ అలసటతో రామలక్ష్మమ్మ నిద్రపోగా బ్యాగ్ను కత్తిరించి అందులోని 7 తులాల బంగారు చైన్, రూ. 10 వేల నగదుతో తీసుకుని అవుకులో దిగిపోయారు. కొద్ది సేపటికి తేరుకున్న మహిళ కత్తిరించిన బ్యాగ్ చూసుకుని చోరీ జరిగినట్లు గుర్తించి అవుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి వెంటనే మహిళా దొంగల కోసం విచారణ చేపట్టారు. బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్లో వారు బస్సు ఎక్కినట్లు, తిరిగి ఉదయం 11.30 గంటల సమయంలో అవుకు నుంచి బనగానపల్లెకు చేరుకున్నట్లు పట్టణంలో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిఘా నీడలో కొడనాడు
► ప్రత్యేక చెక్ పోస్టులు ► సీసీ కెమెరాలు ► భద్రత కట్టుదిట్టం సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ను నిఘా వలయంలోకి తీసుకొచ్చేందుకు నీలగిరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రత్యేక చెక్ పోస్టులు ఆ మార్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. 20 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉన్న నీలగిరి జిల్లా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ కోతగిరి సమీపంలోని కొడనాడు ఎస్టేట్ తేయాకు తోటల నడుమ సుందరంగా రూపుదిద్దుకుని ఉంది. 1,600 ఎకరాల విస్తీర్ణంలో పన్నెండుకు పైగా మార్గాలతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఈ పరిసరాలు కనిపిస్తుంటాయి. తేయాకు తోటల మధ్య ఓ పాత బంగ్లా, మరో కొత్త బంగ్లా, సమీపంలో హెలిప్యాడ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 55 వేల చదరపు అడుగులతో నిర్మితమైన కొత్త బంగ్లా అమ్మ జయలలితకు ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. అమ్మ బతికి ఉన్నంత కాలం ఈ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నాయి. 80 వరకు నిఘా నేత్రాలు అప్పట్లో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు సంకేతాలున్నాయి. అయితే, ఇప్పుడు అక్కడ అవేమీ లేవు. అమ్మ లేని దృష్ట్యా, భద్రతను వెనక్కు తీసుకుని ప్రైవేటు సేనలను రంగంలోకి దించారు. ఇదే అదనుగా గత నెల ఈ ఎస్టేట్లో సెక్యూరిటీ గార్డు ఓం బహూదూర్ హత్య, దోపిడీ, నిందితుడి అనుమానస్పద మృతి, ప్రమాదాలు...ఇలా ఒకదాని తర్వాత మరో ఘటన వెలుగు చూస్తుండడంతో కొడనాడులో ఏదో మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం ఊపందుకుంది. బుధవారం అయితే, ఇక్కడ ఐటీ దాడులు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఖండించారు. అయితే, ఆ బంగ్లాలోకి వాహనాల్లో వచ్చి వెళ్లిన వాళ్లు ఎవరో అన్న ప్రశ్న బయలు దేరింది. అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు మానవ రహిత(డ్రోన్) విమానాల్లో పొందుపరిచిన కెమెరాల ద్వారా ఎస్టేట్ను అనుక్షణం పరిశీలిస్తున్నట్టు వెలుగులోకి రావడంతో నీలగిరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరుస ఘటనలు, రోజుకో ఆరోపణలు, తేయాకు రోజుకు వెయ్యి కిలోల మేరకు మాయం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి నిర్ణయించారు. నీలగిరి ఎస్పీ మురళీ రంభ ఆదేశాల మేరకు భద్రతావలయంలోకి కొడనాడును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మార్గాల్లో శుక్రవారం నుంచి తాత్కాలిక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలాగే, 20 చోట్ల నిఘా కెమెరాల్ని అమర్చి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆ కొడనాడు వైపుగా ఏ వాహనం వచ్చినా పూర్తి వివరాలు సేకరించడం, అటు వైపుగా ఇతర వాహనాల పయనం సాగినా, వాటి నంబర్ల నమోదు, అందులో ఉన్న వారి వివరాలు, ఇలా ముందు జాగ్రత్తగా అన్ని భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. -
గీత దాటారో.. లైసెన్స్ గోవిందా!
-
గీత దాటారో.. లైసెన్స్ గోవిందా!
ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాయింట్ల విధానంతో చెక్ రెండేళ్లలో 12 పాయింట్లు వస్తే లైసెన్స్ రద్దు.. ఉత్తర్వు జారీ సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రయ్.. రయ్.. అంటూ దూసుకుపోయారో జాగ్రత్త! ఇప్పటివరకు పెనాల్టీలతో సరిపుచ్చిన అధికారులు ఇక ఏకంగా లైసెన్సునే రద్దు చేయబోతున్నారు. ఇందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. పెనాల్టీలతోపాటు ఆ నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వాటి సంఖ్య 12కు చేరితే లైసెన్సు రద్దవుతుంది. అదే లెర్నింగ్ లెసెన్సు ఉన్నవారికి ఆ పాయింట్ల సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. అంతకుమించితే వారి తాత్కాలిక లైసెన్సు కూడా రద్దవుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. చలానా కట్టేస్తే సరిపోతుందనే ధీమాతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారికి ఇక ఈ కొత్త విధానంతో ముకుతాడు పడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో భారీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారుల విషయంలో ఇక కఠినంగా ఉండబోతున్నారు. అమెరికా, బ్రిటన్లాంటి దేశాల్లో ఈ విధానం చక్కటి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమల్లోకి తేవాలని గతంలోనే నిర్ణయించి కసరత్తు చేసింది. రోడ్డు భద్రత చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని అటు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.వేలల్లో పెనాల్టీలు, లైసెన్సు రద్దు, వాహనాల జప్తు లాంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇది అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ల విధానానికి శ్రీకారం చుడుతోంది. సీసీ కెమెరాలే ఆయుధం ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్లలోని సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుల ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలు పంపుతున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కూడళ్లలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి చిక్కటం ఖాయం. దాని ఆధారంగా ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటాబేస్ ఎప్పటికప్పుడు లెక్క కడుతూ ఉంటుంది. రెండేళ్ల (24 నెలలు) సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్సు రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతుంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్లపాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్లపాటు లైసెన్సును రద్దు చేస్తారు. పాయింట్లు ఇలా తగ్గించుకోవచ్చు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో వాహనా ల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశా లపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటివరకు వాహనదారుడి ఖాతాలో నమోదైన పాయింట్ల నుంచి మూడు పాయింట్లను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఉల్లంఘన పాయింట్లు ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే 1 సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2 హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపితే 1 రాంగ్ రూట్లో వాహనం నడిపితే.. 2 నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2 నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3 ప్రమాదకరంగా వాహనం నడపడం/సెల్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్ 2 మద్యం తాగి బైక్ నడిపితే, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే.. 3 మద్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4 మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగినడిపితే 5 ఇబ్బంది కలిగేలా నడిపితే/శబ్ద, వాయు కాలుష్యానికి కారణమైనా/అనుమతిలేని చోట పార్క్ చేసినా.. 2 బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2 అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2 ర్యాష్ డ్రైవింగ్/ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపరిచేలా నడిపితే 2 నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే.. 5 వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీ.. తదితర నేరాలకు పాల్పడితే 5 -
వెయ్యి కళ్ల నిఘా
► గుంటూరు నగరంలో 1000 సీసీ కెమెరాలు ► సిటీ సెక్యూరిటీ యాక్టు అమలుకు పోలీసుల కసరత్తు ► ప్రతి వాణిజ్య సముదాయానికీ కెమెరాలు తప్పనిసరి ► సహకరించని నగరపాలక సంస్థ గుంటూరు నగరం పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లనుంది. సిటీ సెక్యూరిటీ యాక్టును అమలు చేసేందుకు అధికారులుసిద్ధమయ్యారు. దీనిలో భాగంగా నగరంలోని వాణిజ్య సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే వ్యాపారులకు పోలీసులు అవగాహన కల్పించారు. సాక్షి, గుంటూరు : గుంటూరు అర్బన్ జిల్లాలో సిటీ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేయడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో భద్రతను పెంపొందించి, నేరాలు, దొంగతనాల నివారణకు దోహదపడే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీని అమలు ద్వారా నగరంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాతల సహకారంతో అర్బన్ జిల్లా పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఏర్పాటు చేశారు. భద్రత పరంగా.. గుంటూరు నగరం రాజధాని నగరం కావడంతో గణనీయంగా పాధాన్యం పెరుగుతోంది. నగరంలో రోజూ సగటున 30 నుంచి 50 మంది వీఐపీల రాకపోకలు కొనసాగుతున్నాయి. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సగటును 2.25 లక్షల మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు నిత్యం జనసంద్రంతో కిటకిటలాడుతుంటాయి. జిల్లాలో సుమారు 12 రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఏర్పాటవడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కూడా వివిధ పనుల నిమిత్తం నగరానికి వస్తున్నారు. దీంతో నగరంలోని రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. ఈ పరిణామాల క్రమంలో అటు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి, ఇటు భద్రతపరంగా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు (సీసీ కెమెరాలు) కొంత మేరకు ఉపయోగపడతాయి. పట్టించుకోని నగర పాలక సంస్థ అర్బన్ జిల్లా పోలీసులు నగరంలో ఇప్పటి వరకూ 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో 40 వరకూ ఏర్పాటు చేయగా మిగతా 60 సీసీ కెమెరాలను పోలీసుశాఖ కేటాయించింది. నగరపాలక సంస్థే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ సంస్థ అధికారుల నుంచి పూర్తిస్థాయి సహకారం రాకపోవడంతో పోలీసులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గతేడాది కృష్ణా పుష్కారాల సమయంలో అర్బన్ జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద సుమారు రెండు వందల సీసీ కెమెరాలు, ఆరు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పుష్కరాలు అయ్యాక వాటిలో 60 కెమెరాలను నగరానికి కేటాయించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి గతంలో డీజీపీకి వినవించారు. దీంతో కెమెరాలు కేటాయించారు. ఈ క్రమంలో కెమెరాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, జిన్నా టవర్, మార్కెట్ సెంటర్, శంకర్విలాస్ సెంటర్, లాడ్డి సెంటర్తో పాటు మరో నాలుగు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ యాక్ట్ ద్వారా.. సిటీ సెక్యూరిటీ చట్టం ద్వారా నగరంలోని ప్రతి వాణిజ్య సముదాయం, లైసెన్స్ ఉన్న ప్రతి వ్యాపారీ ఆయా వాణిజ్య సముదాయాల బయట కూడా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే విజయవాడ కమిషనరేట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తుండటంతో సుమారు 1300 వరకూ సీసీ కెమెరాలు విజయవాడలో ఏర్పాటయ్యాయి. దానిని గుంటూరులో కూడా అమలు చేస్తే బాగుంటుందని అధికారులు కసరత్తు చేస్తున్నారు. లైవ్ స్ట్రీమ్ కెమెరాలయితే మరింత మేలు.. ప్రస్తుతం నగరంలో ఉన్న కెమెరాల ద్వారా రికార్డు మాత్రమే అవుతుంటాయి. రికార్డు అయ్యాకే వాటిని చూసే వీలుంటుంది. పుటేజ్ అంతా కంట్రోల్ రూంతో పాటు సంబంధిత పోలీసుస్టేషన్లో కూడా అందుబాటులో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్లో ఉన్న కెమెరాలు ఉంటే నేరం జరిగిన గంటల వ్యవధిలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు ఒక ఏఎస్సీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించారు. ప్రస్తుతం సౌత్ డీఎస్పీ శ్రీనివాసరావు వీటిని పర్యవేక్షిస్తున్నారు. గతంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్ నిర్వహించి సీసీ కెమెరాలు వాడటం వలన కలిగే ప్రయోనాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ యాక్ట్ను పకడ్బందీగా అమలుచేసి నగరంలో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
వాహనచోదకులరా తస్మత్ జాగ్రత్త
-రాంగ్రూట్లో వెళ్లినా..సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఈ చలానా జరిమాన - త్వరలో కర్నూలులో అమలు – సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు : నిబంధనలకు విరుద్ధంగా రాంగ్రూట్లో వెళ్లే వాహన చోదకులకు ఈ చలానా జరిమానతో చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు కార్యచరణ రూపొందించారు. త్వరలో ఈ చలాన ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నగరంలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్ పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమును ఆయన పరిశీలించారు. నగరంలోని రద్దీస్థలాలు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్ను కంట్రోల్ రూము నుంచి పరిశీలించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, పరిమితికి మించి వాహనాల్లో వెళ్లడం వంటి వాటిని సీసీ కెమెరాల నుంచి ఫొటో క్యాప్షర్ చేసి, ఈచలానా ఫాం వాహనదారుని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ఈచలానా జరిమాన రూ.300 నుంచి రూ.1000 వరకు ఉంటుందన్నారు. దూర ప్రాంతాల వారికి పోస్టల్లో ఈ చలానా వెళ్తుందన్నారు. శివారు కాలనీల్లో కూడా ప్రజాభద్రతా చట్టం ప్రకారం సీసీ కెమెరాల వినియోగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీ నుంచి పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాల పనిలోపం ఎక్కడైనా ఉంటే మున్సిపల్ అధికారులు బృహస్పతి టెక్నాలజీ వారితో చర్చించి సరిచేయాలన్నారు. నేరాల అదుపునకు, దర్యాప్తునకు సీసీ టీవీల పుటేజీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్రెడ్డి, కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజుయాదవ్, శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో నేరాలకు చెక్
- వేలిముద్ర ఆధారంగా నేరస్తుల గుర్తింపు - పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు - రానున్న రోజుల్లో స్మార్ట్ పోలిసింగ్ - రాయల సీమ ఐజీ శ్రీధర్రావు ఆదోని టౌన్: సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని రాయలసీమ రేంజ్ ఐజీ ఎన్. శ్రీధర్రావు తెలిపారు. ఆదోని పట్టణంలోని పోలీస్ కంట్రోల్రూం, వ¯న్Œ టౌన్ పోలీస్ స్టేషన్లను బుధవారం.. ఎస్పీ ఆకే రవికృష్ణతోపాటు ఆయన తనిఖీ చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల పనితీరును డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ. ఆదోని పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు.. సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రాయలసీమపరిధిలోని తిరుపతిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫలితాన్నిస్తున్నాయన్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అధునాతన టెక్నాలజీతో థంబ్ (వేలిముద్ర) ఆధారంగా నేరస్తులను గుర్తించడం సులభం అవుతోందన్నారు. పోలీసు శాఖలో చాలా మార్పులు వచ్చాయని, సైబర్ నేరాలు, అసాంఘిక శక్తుల ఆట కట్టించడంతో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. పోలీసు శాఖలో 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొబైల్ టెక్నాలజీతోనూ కేసులను ఛేదించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో స్మార్ట్ పోలిసింగ్ వ్యవస్థ వస్తుందన్నారు. ఆన్లైన్ మోసాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కంట్రోల్ రూం పోలీసులకు ప్రోత్సాహకాలు ట్రాఫిక్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్న ఐదుగురు పోలీసులకు ఐజీ శ్రీధర్రావు, ఎస్పీ ఆకె రవికృష్ణలు.. ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఆదోని షరాఫ్ బజార్, బంగారం, వెండి వ్యాపారుల అసోసియేషన్ నిర్వాహకులు ఐజీ, ఎస్పీలను సన్మానించారు. డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐలు ఘంటా సుబ్బారావు, చంద్రశేఖర్, దైవప్రసాద్, శంకరయ్య, గౌస్, ఎస్ఐలు ఈశ్వరయ్య, నల్లప్ప, సునిల్ కుమార్, బాబు, విజయ్, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అణువణువూ అనుసంధానం
⇔ ప్రగతి భవన్కు గ్రేటర్లోని సీసీ కెమెరాలన్నీ లింక్ ⇔కీలక సమయాల్లో సీఎం స్వయంగా పర్యవేక్షించేందుకే ⇔హనుమాన్ జయంతి యాత్రతో మొదలైన లింకేజీ సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతి కీలక ప్రాంతాన్ని ఇకపై ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ నుంచి వీక్షించవచ్చు. నగర వ్యాప్తంగా ఏర్పాటైన ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలను అనుసంధానించడంతో ఇది సాధ్యమవుతోంది. హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో మంగళవారం ఈ లింకేజ్ పనిచేయడం ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయంతోనూ వీటిని లింక్ చేశారు. కీలక సమయాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేప్పుడు ముఖ్యమంత్రితో పాటు డీజీపీ సైతం పరిస్థితుల్ని పర్యవేక్షించడం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు అధికారులు చెప్పారు. పది వేలకు పైగా కెమెరాల అనుసంధానం... ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న సిటీ పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ నిఘా, ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు అపార్ట్మెంట్ వాసుల్నీ కలుపుకుంటూ వెళ్తున్న పోలీసులు వారితో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికే నగరంలో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బషీర్బాగ్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లోనూ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయించారు. వీటి నుంచి సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, లీకేజీలు తదితరాల పర్యవేక్షణకూ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీనికోసం ఆయా విభాగాలకూ భాగస్వామ్యం కల్పించారు. ఇకపై వీటన్నింటినీ అవసరమనుకున్నప్పుడు సీఎం ప్రగతిభవన్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. వివిధ ఉత్సవాల సందర్భంగా నగరంలో జరిగే భారీ ర్యాలీల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. నిత్యం వీటికి సంబంధించిన సమాచారం సీఎం, డీజీపీ తదితర కార్యాలయాలకు చేరుతుంటుంది. హనుమాన్ ర్యాలీ పర్యవేక్షణ... మంగళవారం జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి సీసీసీ నుంచి, డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్లో సీఎం, ఇతర అధికారులు సైతం దీన్ని వీక్షించినట్లు తెలిసింది. దీనికోసం ప్రగతిభవన్లో ప్రత్యేకంగా భారీ వీడియో వాల్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. -
ఇదిగో పులి...
⇒ బ్రాహ్మన్పల్లి అటవీ ప్రాంతంలో సంచారం ⇒ శుక్రవారం సీసీ కెమెరాకు చిక్కిన వైనం ⇒ భయాందోళనలో రెండు మండలాల ప్రజలు ⇒ అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చెన్నూర్/కోటపల్లి: మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్న విషయం తేటతెల్లమైంది. పదిహేను రోజుల క్రితమే అటవీ అధికారులు వేమనపల్లి మండలంలో పులి సంచరిస్తుందన్న విషయాన్ని ధ్రువీకరిం చారు. తాజాగా శుక్రవారం వేమనపల్లి మండలం నీల్వాయి, కోటపల్లి మండలం బ్రాహ్మన్పల్లి అటవీ ప్రాంతంలో పులి కుర్మ శ్రీనివాస్కు చెందిన ఆవును హతమార్చింది. ఆ ప్రాంతంలో లభించిన ఆధారాలను సేకరించిన ఫారెస్ట్ అధికారులు పులే ఆవును హతమార్చిందని నిర్ధారించారు. దీంతో రెండు మండలాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మన్పల్లి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో శనివారం పులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నెలల తర్వాత. పంగిడి సోమారం గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్ అనే రైతుకు చెందిన ఆవును గతేడాది నవంబర్ 8న అటవీ ప్రాంతంలో పులి హతమార్చింది. ఈ విషయంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవు ఇంటికి రాక పోవడంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. 2016 నవంబర్ 15న ఆవు కళేబరం లభించింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలుపడంతో అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆవును పులి హతమార్చిన అనవాళ్లు లభించడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలో పులి చిక్కింది. ఒంటరిగా వెళ్లొద్దు.. కోటపల్లి అడవుల్లో పులి సంచరిస్తోందని అటవీ ప్రాంతా నికి ఒంటరిగా వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మళ్లీ అదే రీతిన పులి ఆవును హతమార్చింది. గతంలో ఆవును హతమార్చిన పులి వారం వ్యవధిలోనే కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతి చెందిం ది. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా పులి సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. అంతా గోప్యం.. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్నది సీసీ కెమెరాలో చిక్కినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పులి సంచరిస్తుందన్న విష యం బయటికి పొక్కితే వేటగాళ్లు మళ్లీ పులిని వేటాడే అవకాశాలుండడంతో అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎట్టకేలకు శనివారం నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బ్రాహ్మన్పల్లి అటవీ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాకు పులి చిక్కిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అప్రమత్తమైన అధికారులు.. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు పక్షం రోజులుగా చెన్నూర్, కోటపల్లి, నీ ల్వా యి ఫారెస్ట్ రేంజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు మండలా ల్లో పులి ఎక్కడైనా సంచరించే అవకాశం ఉండడంతో మూడు రేంజ్ల సి బ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బంది తాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల వేటగాళ్లున్న గ్రామాలను సందర్శించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణులను హతమారిస్తే కఠిన చర్యలుంటా యని హెచ్చరికలు జారీ చేస్తూనే.. వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం పులి సంచరిస్తున్న విషయం వాస్తవమే. పులి ఈ ప్రాంతంలో ఉం డేందుకు అన్ని సౌకర్యాలున్నాయి. సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతం నుంచి ఇటు వచ్చింది. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్ల అధికారులను అప్రమత్తం చేశారు. బేస్ క్యాంప్ సిబ్బంది పులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీల్వాయిలో ప్రాజెక్ట్ ఉండడంతో నీటి వస తి సమృద్ధిగా ఉంది. చిన్నచిన్న జంతువులు పులికి ఆహారంగా మారుతున్నాయి. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. పాత వేటగాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశాం. నీల్వా యి అటవీ ప్రాంతంలో 11కేవీ విద్యుత్ తీగలు లేవు. పులికి హానీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. – తిరుమలరావు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, చెన్నూర్ -
అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్: ఎంపీ వినోద్
కరీంనగర్: అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారనుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని వైద్యుల వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరాభివృద్దికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. స్మార్ట్ సిటీకి ఎంపికైన కరీంనగర్ను వెయ్యి కోట్ల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్, సీపీ కమలాసన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జనసందడిగల ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ తెలిపారు. విద్యాసంస్థలు, హస్పిటల్, పంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు టెంపుల్స్ ఏరియాలో ప్రజల బాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణ.. అందరి బాధ్యత
► సీమ ఐజీ శ్రీధర్రావు చింతకొమ్మదిన్నె : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాయలసీమ ఐజీ ఎన్. శ్రీధర్రావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఇటీవల నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కొద్దిపాటి చిన్న పనులను వెంటనే పూర్తి చేసి కడప కర్నూలు రేంజ్ డీఐజీకి సమాచారం అందించాలన్నారు. తర్వాత ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్న పోలీస్స్టేషన్ భవనం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, మట్కా, గ్యాబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని, మండల కార్యాలయాల్లో కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రదేశాలలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇంటిపైన నిద్రిస్తారని, దొంగతనాలు జరగకుండా లాకర్ బీగాలను వాడాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే.. ఆ ఇంటికి పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పోలీస్స్టేషన్ నుంచి నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ సత్య ఏసుబాబు, కడప డివిజన్ డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు కుళ్ళాయప్ప. చాంద్బాషా పాల్గొన్నారు. -
నగలకు మెరుగు పెడతామంటూ మోసం
కోదాడ: బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళను ఏమార్చి నాలుగు తులాల బంగారు గొలుసుతో ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఈ సంఘటన గురువారం మండల పరిధిలోని గుడిబండలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంకా వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి తోడుగా వారి మూడో కోడలైన భవానీ ఉంటుంది. గురువారం ఉదయం పది గంటల సమయంలో రాగి పాత్రలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓరాగి పాత్రకు, మరో వెండి వస్తువుకు మెరుగు పెట్టి చూపిం చారు. తర్వాత బంగారు వస్తువులకు కూడా మెరుగుపెడతామంటూ చెప్పి మంగమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడును ఇవ్వమని అడిగారు. మంగమ్మతో పాటు ఆమె కోడలు భవానీ ఎంత వద్దన్నా వారు వినిపించుకోకుండా మా చేతికి ఇవ్వవద్దు, మీరే మెరుగుపెట్టుకోండి అంటూ వారిని నమ్మించారు. పాత్రలో వస్తువులు వేసి వేడి చేయాలని చెప్పి మహిళలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పాత్రలోని వస్తువులను మాయం చేసి ఒకరి తరువాత ఒకరు జారుకున్నారు. కొద్ది సమయం తర్వాత బాధితులు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కోదాడ రూరల్ సీఐ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తీగలు తెగినా బేఫికర్!
►సీసీ కెమెరాలన్నీ వైర్లెస్ ద్వారా అనుసంధానం ►ఠాణా సమీపం నుంచి నేరుగా సీసీసీకే విజువల్స్ ►బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు ►లోపాల అధ్యయనం తర్వాత నగర వ్యాప్తంగా.. సిటీబ్యూరో: నగరంలో సంచలనాత్మక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు నేరాలు నిరోధించడంలోనూ వీటి పాత్ర కీలకంగా మారింది. మెరుగైన పర్యవేక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న కెమెరాలను కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల అప్పుడప్పుడు కనెక్టివిటీకి సంబంధించిన తీగలు తెగిపోతున్నాయి. దీని ప్రభావం పర్యవేక్షణపై పడుతోంది. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా సిటీ పోలీసులు వైర్లెస్ పరిజ్ఞానం పరిచయం చేస్తున్నారు. బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటులో యూనిఫార్మిటీ 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాల ఏర్పాటును కచ్చితం చేశారు. అయితే ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగిన కెమెరాలను వారు ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా యూనిఫార్మిటీ కోసమూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలీసులే ఓ ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన సదుపాయాలు, ప్రమాణాలను (స్పెసిఫికేషన్స్) నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సింక్రనైజేషన్... సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతల్ని ఠాణాల వారీగా ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వీరి సూచన మేరకు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు తమ దుకాణాల్లోనూ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దుకాణం బయటకు ఉన్న కెమెరాలన్నింటినీ బ్రాడ్బ్యాండ్ ద్వారా సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దీంతో ప్రతి సీసీ కెమెరాలో కనిపించే దృశ్యాలను పోలీసుస్టేషన్తో పాటు సీసీసీ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా సింక్రనైజ్ చేయడానికి ప్రస్తుతం వైర్లు వినియోగిస్తున్నారు. వివిధ కారణాల నేపథ్యంలో ఇవి తెగిపోతుండటంతో నిత్యం కొన్నింటిలోని దృశ్యాలు సీసీసీలో ‘అదృశ్యమవుతున్నాయి’. రెండో దశలో ఎనలటిక్స్... నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉండే కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఎప్పటికప్పుడు సీసీసీ ఉండే సిబ్బంది పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్గా పిలిచే సాఫ్ట్వేర్స్ అభివృద్ధి చేస్తున్నారు. వైర్లెస్ విధానం అమలుకు శ్రీకారం... ఠాణా పరిధిలో ఇలా తెగిన వైర్లను అతికించి, దృశ్యాలను పునరుద్ధరించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే సీసీసీ బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లో ఉండటంతో దీంతో సింక్రనైజేషన్కు సమయం పట్టడంతో పాటు అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పోలీసు విభాగం వైర్లెస్ విధానం అమలు చేస్తోంది. ఆ ఠాణా పరిధిలో ఉండే సీసీ కెమెరాలన్నీ పోలీసుస్టేషన్తో అనుసంధానించి ఉంటాయి. దానికి సమీపంలో ఉన్న ఎల్తైన భవనంపై ఓ ట్రాన్స్మీటర్ను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన రిసీవర్ కమిషనరేట్ సమీపంలోని బాబూఖాన్ ఎస్టేట్పై అమరుస్తారు. అక్కడ నుంచి సీసీసీకి వైర్ల ద్వారానే ఫీడ్ అందుతుంది. దీంతో ఠాణా నుంచి సీసీసీ వరకు బ్రాడ్బ్యాండ్తో అవసరం ఉండదు. బేగంపేటలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభమైంది. లోపాలను అధ్యయనం చేయడంతో పాటు వాటిని సరి చేసిన తర్వాత నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల వద్దా ట్రాన్స్మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే... ►నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. ►ఈ సర్వర్లలో ఎనలటిక్స్గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్వేర్స్ నిక్షిప్తం చేస్తారు. ►వీటిలో ఉండే ప్రోగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది. ►వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి. ►ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్పై పాప్అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ►పాప్అప్లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు. ►ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి. ►నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది. ►రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్అప్ ఇస్తాయి. ►ఈ ఎనలటిక్స్లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు. -
పూర్తి బాధ్యత యజమానులదే
∙ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ∙ సీపీ సుధీర్బాబు వరంగల్ : సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల భద్రత పూర్తిగా థియేటర్ల యాజమాన్యాలే వ హించాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు అన్నారు. స్థానిక పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం కమిషనరేట్ పరిధిలోని సినిమా థియేటర్ల యా జమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ సేఫ్టి యాక్టు – 2013 ప్రకారం 100కి పైగా ప్రజలు వచ్చిపోయే ప్రాంతాల్లో ప్రజలకు భద్రత కల్పించాల్సిన బా« ద్యత అయా సంస్థలపై ఉందన్నారు. ప్రతి థియేటర్లో ప్రవేశమార్గంలో నాణ్యమైన డీఎఫ్ఎండీ (పేలుడు పదార్థాలను గుర్తించే యంత్రం)లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ఐపీసీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ దృశ్యాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరి నియమించుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు సైన్బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. థియేటర్లలో అనుకోకుండా ఏదైనా తొక్కిసలాట, అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాలను సూచించే విధింగా ఓ లఘు చిత్రాన్ని చిత్రం ప్రా రంభానికి ముందుగా ప్రదర్శించాలన్నారు. మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రతి థియేటర్లో 50కి పైగా టాయిలెట్స్ ఏర్పా టు చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బ్లాక్ టిక్కెట్లు అమ్మకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హాల్లో సిగరెట్లు, గుట్కాలు అమ్మకాలు జరగకుండా జాగ్రత్త పడా లి. పొగ త్రాగడం, గుట్కాలు తినడం చట్టరీత్యా నేరం అన్న బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్లో సైతం ఒక ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా నగర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై చక్క టి చిత్రాలను చిత్రీకరించి జాతీయ, అంతర్జాతీ యంగా విడుదల చేయడం ద్వారా మరింత గు ర్తింపు వస్తుందన్నారు. డీసీపీలు వేణుగోపాలరా వు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసీపీలు మురళీధర్, ఈశ్వర్రావు, సంజీవ్కుమార్, పద్మనాభరెడ్డి, చై తన్యకుమార్, మురళీధర్, సీఐలు పాల్గొన్నారు. -
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో
భువనేశ్వర్: కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకులతో బెదిరించి, మేనేజర్ పై కాల్పులు జరిపి రూ.2 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒడిషాలోని అంగల్ జిల్లా పరాంగ్లో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు పరాంగ్ లోని ఓ పెట్రోల్ బంకుకి తుపాకులతో దోపిడీకి వచ్చారు. ఓ వ్యక్తి మేనేజర్ రూమ్ బయట ఉండగా మరో ఇద్దరు లోపలికి వెళ్లారు. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ ఉంది. డబ్బు ఎక్కడ ఉందని దుండగులు మేనేజర్ జితేంద్ర బెహరాను ప్రశ్నించారు. డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఆయనపై ఓ దుండగుడు ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. మేనేజర్ చెప్పగానే మరో ఉద్యోగి మొదట కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత మనేజర్ కూడా డెస్క్ లో దాచిన మరికొంత నగదును దుండగులకు ఇచ్చేశాడు. తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించడంతో డబ్బు ఇవ్వక తప్పలేదని గాయపడ్డ మేనేజర్ జితేంద్ర పోలీసులకు తెలిపారు. రూ.2 లక్షలకు పైగా నగదును దోపిడీదారులు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ కుడికాలిలో బుల్లెట్ గాయం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ రూములో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో
-
12 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదింపు
అనంతపురం సెంట్రల్ : చిన్నారి కిడ్నాప్ కేసును 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ను కనుగొని, అతడి నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు సమక్షంలో చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అనంతపురంలోని సూర్యనగర్ సర్కిల్ సమీపంలో నివాసముంటున్న కిశోర్కుమార్, మల్లీశ్వరి దంపతుల మూడేళ్ల కుమార్తె హనీశ్వరి గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటి పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో వన్టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ రంగడుయాదవ్లను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పరిసరప్రాంతాలను క్షుణ్ణంగా గాలించారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బాలికను కిడ్నాప్ చేసి బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బస్సు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. కిడ్నాపర్ ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతిసర్కిల్లో దిగి ఆటో ద్వారా వెళ్లినట్లు తేలింది. వెంటనే ఆటోడ్రైవర్ అడ్రస్సు కనుగొని కిడ్నాపర్ని పట్టుకున్నారు. ఇదంతా 12 గంటలలోపే జరిగింది. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన పెన్నోబిలేసు అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్దారించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని చిన్నారి హనీశ్వరిని సురక్షితంగా జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ రాజశేఖరబాబుల సమక్షంలో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు చేర్చడంలో కృషిచేసిన వన్టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ రంగడుయాదవ్, సిబ్బందిని అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నామన్నారు. పిల్లలు లేరని, పెంచుకునేందుకే తీసుకెళ్లానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. -
నిఘా కళ్లు కప్పేశారు !
కాశినాయనణ: పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లైంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదారులు తొక్కే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్ల యాజమాన్యాలు చేస్తున్న మాస్కాపీయింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే 5 కేంద్రాల్లో మాత్రమే సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఫలించిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల హవా? : కొన్నేళ్లుగా జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులదే హవా. దీనికి ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తు అయితే పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, నిర్వాహకులను మేనేజ్ చేయడం మరొక ఎత్తు. పరీక్షల్లో విద్యార్థులు అడ్డదారులు తొక్కేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బందిని, కొంత మంది అధికారులను లోబరుచుకోవడానికి పెద్ద మొత్తంలో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేసిన ఘటనలు అనేకం. మాస్కాపీయింగ్ వల్లే కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్నారని అనేక పర్యాయాలు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే కొంత మంది అవినీతి అధికారులను మేనేజ్ చేసి తమ విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఏ పరీక్ష కేంద్రంలో కూడా సీసీకెమెరాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొత్తం మీద ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. -
బీసీ హాస్టళ్లలో ‘సీసీ నేత్రం’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అపరిచితుల రాకపోకలపై ఫిర్యాదులు, విధి నిర్వహణలో వసతిగృహ సంక్షేమాధికారి తీరుపై ఆరోపణలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ముం దుగా బాలికల వసతిగృహాల్లో సీసీ(క్లోజ్డ్ సర్క్యూట్) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 705 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 250 కాలేజీ విద్యార్థి హాస్టళ్లు కాగా, 455 పాఠశాల విద్యార్థి హాస్టళ్లు. వీటిలో 325 బాలికల వసతిగృహాలుండగా, ఈ హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. వసతిగృహ సంక్షేమాధికారి సమయపాలన పటించకపోవడం, అనధికారిక వ్యక్తులు హాస్టళ్లకు పదేపదే రావడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడంతో టీఎస్టీఎస్(తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్) ద్వారా కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రతి వసతిగృహంలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సత్ఫలితాలు వస్తున్న తరు ణంలో వీటిని బీసీ హాస్టళ్లలో అమలుకు పూనుకుంది. ఇకపై విద్యా ర్థులు, వసతిగృహ సంక్షేమా ధికారి, సిబ్బంది హాజరు కూడా బయోమెట్రిక్ మిషన్ల ద్వారా నమోదు చేస్తే పర్యవేక్షణ సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్లోని ఉద్యోగులు వసతిగృహాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు తయారు చేస్తారు. -
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► 35,992 మంది విద్యార్థుల కోసం 164 కేంద్రాలు ► తొలిసారిగా సీసీఈ విధానంలో పరీక్ష ► జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 164 కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీఈ విధానం ద్వారా తొలిసారి 80 మార్కులకు పరీక్షలు జరగనుండగా గతంకంటే 15 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీసీఈ మోడల్లో ప్రశ్నపత్రం ఇవ్వడంతో చదువుకునేందుకు ఈ సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో ఖచ్చితంగా బెంచీలు ఉండేటట్లు చూడాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడంతో అందుకుతగ్గ ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తున్నారు. 5 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: పది పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు విద్యార్థులు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు ఐదు సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, చక్రాయపేట మండలం గండిలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, పెనగలూరు మండలం చక్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా 8 సెంటర్లు: జిల్లాలోని ఎనిమిది సెంటర్లను సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఇందులో నందిమండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, వనిపెంట గురుకుల పాఠశాల, గండి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, మఠం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కడప జయనగర్కాలనీ(ప్రైవేటు సెంటర్), తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ సెంటర్లపై స్క్వాడ్ ప్రత్యేక దృష్టిపెట్టనుంది. 50 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం: పది పరీక్షల్లో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ కేవీ సత్యనారాయణ నియమించారు. వీరు ఆయా మండలాల్లోని సెంటర్లలో ఉండే విద్యార్థులు మాస్కాపీయింగ్కు పాల్పడకుండా ప్రత్యేక పర్యవేక్షణను చేయనున్నారు. దీంతోపాటు విద్యాశాఖ మరో 20 టీంలను పరీక్షల పర్యవేక్షణకు నియమించింది. ఈ స్క్వాడ్లోని ప్రతి బృందంలో విద్యాశాఖ నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరు. పోలీస్వాఖ నుంచి ఒకరు ఉంటారు. వీరు ముగ్గురు కలిసి ఒక బృందంగా ççపరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు. ఇన్విజిలేటర్ల నియామకంలో జంబ్లింగ్: ఈసారి జరిగే పది పరీక్షల్లో మాస్కాఫీయింగ్కు తావ్వకుండా గతమెన్నడూ లేని విధంగా కలెక్టర్ పరీక్షలకు వెళ్లే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో విధులను నియమించనున్నారు. ఈ మేరకే కలెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విధానం కిందిస్థాయిలో అమలు కొంతమేర కష్టతరం అవుతుందని మేధావులు, విద్యావంతులు అంటున్నారు. ఎందుకుంటే పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం అయితే పరీక్ష నిర్వహించే రోజు ఉదయం 7 గంటలకు ఇన్విజిలేటర్ల సెల్కు ఏసెంటర్ అనేది మెసేజ్ వస్తుందని కలెక్టర్ గారు చెప్పారు. ఇది అమలు కొంతమేర కష్టతరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. కొన్ని కారణాల చేత ఇన్విజిలేటర్ల సెల్కు మేసేజ్ చేరకపోయినా సంబంధిత ప్రక్రియ జరగడం కొంతమేర ఆలస్యమైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. 25 యాక్టు అమలు: రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది నుంచి 25 యాక్టు (ప్రిలెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్)ను అమలు చేయనుంది. ఈ యాక్టు వల్ల పరీక్ష కేంద్రాలలోని విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడితే సంబంధిత సెంటర్ ఇన్విజిలేటర్ని బాధ్యుడిగా చేయనుంది. దీంతో అతనిపై కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: పది పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఎక్కడా కూడా నేలబారు పరీక్షలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించాం. మేము కూడా పర్యవేక్షిస్తున్నాం. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నాం. ---పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
బ్యాంక్లో చోరీ
- సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళా దొంగ పట్టివేత గూడూరు: స్థానిక ఎస్బీఐ బ్రాంచ్లో ఓ ఖాతాదారుడి నుంచి నగదును తస్కరించిన మహిళను సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ఆర్.ఖానాపురం గ్రామానికి చెందిన రైతు దామోదర్రెడ్డి వైజాగ్లో చదువుకుంటుండగా తన కుమారుడి ఖాతాలో నగదు జమ చేసేందుకు ఎస్బీఐకి వచ్చాడు. కుమారుడి ఖాతాలో రూ.25 వేలు జమ చేస్తుండగా వెనుక ఉన్న ఓ మహిళ బ్లేడుతో బ్యాగ్ను కత్తిరించి అందులో ఉన్న రూ. 960ని తస్కరించింది. కొద్ది సేపటికి బాధితుడు విషయాన్ని గమనించి బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ను పరిశీలించగా బాధితుడి వెనుక ఓ మహిళ బురఖా ధరించి చోరీకి పాల్పడిన విషయాన్ని గమనించారు. అనంతరం మేనేజర్ ప్రదీప్కుమార్, సిబ్బంది పాత బస్టాండు సెంటర్లో పరిశీలించగా బస్సు ఎక్కుతున్న నిందితురాలిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుని తస్కరించిన రూ. 960ని బాధితుడికి అప్పగించింది. నిందితురాలు కర్నూలు పట్టణానికి చెందిన మహిళ అని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఓబులేసు తెలిపారు. -
ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించండి
- పోలీసు అధికారులకు సీమ ఐజీ ఆదేశం కర్నూలు : ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పక పాటించాలని రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్రావు ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలతో ఐజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి.రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా చిత్రీకరించాలన్నారు. ఎన్నికల వెబ్సైట్లను ప్రతిరోజూ గంటకోసారి గమనిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పూర్తిగా నిఘా ఉంచాలన్నారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర పోలీసు బలగాలను ఉపయోగించుకుని ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిని కట్టడి చేయాలన్నారు. నేర ప్రవృత్తి గల రౌడీల కదలికలపై నిఘా పెంచాలన్నారు. బ్యాలెట్ బాక్సులు తరలించేటప్పుడు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నాన్బెయిలబుల్ వారెంట్ల వివరాలు, బైండోవర్ కేసులు, లైసెన్స్ ఆయుధాల స్వాధీన వివరాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఎంతమంది ఓటింగ్కు హాజరవుతున్నారనే విషయాలను ఎన్నికల బందోబస్తు విధులకు నియమించే సిబ్బంది వివరాలు ఎస్పీ, ఐజీకి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. డీజీపీ ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, జె.బాబుప్రసాద్, ఈశ్వర్రెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, మురళీధర్, వినోద్కుమార్, వెంకటాద్రి, బాబా ఫకృద్దీన్, హుసేన్ పీరా, సీఐలు పవన్కిషోర్, ఇస్మాయిల్, రామాంజనేయులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అడుగడుగునా పోలీసులు, సీసీ కెమెరాలు
తాడేపల్లి (అమరావతి): వెలగపూడిలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో రాజధాని, చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శనివారం నాటికే వివిధ ప్రాంతాల నుంచి 1,500 మంది పోలీసులను తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి, పెదకూరపాడు మండలాల్లో మోహరించారు. సమావేశాలు కొత్త రాజధానిలో నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ మొండి వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతాయనే భయాందోళనలతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్గాలకు చెందిన నాయకులు ఇప్పటికే తమ సమస్యలపై పలుసార్లు విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసు వద్ద ధర్నాలు నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సచివాలయానికి 20 కిలోమీటర్ల దూరంలోనే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాత్రి- పగలు షిప్టుల వారీగా పోలీసులు డ్యూటీలు నిర్వహించనున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 15 చోట్ల ప్రత్యేక టెంట్లు ఏర్పాటు ఏర్పాటు చేసి, ఒక్కో చోట 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరికి సాయంగా ఒక్కొక్క చోట 70 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసి, అప్రమత్తంగా ఉంచారు. వీటికి అదనంగా గుంటూరు జిల్లా అర్భన్, రూరల్ పరిధిలో సచివాలయానికి వేళ్లే రహదార్లలో 300 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ఫుటేజిలను నేరుగా గుంటూరు ఎస్పీ కార్యాలయంలో చూసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు, రాజధాని పరిధిలో పైలట్ వాహనాలలో సంచరించే వారికి జీపీఎస్ ఫోన్లు అందజేసి, నిరంతరం వాటిని పర్యవేక్షించేందుకు గుంటూరులో ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎప్పటికప్పుడు, ఎక్కడనుండి ఎక్కడకు ప్రయాణిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారనే విషయాలు కూడా క్షుణ్ణంగా దీనిలో తెలుస్తుందని విశ్వసనీయ సమాచారం. -
ఆస్పత్రిలో భద్రత కోసం సీసీ కెమెరాలు
హిందూపురం అర్బన్ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత కోసం త్వరలోనే అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆస్పత్రి సలహా కమిటీ అ«ధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. మంగళవారం అభివృద్ధి సలహా కమిటీ సమావేశం సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వెలుగుల కోసం దాతల సహకారంతో హైమ్యాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిన్నంటిని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ ద్వారా త్వరలోనే ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్పారు. -
రష్యా రైల్వే స్టేషన్లో అద్భుత సాహసం
మాస్కో: రష్యాలోని ఓ సీసీటీవీ కెమెరాలో అద్భుత దృశ్యం రికార్డయింది. ఫోన్లో మాట్లాడుతూ అనూహ్యంగా రైలు పట్టాలపై పడిన ఓ పిల్లాడిని అక్కడే ప్లాట్ఫాం పై ఉన్న ఓ వ్యక్తి ఎంతో తెగువ చేసి రక్షించాడు. అది కూడా రైలు వస్తుండగా ప్రాణాలకు తెగించి. వారిద్దరు ప్లాట్ఫాం చేరుకున్న సెకన్లలోనే రైలు వచ్చి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని యేకతరిన్బర్గ్ రైల్వే స్టేషన్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు చేతిలో ఫోన్ బ్యాగుతో ఉండి ప్లాట్ఫాం చివరి అంచున నడవడం మొదలుపెట్టాడు. దిక్కులు చూస్తూ తాను ఎక్కడ అడుగువేస్తున్నాననే విషయాన్ని ఆదమరిచి అమాంతం రైలుపట్టాలపై పడ్డాడు. కాస్త దూరంలో హైస్పీడ్ రైలు దూసుకొస్తుంది. ఏ ఒక్కరూ దిగే సాహసం చేయలేదు. కానీ, అక్కడే ఉన్న ఓ నల్లజాతీయుడు ప్రాణాలకు తెగించి రైలుపట్టాలమీదకు దూకాడు. ఆ బాలుడిని పైకెత్తి వేరేవాళ్లకు అందించాడు. అ తర్వాత తాను కూడా పైకి వచ్చి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడు అలా పైకి వచ్చి రాగానే రైలు వేగంగా వచ్చి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ బాలుడి తండ్రితోపాటు అక్కడి వారంతా సోషల్ మీడియాలో ఆ బ్లాక్ యువకుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. తాను అతడు ఎక్కడున్నా కలుసుకొని ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు బాలుడి తండ్రి తెలిపాడు. -
ఇంటర్ ప్రాక్టికల్స్లో 30/30!
⇒ యాజమాన్యాలతో ఎగ్జామినర్ల కుమ్మక్కు.. ⇒ ఇష్టారాజ్యంగా మార్కులు.. పట్టించుకోని ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో సీసీ కెమరాల్లేవు.. నిఘా లేదు. పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ అంతకంటే లేదు. ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్. దీంతో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎగ్జామినర్లకు ముడుపులిచ్చి తమ విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయించుకున్నట్లు విమర్శలు వస్తు న్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ఒక్కో గ్రూపులోని ఒక్కో బ్యాచ్లో ఉండే 20 మంది విద్యార్థుల్లో ఒక్కరికి మించి 30కి 30 మార్కులు వేయకూడదన్న నిబంధనను తుంగలో తొక్కి ఎగ్జామినర్లు ఇష్టానుసారం మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఆలసత్వ వైఖరి కూడా దీనికి కార ణమవుతోంది. ముడుపుల మత్తులో జోగుతూ పట్టించుకోని కొంతమంది బోర్డు అధికారులు, యాజమాన్యాలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తున్న కొంతమంది ఎగ్జామినర్ల తీరుతో ఈ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. రెండు రోజుల కిందట: రెండు రోజుల కిందట ఓ ఎగ్జామినర్కు ఓ కార్పొరేట్ కాలేజీలో డ్యూటీ పడింది. సదరు కాలేజీకి వెళ్లాక.. ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్లకు కలిపి రూ.30వేలు ఇస్తామని యాజమాన్యం ఆయనతో ‘ఒప్పందం’ కుదుర్చుకుంది. దీంతో ఆ ఎగ్జామినర్ ఎక్కువ మంది విద్యార్థులకు 30కి 30 మార్కులను వేసేశారు. చివరకు సదరు ఎగ్జామినర్కు రూ.6 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపింది ఆ యాజమాన్యం. మరోవైపు ఎగ్జామినర్ను మేనేజ్ చేయాలంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు యాజమాన్యం వసూలు చేసింది. అయితే అదే ఎగ్జామినర్కు అదే కాలేజీలో ఆదివారం కూడా డ్యూటీ పడింది. ఇంకేముంది అదనపు మొత్తం కావాలని డిమాండ్ చేశారు సదరు ఎగ్జామినర్. మధ్యేమార్గంగా ఒప్పందం చేసుకుని.. అత్యధిక మార్కులు వేసేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా.. అది కార్పొరేట్ యాజమాన్యం కావడంతో చేతులెత్తేశారు. ఆ ఒక్క కాలేజీలోనే కాదు.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలన్నింటిలోనూ ఈ దందా కొనసాగుతోంది. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ర్యాంకుల ఖరారులో ఒక్క మార్కు కూడా కీలకం అవుతోంది. సీసీ కెమెరాల్లేవ్.. జంబ్లింగ్పై దృష్టి లేదు: రాష్ట్రవ్యాప్తంగా 1,682 కాలేజీల్లో 3,19,185 విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్స్ జరిగే ఒక్కో గదిలో 2 చొప్పున సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని, నిఘా నీడన పరీక్ష నిర్వహిస్తామని మొదట్లో పేర్కొంది. కానీ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యే సమయానికి సీసీ కెమెరాలు కచ్చితంగా ఉండాలనే నిబంధనను తొలగించింది. అలాగే పరీ„ýక్ష కేంద్రాల జంబ్లింగ్నూ పట్టించుకోలేదు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే పరీక్ష కేంద్రాలు పడటంతో ఇష్టారాజ్య మార్కులకు తెరలేచింది. మరోవైపు ఒక్కో కేంద్రంలో ఒక్కో గ్రూపులో ప్రాక్టికల్స్ జరిగే బ్యాచ్లోని 20 మందిలో ఒక్కరికి మించి 30 మార్కులకు 30 వేయరాదన్న నిబంధన అమలును బోర్డు పట్టించుకోవడం లేదు. ఏటా ఒక్కో బ్యాచ్లో ఆరేడు మందికి 30కి 30 వేసిన సందర్భాలున్నా.. ఎగ్జామినర్లపై చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. -
రాజధానిలో భద్రత డొల్ల
సాక్షి, అమరావతి : అది రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి గ్రామం. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున ఏపీ07టీజీ 7477 నంబర్ ట్రాక్టర్ అపహరణకు గురైంది. 8వ తేదీన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీలపై ఆ«ధారపడ్డారు. తాడేపల్లి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ట్రాక్టర్ వారధిపై నుంచి వెళ్లడాన్ని స్పష్టంగా గమనించారు. అదే దారిలో సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించుకుంటూ బ్యారేజీ నుంచి విజయవాడ నగరంలోకి వెళితే ట్రాక్టర్ దొంగను పట్టుకోవచ్చని ధీమాగా ముందుకు సాగారు. అయితే ప్రకాశం బ్యారేజీపై విజయవాడ వైపు ఉన్న 15 సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడం లేదని తెలిసి కంగుతిన్నారు. అంతే కాదు విజయవాడ నగరంలోని వన్టౌన్, ప్రధాన రహదారిలోనూ సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని పోలీసులకే అనుభవమైంది. ఫుటేజీ చూడటానికి అసలు సీపీ కెమెరాలే పనిచేయడం లేదని నిర్ధారించారు. ఇంతకీ ట్రాక్టర్ వెళ్లిన దారిలో వెదుకుదామని వెళితే నిఘా నిద్రపోతున్న వైనం వెలుగు చూసింది. ప్రకాశం బ్యారేజీ, వన్టౌన్కు ఆనుకుని ఉన్న విజయవాడ ప్రధాన రోడ్డు మార్గంలో నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తుంటారు. ఈ మార్గంలో లెక్కకు మిక్కిలి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినప్పటికీ అవి ఏమేరకు పనిచేస్తున్నాయో పరిశీలించడంలో మాత్రం ఘోర వైఫల్యం కన్పిస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక స్తంభానికి ఏకంగా ఏడు సీసీ కెమెరాలు బిగించారు. అందులో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని గుర్తించారు. మూడు రోజలపాటు జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు సైతం దేశవిదేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. బౌద్ధమత గురువు దలైలామాకు, మావోయిస్టుల నుంచి చంద్రబాబుకు హాని ఉందని గతంలోనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి కీలక సమయంలో సీసీ కెమెరాలు ఎంత వరకు పనిచేస్తున్నాయనే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కన్పిచడం గమనార్హం. -
రూ.630 కోసం హత్య
నిందితుడి అరెస్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తింపు నాంపల్లి: డబ్బు కోసం ఫుట్పాత్పై నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన కేసులో నిందితుడని హబీబ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హబీబ్నగర్ పోలీసు స్టేషన్లో గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ రావు, ఇన్స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన సయ్యద్ జబిర్ ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను జులాయిగా తిరుగుతూ హైదరాబాద్కు చేరుకున్నారు. హబీబ్నగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నిద్రిస్తున్న వారి జేబుల్లోని డబ్బులు తీసుకుని మద్యం సేవించేవాడు. ఈ నెల 4న అర్ధరాత్రి మల్లేపల్లి బడే మసీదు సమీపంలోని నేషనల్ ఎలక్రానిక్స్, మొబైల్ దుకాణం వద్ద ఫుట్పాత్పై నిద్రిస్తున్న 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి జేడులో ఉన్న డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జబీర్ బాగా ఆకలితో ఉన్న జబీర్ ఏలాగైనా అతడి నుంచి డబ్బు లాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బండరాళ్లను తీసుకువచ్చి సదరు వ్యక్తి తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని జేబులో ఉన్న రూ.630 తీసుకుని పరారయ్యారు. తెల్లవారుజామున టీ తాగేందుకు అక్కడికి వచ్చిన పురానాపూల్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అకైఫ్ మీర్జా బైక్ను మొబైల్ షాపు ముందు పార్క్ చేసి హోటల్ లోపలికి వెళుతుండగా ఫుట్పాత్పై రక్తం మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సయ్యద్ జబిర్ హత్య చేసినట్లుగా గుర్తించారు. శుక్రవారం మల్లేపల్లిలోని ఎస్బిహెచ్ బ్యాంకు వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సీసీ కెమెరాలే కీలకం
శాంతిభద్రతలే ప్రధానం పోలీసుల సంక్షేమమే లక్ష్యం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మెదక్ రూరల్: దొంగతనాలను, రౌడీయిజాన్ని, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయని, ఒక్క సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లుతో సమానంగా పని చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మెదక్ మండలం అవుసులపల్లి గ్రామం వద్ద గల మెదక్ రూరల్ పోలీస్స్టేషన్ పక్కన రూ.10కోట్ల78 లక్షల వ్యయంతో 600 మంది పోలీస్ సిబ్బంది క్వార్టర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ నిధుల నుంచి తమ తమ నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో సీసీ కెమెరాల ఆధారంగా కేవలం 24 గంటల్లోనే పోలీసులు చేధించిన పలు కేసుల గురించి వివరించారు. నేరాలను అదుపు చేయడానికి అధునాతన పద్ధతులతో హైదరాబాద్లో 22 అంతస్తులతో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా సీసీ కెమెరాల ఆధారంగా ప్రతీ పోలీస్స్టేషన్ నుంచి నిమిషాల వ్యవధిలో మొత్తం వివరాలతో కమాండ్ అండ్ కంట్రోల్కు సమాచారం వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన కొత్త మండలాల్లో త్వరలో పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశ పెట్టాం.. గతంలో పోలీస్స్టేషన్కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టి.. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించామన్నారు. పోలీసులు డబ్బులు తీసుకుని చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పోలీస్స్టేషన్కు నెలనెలా నిర్వహణ కోసం ఖర్చులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏ క్లాస్ పోలీస్స్టేషన్కు రూ.75వేలు, బి క్లాస్ పోలీస్స్టేషన్కు రూ.50వేలు, సీ క్లాస్ పోలీస్ స్టేషన్కు రూ.25వేలు అందిస్తున్నట్లు తెలి పారు. సీఎం ప్రతి రంజాన్కు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పోలీసుల సంక్షేమానికి రూ.350 కోట్లు.. పోలీసుల సంక్షేమానికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆసరా పింఛన్ను, ఆరు కిలోల బియ్యం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లా నీళ్లు, మిషన్ కాకాతీయ ద్వారా చెరువుల పురుద్ధరణ వంటి కార్యక్రమాలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పది వేల మంది పోలీసులు శిక్షణలో ఉన్నారని, అం దులో మహిళా పోలీసులు ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ ఎంతో అవసరం.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో రామాయంపేట పోలీస్స్టేషన్ భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వచ్చినప్పుడు మెదక్లో పోలీస్ సిబ్బంది కోసం క్వార్టర్లు, డీఎస్పీ కార్యాలయం కావాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే పోలీస్ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో అత్యధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి, ఎస్పీ చందనదీప్తి, మెదక్ ఎంపీపీ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యారెడ్డి, సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల శాఖలో ఐటీ విభాగం
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను ప్రక్షాళన చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నిత్యావసర సరుకుల సరఫరా మొదలు పంపిణీ వరకు పీడీఎస్ను పటిష్ట పరిచేందుకు ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం సిబ్బందిని ఏడాది కాలానికి ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు. వీరి ఎంపికను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా చేపట్టారు. పౌరసరఫరాల శాఖలో అమలవుతున్న ఐటీ ప్రాజెక్టులను పర్యవేక్షించే బాధ్యతను ఈ బృందం చూడనుంది. ఒక ప్రాజెక్టు హెడ్, ఇద్దరు ప్రాజెక్టు మేనేజర్లు, ఇద్దరు ప్రాజెక్ట్ అసోసియేట్స్తో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మండల స్థాయి నిల్వకేంద్రాల (ఎంఎల్ఎస్ పాయింట్లు) వద్దకు సీసీ కెమెరాలు, సరుకులు తరలించే లారీలకు జీపీఎస్, రేషన్ దుకాణాల వద్ద బయోమెట్రిక్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి వ్యవహారాల నిర్వహణను ఐటీ విభాగం పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు కూడా వీటిని వీక్షించేలా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణల్లో ఈ–పాస్ యంత్రాలు, నగదు రహిత లావాదేవీలు వంటి ప్రాజెక్టులను ఐటీ విభాగం పర్యవేక్షించనుంది. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
22వ తేదీ వరకు నాలుగు దశలుగా నిర్వహణ తుస్సుమన్న సీసీ కెమెరాల నిబంధన, పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన బోర్డు? సాక్షి, హైదరాబాద్: ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా, పకడ్బందీగా జంబ్లింగ్ విధా నం అమలు చేస్తామంటూ ఊదరగొట్టిన ఇంటర్మీ డియెట్ బోర్డు చివరకు చేతులెత్తేసింది! కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి మొదట్లో రూపొందించిన నిబంధనలను పక్కన పెట్టే సింది!! సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్స్కు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్న నిబంధనను తొలగించి నేటి నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టి కల్స్కు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ల్యాబ్ సదుపాయాలు పెద్దగా లేని కొన్ని కాలేజీలు మినహా మిగతా కాలేజీల విద్యార్థులు దాదాపుగా తమ కాలేజీల్లో ప్రాక్టికల్స్కు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపి స్తామన్న ఒక్క నిబంధన అమలుతో ప్రాక్టికల్స్ నిర్వహణకు సిద్ధమైంది. ప్రైవేటు యాజమాన్యా లు, ఓ మంత్రి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే బోర్డు జంబ్లింగ్ను, సీసీ కెమెరాలు ఉండాలన్న నిబంధనలను తొలగించినట్లు విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉండాలంటూ పెట్టిన నిబంధననూ తొలగించాలంటూ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. పరీక్షలు ప్రారంభమైతే ఈ నిబం ధన విషయంలో ఏం చేస్తుందనేది తెలియనుంది. నాలుగు దశల్లో 22 వరకు నిర్వహణ ఇంటర్ ప్రాక్టికల్స్ను బోర్డు ఈ నెల 3 నుంచి 22 వరకు 4 దశలుగా నిర్వహించనుంది. దీని కోసం 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, వొకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్కు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలే జీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ విద్యా ర్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 39,044 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం... ఆన్లైన్ ద్వారా ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. tsbie.cgg.gov.in నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. పరీక్ష పూర్తి కాగానే మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. -
మిలాఖత్
లడ్డూ దందాలో ఇంటిదొంగలే కీలకం దళారులతో చేతులు కలిపిన నిఘా, కౌంటర్ సిబ్బంది, ట్రేలిఫ్టర్స్ సీసీ కెమెరాల పనితీరుపైనా అనుమానాలు తిరుమల : కొండ లడ్డూ అక్రమదందాలో కంచే చేనుమేస్తోందా.. నిఘా సిబ్బందే దళారులతో చేతులు కలిపారా..? కౌంటర్ సిబ్బంది.. ట్రే లిఫ్టర్స్ చేతుల మీదుగానే లడ్డూలు పక్కదారి పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. చీమచిటుక్కుమన్నా పసిగట్టి గుట్టువిప్పాల్సిన సీసీ కెమెరాలూ ఈ అక్రమ దందాను చిత్రీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిఘా సిబ్బందే బేరసారాలు దళారులతో నిఘా సిబ్బంది మిలాఖతై భక్తులతో బేరసారాలు సాగిస్తున్నారు. కొందరు దళారుల్ని అసిస్టెంట్లుగా నియమించుకుని ఈ అక్రమ వ్యాపారంలో తలమునకలైపోయారు. కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తుడికి ఇచ్చే ఒక ఉచిత లడ్డూ టోకెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తుల్లో ఒకరికి ఇచ్చే రూ.10 చొప్పున రెండు సబ్సిడీ టోకెన్లతోనే ఈ అక్రమ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం సినిమాల్లో మాదిరిగానే సినిమాల్లో డాన్ను కలిసే తరహాలోనే తిరుమలకొండ మీద లడ్డూల అక్రమ వ్యాపారం సాగుతోంది. దళారులు పక్కా స్కెచ్తో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఓ దళారి భక్తుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మరో దళారి కౌంటర్ నుంచి లడ్డూలు తీసుకొస్తాడు. ఇంకోదళారి ఆ భక్తుడికి లడ్డూలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. వీరికి టీటీడీ నిఘా సిబ్బంది, కౌంటర్ సూపర్వైజర్, ట్రే లిఫ్టర్లు వారివారి స్థాయిలో సహకారం అందిస్తారు. చివరగా వచ్చిన ఆ డబ్బులు అందరూ పంచుకుంటారు. మూడో కంటికి తెలియకుండా.. లడ్డూ కౌంటర్ల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సాక్షిగానే లడ్డూల అక్రమ విక్రయాలు సాగుతున్నాయి. ఈ దృశ్యాలు వాటికి కనిపించటం లేదు. దళారుల కదిలికల్ని పసిగట్టడంలేదు. సీసీ కెమెరా అపరేట్చేసే సిబ్బందీ వీటిని రికార్డు చేయడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్రమ దందాలో పాత్రదారులెందరో? భక్తులకు కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్లు ఇచ్చే బాధ్యతల్ని ఓ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ సంస్థలో పనిచేసే కొందరు సిబ్బంది ఈ అక్రమ దందాలో ప్రధాన పాత్రధారులు. టోకెన్లను దొడ్డిదారిలో తరలిస్తూ లక్షలాది రూపాయలు టీటీడీకి నష్టం కలిగిస్తున్నారు. వీరితో కొందరు విజిలెన్స్, టీటీడీ సిబ్బంది కలసిపోయి అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల చిట్టా కొందరు విజిలెన్స్ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
లేడీస్ హాస్టల్ సంఘటనపై డీఎస్పీ విచారణ
– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నంద్యాల: పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ లేడీస్ హాస్టల్లో శనివారం రాత్రి ఆగంతకులు జొరబడి విద్యార్థినిలను భయబ్రాంతులకు గురి చేసిన సంఘటన డీఎస్పీ హరినాథరెడ్డి విచారణ చేపట్టారు. సోమవారం ఆయన హాస్టల్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దేవనగర్కు చెందిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఇద్దరు గతంలో పెట్రోల్ దొంగతనాలకు పాల్పడేవారని, జల్సా కోసం దొంగలుగా మారారని విచారణలో తెలుస్తోంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం. లేడీస్ హాస్టల్లో జరిగిన సంఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి గాలి రవిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి చిన్న, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ హాస్టల్లో వాచ్మెన్ను నియమించకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. -
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా
టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రాక్టికల్ పరీక్షలపైనా నిఘా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. వచ్చే నెల 3 నుంచి 22 వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్షలకు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి ప్రాక్టికల్ కేంద్రంలోని ఒక్కో గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించడంతో పాటు ప్రశ్నపత్రం పంపిణీ, మూల్యాంక నం, మార్కుల కేటాయింపు అంశాలను ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. ఎగ్జామినర్లతో ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మక్కై విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం లేకుండా, ఎగ్జామినర్లకు అరగంట ముందే ఆన్లైన్ ద్వారా పేపర్ పంపించడం, పరీక్ష పూర్తయ్యాక 2 గంటల్లోపే మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ప్రశ్నపత్రాలు, మూల్యాంకనం విధానాలపై ఎగ్జామినర్లకు శిక్షణ ప్రారంభమైంది. మార్చి 1 నుంచి జరిగే థియరీ పరీక్షలకూ తరగతి గదుల్లో రెండు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు టెన్త్ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,300 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5.2 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్కో తరగతి గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది. -
సీసీ కెమెరా నిఘాలో పెద్దపల్లి
► పట్టణంలో 77 చోట్ల ఏర్పాటు ►ప్రతీ పల్లెలో ఏర్పాటుకు సన్నాహాలు పెద్దపల్లి : సీసీ కెమెరాల నిఘాలోకి పెద్దపల్లి సర్కిల్ వెల్లనుంది. పట్టణంలోని ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుండగా పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్స్టేషన్ లను నమూనాగా తీసుకొని అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్లతోపాటు ప్రతీ విధిలో ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణకు వ్యూహరచన చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీలు ఉపయోగపడనున్నాయి. ఒక్కో సీసీ కెమెరా 360 మీటర్ల దూరంలోని వ్యక్తుల కదలికలను రికార్డు చేయనుంది. పెద్దపల్లి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సిటికేబుల్ ద్వారా పోలీస్స్టేషన్ కు అనుసంధానం చేస్తూ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రతీ అంగుళం కూడా పోలీసుల గుప్పిట్లో ఉండేందుకు వీలుగా ఒక్క పెద్దపల్లి పట్టణంలోనే 77 చోట్ల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మేరకు జెండా చౌరస్తాలోని ఆరు వైపులా, మజీద్ చౌరస్తాలో ఆరు వైపులా, రైల్వే స్టేషన్ లో నాలుగు వైపులా, బస్టాండ్లో ఏడు వైపులా ఇలా ప్రతి వీధిని కవర్ చేస్తూ అమర్చనున్నారు. పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని బసంత్నగర్, ధర్మారం, వెల్గటూర్, పెద్దపల్లి పట్టణం, మండలంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నారు. ఎంపీ బాల్క సుమన్ తన నిధుల కోటా ద్వారా రూ.15 లక్షలు కేటాయించారు. స్థానిక వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటున్నట్లు సీఐ ఎడ్ల మహేశ్ తెలిపారు. ఇప్పటికే బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో కెమెరాల బిగింపు పూర్తయిందన్నారు. పెద్దపల్లి మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్వగ్రామం కాసులపల్లి నుంచి బిగింపునకు శ్రీకారం చుట్టామన్నారు. ఆ గ్రామం నుంచి రూ. 90 వేలు విరాళాలు వచ్చాయని సీఐ తెలిపారు. తగ్గనున్న నేరాలు సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా నేరం జరిగినా వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపించేందుకు, శిక్ష పడేందుకు కూడా దోహదపడతాయని అంటున్నారు. పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో సుమారు రూ.కోటి 30 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆనాటి అన్నల గ్రామాల్లో నిఘా పెద్దపల్లి జిల్లాలోని అన్నల ప్రభావిత గ్రామాల్లో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాణాపూర్, కుక్కలగూడూర్, పాలకుర్తి, పాలితం, వనపర్తి, ముంజంపల్లి ఇలా పదుల సంఖ్యలో మావోయిస్టులను ఇచ్చిన గ్రామాలు పోలీసుల నిఘా నేత్రంలో ఉండనున్నాయి. -
మూడో కన్ను..అడవికి దన్ను
-నల్లమలలో 600 కెమెరాల ఏర్పాటు - ఎర్రచందంనం అక్రమ రవణాకు చెక్ - 66 పెద్ద పులుల గుర్తింపు - చిమ్మచీకట్లోనూ ఇన్ఫ్రారెడ్ రేస్తో చిత్రాలు సేకరణ కల్లూరు (రూరల్): వన్యప్రాణుల రక్షణ కోసం..అటవీ సంపద పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని నల్లమల అడవిలో వరల్డ్ వైల్డ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో వీటిని ఏర్పాటు చేశారు. నంద్యాలలోని చెలమ రేంజ్, బీచ్, బసాపురం, పెద్దకంబలూరు, పచ్చర్ల, దొంగబావి, అహోబిలం, రుద్రవరం, గుండ్ల బ్రహ్మేశ్వరం, బైరేనీ, ఎన్ఆర్ కుంట, ఓంకారం వంటి ప్రాంతాల్లో..600 కెమెరాలను అమర్చారు. చిమ్మచీకట్లోనూ ఇన్ఫ్రారెడ్ రేస్తో ఇవి చిత్రాలను తీయగలవు. కెమెరా ఏదైనా జంతువు నిల్చుంటే చాలు ఆటోమేటిక్గా ఇవి చిత్రాలను తీస్తాయి. అటవీ జంతువులు వర్షాకాలంలో ఎత్తయిన ప్రదేశాల్లో, ఎండాకాలంలో చల్లని నీటి కుంటల వద్ద సంచరిస్తూ ఉంటాయి. టైగర్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 66 పెద్ద పులులను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంత విస్తీర్ణం 355 చదరపు కిలో మీటర్లు ఉంది. ప్రత్యేక చిప్.. ఇన్ఫ్రారిడ్ కెమెరాల్లో ప్రత్యేక చిప్ ఉంటుంది. వాటి ముందు నిల్చుంటే చాలు ఇన్ఫ్రారిడ్ రేస్ ఇట్టే పట్టేస్తాయి. జంతువు/మనిషి ప్రతిబింబం ఇన్ఫ్రారిడ్ రేస్ క్యాప్చర్ చేసేస్తాయి. ఆ కెమెరాల్లో అమర్చిన చిప్తో చిత్రాలను అటవీ శాఖ అధికారులు డౌన్లోడ్ చేసుకుంటూ అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి జంతువులు సంచరించాయి, డేట్, టైమ్తో పాటు ఫోటోలో క్చాప్చర్ అవుతోంది. వీటి ద్వారా అటవీ ప్రాంతంలో ఎవరెవరూ గుట్టు చప్పుడు కాకుండా సంచరిస్తుంటారో తెలుసుకోవచ్చు.. రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం సీజ్ ఇప్పటి వరకు గుట్టుగా తరలిపోతున్న రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం అక్రమ తరలింపుకు చెక్ పడినట్లైంది. అర్థరాత్రి వేళలోనూ ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాల ద్వారా స్పష్టంగా ఛాయాచిత్రాలు, అనుమతి లేకుండా సంచరించే వారిని ఈ కెమెరాలు ఇట్టే పడేయడంతో అక్రమ వ్యాపారానికి కొంత చెక్ పడింది. అందులో భాగంగానే రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల అటవీ ప్రాంతంలో రూ.241 లక్షలు విలువ చేసే 366 టన్నుల ఎర్ర చందనాన్ని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. మొత్తం 548 కేసులు నమోదు చేసి, 719 మందిని అరెస్ట్ చేసి, 235 వాహనాలను సీజ్ చేశారు. అలాగే కడప–పొద్దుటూరులో రూ.26 కోట్లు విలువ చేసే 3,800 టన్నుల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు. 3,600 కేసులు నమోదు చేసి 50,300 మందిని అరెస్ట్ చేసి, 1900 వాహనాలను సీజ్ చేశారు. తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్కు ఎర్రచందనాన్ని తరలించారు. అక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేలం వేసి అమ్మేస్తారు. అటవీప్రాంతంలో గట్టి నిఘా : జేఎస్ఎన్ మూర్తి, ఫారెస్ట్ కన్సర్వేటర్, కర్నూలు ఎర్రచందనం అక్ర రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. వన సంపద కొల్లగొట్టే అక్రమార్కులపై కొరడా ఝుళిపించనున్నాం. వన్యప్రాణుల పరిరక్షణ మా బాధ్యత..ఇందుకు ఇన్ప్రారెడ్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాం. -
సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిఘా నీడన నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,300 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ పరీక్షల ను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నట్లు వివరించారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నాటికి రూట్ మ్యాప్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి తన హాల్టికెట్ నంబర్ను యాప్లో ఎంటర్ చేయగానే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలన్న రూట్ మ్యాప్ మొబైల్లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది.