Crypto Currency
-
క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్?
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!What are Jiocoins?Jiocoins are digital tokens issued on Polygon.Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025 -
2024లో 120 శాతం: 2025లో బిట్కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్లో బిట్కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్కాయిన్ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. -
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్సైట్కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్న అనంత్ అంబానీపై క్రిప్టోముఠా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్బైట్ హెడ్డింగ్లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్ఫామ్లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. -
క్రిప్టో కింగ్కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్లో మూడేళ్ల పాటు ట్రేడర్గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్టీఎక్స్ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
Sam Bankman-Fried : క్రిప్టో కింగ్కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్, ఎఫ్టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు. క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు. గత ఏడాది నవంబర్లో ఎఫ్టీఎక్స్లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రైడ్కు అనారోగ్య సమస్యలు అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తారా? దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్తో బిట్కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్ను దాటి రికార్డ్లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
రూ.83 వేల కోట్ల మోసం : జైలు శిక్ష పడుతుందని.. ప్రియురాల్ని ఇరికించాడు!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కోర్టు విచారణ సందర్భంగా తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ కుప్పకూలిపోవడంతో నా వల్ల చాలా మంది బాధపడ్డారు. అయితే, తానెవరినీ మోసం చేయలేదని, కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకోలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 83వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మోసానికి గాను ఏళ్ల తరబడి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో చేసిన నేరాన్ని తన ప్రియురాలు కరోలిన్ ఎల్లిసన్పై నెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 134 ఎఫ్టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు, 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు నష్టం’ వంటి కారణాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫ్రైడ్పై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ (టెలికమ్యూనికేషన్, టెక్నాలజీని వినియోగించి చేసే మోసం), మనీ ల్యాండరింగ్కు పాల్పడినందుకు డజనకుపైగా కేసులు నమోదు చేశాయి. వీటిపై న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ను విచారిస్తుంది. ప్రియురాల్ని ఇరికించి తాజాగా,ఫెడరల్ కోర్టు నిర్వహించిన విచారణకు ఫ్రైడ్, అతని తరుపు వాదించే లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రైడ్ను విచారిస్తున్న న్యాయమూర్తులతో రిస్క్-మేనేజ్మెంట్ టీమ్ను నియమించుకోవడం వంటి తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సమయంలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తన ప్రియురాలు, 2017లో ఫ్రైడ్ స్థాపించిన ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్ సీఈవో కరోలిన్ ఎల్లిసన్ను ఇరికించారు. ఆరు గంటల వాంగ్మూలంలో ‘మేం మార్కెట్లో అత్యుత్తమ ప్రొడక్ట్ను తయారు చేయగలమని భావించాము. కానీ ఊహించిన దానికి విరుద్ధంగా మారింది. దీంతో కస్టమర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. కంపెనీ దివాలా తీసింది’అని బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో తన ఆరు గంటల వాంగ్మూలంలో చెప్పాడు. నేరం రుజువైతే దశాబ్ధాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తనపై నమోదైన డజనకు పైగా కేసుల్లో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు. 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ ఎఫ్టీఎక్స్ కస్టమర్ ఫండ్లను అలమెడా రీసెర్చ్కు తరలించారని, ఎన్నికల ప్రచారం కోసం అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులకు 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. డిఫెన్స్ లాయర్ మార్క్ కోహెన్ ప్రశ్నలకు బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ స్పందిస్తూ.. స్పాన్సర్షిప్లు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే నిధులు ఎఫ్టీఎక్స్ కస్టమర్ల నుండి రాలేదని, కంపెనీ ఆదాయం,ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి పొందిన కమీషన్ల నుంచి వచ్చినట్లు తాను నమ్ముతున్నానని అన్నాడు. రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు తనకున్న ఆలమేడ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రియురాలే చేసింది 2022 జూన్లో క్రిప్టో మార్కెట్ క్రాష్ అయ్యింది. దీంతో పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అల్మెడ బ్యాలెన్స్ షీట్లను తప్పుగా మార్చమని చెప్పినట్లు ఫ్రైడ్ వివరించాడు. ఆ బ్యాలెన్స్ షీట్లను చూసే అవసరలేదని భావించానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సుదీర్ఘ విచారణలో ఫ్రైడ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం విచారణను కోర్టు వాయిదా వేసింది. ఎవరీ బ్యాంక్మన్-ఫ్రైడ్ క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్టీఎక్స్ను 2019లో బ్యాంక్మన్-ఫ్రైడ్ స్థాపించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఇది విస్తరించింది. 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీని ఆయన పూర్తి చేశారు. అనంతరం క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్లో మూడేళ్ల పాటు ట్రేడర్గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్టీఎక్స్ను ఏర్పాటు చేశారు. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. ఆయన సంపదలో అధిక మొత్తాన్ని స్వచ్ఛంద సేవకు ఇస్తానని హామీ ఇచ్చారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్మ్యాప్ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్మ్యాప్కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోరి్టంగ్ ఫ్రేమ్వర్క్ (సీఏఆర్ఎఫ్) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్లు తదితరాలకు సంబంధించిన గ్రూప్లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్తో.. తొలుత భరత్ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్లో ఉండే స్నేహితుడు ప్రశాంత్ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్కు పంపేవా డు. భరత్ తైవాన్లో ఉండే స్వాంగ్ లిన్కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్కేసులో డెడ్బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్కేస్లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్కేస్ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్స్టాగ్రామ్లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
ప్రపంచ ఆర్థిక నేరాలను నిరోధించాలి
గాందీనగర్: ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, క్రిప్టో కరెన్సీలతో సహా వివిధ అసెట్ క్లాస్ల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ఆయా సవాళ్లను నిరోధించడం కోసం గ్లోబల్ ఆర్కిటెక్చర్ను మరింత బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా చట్ట అమలు సామర్థ్యం పెరగాలని ఉద్ఘాటించారు. పన్ను ఎగవేతలు, అవినీతి, అక్రమ ధనార్జన నిరోధంపై ఇక్కడ జరిగిన జీ20 అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీ20 ప్రెసిడెన్సీ కింద, ఓఈసీడీ సహకారంతో దక్షిణాసియా ప్రాంతంలో పన్ను, ఆర్థిక నేర పరిశోధనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందుందని సీతారామన్ అన్నారు. కీలక భేటీలు.. ఇండోనేíÙయా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి, కెనడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్లతో కూడా ఆమె ఈ సందర్భంగా సమావేశమై, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. 3వ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)ప్రెసిడెంట్ జిన్ లిక్వెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల భేటీలో పాల్గొనడానికిగాను అమెరికా ఆర్థికమంత్రి జానెత్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు కూడా గాంధీనగర్కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీని సందర్శించారు. పట్టణ మౌలిక రంగంపై పెట్టుబడులు కాగా, జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్పై జరిగిన మరో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు పె ట్టుబడులను ఆకర్షించడం అవసరమని పేర్కొన్నా రు. అభివృద్ధి చెందుతున్న పలుదేశాల్లో కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి కీలక సవాలుగా మారిందని కూడా అన్నారు. -
భవిష్యత్తు కరెన్సీ క్రిప్టో.. డిజిటల్ ఆస్తిగా పరిగణన
న్యూఢిల్లీ: భారతీయుల్లో 37 శాతం మంది క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కరెన్సీగా భావిస్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ ఆస్తిగా 31 శాతం మంది పరిగణిస్తున్నారు. ఈ విషయాలు యూగోవ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. వెబ్ఈ, క్రిప్టో ఎకోసిస్టమ్పై ప్రజల్లో అవగాహన తెలుసుకునేందుకు భారత్ సహా 15 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 18 మధ్య దీన్ని నిర్వహించారు. మన దేశం నుంచి 1013 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో భాగం కావడంగా క్రిప్టోలను మన దేశీయులు పరిగణిస్తున్నారు. సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో ఆధారిత భవిష్యత్తును తెలియజేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ♦ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 92 శాతం మంది క్రిప్టో పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పారు. ♦ 37 శాతం మంది భవిష్యత్తు డబ్బుగా క్రిప్టోని పేర్కొంటే, భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా 31 శాతం మంది తెలిపారు. ♦ మరీ ముఖ్యంగా 17 శాతం మంది క్రిప్టోని స్పెక్యులేటివ్ సాధనంగా చెప్పగా, ఏకంగా 20 శాతం మంది అయితే స్కామ్లుగా చెప్పడం గమనార్హం. ♦ ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఇప్పటికే క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు. ♦ వచ్చే 12 నెలల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెడతామని 57 శాతం మంది తెలిపారు. ♦ క్రిప్టోలను పర్యావరణ అనుకూల టెక్నాలజీగా 57% మంది పేర్కొన్నారు. ♦ ఉత్తరాది, మధ్య, తూర్పు భారత్, ఈశాన్య రా ష్ట్రాల్లో అత్యధికంగా 94% మంది క్రిప్టో కరెన్సీ ల పట్ల ఆసక్తితో ఉంటే, పశ్చిమభారత్లో 92%, దక్షిణాది రాష్ట్రాల్లో 89% ఆసక్తి వ్యక్తమైంది. ♦ డేటా గోప్యత ముఖ్యమని 62% మంది చెప్పగా, ఇంటర్నెట్లో తమ గుర్తింపుపై తమకు మరింత నియంత్రణ అవసరమని 53% మంది తెలిపారు. ♦ క్రిప్టో మార్కెట్లో ఉన్న తీవ్ర ఆటుపోట్లు, స్కాముల భయం ఈ పరిశ్రమలో ప్రవేశానికి పెద్ద అడ్డంకులుగా ఈ సర్వే పేర్కొంది. అలాగే, క్రిప్టో ఎకోసిస్టమ్ సంక్లిష్టంగా ఉండడాన్ని కూడా అవరోధంగా పేర్కొంది. ♦ 53% మంది మెటావర్స్, 41% మంది వెబ్3, 42% మంది ఎన్ఎఫ్టీ గురించి అవగాహన ఉన్నట్టు ఉన్నారు. క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదు రతన్ టాటా స్పష్టీకరణ ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా తనకు క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి అనుబంధం ఏ రూపంలోనూ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో రతన్ టాటాకు పెట్టుబడులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బలంగా ఖండించారు. ‘‘నెటిజన్లూ ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీతో నాకు ఏ రూపంలోనూ అనుబంధం లేదు. క్రిప్టో కరెన్సీతో నాకు అనుబంధం ఉందంటూ ఏదయినా ప్రకటన కానీ లేదా ఆర్టికల్ను కానీ చూస్తే అది వాస్తవం కాదు. కేవలం నెటిజన్లను మోసపుచ్చేందుకే’’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. 2021లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’!
రతన్ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, ఆన్లైన్లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. I request netizens to please stay aware. I have no associations with cryptocurrency of any form. pic.twitter.com/LpVIHVrOjy — Ratan N. Tata (@RNTata2000) June 27, 2023 చదవండి👉 రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది. క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. లగ్జరీ లైఫ్కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్స్కైని గత ఏడాది డిసెంబర్లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్ చేసిన కోడ్ లేదా నంబరు లేదా టోకెన్లను వర్చువల్ డిజిటల్ అసెట్లుగా పరిగణిస్తారు. (ఇదీ చదవండి: ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు) -
‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్కు భారీ షాక్!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫ్రీడ్ అభ్యర్ధనని తిరస్కరిస్తూ ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ దివాలా తీసిన ఘటనలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అభ్యర్ధనను కోర్టు కొట్టిపారేసింది. ఫ్లిప్ ఫోన్ లేదంటే స్మార్ట్ ఫోన్ వినియోగించేందుకు ఫ్రీడ్కు అనుమతి ఇవ్వబోమని అమెరికా న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎఫ్టీఎక్స్ పతనం తర్వాత ఫ్రీడ్పై పలు దేశాల్లో ఆర్థిక నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. అ అభియోగాలతో అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్లో 250 మిలియన్ డాలర్ల బాండ్ పూచీకత్తుతో బెయిల్పై విడుదలయ్యారు.కోర్టు సైతం ఫ్రీడ్ను విడుదల చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది. దివాలా కేసులో నిజానిజాలు తేలే వరకు న్యాయ స్థానం చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ బెయిల్పై విడుదలైన అనంతరం కాల్ఫిపోర్నియాలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఎఫ్టీఎక్స్ ఫౌండర్ కోర్టు నిబంధనల్ని లైట్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఎస్ ఎఫ్టీఎక్స్ జనరల్ కౌన్సిల్ రైన్ మిల్లర్కు ఎన్క్రిప్టెడ్ మెసేజ్, ఫిబ్రవరి నెలలో థర్డ్ పార్టీ పీఎన్ను నెట్వర్క్ను రెండు సార్లు వినియోగించారు. తాజాగా కోర్టు విధించిన నిబంధనల్ని సడలించాలని ఫ్రీడ్ తన తరుపు లాయర్లతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫ్రీడ్ సాక్షుల్ని ప్రభావితం చేసేలా గతంలో పలు మార్లు ఇంటర్నెట్ను వినియోగించడం, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్లను పంపించారని ప్రతివాదులు కోర్టులో వాదించారు. అందుకు తగ్గ ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనల విన్న న్యాయవాది లూయిస్ ఏ.కప్లాన్ ఫ్రీడ్ అభ్యర్ధనల్ని తిరస్కరించారు. -
G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?) -
కూకట్పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం
-
‘క్రిప్టో’పై ఏకాభిప్రాయానికి భారత్ కసరత్తు..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. వీలైతే, జీ–20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనే ఇది కుదిరేలా చూసేందుకు ఆర్థిక స్థిరత్వ బోర్డు (ఎఫ్ఎస్బీ)తో కలిసి పని చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ ఈ వివరాలు తెలిపారు. క్రిప్టో అసెట్స్పై అంతర్జాతీయ ద్రవ్య నిధి రూపొందించిన నివేదికపై జనవరి 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో వర్ధమాన దేశాలు చర్చించుకున్నాయని సేథ్ చెప్పారు. ఫిబ్రవరి 23న బెంగళూరులో జరగబోయే జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా .. క్రిప్టో అసెట్స్ పాలసీపైనా ఏకాభిప్రాయ సాధనకు ఒక సెమినార్ జరగనున్నట్లు వివరించారు. దీని కోసం చర్చాపత్రం రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను కట్టడి చేసే దిశగా క్రిప్టో అసెట్స్పై అన్ని దేశాలూ కలిసి అంతర్జాతీయంగా నియంత్రించేలా చూసేందుకు జీ–20 అధ్యక్షత సందర్భంగా భారత్ కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తెలిపారు. ఎటువంటి నియంత్రణలు లేని క్రిప్టో కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్వెస్టర్లను నష్టాలపాలు చేస్తుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ వేల్యుయేషన్ 2023 జనవరి నాటికి 1 ట్రిలియన్ డాలర్ దిగువకు పడిపోయింది. -
బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? మీరేం అనుకుంటున్నారు?
‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్కు ముందు, బడ్జెట్కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది. సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు... కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్స్టర్స్కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక. యంగ్పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు. ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. కంపెనీల లే ఆఫ్లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్పై ఒక కన్ను వేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే. సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు. తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష. ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ. ‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష. ‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా! స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. -
గాంబ్లింగ్ తప్ప మరోటి కాదు, క్రిప్టోపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు. క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. -
94 శాతం సంపద ఆవిరి, బిలియనీర్కు మరో ఊహించని షాక్!
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్గా పేరు సంపాదించిన ఎఫ్టీఎక్స్ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్కు ఊహించని షాక్ తగిలింది. ఫ్రైడ్ అనుమానాస్పద రీతలో నిధులను తరలించారనే ఆరోపణలతో బహమాస్లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహామాస్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దీని తర్వాత ఫ్రైడ్ని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మాన్హట్టన్లోని యూఎస్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ను అరెస్టు చేసినట్లు ధృవీకరించినా, అతనిపై ఉన్న ఆరోపణల గురించి తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ $10 బిలియన్ల FTX కస్టమర్ల నిధులను అల్మెడకు రహస్యంగా తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కనీసం $1 బిలియన్ల కస్టమర్ల నిధులు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ అంశంపై బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ రాయిటర్స్తో మాట్లాడుతూ.. కంపెనీ నిధులను ఎప్పుడూ రహస్యంగా బదిలీ చేయలేదని చెప్పారు. నవంబర్, డిసెంబరు చివరిలో జరిగిన ఇంటర్వ్యూలతో పాటు బహిరంగాను బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ తన రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యాలను అంగీకరించాడు. అయితే మోసం చేశాడనే ఆరోపణలను మాత్రం అంగీకరించలేదు. తన యాజమాన్య వ్యాపార సంస్థ అయిన అల్మెడ రీసెర్చ్లోని నిధులతో FTXలో కస్టమర్ ఫండ్స్ని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తరలించలేదని వివరణ ఇచ్చాడు. కాగా నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయని పేర్కొంది. చదవండి ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్! -
నిండా ముంచిన క్రిప్టో.. రూ.27 లక్షలు టోకరా
సాక్షి, హైదరాబాద్: తొలుత రూ.10వేలు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి లాభం రాలేదు. ఆ తర్వాత రూ.20వేలు పెట్టాడు, దీనికి లాభాలు రాలేదు. మళ్లీ ఒకేసారి రూ.80వేలు పెట్టాడు.. దీనికి కూడా ఒక్క రూపాయి రాలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కోటీశ్వరుడిని కావాలనే ఆశతో రూ.లక్షలు ముట్టజెప్పాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు ఓ వ్యక్తి. గాంధీనగర్కు చెందిన శ్రీనివాస్ ఫోన్ నంబర్ను గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. తాము చెప్పినట్లు చేస్తే తక్కువ టైంలో కోటీశ్వరుడిని చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు. అందుకు అంగీకరించిన శ్రీనివాస్ పైన చెప్పుకున్న విధంగా పెట్టుబడి పెట్టుకుంటూ పోయాడు. రూ.80వేల తర్వాత ఒకేసారి రూ.2.50 లక్షలు పెట్టాడు. దీనికి లాభాలు కనిపించాయి, తీసుకునేందుకు వీలు లేకుండా ఆ డబ్బును సైబర్ నేరగాళ్లు ఫ్రీజ్ చేశారు. లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయి పలు దఫాలుగా రూ.27లక్షలు పెట్టాడు. ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మంగళవారం సిటీసైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం : -
700 ఖాతాల నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి!
క్రిప్టో మార్కెట్లో అలజడి. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ దివాలా తీసింది. ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కొద్దిరోజుల క్రితం1600 కోట్ల డాలర్ల (రూ.1 లక్షా 36 వేల కోట్లు)తో ప్రపంచ ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు 1లక్షా 28వేల కోట్ల రూపాయలు నష్టపోయి బిలియనీర్ కాస్తా చిక్కుల్లో పడ్డాడు.అందుకు కారణం ఓ ఉద్యోగి. నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్ చేసింది ఎవరో కాదు ఆ సంస్థ ఉద్యోగి నిషాద్ సింగ్. నిషాద్ వల్ల శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద 1లక్షా 28వేల కోట్లు తగ్గింది నిషాద్ సింగ్ ఎవరు? ►ఎన్నారై నిషాద్ సింగ్ ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన ఎఫ్టిఎక్స్ దివాలా తీసేందుకు కారణమైన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారు. నిషాద్ సింగ్తో పాటు మరో 8 మంది రూమ్మెట్స్. వారిలో ఎఫ్టిఎక్స్ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఒకరు. ►బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నిషాద్ సింగ్ పట్టభద్రుడయ్యాడు. ►ఆ తర్వాత నిషాద్ సింగ్ ఫేస్బుక్లో మెషిన్ లెర్నింగ్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. డిసెంబర్ 2017లో ఎఫ్టీఎక్స్ కాంపిటీటర్ అలమేడ రీసెర్చ్లో చేరారు. ►అలమెడ రీసెర్చ్లో 17 నెలల పాటు ఇంజినీరింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఏప్రిల్ 2019లో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్కి మారాడు. అప్పటి నుండి అదే టాప్ పొజీషన్లో కొనసాగుతున్నాడు. ►నిషాద్ సింగ్, శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్, గ్యారీ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్యారీ వాంగ్)లు క్రిప్టో ట్రేడర్లకు అనుగుణంగా క్రిప్టో మార్కెట్ను, ఫండ్స్ను కంట్రోల్ చేస్తారని కాయిన్డెస్క్ తెలిపింది. ►రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్టీఎక్స్ కాంపిటీటర్ అలమెడ రీసెర్చ్లో 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేశారు. ఆ ఘటన తర్వాత శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫారెన్స్లో సంస్థలోని ఇద్దరు ఉద్యోగులు, నిషాద్ సింగ్ , గ్యారీ వాంగ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యారీ వాంగ్ మాట్లాడుతూ ఎఫ్టీఎక్స్ నుంచి.. అలమెడ రీసెర్చ్కు సెండ్ చేసిన నిధుల గురించి తనకు తెలుసని నివేదించారు. కాగా, ప్రస్తుతం అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. చదవండి👉 షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు -
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ విలువ
-
చరిత్రకెక్కిన యంగ్ సీఈఓ.. రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి, 94 శాతం సంపద కరిగిపాయే!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. జీవితంలో ఒక్కోసారి అకస్మిక ప్రమాదాలు , అదృష్టాలు, అలానే నష్టాలు.. ఇవన్నీ సడన్ సునామీలా మన లైఫ్లోకి వచ్చి పలకరిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ యంగ్ బిలియనీర్కి భారీ షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు పొయాయి. ఎలా అని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. క్రిప్టో కరెన్సీల (Cryptocurrency) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న వ్యవస్థ. అందుకే ఇందులో షాకింగ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా క్రిప్టో ఎక్స్చేంజీ కంపెనీ అయిన FTX ఫౌండర్, సీఈఓ, అయిన సామ్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. తన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. బ్లూమ్బెర్గ్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్గా చరిత్రలోకెక్కారు ఈ యంగ్ బిలియనీర్. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టిఎక్స్ను( Crypto Exchange FTX) తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్( Binanace) కొనుగోలు చేస్తున్నట్లు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ సంపద కరిగిపోయింది. కాయిన్డెస్క్ ప్రకారం, సామ్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ FTX అమ్మకంపై వార్త వెలువడే ముందు $15.2 బిలియన్ల విలువ ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత అతని సంపద నుంచి దాదాపు $14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి. బినాన్స్ హెడ్ చాంగ్పెంగ్ జావో ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫాం అయిన బినాన్స్.. FTXను కొనుగోలు చేయడానికి తమ కంపెనీ ఆసక్తి చూపిస్తుందని, డీల్ కూడా కుదిరిందని తెలిపారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
ఉగ్ర ‘టూల్కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్, యూకేలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత?
బ్రిటన్ 47వ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టడంతో ఆదేశంలో క్రిప్టో కరెన్సీపై మరోసారి చర్చ మొదలైంది. క్రిప్టో కరెన్సీని ఆర్ధిక వ్యవస్థలో భాగం చేసేందుకు సునాక్ డిజిటల్ కరెన్సీని చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్కాయిన్ వినియోగించాలనుకునే వారిలో రిషి సునాక్ సైతం ఉన్నారు. 500 ఏళ్లుగా ఆర్ధిక స్థిరత్వానికి కంచుకోటగా ఉన్న బ్రిటన్ గడ్డు పరిస్థితుల్లోకి జారుకుంది. దీంతో ఆర్ధిక నిపుణుడైన సునక్..దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కే దిశగా ప్రయత్నాలు చేశారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఛాన్సలర్గా ఉన్న సమయంలో యూకేని క్రిప్టోకరెన్సీకి కేంద్రంగా మార్చాలనే తన కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే క్రిప్టో నిపుణులు యూకే ప్రధానిగా సునక్ ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా పాలన పగ్గాలు నిర్వహిస్తున్న సమయంలో సునక్ స్టేబుల్కాయిన్లకు సంబంధించిన నియంత్రణ సంస్కరణలను ప్రతిపాదించారు. క్రిప్టో అసెట్స్ టెక్నాలజీ హబ్గా యూకేని మార్చడం నా ఆశయం. మేం పెట్టిన ప్రతిపాదనలు సంస్థలు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయ పడతాయని నాడు ఓ సందర్భంలో అన్నారు. 2021లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), లేదా ‘బ్రిట్కాయిన్’ ను 2025 చివరి నాటికి యూకే ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని సునక్ ప్రతిపాదించారు. ప్రయోజనాల్ని హైలెట్ చేశారు. ప్రభుత్వం రెండుసార్లు మారడం వల్ల సునాక్ క్రిప్టో ప్లాన్లు వాయిదా పడింది. అయితే, ఇప్పుడు సునక్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని యూకే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
సైబర్ మాయ.. లక్షలు పాయె
సాక్షి, హిమాయత్నగర్: ‘‘నగరానికి చెందిన పావని ఫోన్ నంబర్ను ఓ వ్యక్తి వాట్సప్ గ్రూప్లో యాడ్ చేశాడు. మీరు చెప్పినట్లుగా విని నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యానంటూ ఏవో కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం. వీటిని చూసిన పావని తాను కూడా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరాలిని కావొచ్చనే ఆశతో డబ్బు పెట్టి మోసపోయింది.’’ ‘‘నాలుగు రోజుల క్రితం హైటెక్సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేసే యువతికి ఇన్స్ట్రాగామ్లో ఓ వ్యక్తి పరిచయమై క్రిప్టోలో డబ్బు పెట్టమన్నాడు. అతగాడి మాటలకు బుట్టలో పడ్డ యువతి పలు దఫాలుగా రూ.92లక్షలు పెట్టుబడి పెట్టినాక మాయగాడి ఇన్స్ట్రాగామ్, వాట్సప్ మాయమైంది.. అప్పటికి గాని యువతికి అర్థం కాలేదు తాను మోసపొయినట్లు’’. ఈ రెండు ఉదాహారణలే కాదు ఇలా వారంలో పది, పదిహేను మంది ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ వలలో పడి మోసపోయిన బాధితులు సైబర్క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోసపోతున్న వారిలో వందకు వందశాతం విద్యావంతులే ఉండటం అందులోనూ ఐటీ రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఉండటం మరింత హాస్యాస్పదానికి గురిచేస్తుంది. కోటీశ్వరులైనట్లుగా నకిలీ ఆధారాలతో బురిడీ ముక్కూ మెహం తెలియని కొందరు వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటుంటే మిగత వారు రాజస్థాన్, యూపీ, అస్సాంలకు చెందిన వారు ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్, డబ్బు వచ్చినట్లుగా వారికి వారే వాట్సప్ చాటింగ్లో గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు. పెట్టుబడి పెడుతున్న వారిని నమ్మించేందుకు రూ.5వేలకు 10వేలు ఇవ్వడం లేదా రూ.10వేలకు 20వేలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిగో లాభాలు వస్తున్నాయి కదా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు పెట్టేస్తూ అప్పులపాలౌవుతున్నారు. హెచ్చరిస్తున్నాం అయినా వలలో పడిపోతున్నారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ అధికారిక పేజీల్లో ఇన్వెస్ట్మెంట్లు, క్రిప్టో కరెన్సీలు చేసి మోసపోవద్దంటూ పోలీసులు పోస్టులు పెడుతున్నారు. ఆయా కమీషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లకు సంబం«ధించిన వారు కూడా అవగాహాన కలి్పస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. కొత్తవారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ లక్షల రూపాయిలు మోసపోతున్నారు. – కేవీఎం ప్రసాద్, సైబర్క్రైం ఏసీపీ -
మొబైల్కు మెసేజ్.. క్రిప్టో పేరుతో లూటీ!
లక్కీ డ్రా గిఫ్టు పేరుతో ప్రజలు మొబైళ్లకు ఓటీపీ పంపించి వారి బ్యాంకు అకౌంట్లను కాజేసే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆశ చూపించి దోచేస్తున్నారు. దీనికి ఇన్స్టా గ్రాంలో చురుకుగా ఉంటున్న యువతనే టార్గెట్ చేసుకున్నారు. మెసేజ్లు, లింక్లు పంపించి పలు నకిలీ కంపెనీల బ్రోచర్లను చూపి అధిక లాభాల పేరుతో వలలో వేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ మోజులో పడి మోసపోతున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా ఉన్నారు. ఎలా వంచనకు పాల్పడతారంటే అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్, ఆ తరువాత కాలంలో ఈ సైబర్ డబ్బు విలువ పెరిగింది. దీంతో వంచకులు క్రిప్టో బాట పట్టారు. యువత, టెక్కీలు చాలామంది ఇన్స్టా వినియోగిస్తారు. సైబర్ మోసగాళ్లు వారికి లింక్లు పంపుతూ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే అచిర కాలంలోనే భారీ లాభాలు వస్తాయని చెబుతారు. పెట్టుబడి పెట్టాక అకౌంట్ను, ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేస్తారు. దీంతో బాధితులు మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తారు. సైబర్ వంచకులు ఇతరుల ఇన్స్టా అకౌంట్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడతారు. వారు పంపించిన లింక్, యుఆర్పీఎల్ కొద్దిరోజుల్లోనే డీ యాక్టివేట్ అవుతాయి. వంచకులు నగదు జమచేసుకునే బ్యాంకు అకౌంట్లు కూడా నకిలీల పేరుతో ఉంటాయి. దీంతో కేసుల విచారణ కష్టంగా ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే అధికారిక కంపెనీలు ఏవి, వాటికి అనుమతులు ఉన్నాయా? ఇలా పలు విషయాలను తెలుసుకున్న తరువాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే లింక్లను నమ్మి మదుపు చేస్తే మోసపోతారని సైబర్ నిపుణులు తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయని దుండగులు నకిలీ సక్సెస్ స్టోరీలను పోస్ట్ చేసి మాయకు గురిచేస్తారు. కాబట్టి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్స్టేషన్ సీఐ ఆర్.సంతోష్రామ్ తెలిపారు. లక్షల రూపాయలు పోయాయి నగరంలో పేరుపొందిన ఐటీ కంపెనీ ఉద్యోగి ఇన్ స్టా ఖాతాకు క్రిప్టోలో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయల లాభం పొందవచ్చని ఒక సక్సెస్ స్టోరీ వచ్చింది. స్నేహితులు పంపిన లింక్ కదా అని నమ్మి దశలవారీగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులు గడిచినప్పటికీ లాభాలు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు మాయమైంది. దీనిపై బాదితుడు సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్! -
టెకీకి టోకరా..
హిమాయత్నగర్: ఇన్స్ట్రాగామ్ వేదికగా పరిచయమైన ఇద్దరు వ్యక్తులు క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేశారు. కొద్దిరోజులు సాన్నిహిత్యంగా మాట్లాడిన అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కోటీశర్వురాలిని చేస్తానంటూ నగరానికి చెందిన ఓ టెకీకి చైనీయుడు వల వేశాడు. వలలో పడ్డ టెకీ పెద్ద మొత్తంలో మోసపోయి సిటీ సైబర్క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..జూబ్లిహిల్స్కు చెందిన యువతి హైటెక్సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన హువాంగ్వినూ పేరుతో ఇన్స్ట్రాగామ్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రతిరోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. క్రమంలో క్రిప్టో కరెన్సీకు సంబంధించిన పోస్టులను, కోట్లు గెలుచుకున్నట్లుగా కొందరి ఫొటోలతో అభిప్రాయాలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రతిపోస్ట్కు లైక్ కొడుతున్న టెకీ ఓ రోజు తాను కూడా చేయొచ్చా అంటూ సంప్రదించింది. తక్కువ టైంలో తక్కువ సంపాదనతో కోటీశ్వరురాలిని చేస్తానంటూ భరోసా ఇచ్చాడు. అంతే కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే పలు దఫాలుగా రూ.91లక్ష పెట్టుబడి పెట్టింది. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోగా ఉన్నవి ఇవ్వకుండా వేధిస్తున్న క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్క్రైం పీఎస్ మెట్లు ఎక్కింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. మరో కేసులో... సుల్తాన్బజార్కు చెందిన ఓ యువకుడికి రీకా పేరుతో ఓ అమ్మాయి పరిచయమైయ్యింది. ఫోన్లో సైతం ఇద్దరూ సంభాíÙంచుకుంటున్నారు. తాను ఇన్వెస్టర్ని అంటూ మాటలు కలిపింది. రీకా మాటలకు బుట్టలో పడ్డ యువకుడు పలు దఫాలుగా రూ.42లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా మోసపోయినట్లు తేరుకుని ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఒక్కసారి ప్రచారానికి రండి అన్నా) -
ఝన్ఝన్వాలా తరువాత నేనే! కట్ చేస్తే..ఓ టీస్టాల్ కుర్రోడి వైరల్ స్టోరీ
బెంగళూరుకు చెందిన ఒక టీ స్టాల్ ఓనర్ ఏకంగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులను యాక్సెస్ చేయడం సెన్సేషన్గా మారింది. అది కూడా 'ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్ అవుట్' టీ స్టాల్ నిర్వహిస్తూ బిట్కాయిన్ లావాదేవీలు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిన 22 ఏళ్ల శుభమ్ సైనీ వైరల్ స్టోరీ.. శుభమ్ సైనీ రేవారి, ఇందిరా గాంధీ యూనివర్సిటీ నుంచి బీసీఏ డ్రాప్ అవుట్. ఇంటర్నషిప్ చేద్దామని బెంగళూరు వచ్చాడు. అతనికి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో క్రిప్టో ప్రపంచం అతనికి పరిచయమైంది. రాకేష్ ఝన్ ఝన్వాలా అంతటివాడిని కావాలని కలలు కన్నాడు. అలా 2020లో, మార్కెట్ 60శాతం క్రాష్ అయిన సమయంలో లాభాలను ఆర్జించాలనే ఆశతో క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. రూ. 1.5 లక్షలపై వెయ్యి శాతం లాభాలు గడించాడు. అలా రూ. 30 లక్షల మేర లాభాలు రావడంతో గాల్లో తేలిపోయాడు. 2021 మార్కెట్ పతనంతో ఆ ఆనందం గాల్లోనే కలిసిపోయింది. ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడికే చేరాడు. కానీ అక్కడితో కుంగిపోలేదు. ఏమైనా చేయాలనే పట్టుదలతో కేవలం 30వేల పెట్టుబడితో ఆరు నెలల క్రితం టీ దుకాణం ప్రారంభించాడు. మట్టికప్పులో రూ. 20 లకి టీని విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. 'చాయ్ విత్ క్రిప్టో' దుకాణం చాయ్ లవర్స్ హ్యాంగ్అవుట్గా మారిపోయింది. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ఝన్వాలా తరువాత నేనే అనుకున్నా. కానీ అనుకున్నట్టుగా జీవితం సాగుదుగా. అనుకోని నష్టాలతో కంగిపోలే.. ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎదగాలని భావించాను. అందుకే చిన్నగా టీ స్టాల్ మొదలు పెట్టాను. ముఖ్యంగా పర్యావరణహితంగా మట్టి కప్పులనే వాడుతున్నాను. వారానికి సగటున 20-30 లావాదేవీలు జరుగుతాయనీ, తన పేమెంట్ సిస్టం యూజర్లకు బాగా నచ్చుతోందని శుభమ్ చెప్పారు. యూపీఐ లాంటి నగదు లావాదేవీలతోపాటు కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు తన వద్ద చేయవచ్చని తెలిపాడు. దీంతోపాటు నార్త్ ఇండియా వంటకాలతో ‘క్లౌడ్ కిచెన్’ తో మరింత ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అతిపెద్ద గ్రీన్ అండ్ సక్సెస్పుల్ కేఫ్ బ్రాండ్ యజమానిగా ఎదగాలని శుభమ్ సైనీ భావిస్తున్నాడు. దీంతో నెటిజనులంతా ఆల్ ది బెస్ట్ బ్రో అంటు విషెస్ అందిస్తున్నారు. -
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు) సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫారమ్ క్రిప్టో డాట్కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చదవండి: Starbucks: స్టార్బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే? ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్కాంకు ఇవ్వాలని ఆదేశించారు. -
డెత్ డ్రాప్.. డ్రగ్ ట్రాప్! ఎవరికీ చిక్కకుండా కొత్త పంథాలో ‘సరుకు’ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి. ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య డార్క్ వెబ్లో ఆర్డర్లు తీసుకుని.. హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు. బికర్మీ యాప్లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్వెబ్లోని డ్రగ్స్ ఫోరమ్స్లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. ►హైదరాబాద్కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్కుమార్, పి.భూషణ్రాజ్ డార్క్వెబ్లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు. ►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ను పంపిస్తున్నారు. కొరియర్లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు. నిఘా పెట్టి.. ఈ డ్రగ్ నెట్వర్క్పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్నగర్, చాదర్ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్ను సరఫరా చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. –సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్కు చెందిన రోషన్అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్నంబర్పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్కాంగ్లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్టీఎక్స్ అనే ట్రేడింగ్లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
క్రిప్టోలను నిషేధించాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్బీఐ అభిప్రాయం‘ అని లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా? -
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్కాయిన్ ఈటీఎఫ్లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్లో క్రిప్టో ఎక్సేంజ్లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్ఎక్స్లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్కాయిన్లో లాభం వచ్చి, బిట్ కాయిన్లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్కాయిన్లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్కాయిన్ ఈటీఎఫ్లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్లో క్రిప్టో ఎక్సేంజ్లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్ఎక్స్లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్కాయిన్లో లాభం వచ్చి, బిట్ కాయిన్లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్కాయిన్లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్ను ఎక్సే్ఛంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
ఎలన్ మస్క్ వీడియోలు చూస్తున్నారా?
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పే క్రిప్టో ప్రిడిక్షన్స్ నమ్ముతున్నారా? ఆయన పేరు మీదున్న యూట్యూబ్ వీడియోలు, ట్విట్ లింక్స్ ఓపెన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరస్తులు ఎలన్ మస్క్ ఫోటోలు, వీడియోలు చూపించి మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు తెలివి మీరారు. ఎలన్ మస్క్ ఫోటోల్ని, వీడియోల్ని చూపించి అమాయకుల్నే కాదు బ్రిటిష్ ఆర్మీని సైతం మోసం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గార్డియన్ రిపోర్ట్ ప్రకారం.. బ్రిటిష్ ఆర్మీకి చెందిన ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు వాటి పేర్లను మార్చారు. పనిలో పనిగా అధికారిక ఆర్మీ ప్రొఫైల్ ఇమేజెస్కు బదులు మంకీ కార్టూన్ ఇమేజ్ను అప్డేట్ చేశారు. ఆర్మీ రిక్రూట్ట్మెంట్తో పాటు ట్రైనింగ్ గురించి అలర్ట్ ఇచ్చారు. ఇక యూట్యూబ్లో సైతం ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన వీడియోల్ని టెలికాస్ట్ చేశారు. ఎలన్ మస్క్ చెప్పినట్లు చేస్తే క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాల్ని గడించవచ్చని నమ్మించారు. దీంతో అప్రమత్తమైన బ్రిటిష్ ఆర్మీ దేశ ప్రజలకు క్షమాణలు చెప్పింది. హ్యాకింగ్ జరిగిందని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం హ్యాకింగ్ ఎవరు చేశారు. ఎక్కడి నుంచి చేశారనే అంశంపై బ్రిటిష్ ఆర్మీ విచారణ ముమ్మరం చేసింది. -
క్రిప్టో కరెన్సీతో ముమ్మాటికీ ప్రమాదమే
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికీ ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంచేశారు. అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్స్ట్రమెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడు దల సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభా వం ఎకానమీలపై ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ రికవరీ బాటలో పయనిస్తోంది. ఎటువంటి సవాళ్లనైనా తట్టుకోడానికి వీలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్ట మూలధనాన్ని కొనసాగిస్తున్నాయి. ► 2021లో అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం 10.1 శాతం పెరిగితే 2022లో ఇది 5 శాతానికి పడిపోతుందని అంచనా. ► దేశీయంగా బ్యాంకింగ్ మొండిబకాయిల నిష్పత్తి మార్చిలో ఆరేళ్ల కనిష్టం 5.9 శాతానికి పడిపోయింది. 2023 మార్చి నాటికి మొండిబకాయిలు 5.3 శాతానికి దిగివస్తాయని భావిస్తున్నాం. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. దీర్ఘకాలంలో రూపాయి స్థిరత్వం ఆర్బీఐ లక్ష్యం. ► మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ విదేశీ రుణ భారం 47.1 బిలియన్ డాలర్లు పెరిగి, 620.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే జీడీపీ నిష్పత్తిలో చూస్తే 2021 మార్చిలో 21.2%గా ఉంటే, 2022 మార్చిలో 19.9%కి తగ్గింది. ► పరిశ్రమకు రుణ వృద్ధి మే 2022లో 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఈ రేటు 11.8 శాతం పెరిగింది. పరిశ్రమకు రుణ వృద్ధి 2021 మేలో కేవలం 0.2 శాతం కావడం గమనార్హం. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వినియోగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. -
క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్ఎఫ్టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్టూపీర్ అంటే ఎక్సే్ఛంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్ల్లో అయితే ఆయా ప్లాట్ఫామ్లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. -
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
భారత దేశ చరిత్రలో 90వేల కోట్ల బిట్ కాయిన్ స్కాం..చేసింది ఎవరంటే!
ఈ ఏడాది మార్చి నెలలో భారీ బిట్ కాయిన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్పై కోర్ట్లో కేసు నడుస్తుండగా.. తాజాగా ఆ మొత్తం కుంభ కోణం విలువ సుమారు రూ.90,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు పోంజి స్కాం చేశాడు.ఇక, బిజినెస్ వాడుక భాషలో పూంజి స్కాం అంటే..ఉదాహరణకు..నిందితుడు లక్షమందిని మోసం చేయాలని అనుకుంటే..ఆ డిజిట్కు రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తాడు.ఇందుకోసం తన మాట విని బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పెట్టిన మొత్తాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇస్తాడు. ఆ మాటలు నమ్మిన మదుపర్లు బిట్ కాయిన్లపై భారీగా ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పినట్లుగానే అమాయకులైన ఇన్వెస్టర్లకు మొదట్లో లాభాలు చూపిస్తారు. ఆ లాభాలతో నిందితులకు పబ్లిసిటీ పెరుగుతుంది. దీంతో అనతి కాలంలో స్కాం టార్గెట్ను రీచ్ అవ్వొచ్చు. అలా టార్గెట్ రీచ్ అయితే ఇన్వెస్టర్లకు ఆదాయం చూపించడం మానేస్తారు. ప్రతినెలా డబ్బులే డబ్బులు సేమ్ ఇలాగే పైన అమిత్ భరద్వాజ్ కుంభకోణం విషయంలో జరిగింది. భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్తో 18 నెలల పాటు బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో ఉండగా..ఈడీ బిట్కాయిన్ కుంభకోణానికి పాల్పడిన నిందితుల క్రిప్టో వాలెట్కు యాక్సెస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరుల సహకారంతో అమిత్ భరద్వాజ్ (ఈ ఏడాది జనవరిలో మరణించాడు) 80వేలకు పైగా బిట్కాయిన్లు సేకరించినట్లు తాము నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. రూ.90వేలకోట్ల స్కాం ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిట్కాయిన్ స్కాంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అమిత్ చేసిన పోంజి కుంభ కోణం విలువ రూ.90వేల కోట్లకు పైగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పోంజీ స్కాం సూత్రధారి అమిత్ భరద్వాజ్ మదుపర్ల నుంచి వచ్చిన వేల కోట్లతో 385,000 నుండి 600,000 మధ్య బిట్ కాయిన్లను సేకరించారు. వాటి విలువ సుమారు వన్ ట్రిలియన్ కంటే ఎక్కువేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్కాంలో నిందితుడిపై 40 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 40ఎఫ్ఐఆర్లు ఈడీ విచారణతో బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. మహారాష్ట్ర, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు బిట్ కాయిన్ కుంభ కోణంలో బాధితులు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయారు. దాదాపు ప్రస్తుత బిట్ కాయిన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే? ప్రతి బిట్ కాయిన్ విలువు రూ. 23,57,250గా ఉంది.పూణే పోలీసులు 60వేల మందికి పైగా యూజర్లు, ఐడీ, ఈమెయిల్ అడ్రస్ల ఆధారాలకు అనుగుణంగా ఆ బిట్ కాయిన్ స్కాం రూ.90,500 కోట్లని అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్ట్లను కోరుతున్నారు. చదవండి👉 యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! -
క్రిప్టోకరెన్సీపై బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వంటి క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్లు బూటకమని కొట్టిపారేశారు. గతంలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులని అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని..ఎవరో నిర్ణయించిన రేటుకు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పారేశారు. అయితే తాజా బిల్ గేట్స్ వ్యాఖ్యలు క్రిప్టో మార్కెట్లో సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరవ్వగా..గేట్స్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కాలిఫోర్నియా బర్కిలీ టెక్ క్రంచ్ కార్యక్రమంలో గేట్స్ ఎన్ఎఫ్టీలపై మాట్లాడుతూ " కోతుల ఖరీదైన డిజిటల్ చిత్రాలు ప్రపంచాన్ని మెరుగుపరుస్తాయి" అని వ్యంగ్యంగా అన్నారు. 2015లో తాను ప్రారంభించిన క్లైమేట్ ఫోకస్డ్ ఫండ్, బ్రేక్త్రూ ఎనర్జీ వెంచర్స్కు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు అవసరమయ్యే రసాయనాలు, ఉక్కు ఉత్పత్తి వంటి పరిశ్రమలలో పనిచేయడానికి సిలికాన్ వ్యాలీ ఇంజనీర్లను నియమించుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు గేట్స్ తెలిపారు. బిట్ కాయిన్ ఢమాల్ బిట్కాయిన్ సోమవారం 15% కంటే ఎక్కువ పడిపోయింది. మంగళవారం సైతం 5.4శాతం నష్టపోయింది. అయితే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోవడానికి అమెరికా ద్రవ్యోల్భణంతో ఇతర అంశాలు అందుకు కారణమని తెలుస్తోంది. క్రిప్టోతో పాటు బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్ (బీఏవైసీ)తో సహా ప్రసిద్ధ ఎన్ఎఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు..నష్టం మామూలుగా లేదుగా!
లాభాలే..లాభాలని బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అనుభవంతో పనిలేకుండా, డబ్బులున్నాయని పెట్టుబడులు పెట్టారా? అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు తప్పదిక! మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను రోడ్డున పడేస్తుంది. ఇన్నిరోజులు లాభాలతో ఇన్వెస్టర్లకు స్వర్గదామంగా మారిన బిట్కాయిన్ ఇప్పుడు నష్టాలతో కుదేలవుతుంది. ఇందులో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు (జూన్ 13) జనవరి 2021 తరువాత తొలిసారి 1ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు క్రిప్టో డేటా బ్లాగ్ 'కాయిన్ మార్కెట్ క్యాప్' తెలిపింది. 2021 నవంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, కొత్తగా పుట్టుకొచ్చిన మంకీ పాక్స్ లాంటి వైరస్లు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సెంట్రల్ బ్యాంకుల (మన దేశంలో ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు క్రిప్టో మార్కెట్ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే గత రెండు నెలల వ్యవధిలో ఇన్వెస్టర్లు 1 ట్రిలియన్ వ్యాల్యును కోల్పోయింది. 18నెలల్లో లక్షల కోట్లు ఉఫ్ ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ గడిచిన 18నెలల కాలంలో రోజులో 10 శాతానికి పైగా క్షీణించి, 18 నెలల కనిష్ట స్థాయి $23,750కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం తగ్గింది. చిన్న కాయిన్ ఈథర్ 15 శాతం పైగా పడిపోయి $1,210కి చేరుకుంది. -
రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్లో భాగమేనా?
రష్యా మరోసారి తన ఊగిసలాటను ప్రపంచానికి ప్రదర్శిస్తోంది. యుద్ధంతో కాదు.. ఈసారి క్రిప్టోకరెన్సీ చట్టబద్ధత విషయంలో!. ముఖ్యంగా ఉక్రెయిన్ యద్ధం మొదలైనప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డబుల్ గేమ్ నడిపిస్తున్నారు. ఇదంతా పాశ్చాత్య దేశాల క్రిప్టో ఇన్వెస్టర్లను ముంచడానికే అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకున్నా.. గత కొన్ని నెలలుగా బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అంతా కలిసి మల్లాగుల్లాలు పడుతున్నా క్రిప్టోకరెన్సీ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తాజాగా క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు రష్యాలో చెల్లవంటూ కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. ఈ మేరకు.. రష్యా పార్లమెంట్ దిగువ సభలో ఓ ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. జూన్ 7వ తేదీన ఈ చట్టాన్ని ప్రతిపాదించగా.. డిజిటల్ చెల్లింపులు చెల్లవంటూ చేసిన తీర్మానానికి ఆమోద ముద్ర లభించడమే తర్వాయిగా మిగిలింది. రష్యాకు అధికారిక కరెన్సీ రూబుల్. ఇతర ఏ తరహా చెల్లింపులు కుదరవంటూ స్పష్టత ఇచ్చింది ఆ చట్టం. దేశీయ-విదేశీ చెల్లింపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. తాజా ప్రకటనతో ఎక్కువగా నష్టపోయేది యూరప్, ఉత్తర అమెరికా ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ప్రతిపాదన కంటే ముందు రష్యాలో విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్.. విదేశీ చెల్లింపుల కోసం క్రిప్టో తరహా పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వాణిజ్య శాఖ మంత్రి డెనిస్ మంట్రురోవ్ కూడా క్రిప్టో పేమెంట్స్కు అనుకూల వ్యాఖ్యలే చేశాడు. ఏ క్షణమైనా క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత రష్యాలో లభించవచ్చని ఒక ప్రకటన చేశారు. ఆ ధైర్యంతో పాశ్చాత్య దేశాల నుంచి భారీగా క్రిప్టో ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. తాజా నిషేధంతో వాళ్లంతా పూర్తిగా మునిగిపోయినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా ఇలా డబుల్ గేమ్ ఆడడం కొత్త విషయమేమీ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. సుమారు లక్షన్నర మంది ఇన్వెస్టర్లు నష్టపోగా.. అమెరికన్ ఇన్వెస్టర్లను భారీగా దెబ్బ కొట్టే స్కెచ్తోనే పుతిన్ అలాంటి ప్రకటనలు ఇప్పించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈసారి ఏకంగా మంత్రి వ్యాఖ్యలు, సెంట్రల్ బ్యాంక్ భరోసా నేపథ్యంలో భారీగానే పెట్టుబడులు పెట్టారు పాశ్చాత్య దేశాల ప్రముఖులు. ఈ ఏడాది మొదట్లో క్రిప్టో చెల్లింపులతో అక్రమ వ్యవహారాలకు తెర లేస్తుందంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది రష్యా సెంట్రల్ బ్యాంక్. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఇవాన్ చెబెస్కోవ్ మాత్రం సెంట్రల్ బ్యాంక్ వాదనను తప్పుబట్టి, నియంత్రిస్తే చాలని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలను ఒక ఒప్పందానికి రావాలంటూ సూచించారు. దీంతో తాత్కాలిక ఊరట కింద.. రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ చెల్లింపులకు అనుమతులు జారీ చేసింది.అప్పటి నుంచి బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలపై నియంత్రణల లోపిస్తే లేదా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగం లేకపోతే అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం మాదిరే తయారయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వం పరంగా వచ్చిన లాభాలు దెబ్బతినకుండా ఎంతో తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో టెర్రా–లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ‘‘క్రిప్టో కరెన్సీలను చూసి నేను ఉద్వేగం చెందను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బలీయమైన శక్తుల ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. అందుకే నేను ఫిన్టెక్ ఆధారిత ఈ తరహా ఆవిష్కరణలైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డెఫి), క్రిప్టోలను ఆహ్వానించే విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించాను. ఈ విషయంలో నేను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరమని రవిశంకర్ చెప్పారు. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం లేదా అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు’’అని నాగేశ్వరన్ క్రిప్టోలపై తన అభిప్రాయాలను, నియంత్రణ అవసరాన్ని తెలియజేశారు. క్రిప్టోలను చట్టబద్ధం చేయవద్దని ఆర్బీఐ కేంద్రానికి బలంగా సూచించడం తెలిసిందే. దీంతో క్రిప్టో లాభాలపై పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సొంతంగా డిజిటల్ రూపీని ఆవిష్కరించే కార్యక్రమంలో ఉండడం తెలిసిందే. చదవండి: Bloodbath In Crypto Markets: మార్కెట్ క్యాప్ ఢమాల్! -
లావాదేవీలపై టీడీఎస్ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్ఫారమ్లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
భారత్లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
వాషింగ్టన్: భారత్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి సలహాలు, సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు, తగు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. భారత డిజిటల్ విప్లవంలో పెట్టుబడులు అంశంపై రౌండ్టేబుల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. భారత్లో పెట్టుబడులు మరింతగా పెంచాలని ఇన్వెస్టర్లను కోరారు. దేశీ స్టార్టప్లతో చేతులు కలిపేందుకు ఆసక్తిగా ఉన్న వారి కోసం స్టార్టప్ సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారీ సంఖ్యలో యూనికార్న్లను (1 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే అంకుర సంస్థలు) తీర్చిదిద్దే సామర్థ్యాలు భారత్కు పుష్కలంగా ఉన్నాయని సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడినట్లు పేర్కొంది. మహిళా సీఎక్స్వోలతో భేటీ.. ఇన్వెస్టర్లతో భేటీకి ముందు..ఫిన్టెక్, ఆరోగ్యం, విద్య, ఐటీ తదితర రంగాల సంస్థల మహిళా చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లతో (సీఎక్స్వో) నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారత్ వృద్ధిలో వారు పోషించగలిగే పాత్ర గురించి చర్చించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. అటు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందాన్ని కూడా నిర్మలా సీతారామన్ కలిశారు. అటు అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి జేమ్స్ మాటిస్తో సమావేశమై ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చగల అంశాలపై చర్చించారు. బయోటెక్ స్టార్టప్ సంస్థ పర్ఫెక్ట్ డే సహ వ్యవస్థాపకుడు పెరుమాళ్ గాంధీతోనూ మంత్రి భేటీ అయ్యారు. మేకిన్ ఇండియాలో భాగం అయ్యేందుకు తమ ప్రణాళికలను ఆమెకు గాంధీ వివరించారు. క్రిప్టోలపై తగు నిర్ణయం తీసుకుంటాం.. క్రిప్టో కరెన్సీలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వర్చువల్ కరెన్సీల నియంత్రణ అంశాన్ని లోతుగా పరిశీలించి, భారత్ తగు నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయంలో తొందరపడబోమని పేర్కొన్నారు. అలాగని, కొత్త ఆవిష్కరణలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశ్యం కాదని .. నవకల్పనలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు. చదవండి👉అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం! -
ఘోస్ట్ సినిమా షూటింగ్లో నాగార్జున
-
సైబర్ వలలో టెకీలు... బాధితులంతా ఐటీ ఉద్యోగులే
సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన ఓ యువతి మాదాపూర్లోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ నంబర్ను వాట్సాప్, టెలిగ్రాం ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లలో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో అడ్వైజర్ ఆదిత్య సంతోష్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని సూచించాడు. దీంతో సదరు 39 ఏళ్ల టెకీ.. నెల రోజుల వ్యవధిలో రూ.2.2 లక్షల పెట్టుబడి పెట్టింది. యాప్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ రూ.5.8 లక్షలని చూపిస్తుండటంతో ఆనందానికి గురైంది. కానీ, ఆ సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం లేదని తెలుసుకున్న టెకీ.. తాను మోసపోయానని గ్రహించింది. దీంతో గత నెలాఖరున సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని సూచించడంతో వాట్సాప్ గ్రూప్లో చేరాడు. 25 లేదా 35 రోజుల లాకిన్ పీరియడ్ తర్వాతే విత్డ్రాకు అవకాశముంటుందనే షరతును పట్టించుకోలేదు. దశల వారీగా రూ.10.2 లక్షల పెట్టుబడులు పెట్టాడు. కానీ, లాగిన్ పీరియడ్ పూర్తయ్యాక.. సంబంధిత వాట్సాప్ గ్రూప్ నుంచి సదరు టెకీని తొలగించేశారు, గ్రూప్నూ డిలీట్ చేసేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్పేటకు చెందిన 22 ఏళ్ల ఓ మహిళా ఇంజినీర్.. ఐడీబీఐ పాస్బుక్ అప్డేట్ చేయడం కోసం బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ను గూగుల్లో వెతికింది. వెంటనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సౌరవ్ శర్మ నుంచి తనకు ఫోన్ వచ్చింది. పాస్బుక్ను అప్డేట్ చేయడానికి మీ సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేయాలని సూచించడంతో.. సరేనని ఇన్స్టాల్ చేయగా క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.1.68 లక్షలు మాయమైపోయాయి. .. ఇలా ఒకరిద్దరు కాదు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో ఐటీ ఉద్యోగులు, టెకీ గ్రాడ్యుయెట్లే ఎక్కువగా ఉన్నారు. అత్యాశే బాధితుల కొంప ముంచుతోంది. తక్కువ టైంలో రెట్టింపు లాభాలను పొందొచ్చనే వల విసిరి నట్టేట ముంచేస్తున్నారు సైబర్ నేరస్తులు. 80 శాతం ఐటీ బాధితులే.. కస్టమర్ కేర్, ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్రెడిట్ కార్డ్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇలా రకరకాలుగా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్లో 70 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇందులో 80 శాతం బాధితులు ఐటీ నేపథ్యం ఉన్న వారే ఉండటం గమనార్హం. విద్యావంతులు సైబర్ మోసాల బారిన పడరన్నది అపోహ మాత్రమే. నిజం చెప్పాలంటే నిరుద్యోగులు, నిరక్షరాస్యుల కంటే వీరిని మోసం చేయడమే సులువేమో. మోసపూరిత స్కీమ్లలో పెట్టుబడులు, ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ను ఇచ్చే నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయడం లేదా వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వంటి రహస్య వివరాలను బహిర్గతం చేయడం వంటి సైబర్ నేరాల బారిన పడటానికి ప్రధాన కారణం. అవగాహనతోనే అడ్డుకట్ట.. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు 200 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్ నేరాలకు ప్రధాన కారణం. అవగాహనే సైబర్ నేరాల నివారణకు మందు. – స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ (చదవండి: కాలుతూ.. పేలుతూ..) -
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ
హిమాయత్నగర్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు) -
ఉక్రెయిన్ పౌరులకు అండగా క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ..!
ప్రముఖ యుఎస్ ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ క్రాకెన్ ఉక్రెయిన్ పౌరులకు $10 మిలియన్లకు పైగా(సుమారు రూ.76 కోట్లు) ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. 2022 మొదటి అర్ధభాగంలో రష్యా ఖాతాదారుల నుంచి సేకరించిన మొత్తం ట్రేడింగ్ ఫీజులకు సమానమైన మొత్తాన్ని ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీ ఉక్రెయిన్ పౌరులకు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సహాయం వెంటనే అందించేందుకు మార్చి 9కి ముందు తమ క్రిప్టో ఎక్స్ఛేంజ్'లో ఖాతా తెరిచిన ఉక్రెయిన్ వినియోగదారులకు $1,000(సుమారు రూ.76,300) డాలర్లకు సరిసమానమైన బిట్ కాయిన్స్ అందించనున్నట్లు తెలిపింది. అది, అలా ఉంటే.. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. పుతిన్ సైనిక దళాలు సాధారణ పౌరుల పైనా కాల్పులు జరుపుతున్నారు. మానవతా కారిడార్కు సహకరించినట్లు చెప్పుకుంటున్న రష్యా.. ఆ మార్గం గుండా వెళ్లిన ప్రజలపై దాడులు చేసిందని ఉక్రెయిన్ నుంచి బయటపడిన శరణార్థులు చెబుతున్నారు. పోల్లోని ప్రసూతి ఆస్పత్రిపైనా రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అనేక మంది గర్భిణులు, చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో నగరంలో రెండు ఆస్పత్రులపైనా బాంబు దాడులు జరిగాయి. Kraken will distribute over $10 million worth of to aid clients in 🇺🇦Ukraine. Tranche 1 recipients will be credited $1000 of #BTC, withdrawable tomorrow. The package is funded by historical Ukraine revenues and H1 2022 revenues from Russia-based trading.https://t.co/DdkY2TsVoB — Kraken Exchange (@krakenfx) March 9, 2022 (చదవండి: ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!) -
దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు
14 రోజులుగా ఉక్రెయిన్పై రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, కమ్ బ్యాక్ అలైవ్ అనే స్వచ్చంద సంస్థలు విరాళాల సేకరణ చేపట్టాయి. కమ్ బ్యాక్ అలైవ్ అనేది ఉక్రేనియన్ ప్రభుత్వేతర ఎన్జిఓ సంస్థ. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నగదును రుస్సో-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్ మిలిటరీ, వాలంటీర్లు & వారి కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఉక్రెయిన్ పోలీసులు కూడా ఇతర దేశాల నుంచి క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. మార్చి 6న ట్విటర్ వేదికగా చేసిన పోస్టులో ఉక్రేనియన్ సైబర్ పోలీసులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి క్రిప్టోకరెన్సీలను విరాళం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు. వివిధ క్రిప్టోకరెన్సీలు అయిన బిట్ కాయిన్(బీటీసీ), ఈథర్ (ఇటిహెచ్), యుఎస్ డిటి టెటర్(యుఎస్ డిటి), ట్రాన్ (టిఆర్ఎక్స్), పాలిగాన్ (మాటిక్), బినాన్స్ ఎక్స్ఛేంజ్ టోకెన్(బిఎన్ బి)లను విరాళ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపింది. సేకరించిన క్రిప్టోకరెన్సీలను నేషనల్ పోలీస్, నేషనల్ గార్డ్, స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వినియోగిస్తామని ఉక్రెయిన్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, ఈ నిధులను ఔషధం & ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం, ఇంకా రష్యా దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తామని తెలిపింది. రష్యన్ ఆక్రమణ నుంచి బయటపడటానికి కైవ్ అధికారులు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరించడంలో విజయవంతమైంది. ఇప్పటికే బిట్ కాయిన్, ఈథర్, యుఎస్ డీటీ టీథర్, పోల్కాడాట్, డాగీకాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీల రూపంలో $60.5 మిలియన్లను సేకరించింది. ఇంకా ఉక్రెయిన్ జెండాను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేయడం ద్వారా కూడా $6.5 మిలియన్లను సేకరించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!) -
భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్కాయిన్స్, ఎథిరెమ్, లైట్కాయిన్, రిపిల్, డోజీకాయిన్ను భారత్లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్షిప్ను భద్రపరుస్తారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. (చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!) -
లాభాల కోసం క్రిప్టోల రిస్క్లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ ఓపెన్సీ హ్యాక్కు గురి అయ్యింది. ఓపెన్సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్టీలను కోల్పోయినట్టు ఓపెన్సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్టీలను కోల్పోయారని ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ $200 మిలియన్ డాలర్లు అనేది అబద్ధమని అన్నారు. దాడి చేసిన వ్యక్తి దొంగిలించిన ఎన్ఎఫ్టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. ఓపెన్సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్గ్రేడ్ను ప్రకటించింది. కొత్త అప్గ్రేడ్ వల్ల.. ఓపెన్సీలో ఇన్ యాక్టివ్లో ఉన్న ఎన్ఎఫ్టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్సీ హ్యాకింగ్ కి సంబంధించిన వార్తలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రూ.29 వేల శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!) -
క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై నేడు రాజ్యసభలో మాట్లాడారు. నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. "క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది" అని రాజ్యసభలో ఎఫ్ఎం సీతారామన్ తెలిపారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఎఫ్ఎం సీతారామన్ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ వ్యాపారాల లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, చాలా మంది మన దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయం మీదే నేడు సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 10న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ.. తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఆ రెండు బ్యాంకులు శుభవార్త..!) -
డిజిటల్ ఆదాయ స్వప్నం
నిజాలెంత నిష్ఠూరంగా ఉన్నా, కనీసం కలలైనా కమ్మగా ఉండాలంటారు. నిరుద్యోగం పెరిగి, మధ్య, దిగువ మధ్యతరగతి నడ్డి విరిగిన కరోనా కష్టకాలంలో... తాజా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపిన భవిష్యత్ డిజిటల్ చిత్రం రకరకాల రంగులీనుతోంది. కాగితంతో పని లేకుండా డిజిటల్ ఉపకరణం సాయంతో ప్రసంగాన్ని చదువుతూ డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం.. అన్ని రంగాలనూ డిజిటల్ బాట పట్టించే ప్రతిపాదనలు చేశారు. కొత్తగా వర్చ్యువల్ డిజిటల్ కరెన్సీ తెస్తామంటూ ‘డిజిటల్ భారతావని’ని అరచేతిలో చూపారు. క్రిప్టో మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో వర్చ్యువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏల) లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చర్చంతా వీడీఏలతో జనం గడించే ఆదాయంపై 30 శాతం పన్ను వేయడం మీదే! కొన్నేళ్ళుగా దేశంలో క్రిప్టో పరిశ్రమ ప్రాచుర్యానికి ఈ ప్రతిపాదన ఓ తార్కాణం. ఇటీవల వీడీఏలపై వాణిజ్యం భారీయెత్తున సాగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఒక వీడీఏను బదలాయించి నందుకు చెల్లింపులు కూడా అలాంటి మరో వీడీఏ రూపంలోనే సాగేలా మార్కెట్ ఆవిర్భవించడాన్ని గమనించింది. వెరసి, ఈ డిజిటల్ ఆస్తుల వ్యవహారం పన్ను రాబడికి వనరు అని గ్రహించింది. అందుకే, బడ్జెట్లో వీడీఏల లావాదేవీలపై 30 శాతం మేర పన్ను వేసింది. అలాంటి అమ్మకాలు ఒక నియమిత పరిమితి దాటితే, 1 శాతం మేర టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను మినహాయింపు) కూడా విధించింది. ఇలా క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వ్యాపారంలో లాభాలు రానున్న ఏప్రిల్ 1 నుంచి దేశంలోకెల్లా అత్యధిక పన్ను శ్లాబ్లోకి వస్తున్నాయి. డిజిటల్ కరెన్సీలకు ఆమోదముద్ర కోరుతున్నవారికి ఇది తీపి, చేదు అనుభూతుల సమ్మిశ్రమం. క్రిప్టో లాంటి డిజిటల్ ఆస్తులకు అధికారికంగా గుర్తింపు ఉన్నదీ, లేనిదీ తేల్చకుండానే ప్రభుత్వం పన్ను విధింపునకు దిగడం గమ్మల్తైన విషయమే. 2018లో రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ను నిషేధించడం, ఆ తర్వాత రెండేళ్ళకు సుప్రీమ్ కోర్ట్ ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. అది జరిగీ మరో రెండేళ్ళవుతున్నా కేంద్రం ఈ క్రిప్టోలపై ఒక కచ్చితమైన విధాన నిర్ణయానికి రాలేకపోవడం విడ్డూరం. లాటరీ, జూదం, ఇతర గేమింగ్ల లాంటి స్పెక్యులేషన్ కార్యకలాపాలతో సమానంగా 30 శాతం భారీ పన్ను క్రిప్టో వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికేనని కొందరి అభిప్రాయం. అది కొంత నిజమే. లాభాలకు పన్ను కట్టినా, డిజిటల్ ఆస్తుల బదలాయింపులో నష్టాలు ఎదురైతే మాత్రం ఇతర ఆదాయంతో దాన్ని సమం చేస్తూ లెక్కలు చూపడానికి లేదన్న నిబంధన అందుకు నిదర్శనం. అయితే, అసలంటూ పన్ను విధింపు ద్వారా పరోక్షంగా డిజిటల్ ఆస్తుల్ని గుర్తిస్తున్నట్టు సర్కారు సంకేతాలిచ్చిందని ఇంకొందరు నిపుణుల మాట. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ తాజా చర్యలు అందులో భాగమే. మోదీ సర్కార్ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తగ్గట్లే ఇప్పుడు కొత్త డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన తెచ్చింది. పొరుగున ఉన్న చైనా డిజిటల్ యువాన్ తేవడంపై మల్లగుల్లాలు పడు తుండగానే, రిజర్వ్ బ్యాంక్ సారథ్యంలో డిజిటల్ రూపీ తేనున్నట్టు మనం ప్రకటించడం పెద్ద విషయమే. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్లను నిషేధించిన చైనా ఈ నెలలో శీతకాలపు ఒలింపిక్స్ నాటికి డిజిటల్ యువాన్ తేవాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్ కూడా డిజిటల్ కరెన్సీ తేవాలనుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోట డిజిటల్ రూపీ మాట క్రిప్టో కరెన్సీ వ్యాపారులకు హర్షమే. నిజానికి, మన దేశంలో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లున్నారని అంచనా. వారి మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ రూ. 40 వేల కోట్లని లెక్క. కరోనా దెబ్బతో ఖజానాకు ఆదాయం తగ్గుతున్నవేళ, జనం ఎగబడుతున్న క్రిప్టో పరిశ్రమ కొత్త పన్ను రాబడి కోసం ప్రభుత్వానికి పాడి ఆవులా కనిపించింది. అందుకే, బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది. మొదటి నుంచీ క్రిప్టో పరిశ్రమ పట్ల సదభిప్రాయం లేని సర్కారు తెలివిగా బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ అనే పదం వాడలేదు. డిజిటల్ ఆస్తులు అనే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇంతకీ, క్రిప్టో తదితర ఆస్తుల్ని అధికారికంగా ఏ మేరకు గుర్తిస్తున్నదీ, వాటి చట్టబద్ధత ఎంత అన్నదీ ప్రభుత్వమే వివరించాలి. తీవ్రవాద సంస్థల చేతిలో క్రిప్టో కరెన్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదానికి నివారణ చర్యలనూ ఆలోచించాలి. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ కరెన్సీల మార్కెట్లో ప్రధాన వాటా కోసం డిజిటల్ రూపీ ఆలోచన బాగుంది. కానీ, ఇవాళ్టికీ దేశంలో సగానికి సగం మందికి డిజిటల్ నగదు లావాదేవీలు తెలియని చోట, కొత్తగా తెచ్చే అధికారిక డిజిటల్ రూపీ ప్రయోజనాలను పరిచయం చేసే బాధ్యత చేపట్టాలి. ఇక, క్రిప్టోతో ఈ డిజిటల్ రూపీ ఏ మేరకు పోటీపడుతుందన్నది మరో ప్రశ్న. రెండూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మీద ఆధారపడినా, క్రిప్టోలో లాగా ఇక్కడ ఇన్వెస్టర్ల వివరాలు అజ్ఞాతంగా ఉండడం కుదరదు. ఒక్కమాటలో పరిశ్రమలో అగ్రభాగంలో నిలవడానికి డిజిటల్ రూపీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. క్రిప్టో ట్రేడింగ్పై పూర్తి నిషేధానికీ, ఇటు నియంత్రణలకూ మధ్యేమార్గంలో ప్రభుత్వం రెండు వ్యవస్థలూ సామరస్యంగా కొనసాగే చర్య చేపడుతుందేమో వేచి చూడాలి. అది ఎంత త్వరగా స్పష్టతనిస్తే అమాయక ఇన్వెస్టర్లకు అంత మేలు! -
సాక్షి కార్టూన్(03-02-2022)
-
ఏంటా స్పీడు! అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..
Union Budget 2022: డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు, సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్ బ్యాంక్ తాజాగా దేశీ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతోంది. ఏప్రిల్తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తేనుంది. మంగళవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. ‘కరెన్సీ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత సమర్థంగా, తక్కువ వ్యయాలతో నిర్వహించేందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో 2022–23 నుంచి బ్లాక్చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుంది‘ అని ఆమె పేర్కొన్నారు. ప్రాథమికంగా సబ్సిడీ పథకాలకు సంబంధించిన చెల్లింపులు మొదలైన వాటికి దీన్ని ఉపయోగించవచ్చని పరిశ్రమవర్గాలు తెలిపాయి. నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతమివ్వగలదని, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో సానుకూల మార్పులు తేగలదని పేర్కొన్నాయి. రియల్ టైమ్లో, వేగవంతంగా సీమాంతర రెమిటెన్సులకు కూడా తోడ్పడగలదు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు లావాదేవీల వ్యయాలు కూడా తగ్గగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిజిటల్ కరెన్సీ అంటే.. ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో బిట్కాయిన్ వంటి డిజిటల్/క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు కుప్పతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ ఈ క్రోనా ఈ నేపథ్యంలో దేశాల ప్రభుత్వాలు అధికారికంగా డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కూడా డిజిటల్ రూపీకి రూపమిస్తోంది. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఈ తరహా ‘ఈ–క్రోనా’ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చదవండి:భారత్లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ వచ్చేసింది -
కేంద్ర బడ్జెట్పై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం..!
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1న) లోక్ సభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. అయితే, ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను ప్రస్తుతం విధానంలో ఏదైనా మారుస్తారని అందరూ ఆశించారు. కానీ, ఈ విషయంలో బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే, క్రిప్టో కరెన్సీ లాభాలపై కేంద్రం 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా #Budget2022, #IncomeTax అనే ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో.. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ అంతకంటే ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మీమ్స్ కూడా మీరు చూసేయండి. ఆదాయపన్ను శ్లాబులో ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచేయడంతో మధ్యతరగతి వర్గాలకు నిరాశ ఎదురైందంటూ బడ్జెట్పై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంతోకూడిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆదాయపన్ను గురించి పోస్టులు ట్విట్టర్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇంటర్నెట్లో మొత్తంగా ‘మధ్యతరగతి’వర్గాలు బడ్జెట్పై స్పందిస్తున్న పోస్టులు టాప్ ట్రెండింగ్గా నిలిచాయి. నవ్వు తెప్పించే విధంగా ఉన్న ఆ పోస్టుల్లో కొన్ని... ► డాక్టర్ ప్రశాంత్ మిశ్రా తన ట్విట్టర్ నుంచి.. మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ప్రతీఏటా ఆశగా ఎదురుచూడటం తప్పట్లేదు అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేశారు. ► ట్రెండూల్కర్ ట్విట్టర్ నుంచి ఆదాయపన్ను పరిమితి పెంపుపై ఇంటి బయటనుంచి లోపలికి ఆశగా ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ► అమిత్ జూనియర్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ప్రతిఏటా బడ్జెట్ అనంతరం మధ్యతరగతి ప్రజల స్పందన ఇదేనంటూ నిరాశగా ఉన్న అక్షయ్కుమార్ ఫొటోను షేర్ చేశారు ► అరవింద్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్కు ఓ వేతనజీవి నేరుగా ఫోన్ చేసి సామాన్యుడంటే విలువలేకుండా పోయిందని వాపోతున్న ఫొటోను షేర్ చేశారు Tax payers waiting for the good news...#Budget2022 #incometax pic.twitter.com/b7Ek3DxEZd — सख्याहरी (@sakhyahari) February 1, 2022 Bring it on, FM! I've suffered enough.#BudgetSession2022 #Budget2022 #Budget22 #Memes #budgetmemes pic.twitter.com/hvygDlAsbw — Prashasti Shandilya (@PrashastiiS) February 1, 2022 View this post on Instagram A post shared by Meme Raja (@meme_raaja) View this post on Instagram A post shared by Chai Bisket (@chaibisket) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) Middle class meme#Budget2022 #BudgetSession2022 pic.twitter.com/fVY58zn0XD — Black Adam 🔥 (@blackadameveee) February 1, 2022 People discussing about #BudgetSession2022..... Me with zero knowledge of finance : pic.twitter.com/rHtiZcnfnL — UmderTamker (@jhampakjhum) February 1, 2022 (చదవండి: PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!) -
తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్ !
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవనిది ఆ దార్లో నడిచెదరో అనే పాటకే కాదు నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే పాపులర్ డైలాగ్కి కానీ పర్ఫెక్ట్గా సూటయ్యే పేరు ఎలన్మస్క్. భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన నేర్పు అతన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. అయితే తన అలవాటు ప్రకారం ఏ మాట్లాడినా.. ఏ పని చేసినా వెటకారం జోడించడం ఎలన్మస్క్కి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ వెటకారానికి మంచి రిటార్ట్ పడింది. కొంటె ట్వీట్ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో వందల కొద్దీ కాయిన్స్ ఉన్నాయి. ఇందులో మీమ్స్ కాయిన్గా వచ్చింది డోజ్కాయిన్. ఎలన్మస్క్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇది వరల్డ్ ఫేమస్ అయ్యింది. తాజాగా టెస్లా కార్లు కొనే సమయంలో డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీని సైతం అంగీకరిస్తామంటూ మరింత పాపులర్ చేశారు ఎలన్మస్క్. తాను పెట్టుబడి పెట్టిన డోజ్ కాయిన్కు మరింత పాపులారిటీ తీసుకొచ్చే పనిలో మరో ట్వీట్ చేశాడు. డోజ్కాయిన్ తీసుకుంటారా? ఫేమస్ ఫుడ్ సప్లై చెయిన్ మెక్డొనాల్ట్స్ కనుక డోజ్ కాయిన్ను అంగీకరిస్తే నేను ఎంతో హ్యాపీగా మెక్డొనాల్డ్స్ అందించే ఫుడ్ తింటాను అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఒకరోజు సమయం ఇచ్చిన మెక్డొనాల్డ్ ఎలన్మస్క్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తీసుకుంటాం.. కానీ క్రిప్టో కరెన్సీలో బాగా పాపులరైన బినాన్స్ స్మార్ట్ చెయిన్ నుంచి గ్రిమాకే కాయిన్స్ అంటూ కొత్త రకం మీమ్ కాయిన్ని రెడీ చేయించింది. ఆ తర్వాత ట్విట్టర్కి వెళ్లి డోజ్కాయిన్ని మెక్డొనాల్డ్లో అంగీకరిస్తాం. కానీ ఒక్క షరతు టెస్లా కార్లు కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్ను తీసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. only if @tesla accepts grimacecoin https://t.co/CQrmAFelHR pic.twitter.com/to9HmYJhej — McDonald's (@McDonalds) January 25, 2022 ఎలన్మస్క్కి మెక్డొనాల్డ్ కంపెనీ ఇచ్చిన కౌంటర్ నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది. క్రిప్టో కరెన్సీ గురించి టెక్ వరల్డ్లో బోలెడంత చర్చ జరుగుతోంది. ఎలన్మస్క్, టిమ్కుక్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఐనప్పటికీ క్రిప్టో కరెన్సీ ఇంకా జనసామాన్యంలోకి చొచ్చుకుపోలేదు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
భారత్ నుంచి రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్ ఆఫ్ ద వరల్డ్)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. నవ భారత్ రికార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్లో ఉందని, ఒక్క డిసెంబర్లోనే భారత్లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్లో ప్రాజెక్ట్ అసోసియేట్గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్తో ఈ రిసెప్షన్ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్ను నిర్వహించనుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్!!
ఓ స్వచ్ఛంద సంస్థ తాము ఎంపిక చేసిన ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు 10వేల డాలర్లు(రూ.7లక్షల పై మాటే) విలువ చేసే బిట్కాయిన్లను ఉచితంగా అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది. అమెరికాకు చెందిన నార్తవెస్ట్ ఆర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్..ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడేవారికి భారీ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు 2020నవంబర్ నుంచి ఫ్రీగా 10 వేలడాలర్లతో పాటు రోడ్ బైక్ లేదంటే మౌంటెన్ బైక్ అందిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి లాభపేక్షలేకుండా ఫ్రీగా అంతపెద్దమొత్తాన్ని ఎలా చెల్లిస్తారనే ప్రశ్నకు సమాధానంగా నార్త్వెస్ట్ అర్కాన్సాస్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. నార్త్వెస్ట్ అర్కాన్సాస్కు వలసల్ని ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని క్రిప్టో హబ్గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోత్సహకాల్ని అందిస్తున్నాం. బ్లాక్చెయిన్పై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలను ఆకర్షించాలనదే మా ఉద్దేశం. ఈ ఆఫర్లో ఎవరైనా పాల్గొనచ్చని కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈఓ నెల్సన్ పీకాక్ తెలిపారు. బ్లూమ్బెర్గ్ నివేదిక సైతం..ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి 50మంది తరలి వచ్చినట్లు తెలుస్తోంది. బిట్కాయిన్ల ఇన్సెంటీవ్లను అందించడం ద్వారా రానున్న రోజుల్లో 7,500 ఓపెన్ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సహాయపడుతుందని కౌన్సిల్ భావిస్తోంది. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు!