Equity
-
చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్కు ప్రత్యేక సంస్థ ఉండాలి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు. చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
‘సిప్’ సరికొత్త రికార్డు.. ఈ ఇన్వెస్ట్ మీరూ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ– సిప్) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం– సిప్లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. ఈక్విటీ ఫండ్స్లోకి రూ.34,419 కోట్లు.. ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్సెట్తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్లో రిస్క్ డెట్లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్ఫోలియోలో డెట్ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్క్యాప్నకు, మిడ్క్యాప్ స్టాక్స్కు 10–15 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
స్మార్ట్ సిప్ అంటే ఏంటి?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ స్మార్ట్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (స్మార్ట్ సిప్) అనేది రెగ్యులర్ సిప్తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్ అవుతున్నాయని ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) భావిస్తే, అప్పుడు సిప్లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్కే కేటాయిస్తుంది. లిక్విడ్ ఫండ్కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్ సిప్ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్ చౌకగా మారినప్పుడు సిప్లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్సిప్ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్్కను తగ్గించడమే. మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్ పెట్టుబడితో ఎక్కువ ఫండ్ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్సిప్ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్ సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్ నరేంద్రన్ అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడులను ఎస్డబ్ల్యూపీ ద్వారా డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్ను తప్పిస్తుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు అక్టోబర్లో ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ కనిపించింది. ఏకంగా రూ.841 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. అంతకుముందు సెప్టెంబర్ మాసంలో గోల్డ్ ఈటీఎఫ్లలో తాజా పెట్టుబడులు రూ.175 కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్ట్లో అత్యధికంగా రూ.1,028 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. ఇది 16 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. జూలైలోనూ రూ.456 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. అంతకుముందు ఏప్రిల్–జూన్ మధ్య నికరంగా రూ.298 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోయాయి. ఈ ఏడాది మార్చి నెలలో వీటి నుంచి ఇన్వెస్టర్లు రూ.1,243 కోట్లు ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య (ఫోలియోలు) అక్టోబర్లో 27,700 పెరిగి మొత్తం 48.34 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని ఆస్తులు 10 శాతం పెరిగి రూ.26,613 కోట్లకు చేరాయి. సెప్టెంబర్ చివరికి వీటి విలువ రూ.23,800 కోట్లుగా ఉన్నట్టు యాంఫి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు ఒక గ్రాము పరిమాణంలో ట్రేడ్ అవుతుంటాయి. దేశీయ బంగారం ధరలనే ఇవి ప్రతిఫలిస్తుంటాయి. ‘‘ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్లో వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగుతుందన్న భయాలు, ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిలోనే ఉండడం, వృద్ధి రేటు తగ్గిన నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు’’అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మెల్విన్ శాంటారియా తెలిపారు. -
క్యూ2లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 34,765 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో మొత్తం మీద రూ.34,765 కోట్ల పెట్టుబడులను నికరంగా ఆకర్షించింది. అంతకుముందు జూన్తో ముగిసిన త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.85 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ పెట్టుబడుల రాక సానుకూలంగానే ఉంది. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) విభాగంపై ఎక్కువ ప్రభావం పడింది. వీటి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫండ్స్ నుంచి జూలైలో రూ.82,467 కోట్ల పెట్టుబడులు రాగా, ఆగస్ట్లో రూ.16,180 కోట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్ నెలలో రూ.63,882 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దీంతో నికరంగా రూ.34,765 కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు మార్నింగ్ స్టార్ ఇండియా నివేదిక తెలిపింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు నాలుగేళ్లలోనే గరిష్ట స్థాయి అని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరి నుంచి సెప్టెంబర్ చివరికి 5 శాతం పెరిగి రూ.46.22 లక్షల కోట్లుగా ఉంది. గత పది త్రైమాసికాల్లోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా రూ.41,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.18,358 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇక డెట్ ఫండ్స్ నుంచి రూ.65,944 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఈ విభాగం రూ.1.38 లక్షల కోట్లు ఆకర్షించడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. -
మీ ఫండ్కు మీరే మేనేజర్..?
మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగులు వేసే రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. అన్ని సాధనాల్లోకెల్లా ఈక్విటీలు దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులు ఇవ్వడమే ఈ ఆకర్షణకు కారణం. ఈక్విటీల్లో పెట్టుబడులు ఎంత సులభమో, ఆచరణలో అంత కష్టం. నిపుణులైన ఫండ్ మేనేజర్లను కాదని, నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించే వారు, ప్రాథమిక విషయాల గురించి, రిస్క్ గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేదంటే అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. తమ పెట్టుబడులకు తామే ఫండ్ మేనేజర్ పాత్ర పోషిస్తామనుకునే వారు, ఈక్విటీలో తలపండిన వారెన్ బఫెట్, ఫిలిప్ ఫిషర్, చార్లీ ముంగర్ చెప్పిన సూత్రాలు పాటించడం అనుసరణీయం. కంపెనీ గురించి, చేస్తున్న వ్యాపారం గురించి, పని చేస్తున్న రంగం, యాజమాన్య దక్షత, పోటీ సామర్థ్యాలు, నిధుల బలాలు ఇలా ఎన్నో అంశాలను చూసి వడపోయాలి. ఆపై మిగిలిన కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేసుకోవడం వల్ల రక్షణ ఎక్కువగా ఉంటుంది. నేరుగా పెట్టుబడులు పెట్టే ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన అంశాల సమాహారమే ఈ కథనం... వ్యాపార నమూనా అర్థమైందా? ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే.. సదరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. ఒక షేరును రూ.20లో కొని, అది రూ.100కు చేరితే నాలుగింతలు లాభం వస్తుందన్న అవాస్తవ అంచనాలు వేసుకుని ఓ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారంటే? అనుసరించే బాట సరిగ్గా లేదని తెలుసుకోవాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఆదాయం ఎలా వస్తోంది? కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులు ఏంటన్నవి అర్థం చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉండాల్సిందే. కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి తెలియనప్పుడు, భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతుందో ఎలా తెలుస్తుంది? అటువంటప్పుడు పెట్టే పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతుంది? ఒక కంపెనీ గురించి అర్థం కాకకపోయినా లేదా ఉత్పత్తులు, సేవలు ఆకర్షణీయంగా అనిపించకపోయినా, ఆ కంపెనీకి దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారం అర్థం చేసుకునేందుకు ఎంత సులభంగా ఉంటే, అంత ఆకర్షణీయమైనదిగా భావించొచ్చు. యాజమాన్య దక్షత గుడ్ బిజినెస్ ఇన్ రాంగ్ హ్యాండ్స్.. రాంగ్ బిజినెస్ ఇన్ గుడ్ హ్యాండ్స్.. ఈ రెండింటిలో రెండోదే ఉత్తమం. సమర్థత లేని వ్యక్తుల చేతుల్లో మంచి వ్యాపారం ఉన్నా దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లలేరు. అదే మంచి వ్యాపార దక్షత కలిగిన వ్యక్తులు యాజమాన్య స్థానంలో ఉంటే, చెత్త వ్యాపారాన్ని సైతం మంచిగా వృద్ధి చేయగలరు. పెట్టుబడులు పెట్టే కంపెనీకి సమర్థులైన, ప్రతిభావంతులైన, భవిష్యత్తు ప్రణాళికలు, పోటీతత్వంపై స్పష్టమైన అవగాహన, టెక్నాలజీ పట్ల ఆసక్తి కలిగిన ప్రమోటర్లు ఉండాలి. ఆ కంపెనీ యాజమాన్యం పనితీరు గురించి సాధ్యమైనంత లోతుగా తెలుసుకోవాలి. వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నడిచేవి, కుటుంబ కంపెనీలు సగటున ఏటా 3 శాతం అధిక పనితీరు చూపిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రమోటర్లతో సంబంధం లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో గొప్పగా పనిచేసే హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఎల్అండ్టీ గ్రూప్, ఐటీసీ గ్రూప్ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం.. ప్రతి కంపెనీ కూడా ఒక్కో రంగంలో విశేషమైన అనుభవం కలిగి ఉంటుంది. ఆయా రంగంలో వచ్చే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలా ఓ రంగానికే కట్టుబడి గొప్పగా రాణిస్తున్న కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. కంపెనీల మేనేజ్మెంట్ వ్యాపారంపైనే దృష్టి పెట్టాలి కానీ, వాటాదారుల విలువపై కాదు. కంపెనీ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తుంటే సహజంగానే వాటాల విలువ ఇతోధికం అవుతుంది. వ్యాపారం కాకుండా వాటాల విలువను పెంచడంపై దృష్టి సారించే యాజమాన్యాల వైఖరి, దీర్ఘకాలంలో వాటాదారులకు మేలు చేయకపోవచ్చు. కొన్ని కంపెనీలు చేస్తున్న వ్యాపారంపై దృష్టి తగ్గించి, మార్కెట్లో వచ్చే కొత్త వ్యాపార అవకాశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వాటాల విలువ పెరుగుతుందని అలా వ్యవహరిస్తుంటాయి. దీనివల్ల నిజానికి వ్యాపార విధానం గాడి తప్పుతుంది. కొత్త వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున రుణాలు సమీకరిస్తుంటాయి. ఇది కూడా వాటాదారుల విలువకు ప్రతికూలం అవుతుంది. భవిష్యత్ నాయకత్వం? ఒక గొప్ప ప్రమోటర్ను చూసి కళ్లు మూసుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చని అనుభవజు్ఞలైన ఇన్వెస్టర్లు చెబుతుంటారు. నిజమే అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆ గొప్ప ప్రమోటర్ ఏదో ఒకరోజు వయసు మళ్లో లేకుంటే ఆకస్మికంగా కాలం చేస్తే పరిస్థితి ఏమిటి? కంపెనీ సంక్షోభంలో పడిపోకుండా, ఆ తర్వాత నుంచి సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఉన్నారో లేదో చూడాలి. ప్రమోటర్ కాకపోయినా కంపెనీలను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఎల్అండ్టీ ఏఎం నాయక్ వంటి నిపుణులు ఎందరో ఉంటారు. అలాంటి నిపుణుల చేతికి నాయకత్వం వెళితే నిశి్చంతగా ఉండొచ్చు. పనిచేస్తున్న రంగం కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందన్నది మరో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు మెటల్స్ తీసుకుంటే వాటి ధరలు అంతర్జాతీయంగా వివిధ దేశాల వినియోగం, ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తుంటాయి. స్థిరమైన రాబడి కోరుకునే వారు మెటల్స్కు దూరంగా ఉండాల్సిందే. అదే ఐటీ రంగం తీసుకుంటే అస్థిరతలు తక్కువ. ఎక్కువ కాలాల్లో స్థిరమైన వృద్ధిని ఏటా నమోదు చేస్తుంటాయి. అలాగే బాగా వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను ఎంపిక చేసుకుంటే, ఎక్కువ కాంపౌండింగ్కు అవకాశం ఉంటుంది. పోటీతత్వం ఎంపిక చేసుకునే కంపెనీకి గట్టి పోటీనిచ్చే సామర్థ్యాలున్నాయా? సదరు కంపెనీకి వ్యాపార పరంగా బలాలు ఉండే పెట్టుబడులకు రక్షణ ఉన్నట్టుగా భావించొచ్చు. దీన్నే మోట్ అని పిలుస్తారు. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? అంటే.. కంపెనీకి వ్యాపారంలో స్థూల మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే, ఆ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్ ఉన్నట్టుగా భావించొచ్చు. ఉదాహరణకు యాపిల్ స్థూల మార్జిన్లు 44 శాతానికి పైనే. ఆయా వ్యాపారంలో కొన్ని కంపెనీలే పనిచేస్తుండడం, కొత్త కంపెనీల ప్రవేశం అంత సులభం కాకపోవడం వంటివి అనుకూలతలు. దీనివల్ల ఉన్న కంపెనీలకు ప్రైసింగ్ పవర్ (ధరలను నిర్ణయించే శక్తి) ఉంటుంది. కనీసం లాభాల మార్జిన్ 10 శాతానికి పైన ఉండేలా చూసుకోవాలి. స్వల్ప మార్జిన్తో నడిచే కంపెనీలు ఎప్పుడైనా నష్టాల్లోకి జారిపోవచ్చు. పోటీ సంస్థల కంటే మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండాలి. ఈ మార్జిన్ను ఏటేటా పెంచుకోవడం లేదంటే అదే స్థాయిలో కొనసాగించడం అవసరం. ఏటేటా క్షీణిస్తూ ఉంటే, బలం క్షీణిస్తున్నట్టుగా చూడొచ్చు. కంపెనీ నిలబడుతుందా? కంపెనీ రిస్క్లను కూడా చూడాలి. కంపెనీకి బలాలు ఉన్నాయని ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవి అలాగే కొనసాగుతున్నాయా? అని కనిపెట్టుకుని ఉండాలి. టెలికం రంగంలో ఏం జరిగిందో చూశారు కదా..? జియో రావడంతో ఎయిర్టెల్, వొడాఐడియా మినహా అన్నీ మూట సర్దేసుకోవాల్సి వచ్చింది. వొడాఐడియా కూడా ఆరి్థక సంక్షోభంతో కొనసాగుతోంది. ఇలాంటి విపత్తు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందే కంపెనీకి వచ్చే రిస్్కల గురించి కూడా అవగాహన ఉండాలి. ఎయిర్టెల్ కంపెనీకి నెట్వర్క్ విస్తరణ పరంగా కాస్త మెరుగైన సామర్థ్యాలు ఉన్నాయి. దీనికితోడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు తగ్గట్టు ఎయిర్టెల్ ప్రణాళికలు రచించి, అమలు చేసుకుంటూ వెళ్లింది. అందుకే జియోకు గట్టి పోటీదారుగా నిలిచింది. ముఖ్యంగా కంపెనీకి దీర్ఘకాలిక విజన్ (భవిష్యత్ ప్రణాళిక) ఉండాలి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో సవాళ్లను దీటుగా ఎదుర్కొని, వాటాదారులకు విలువను సమకూర్చగలవు. బలమైన బ్యాలన్స్ షీట్ ఎంపిక చేసుకునే కంపెనీకి ఆరి్థక బలాలు తప్పకుండా ఉండాలి. కంపెనీకి దాదాపు రుణ భారం లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ రుణాలు ఉన్నా కానీ, ఆ మొత్తం ఈక్విటీతో పోలిస్తే నూరు శాతం మించకుండా చూసుకోవాలి. రుణభారం ఎక్కువైతే కంపెనీ సంపాదించినదంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. అప్పుడు కంపెనీ వృద్ధి ప్రణాళికల కోసం అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి బ్యాలన్స్ షీటు కంపెనీలకు దూరంగా ఉండాలి. రుణరహిత కంపెనీలు, ఆదాయం ఏటా కనీసం 10–15 శాతం, నికర లాభం ఏటా 15–20 శాతం వృద్ధి చెందే కంపెనీల్లో పెట్టుబడికి రక్షణ, వృద్ధికి అవకాశం ఉంటుంది. ఓ కంపెనీ షేరు ధర దీర్ఘకాలంలో లాభాలనే అనుసరిస్తుంటుంది. డివిడెండ్ చెల్లించేవి అయితే అదనపు ప్లస్గా చూడొచ్చు. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యం మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగు ణంగా ఉత్పత్తులు, సేవల్లోనూ నవ్యత అవసరం. అందుకే కంపెనీలు పరిశోధనపై పెద్ద మొత్తంలో వెచి్చస్తుంటాయి. ఓ కంపెనీ పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యాలకు నిదర్శనం, ఆ కంపెనీ ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు ఉండడం. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, సేవలను మార్కెట్ చేస్తుండడం. ఇలాంటి బలాలు ఉంటే, దీర్ఘకాలంలో ఆ కంపెనీ ఎంత పోటీ ఉన్నా నిలదొక్కుకుని, రాణిస్తుంది. ఇందుకు ఒక నిదర్శనం గూగుల్, యాపిల్. ఇవి పరిశోధనపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. ఉత్పత్తులు, సేవలపై పేటెంట్ ఉంటే, వ్యాపారంలో అ ధిక లాభాల మార్జిన్లకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ఉన్న పేటెంట్ల గడువు ముగుస్తుంటే, అది లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులతో సంబంధాలు కంపెనీలో పని విలువలు కూడా వాటాదారులకు విలువను తెచ్చి పెట్టే అంశాల్లో ఒకటి. మెరుగైన పని విధానం ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను సమకూరుస్తాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కంపెనీ ఉద్యోగుల విషయంలో సముచితంగా వ్యవహరిస్తుంటే, మెరుగైన పని వాతావరణం ఉన్నప్పుడు వారు మరింత ఉత్పాదకత దిశగా పనిచేయగలరు. వాటాల విలువ పలుచన అవుతోందా? కంపెనీల మూలధనం పెరుగుతూ వెళుతోందా? ఏ రూపంలో అయినా కానీయండి, దీనివల్ల అప్పటికే కంపెనీలో ఉన్న వాటాల విలువ పలుచనవుతుంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల మూలధనం స్థిరంగా ఉండాలి. షేర్ల బైబ్యాక్ రూపంలో ఈక్విటీ తగ్గుతుంటే ఇంకా మంచిది. దీనివల్ల వాటాదారుల విలువ ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంది. బ్యాంక్ స్టాక్స్కు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు. ఎందుకంటే బ్యాంకులకు నిధులే వ్యాపార వస్తువు. కనుక అవి తాజా ఈక్విటీ జారీ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు సమీకరిస్తూ, వ్యాపార విస్తరణపై వెచి్చస్తుంటాయి. ఇవి కూడా గమనించాలి.. ► టెక్నాలజీ పరంగా కంపెనీ ముందుండాలి. కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహా్వనించాలి. లేదంటే అస్తిత్వ ముప్పు ఏర్పడొచ్చు. ► కొన్ని రంగాల్లో చిన్న కంపెనీల కంటే పెద్ద కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడమే మంచిది. ఉదాహరణకు టైర్ల రంగంలో చిన్న కంపెనీని ఎంపిక చేసుకోవడం కంటే ఎంఆర్ఎఫ్ వంటి పెద్ద కంపెనీలే దీర్ఘకాలంలో రాణించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ► ఓ కంపెనీ షేరు గణనీయంగా పడిపోయిందని ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఆ షేరు ఏ కారణాల వల్ల పడిపోయిందన్నది ముందుగా తెలుసుకోవాలి. జెట్ ఎయిర్వేస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యస్ బ్యాంక్ ఇలాంటి కేసులను అధ్యయనం చేయాలి. పడిపోతున్న షేరును కొనుగోలు చేయడం, పడిపోతున్న కత్తిని పట్టుకోవడంగా నిపుణులు చెబుతుంటారు. ► కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ) దీర్ఘకాలంలో పెద్దగా వృద్ధి లేకుండా అక్కడక్కడే చలిస్తుంటే.. దీనికి బదులు ఏటేటా ఆర్వోఈ వృద్ధి చెందే కంపెనీలే మెరుగైన రాబడులను ఇవ్వగలవు. ► సిమెంట్, మెటల్స్, షుగర్, ఆటోమొబైల్ ఇవన్నీ సైక్లికల్ కంపెనీలు. కొన్నేళ్ల కాలంలోనే ఎన్నో రెట్ల రాబడులు ఇచి్చన తర్వాత, మళ్లీ ర్యాలీ చేయడానికి కొన్నేళ్ల సమయం తీసుకుంటాయి. ఇలాంటి కంపెనీల్లో అధిక వేల్యుయేషన్ల వద్ద ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలను గమనించాలి. ► వాటాల పరంగా లిక్విడిటీ మెరుగ్గా ఉండాలి. అంటే ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాప్ చెప్పుకోదగినంతగా ఉండాలి. లిక్విడిటీ తక్కువగా ఉంటే, మార్కెట్ కరెక్షన్లలో అమ్ముకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేరు ధర భారీగా పతనం చెందుతుంది. దీంతో భారీ నష్టాలు ఎదురవుతాయి. కంపెనీ షేరు ధరను కాకుండా, అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా ఉండాలి. కంపెనీ వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నప్పుడే, మార్కెట్ ఆ కంపెనీకి మెరుగైన విలువను కడుతుంది. ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులతో ముందుకు వస్తాయి. కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా లేని కంపెనీలకు దూరంగా ఉంటాయి. సత్యం కంప్యూటర్స్, బ్రైట్కామ్ గ్రూప్, ఈకేఐ ఎనర్జీ వంటి కంపెనీల కేసులను ఇందుకు అధ్యయనం చేయొచ్చు. ► ప్రమోటర్ల వాటా కంపెనీలో ఎంత ఉందన్నది కూడా చూడాలి. కనీసం 20 శాతంపైన ఉంటే మంచిది. పైగా ప్రమోటర్లు తమకున్న వాటాలను తనఖా పెట్టారా? తనఖా పెట్టిన మొత్తం వారి వాటాల్లో 50 శాతం మించితే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. స్కటిల్బట్ మెథడ్ ప్రకారం.. ఓ కంపెనీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంటే, ముందు ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగించుకునే వారిని కలసి మాట్లాడాలి. అలాగే, ఆ కంపెనీ పోటీదారులు, ఉద్యోగులతో మాట్లాడిన తర్వా త ఓ నిర్ణయానికి రావాలి. – ఫిలిప్ ఎ. ఫిషర్ -
అదానీ పవర్లో 8.1% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్మిషన్లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీలోనూ.. మరో స్టాక్ మార్కెట్ డీల్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. -
తక్కువ రిస్క్.. మంచి రాబడి - ఉందిగా సరైన మార్గం!
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్తంత అధికరాబడులు కోరుకునే వారు హైబ్రిడ్ ఈక్విటీ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. రాబడి మాత్రం అచ్చమైన డెట్ సాధనాలకు మించి ఉంటుంది. అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ పథకం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పథకం కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో 14.52 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 17.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11.70 శాతం, ఏడేళ్లలోనూ ఏటా 11.55 శాతం, పదేళ్లలో 14.37 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఉంది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.43 శాతంగా ఉన్నాయి. డెట్తో కూడిన పెట్టుబడులు కనుక దీర్ఘకాలంలో వార్షిక రాబడి 11–12 శాతం చొప్పున ఉంటే మెరుగైనదిగా పరిగణించొచ్చు. అచ్చమైన ఈక్విటీ కాకుండా, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన సాధనాల్లో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వారు ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. ఇంతకంటే అధిక రాబడి కోరుకునే వారికి అచ్చమైన ఈక్విటీ పథకాలే సూచనీయం. (ఇదీ చదవండి: గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?) పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల కేటాయింపు సమయోచితంగా ఉంటుంది. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015, 2020 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు తీసుకొచ్చేలా పథకం పరిశోధనా బృందం పనిచేస్తుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.58వేల కోట్లకు పైనే పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో 75.80 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడులు 18.72 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాలకు కూడా ఒక శాతం లోపు కేటాయించగా, 4.61 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 78 శాతం పెట్టుబడులు లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్క్యాప్ కంపెనీల్లో కేవలం 0.73 శాతమే ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈక్విటీల్లోనూ రిస్క్ను తగ్గించే విధంగా కేటాయింపులు ఉన్నాయి. 18.72 శాతం డెట్ కేటాయింపుల్లోనూ అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సాధనాల్లోనే 14 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లో అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం కేటాయింపులు చేయగా, సేవల రంగ కంపెనీలకు 7 శాతానికి పైన కేటాయించింది. హెల్త్కేర్లో 6 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్ఎఫ్వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్ఎఫ్వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..
ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి. మనలో చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి. మీరు మీ ఫండ్ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు. అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిస్క్ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి. ఎంత నిధి కావాలి? రిటైర్మెంట్కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్ తర్వాత అవసరం అవుతుంది. ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం. మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి. అస్సెట్ అలోకేషన్ అస్సెట్ అలోకేషన్ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్పై రాసుకోవాలి. మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్ అలోకేషన్ను సవరించుకోవచ్చు. రిటైర్మెంట్ ఫండ్పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్ ఫండ్ను ఈక్విటీ, డెట్కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. కార్యాచరణ ప్రణాళిక.. రిటైర్మెంట్ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి. పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు. మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్ సాధనాలు. ఏటా ఏప్రిల్లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్లో సమానంగా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. -
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
రుణ భారం, ఆదాయం రెండూ అప్
ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది. 18 సంస్థలపై.. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది. హెచ్ఏఎంలో.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్హెచ్ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్ఫోలియో రిస్క్ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్తో కూడిన పోర్ట్ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్తో కూడిన పోర్ట్ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్తో కూడిన పోర్ట్ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్ఫోలియో రిస్క్ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
రికవరీకి అవకాశం
ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు. బుధవారం డివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీవో కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది. అదే రోజున ఆర్బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి. అమెరికా, యూరోజోన్తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. -
వొడా ఐడియాకు ఊరట.. ప్రభుత్వానికి మెజారిటీ వాటా!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కట్టాల్సిన రూ. 16,133 కోట్ల వడ్డీ బాకీలను ఈక్విటీ కింద మార్చుకునే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. స్పెక్ట్రం వాయిదాలు, సవరించిన స్థూల లాభాలపై కట్టాల్సినది (ఏజీఆర్) కలిపి ప్రభుత్వానికి వీఐఎల్ భారీగా బాకీ పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను వాటాగా కేటాయించింది. దీంతో రూ.10 షేర్ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి బదిలీ చేసింది. తమ భాకీలను ఈక్విటీగా మార్చుకుంటే తమ సంస్థలో ప్రభుత్వానికి 33.14 శాతం వాటా లభించగలదని వీఐఎల్ గతంలో తెలిపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ టెలికాం రంగంలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు ఈ రంగంలోని పలు టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకాయిలు కూడా టెలికాం రంగం ఇబ్బందులను మరింత పెంచాయి. చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ -
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయి.. ఒక్క రోజులోనే సెటిల్మెంట్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం(27న) నుంచి మొత్తం ఈక్విటీ విభాగంలో లావాదేవీలను ఒక్క రోజులోనే సెటిల్ చేసే ప్రక్రియకు తెరతీశాయి. దీంతో మార్కెట్లో నమోదయ్యే లావాదేవీలను మరుసటి రోజులోనే క్లియర్ చేస్తారు. అంటే షేరు లేదా నగదు బదిలీని పూర్తి చేస్తారు. ఈక్విటీ విభాగంలోని సెక్యూరిటీలలో ఈ నెల 27 నుంచి ట్రేడ్ప్లస్(టీప్లస్)1 సెటిల్మెంట్ను అమలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకూ టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే లావాదేవీ జరిగిన రెండు రోజుల్లో క్లియరింగ్ను చేపడుతున్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యాలు మెరుగుపడటంతోపాటు.. మొత్తం పరిశ్రమలో రిస్కులు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2021లోనే పునాది: నిజానికి టీప్లస్1 సెటిల్మెంట్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2021 సెప్టెంబర్ 7న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టేందుకు ఎక్సే్ఛంజీలను అనుమతించింది. ట్రేడింగ్ సభ్యులు, కస్టోడియన్లు తదితర మార్కెట్ మౌలిక సంస్థలు దశలవారీగా టీప్లస్1 అమలుకు తెరతీశాయి. 2022 ఫిబ్రవరి 25న కొత్త సెటిల్మెంట్ను ప్రారంభించాయి. 2023 జనవరి 27కల్లా ఈక్విటీ విభాగంలోని అన్ని సెక్యూరిటీలనూ ఒక్క రోజు సెటిల్మెంట్లోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎస్ఎంఈ షేర్లు సహా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు), సావరిన్ గోల్డ్ బాండ్లు(ఎస్జీబీలు), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు చేరాయి. పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికీ టీప్లస్2 సెటిల్మెంటును అమలు చేస్తుండటం గమనార్హం! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్ రిపోర్ట్ అవుట్లుక్ 2023’పేరుతో విడుదల చేసింది. సర్వే ఫలితాలు.. ► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. ► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు. ► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు ► 47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు. ► అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది. ► 2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. ► యూకే, యూఏఈ, యూఎస్ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
ఈ స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్! భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్న లార్జ్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్ అండ్ మిడ్క్యాప్ పథకం ఇది. మోస్తరు రిస్క్ ఉంటుంది. మోస్తరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. బోటమ్అప్ విధానాన్ని పెట్టుబడుల విషయంలో అనుసరిస్తోంది. కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉండడం, ఇన్వెస్టర్లకు ఈ పథకం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సిప్ విధానంలో ప్రతి నెలా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో ప్రస్తుతం ఈక్విటీలకు 97 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్కాప్స్ కంపెనీల్లో 72 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంటే, మిడ్క్యాప్ కంపెనీల్లో 35 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్క్యాప్ కంపెనీల్లో కేవలం 1.92 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 30 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీల్లో 9.24 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.72 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 7.25%, టెక్నాలజీ కంపెనీల్లో 6.99 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చింది. గత ఏడాదిగా మార్కెట్లలో అనిశ్చితులు నెలకొని ఉండడం, మిడ్క్యాప్ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడం రాబడులపై ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 18 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో 10.16 శాతం, ఏడేళ్లలో 14.24 శాతం, పదేళ్లలో 19.38 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇందులో ఉన్నాయి. ఏడాది, ఐదేళ్ల కాలంలో మినహా లార్జ్ మిడ్క్యాప్ టీఆర్ఐ రాబడుల కంటే ఇందులోనే ఎక్కువగా ఉన్నాయి. -
వారీ ఎనర్జీస్కు రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు. ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రూఫ్టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది. -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఆగస్ట్లో కేవలం రూ.6,120 కోట్ల వరకే వచ్చాయి. అంతకు ముందు నెలలో (జూలై) వచ్చిన రూ.8,898 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్లో రూ.15,890 కోట్లు, మే నెలలో రూ.18,529 కోట్లు, జూన్లో రూ.15,495 కోట్ల చొప్పున వచ్చిన పెట్టుబడులు.. తర్వాతి రెండు నెలల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆగస్ట్లో వచ్చిన పెట్టుబడులు 2021 అక్టోబర్ (రూ.5,215 కోట్లు) తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే, ఈక్విటీల్లోకి నికర పెట్టబుడుల రాక 18వ నెలలోనూ నమోదైంది. సిప్ ద్వారా రూ.12,693 కోట్లు..: ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్, మిడ్కాయ్ప్, స్మాల్క్యాప్ ఫండ్స్లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొత్త పథకాల ఆవిష్కరణపై సెబీ నియంత్రణ ఎత్తివేయడంతో ఏఎంసీలు పలు కొత్త పథకాల ద్వారా నిధులు సమీకరించాయి. హైబ్రిడ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.6,601 కోట్లను వెనక్కి తీసుకున్నారు. బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రూ.38 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఆగస్ట్లో రూ.12,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య అత్యంత గరిష్ట స్థాయి 5.71 కోట్లకు చేరింది. డెట్లోకి భారీగా.. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఆగస్ట్లో రూ.49,164 కోట్లు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.4,930 కోట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి. -
డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
మీ చిన్నారుల భవిష్యత్తు కోసం.. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి!
చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ చక్కని నిధిని సమకూర్చుకోవాలని భావించే వారి ముందు ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఈక్విటీలకు మించినది మరేదీ లేదనే చెప్పుకోవాలి. ఈక్విటీల్లో మంచి పథకాలను ఎంపిక చేసుకుని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సగటు వార్షిక రాబడి 15 శాతం, అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తే, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ను పరిశీలించొచ్చు. సెబీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ విభాగంలోకి ఇది వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక ఐదేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మోస్తరు రిస్క్ భరించగలిగే వారికి హెచ్డీఎఫ్సీ చిల్ట్రన్స్ గిఫ్ట్ ఫండ్ అనుకూలం. పెట్టుబడుల విధానం/రాబడులు ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 7 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ కేటగిరీ రాబడి 4.5 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఐదేళ్ల కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. మైనర్ పేరిటే (18 ఏళ్ల లోపు) ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత చిన్నారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరిట వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఫండ్స్ యూనిట్లు ఎన్నున్నాయో వాటి విలువకు పది రెట్లు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఈ బీమా ఉంటుంది. అస్థిరతల రిస్క్ను తగ్గించుకునేందుకు సిప్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం అనుకూలం. పనితీరు విధానం ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మాదిరిగా హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ పనిచేస్తుంది. డెట్ సాధనాల్లో, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మరో విభాగం నుంచి కొంత కుషన్ ఉంటుంది. రూ.5,217 కోట్ల పెట్టుబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 65.7 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ సాధనాల్లో 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, 14.3 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్టానికి చేరాయని భావించినప్పుడు కొంత మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటుంది. తద్వారా కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి నిల్వలను పెంచుకుంటుంది. ఈ పథకం పోర్ట్ఫోలియోలో 47 స్టాక్స్ వరకు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 20 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ రంగానికి 10 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8 శాతం మేర కేటాయింపులు చేసింది. -
ఈ ఈక్విటీ ఫండ్తో లాభాలొస్తాయా!
ఈక్విటీల్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్లో అనుకూలమైన విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందులో స్పెషల్ సిచ్యుయేషన్ కూడా ఒకటి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ ఫండ్ ఈ విభాగం కిందకే వస్తుంది. పెట్టుబడుల విధానం.. కంపెనీల్లో చోటుచేసుకునే అసాధారణ పరిణామాలను పెట్టుబడుల అవకాశాలుగా ఈ పథకం చూస్తుంది. మంచి అవకాశం అని భావిస్తే ఇన్వెస్ట్ చేస్తుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను పెట్టుబడులకు అనుసరిస్తుంది. ఇందుకోసం 360 డిగ్రీల కోణంలో పరిశోధన చేస్తుంది. ప్రత్యేక పెట్టుబడి సందర్భాలన్నవి ఎన్నో రూపాల్లో ఎదురవుతుంటాయి. ఆయా కంపెనీ లేదా రంగంలో తాత్కాలిక సంక్షోభం వల్ల స్టాక్స్ పడిపోవచ్చు. అంతర్జాతీయ అనిశ్చితులు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంతో దిద్దుబాటుకు లోను కావచ్చు. ఈ పథకానికి ఎస్ నరేన్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నప్పుడు కొన్ని విభాగాల ఫండ్స్ ఆయా స్టాక్స్ నుంచి బయటకు వచ్చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఆ సందర్భాలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ తరహా పథకాలు అవకాశాలుగా చూస్తుంటాయి. అందుకుని ఈ ఫండ్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడులు ఈ పథకం 2019 జనవరి 15న ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో 42 శాతం రాబడులు ఇవ్వగా.. మూడేళ్లలో వార్షికంగా 19 శాతానికిపైనే రాబడులు తెచ్చి పెట్టింది. ఆరంభం నుంచి చూస్తే.. వార్షిక రాబడి రేటు 20 శాతానికిపైనే ఉంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలైన లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్, మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాల కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించడం గమనించాలి. నిఫ్టీ 500 టీఆర్ఐ కంటే కూడా ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. ఆరంభంలో రూ.10 ఇన్వెస్ట్ చేస్తే 2022 ఏప్రిల్ 20 నాటికి రూ.18.46 అయి ఉండేది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,911 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 98 శాతం మేర ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 44 స్టాక్స్ ఉన్నాయి. తన పెట్టుబడుల్లో 64 శాతాన్ని టాప్–10 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసింది. 72 శాతం మేర పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్ క్యాప్లో 19 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 9 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పెట్టుబడుల పరంగా ఇంధన రంగ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అత్యధికంగా 22 శాతం కేటాయింపులు చేసింది. హెల్త్కేర్ కంపెనీల్లో 17 శాతం, ఆటోమొబైల్, నిర్మాణ రంగ కంపెనీలలో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ’’దీర్ఘకాలంలో స్పెషల్ సిచ్యుయేషన్ పెట్టుబడులు మంచి రాబడులు కురిపిస్తాయి. అయితే స్వల్పకాలంలో అస్థిరతలు ఉండవని చెప్పలేం. ఎన్నో అంచనాలతో చేసిన పెట్టుబడులు మధ్య కాలం నుంచి ఫలితాలు ఇవ్వడం కనిపిస్తాయి’’అని ఎస్.నరేన్ ఇన్వెస్టర్లకు సూచించారు. -
మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత అధికమైంది. ఇందుకు నిదర్శనంగా మార్చి నెలలో రూ.28,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక నెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్, హెచ్ఎన్ఐ (అధిక నెట్వర్త్ ఉన్నవారు) ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన ఫలితమే ఇదని విశ్లేషకులు అంటున్నారు. ఇక వరుసగా 13వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,705 కోట్లుగా ఉంటే, జనవరిలో రూ.14,888 కోట్లు, 2021 డిసెంబర్లో రూ.25,077 కోట్ల చొప్పున వచ్చాయి. మార్చి నెలకు సంబంధించిన గణంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మరింత వివరంగా గణాంకాలు.. ► 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ పథకాలు రూ.1,64,399 కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించడం విశేషం. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 2020–21లో రూ.25,966 కోట్లు నికరంగా బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల మారిన ఇన్వెస్టర్ల వైఖరిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ► ఈక్విటీ పథకాలు 2021 మార్చి నుంచి నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కరోనా రెండో విడత మార్కెట్లలో కరెక్షన్కు దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపించారు. దీనికంటే ముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల కాలంలో ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► ఈక్విటీల్లో దాదాపు అన్ని రకాల పథకాలు మార్చి మాసంలో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయి. అత్యధికంగా మల్టీక్యాప్ కేటగిరీ పథకాల్లోకి రూ.9,695 కోట్లు వచ్చాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మల్టీక్యాప్ ఫండ్ను ప్రారంభించి రూ.8,170 కోట్లను ఆకర్షించడం అధిక పెట్టుబడుల రాకకు కలిసొచ్చింది. ► లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్, లార్జ్క్యాప్ ఫండ్స్ విభాగాలు ఒక్కోటీ రూ.3,000 కోట్లకు పైనే ఆకర్షించాయి. ► ఈటీఎఫ్ పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.10,719 కోట్లు వస్తే, మార్చిలో రాక రూ.6,907 కోట్లకు పరిమితమయ్యాయి. ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాలు రెండింటిలోకి కలిపి రూ.19,219 కోట్లు వచ్చాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.1.15లక్షల కోట్లు బయటకు వెళ్లాయి. ఫిబ్రవరిలో రూ.8,274 కోట్లు నికరంగా ఈ విభాగంలోకి వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్లోకి మార్చి నెలలో రూ.44,604 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ మొత్తం రూ.40,273 కోట్లుగా ఉన్నాయి. ► క్రెడిట్ రిస్క్ పథకాలు రూ.399 కోట్లను ఆకర్షించాయి. ఫిబ్రవరిలో వీటి నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.388 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. ► మొత్తం మీద మ్యూచువల్ పండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ.69,883 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. అంతకు ముందు నెలలో నికర పెట్టుబడి రాక రూ.31,533 కోట్లుగా ఉంది. ► అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.38.56 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.37.7 లక్షల కోట్లకు తగ్గింది. సిప్ పెట్టుబడులూ ఆల్టైమ్ గరిష్టం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలోనూ భారీగా రూ.12,328 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా నెలవారీగా అత్యధిక పెట్టుబడులు కావడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చితుల్లోనూ సిస్ పెట్టుబడులు ఆల్టైమ్ గరిష్టానికి చేరడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని ప్రతిఫలిస్తోందని నిపుణులు అంటున్నారు. రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది.. ‘‘రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం మార్కెట్లలో అనిశ్చితులకు దారితీసింది. దీంతో అధిక కేటాయింపులు చేసుకునేందుకు, ప్రస్తుత పెట్టుబడుల్లో మార్పులు చేసుకునేందుకు దీన్ని ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. ఈక్విటీల్లో రిస్క్ ధోరణి గరిష్టానికి చేరింది. ఇది మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచిది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ‘‘చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఫిబ్రవరి చివర, మార్చి మొదట్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. దీంతో ఈక్విటీలకు కేటాయింపులు చేసుకునేందుకు ఇన్వెస్టర్ల అవకాశం ఏర్పడింది’’అని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
కంపెనీలో వారికి ఆహ్వానం పలకనున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక పెట్టుబడిదారు సంస్థను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల జారీని చేపట్టనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల అంశాన్ని ఈ నెల 28న(శుక్రవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు తెలియజేశాయి. రుణ చెల్లింపుల ఒత్తిడి వంటి అంశాలుకాకుండా దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలకు అనుగుణంగా మాత్ర మే పెట్టుబడిదారు సంస్థకు ఈక్విటీ జారీ యోచనలో ఉన్నట్లు వివరించాయి. వెనువెంటనే పెట్టుబడుల ఆవశ్యకత లేనప్పటికీ భారతీ ఎయిర్టెల్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ జారీ యోచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 3.25 శాతం లాభపడి రూ. 712 వద్ద ముగిసింది. -
వొడాఫోన్-ఐడియాలో వాటా: మాంచి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్-ఐడియా తన మేజర్ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. కంపెనీలో మేజర్ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే.. నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను.. ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్ఎన్ఎల్గా మారనుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్ అందుకుంది. సంబంధిత పూర్తి కథనం: ప్రభుత్వం చేతికి వొడాఐడియా! -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
ఎఫ్డీఐల రాకలో 62 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు.. మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయి. చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి -
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ?
నేను యాక్సిస్ మిడ్క్యాప్, యాక్సిస్ బ్లూచిప్, మిరేఅస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకాల్లో గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని కంపెనీల షేర్లు సైతం ఇదే కాలంలో 100–200 శాతం పెరగడాన్ని గమనించాను. కనుక మంచి రాబడుల కోసం నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? – ప్రశాంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు పథకాలు కూడా మంచివే. వీటితో కూడిన పోర్ట్ఫోలియో సమతూకంగానే ఉంది. అయితే, యాక్సిస్కు చెందిన రెండు పథకాల్లో ఏదో ఒక దానిలోనే ఇన్వెస్ట్ చేసుకుని.. ఇతర ఫండ్హౌస్కు చెందిన మరో పథకాన్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల వైవిధ్యం పెరిగి రిస్క్ తగ్గుతుంది. ఈ మూడు పథకాల్లోనూ సమానంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు మూడింట రెండొంతులు యాక్సిస్ ఫండ్ పథకాల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంబంధిత ఫండ్హౌస్ పరంగా అంచనాలు తప్పితే రాబడులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని యాక్సిస్కు చెందిన ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేసుకుని, రెండో పథకానికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో రాబడులను.. ఏ కంపెనీ షేరుతోనూ పోల్చి చూడకూడదు. మీ మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరును సంబంధిత సూచీ రాబడులతోనే పోల్చి చూడాలి. అంటే మిడ్క్యాప్ పథకాన్ని మిడ్క్యాప్ ఇండెక్స్ రాబడులతోనే పోల్చి చూడాలి. నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వారు కేవలం ఒకటి, రెండు కంపెనీల్లోనే పెట్టుబడులకు పరిమితం కాకూడదు. తగినంత వైవిధ్యం కోసం కనీసం 10–20 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పోర్ట్ఫోలియో నిర్వహించినట్టయితే రాబడులు మోస్తరుగా ఉంటాయి. రిస్క్ కూడా తగ్గుతుంది. ఎవరైనా కానీ ఒక కంపెనీ 200 శాతం రాబడులను ఇస్తుందని పెట్టుబడులన్నింటినీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. 200 శాతం రాబడులకు అవకాశం ఎలా అయితే ఉంటుందో.. కొనుగోలు ధర నుంచి 60–70 శాతం పతనానికీ అవకాశం ఉంటుంది. ఈ రిస్క్లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు వైవిధ్యమైన పోర్ట్ఫోలియోను నిర్వహిస్తుంటాయి. అలాంటప్పుడు రాబడులు మోస్తరు నుంచి మెరుగ్గా దీర్ఘకాలానికి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10లక్షలను ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరైన సమయమేనా? నేను కనీసం పదేళ్లపాటు నా పెట్టుబడులను కొనసాగించగలను – గజేంద్ర రూ.10లక్షలు అన్నవి మీకు అంత అవసరమైనవి కాకపోతే ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి గణనీయమైన పెట్టుబడి మొతాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఒకేవిడత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కిందకు వెళితే మీరు కచ్చితంగా భయానికి లోనవుతారు. భయపడి పెట్టుబడులను నష్టాలతో వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న మీ ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. కనుక క్రమంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీదగ్గర ఉన్న పెట్టుబడులను వచ్చే 12–15 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు భారీ పెట్టుబడి అనిపిస్తే 18–36 నెలల పరిధిలో పెట్టుబడులు పెట్టడాన్ని విస్తరించుకోవడం కూడా సూచనీయం. రిటైర్ అయిన వ్యక్తి క్రమ ఆదాయం కోసం ఎన్పీఎస్ టైర్–2 అకౌంట్ను వాడుకోవచ్చా? – ఎం.మాధుర్ ఆదాయం పన్ను పరిధిలో లేకపోతే మీ సౌకర్యం ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఎన్పీఎస్ సరైన ఆప్షన్ అవుతుంది. మీ అస్సెట్ అలోకేషన్ (ఏ విభాగంలో ఎంత మేర కేటా యింపులు) ఆధారంగా ఈ తరహా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్పీఎస్లో అందుబాటులో ఉన్న మూడు రకాల ఆప్షన్లలో సరైనది ఎంపిక చేసుకోవడం మీ బాధ్యతే. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి ఎంత కేటాయింపులు చేయగలరు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరనే దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్థిరాదాయ పథకాల కంటే ఎక్కువ రాబడులను మీరు ఆశిస్తున్నట్టు అయితే.. మీ ఆదాయం రూ.6.5 లక్షల వరకు ఉన్నట్టయితే అప్పుడు రూ.1.5 లక్షలను పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో మిగిలిన రూ.5లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఈక్విటీలకు కేటాయింపులు 20–30% మించనీయకండి. డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే కూడా స్థిరాదాయ ప్లాన్ల నుంచే తీసుకోవాలి. ఇదే మాదిరి మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిట్గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జిరోదా..! -
భారత్పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
ఈక్విటీల్లో ఈపీఎఫ్వో రూ.7,715 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) జూన్తో ముగిసిన మూడు నెలల కాలంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం) ఈక్విటీల్లో రూ.7,715 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్తెలి ఈ విషయాన్ని లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్వో తన నిర్వహణలోని మొత్తం నిధుల్లో 15 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్వో నేరుగా షేర్లలో కాకుండా ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2020–21లో ఈపీఎఫ్వో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లను, 2019–20లో రూ.32,377 కోట్లు, 2018–19లో రూ.27,743 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
ఈక్విటీల్లో పన్ను మినహాయింపు అధికంగా పొందాలంటే ?
క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటీ ? ఈక్వీటీల నుంచి ఎక్కువ లాభాలు పొందాలంటే ఏం చేయాలని ఇలాంటి అంశాలపై ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్పై ఆసక్తి ఉన్న వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు మార్కెట్ నిపుణులు , వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ వివరణ మీ కోసం.. నా వయసు 60 ఏళ్లు. ఈక్విటీల్లో నా పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నది నా ఆలోచన. ఈ పెట్టుబడులను బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి మళ్లించుకోవాలా? ఒకవేళ డెట్ ఫండ్స్కు మారేట్టు అయితే నా పెట్టుబడికి ఏదైనా రిస్క్ ఉంటుందా? రెండు నుంచి మూడు మంచి డెట్ పథకాలను సూచించగలరు? – రామకృష్ణ, భీమవరం మీ లాభాలను కాపాడుకోవాలనుకుంటే అందుకున్న ఏకైక మార్గం ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే. దాంతో మార్కెట్పై ఇక ఎంతమాత్రం ఆధారపడి ఉండరు. ఈక్విటీల్లో స్వల్పకాలంలోనే అధిక రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, దీర్ఘకాలంలో అంత రిస్క్ ఉండదు. మీరు 60 ఏళ్లకు వచ్చి, గణనీయమైన రాబడులను ఈక్విటీల్లో సంపాదించుకున్నారు కనుక.. భవిష్యత్తులో ఈక్విటీలు కరెక్షన్ను చూస్తే విచారించకూడదనుకుంటే ఇందులో అధిక భాగాన్ని డెట్ ఫండ్స్కు మళ్లించడం మంచి ఆలోచనే అవుతుంది. దీనిని ప్రణాళిక మేరకు చేసుకోవాలి. అంతేకానీ, ఈక్విటీలకు మొత్తంగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం, వీటిల్లో ఏవి మెరుగన్నది చూస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే, వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీకు వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ లాభాలను తీసుకునే వరకు పన్ను వర్తించదు. ఒకవేళ డెట్ ఫండ్స్లో లాభాలను స్వీకరించేట్టు అయితే.. అది కూడా ఇన్వెస్ట్ చేసి మూడేళ్లలోపు అయితే.. ఆ లాభాలను కూడా ఆదాయంగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. దానిపై మీ పన్ను శ్లాబు మేరకు పన్ను చెల్లించాలి. ఒకవేళ డెట్లో పెట్టుబడులు మూడేళ్లకుపైగా కొనసాగించిన తర్వాత లాభాలను స్వీకరిస్తే అందులో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన లాభాలపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్లో రాబడులపై నికరంగా పన్ను భారం తక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఎక్కువ పథకాలు సురక్షితమే. కానీ, రాబడులకు అవి ఎటువంటి హామీ ఇవ్వవు. వీటిల్లో రాబడులు వడ్డీ రేట్లకు అనుగుణంగానే ఉంటుంటాయి. డెట్ ఫండ్ను ఎంపిక చేసుకునే ముందు ఇటీవలి పనితీరును చూడకుండా.. పెట్టుబడుల్లో నాణ్యతను చూడాలి. డెట్ ఫండ్స్లో స్వల్పకాలం కోసం యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్, ఐడీఎఫ్సీ బాండ్ షార్ట్ టర్మ్ ఫండ్, ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లను పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన నికర రాబడులను ఆశించొచ్చు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఏది సురక్షితమైనది? – రిషికేష్, విశాఖపట్నం క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మధ్య అంతర్లీనంగా ఉండే వ్యత్యాసం వాటి పెట్టుబడుల్లో ఉండే క్రెడిట్ రిస్కే. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని అత్యధిక నాణ్యత కలిగిన బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ నాణ్యత కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి పెట్టుబడుల్లో అధిక రిస్క్ తీసుకుని, అధిక రాబడులను ఇచ్చే విధానంతో పనిచేస్తుంటాయి. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న కంపెనీలు నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లలో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయాల్లో ఇటువంటి కంపెనీలు అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తరహా రిస్క్ ఉంటుంది కనుక ఆయా సంస్థలు జారీ చేసే బాండ్లపై అధిక వడ్డీ రేటును ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తుంటాయి. కనుకనే క్రెడిట్రిస్క్ ఫండ్స్ ఎక్కువ రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. దాంతో అధిక రిస్క్ వీటిల్లో ఉంటుంది. ఇక మీరు అడిగిన సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కోసం అయితే ఈ రెండు కూడా తగినవి కావన్నది నా నమ్మకం. వీటికి బదులు లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి లిక్విడిటీ పరంగా, వడ్డీ రేట్ల అస్థితరల పరంగా కాస్త మెరుగైన ఎంపిక అవుతాయి. వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ -
దివాలా కంపెనీలకు స్పెషల్ ట్యాగ్
ముంబై: కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభమైన కంపెనీల విషయంలో ఇన్వెస్టర్లకు స్పష్టతను ఇచ్చేందుకు వీలుగా దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మార్గదర్శకాలు రూపొందించాయి. తద్వారా ఇలాంటి కంపెనీల లిస్టింగ్ అంశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని అందించేందుకు నడుం బిగించాయి. ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా పలు కంపెనీలు వాటాదారులకు ఎలాంటి చెల్లింపులనూ చేపట్టకుండానే తమ ఈక్విటీల డీలిస్టింగ్ లేదా రైటాఫ్, రద్దు వంటివి చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దివాలా ప్రక్రియలో భాగంగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) రుణ పరిష్కార ప్రణాళికలను ఆమోదించడంలో తొలి ఆదేశాలు, తదుపరి రాతపూర్వక ఆదేశాలకు మధ్య గడువుకు ఆస్కారం ఉంటోంది. దీంతో ఎన్సీఎల్టీకి చేరిన కంపెనీలు ఈ అంశాలపై తగిన విధంగా సమాచారాన్ని అందించడంలేదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలియజేశాయి. ఎన్సీఎల్టీ నుంచి రాతపూర్వక ఆదేశాలు వచ్చేవరకూ స్టాక్ ఎక్సే్ంజీలకు వివరాలను దాఖలు చేయడంలేదని వివరించాయి. ఇలాంటి సమాచారం ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుతున్నదని, ఇది అస్పష్టతకు తావిస్తున్నదని తెలియజేశాయి. వెరసి మార్కెట్లలో ఈ కంపెనీల లిస్టింగ్ సమాచారంపై గందరగోళం నెలకొంటున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా రూపొందించిన నిబంధనలలో భాగంగా కార్పొరేట్ రుణ పరిష్కార ప్రక్రియకు చేరిన కంపెనీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేయనున్నాయి. సెబీ ఎల్వోడీఆర్ నియంత్రణల ప్రకారం ఈ ఆదేశాలు జారీకానున్నాయి. వీటిని స్టాక్ ఎక్సే్ంజీల వెబ్సైట్లలో పొందుపరచరు. ఆయా కంపెనీల ఈమెయిల్స్కు పంపిస్తాయి. ఎల్వోడీఆర్ నిబంధనలను రిజల్యూషన్ ప్రొఫెషనల్ అమలు చేయవలసి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై నిర్ణయాలను 30 నిముషాల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. దీంతోపాటు లిస్టెడ్ సెక్యూరిటీల వాటాదారులపై ఈ ప్రభావానికి సంబంధించి తగిన సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఆయా కంపెనీలు, రుణపరిష్కార నిపుణులు.. రిజల్యూషన్ ప్రణాళికకు చెందిన రహస్య అంశాలపట్ల ఎక్సే్ంజీలకు దాఖలు చేసేటంత వరకూ గోప్యతను పాటించవలసి ఉంటుంది. ఏదైనా కంపెనీ ఎన్సీఎల్టీకి చేరిన వెంటనే ఎక్సే్ంజీలు టాగ్ చేస్తాయి. ఇలాంటి కంపెనీల జాబితాను సైతం పొందుపరుస్తాయి. ఎన్సీఎల్టీ ఆదేశాలు ఏవైనా ఉంటే అలర్ట్ను ప్రకటిస్తాయి. -
యులిప్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: యూనిట్ ఆధారిత బీమా పథకాలకు (యులిప్/ఈక్విటీలతో కూడిన) ఇన్వెస్టర్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో యులిప్ల్లో పెట్టుబడులు పెరిగినట్టు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యులిప్లలో పెట్టుబడుల నిర్వహణ సౌకర్యంగా ఉండడం కారణమని ఈ సంస్థ పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు రానున్న సంవత్సరంలో యులిప్లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సర్వేలో చెప్పారు. కరోనా మొదటి దశ తర్వాత యులిప్ల పట్ల తమకు ఇష్టం పెరిగినట్టు 92 శాతం మంది చెప్పారు. యులిప్ ప్లాన్లు ఒకవైపు జీవిత బీమా రక్షణ కల్పిస్తూ, మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుంటాయి. ప్రీమియంలో కొంత బీమా రక్షణకు పోగా, మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఎంపిక చేసుకున్న సాధనాల్లో బీమా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నీల్సన్ ఐక్యూ సాయంతో బజాజ్ అలియాంజ్ లైఫ్ ఈ సర్వే నిర్వహించింది. మెట్రో, నాన్ మెట్రోల్లో 499 మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ‘‘యులిప్లలో పెట్టుబడుల పురోగతిని సమీక్షించుకోవడం సులభంగా ఉంటుంది. వ్యయాలు తక్కువగా ఉంటాయి. రైడర్ లేదా టాపప్ జోడించుకోవడం, నిధులను వెనక్కి తీసుకోవడం సులభం’’ అని సర్వే తెలిపింది. ఆకర్షించే సదుపాయాలు.. మధ్యాదాయ వర్గాల వారు యులిప్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండడాన్ని ఇష్డపడుతున్నారు. 21–30 సంవత్సరాల్లోని వారు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడుల సాధనం) రూపంలో యులిప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. అదే 50 ఏళ్లకు పైన వయసులోని వారు యులిప్లో ఒకే విడత (సింగిల్ప్రీమియం) ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ను ఇష్టపడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండానే యులిప్లలో పెట్టుబడులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చుకునే సదుపాయం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో ఈ సౌకర్యం లేదు. ఎక్కువ మందికి నచ్చే అంశం బీమా రక్షణకుతోడు, పెట్టుబడుల అవకాశం ఉండడం. అన్ని వర్గాలకూ నచ్చే సాధనం.. ‘‘అన్ని రకాల వయసులు, ఆదాయ వర్గాలు, భౌగోళిక ప్రాంతాల్లోనూ యులిప్ల పట్ల ఆదరణ ఉన్నట్టు ఈ సర్వే రూపంలో తెలుస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతోపాటు, పెట్టుబడుల్లో సౌకర్యం, బీమా రక్షణ, ఉపసంహరణకు వీలు ఇవన్నీ యులిప్ల కొనుగోలుకు దారితీసే అంశాలు’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య మార్కెటింగ్ అధికారి చంద్రమోహన్ మెహ్రా తెలిపారు. తమ దీర్ఘకాల లక్ష్యాలకు బీమా ప్లాన్లు కూడా ప్రాధాన్య సాధనంగా ఎక్కువ మంది పరిగిణిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం
ముంబై: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన విజయ డయగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూకి రెడీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు ఢిల్లీలో ఈ సంస్థకు మొత్తం 13 నగరాల్లో 80 రోగ నిర్థారణ కేంద్రాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ సంస్థ నిధుల సేకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు సెబికి దరఖాస్తు చేసింది. 35 శాతం విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రమోటర్ ఎస్ సురేంథ్రనాథ్రెడ్డితో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు సంయుక్తంగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3.56 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ద్వారా కంపెనీలో 35 శాతం షేర్లు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందులో 5 శాతం షేర్ ప్రమోటర్ సురేంద్రనాథ్కి కాగా మిగిలిలిన 30 శాతం షేర్లు ప్రైవేటు ఈక్వీటీ సంస్థది. లాభాల బాటలో విజయ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థ 2016లో విజయ డయగ్నోస్టిక్స్లో పెట్టుబడులు పెట్టింది. తాజా షేర్ల విక్రయం ద్వారా ఆ సంస్థ విజయ నుంచి దాదాపుగా తప్పుకోనుంది. గతేడాది విజయ డయాగ్నోస్టిక్స్ నికర లాభం రూ. 84.91 కోట్లు. అంతకు ముందు రూ. 62 కోట్ల లాభాన్ని ఆ సంస్థ ప్రకటించింది. -
చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఈక్విటీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 19 శాతం బలపడ్డాయి. దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ సంస్కరణలు, పెట్టుబడి అవకాశాలు, బిజినెస్లకు సరళ వాతావరణం ఇందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలియజేసింది. ఈక్విటీ, ఆర్జనలను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులతో కలిపి మొత్తం ఎఫ్డీఐలు 10 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. వెరసి చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇవి 74.39 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో ఈక్విటీ ఎఫ్డీఐలు 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశాలవారీగా చూస్తే... దేశీ ఎఫ్డీఐలలో 29 శాతం వాటాతో సింగపూర్ టాప్ ర్యాంకులో నిలవగా.. యూఎస్ 23 శాతం, మారిషస్ 9 శాతం చొప్పున వాటాను ఆక్రమించాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల విషయంలో కేంద్ర తీసుకున్న విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల అనుకూలత, సులభతర వ్యాపార నిర్వహణ తదితర అంశాలు ఇందుకు సహకరించినట్లు వాణిజ్య శాఖ వివరించింది. వెరసి ప్రపంచ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య దేశంగా భారత్ నిలుస్తున్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. రంగాలవారీగా..: ఎఫ్డీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న రంగాలలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 44 శాతం వాటాతో అగ్రపథాన నిలవగా.. నిర్మాణం(మౌలిక సదుపాయాలు) 13 శాతం, సరీ్వసుల రంగం 8 శాతం చొప్పున జాబితాలో చేరాయి. రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్కు 37 శాతం పెట్టుబడులు లభించగా.. 27 శాతం వాటాతో మహారాష్ట్ర రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో కర్ణాటక 13 శాతం ఎఫ్డీఐలను సాధించింది. -
ఇండస్ఇండ్కు తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్నకు చెందిన బ్యాంక్ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం! 2019లో..: ప్రమోటర్ సంస్థలు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, ఇండస్ఇండ్ లిమిటెడ్కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫైనాన్స్ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది. -
మీ అడుగులు ఎటువైపు..
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీలు రంగాలు.. ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. – శ్రేయాష్ దేవల్కర్, సీనియర్ ఫండ్ మేనేజర్, యాక్సిస్ ఏఎమ్సీ మిడ్, స్మాల్క్యాప్ మార్చి, జూన్ త్రైమాసికాలపై లాక్డౌన్ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్క్యాప్ కంపెనీలు 2020 సెప్టెంబర్ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, రిటైల్ స్టాక్స్ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్క్యాప్లో ఇన్వెస్ట్ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్లో పెట్టుబడుల వైపు చూడొచ్చు. ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ డెట్ వడ్డీ రేట్లు..! రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్ కర్వ్ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్ కర్వ్ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు సన్నద్ధంగానూ ఉండాలి. – అనురాగ్ మిట్టల్, ఐడీఎఫ్సీ ఫండ్ ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ ఏవి మెరుగు? ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్ బకెట్ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్ లేదా డ్యురేషన్ ఫండ్స్తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్ బకెట్ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్ స్ప్రెడ్స్ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి రిస్క్కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం. పసిడి లార్జ్క్యాప్.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్ పవర్) తిరిగి లభించింది. డిమాండ్ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు. ర్యాలీ ముగిసినట్లేనా? కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్మూవ్ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. గోల్డ్ ఈటీఎఫ్లు.. భారత్లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్ను తగ్గించి, పోర్ట్ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ ఏఎమ్సీ రియల్టీ ఇళ్లకు డిమాండ్ 2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్ పుంజుకుంది. కొత్త ఏడాది! ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ డిమాండ్ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం కావు. వాణిజ్య రియల్టీ అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాము. – శిశిర్ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా -
లాభాలు తీసుకోండి.. రీబ్యాలెన్స్ చేసుకోండి
స్టాక్ మార్కెట్లు మార్చిలో చూసిన కనిష్టాల నుంచి భారీగానే రికవరీ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల్లోని స్టాక్స్ వరుసగా ర్యాలీ బాట పడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం కనిష్ట స్థాయిల నుంచి గణనీయంగానే పెరిగాయి. ఇంకా పెరుగుతాయన్న ధోరణి కాకుండా.. ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ పెరిగిందన్న సత్యాన్ని గుర్తించాలి. దీనికి తగినట్టు పోర్ట్ ఫోలియోను సవరించుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. దీన్నే పోర్ట్ పోలియో రీబ్యాలెన్స్ గా చెబుతారు. ఇన్వెస్టర్ తన లక్ష్యాలకు తగిన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంచుకోవడం, అందుకు అనుగుణంగా వాటికి కేటాయింపులు చేసుకోవడం పోర్ట్ ఫోలియో అలొకేషన్ అవుతుంది. వివిధ మార్కెట్లలో రాబడుల తీరుకు అనుగుణంగా పోర్ట్ ఫోలియోలోనూ మార్పులు అవసరం అవుతాయి. ఆ వివరాలను ‘మై మనీ మంత్ర’ ఎండీ రాజ్ ఖోస్లా వివరించారు. అందరికీ అన్ని సాధనాలు ఒకే విధంగా అనుకూలంగా ఉండవు. ఉదాహరణకు రమణ (39) సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు సంపాదన రూ.లక్ష వరకు ఉంటుంది. సంతానం ఒకే కుమారుడు. దీంతో వీరికి ప్రతీ నెలా రూ.60వేల వరకు మిగులు కనిపిస్తోంది. మరో ఉదాహరణలో గోపాల్ (32) ఓ ఫార్మా కంపెనీ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తుంటాడు. నెలకు ఆదాయం రూ.40వేలు. సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు. నెలలో మిగులు కష్టంగా ఉంటోంది. కొన్ని ఖర్చులను నియంత్రించుకుంటే రూ.5వేల వరకు పొదుపు చేసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఈ రెండు కేసుల్లో ఆదాయ స్థాయిలు మారిపోయాయి. వారి అవసరాల్లోనూ, కుటుంబ సభ్యుల సంఖ్యలోనూ మార్పులు గమనించొచ్చు. వీరిలో రమణ అధిక ఆదాయ పరుడు. చిన్న కుటుంబం. బాధ్యతలు తక్కువ. కనుక రిస్క్ ఎక్కువగా తీసుకోగలడు. కనుక ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, గోపాల్ పరిస్థితి వేరు. మిగిలేదే తక్కువ. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోలేని పరిస్థితి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేడు. ఇలా ప్రతీ ఒక్కరూ అవసరాలు, ఆదాయాలు, మిగులు, జీవిత లక్ష్యాలు, బాధ్యతలను అనుసరించి వారి పోర్ట్ ఫోలియో అలొకేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్ ఫోలియో అంటే.. ఈక్విటీ, డెట్, డిపాజిట్స్, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో పెట్టుబడులు. భిన్న సాధనాల మధ్య చేసిన కేటాయింపులను.. అవసరమైనప్పుడల్లా సమతూకం ఉండేలా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల పెట్టుబడులు ఒకే తీరులో, ఒకే దిశలో చలిస్తాయని చెప్పలేము. ఇందుకు ఈ ఏడాది తొలి ఆరు నెలలే ప్రత్యక్ష నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్టాల నుంచి చూస్తే 50 శాతానికి పైగా ఐదు నెలల్లో పెరిగాయి. బంగారం 20 శాతం పెరిగింది. రాబడులన్నవి ఈక్విటీ, బంగారంలో ఒకే మాదిరిగా లేకపోవడాన్ని గమనించొచ్చు. ఎవరైనా ఒకరు తమ ఆర్థిక ప్రణాళిక మేరకు.. ఈ ఏడాది జనవరిలో 60% ఈక్విటీలకు, 30 శాతం డెట్ సాధనాలకు, మరో 10 శాతం బంగారానికి కేటాయించారనుకుంటే.. ఆగస్ట్ చివరి నాటికి చూస్తే ఈక్విటీ పెట్టుబడుల శాతం 55గాను, డెట్ పెట్టుబడులు 32.5 శాతంగాను, బంగారం 12.5 శాతంగా మారి ఉంటాయి. ఇక రానున్నఆరు నెలల్లో ఈక్విటీలు మరో 5 శాతం క్షీణించి, డెట్ 7 శాతం, బంగారం 10 శాతం పెరుగుతుందనుకుంటే.. అప్పటికి ఈక్విటీల్లో 53 శాతం, డెట్లో 34 శాతం, బంగారంలో 14శాతంగాను ఉంటాయి. ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత రాబడులను ఆశిస్తున్నారనే అంశాల ఆధారంగా ఈ కేటాయింపులు చేసుకుని ఉండొచ్చు. కానీ కొంత కాలానికి వీటిల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈక్విటీలకు 60% అనుకుంటే 55 శాతానికి తగ్గిపోయి, మిగిలిన రెండు సాధనాల్లోని పెట్టుబడుల విలువ పెరిగింది. ఈ వ్యత్యాసం ప్రస్తుతం చూడ్డానికి చాలా స్వల్పమే అనిపించొచ్చు. కానీ దీర్ఘకాలానికి రాబడుల పరంగా ఈ వ్యత్యాసం భారీగా ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకే ఈ సమయంలో పోర్ట్ ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈక్విటీల్లో పెట్టుబడులను తిరిగి 60 శాతానికి పెంచుకోవాలి. అందుకోసం డెట్, బంగారంలో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. బుల్ రన్ చూసి అధిక ఉత్సాహంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకుంటే ఆటుపోట్లు భారీగా పెరిగే అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ పెరిగిన స్థాయి నుంచి మళ్లీ పడిపోతే పెట్టుబడుల విలువ క్షీణిస్తుంది. తగిన ప్రణాళికకు మార్గం పడిన మార్కెట్లు మళ్లీ పెరగడం సహజం. కానీ, మార్కెట్లు రికవరీ అయినా కానీ, ఇన్వెస్టర్ పోర్ట్ ఫోలియోలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ అదే స్థాయిలో రికవరీ అవ్వకపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్ రీబ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దానివల్ల రిస్క్ ను కూడా నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. తద్వారా ఇన్వెస్టర్ విశ్వాసం మరింత పెరుగుతుంది. తన పోర్ట్ ఫోలియోలో ఏదేనీ ఒక విభాగం కరెక్షన్ లోనైనప్పుడు ఇన్వెస్టర్ భయపడిపోకుండా తన పెట్టుబడులను ప్రణాళిక మేరకు సవరించుకుని కొనసాగించుకునే వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టాలను ఎదుర్కొని ఉంటారు. కానీ, క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఈ ఏడాది జనవరిలో తమ పోర్ట్ ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుని ఉండి ఉంటారో వారు మంచి సక్సెస్ చవి చూసి ఉంటారు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. రీబ్యాలెన్స్ విధానం తెలిసి, దాన్ని ఆచరిస్తున్నవారు అయితే భారీగా పెరిగిన ఈక్విటీ విభాగంలో పెట్టుబడులను తగ్గించుకుని ఉండేవారు. దాంతో అనంతరం మార్చిలో భారీ పతనం తర్వాత ఈక్విటీ పెట్టుబడుల విలువ తగ్గినందున మరిన్ని పెట్టుబడులకు అవకాశం లభించేది. ఇన్వెస్ట్మెంట్పై ఆటుపోట్లను తగ్గించుకునే ప్రయత్నం మార్కెట్లలో ఆటుపోట్లను ఇన్వెస్టర్లు నియంత్రించలేరన్నది నిజం. కాకపోతే ఈ ఆటుపోట్ల ప్రభావం తమ పెట్టుబడులపై తక్కువగా ఉండేలా రిస్క్ను నియంత్రించుకోగలరు. ఇందుకు చేయాల్సిందల్లా పెట్టుబడుల్లో సమతుల్యం ఉండేలా చూసుకోవడమే. నిర్ణయించుకున్న మేర వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపులను సవరించుకోవాలి. ఇన్వెస్ట్ చేసి, అవసరం వచ్చే నాటి వరకు వాటిని పట్టించుకోని వారితో పోలిస్తే.. క్రమానుగతంగా తమ పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకునే వారే దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను సొంతం చేసుకుంటున్నట్టు చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏదేనీ ఒక విభాగంలో (ఈక్విటీ లేదా డెట్ లేదా గోల్డ్) గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు లేదా కనీసం ఏడాదికి ఒక పర్యాయం అయినా పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆర్థిక సంవత్సరం చివర్లో ఈ పని చేయడం ద్వారా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు ఉంటే సొంతం చేసుకోవచ్చు. అయితే రీబ్యాలెన్స్ అన్నది రిస్క్ తగ్గించుకునేందుకే కాదు.. మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల ఇన్వెస్టర్ పొందొచ్చు. అప్పటి వరకు బాగా పెరిగిన వాటి నుంచి పెట్టుబడులను తీసుకుని, ర్యాలీకి సిద్ధంగా ఉన్న నాణ్యమైన వాటిల్లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. చెట్టు నుంచి పుష్పాలను కోసుకుని, మళ్లీ పువ్వుల కోసం చెట్టుకు నీరు, పోషకాలు ఇచ్చినట్టే.. పెట్టుబడుల రీబ్యాలెన్స్ రాబడుల ఫలాలను ఇస్తుందని నిపుణుల సూచన. ఆర్థి క, పెట్టుబడుల వ్యవహారాలు అంత సులభమైనవి కావు. తగిన విషయ జ్ఞానంతోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం సూచనీయం. -
హెచ్ఎస్ఐఎల్ జూమ్- జీఎంఎం పతనం
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్ఎస్ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్కు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్కాగా.. నేటి నుంచి ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది. -
ధనుకా అగ్రి- హెచ్ఎస్ఐఎల్ బైబ్యాక్ జోష్
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 261 పాయింట్లు క్షీణించి 39,042 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అగ్రికెమికల్స్ కంపెనీ ధనుకా అగ్రిటెక్, శానిటరీవేర్, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ధనుకా అగ్రిటెక్ షేరుకి రూ. 1,000 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ధనుకా అగ్రిటెక్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్లో భాగంగా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్కు ఈ నెల 28 రికార్డ్ డేట్కాగా.. ఇందుకు రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 839ను అధిగమించింది. ప్రస్తుతం 6.3 శాతం లాభంతో రూ. 817 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఎస్ఐఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 21న(సోమవారం) బోర్డు సమావేశమవుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత హెచ్ఎస్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్చేసి రూ. 75ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 72 వద్ద ట్రేడవుతోంది. కాగా.. లాక్డవున్ల కారణంగా ఈ ఏడాది క్యూ1లో హెచ్ఎస్ఐఎల్ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే. -
మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్ ఏకంగా రూ.27లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతాయి. హరించుకుపోయిన ఈ మొత్తం ధనం దేశ జీడీపీలో 13.5శాతంగా ఉంది. కోవిడ్ సంక్షోంభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కేంద్ర ప్రకటించిన రూ.20లక్షల కోట్ల పోలిస్తే 35శాతం ఈ మొత్తం విలువ అధికం. ఇదే ఏడాదిలో ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్ రిటర్న్లను ఇచ్చాయి. ఇదే సమయంలో బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10శాతం కంపెనీల షేర్లు మాత్రం రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. మోదీ ఏడాది పాలనకు 10మార్కులకు 7 మార్కులిచ్చిన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపక్ జైసనీ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ పనితీరు నిర్ధారణకు మార్కెట్-క్యాపిటలైజేషన్ ప్రమాణికం కాదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద మాత్రమే ఆధాపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటు ఇతర అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’’అని అన్నారు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
40,000 దాటిన సెన్సెక్స్
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్టైమ్ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి. ఈక్విటీ పన్ను సంస్కరణలు.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్ ప్యాకేజీ నిమిత్తం కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్ ఐడియా షేర్ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది. ఎయిర్టెల్ షేర్ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది. -
మోస్తరు రిస్క్... రాబడులు ఎక్కువ!
కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఈక్విటీ పెట్టుబడులతో అధిక రాబడులు, డెట్ పెట్టుబడులతో రిస్క్ను తగ్గించే విధంగా ఈ పథకం పనితీరు ఉంటుంది. గతంలో ఈ పథకం ఎస్బీఐ మ్యాగ్నం బ్యాలెన్స్డ్ ఫండ్ పేరుతో కొనసాగిందన్నది గుర్తుంచుకోవాలి. రాబడులు ఈ పథకం రాబడులు అన్ని సమయాల్లోనూ ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడుల కంటే అధికంగానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతం రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 16.7 శాతం కాగా, ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడులు 13.8 శాతంగానే ఉన్నాయి. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు 14 శాతం, మూడేళ్లలో 12.6 శాతం చొప్పున ఉండగా, ఈ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 11.2 శాతం, 11.1 శాతం చొప్పున ఉన్నాయి. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండేందుకు లార్జ్క్యాప్ స్టాక్స్ను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, రిస్క్ మధ్యస్థంగా ఉండాలని భావించే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. పోర్ట్ఫోలియో ఈక్విటీ, డెట్ కలబోత కనుక భిన్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్ఫోలియోను మార్చుకోవడం ఈ పథకం పనితీరులో భాగంగా గమనించొచ్చు. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం మేనేజర్లు ఈక్విటీల కేటాయింపులను కనిష్టంగా 64 శాతం, గరిష్టంగా 72 శాతం మధ్య నిర్వహించారు. అస్థిరతల సమయాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుని 10 శాతం వరకు నగదు నిల్వలను ఉంచుకునే వ్యూహాన్ని ఈ పథకం పాటిస్తుంది. 2017 మార్కెట్ ర్యాలీ సమయంలో ఈ పథకంలోని మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 72 శాతంగా ఉండగా, 2018 కరెక్షన్ సమయానికి 64 శాతానికి పరిమితం అయ్యాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలతో పోలిస్తే ఈ పథకం నష్టాలను తగ్గించుకుంది. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడుల్లో 72 శాతాన్ని లార్జ్క్యాప్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మొత్తం మిడ్, స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. అలాగే, పోర్ట్ఫోలియోలో 54 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈక్విటీల్లో 72 శాతం, డెట్లో 24.58 శాతం పెట్టుబడులు ఉండగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంచుకుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 31.58 శాతం ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ స్టాక్స్లోనే ఉన్నాయి. ఆ తర్వాత సేవల రంగంలో 9 శాతం, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగాలకు ఒక్కోదానికీ 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించిన సింగపూర్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్లో సింగపూర్ ప్రభుత్వం 6.8 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో డీఎల్ఎఫ్ షేర్ 8 శాతం వరకూ నష్టపోయింది. బ్లాక్డీల్ విలువ రూ.1,298 కోట్లు డీఎల్ఎఫ్ కంపెనీలో సింగపూర్ ప్రభుత్వానికి గత ఏడాది చివరి నాటికి 4.11 శాతం వాటాకు సమానమైన 7.32 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయి. దీంట్లో 6.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సింగపూర్ప్రభుత్వం సోమవారం విక్రయించింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ.191 ప్రకారం ఈ మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.1,298 కోట్లుగా ఉంది. ఈ షేర్లను ఫ్రాన్స్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సొసైటీ జనరల్, హెచ్ఎస్బీసీ, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సమాచారం. ఇటీవలి డీఎల్ఎఫ్ రూ.3,200 కోట్ల క్యూఐపీ ఇష్యూలో పాలు పంచుకున్న హెచ్ఎస్బీసీ, ఇతర సంస్థలు ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీలో కూడా డీఎల్ఎఫ్ షేర్లను కొనుగోలు చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బ్లాక్డీల్ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో 8.4 శాతం నష్టంతో రూ.185 వద్ద ముగిసింది. -
పెట్టుబడులకు.. సిస్టమ్యాటిక్ రికరింగ్ డిపాజిట్
ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సాధనం. కానీ, పెట్టుబడికి, రాబడులకు ఎప్పుడూ రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. కనుక పెట్టుబడులన్నీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, భిన్న సాధనాల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకోవాలంటూ సూచనలిస్తుంటారు ఆర్థిక సలహాదారులు. పోర్ట్ఫోలియో రిస్క్ను తగ్గించి స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిశీలించినప్పుడు పెట్టుబడుల మధ్య వైవిధ్యం, సమతుల్యత కోసం రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) మంచి ఆప్షన్. బ్యాంకులు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ సాధనాలను ఇన్వెస్టర్లు తమ మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక అవసరాల కోసం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రయోజనాలు... ఫిక్స్డ్ డిపాజిట్ లాభాలు ఆర్డీలోనూ ఉంటాయి. కాకపోతే దీనికి అదనంగా పెట్టుబడులకు క్రమశిక్షణ అన్నది ఆర్డీతో సాధ్యం. నిర్ణీత కాలానికి, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది కనుక... అనవసర దుబారా కంటే పెట్టుబడికి ప్రాధాన్యం గుర్తుకొస్తు్తంది. కనీసం రూ.100 నుంచి కూడా ఆర్డీ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బంధన్బ్యాంకులు వంటివి తక్కువ మొత్తానికే వీలు కల్పిస్తుంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులు రూ.1,000 నుంచి ఆర్డీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి ఒకే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఆర్డీ అయితే ప్రతీ నెలా ఇంత చొప్పున నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు... రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఆర్డీ టర్మ్ (కాల వ్యవధి)ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అది కూడా బ్యాంకులను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లకు దగ్గరగానే ఈ రేట్లు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే అధిక రేటు ఆఫర్ చేస్తోంది. 27–36 నెలల కోసం ఆర్డీ చేసేట్టు అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆఫర్ చేస్తున్న రేటు 7.4%. 60 ఏళ్లు దాటిన వారికి అరశాతం వడ్డీ రేటు అదనంగా ఇస్తోంది. బంధన్ బ్యాంకు అయితే 7.65% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.75% ఎక్కువ ఇస్తోంది. ఇక బ్యాంకులతోపాటు డిపాజిట్లు సేకరించే ఎన్బీఎఫ్సీలు కూడా ఆర్డీ పథకాలను అందిస్తున్నాయి. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో ఆర్డీ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల్లో చేసే రూ.లక్ష వరకు డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా ఉంటుంది. అదే ఎన్బీఎఫ్సీల్లో చేసే డిపాజిట్లకు బీమా వర్తించదు. తమ అవసరాలకు అనుగుణంగా ఆర్డీ టర్మ్ను ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు ఆరు నెలల నుంచి పదేళ్ల కాల వ్యవధి వరకు టర్మ్లతో కూడిన ఆర్డీలను అనుమతిస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి టర్మ్ ఎంచుకున్న తర్వాత అందులో మార్పులకు అవకాశం ఉండదు. అత్యవసరాల్లో అక్కరకు ఆర్డీలో మరో వెసులుబాటు ఉంది. అత్యవసర నిధి సమకూర్చుకోని వారు, అత్యవసర సందర్భాల్లో నిధులకు ఆర్డీ అక్కరకు వస్తుంది. ఆర్డీలో ఉన్న బ్యాలెన్స్పై రాయితీ రేటుతో రుణం తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్ణీత వాయిదాల తర్వాత ఓవర్డ్రాఫ్ట్ కల్పిస్తున్నాయి. బంధన్ బ్యాంకు 6 నెలల తర్వాత ఓవర్డ్రాఫ్ట్ను ఆఫర్ చేస్తోంది. నిర్ణీత వ్యవధికి ముందే ఆర్డీని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. కాకపోతే అప్పటి వరకు గడించిన వడ్డీ నుంచి కొంత ఉపసంహరించుకుంటాయి. ఇది సాధారణంగా 1–2% ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి బదులు ఆర్డీ చేసినప్పుడు ఉన్న రేట్ల ప్రకారం... ఎంత కాలానికి ఆర్డీ ఉంచారో చూసి ఆ మేరకు రేటును అమలు చేస్తున్నాయి. ఈ వడ్డీని గడువు తీరాకే చెల్లిస్తున్నాయి. ఇక మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)ను ఆర్డీలకు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. 2018–19 ఏడాది వరకు ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే టీడీఎస్ అమలవుతుంది. తర్వాత నుంచి ఈ పరిమితి రూ.40,000కు పెరగనుంది. మొత్తం ఆదాయం ఆదాయపన్ను శ్లాబ్ కంటే తక్కువే ఉంటే ఫామ్ 15జీ (సీనియర్ సిటిజన్లు ఫామ్ 15హెచ్) సమర్పించడం ద్వారా టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విధానం మీరు ఇప్పటికే బ్యాంకు కస్టమర్ అయితే, నెట్బ్యాంకింగ్ ద్వారా ఆర్డీని ఆన్లైన్లో ప్రారంభించుకోవచ్చు. అలాగే, బ్యాంకు శాఖకు వెళ్లి కూడా ఆర్డీని మొదలుపెట్టొచ్చు. దరఖాస్తుతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆర్డీ అన్నది క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాల్లో మంచి ఉపకరణం. కాకపోతే రెగ్యులర్గా వడ్డీ చెల్లించే ఆప్షన్ ఇందు లో ఉండదు. అలాగే, క్యుములేటివ్ ఇంటరెస్ట్, అసలు కలిపి గడువు తీరిన తర్వాతే చెల్లించడం జరుగుతుంది. రెగ్యులర్ఆర్డీకి అదనంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటే ఫ్లెక్సీ ఆర్డీ లేదా మరో ఆర్డీ ఖాతా ప్రారంభించకుంటే సరిపోతుంది. -
కార్పొరేట్లకు ‘విదేశీ’ జోష్!
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్ చోటు చేసుకోవడం దేశీయ పరిశ్రమకు ఉపశమనం వంటిదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పాక్షిక వాటాల విక్రయంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి పూర్తిగా తప్పుకోవడం, ప్రమోటర్ల వాటాల ఉపసంహరణలు, తాజాగా ఈక్విటీల జారీ(క్యూఐపీ)తో నిధుల సమీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘గతేడాది ద్వితీయార్ధం నుంచి మార్కెట్ సెంటిమెంట్ నిద్రాణంగా ఉండగా, గత మూడు వారాల్లో ఇది మారిపోయింది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అనుజ్ కపూర్ తెలిపారు. మార్కెట్లో ఆదరణ డచ్ ఆర్థిక సేవల కంపెనీ ఐఎన్జీ గ్రూపు కోటక్ మహీంద్రాలో తనకున్న మొత్తం 3.06 శాతం వాటాను రూ.7,160 కోట్లకు విక్రయించింది. అలాగే ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబాస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో 9 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,751 కోట్లను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్లో బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ లైఫ్ 5 శాతం వాటాలను రూ.3,634 కోట్లకు విక్రయించింది. రియల్టీ సంస్థ డీఎల్ఎఫ్ రూ.3,178 కోట్లు, లక్ష్మి విలాస్ బ్యాంకు రూ.421 కోట్ల మేర తాజాగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఈ లావాదేవీలకు మార్కెట్లో మంచి ఆదరణే లభించడం గమనార్హం. అంతెందుకు, తాజాగా ముగిసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఫర్సేల్కు సైతం భారీ మద్దతు లభించింది. ఈ స్థాయిలో నిధుల రాకను మార్కెట్ సర్దుబాటు చేసుకోగలదంటున్నారు నిపుణులు. గత నెలలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు రూ.42,000 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఇన్వెస్టర్లలో ఆసక్తి తిరిగి పుంజుకోవడంతో బ్లాక్ డీల్స్, క్యూఐపీలు చోటు చేసుకుంటున్నాయి. నిధుల సరఫరా పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే మరిన్ని లావాదేవీలు జరగొచ్చు’’ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జీబీ జాకబ్ తెలిపారు. ఈ తరరహా అధిక లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ ట్రేడ్స్, క్యూఐపీలకు అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంటున్నారు. మరిన్ని నిధులు: అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇటీవలి ర్యాలీ, ఎన్నికల ఫలితాల పట్ల దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో మరిన్ని క్యూఐపీలు, బ్లాక్ డీల్స్, ఆఫర్ఫర్సేల్ చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణంతో ఐపీవో మార్కెట్లో ఇష్యూలు తిరిగి ఆరంభం అవుతాయని అనుజ్ కపూర్ తెలిపారు. ఇటీవలే ఎంబసీ నుంచి వచ్చిన తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)కు మంచి డిమాండ్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీవో మార్కెట్కు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఐపీవోలను చేపట్టిన విషయం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఐపీవోలు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి డీల్స్ ఎక్కువగా జరుగుతున్నందున ఐపీవోలు వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందంటున్నారు. మొత్తం మీద ఐపీవో మార్కెట్ టర్న్అరౌండ్కు ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. -
కవ్వించి నవ్వించిన వాడి కథ
ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా తల్లీ. అమ్మా... ధన్యోస్మీ... జగదాంబ ధన్యోస్మీ’’ అన్నాడు అతడు.ఆతరువాత భార్యాబిడ్డలతో కలిసి విజయనగరరాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక సత్రంలోకి వెళ్లి...‘‘ఏవండీ...దూరం నుంచి వస్తున్నాం. బస వీలవుతుందా?’’ అని అడిగాడు నెమ్మదిగా.‘‘ఆ గదిలో బూజు దులుపుకుని ఉండండి. రెండురోజులు ఉండవచ్చు’’ అన్నాడు సత్రం నిర్వాహకుడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో తాను కవిని అనే విషయం చెప్పాడు అతడు.‘కవి’ అనే శబ్దం వినిపించగానే అతడికి అక్కడ అపూర్వమైన గౌరవమర్యాదలు లభించాయి. ఇది చూసి కవిగారు మురిసిపోయి...‘‘యాథారాజా తథాప్రజా అని ఊరకే అన్నారా పెద్దలు. మీ ఆదరణలో అతిథి మర్యాదలు చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది’’ అన్నాడు.ఆచార్య స్వాముల వారిని కలవాలని ప్రయత్నిస్తున్నారు కవిగారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇతడిని బొత్తిగా ఖాతరు చేయడం లేదు.‘‘ఎవరయ్యా నువ్వు?’’ అని గద్దించాడు ఒక ఆస్థాన కవి.‘‘నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉందండి. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చా!’’ తాను వచ్చిన పని గురించి చెప్పారు కవిగారు.‘‘నాకు కవిత్వంలో ప్రవేశం ఉందండి’’ అనే మాట విని ఈ కవిగారిని ఆస్థాన కవిగారు ఇలా వెటకారం చేశారు...‘‘ఈ కాలంలో కవిత్వం, వైద్యం రానివాడెవ్వడులే’’ అన్నాడు. మహారాజును కలిసే వరకే అతని దురదృష్టం. ఆతరువాత అదృష్టమే ఆ కవి వెంట పరుగులు తీస్తుంది. కాని ఆ అదృష్టఘడియ ఎప్పుడు వచ్చేనో ఎలా వచ్చేనో! రాయలవారి సభ.‘‘ఏమిటి మీ విజ్ఞాపన?’’ గంభీరస్వరంతో అడిగారు మంత్రి.‘‘మా తండ్రిగారి మరణశాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. కాని స్థిరాస్తి మాకు పంచలేకపోతున్నారు మహాప్రభో’’ అన్నాడు రాయలవారి ముందు నిల్చున్న ముగ్గురిలో ఒకరు.‘‘కారణం?’’ అడిగారు రాయలవారు.‘‘మా తండ్రిగారి పదిహేడు ఏనుగులు... సగం పాలు నాకు, మూడో పాలు రెండో వాడికి, అందులో మూడో పాలు మూడోవాడికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని మీ గజశాలకు తోలించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో’’ అని దీనంగా వేడుకున్నాడు ముగ్గురిలో పెద్దవాడు.రాయలవారు వెంటనే స్పందించారు: ‘‘మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగబోనివ్వం’’ అంటూ ‘‘ఈ సమస్య గురించి మీ అభిప్రాయం?’’ అని ధర్మాధికారులను అడిగాడు.‘‘ఎన్ని విధాల భాగించి చూసినా జంతుహింస చేయకుండా పాలు పంచడం సాధ్యంగా కనిపించడం లేదు మహారాజా’’ అన్నాడు ధర్మాధికారులలో ఒకరు.‘‘మరణించినవాడు మతిలేనివాడు కాదు మహాప్రభో. ప్రతిభవంతుడైనా ప్రభుభక్తిపరాయణుడు. కనుకనే సాధ్యం కాని విభాగాలలో మరణశాసనం రాశాడు. కాబట్టి ఆయన అభిమతాన్ని మన్నించి మీరు ఏనుగుల్ని స్వీకరించడం ధర్మం’’ అన్నాడు మరో ధర్మాధికారి.‘‘ధర్మం కాదు మహాప్రభో’’ బాధగా అన్నారు అన్నదమ్ముల్లో ఒకరు.‘‘ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేది ఎవరో’’ సభను ఉద్దేశించి గట్టిగా అడిగారు మహామంత్రి.‘‘నేను’’ అంటూ ఎవరో అనామకుడు లోనికి వచ్చాడు.‘‘ఎవరు నువ్వు?’’ గద్దించారు మహామంత్రి.‘‘ఎవడో పిచ్చివాడు’’ సమాధానమిచ్చాడు ఒక పాలనాధికారి.‘‘కాదు మహాప్రభో తమ ఆశ్రితుడిని’’ అన్నాడు ఆ అనామకుడు.‘‘విద్యానగర పౌరుడివేనా?’’ అడిగారు మహామంత్రి.‘‘ప్రభువులు అనుగ్రహిస్తే అవుతాను. నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతాను’’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అనామకుడు. ‘‘ఎవరివయ్యా నువ్వు?’’ అని అక్కడ ఎవరో అడిగారు.తాను కృష్ణా తీరం నుంచి వచ్చాను అని, తండ్రి పేరు గార్లపాటి రామన్న మంత్రి అని చెప్పాడు ఆ యువకుడు.‘‘నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా?’’ అడిగారు మహామంత్రి.‘‘తమకు అభ్యంతరం లేకుండా పరిష్కరిస్తాను’’ అని రంగంలోకి దిగాడు రామన్నగారి కుమారుడు.‘‘పదిహేడు ఏనుగు బొమ్మలు తెప్పించండి’’ అని అడిగాడు.అలాగే పదిహేడు ఏనుగు బొమ్మలు అతని దగ్గరకు తెచ్చారు.‘‘ఈ పదిహేడు ఏనుగుల్లో రాజుగారి ఏనుగును చేర్చడానిక మీకు ఏమైనా అభ్యంతరమా?’’ అని అడిగాడు.‘‘చేర్చడానికి వీల్లేదు. పంచేవి పదిహేడే’’ అన్నారు ఒక ధర్మాధికారి.‘‘నేను పంచేది కూడా పదిహేడే స్వామి’’ అన్నాడు యువకుడు.సభాసదులలో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోయింది.‘ఇతడు ఏం చేయబోతున్నాడు?!’‘‘ఇక్కడ ఉన్నవి ఎన్ని ఏనుగులు?’’ అని అడిగాడు యువకుడు.‘‘పదిహేడు’’ అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒకడు.‘‘పదిహేడు కాదు రాజుగారి ఏనుగుతో కలిపి, వెరసి పద్దెమినిది. ఇందులో సగం పాలు పెద్దవాడికి...ఈ తొమ్మిది తీసుకో...రెండో వాడికి మూడో వంతు...అనగా ఆరు...మూడో వాడి పాలు రెండు...ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు’’ అని జటిలమైన సమస్యను నిమిషాల్లో తీర్చేశాడు ఆ యువకుడు.‘‘శబ్భాష్’’ అన్నారు మెచ్చుకోలుగా రాయలవారు.ఆనందంగా ఇంటికి వచ్చాడు ఆ యువకుడు.‘‘ఆహా, రాయలవారిది ఇంద్రవైభవం కమల’’ అన్నాడు భార్యతో.‘‘ఆదరించారా?’’ అడిగింది ఆమె.‘‘అన్నాక తప్పుతుందా! వారు మహారాజు, మనల్ని కవిరాజుని చేసేశారు. మహామంత్రి అప్పాజీగారు, మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట! ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తానన్నారు. రేపటి నుంచి మన కాపురం అక్కడే’’ అని సంతోషంగా చెప్పుకుపోతున్నాడు యువకుడు. -
లక్ష్య సాధనకు కేటాయింపులు కీలకం
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ సీఈవో బాలసుబ్రమణియన్. అలాగే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) రూపంలో దేశీయంగా కూడా పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సాక్షి ప్రాఫిట్కు వివరించారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఈ ఏడాది గణనీయంగా వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. రిస్కులు, ప్రయోజనాలపరంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన సాధనాలు. పొదుపు (లిక్విడ్ ఫండ్స్), రాబడి (ఫిక్స్డ్ ఇన్కం స్కీమ్స్), సంపద సృష్టి (ఈక్విటీ పథకాలు), పన్ను ఆదా స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్ పథకాలు).. ఇలా అవసరం ఏదైనా ప్రతి దానికీ ఒక స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవాలంటే ఎల్లవేళలా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ సాధనాలకు కేటాయించడం శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కం పథకాలు ప్రతీ ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండతగినవి. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ. 69 లక్షల కోట్లు ఎఫ్డీల రూపంలో ఉన్నాయని అంచనా. వీటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కం పథకాలు ఇటు మెరుగైన రాబడులు అందించడంతో పాటు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా ఇస్తాయి. సంస్కరణలతో ఊతం .. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, దేశీయంగా బ్యాంకుల మొండిబాకీలు పెరిగిపోవడం, రూపాయి పతనం, వ్యాపార రంగంలో సంక్షోభాలు మొదలైన వాటితో గతేడాది సవాళ్లమయంగా సాగింది. అయితే, 2019లో పరిస్థితులు ఆశావహంగానే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు కాస్త ఉపశమించడం, రూపాయి కొంత బలపడుతుండటం మొదలైనవి ఇందుకు ఊతమిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు క్రమంగా ఫలాలిస్తున్న నేపథ్యంలో భారత్పై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఆశావహ అంచనాలే వెలువరిస్తున్నాయి. వినియోగమే దేశ ఎకానమీ వృద్ధికి చోదకంగా నిలుస్తుందనడానికి నిదర్శనంగా ప్రైవేట్ వినియోగం ఈసారి మరింత ముఖ్యపాత్ర పోషించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మరింతగా వ్యయం చేస్తుండటం కూడా వినియోగ వృద్ధికి ఊతమివ్వనుంది. ఇక దివాలా చట్టం అమల్లోకి వచ్చాక బ్యాంకుల ఖాతాల ప్రక్షాళన జరగడం కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడనుంది. ఇక జీఎస్టీ విధానం కూడా స్థిరపడితే, పన్నుల రేట్లు తగ్గిన పక్షంలో వినియోగంతో పాటు మొత్తం మీద ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా పెరిగేందుకు ఊతమిస్తుంది. సెంటిమెంట్ అంతా సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఎన్నికలు జరగడానికి ముందు, తర్వాత ఆరు నెలల డేటా పరిశీలిస్తే మార్కెట్లు పాజిటివ్గానే స్పందించిన దాఖలాలే ఉన్నాయి. ఏదైతేనేం.. అంతిమంగా ఫండమెంటల్స్, ఎకానమీ స్థిరత్వమే మార్కెట్ పనితీరును ప్రభావితం చేస్తుంది. -
జెట్ రుణ సంక్షోభానికి తెర!
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్ ఎయిర్వేస్ తెలియజేసింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం. ఈ చర్యల అనంతరం బ్యాంకులో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకపోతే పుస్తక విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం షేరు ముఖ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు. జెట్ ఎయిర్వేస్ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. తన పనితీరు మెరుగుపరుచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది. నష్టాలు రూ.732 కోట్లు జెట్ ఎయిర్వేస్కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే, గత క్యూ3లో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,148 కోట్లు.... కంపెనీ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.6,043 కోట్ల నుంచి రూ.6,786 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ క్యూ3లో రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 1 శాతం లాభంతో రూ.225 వద్ద ముగిసింది. -
నేటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేటి(మంగళవారం)నుంచి ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్యూయూటీఐ(ద స్పెసిఫైడ్ అండర్టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో 3% వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది. ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. -
విహార యాత్రకు ...సిప్
నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్ అవసరాల నిమిత్తం నా ఇన్వెస్ట్మెంట్స్ను ఎలా ప్లాన్ చేసుకోవాలో సూచించండి? –అరవింద్, విశాఖపట్టణం బుద్ది మాంద్యం గల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ అవసరాల కోసం మీకు భవిష్యత్తులో భారీ మొత్తమే అవసరమవుతుంది. దీనికి గాను మీరు పెద్ద మొత్తంలోనే నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని వీలైనంత అధికంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పతన సమయాల్లోనూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించండి. మీ తదనంతరం మీ బిడ్డ అవసరాలు సజావుగా తీరేలా ఉండాలంటే, మీరు పనిచేస్తున్నంత కాలమూ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. మీ తదనంతరం కూడా బిడ్డ బాగోగులు చూసుకోవడం కోసం ట్రస్ట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. నమ్మకమైన మిత్రులు, బంధువుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను ట్రస్టీలుగా నియమించి మీరు ఏర్పాటు చేసిన నిధిని మీ కొడుకు కోసం ఉపయోగపడేలా చూడండి. నేను గత పదేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్లోనూ, షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తూ, 30 లక్షల వరకూ కూడబెట్టాను. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనేది నా కల. గృహ రుణానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వండి. –సుధీర్, హైదరాబాద్ ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక ఫండ్ను నిర్మించుకోవడం... ఇవన్నీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ తరహా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లోనూ. మ్యూచువల్ ఫండ్స్ల్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలి. ఇల్లు కొనుక్కోవాలనే లక్ష్యం కోసం రూ.30 లక్షలు కూడబెట్టడం మంచి విషయమే. ఇల్లు కొనే విషయంలో మీకు కొన్ని సూచనలు. మీరు ఆ ఇంట్లో నివసించాలనుకుంటేనే ఇల్లు కొనుగోలు చేయండి. ఇలా చేస్తే, మీకు అద్దె డబ్బులు ఆదా అవుతాయి. మీరు గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది గృహరుణానికి సంబంధించి మీరు చెల్లించే నెలవారీ వాయిదా (ఈఎమ్ఐ) మీ నెలవారీ వేతనంలో మూడో వంతు దాటకుండా ఉండేలా చూసుకోండి. ఇక రెండో విషయం...మీరు ఇంటికి చెల్లించే డౌన్ పేమెంట్ మీరు కొనుగోలు చేసే గృహం విలువలో కనీసం 40% ఉండాలి. అంటే మీరు కొనే ఇంటి విలువ రూ.80 లక్షలుంటే, 40% మొత్తాన్ని.. అంటే రూ.32 లక్షల వరకూ డౌన్ పేమెంట్ చేస్తే, ఈఎమ్ఐ తక్కువగా ఉంటుంది. ఈ రెండు విషయాలు పాటిస్తే, గృహ రుణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. నా వయస్సు 41 సంవత్సరాలు. నేను గత పదేళ్ల నుంచే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. లిక్విడ్, ఆర్బిట్రేజ్ ఫండ్స్లో కలుపుకొని ఇప్పటివరకూ నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రూ.10 లక్షల వరకూ అయ్యాయి. నాకు మరో ఐదేళ్ల వరకూ ఈ డబ్బులు అవసరం ఉండదు. ఈక్విటీ, డెట్ల్లో సరిసమానంగా వెయిటేజ్ ఉన్న బ్యాలన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? – రవీందర్, విజయవాడ మీరు ఇప్పటికే లిక్విడ్, ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్పై మీకు తగిన అవగాహన వచ్చి ఉంటుంది. బ్యాలన్స్డ్ ఫండ్లో కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ను ఎంచుకోండి. బ్యాలన్స్డ్ ఫండ్ కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సురక్షితమైనది. ఈ ఫండ్ తన కార్పస్లో మూడో వంతు వరకూ పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కనీసం 12 సమ భాగాలు చేసి, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఐదేళ్లలో మీరు ఈ ఫండ్ ద్వారా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే అధిక రాబడులను పొందే అవకాశాలున్నాయి. కనీసం ఐదేళ్లకొకసారి కుటుంబంతో కలసి విహారయాత్రకు వెళ్లాలనేది నా ఆలోచన. దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలపండి? –కార్తీక్, బెంగళూరు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వచ్చిపడే ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండటమే కానీ విహార యాత్ర కోసం డబ్బులు వెచ్చించే వెసులుబాటు అందరికీ ఉండదు. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, ఏదైనా సాధ్యమే. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెడితే మీరు కోరుకుంటున్నట్లు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లవచ్చు. విహార యాత్ర నిధిని ఏర్పాటు చేసుకోవడానికి సరళమైన, సులభమైన విధానం ఇది. ఏదైనా ఈక్విటీ ఫండ్ను ఎంచుకుని ఆ ఫండ్లో సిప్ విధానంలో నెలకు ఎంతో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. కనీసం ఐదేళ్ల పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించండి. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు మీకు వస్తాయి. స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఈ ఒడుదుడుకుల కారణంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ ఆశించిన రాబడులు ఇవ్వకపోయినా, ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈక్విటీల పతనంతో పసిడి జోరు!
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్లో పసిడి పరుగు వరుసగా నాల్గవ వారంలోనూ కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ ధర (31.1గ్రా) ఆరు డాలర్లు లాభపడి 1,232 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,240 డాలర్లను కూడా చూసింది. మూడు నెలల గరిష్ట స్థాయి ఇది. అమెరికా ఈక్విటీ మార్కెట్ల పతనం, బాండ్ ఈల్డ్స్ నష్టాలు దీనికి నేపథ్యం. మొత్తంమీద ఆరు నెలలుగా పడుతూ వచ్చిన పసిడి, 1,160 డాలర్ల వరకూ పతనమైనా, వెంటనే రికవరీతో 1,185–1,210 శ్రేణిలో పటిష్ట కన్సాలిడేటెడ్ ధోరణి ప్రదర్శించింది. 1,200 డాలర్లు పసిడి ‘స్వీట్ స్టాప్’గా విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ లోపునకు ధర పడిపోతే ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే పరిస్థితుల్లో అవి మూతపడతాయని, తిరిగి పసిడికి డిమాండ్ పెరిగి వెంటనే 1,200 డాలర్లపైకి పసిడి ఎగయడం ఖాయమని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా–సౌదీ అరేబియాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలూ, కంపెనీల ఫలితాలు ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థల గణాంకాలు అంచనాలకు తగినట్లుగా లేకపోవడంమ పసిడి లాభాలకు తోడయ్యాయి. ‘‘ఈక్విటీలు మరింత కిందకు జారితే, పసిడి మున్ముందు మరింతపైకి లేవడం ఖాయం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం తమ ఇన్వెస్ట్మెంట్లకు పసిడినే ఎంచుకోవడం జరుగుతుంది’’ అని సిటీ ఇండెక్స్లో టెక్నికల్ అనలిస్ట్ రజాక్జాదా పేర్కొన్నారు. కొంచెం జాగ్రత్త అవసరం... అయితే ప్రస్తుత స్థాయి వద్ద కొంత జాగరూకత అవసరమని ఇన్వెస్టర్లకు బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బ్రూచ్ సూచించారు. ప్రస్తుత స్థాయి కీలక నిరోధంగా ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వృద్ధి పటిష్టత, డిసెంబర్లో ఈఏడాదిలో నాల్గవసారి ఫెడ్రేటు పెంపు అవకాశాలు, డాలర్ ఇండెక్స్ పటిష్ట స్థాయిలో ఉండడం (శుక్రవారం 96.13 వద్ద ముగింపు) వంటి అంశాలను ప్రస్తావించారు. దేశంలో సానుకూలత కాగా పసిడి ధరకు దేశంలో మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా ధర పెరగడం సంగతి ఒకవైపయితే, డాలర్ మారకంలో రూపాయి విలువ మారకం బలహీనత మరోవైపు దీనికి దోహదపడుతున్న అంశాలు. -
ఆటుపోట్ల మధ్య పెట్టుబడులకు భద్రత
స్టాక్ మార్కెట్లు గరిష్ట విలువలకు చేరి దిద్దుబాటుకు గురవుతున్న క్రమంలో, తమ పెట్టుబడులకు భద్రత కోరుకునే వారు టాటా ఈక్విటీ పీఈ ఫండ్ను పరిశీలించొచ్చు. ఇది విలువ ఆధారిత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే పథకం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 70 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. సెన్సెక్స్ పీఈతో పోలిస్తే తక్కువ పీఈతో ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. వివిధ మార్కెట్ క్యాప్తో కూడిన స్టాక్స్ను ఎంచుకుంటుంది. అంటే ఫ్లెక్సీ క్యాప్ ప్రొఫైల్గానే చెప్పుకోవాలి. ఉదాహరణకు ఏదైనా సమయంలో స్మాల్, మిడ్క్యాప్ విభాగాల్లోని స్టాక్స్ విలువల పరంగా మంచి ఆకర్షణీయంగా కనిపిస్తే ఆయా స్టాక్స్కు 35–40 శాతం నిధులను కేటాయిస్తుంది. 2013 చివర్లో, 2014లో ఇదే విధానాన్ని అమలు చేసింది. విలువైన ఎంపిక మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక ధరలకు చేరడంతో గత ఏడాది కాలంగా ఈ స్టాక్స్లో ఈ పథకం తన పెట్టుబడులను తగ్గించుకుంది. 2017 మే నెల నాటికి ఈ స్టాక్స్లో ఎక్స్పోజర్ 25 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10 శాతమే ఉండటం గమనించాలి. అధిక వృద్ధి, అధిక విలువలున్న స్టాక్స్ జోలికి పోకుండా, తక్కువ విలువల వద్ద ఉండి, రానున్న కాలంలో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న స్టాక్స్ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తుంది. 2017లో మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్న సమయంలోనే మిడ్క్యాప్, ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించింది. అందుకే ఏడాది కాల రాబడులను గమనిస్తే ప్రామాణిక సూచీ అయిన సెన్సెక్స్తో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 8.9 శాతం రిటర్నులు ఇస్తే, సెన్సెక్స్ రాబడులు 15.5 శాతంగా ఉన్నాయి. అయితే, మూడేళ్లు, ఐదేళ్ల కాలానికి చూస్తే సెన్సెక్స్ కంటే టాటా ఈక్విటీ ఫండ్ అధిక రాబడులను అందించింది. మూడేళ్లలో వార్షికంగా సగటున 15.5 శాతం, ఐదేళ్లలో అయితే వార్షికంగా 26.6 శాతం రాబడులు ఉన్నాయి. ఈ కాలంలో సెన్సెక్స్రాబడులు 10 శాతం, 14.9 శాతంగానే ఉన్నాయి. పోర్ట్ఫోలియో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా ప్రాథాన్యాన్ని కూడా మార్చడం ఈ పథకం పనితీరులో భాగమే. ఎన్పీఏల సమస్యతో బ్యాంకు స్టాక్స్ కుదేలవుతున్న తరుణంలో బ్యాంకులకు బదులు ఫైనాన్స్ స్టాక్స్కు ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో డెట్/ నగదు నిల్వలు పెంచింది. తాజా పోర్ట్ఫోలియోను గమనించినట్టయితే.... ఆటుపోట్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో 88 శాతం పెట్టుబడులను కలిగి ఉండగా, ఎక్కువ శాతం లార్జ్క్యాప్ స్టాక్స్ కావడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంకు, రిలయన్స్లో వాటాలను పెంచుకుంది. ఈ ఏడాది ఆటో రంగంలో పెట్టుబడులను పెంచింది. మారుతి సుజుకి తరహా అధిక విలువకు చేరిన స్టాక్స్లో పెట్టుబడులను తగ్గించుకుంది. అదే సమయంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాలో పెట్టుబడులను పెంచుకుంది. రూపాయి పతనం నేపథ్యంలో లాభపడే ఐటీ రంగ స్టాక్స్లోనూ పెట్టుబడులు గతంలో 1–2 శాతం మధ్య ఉంటే, 5 శాతానికి పెంచుకుంది. -
విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో డాలర్తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే. ముందుగానే ప్రారంభించాలి పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సరైన చోట పెట్టుబడి పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు. ‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు. ఆలస్యంగా మొదలు పెడితే... పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి. విద్యా రుణం తీసుకోవచ్చు... లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ. సంప్రదాయ ఇన్వెస్టర్లయితే... పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్లో మాస్టర్ ఆఫ్ సైన్స్కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు. కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే. లక్ష్యానికి సమీపంలో... పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం. విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత? యూఎస్ఏ ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ. మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు. ఆస్ట్రేలియా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్కు 12–18 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. యూకే ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. కెనడా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు. నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు సింగపూర్ ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు. నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు జర్మనీ ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి. నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు. -
అస్థిరతల మధ్య మెరుగైన ఎంపిక!
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా కాస్తంత రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులు అందుకోవాలనుకునే వారికి మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం అనకూలంగా ఉంటుంది. హైబ్రిడ్ పథకంగా మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మేర ఈక్విటీల్లో, మిగిలినది డెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల రిస్క్ మోస్తరుగానే ఉంటుంది. ఇది కొత్త పథకం. ప్రారంభించి మూడేళ్లే అయింది. ఈ కాలంలో పనితీరు ఫర్వాలేదు. ఏడాది కాలంలో 9.63 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో చూసుకుంటే ఏటా సగటున రాబడులు 15 శాతంపైన ఉన్నాయి. ఇదే కాలంలో ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే క్రిసిల్ హైబ్రిడ్, ప్లస్ 65 అగ్రెస్సివ్ రాబడులు 9.9 శాతం, 10.7 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టే పథకం కావడంతో దీర్ఘకాల రాబడులను పరిగణనలోకి తీసుకోవడమే సరైనది. సెబీ కేటగిరీల్లో మార్పులకు ముందు మిరే అస్సెట్ ప్రుడెన్స్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఈ పథకం 2015లో ఆరంభమైన తర్వాత, మార్కెట్లలో భారీ పతనాలు చోటు చేసుకోలేదు. కనుక 2007 తరహా సంక్షోభాలు ఎదురైతే పనితీరు ఎలా ఉంటుందో చూడాలి. 2016, 2017 ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈ పథకం కేటగిరీ సగటు రాబడుల కంటే ఎక్కువే ఇన్వెస్టర్లకు పంచింది. 2016లో 8.5 శాతం, 2017లో 27.8 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. పోర్ట్ఫోలియో ఈక్విటీల్లో ఈ పథకం 60 స్టాక్స్ను కలిగి ఉంది. 26 రంగాలకు చెందిన కంపెనీలతో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తోంది. స్టాక్స్ ఎంపికకు బోటమ్అప్ విధానాన్ని అనుసరిస్తుంది. బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. 20 శాతం నిధులను బ్యాంకింగ్ రంగంలోనే ఇన్వెస్ట్ చేయడం దీన్నే సూచిస్తోంది. 2016 ప్రారంభం నుంచి ఇదే స్థాయిలో పెట్టుబడులను కేటాయించింది. సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ డ్యురబుల్స్ రంగాలకు తదుపరి ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఫైనాన్స్, పెట్రోలియం ఉత్పత్తుల రంగాలకు పెట్టుబడులను పెంచడాన్ని గమనించొచ్చు. ఇక డెట్ విభాగంలో ఎక్కువ భాగం పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీలు, కమర్షియల్ పేపర్లకు కేటాయించింది. తాజా పోర్ట్ఫోలియోను గమనిస్తే ఈక్విటీల్లో పెట్టుబడులు 74.68 శాతం, డెట్లో 23.19 శాతం చొప్పున ఉంటే, 2.09 నగదు నిల్వలను కలిగి ఉంది. సెబీ కేటగిరీ మార్పుల నేపథ్యంలో ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. నిబంధనల మేరకు 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంటుంది. 20–35 శాతం మేర ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, ఈ ఫండ్ మేనేజర్లు ఈక్విటీ పెట్టబడులను 70–75 శాతం మధ్య కొనసాగిస్తూ వస్తున్నారు. -
‘కాంప్లాన్’ బాయ్ ఎవరు?
క్రాఫ్ట్ హీన్జ్ సంస్థకు చెందిన కాంప్లాన్ బ్రాండ్ విక్రయం వేడెక్కుతోంది. దీని కొనుగోలు కోసం పోటీ పడుతున్న వారిలో దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలతో పాటు అగ్రశ్రేణి ప్రైవేటు ఈక్విటీ సంస్థలూ ఉన్నాయి. కాంప్లాన్తో పాటు గ్లూకోన్–డి, నైసిల్, సంప్రితి ఘీ బ్రాండ్లతో కూడిన కన్సూమర్ ఫుడ్ డివిజన్ను వంద కోట్ల డాలర్లకు విక్రయించాలనేది క్రాఫ్ట్ హెన్జ్ కంపెనీ ఆలోచన. ఈ విభాగం విక్రయ వ్యవహారాలను చూడటానికి జేపీ మోర్గాన్, లజార్డ్ సంస్థలను ఈ కంపెనీ నియమించింది కూడా. కాంప్లాన్ వంటివి బాగా పాతుకుపోయిన బ్రాండ్లు కావటంతో ఐటీసీ, ఇమామి, విప్రో, అబాట్, జైడస్ వెల్నెస్, క్యాడిలా వంటి కంపెనీలతో పాటు బ్లాక్స్టోన్, కార్లైల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వచ్చే నెల 15లోగా తమ తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీల బిడ్లు 70–80 కోట్ల డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. మరోవైపు గ్లాక్సో స్మిత్క్లైన్ కంపెనీ కూడా తన కన్సూమర్ హెల్త్కేర్ వ్యాపారాన్ని (దీంట్లో హార్లిక్స్ బ్రాండ్ కూడా ఉంది) విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. హార్లిక్స్ను అమ్మనున్నట్లు జీఎస్కే ప్రకటించిన కొద్ది రోజులకే క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కూడా కాంప్లాన్ బ్రాండ్ను అమ్మకానికి పెట్టడం విశేషం. కాంప్లాన్.. 8 శాతం మార్కెట్ వాటా! మూడేళ్ల కిందట 2015లో క్రాఫ్ట్ ఫుడ్స్, హీన్జ్ కంపెనీలు రెండూ విలీనమై క్రాప్ట్ హెన్జ్ సంస్థ ఏర్పడింది. ఈ కంపెనీ 13 విభిన్న రకాలైన బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తోంది. ఈ కంపెనీ కన్సూమర్ బిజినెస్ 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1,800 కోట్ల అమ్మకాలు సాధించింది. దీంట్లో ఒక్క కాంప్లాన్ వాటాయే 40 శాతంగా ఉంటుంది. ఈ కాంప్లాన్ బ్రాండ్ను 1994లో హీన్జ్ కంపెనీ గ్లాక్సో నుంచి కొనుగోలు చేసింది. మాల్టెడ్ ఫుడ్ డ్రింక్లో (ఎమ్ఎఫ్డీ) కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుంది. భారత్లో ఎమ్ఎఫ్డీ పరిశ్రమ రూ.8,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంట్లో 44.3 శాతం మార్కెట్ వాటాతో గ్లాక్సో కంపెనీకి చెందిన హార్లిక్స్దే అగ్రస్థానం. ఈ కంపెనీకే చెందిన బూస్ట్, మాల్టోవా కూడా మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. క్రాఫ్ట్ కంపెనీకి చెందిన బోర్నవిటా, నెస్లే మిలో తదితర బ్రాండ్లు కూడా మంచి అమ్మకాలే సాధిస్తున్నాయి. వైదొలుగుతున్న ఎమ్ఎన్సీలు... మాల్టెడ్ ఫుడ్ డ్రింక్ (ఎమ్ఎఫ్డీ) కేటగిరీ వృద్ధి ఆశించినంత జోరుగా లేకపోవటం, పోటీ తీవ్రత పెరుగుతుండటంతో ఈ రంగం నుంచి వైదొలగాలని బహుళ జాతి కంపెనీలు భావిస్తున్నాయి. మాల్ట్ బేస్డ్ డ్రింక్స్ విభాగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2014లో 13 శాతంగా ఉన్న ఈ పరిశ్రమ వృద్ది 2017లో 9 శాతానికే పరిమితమైంది. అయితే వాండర్ ఏజీ కంపెనీ ఓవల్టీన్, క్యాడిలాకు చెందిన ఆక్టిలైఫ్ వంటి సప్లిమెంట్ న్యూట్రిషన్ డ్రింక్స్ వీటికన్నా మంచి వృద్ధిని సాధించాయి. అలాగని ఈ డ్రింక్స్ వృద్ధి కూడా మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. ఈ డ్రింక్ల సెగ్మెంట్ వృద్ధి 2014లో 21.3 శాతంగా ఉండగా, 2017లో 11.5 శాతానికే పరిమితమయింది. 2017లో క్రాఫ్ట్ హీన్జ్కు న్యూట్రిషినల్ బేవరేజేస్ వ్యాపారంలో 5 కోట్ల డాలర్ల ఇంపెయిర్మెంట్ నష్టాలు (భవిష్యత్తు విలువ క్షీణించటం) వచ్చాయి. వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటం, ఇంపెయిర్మెంట్ నష్టాల వంటి కారణాల వల్ల క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కాంప్లాన్, ఇతర బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. కాగా బ్లాక్స్టోన్, కార్లైల్ వంటి పీఈ సంస్థలు కన్సూమర్ హెల్త్కేర్ థీమ్పై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు వదిలించుకోవాలనుకుంటున్న ఈ సెగ్మెంట్ బ్రాండ్ల కొనుగోలుకు ఇవి పోటీ పడుతూ బిడ్లు వేస్తున్నాయి. కాకపోతే అధికారికంగా మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు. ఆదాయ స్థాయిలు పెరుగుతుండటంతో వినియోగదారులు బ్రాండెడ్ ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో వచ్చే 20 ఏళ్లలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. కాంప్లాన్ కథ గ్లాక్సో కంపెనీ కాంప్లాన్ను పౌడర్ రూపంలో ఉన్న మిల్క్ ఎనర్జీ డ్రింక్గా 1954లో మార్కెట్లోకి తెచ్చింది. ఇంగ్లాండ్లో ఈ బ్రాండ్ను గ్లాక్సో కంపెనీ 1988లోనే వేరే కంపెనీకి అమ్మేసింది. భారత్లో మాత్రం 1994లో క్రాఫ్ట్ కంపెనీకి విక్రయించింది. మాల్టెట్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, క్రాఫ్ట్ అండ్ హెన్జ్ కంపెనీ ఐదవ అతి పెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ. కాప్రి సన్, క్లాసికో, జెల్–ఓ, కూల్–ఎయిడ్, లంచబుల్స్, మ్యాక్స్వెల్... ఇవి ఈ కంపెనీ పాపులర్ బ్రాండ్లలో కొన్ని. షికాగో, పిట్స్బర్గ్ కేంద్రాలుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో నియంత్రిత వాటాలు ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హతావే, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, 3జీ క్యాపిటల్కు ఉన్నాయి. -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి ఆల్టర్నేటివ్ ఫండ్...
ఫ్రాంక్లిన్ టెంపుల్వ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్ ’ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఏఐఎఫ్’ను ప్రవేశపెట్టింది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్పై అవగాహన ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికోసం దీన్ని ఉద్దేశించినట్లు ఎఫ్టీఏఐ ప్రెసిడెంట్ నాగనాథ్ సుందరేశన్ తెలిపారు. దేశీ సంస్థల ఈక్విటీ, డెరివేటివ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్య, దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు అందించడం, పెట్టుబడుల విలువ పెరిగేలా చూడటం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫండమెంటల్, టెక్నికల్ విశ్లేషణల మేళవింపుతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. -
అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్కు రెడీ
ముంబై: ట్రేడింగ్ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో ట్రేడింగ్ను అక్టోబర్ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్ఎస్ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఈ కొత్త లోగోను ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్ జరుగుతోంది. క్యాష్ మార్కెట్ ముగిసిన కొంత వ్యవధి తర్వాత రెండో సెషన్ సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రాత్రి 11.15కు ముగుస్తుంది. అయితే, ఈ సెషన్లో డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్కు మాత్రమే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఐపీఓ ఎప్పుడంటే... ఎన్ఎన్ఈ కో–లొకేషన్ సర్వర్లకు సంబంధించి వివాదంపై మాట్లాడుతూ... దీనిపై ఇప్పటికే తమ అంతర్గత దర్యాప్తును పూర్తి చేశామని.. దీనికి తగిన పరిష్కారం కోసం సెబీతో తాజాగా మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు. కన్సెంట్ విధానంలో (నేరాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడంతో సంబంధం లేకుండా జరిమానా రూపంలో కొంత చార్జీలను చెల్లించడం) దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ‘ఎన్ఎస్ఈ ఐపీఓ (రూ.10,000 కోట్లుగా అంచనా) ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కో–లొకేషన్ సమస్యతో ఇది ముడిపడి ఉంది. ఈ వివాదానికి పరిష్కారం ఎంత త్వరగా లభిస్తుందో అంత త్వరగా ఐపీఓ పూర్తవుతుంది’ అని లిమాయే వివరించారు. ఇక కమోడిటీ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్ను కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమేనని చెప్పారు. ‘దీనికి నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు రావాల్సి ఉంది. ముందుగా బులియన్ (బంగారం, వెండి), ఇంధనం, మెటల్ వంటి వ్యవసాయేతర ఉత్పత్తులతో కమోడిటీ ట్రేడింగ్ను ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లిమాయే పేర్కొన్నారు. ఈక్విటీ, డెట్పై మరింత దృష్టి: చావ్లా వ్యాపార విస్తరణలో భాగంగా ఈక్విటీ, డెట్, వడ్డీరేట్లు ఫ్యూచర్స్ విభాగాలపై మరింత దృష్టి పెడతామని ఎన్ఎస్ఈ చైర్మన్ అశోక్ చావ్లా పేర్కొన్నారు. అదేవిధంగా కంపెనీల నిధుల సమీకరణ వ్యయాలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కమోడిటీ ఫ్యూచర్స్లోకి ప్రవేశంతో ఎక్సే్ఛంజ్ టర్నోవర్ ఇంకాస్త జోరుందుకుంటుందని చావ్లా తెలిపారు. మరిన్ని శిఖరాలనుచేరాలి...: మన్మోహన్ సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1994లో దేశంలో రెండో ప్రధాన స్టాక్ ఎక్సే్ఛంజ్గా ఆవిర్భవించి అనతి కాలంలో టర్నోవర్ పరంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎన్ఎస్ఈ.. ఇంకా మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఎన్సీఈ కార్యకలాపాలను ప్రారంభించింది మన్మోహన్ కావడం గమనార్హం. ‘1994లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగానికి గడ్డురోజులవి. అయితే, అవన్నీ తప్పని దేశ భవిష్యత్తుకు ఢోకాలేదని నిరూపించగలిగాం’ అని ఎన్ఎస్ఈ రజతోత్సవ వేడుకలో మన్మోహన్ పేర్కొన్నారు. మార్కెట్, దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్ను మరింతగా సమ్మిళితం చేసే దిశగా ఎన్ఎస్ఈ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్నా.. అనుకోని కారణాలతో రాలేకపోయా రు. ఆయన సందేశాన్ని చదవి వినిపించారు. -
రిస్క్ తీసుకున్నా రాబడులకు భరోసా!
ఇటీవలి మార్కెట్ల అస్థిరత సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందిన విషయం నిజమే. కానీ, దీర్ఘకాలంలో పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా సంపద సృష్టికి ఈక్విటీలకు దూరంగా ఉండడం కూడా సరికాదు. కనుక నాణ్యమైన ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోవడం అర్థవంతమైనదే. ఆ విధంగా చూసినప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ కూడా పరిశీలించదగ్గదే. ఎందుకంటే మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయంలో స్టాక్స్ను కొంత మేర విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవడం, అదే సమయంలో డెట్ విభాగంలోనూ కొంత మేర పెట్టుబడుల ద్వారా నష్టాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం ఈ పథకం పనితీరులో భాగం. హైబ్రిడ్ పథకంగా ఇది 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. కనీసం 65 శాతం ఈక్విటీలోనూ, 20–35 శాతం వరకు డెట్ విభాగంలోనూ పెట్టుబడులు పెట్టే ఈ పథకాన్ని అటు రాబడుల పరంగా, ఇటు మార్కెట్ల ఆటుపోట్ల సమయంలోనూ కాస్తంత రక్షణగా భావించొచ్చు. పనితీరు గతంలో ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్గా ఉండేది. సెబీ మార్పుల తర్వాత పేరు మారింది. దీర్ఘకాలంలో చూసినప్పుడు ఈ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు కాస్త అధికంగానే ఉంది. స్వల్ప కాలం అంటే ఏడాది కాలంలో మాత్రం కాస్త ప్రతికూలంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 4.9 శాతం రాబడులు ఇస్తే, ఈ విభాగం సగటు రాబడులు 6.2 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు సగటున 10.4 శాతంగా ఉంటే, ఇదే విభాగం సగటు రాబడులు 8.6 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 17.4 శాతం కాగా, ఈ విభాగం రాబడులు 15.3 శాతం. గత మూడేళ్లుగా ఈ పథకం ఈక్విటీల్లో 65–74 శాతం మేర పెట్టుబడులు కొనసాగిస్తోంది. 2017లో వడ్డీ రేట్లు పెరిగిన సమయంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్పోజర్ను 11–14 శాతం వరకు తగ్గించుకుంది. 2017లో ఈ పథకం రాబడులు తక్కువగా ఉండడానికి కారణం ఐటీ స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకుని, అధిక భాగం లార్జ్క్యాప్నకు పరిమితం కావడమే. పోర్ట్ఫోలియో ఈక్విటీల్లో ప్రధానంగా లార్జ్క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అవసరమైన సమయాల్లో మిడ్క్యాప్ స్టాక్స్లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబడులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులు మార్చడం ద్వారా రాబడులు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. 2014 ర్యాలీ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 68–70 శాతం స్థాయిలో కొనసాగిస్తే, 2013లో ఇది 65–67 శాతంగా ఉండడం గమనార్హం. 2016లో బ్యాంకింగ్, పవర్, ఆయిల్, గ్యాస్ కంపెనీల స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది. -
రిస్క్ తక్కువ... స్థిరమైన రాబడి
స్థిరమైన పనితీరుతో పాటు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు డీఎస్పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్ను పరిశీలించొచ్చు. సెబీ మార్పుల తర్వాత కూడా ఈ పథకం పనితీరులో ఎటువంటి మార్పుల్లేవు. ఇది ఇక ముందూ మల్టీక్యాప్గానే కొనసాగుతుంది. పనితీరు ఈ ఫండ్ అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులతో ముందున్నది. ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ఎన్ఎస్ఈ 500. మూడేళ్ల కాలంలో 14.6 శాతం, ఐదేళ్లలో 19.6 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన పథకం ఇది. ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 12.8 శాతం, 16.3 శాతం, 10.9 శాతంగానే ఉండడం గమనార్హం. అంటే బెంచ్ మార్క్తో పోలిస్తే డీఎస్పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ 2–5 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు తెలుస్తోంది. అధిక శాతం లార్జ్క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్లో మోస్తరు ఎక్స్పోజర్ రాబడులకు కారణం. మొత్తం నిధుల్లో 80% లార్జ్క్యాప్ స్టాక్స్కు, 10–15% మిడ్క్యాప్ స్టాక్స్కు కేటాయించింది. అధిక వికేంద్రీకృత పోర్ట్ఫోలియో విధానంతో అన్ని మార్కెట్ల సమయాల్లోనూ మెరుగైన పనితీరుకు, కరెక్షన్లో పతనాన్ని పరిమితం చేయడం, అదే సమయంలో ర్యాలీల్లో మోస్తరు పనితీరుకు దోహదపడ్డాయి. అన్ని కాలాల్లోనూ మార్కెట్కు ధీటైన పనితీరు కోరుకునేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. పోర్ట్ఫోలియో గతంలో ఈ పథకం పోర్ట్ఫోలియోలో 50 స్టాక్స్ మేర ఉంటే, గడిచిన ఏడాది కాలంగా 70 స్టాక్స్పైగా కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో స్టాక్స్ సంఖ్య పెంచుకోవడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. పథకం మొత్తం నిధుల్లో 22.1 శాతం బ్యాంకింగ్ రంగంలోనే ఇన్వెస్ట్ చేసింది. ఫైనాన్షియల్ రంగ స్టాక్స్లో 9.1 శాతం పెట్టుబడులు పెట్టింది. ఫార్మాలో 7.2 శాతం, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల సంబంధిత స్టాక్స్లో 6.1 శాతం, ఆటోమొబైల్ రంగ స్టాక్స్లో 5.9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మాత్రం ఈ పథకం పనితీరు ఆశించిన మేర లేదు. దీనికి కారణం బ్యాంకింగ్ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడమే. అయితే, ఇదే కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్పోజర్ తీసుకోవడం కలిసొచ్చింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే అధికంగా ప్రయోజనం పొందే కన్స్ట్రక్షన్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉంది. చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకుంది. ఇక పథకం నిర్వహణలోని నిధుల్లో 5–7 శాతం మేర డెట్ పెట్టుబడులు, నగదు రూపంలో కలిగి ఉంది. ఐదేళ్లు, ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు పరిశీలించతగిన పథకంగా చెప్పుకోవచ్చు. -
సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి
ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ అన్నారు. ‘‘బ్యాంకుల పుస్తకాల ప్రక్షాళన జరుగుతోంది. ఎన్పీఏల గుర్తింపు పారదర్శకంగా మారింది. వృద్ధి చెందే జీడీపీకి తోడు, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్కరణలతో భారత వృద్ధి త్వరలోనే రెండంకెలకు చేరుతుంది’’ అని చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2016 డిసెంబర్ నుంచి వృద్ధి వేగాన్ని అందుకుందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, చమురు ధరలతో ఐపీవోలపై ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా చూస్తే భారత ఎక్స్ఛేంజ్ల్లో అధిక ఐపీవో కార్యకలాపాలు ఉన్నాయని, 2018 మొదటి ఆరు నెలల్లో 90 ఐపీవోలు 3.9 బిలియన్ డాలర్ల (రూ.26,520 కోట్లు) మేర నిధులు సమీకరించాయని ఆయన తెలిపారు. -
ఈక్విటీ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలి?
నేను మరో పదేళ్లలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా ఉండటం కోసం ఇప్పటికే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ల్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – శ్రీనివాస్, విజయవాడ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్(ఎన్సీడీ)ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. అయితే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఉండవు. మీరు కొనుగోలు చేసిన ఎన్సీడీలను జారీ చేసిన కంపెనీ బాగా ఉన్నంత కాలం మీ సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు. మీరు ఒకటి లేదా రెండు కంపెనీల్లో పెద్ద మొత్తాల్లోనే ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అవి మెచ్యూరయ్యే సమయానికి ఆ కంపెనీల ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోతే, మీకు ఇబ్బందులు తప్పవు. ఎన్సీడీలకు బదులుగా మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఎన్సీడీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మొత్తం మీద రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కనీసం మూడో వంతు ఈక్విటీలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మీరు తరచూ చెబుతుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువ కదా ! మరి ఈ ఒడిదుడుకుల ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉండదా ? వాటిని ఎలా అధిగమించాలి. – మణిమాల, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చనేది నిజం. అలాగే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయన్న మాట కూడా నిజమే. ఈక్విటీ మార్కెట్తో సంబంధం ఉన్న ఏ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, చివరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు 2016లో సెన్సెక్స్ 2 శాతమే రాబడులనిచ్చింది. గత ఏడాది సెన్సెక్స్ రాబడి 28 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ రాబడి 4 శాతం వరకూ ఉంటుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్పై ఒడిదుడుకుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ఒడిదుడుకుల సమస్యను రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. మొదటిది ఈక్విటీల్లో ఎప్పుడూ దీర్ఘకాలం దృష్ట్యానే ఇన్వెస్ట్ చేయాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం ఎప్పుడూ ఈక్విటీలను ఎంచుకోకూడదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే, స్వల్పకాలిక ఒడిదుడుకులను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కనీసం ఐదేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈక్విటీని ఎంచుకోవాలి. ఇక రెండోది ఈక్విటీల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు వచ్చినా, మార్కెట్ పతనమైనప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. నా మిత్రుల్లో ఇద్దరు, ముగ్గురు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నారు. మొహమాటం కొద్దీ రెండు, మూడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవలసి వచ్చింది. ఇది కాకుండా మా ఆఫీస్వాళ్ల హెల్త్ పాలసీ కూడా ఉంది. సింగిల్ క్లెయిమ్ కోసం వీటన్నింటిని ఉపయోగించుకోవచ్చా? – వంశీధర్, విశాఖపట్టణం ఆర్థిక సంబంధిత అంశాల్లో ఎప్పుడూ మొహమాటానికి తావు ఇవ్వవద్దు. మొహమాటానికి పోతే అవసరం లేని పాలసీలు తీసుకోవలసి వస్తుంది. అనవసరంగా పాలసీ ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలను ఉపయోగించుకోవచ్చు. ఒక పాలసీ కవరేజ్ పూర్తయితేనే రెండో పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశాలున్నాయి. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలు ఉపయోగించుకోవాలని అనుకున్నారనుకోండి. ఒక్క పాలసీని మాత్రమే నగదు రహిత(క్యాష్లెస్) విధానంలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, మోకాలి చిప్ప రీప్లేస్మెంట్ కోసం మీకు రూ.2 లక్షలు అవసరమయ్యాయనుకుందాం. మీ ఆఫీస్ పాలసీ కవరేజ్ రూ. లక్షకు, మీరు తీసుకున్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 1 లక్ష ఉందనుకుందాం. మీరు ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగించుకోవచ్చు. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, హాస్పిటల్ సిబ్బంది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాష్లెస్ అప్రూవల్ కోసం మీ డాక్యుమెంట్లను పంపిస్తుంది. సదరు సంస్థ ఆమోదం తెలపగానే, మిగిలిన రూ. లక్ష చెల్లించమని మిమ్మల్ని ఆ హాస్పిటల్ అడుగుతుంది. మీరు ఆ మొత్తాన్నిచెల్లించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యేటప్పుడు.. మొదటి బీమా సంస్థ రూ.లక్ష చెల్లించనట్లుగా సెటిల్మెంట్ లెటర్ను హాస్పిటల్కు పంపిస్తుంది. మీరు ఈ సెటిల్మెంట్ లెటర్ను హాస్పిటల్ నుంచి తీసుకొని మీరు చెల్లించిన రూ. లక్ష రికవరీ కోసం వేరే బీమా సంస్థకు పంపించాలి. ఈ సెటిల్మెంట్ లెటర్లో పాలసీ వివరాలు. మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎంత ఖర్చయింది, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. . ఇలా అన్ని వివరాలు ఉంటాయి. మీరు చెల్లించిన రూ. లక్ష మొత్తాన్ని రెండో బీమా సంస్థ నుంచి రీయింబర్స్ పొందడానికి సాధారణంగా ఈ సెటిల్మెంట్ లెటర్ సరిపోతుంది. మీరు ఒకే సంస్థ నుంచి రెండు, మూడు పాలసీలు తీసుకున్నట్లయితే, క్యాష్లెస్ సౌకర్యం పొందడం చాలా సులభమవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి పథకాల కోసం అన్వేషించే వారు ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ను పరిశీలించొచ్చు. మొన్నటి వరకు ఎస్బీఐ మాగ్నం బ్యాలన్స్డ్ ఫండ్గా చెలామణి అయిన ఈ పథకం పేరు సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్గా మారింది. అయితే, పెట్టుబడుల పరంగా పథకం విధానాల్లో పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఈక్విటీల్లో కనీసం 65శాతం పెట్టుబడి పెడుతుంది. అంటే ఇంతకుమించి కూడా సందర్భానుసారంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మిగిలిన పెట్టుబడులను డెట్ విభాగంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. మార్కెట్ అస్థిరతల సమయాల్లో ఈ పథకం పనితీరు చెప్పుకోతగిన విధంగా ఉండటం గమనార్హం. నేర్పుతో కూడిన విధానం ఈక్విటీ, డెట్ మార్కెట్లలో అననుకూల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఈక్విటీల్లో తక్కువ ఎక్స్పోజర్ కారణంగా 2011, 2015 అస్థిరతల మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. 2014లో బాండ్ మార్కెట్ ర్యాలీలో అధిక లాభాలను ఒడిసి పట్టుకుంది. ఆ ఏడాది 23 శాతం వరకు పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టింది. అంతకుముందు ఏడాది ఇది 10 శాతంగానే ఉంది. ఇక 2017 ఈక్విటీ మార్కెట్లలో భారీ ర్యాలీ అనంతరం కరెక్షన్ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుంది. మిడ్క్యాప్స్కు 30–35 శాతం వరకు కేటాయింపులు చేయడం ద్వారా 2014 బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనబరిచింది. అయితే, వీటిలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో 2017 నుంచి ఎక్స్పోజర్ తగ్గించుకుంది. డెట్ వైపు గతేడాది కాలంలో 10 ఏళ్ల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్ 7.7 శాతానికి చేరిన నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకుని షార్ట్టర్మ్ మనీమార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ తీసుకుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... పెట్టుబడుల పరంగా ఈ విధమైన వ్యూహాల కారణంగా ఈ పథకం సదరు కేటగిరీలో మెరుగైన పనితీరు చూపించగలుగుతోంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు కేటగిరీతో పోలిస్తే సగటున 1–5 శాతం అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.8 శాతం, మూడేళ్లలో 9.9 శాతం, ఐదేళ్లలో 16.8 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం అందించింది. పోర్ట్ఫోలియో:ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 65 శాతం, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో 13 శాతం, కార్పొరేట్ డిబెంచర్లలో 8 శాతం, 11 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో కలిగి ఉంది. కాలానుగుణంగా ఈక్విటీ హోల్డింగ్స్లో మార్పులు చేస్తుంటుంది. -
మరీ ఎక్కువ రిస్కు వద్దా..?
సెబీ ఆదేశాల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఏర్పడిన కేటగిరీ ‘కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్’. ఈక్విటీల్లో మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. ఈ విభాగంలోని ఫండ్ పథకాలు తమ పెట్టుబడుల్లో 10 నుంచి 25 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన పెట్టుబడులను డెట్ సాధనాల్లో పెడతాయి. అధిక భాగాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కచ్చితంగా నిర్ణీత శాతం రాబడులకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ భాగం నుంచి అధిక రాబడులొస్తాయి. రిస్క్ పరిమితంగా ఉండాలని ఆశించే వారు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నవారు, రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా కొంత భాగాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఈ విభాగంలో కాస్త మెరుగైన రాబడులను ఇస్తున్న పథకంగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25’ పథకాన్ని చెప్పుకోవాలి. అయితే, సెబీ ఆదేశాల నేపథ్యంలో ఈ పథకం పేరు ఈ నెల 28 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్గా మారుతోంది. పేరు మారుతున్నప్పటికీ పథకం పెట్టుబడుల విధానం అలానే కొనసాగనుంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఈక్విటీల్లో 21– 25 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించింది. పనితీరు ఇలా ఉంది... ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ‘క్రిసిల్ హైబ్రిడ్ 75+25 కన్జర్వేటివ్ ఇండెక్స్’. ఇది బీఎస్ఈ 200 (25 శాతం ఈక్విటీ), క్రిసిల్ కాంపోజిట్ బాండ్ ఫండ్ ఇండెక్స్ (75 శాతం డెట్) కలయిక. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం 2014లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షికంగా 10.3 శాతం రాబడులను పంచింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షికంగా 9.5 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11 శాతం, ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 10.8 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ విభాగం (తొమ్మిది ఫండ్స్తో కూడిన విభాగం) సగటు రాబడులు 7.6 శాతం, 8.8 శాతం, 8.8 శాతం చొప్పునే ఉన్నాయి. ఈ ప్రకారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అన్ని సమయాల్లోనూ మెరుగైన పనితీరును చూపిస్తూ వస్తోంది. ఈక్విటీల్లో లార్జ్క్యాప్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కరెక్షన్ సమయాల్లోనూ రాబడులకు పెద్ద విఘాతం కలగలేదు. అదే సమయంలో బుల్ ర్యాలీల్లోనూ మోస్తరు రాబడులను అందించింది. ఇదీ పోర్ట్ఫోలియో... మార్కెట్లలో ఆటుపోట్లకు అనుగుణంగా ఈక్విటీల్లో పెట్టుబడులను 10–25 శాతం మధ్య పెడుతోంది. డెట్ సాధనాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇటీవల డెట్ మార్కెట్లలో ఊగిసలాట పెరగడం, బాండ్లపై పెరిగిన ఈల్డ్ నేపథ్యంలో ఈ పథకం క్రెడిట్ సాధనాల్లో పెట్టుబడిని పెంచింది. రుణ సాధనాల్లో సగటు మెచ్యూరిటీ పదేళ్లు కాగా, గడిచిన ఏడాదిలో దీన్ని 3.6 ఏళ్లకు తగ్గించుకుంది. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ స్టాక్ పేరు పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.84 గ్రాసిం ఇండస్ట్రీస్ 3.36 సన్ఫార్మా 3.20 జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.60 ఎల్అండ్టీ 2.60 భారత్ ఫైనాన్షియల్ 2.45 ఇన్ఫోసిస్ 2.06 టైటాన్ కంపెనీ 2.02 సెంచురీ టెక్స్టైల్స్ 1.75 ఆర్ఐఎల్ 1.73 -
ఈక్విటీలే ముద్దు.. గోల్డ్ ఈటీఎఫ్లు వద్దు
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్లో 14 గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అటు లిక్విడ్ ఫండ్స్లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్లో మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. గడిచిన అయిదేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్స్టార్ మేనేజర్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్ ఈటీఎఫ్లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. -
మ్యూచువల్ ఫండ్స్కే ఓటు!
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లతో సహా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో రాబడులు తగ్గుతుండటంతో ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కాస్తంత కష్టమైన వ్యవహారం కావటంతో అత్యధికులు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఫండ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య కొత్తగా 32 లక్షలు పెరిగింది. పరిశ్రమ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు కూడా దీనికి కారణమవుతున్నట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (యాంఫీ) చెబుతోంది. ‘‘మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు తొలిగా 2017 మార్చిలో ప్రతిష్టాత్మకంగా మ్యూచువల్ ఫండ్స్ సహి హై (మ్యూచువల్ ఫండ్స్ సరైనవి) ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించా. ఇపుడు మరో మీడియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా దీర్ఘకాలంలో మరీ ముఖ్యంగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాం. తొలి విడత ప్రచార కార్యక్రమం దాదాపు 32 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేసింది. రెండో విడత ప్రచారం మరింత మందిని దగ్గర చేస్తుందని భావిస్తున్నాం’’ అని యాంఫీ తెలియజేసింది. 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లే లక్ష్యం వచ్చే ఏడాది కాలంలో 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు యాంఫీ తెలియజేసింది. ‘కుటుంబాల ఆదాయం పెరిగింది. భారత్ దీర్ఘకాలిక వృద్ధి అంచనా నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా పొదుపు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రతి కుటుంబానికీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారతాయి’’ అని యాంఫీ చైర్మన్ ఎ.బాలసుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఇన్వెస్టర్లకు సహనం కావాలి. ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ వెళ్లాలి. పోర్ట్ఫోలియోకు డెట్, హైబ్రిడ్ ఫండ్స్ను జతచేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కు (సిప్) మరీ ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాలంలో లబ్ధి పొందేలా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలి’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది కాలంలో దేశ జనాభాలో 2 శాతం మందిని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేలా చూడడానికి తమకు ‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.5 శాతం కన్నా తక్కువ మంది ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏయూఎంలో 25 శాతం వృద్ధి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెరుగుదలతో పాటు ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) కూడా వృద్ధి చెందాయి. 2017 మార్చి నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఫండ్స్ ఏయూఎం విలువ 25 శాతం వృద్ధితో రూ.4.25 లక్షల కోట్లు పెరిగింది. ‘మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇటీవల గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ను కొనసాగిస్తాం’ అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఫండ్స్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండని తెలియజేసే ‘జన్ నివేశ్’ ప్రచార కార్యక్రమ ఆవిష్కరణకు ప్రముఖ మీడియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఠీఠీఠీ.ఝu్టu్చ జunఛీటట్చజిజీ.ఛిౌఝ మైక్రోసైట్ను అందుబాటులో ఉంచిందని, ఇందులో ఫండ్స్కు సంబంధించిన వివరాలను, సమీపంలోని ఫండ్ కార్యాలయం, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల సమాచారాన్ని పొందొచ్చని తెలియజేశారు. -
ఎల్టీసీజీ ఉన్నా ఈక్విటీ ఫండ్స్ ఓకే!!
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ–లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? – పరిమళ, సికింద్రాబాద్ దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ–లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. ఈ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో ఈక్విటీల్లో మూడో వంతు, ఆర్బిట్రేజ్ ఫండ్స్లో మరో మూడో వంతు, ఫిక్స్డ్–ఇన్కమ్ సాధనాల్లో మరో మూడో వంతు చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్లో ఏడాదికి మించి మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగితే మీరు పొందే రాబడులపై 10 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ నుంచి స్టిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకుంటే అది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈక్విటీలో పెట్టిన మూడో వంతు పెట్టుబడిని రీ–బ్యాలెన్సింగ్కు వినియోగిస్తారు. దీనిపై ఎలాంటి పన్ను భారాలూ ఉండవు. అందుకని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కొనసాగించవచ్చు. దీంట్లో గ్రోత్ ప్లాన్ను ఎంచుకోవాలి. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకోవాలి. రోజులు గడిచే కొద్దీ, ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్స్ ఆకర్షణ కోల్పోవచ్చు. పెట్టుబడి సంబంధిత కేటాయింపులు కారణంగా వీటికి మాత్రం ప్రాధాన్యత తగ్గదనే చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇచ్చే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) విధించారు కదా! ఈ సందర్భంలో డివిడెండ్ ప్లాన్ను ఎంచుకోవాలా ? లేకుంటే గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయాలా? – సుధాకర్, విజయవాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) విధించిన నేపథ్యంలో గ్రోత్ ఆప్షన్ను ఎంచుకోవడమే ఉత్తమం. డీడీటీ విధింపుకు ముందు కూడా గ్రోత్ ప్లాన్లే ఆకర్షణీయంగా ఉండేవి. చాలా ఈక్విటీ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లను పరిశీలిస్తే, ఆయా ఫండ్ల డివిడెండ్ ఈల్డ్ ఆరు నుంచి ఏడు శాతానికి మించి ఉండేది కాదు. ఈక్విటీ ఫండ్స్ గ్రోత్ ఆప్షన్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ఇంతకు మించి మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీరియాడిక్ ఆదాయం(డివిడెండ్ల ద్వారా కొంత మొత్తంలో) పొందాలనుకోకూడదు. ఉదాహరణకు రూ.10 ముఖ విలువ గల ఒక ఈక్విటీ ఫండ్ను తీసుకుందాం. దీని ఎన్ఏవీ రూ.15 ఉంది. ఇది 10 శాతం డివిడెండ్ను ప్రకటించింది. మీరు డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రూ.1 డివిడెండ్ లభిస్తుంది. ఈ మేరకు ఎన్ఏవీ రూ.14కు తగ్గుతుంది. 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ను పరిగణనలోకి తీసుకుంటే మీకు 90 పైసలే డివిడెండ్ వస్తుంది. అదే గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటే, ఎన్ఏవీ రూ.15 అలాగే కొనసాగుతుంది. పైగా ఎలాంటి పన్ను భారం కూడా ఉండదు. నేను సీనియర్ సిటిజన్ను. నేను గతంలో ఇన్వెస్ట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి ఇటీవలే మెచ్యూర్ అయింది. ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి నెలవారీ కొంత ఆదాయాన్ని పొందాలనేది నా ఆలోచన. దీనికి తగ్గట్టుగా మంచి పెట్టుబడి వ్యూహాన్ని సూచించండి? – ఆంజనేయులు, విశాఖపట్టణం ముందుగా మీ జీవన వ్యయాలకు అవసరమయ్యే నెలవారీ ఖర్చులను పూర్తిగా రాసుకోండి. మీ నెలవారీ అవసరాలకు ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి. ఈ అవసరాలను తీర్చే ఇతర ఆదాయాలు.. (ఉదాహరణకు మీకు ఇంటద్దెలు రావడం కానీ, పెన్షన్ రావడం కానీ) ఏమీ లేని పక్షంలో సీనియర్ సిటిజన్స్ స్కీమ్లో రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయండి. ఈ స్కీమ్లో మీకు 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది పూర్తిగా సురక్షితం. మీకు మూడు నెలలకొకసారి వడ్డీ వస్తుంది. ఎల్ఐసీకి చెందిన ప్రధాన మంత్రి వ్యయ వందన యోజనలో కూడా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. దీనిపై కూడా 8.3 శాతం వడ్డీ వస్తుంది. ఈ రెండు స్కీమ్లూ సురక్షితమైనవే. ఒకటి పూర్తిగా ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్కీమ్ కాగా, మరొకటి ప్రభుత్వం స్పాన్సర్చేస్తున్న స్కీమ్. ఇక మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవే కానీ, మీ పెట్టుబడి వ్యూహానికి అవి తగవు. రిటైర్మెంట్ వ్యక్తులకు ద్రవ్యోల్బణంతో తట్టుకునే క్రమబద్ధమైన ఆదాయం అవసరం. స్థిరాదాయం అందించే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆదాయాన్ని మాత్రమే ఇవ్వగలవు. మూడేళ్ల తర్వాత ద్రవ్యోల్బణంతో పాటు ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ ఆదాయం కూడా పెరగాలి. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో మీ పెట్టుబడి కూడా స్థిరంగానే ఉంటుంది. కానీ వృద్ధి ఉండదు. ఐదు లేదా పదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణంతో పాటే పెరిగేలా మీ రాబడులు ఉండాలి. దీనికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ పెట్టుబడికి రక్షణ ఉండాలి. అలాగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగానే రాబడులు ఉండాలి. ఈక్విటీల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ రిస్క్ను తగ్గించుకోవాలి. అందుకని మీ మొత్తం పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం కంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయొద్దు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రపంచ ట్రెండ్.. దిక్సూచి!
న్యూఢిల్లీ: సెలవుల కారణంగా మూడురోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో మార్కెట్...ప్రపంచ సంకేతాలకు అనుగుణంగా కదులుతుందని విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా–చైనాల మధ్య తాజాగా తలెత్తిన వాణిజ్య యుద్ధం విస్త్రతమవుతుందన్న భయాలు, మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటం వంటి అంశాల కారణంగా ఈక్విటీల్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. మహవీర్ జయంతి, గుడ్ఫ్రైడే పండుగలతో వచ్చే గురు, శుక్రవారాల్లో (మార్చి 28, 29 తేదీలు)మార్కెట్కు సెలవుకాగా, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు బుధవారమే (మార్చి 28) జరుగుతుంది. సాధారణంగా ప్రతీ నెలా చివరి గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ విభాగపు కాంట్రాక్టులు క్లోజ్చేయాల్సివుంటుంది. వాణిజ్య యుద్ధంతో దెబ్బ... చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధించే ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత గురువారం సంతకాలు చేయగా, ఆ మర్నాడే అమెరికా దిగుమతులపై 3 బిలియన్ డాలర్ల మేర సుంకాల్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించడంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయని, దీంతో ఈక్విటీ మార్కెట్లు దెబ్బతింటున్నాయని మార్కెట్ నిపుణులు చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ తరహా రక్షణాత్మక విధానాలు మరిన్ని వుండవచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని, ఈ విధానాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కల్గిస్తాయని వారు వివరించారు. అమెరికా–చైనాల మధ్య తలెత్తిన ఈ వాణిజ్య యుద్ధ ప్రభావంతో గత వారం భారత్తో సహా ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ పతనమయ్యాయి. గత గురు, శుక్రవారాల్లో అమెరికా సూచీలు 4 శాతం వరకూ క్షీణించాయి. ఇక్కడ సెన్సెక్స్ వారం మొత్తం మీద 579 పాయింట్లు కోల్పోయింది. దేశీయ సమస్యలు కూడా... అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ సమస్యలు కూడా మన మార్కెట్ను పట్టిపీడిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇక్కడి ఈక్విటీలు అధిక విలువల్ని కలిగివుండటం, ఎన్నికల ముందస్తు రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు భారీగా తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ఇక్కడ ఫండ్స్లో రిడంప్షన్ల ఒత్తిడి తగ్గిందని, ఈ మార్చి నెలాఖరునాటికి పరిస్థితులు కుదుటపడతాయని అంచనావేస్తున్నామన్నారు. కానీ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశాలున్నందున, మార్కెట్లో కొద్దిరోజులపాటు హెచ్చుతగ్గులు చోటుచేసుకోవొచ్చని, ఈ వారం మార్కెట్కు రెండు రోజుల సెలవు దినాలుకావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడటం వంటి అంశాలతో ఒడిదుడుకులు పెరగవచ్చని ఆయన అన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయ వాతావరణం కారణంగా మధ్యకాలికంగా బుల్స్పై ఒత్తిడి వుండవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అంచనావేశారు. -
ఎన్పీఎస్లో.. పెడుతున్నారా..?
నేషనల్ పెన్షన్ సిస్టమ్లో (ఎన్పీఎస్) పెట్టుబడుల తీరుతెన్నులను మార్చాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) యోచిస్తోంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం 50 శాతానికే పరిమితమైన ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్ని ఇకపై 75 శాతం దాకా పెంచేలా ప్రతిపాదిస్తోంది. దీనిపై అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎందుకిలా? ఒకవేళ ఇలా చేస్తే చందాదారులకు కలిగే లాభనష్టాలేంటి? ఒకసారి చూద్దాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ప్రస్తుతం ఎన్పీఎస్లో నాలుగు రకాల ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అవి.. 1. ప్రభుత్వ సెక్యూరిటీస్ ఫండ్ లేదా స్కీమ్ జీ 2. కార్పొరేట్ బాండ్స్ ఫండ్ లేదా స్కీమ్ సి 3. ఈక్విటీస్ ఫండ్ లేదా స్కీమ్ ఈ 4. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లేదా స్కీమ్ ఎ. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది... లైఫ్ సైకిల్ ఆధారిత విధానం. ఇందులో మీ వయసు ఆధారంగా పెట్టుబడులు పెట్టేలా ముందే నిర్ణయించిన లైఫ్ సైకిల్ ఫండ్ ప్లాన్ ఉంటుంది. దీని ప్రకారం 35 ఏళ్లు వచ్చే దాకా ఈక్విటీలకు గరిష్టంగా 50% కేటాయించవచ్చు. 55 ఏళ్లు వచ్చేసరికి ఇది 10 శాతానికి తగ్గిపోతుంది. అయితే 2016లో కొత్తగా మరో రెండు లైఫ్ సైకిల్ ఫండ్స్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఒక దాని తీరు దూకుడుగా ఉండేది కాగా.. ఇంకొకటి కాస్త సంప్రదాయబద్ధంగా ఉండేది. దూకుడుగా ఉండే అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ విధానంలో 35 ఏళ్లు వచ్చే దాకా గరిష్టంగా 75% మేర ఈక్విటీలకు కేటాయించవచ్చు. అదే సాంప్రదాయబద్ధంగా ఉండే కన్జర్వేటివ్ ఆప్షన్లో ఇది 25 శాతమే. 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీలకు కేటాయింపులు అగ్రెసివ్ ఫండ్ విధానంలోనైతే 15 శాతానికి, కన్జర్వేటివ్ విధానంలోనైతే 5 శాతానికి తగ్గిపోతాయి. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ విధానంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ జోలికి వెళ్లవు. ఇక, రెండవది యాక్టివ్ విధానం. ఇందులో ఏ దశలో కూడా ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతానికి మించవు. అయితే, అంతర్గత పరిమితులకు లోబడి ఇన్వెస్టర్లు.. నాలుగింట్లో ఏ స్కీములోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్దిష్ట పరిమితి దాకా కేటాయింపులు చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం పరిమితి 5 శాతమే. ఈ యాక్టివ్ విధానంలోనే ఈక్విటీల్లో ఇప్పటిదాకా 50 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 75% దాకా పెంచాలని పీఎఫ్ఆర్డీఏ యోచిస్తోంది. అయితే, దీన్లోనూ ఓ మెలిక ఉంది. అది... 50 ఏళ్లు వచ్చే దాకా మాత్రమే ఈక్విటీలకు 75%దాకా కేటాయించవచ్చు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి దీన్ని 50 శాతానికి తగ్గించుకోవాలి. ఇలా కేటాయింపులు తగ్గించుకుంటూ రాగా మిగిలిన మొత్తాన్ని ఇతర ఫండ్స్కి మళ్లించవచ్చు. ఎన్పీఎస్ ప్రయోజనాలు.. ఎన్పీఎస్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు అత్యంత తక్కువగా 0.01%మేర ఉంటున్నాయి. ఇది కొంత మేర పెరిగినా రాబడులు అధికంగా ఇచ్చే అవకాశాలున్నందున అంతిమంగా ఇన్వెస్టర్లకు లాభమేనన్నది పరిశ్రమ వర్గాల మాట. పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించడం ఎన్పీఎస్లో రెండో ఆకర్షణీయ అంశం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బి) కింద అదనంగా రూ.50,000 మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సి కింద లభిస్తున్న రూ.1.5 లక్షల డిడక్షన్కి ఇది అదనం. ప్రతికూలాంశాలూ ఉన్నాయ్... మెచ్యూరిటీ తరవాత వచ్చే మొత్తంలో కనీసం 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన ఇబ్బందికరమే. సాధారణంగా యాన్యుటీ పథకాలపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. భవిష్యత్లో మళ్లీ కావాలనుకుంటే ఎకాయెకిన వెనక్కి తీసుకోలేకుండా కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో లాక్ చేసేస్తున్నట్లే లెక్క. అలా కాకుండా రిటైర్మెంట్ అవసరాలకు తగిన ఆదాయాన్ని అందించేలా డెట్, ఈక్విటీ మేళవింపుతో.. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) గల మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయన్నది వారి సూచన. మరోవైపు, 50 ఏళ్ల నుంచి ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకుంటూ రావాలన్న నిబంధనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. యాభై ఏళ్లు పైబడినా దూకుడుగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే సామర్ధ్యం ఉండే ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కాబట్టి.. ఆ ఆప్షన్ వారికే వదిలేయడం మంచిదని సదరు ఫైనాన్షియల్ ప్లానర్స్ అభిప్రాయం. ఏదైతేనేం.. ఈక్విటీలకు కేటాయింపులు పెంచే వీలు కల్పించే ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ పరిమితమైన లిక్విడిటీ స్వభావం ఉన్నందున రిటైర్మెంట్ అవసరాల కోసం ఒక్క ఎన్పీఎస్ మీదే ఆధారపడటం సరికాదన్నది నిపుణుల మాట. రిటైర్మెంట్ కోసం ఇతరత్రా సాధనాలకు కూడా పెట్టుబడులు కేటాయించడం మంచిదని వారి అభిప్రాయం. -
విశ్రాంత జీవనానికి.. ఈ ఫండ్లు బెటర్..!
ఈ ఏడాది ఆదాయపు పన్ను గడువు ముగియటానికి ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. అంటే మార్చి 31 రావటానికి నిండా మూడు వారాలు కూడా లేదు. పన్ను భారం ఎక్కువవుతోందనుకునే వారు చివర్లో మినహాయింపుల కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం మామూలే. ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా... వారు చివరి క్షణాల్లోనే ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సరే!! ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా... అది సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చేదైతేనే పన్ను మినహాయింపు లభిస్తుందనేది మనకు తెలియంది కాదు. బ్యాంకులు జారీ చేసే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పీపీఎఫ్ డెట్ విభాగంలోనివి. ఈక్విటీ వైపు చూస్తే ముందు కనిపించేది ఈఎల్ఎస్ఎస్లే. మ్యూచువల్ ఫండ్స్ అందించే రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్లో పెట్టుబడులు సైతం òసెక్షన్ 80సీ కింద ప్రయోజనానికి అర్హత కలిగినవే. పన్ను ఆదాతో పాటు రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. విశ్రాంత జీవనంలో ఇబ్బందులు పడకూడదని భావించే వారు ఏ వయసు వారైనా... ఈ పథకాల వైపు చూస్తే మంచిది. రిటైర్మెంట్ ఫండ్స్.. ఒక్కొక్కరికి ఒకటి ఈ ఫండ్స్ సాధారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉద్దేశించినవి. వీటిలో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే అవి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంతకు మించి పెట్టుబడి పెట్టినా మినహాయింపు లభించేది రూ.1.5 లక్షలకే అని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ ఇవన్నీ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు, పన్ను మినహాయింపునుకు అర్హత కలిగిన పథకాలే. ఇన్వెస్టర్ల వయసు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. యువ ఇన్వెస్టర్లయితే.. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రిచేషన్ పథకాలు కాస్తంత దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటాయి. అంటే అధిక రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఇచ్చే తరహాలో పనిచేస్తాయి. సేకరించిన నిధుల్లో 85 శాతానికిపైగా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు సుదీర్ఘ సమయం కలిగిన యువ ఇన్వెస్టర్లకు ఈ పథకాలు అనువుగా ఉంటాయి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉంటే... ఇక హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్ పథకాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. అంటే, పెట్టుబడుల విలువను కాపాడేందుకు తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ ఉండే ఈక్విటీల్లో కేవలం 20– 25 శాతాన్నే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారికి ఇవి అనువైనవి. రిస్క్ వద్దనుకునే మధ్య వయస్కులూ వీటిని ఎంచుకోవచ్చు. మధ్యస్థంగా రిస్క్ భరించగలిగితే... హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అయితే ఈక్విటీల్లో 65–70 శాతం ఇన్వెస్ట్ చేస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ పథకాలు ఈక్విటీలకు 40 శాతం కేటాయింపులు చేస్తుంటాయి. మిగిలిన నిధుల్ని బాండ్లలో పెడతాయి. మధ్యస్థంగా రిస్క్ భరించే వారు వీటిని పరిశీలించొచ్చు. ఫ్రాంక్లిన్, యూటీఐ.... సుదీర్ఘ చరిత్ర ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకాలు చక్కని పనితీరు చూపించాయి. గత పది సంవత్సరాల కాలంలో వార్షికంగా 8.7 నుంచి 9.4 శాతం వరకు రాబడులిచ్చాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ పథకాలకు సుదీర్ఘ చరిత్ర లేదు. ఈ మధ్యే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ప్రారంభం నుంచి చూస్తే చెప్పుకోతగ్గ రాబడులనే ఇచ్చాయి. మార్కెట్లు బుల్ ర్యాలీలో ఉండడంతో గడిచిన ఏడాది కాలంలో హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్ 34 శాతం చొప్పున లాభపడ్డాయి. లాకిన్ పీరియడ్... మూడు లేదా ఐదేళ్లు! ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల (ఈఎల్ఎస్ఎస్) మాదిరే రిటైర్మెంట్ ఫండ్స్లోనూ మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఇది పథకాలను బట్టి మారిపోవచ్చు. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన రిటైర్మెంట్ ఫండ్స్కు లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ప్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లో మూడు ఆర్థిక సంవత్సరాలు లాకిన్ పీరియడ్గా అమల్లో ఉంది. సెబీ ఇటీవల మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో మార్పులు చేయడంతో ఈ పథకాల్లోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రిటైర్మెంట్ ఫండ్స్ అన్నవి దీర్ఘకాలిక లక్ష్యానికి ఉద్దేశించినవి. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరడానికి ఇవి దోహదపడతాయి. మధ్యలో ఉపసంహరిస్తే ఎగ్జిట్ లోడ్... మధ్యలో కీలకమైన అవసరాలు ఏర్పడితే ఈ ఫండ్స్ నుంచి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కానీ, ముందుగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఎగ్జిట్ లోడ్ విధిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఫండ్స్ లాకిన్ పీరియడ్ ముగిసి, 60 ఏళ్లు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే విలువలో ఒక శాతాన్ని ఎగ్జిట్ లోడ్గా వసూలు చేస్తున్నాయి. ఇక పన్ను అంశాలనూ చూడాలి. ఈక్వీటీ తరహా పథకాలను (అంటే మొత్తం నిధుల్లో 65 శాతం కంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి) ఏడాది తర్వాత విక్రయిస్తే వాటిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పడుతుంది. అదే డెట్ పథకాల్లో అయితే మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంది కనుక డెట్ ఫండ్స్ను ఆ తర్వాత విక్రయిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలు ప్రధానంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి. అదే, రిటైర్మెంట్ ఫండ్స్ అయితే డెట్లో ఇన్వెస్ట్ చేసేవీ ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్స్ను ఎన్పీఎస్, ఇతర పథకాలతో కలసి పెట్టుబడులకు పరిశీలించొచ్చు. -
మార్కెట్లు పెరిగినా ఇబ్బంది లేదు!
రాబడుల విషయంలో ఈక్విటీలను మించి అధిక రాబడులనిచ్చే సాధనాలు దాదాపుగా లేవనే చెప్పాలి. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.లక్ష దాటితే 10 శాతం పన్ను ప్రవేశపెట్డం వల్ల రాబడులు పెద్దగా ప్రభావితం కావని, ఈక్విటీలు భవిష్యత్తులోనూ మెరుగైన రాబడులనే ఇస్తాయన్నది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో... స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా కూడా రిస్క్ పెద్దగా లేకుండానే తగిన రాబడులు కావాలనుకునే వారు ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్ను పరిశీలించొచ్చు. ఎల్అండ్టీ ప్రుడెన్స్ ఫండ్ ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్డ్ ఫండ్. పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 65 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 35 శాతం మేరకు డెట్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్లు పెరిగి ఉన్నప్పటికీ మరింత ర్యాలీ చేస్తే ఆ అవకాశం కోల్పోకుండా ఈక్విటీ పెట్టుబడులు ఉపయోగపడతాయి. అదే సమయంలో కరెక్షన్కు లోనైతే రిస్క్ తక్కువగా ఉండేందుకు డెట్ ఎక్స్పోజర్ సాయపడుతుంది. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ ఫండ్ ఒక మంచి ఆప్షన్. పెట్టుబడుల విధానం, పనితీరు మార్కెట్ల ర్యాలీ ఎంత పద్ధతి ప్రకారం ఉన్నాగానీ ఈ ఫండ్ ఈక్విటీ పెట్టుబడులను పరిమితికి మించి పెంచదు. ఏ సమయంలో చూసినా ఈక్విటీ ఎక్స్పోజర్ 65–75 శాతం మధ్యలోనే ఉంటుంది. మార్కెట్లు బుల్ ర్యాలీ సమయంలో ఎక్స్పోజర్ను గరిష్టంగా 75 శాతం వరకు పెంచుతుంది. ఆటుపోట్లు ఎక్కువైతే పెట్టుబడుల్ని 65 శాతానికి పరిమితం చేస్తుంది. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువ ఉండే విభాగంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో (మార్కెట్ క్యాప్ రూ.10,000 కోట్లకు తక్కువగా ఉన్నవి) పెట్టుబడుల్ని 30 శాతం మించకుండా చూస్తుంది. అలాగే డెట్ వైపు కూడా ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. బాండ్లలోనూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్పోజర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటుంది. ఈక్విటీ విభాగంలో 2013లో సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ రంగాలు, 2014 ర్యాలీలో బ్యాంకింగ్, 2016లో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ స్టాక్స్లో పెట్టుబడుల ద్వారా గణనీయమైన రాబడులనే అందించింది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలాన్ని పరిశీలించి చూస్తే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్ ఇదే విభాగంలోని ఇతర ఫండ్ పథకాల కంటే సగటున 3–4 శాతం మెరుగైన రాబడులనే అందించింది. ఏడాది కాలంలో 24.3 శాతం, మూడేళ్లలో 12.4 శాతం, ఐదేళ్లలో సగటున 18.6 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. టాటా బ్యాలన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ బ్యాలన్స్డ్, డీఎస్పీబీఆర్ బ్యాలన్స్డ్ ఫండ్ పథకాల కంటే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ రాబడుల్లో ముందుంది. పోర్ట్ఫోలియో ఈక్విటీలో 70 నుంచి 80 స్టాక్స్ వరకు పెట్టుబడుల కోసం ఎంచుకుంటుంది. ప్రస్తుతం డెట్ విభాగంలో 26.6 శాతం పెట్టుబడులున్నాయి. లార్జ్క్యాప్ స్టాక్స్తో పోలిస్తే బుల్ ర్యాలీ కారణంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడులను 10 శాతం లోపునకు తగ్గించుకుంది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. డెట్ వైపు గత ఏడాది కాలంలో సార్వభౌమ బాండ్ల స్థానాన్ని కార్పొరేట్ బాండ్లతో భర్తీ చేసింది. ఫండ్ పెట్టుబడులు ఎలా..? విభాగం నిధులు (శాతం) డెట్ 26.6 బ్యాంకులు 13.7 ఫైనాన్స్ 9.3 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు 5.3 ఫార్మా 5.1 ఆటో 4.9 ఇతర విభాగాలు 35.1 -
ఎల్టీసీజీ ఇన్వెస్టర్ల మేలుకే!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) తీసుకురావడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా సమర్థించుకున్నారు. ఎల్టీసీజీ నుంచి ఈక్విటీలను మినహాయించడం వల్ల ఆస్తుల విలువలు అధిక స్థాయికి చేరతాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు రిస్క్ బాగా పెరిగిపోయే అవకాశాలుంటాయని చెప్పారాయన. 14 ఏళ్ల తర్వాత ఎల్టీసీజీని తిరిగి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూ... ‘‘ఇతర అన్ని రకాల సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంది. ఈక్విటీలకు మినహాయింపు ఇవ్వడం వల్ల పక్కదారి పడుతుంది. నాలుగైదు సాధనాల్లో ఒకదానికి పన్ను లేకపోతే చాలా మంది తమ నిధుల్ని అందులోనే పెట్టాలనుకుంటారు. దాంతో డిమాండ్ పెరిగి, పెద్ద ఎత్తున నిధులు షేర్లు, ఫండ్స్ వెంట పడితే వాటి విలువలు అనూహ్యంగా పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ విలువలు ఆయా కంపెనీల వాస్తవ విలువలను కూడా ప్రతిఫలించేలా ఉండవు. దానివల్ల చిన్న ఇన్వెస్టర్లకు అధిక ముప్పు ఉంటుంది’’ అని అధియా వివరించారు. ఒక పెట్టుబడి విభాగాన్ని పూర్తిగా పన్నుకు దూరంగా ఉంచడం సరికాదన్నారు. పీహెచ్డీ చాంబర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధియా ఈ మేరకు మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్ల తగ్గుదలలో భాగమేనని, ఎల్టీసీజీ తీసుకురావడం వల్ల కాదన్నారు. సోమవారం దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ ఇప్పటికీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదిలోపు పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉండగా, దీర్ఘకాలిక పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను లేదు. ఈ నేపథ్యంలో 10 శాతం ఎల్టీసీజీని కేంద్రం ప్రతిపాదించింది. -
రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్
ఇది బ్యాలెన్స్డ్ ఫండ్. ఈక్విటీలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడితే మార్కెట్లు కరెక్షన్కు లోనైనప్పుడు తమ పెట్టుబడుల విలువ కుంగిపోతుందన్న ఆందోళన ఉంటే దీన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఇది ఈక్విటీ, డెట్ల కలబోత. ముఖ్యంగా మార్కెట్లు అధిక స్థాయికి చేరిన తరుణంలో పూర్తి ఈక్విటీ పథకాలతో రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. మరోవైపు గత ఏడాది ఆగస్ట్లో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్ల పరంగా కఠిన, తటస్థ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి రిస్క్కు సిద్ధపడేవారు రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ తరహా బ్యాలెన్స్డ్ ఫండ్లను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. రిస్క్తో కూడిన సాధనాల్లో పెట్టుబడులను కొంత మేర బ్యాలెన్స్డ్ ఫండ్లలోకి మళ్లించడం కూడా వివేకమే. రిస్క్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ప్రధానంగా లార్జ్క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ పోర్ట్ఫోలియోకు సంబంధించి అక్రూయెల్ స్ట్రాటజీ (క్రెడిట్ రేటింగ్ మెరుగుపడే అవకాశం ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడం) పాటిస్తుంటాయి. రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ – బ్యాలెన్స్డ్ కూడా ఇదే తరహా పథకమే. హైబ్రిడ్ ఈక్విటీ తరహా కేటగిరీలోకి వస్తుంది. పథకం కింద సమీకరించే నిధుల్లో 65 శాతం మేర ఈక్విటీలకు కేటాయిస్తుంది. లార్జ్క్యాప్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే పథకం కావడంతో మార్కెట్లలో అనూహ్య ఆటు పోట్లు ఎదురైనా తట్టుకునే విధంగా మెరుగైన స్థానంలో ఉంది. ఈ కేటగిరీలోనే మంచి పనితీరు చూపిస్తున్న ఇతర పథకాలు... హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ ఫండ్, ప్రిన్సిపల్ బ్యాలెన్స్డ్ ఫండ్, యూటీఐ బ్యాలెన్స్డ్ ఫండ్లు మాత్రం స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయి. పోర్ట్ఫోలియో, పనితీరు ఈ పథకం పనితీరు 2013–16 మధ్య కాలంలో ఆశించిన మేర లేదు. ఎందుకంటే ఆ సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడంతో రాబడుల విషయంలో మిగిలిన పథకాలతో పోలిస్తే వెనుకబడింది. కారణం ఎక్కువ పెట్టుబడుల్ని లార్జ్క్యాప్కు కేటాయించడమే. కానీ, 2017లో తిరిగి రాబడుల పరంగా మంచి స్థానానికి చేరుకుంది. టాప్–3 పథకాల్లో ఒకటిగా నిలిచింది. బ్యాంకు స్టాక్స్కు అధిక కేటాయింపులతో గత 10 సంవత్సరాల కాలంలో ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడులను అందించింది. పెట్టుబడులను రక్షించుకోవడంతోపాటు రిస్క్ను పరిమితం చేసే విధంగా ఈ పథకం విధానం ఉంటుంది. గత ఐదేళ్లలో పరిశీలిస్తే ఈక్విటీలకు కేటాయింపులను 72 శాతం స్థాయిలో కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 70 శాతం ఈక్విటీలకు కేటాయించగా, అందులో 83 శాతం లార్జ్క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన 17 శాతం నిధుల్ని మిడ్, స్మాల్క్యాప్ స్టాక్స్లో పెట్టుబడులుగా పెట్టింది. ఇన్విట్లకు 2 శాతం కేటాయించడం గమనార్హం. బ్యాంకులు, ఫైనాన్స్, ఆటో, సిమెంట్ రంగాల స్టాక్స్కు ప్రాధాన్యం ఇస్తోంది. రాబడుల విషయానికొస్తే ఏడాది కాలంలో 29 శాతం, మూడేళ్లలో 13.2 శాతం, ఐదేళ్లలో 16.4 శాతం, పదేళ్లలో 12 శాతం చొప్పున వార్షికంగా ప్రతిఫలం ఇచ్చింది. ఈక్విటీలో టాప్ పెట్టుబడులు కంపెనీ కేటాయింపులు (%) హెచ్డీఎఫ్సీ బ్యాంకు 8.55 గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5.56 ఇన్ఫోసిస్ 4.37 ఐసీఐసీఐ బ్యాంకు 4.09 భారత్ ఫైనాన్షియల్ 3.27 లార్సన్ అండ్ టుబ్రో 3.20 హెచ్డీఎఫ్సీ 2.61 ఆర్ఐఎల్ 2.38 కోటక్ మహీంద్రాబ్యాంకు 2.26 ఇండియన్ ఆయిల్ 2.18 -
ఎక్కువ మొత్తానికి గృహరుణం ఓకేనా?
మల్టీక్యాప్ ఫండ్స్కు, డైనమిక్ ఫండ్స్కు మధ్య తేడా ఏమిటి ? – మాధురి, విజయవాడ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని బట్టి మల్టీక్యాప్ ఫండ్స్కు, డైనమిక్ ఫండ్స్కు తేడా ఉంటుంది. ఎల్లప్పుడూ ఈక్విటీల్లోనే పూర్తిగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ను మల్టీక్యాప్ ఫండ్స్గా చెప్పుకోవచ్చు. ఇక డైనమిక్ ఫండ్స్ కూడా దాదాపు అధిక స్థాయిల్లోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే మార్కెట్ స్థితిగతులను బట్టి, ఈక్విటీ, స్థిరాదాయ సాధనాలకు సంబంధించిన పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పుచేర్పులు చేస్తాయి. అంటే మార్కెట్ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఈక్విటీల్లో తక్కువగానూ, మార్కెట్ పతనమైన పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఎక్కువగానూ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని డైనమిక్ ఫండ్స్గా వ్యవహరిస్తారు. మార్కెట్ పరిస్థితులను బట్టి డైనమిక్ ఫండ్ను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఒక్కోసారి స్థిరాదాయ సాధనాల్లో 25 శాతం నుంచి 30 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మల్టీక్యాప్ ఫండ్స్ అయితే వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందుతాయి. నా వయస్సు 40 సంవత్సరాలు. నా నికర వేతనం రూ.40,000. ఈ రోజుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్లు చౌకగా ఉన్నాయి. అందుకని వీలైనంత ఎక్కువ మొత్తానికి(రూ.30–35 లక్షల వరకూ) గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – రవి కుమార్, విశాఖపట్టణం ఈ రోజుల్లో గృహరుణాలపై వడ్డీరేట్లు తక్కువగానే ఉన్నాయన్నది నిజమే. అయితే మీ విషయంలో ఎక్కువ మొత్తానికి గృహ రుణం తీసుకోవడమనేది సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తోంది. మీకు వచ్చే ఆదాయంలో 60–80 శాతం వరకూ గృహ రుణ నెలసరి వాయిదాల చెల్లింపులకే పోవడం వల్ల మీ కుటుంబ ఇతర ఆర్థిక అవసరాలపై బాగానే ప్రభావం చూపుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీరు ఉద్యోగం కోల్పోతే అప్పుడు పరిస్థితులు మరింత విషమిస్తాయి. ఉద్యోగం కోల్పోయిన కారణంగా ఈఎంఐలు చెల్లించలేక ఇల్లును కూడా కోల్పోవలసి వస్తుంది. అందుకని ఎవరైనా సరే, గృహ రుణానికి సంబంధించిన నెలసరి వాయిదా (ఈఎంఐ) వారి వారి వేతనంలో మూడో వంతుకు మించకుండా చూసుకోవాలి. మీ విషయానికొస్తే, మీ గృహ రుణ ఈఎంఐ రూ.10,000–14,000 రేంజ్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ సందర్భంలో మీరు ఉద్యోగం కోల్పోయినా, గృహ రుణ ఈఎంఐ చెల్లించే స్థాయిలోనైనా వెంటనే మరో చిన్న ఉద్యోగం సంపాదించుకొని, సొంత ఇంటిని చేజారకుండా చూసుకోవచ్చు. అయితే గృహ రుణాలు చౌకగా ఉన్నందున ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవడం ఒక్కోసారి మంచి ఫలితాలే ఇవ్వవచ్చు. గృహం విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పెరిగే విలువతో పోల్చితే, గృహ రుణంపై అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి. మీరు ఉద్యోగం కోల్పోయినా, విషమ పరిస్థితుల్లో ఈఎంఐ చెల్లింపులు కుంటుపడకుండా ఉండేటట్లయితే(మీ భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ గృహ రుణ ఈఎంఐ చెల్లింపులు చేయగలిగితే) వీలైనంత ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవచ్చు. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. నేను ఎల్ఐసీ జీవన్ తరంగ్ పాలసీని 2011లో తీసుకున్నాను. పాలసీ వివరాలను మీకు పంపిస్తున్నాను. ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? ఈ పాలసీకి దీనికి బదులుగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. – పవన్, హైదరాబాద్ జీవన్ తరంగ్ అనేది విత్ ప్రాఫిట్స్–హోల్ లైఫ్ ప్లాన్. మీరు పంపిన వివరాలను బట్టి చూస్తే, మీరు తీసుకున్న పాలసీకి బీమా కవరేజ్ రూ.9 కోట్లకు ఉంది. మీరు ఒక వేళ ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు భారీగా నష్టపోతారు. మీరు ఇప్పటిదాకా చెల్లించిన ప్రీమియమ్ల్లో మొదటి ఏడాది ప్రీమియమ్ను మినహాయించి మిగిలిన దాంట్లో 30 శాతం మాత్రమే మీకు గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూగా వస్తుంది. ఎల్ఐసీ ఒకోసారి స్పెషల్ సరెండర్ వ్యాల్యూని కూడా చెల్లించవచ్చు. ఇది గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ కంటే కొంచెం అధికంగానే ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకుని మూడేళ్లు దాటింది కాబట్టి మీరు ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. బీమా తీసుకోవాలనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడమే ఉత్తమమైన విధానం. టర్మ్ బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. పైగా బీమా కవరేజ్ అధికంగా ఉంటుంది. తక్కువ ప్రీమియమ్ చెల్లించడం ద్వారా అధిక మొత్తానికి బీమా కవరేజ్ పొందవచ్చు. బీమా, ఇన్వెస్ట్మెంట్కు ఒకే పాలసీని ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, ఇన్వెస్ట్మెంట్స్కు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయాలి. బీమా కోసం టర్మ్ పాలసీని తీసుకున్నట్లుగానే, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్