Harish Shankar
-
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్లో స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
హరీష్ కి హ్యాండ్ ఇచ్చిన రామ్.
-
మెగా హీరోస్ పైనే హరీష్ ఆశలు..
-
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్రెడ్డి మాట్లాడారు. -
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్
ఆగస్టు 15 వీకెండ్లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాత రవితేజను కొత్తగా చూస్తారు: హరీష్ శంకర్
⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్ను డిజైన్ చేశాను.ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను. ⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే. ⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం. -
‘పుష్ప’ చూసి అంతా స్మగ్లింగ్ చేయట్లేదు కదా? : హరీశ్ శంకర్
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే ‘గాంధీ’సినిమా చూసి అందరం మహాత్మ గాంధీలాగే మరిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పని కొస్తుందని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.వినోదం కోసమే సినిమా: హరీశ్ శంకర్‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హరీశ్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ.. ‘సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కాదా? ఠాగూరు చూసిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిసిన ‘గాంధీ’సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. వారి అంతిమ లక్ష్యం వినోదాన్ని పంచడమే. వారిని చూసి మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది వినోదం మాత్రమే. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.పవన్ ఏం అన్నారు?ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలే అడవును నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవు’అన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్గా ఉంటాడు. నాలుగు ఫైట్స్లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
'నల్లంచు తెల్లచీర' మాస్ సాంగ్కు స్టెప్పులేసిన మిస్టర్ బచ్చన్
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్నుశ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఈ సాంగ్ ఉంది. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. సూపర్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్కు ముందు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో గ్రాండ్గా నిర్వహించనున్నారు. This isn’t something I usually do, but this time, it’s for you all 😘#NallanchuThellacheera from #MrBachchan out Tomorrow, August 12th ❤🔥 pic.twitter.com/NokEYn4y0z— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2024 -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మాస్ ట్రైలర్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈమేరకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. -
హీరోయిన్కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్ శంకర్
సినిమా పరిశ్రమలో మనం ఎక్కువగా వినే మాట ఏజ్ గ్యాప్.. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇందులో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే, వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్ను కొద్దిరోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. అందులో వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ గ్యాప్ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడంలేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఒక యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించరు. సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న యువతి కూడా 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది. దీనినే స్క్రీన్ ఏజ్ అంటారని హరీశ్ శంకర్ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారని ఆయన గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఓ ఉదాహరణగా హరీశ్ చెప్పారు.‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్ గ్యాప్ మీకెందుకు అంటూ నెటిజన్ల తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో హీరోయిన్కు సమస్య లేదు. కానీ ట్రోలర్స్కు వచ్చిన బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. ఇంతటితో ఇలాంటి కామెంట్లు ఆపేస్తే మంచిదని హరీశ్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్షిప్డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
మిస్టర్ బచ్చన్ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత ఇదే కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. కాన్సెప్ట్ రైడ్ సినిమా కావచ్చునేమో కానీ, ఆయన తెరకెక్కించే తీరు మాత్రం ప్రత్యేకతను తప్పకుండా చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
నేను దర్శకుడిని కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా..
-
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఓవర్ చేయకు అంటూ డైరెక్టర్కు రవితేజ పంచ్
ప్రస్తుతం మాస్ మహారాజ ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్కు డుమ్మా కొట్టకుండా సెట్కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్, ట్రైలర్కు బదులుగా షో రీల్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా హరీష్.. ఎక్స్(ట్విటర్)లో రవితేజ ఫోటో షేర్ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.ఈ సినిమాలో హీరో.. బిగ్బీ అమితాబ్ బచ్చన్కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్ దేవ్గణ్ 'రైడ్' సినిమాకు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. Over cheyaku roiiiii .. Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024 చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
మాస్ బచ్చన్
శత్రువులు చుట్టుముట్టారు... అయినా బచ్చన్ కంగారుపడలేదు. కంగారు అంటే ఏంటో అతనికి తెలియదు. ధైర్యానికి చిరునామా లాంటివాడు. వచ్చినవాళ్లను వచ్చినట్లు ఇరగదీశాడు బచ్చన్. ఏ రేంజ్లో రఫ్ఫాడించాడో తెలియాలంటే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షో రీల్ వీడియోను సోమవారం విడుదల చేశారు.ఈ వీడియోలో రవితేజ చేసిన మాస్ ఫైట్, ఆగ్రహంతో జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ని రవితేజ అనుకరించడం తదితర విజువల్స్ కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయాంకా బోస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్ ఫ్యాన్గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
Ustaad Bhagat Singh: సినిమాల్లోనూ పవన్ ప్యాకేజీ పాలిటిక్స్!
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హైడ్రామా చూస్తుంటే, ఆ మాట ఆయనకి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. రాజకీయం కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను వాడుతూ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు ఈ నట నాయకుడు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ నుంచి సినిమా అంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉండేవి. సినిమా అప్డేట్స్ వస్తే చాలు మెగా ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఓ చిన్న హీరో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా పవన్ మూవీకి రావడం లేదు. దానికి కారణం సినిమాను సినిమాగా తీయకుండా.. తన రాజకీయాల కోసం వాడుకోవడమే. ప్రతి సినిమాలోనూ తన పార్టీ ప్రచారం కోసం అనవసరపు సన్నివేశాలనో.. డైలాగ్స్నో చొప్పించి, ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఆ మధ్య ‘బ్రో’ సినిమాలోనూ ప్యాకేజీ పాలిటిక్స్ చేసి, చివరకు నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి సైడ్ అయిపోయాడు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ తన ప్యాకేజీ పాలిటిక్స్ని అప్లై చేశాడు. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్పై డైలాగ్స్ చెప్పించి.. సినిమాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. అందులో పవన్ జస్ట్ యాక్టర్ మాత్రమే. అంటే రెమ్యునరేషన్ తీసుకొని నటించి వెళ్లాలి. కానీ ఒకవైపు భారీగా పారితోషికం పుచ్చుకుంటునే.. మరోవైపు ఆ సినిమానే తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నాడు. అలా తనకొచ్చిన ప్రతి సినిమానూ రాజకీయంగా వాడుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. దీని వల్ల నిర్మాతలు రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. ఒకవేళ సినిమాలను రాజకీయాల కోసం వాడుకోవాలంటే.. తనే నిర్మాతగా మారి సినిమా చేస్తే బాగుంటుంది కానీ.. మరొకరి సొమ్ముతో ఈయన రాజకీయ ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పార్ట్టైం పాలిటిక్స్కి ఫిక్స్! ఇది ఎన్నికల సమయం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కానీ ప్యాకేజీ స్టార్ మాత్రం ఇప్పుడు కూడా తన సమయాన్ని సినిమాలకే కెటాయిస్తున్నాడంటే.. ఎన్నికల తర్వాత తన దారి ఎటో తెలిసిపోతుంది. ఎన్నికలు అయిపోగానే పాలిటిక్స్కి ప్యాకప్ చెప్పి..ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకొనే.. వరుస సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వపన్ చేతిలో హరిహరవీరమల్లు , ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో పవన్ ఫుల్టైమ్ని సినిమాలకే కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘గ్లాస్’డైలాగ్స్పై సెటైర్స్ తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు ఉండేవనీ..కానీ గ్లింప్స్ చూశాక పవన్ ఈ సారి కూడా తన స్వార్థం కోసం సినిమాను చెడగొట్టాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా గ్లింప్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను అడ్డుపెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా అని పవర్ స్టార్ ఫ్యాన్సే చర్చించుకుంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే.. సినిమాలోని ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం’ డైలాగ్స్పై సెటైరికల్ కామెంట్ చేస్తున్నారు. ‘అసలు సినిమాకు గాజు గ్లాసుకు సంబంధం ఏంటి?’, ‘ఇదేదో జనసేన పొలిటికల్ యాడ్లా ఉందే’‘ఈసారి పిఠాపురం(పవన్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం)లో గ్లాస్ నుజ్జు నుజ్జు అయిపోతుందటగా’, ‘ఫ్యాన్ గాలికి గ్లాస్ పగిలిపోవడం ఖాయం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
లంబసింగి ట్రైలర్.. కట్టిపడేసిన దివి!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్గా లంబసింగి ట్రైలర్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన! -
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ట్రోలింగ్పై హరీశ్ శంకర్ ఫైర్
-
స్పీడ్ పెంచిన స్టార్ డైరెక్టర్స్
-
కారైకుడిలో మిస్టర్ బచ్చన్
కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్కు ఈ సినిమా స్క్రిప్ట్ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ముచ్చటగా మూడోసారి.. మాస్ మహారాజా మూవీ టైటిల్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మిరపకాయ్ వంటి మాస్ హిట్ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్తో పాటు పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని రవితేజ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హరీశ్- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఖరారు చేశారు. నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్లో రవితేజ కూర్చుని స్టైలిష్ లుక్లో కనిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఈ విషయాన్ని మాస్ మహారాజాతో క్లాస్ మహారాణి అంటూ చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. #MrBachchan Naam tho suna hoga 😉 Honoured to play the character with the name of my favourite @SrBachchan saab 🤗🙏@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo — Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023 -
పవన్ సినిమాను పక్కన పెట్టిన హరీష్ శంకర్.. రవితేజతో హ్యాట్రిక్ ఫిల్మ్!
‘మిరపకాయ్’ వంటి మాస్ హిట్ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్ హిట్ చిత్రాన్ని నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఒకే సినిమాకి కుదిరింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. హరీష్ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్తో ‘ఉస్తాద్ భగత్సింగ్’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్ మంచి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. The Magical Mass Combo is back ❤️🔥 Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥 This time, the #MassReunion gets spicier 🔥🔥 Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥 More details soon! pic.twitter.com/OYNmnRuPDx — People Media Factory (@peoplemediafcy) December 13, 2023 -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్దీప్కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
యూత్ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
రవితేజలో నెగిటివ్ క్వాలిటీస్ చెప్పినా శంకర్
-
రవితేజ గురించి హరీష్ శంకర్ గొప్ప మాటలు
-
చంద్రయాన్ 3 సక్సెస్.. హరీశ్ శంకర్ ట్వీట్పై ట్రోలింగ్
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 జెండా పాతడంతో యావత్ భారతదేశం సంతోషంలో మునిగి తేలుతోంది. ఎవరూ అందుకోలేని ఘనతను మన దేశం సాధించడంతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు కూడా! ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షేర్ చేసిన ప్రకాశ్రాజ్ను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న సంగతి తెలిసిందే! తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్లో షేర్ చేసిన ఫోటోపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రుడిపై జెండా.. జెండాపై చంద్రుడు(పాక్ జాతీయ పతాకం).. రెండూ ఒకటి కాదు అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు హరీశ్. ఇది చూసిన జనాలు మధ్యలో పాకిస్తాన్ను తేవడం అవసరమా? అసలు ఆ దేశంతో మనకు పోలికేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. 'మనకంటే దిగువన ఉన్న వాళ్లతో కాదు, మనకంటే గొప్పగా ఉన్నవాళ్లతో పోల్చుకోవాలి', 'ఈ విమర్శలు పక్కనపెట్టి చంద్రయాన్ 3 విజయంలో పాలుపంచుకున్నవాళ్లను ప్రశంసించండి' అని చురకలంటిస్తున్నారు. 'మనం అందుకున్న విజయాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప పక్కదేశాన్ని వెక్కిరించకూడదు.. ఒక సెలబ్రిటీవైన నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనం తోపులు అని చెప్పుకోవడానికి ఎదుటివాళ్లను ఎందుకు తక్కువచేయడం?..', 'అయినా అమెరికా, చైనా వంటి దేశాలతో మనం పోటీపడాలి, పోల్చుకోవాలే.. అంతే కానీ పాక్ లాంటి దేశాలతో కాదు.. అసలు నువ్వు డైరెక్టర్ ఎలా అయ్యావో.. ఏంటో?' అని విమర్శిస్తున్నారు. Haahhahaha mana janaala sense of humour 🙏🙏🙏🙏 pic.twitter.com/x0ZOlQWTgu — Harish Shankar .S (@harish2you) August 23, 2023 చదవండి: ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు..లిస్టులో 20 మందికి పైగా కంటెస్టెంట్లు! కమెడియన్స్ నుంచి హీరోల దాకా.. -
కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్’ రాజు
‘‘సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ సినిమా మా బ్యానర్కి జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు శతమానం భవతి ఆర్ట్స్ పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టడం సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితపొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ కీలక పా త్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. చింతా గోపా ల కృష్ణారెడ్డి సమర్పణలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ సినిమా లోగోను ‘దిల్’ రాజు విడుదల చేయగా, టీజర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పా తికేళ్లు అయ్యింది. ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్గా, డైరెక్టర్గా నిలబడ్డాను. ఈవీవీ సత్యనారాయణగారి మాటల స్ఫూర్తితోనే ఈ బ్యానర్ పెట్టాను. నేను స్టార్ట్ చేసిన ‘కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని ‘కథా కేళి’ తీశా’’ అన్నారు. -
భారత్లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్. ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. -
తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోనంటూ హరీశ్ స్ట్రాంగ్ వార్నింగ్
2018 సినిమా.. మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో 2018 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. తర్వాత ఓ విలేఖరి మాట్లాడుతూ.. 'మన తెలుగు దర్శకనిర్మాతలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' ప్రశ్నించాడు. దీనికి హరీశ్ శంకర్ స్పందిస్తూ.. 'ప్రెస్మీట్స్ జరిగిన ప్రతిసారి ఆయన(విలేఖరిని ఉద్దేశిస్తూ) సాహసోపేతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచి యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది(తెలుగు సినిమాను ఉద్దేశిస్తూ). అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్లను ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా! డబ్బింగ్, రీమేక్ అదంతా ఏమీ లేదు.. కేవలం సినిమా అంతే! ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని వాసు(నిర్మాత) అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ దర్శకుడు అని భాషాబేధాలు చూడట్లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్ చేశాడు. చులకన చేసే నోరు ఉన్నపుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది.. Can’t take insult to our industry. By all means please appreciate every film maker from every industry but for that sake don’t belittle our industry. Whole world is looking towards us. https://t.co/l5yZRZZgjZ — Harish Shankar .S (@harish2you) May 24, 2023 చదవండి: టాలీవుడ్కు మరో కొత్త హీరోయిన్ -
థియేటర్స్లో చూడాల్సిన సినిమా 2018
‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. -
బలగం చూసి ఆ ముగ్గురు కమర్షియల్ డైరెక్టర్లు ఏడ్చేశారు: హరీశ్
కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది బలగంతో మరోసారి నిరూపితమైంది. రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతూ హిట్ ట్రాక్ ఎక్కిందీ మూవీ. శుక్రవారం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి చూస్తున్నా. సినిమాను క్లాస్, మాస్, కమర్షియల్ అని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇండస్ట్రీలో మనం పెట్టుకున్న పేర్లు. కానీ జనాలు మంచి సినిమానా? కాదా? ఆ ఒక్కటే చూస్తారు. శంకరాభరణం, సాగరసంగమం సినిమాలకు బండ్లు కట్టుకుని వెళ్లారు. ఇసుకేస్తే రాలనంత జనం. ఆ సినిమాల్లో సుమోలు ఎగరలేదు, రక్తపాతాలు జరగలేదు. కానీ మాస్ ఆడియన్స్ కూడా చూశారు. అంతెందుకు, ఈ సినిమా చూసి కమర్షియల్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాధ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకడు మూడు వందల కోట్ల సినిమా తీసినా, ఒకడు మూడు కోట్ల సినిమా తీసినా అన్నీ మన సినిమాలే. బయట మనకెన్నో సమస్యలున్నాయి.. వాటిపై పోరాడటం మానేసి మనలో మనం పోట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాదు, దేనికదే యునిక్. కాసర్ల శ్యామ్ రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే హమ్మయ్య బయ్యర్ల దగ్గర డబ్బులున్నాయి. తర్వాత నా సినిమాను మంచి రేటుతో కొంటారని అనుకుంటాం. అందుకే మా ముందు సినిమాలు హిట్ అయితే సంతోషపడతాం. అంతే తప్ప చాలా మంది అనుకున్నట్లు పక్కోడి సినిమాలు పోతే చప్పట్లు కొట్టం. అది కామన్సెన్స్ లేనివాళ్లు చేసే పని' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. -
సినిమానే మనల్ని ఎంచుకుంటుంది
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. -
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ముఖ్య తారలుగా కెఎస్ హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఏ ఫోన్కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి అంతే..!’, ‘రిచిగాడి పెళ్లి’ జీవితంలో మర్చిపోకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో ‘రిచిగాడి పెళ్లి’ని రూపొందించాం’’ అన్నారు హేమరాజ్. -
హరీష్ శంకర్ చేతులు మీదుగా "రిచి గాడి పెళ్లి" ట్రైలర్ లాంచ్
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం "రిచి గాడి పెళ్లి". కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని అర్ధమవుతుంది అన్నారు. ఇక దర్శకుడు కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ..ట్రైలర్ మంచి స్పందన లభిస్తుందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్కుమార్. -
Siddharth Roy: హీరోగా మారిన ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్.. ‘ఫస్ట్లుక్’లోనే లిప్లాక్
‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ‘సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ , నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైన రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెఫ్ట్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సీరీస్లో దొంగలు రొటీన్గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజాహెగ్డే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ ఇటీవలి కాలంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజాను కాస్త దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజా హెగ్డే అవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలో లాంచింగ్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే ప్రచారమా? లేదంటే డేట్స్ సర్దుబాటు కాలేదా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా బయటకు వచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది. -
‘భవదీయుడు భగత్సింగ్’ పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి‘భవదీయుడు భగత్సింగ్’ అనే టైటిల్ని ఖరారు చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్పైకి పోలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ని వదిలింది. సినిమా టైటిల్ని మార్పు చేస్తూ..'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్తో పాటు ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అనే థీమ్లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥 This time, it's beyond entertainment 😎🔥 Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8 — Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022 -
‘లవ్ యూ రామ్’ టీజర్ను రిలీజ్ చేసిన హరీష్ శంకర్
‘రోహిత్ నటించిన ‘నాట్యం’ చూశాను. అతనిలో మంచి డ్యాన్సర్, యాక్టర్ వున్నారు. ‘లవ్ యూ రామ్’ అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా వున్నాయి. దర్శకుడిగా అద్భుత చిత్రాలు అందించిన దశరథ్ నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ జంటగా దర్శకుడు కె. దశరథ్ అందించిన కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. డీవై చౌదరి దర్శకత్వంలో డీవై చౌదరి, కె. దశరథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ టీజర్ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీజర్ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా చూశాను. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘మిస్టర్ పర్ఫెక్ట్’తో హరీష్ శంకర్, నా జర్నీ మొదలైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారాయన’’ అన్నారు కె. దశరథ్. ‘‘ఈ సినిమాలో దశరథ్గారు కూడా నటించారు’’ అన్నారు డీవై చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: కె. వేద. -
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు .. పవన్ కోసం హరీష్ ..!
-
నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
‘పుష్ప’ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్లో చేరాడు. టాలీవుడ్లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినీ ప్రియులంతా పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింట్ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో బన్ని న్యూలుక్లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు. (చదవండి: సల్మాన్తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం) కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్, చెవికి పోగు పెట్టి రఫ్లో లుక్లో కనిపించాడు బన్ని. అయితే ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్ని ఇలా కనిపించాడు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్ని..తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో యాడ్ చేశాడు. దాని కోసమే బన్ని ఇలా నయా లుక్లో కనిపించాడు. ఈ ఫోటోని బన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. కొన్ని క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయింది. బన్ని నయా లుక్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లైకులు, రీట్వీట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. 🖤 pic.twitter.com/wm1GuLLmsA — Allu Arjun (@alluarjun) July 29, 2022 -
మరోసారి జతకట్టిన హరీశ్ శంకర్-బన్నీ, థాయ్లాండ్లో షూటింగ్..
దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు భారీ వసూళ్లు రాబట్టింది. తాజా వీరిద్దరు మళ్లీ జత కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీతో తమ బ్రాండ్ను ఎండార్స్ చేసేందుకు పలు వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. Get ready to see never before Avatar of…… “ICONSTAAR “ @alluarjun #adshoots — Harish Shankar .S (@harish2you) July 28, 2022 దీంతో వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్లో నటించాలని కోరుతూ బన్నీని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో యాడ్లో నటించనున్నాడు. అయితే ఇప్పటికీ వరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హరీశ్ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్లో జరిగనుందని సమచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. Icon Staar @AlluArjun is teaming up with director @harish2you and DOP Sudeep Chatterjee for an ad shoot for @AstralPipes being shot in Hyderabad. #AlluArjun pic.twitter.com/H2CSh7BAxG — Suresh Kondi (@SureshKondi_) July 28, 2022 చదవండి: బిగ్బాస్లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్? నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
పవన్తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?
ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్స్టార్ పవన్ కల్యాణ్. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. (చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..) మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
పవన్-హరీశ్ శంకర్ మూవీ నుంచి తప్పుకున్న పూజా! అందుకేనా?
లక్కీ లెగ్ హీరోయిన్గా టాలీవుడ్లో గుర్తింపు పొందిన బ్యూటీ పూజా హెగ్డే. ఆమె సినిమాకు ఒకే చేసిందంటే అది హిట్ అనేంతగా దర్శకులకు, హీరోలకు సెంటిమెంట్గా మారింది ఆమె. ఇలా బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్, నాగార్జున లుక్ రిలీజ్ ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్ అని ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్లో నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్లో కిన్నెర మొగిలయ్యకు ఇంటిస్థలం, రూ కోటి నగదు.. ఉత్తర్వులు జారీ దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్ మూవీ యనిమల్లో స్పెషల్ సాంగ్స్కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్న పూజా తాను ఈ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్తో అలరించిన సంగతి తెలిసిందే. -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్టాపిక్గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
హరీష్ శంకర్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను స్పీడ్గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్తో చిట్చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్చాట్లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దొంగతనం మొదలుపెట్టిన బిగ్బాస్-5 విజేత సన్నీ
ప్రముఖ నిర్మాత దిల్రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’. బిగ్బాస్ ఫేం వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్కు హరీష్ శంకర్ కథ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కొత్త వెబ్సిరీస్పై సన్నీ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం వెబ్సిరీస్ గ్రాండ్గా లాంచ్ అయ్యింది. దొంగతనం షురూ' అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా వీజే సన్నీకి అలీ, సోహైల్ సహా పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) -
ఆశిష్కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్వార్, వరస ట్వీట్స్తో మాటల యుద్ధం..
టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వార్కు దిగారు. ఒకరిపై ఒకరూ వరసగా సటైరికల్గా పంచ్లు వేసుకుంటూ మాటల యుద్దానికి దిగారు. ఇదంతా చూస్తుంటే వారి మధ్య ఎదో కోల్డో వారి జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్, రచయిత బీవీఎస్ రవి. బీవీఎస్ రవి చేసిన ట్వీట్కు హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై ఈ గొడవ దారి తీసింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ మొదట బీవీఎస్ రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్కు దర్శకుడు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్ను ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడంతో.. ఇది చూసిన నెటిజన్లు ‘చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏం జరిగింది. ఏదో జరగబోతుందని గట్టిగా కొడుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ — Harish Shankar .S (@harish2you) February 3, 2022 Giving statements on other’s statements at times reverberate as a statement from a critical condition in the struggle to exist. All the best. Continue to sail on social media democracy. https://t.co/6q37rJadCo — BVS Ravi (@BvsRavi) February 4, 2022 అనుభవించడంలో ఒక భాగం పరిపాలన,ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే. ( for those who under read my below tweet. This is said by Chankaya to Chandra gupta in the విశాఖదత్తుడు విరచిత "ముద్రారాక్షసమ్") https://t.co/LKKrnKgePx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C — Harish Shankar .S (@harish2you) February 4, 2022 -
Dil Raju: నా జీవితంలో అది చూడాలని ఉంది
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్వీసీ) బ్యానర్ని 2003లో స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాను. ఎస్వీసీపై 50వ సినిమా చేస్తున్నాం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ లోగో డిజైన్ చేశారు.. దేవుడి ఆశీర్వాదాలతో నా జీవితంలో ఎస్వీసీ లోగోను కూడా అలా చూడాలని ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్లో ఎస్. హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా చంద్రమోహన్ డైరెక్షన్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజు ప్రొడక్షన్లో ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తాయి. ‘హిట్, జెర్సీ’ సినిమాలతో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో హర్షిత్, హన్షితలకు ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బాధ్యతలను నేను, శిరీష్ అప్పగించాం’’ అన్నారు. ‘‘ఏటీఎమ్’ స్క్రిప్ట్, స్క్రీన్ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది’’ అన్నారు ‘జీ 5’ వైస్ ప్రెసిడెంట్ పద్మ. ‘‘ఏటీఎమ్’ తొలి సీజన్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ చంద్రమోహన్. ‘‘ఎస్వీసీని సినిమా రంగంలో ఆదరించినట్టే ‘దిల్’ రాజు ప్రొడక్షన్ని డిజిటల్ మాధ్యమంలోనూ ఆదరించాలి’’ అన్నారు హన్షిత రెడ్డి. ‘‘మా మేనేజర్ కల్యాణ్గారి వల్లే ‘ఏటీఎమ్’ కథను రాశాను’’ అన్నారు ఎస్. హరీష్ శంకర్.