Harish Shankar
-
‘అతిథి’గా హరీష్ శంకర్.. ఏ సినిమాలో అంటే..
‘గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా, దువ్వాడ జగన్నాథమ్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్(Harish Shankar ) ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama) చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి మాళవికా మనోజ్ తెలుగుకి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. ఈ చిత్రంలో హరీష్ శంకర్ అతిథి పాత్ర చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఆయన గెస్ట్ రోల్ అందరిని సర్ఫ్రైజ్ చేస్తుందట. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ హరీష్ శంకర్ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ను ఇటీవల పూర్తిచేశారు.‘‘ఈ సినిమాలో సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు మంచి వినోదం ఉంటుంది. ఈ మూవీలోని ఓ పాత్ర కోసం హరీష్ శంకర్గారిని ఒప్పించి, ఆయన పాత్ర షూటింగ్ పూర్తి చేశాం. ఆయన గెస్ట్ రోల్ సర్ప్రైజ్ చేస్తుంది. మా చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు హరీష్ నల్ల. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్లో స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
హరీష్ కి హ్యాండ్ ఇచ్చిన రామ్.
-
మెగా హీరోస్ పైనే హరీష్ ఆశలు..
-
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్రెడ్డి మాట్లాడారు. -
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్
ఆగస్టు 15 వీకెండ్లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాత రవితేజను కొత్తగా చూస్తారు: హరీష్ శంకర్
⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్ను డిజైన్ చేశాను.ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను. ⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే. ⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం. -
‘పుష్ప’ చూసి అంతా స్మగ్లింగ్ చేయట్లేదు కదా? : హరీశ్ శంకర్
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే ‘గాంధీ’సినిమా చూసి అందరం మహాత్మ గాంధీలాగే మరిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పని కొస్తుందని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.వినోదం కోసమే సినిమా: హరీశ్ శంకర్‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హరీశ్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ.. ‘సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కాదా? ఠాగూరు చూసిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిసిన ‘గాంధీ’సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. వారి అంతిమ లక్ష్యం వినోదాన్ని పంచడమే. వారిని చూసి మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది వినోదం మాత్రమే. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.పవన్ ఏం అన్నారు?ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలే అడవును నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవు’అన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్గా ఉంటాడు. నాలుగు ఫైట్స్లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
'నల్లంచు తెల్లచీర' మాస్ సాంగ్కు స్టెప్పులేసిన మిస్టర్ బచ్చన్
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్నుశ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఈ సాంగ్ ఉంది. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. సూపర్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్కు ముందు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో గ్రాండ్గా నిర్వహించనున్నారు. This isn’t something I usually do, but this time, it’s for you all 😘#NallanchuThellacheera from #MrBachchan out Tomorrow, August 12th ❤🔥 pic.twitter.com/NokEYn4y0z— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2024 -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మాస్ ట్రైలర్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈమేరకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. -
హీరోయిన్కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్ శంకర్
సినిమా పరిశ్రమలో మనం ఎక్కువగా వినే మాట ఏజ్ గ్యాప్.. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇందులో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే, వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్ను కొద్దిరోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. అందులో వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ గ్యాప్ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడంలేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఒక యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించరు. సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న యువతి కూడా 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది. దీనినే స్క్రీన్ ఏజ్ అంటారని హరీశ్ శంకర్ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారని ఆయన గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఓ ఉదాహరణగా హరీశ్ చెప్పారు.‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్ గ్యాప్ మీకెందుకు అంటూ నెటిజన్ల తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో హీరోయిన్కు సమస్య లేదు. కానీ ట్రోలర్స్కు వచ్చిన బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. ఇంతటితో ఇలాంటి కామెంట్లు ఆపేస్తే మంచిదని హరీశ్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్షిప్డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
మిస్టర్ బచ్చన్ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత ఇదే కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. కాన్సెప్ట్ రైడ్ సినిమా కావచ్చునేమో కానీ, ఆయన తెరకెక్కించే తీరు మాత్రం ప్రత్యేకతను తప్పకుండా చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
నేను దర్శకుడిని కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా..
-
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఓవర్ చేయకు అంటూ డైరెక్టర్కు రవితేజ పంచ్
ప్రస్తుతం మాస్ మహారాజ ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్కు డుమ్మా కొట్టకుండా సెట్కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్, ట్రైలర్కు బదులుగా షో రీల్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా హరీష్.. ఎక్స్(ట్విటర్)లో రవితేజ ఫోటో షేర్ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.ఈ సినిమాలో హీరో.. బిగ్బీ అమితాబ్ బచ్చన్కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్ దేవ్గణ్ 'రైడ్' సినిమాకు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. Over cheyaku roiiiii .. Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024 చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
మాస్ బచ్చన్
శత్రువులు చుట్టుముట్టారు... అయినా బచ్చన్ కంగారుపడలేదు. కంగారు అంటే ఏంటో అతనికి తెలియదు. ధైర్యానికి చిరునామా లాంటివాడు. వచ్చినవాళ్లను వచ్చినట్లు ఇరగదీశాడు బచ్చన్. ఏ రేంజ్లో రఫ్ఫాడించాడో తెలియాలంటే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షో రీల్ వీడియోను సోమవారం విడుదల చేశారు.ఈ వీడియోలో రవితేజ చేసిన మాస్ ఫైట్, ఆగ్రహంతో జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ని రవితేజ అనుకరించడం తదితర విజువల్స్ కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయాంకా బోస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్ ఫ్యాన్గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
Ustaad Bhagat Singh: సినిమాల్లోనూ పవన్ ప్యాకేజీ పాలిటిక్స్!
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హైడ్రామా చూస్తుంటే, ఆ మాట ఆయనకి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. రాజకీయం కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను వాడుతూ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు ఈ నట నాయకుడు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ నుంచి సినిమా అంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉండేవి. సినిమా అప్డేట్స్ వస్తే చాలు మెగా ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఓ చిన్న హీరో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా పవన్ మూవీకి రావడం లేదు. దానికి కారణం సినిమాను సినిమాగా తీయకుండా.. తన రాజకీయాల కోసం వాడుకోవడమే. ప్రతి సినిమాలోనూ తన పార్టీ ప్రచారం కోసం అనవసరపు సన్నివేశాలనో.. డైలాగ్స్నో చొప్పించి, ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఆ మధ్య ‘బ్రో’ సినిమాలోనూ ప్యాకేజీ పాలిటిక్స్ చేసి, చివరకు నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి సైడ్ అయిపోయాడు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ తన ప్యాకేజీ పాలిటిక్స్ని అప్లై చేశాడు. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్పై డైలాగ్స్ చెప్పించి.. సినిమాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. అందులో పవన్ జస్ట్ యాక్టర్ మాత్రమే. అంటే రెమ్యునరేషన్ తీసుకొని నటించి వెళ్లాలి. కానీ ఒకవైపు భారీగా పారితోషికం పుచ్చుకుంటునే.. మరోవైపు ఆ సినిమానే తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నాడు. అలా తనకొచ్చిన ప్రతి సినిమానూ రాజకీయంగా వాడుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. దీని వల్ల నిర్మాతలు రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. ఒకవేళ సినిమాలను రాజకీయాల కోసం వాడుకోవాలంటే.. తనే నిర్మాతగా మారి సినిమా చేస్తే బాగుంటుంది కానీ.. మరొకరి సొమ్ముతో ఈయన రాజకీయ ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పార్ట్టైం పాలిటిక్స్కి ఫిక్స్! ఇది ఎన్నికల సమయం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కానీ ప్యాకేజీ స్టార్ మాత్రం ఇప్పుడు కూడా తన సమయాన్ని సినిమాలకే కెటాయిస్తున్నాడంటే.. ఎన్నికల తర్వాత తన దారి ఎటో తెలిసిపోతుంది. ఎన్నికలు అయిపోగానే పాలిటిక్స్కి ప్యాకప్ చెప్పి..ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకొనే.. వరుస సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వపన్ చేతిలో హరిహరవీరమల్లు , ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో పవన్ ఫుల్టైమ్ని సినిమాలకే కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘గ్లాస్’డైలాగ్స్పై సెటైర్స్ తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు ఉండేవనీ..కానీ గ్లింప్స్ చూశాక పవన్ ఈ సారి కూడా తన స్వార్థం కోసం సినిమాను చెడగొట్టాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా గ్లింప్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను అడ్డుపెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా అని పవర్ స్టార్ ఫ్యాన్సే చర్చించుకుంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే.. సినిమాలోని ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం’ డైలాగ్స్పై సెటైరికల్ కామెంట్ చేస్తున్నారు. ‘అసలు సినిమాకు గాజు గ్లాసుకు సంబంధం ఏంటి?’, ‘ఇదేదో జనసేన పొలిటికల్ యాడ్లా ఉందే’‘ఈసారి పిఠాపురం(పవన్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం)లో గ్లాస్ నుజ్జు నుజ్జు అయిపోతుందటగా’, ‘ఫ్యాన్ గాలికి గ్లాస్ పగిలిపోవడం ఖాయం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
లంబసింగి ట్రైలర్.. కట్టిపడేసిన దివి!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్గా లంబసింగి ట్రైలర్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన! -
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ట్రోలింగ్పై హరీశ్ శంకర్ ఫైర్
-
స్పీడ్ పెంచిన స్టార్ డైరెక్టర్స్
-
కారైకుడిలో మిస్టర్ బచ్చన్
కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్కు ఈ సినిమా స్క్రిప్ట్ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ముచ్చటగా మూడోసారి.. మాస్ మహారాజా మూవీ టైటిల్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మిరపకాయ్ వంటి మాస్ హిట్ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్తో పాటు పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని రవితేజ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హరీశ్- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఖరారు చేశారు. నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్లో రవితేజ కూర్చుని స్టైలిష్ లుక్లో కనిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఈ విషయాన్ని మాస్ మహారాజాతో క్లాస్ మహారాణి అంటూ చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. #MrBachchan Naam tho suna hoga 😉 Honoured to play the character with the name of my favourite @SrBachchan saab 🤗🙏@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo — Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023 -
పవన్ సినిమాను పక్కన పెట్టిన హరీష్ శంకర్.. రవితేజతో హ్యాట్రిక్ ఫిల్మ్!
‘మిరపకాయ్’ వంటి మాస్ హిట్ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్ హిట్ చిత్రాన్ని నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఒకే సినిమాకి కుదిరింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. హరీష్ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్తో ‘ఉస్తాద్ భగత్సింగ్’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్ మంచి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. The Magical Mass Combo is back ❤️🔥 Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥 This time, the #MassReunion gets spicier 🔥🔥 Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥 More details soon! pic.twitter.com/OYNmnRuPDx — People Media Factory (@peoplemediafcy) December 13, 2023 -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్దీప్కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
యూత్ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
రవితేజలో నెగిటివ్ క్వాలిటీస్ చెప్పినా శంకర్
-
రవితేజ గురించి హరీష్ శంకర్ గొప్ప మాటలు
-
చంద్రయాన్ 3 సక్సెస్.. హరీశ్ శంకర్ ట్వీట్పై ట్రోలింగ్
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 జెండా పాతడంతో యావత్ భారతదేశం సంతోషంలో మునిగి తేలుతోంది. ఎవరూ అందుకోలేని ఘనతను మన దేశం సాధించడంతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు కూడా! ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షేర్ చేసిన ప్రకాశ్రాజ్ను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న సంగతి తెలిసిందే! తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్లో షేర్ చేసిన ఫోటోపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రుడిపై జెండా.. జెండాపై చంద్రుడు(పాక్ జాతీయ పతాకం).. రెండూ ఒకటి కాదు అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు హరీశ్. ఇది చూసిన జనాలు మధ్యలో పాకిస్తాన్ను తేవడం అవసరమా? అసలు ఆ దేశంతో మనకు పోలికేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. 'మనకంటే దిగువన ఉన్న వాళ్లతో కాదు, మనకంటే గొప్పగా ఉన్నవాళ్లతో పోల్చుకోవాలి', 'ఈ విమర్శలు పక్కనపెట్టి చంద్రయాన్ 3 విజయంలో పాలుపంచుకున్నవాళ్లను ప్రశంసించండి' అని చురకలంటిస్తున్నారు. 'మనం అందుకున్న విజయాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప పక్కదేశాన్ని వెక్కిరించకూడదు.. ఒక సెలబ్రిటీవైన నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనం తోపులు అని చెప్పుకోవడానికి ఎదుటివాళ్లను ఎందుకు తక్కువచేయడం?..', 'అయినా అమెరికా, చైనా వంటి దేశాలతో మనం పోటీపడాలి, పోల్చుకోవాలే.. అంతే కానీ పాక్ లాంటి దేశాలతో కాదు.. అసలు నువ్వు డైరెక్టర్ ఎలా అయ్యావో.. ఏంటో?' అని విమర్శిస్తున్నారు. Haahhahaha mana janaala sense of humour 🙏🙏🙏🙏 pic.twitter.com/x0ZOlQWTgu — Harish Shankar .S (@harish2you) August 23, 2023 చదవండి: ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు..లిస్టులో 20 మందికి పైగా కంటెస్టెంట్లు! కమెడియన్స్ నుంచి హీరోల దాకా.. -
కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్’ రాజు
‘‘సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ సినిమా మా బ్యానర్కి జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు శతమానం భవతి ఆర్ట్స్ పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టడం సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితపొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ కీలక పా త్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. చింతా గోపా ల కృష్ణారెడ్డి సమర్పణలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ సినిమా లోగోను ‘దిల్’ రాజు విడుదల చేయగా, టీజర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పా తికేళ్లు అయ్యింది. ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్గా, డైరెక్టర్గా నిలబడ్డాను. ఈవీవీ సత్యనారాయణగారి మాటల స్ఫూర్తితోనే ఈ బ్యానర్ పెట్టాను. నేను స్టార్ట్ చేసిన ‘కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని ‘కథా కేళి’ తీశా’’ అన్నారు. -
భారత్లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్. ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. -
తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోనంటూ హరీశ్ స్ట్రాంగ్ వార్నింగ్
2018 సినిమా.. మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో 2018 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. తర్వాత ఓ విలేఖరి మాట్లాడుతూ.. 'మన తెలుగు దర్శకనిర్మాతలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' ప్రశ్నించాడు. దీనికి హరీశ్ శంకర్ స్పందిస్తూ.. 'ప్రెస్మీట్స్ జరిగిన ప్రతిసారి ఆయన(విలేఖరిని ఉద్దేశిస్తూ) సాహసోపేతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచి యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది(తెలుగు సినిమాను ఉద్దేశిస్తూ). అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్లను ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా! డబ్బింగ్, రీమేక్ అదంతా ఏమీ లేదు.. కేవలం సినిమా అంతే! ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని వాసు(నిర్మాత) అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ దర్శకుడు అని భాషాబేధాలు చూడట్లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్ చేశాడు. చులకన చేసే నోరు ఉన్నపుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది.. Can’t take insult to our industry. By all means please appreciate every film maker from every industry but for that sake don’t belittle our industry. Whole world is looking towards us. https://t.co/l5yZRZZgjZ — Harish Shankar .S (@harish2you) May 24, 2023 చదవండి: టాలీవుడ్కు మరో కొత్త హీరోయిన్ -
థియేటర్స్లో చూడాల్సిన సినిమా 2018
‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. -
బలగం చూసి ఆ ముగ్గురు కమర్షియల్ డైరెక్టర్లు ఏడ్చేశారు: హరీశ్
కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది బలగంతో మరోసారి నిరూపితమైంది. రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతూ హిట్ ట్రాక్ ఎక్కిందీ మూవీ. శుక్రవారం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి చూస్తున్నా. సినిమాను క్లాస్, మాస్, కమర్షియల్ అని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇండస్ట్రీలో మనం పెట్టుకున్న పేర్లు. కానీ జనాలు మంచి సినిమానా? కాదా? ఆ ఒక్కటే చూస్తారు. శంకరాభరణం, సాగరసంగమం సినిమాలకు బండ్లు కట్టుకుని వెళ్లారు. ఇసుకేస్తే రాలనంత జనం. ఆ సినిమాల్లో సుమోలు ఎగరలేదు, రక్తపాతాలు జరగలేదు. కానీ మాస్ ఆడియన్స్ కూడా చూశారు. అంతెందుకు, ఈ సినిమా చూసి కమర్షియల్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాధ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకడు మూడు వందల కోట్ల సినిమా తీసినా, ఒకడు మూడు కోట్ల సినిమా తీసినా అన్నీ మన సినిమాలే. బయట మనకెన్నో సమస్యలున్నాయి.. వాటిపై పోరాడటం మానేసి మనలో మనం పోట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాదు, దేనికదే యునిక్. కాసర్ల శ్యామ్ రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే హమ్మయ్య బయ్యర్ల దగ్గర డబ్బులున్నాయి. తర్వాత నా సినిమాను మంచి రేటుతో కొంటారని అనుకుంటాం. అందుకే మా ముందు సినిమాలు హిట్ అయితే సంతోషపడతాం. అంతే తప్ప చాలా మంది అనుకున్నట్లు పక్కోడి సినిమాలు పోతే చప్పట్లు కొట్టం. అది కామన్సెన్స్ లేనివాళ్లు చేసే పని' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. -
సినిమానే మనల్ని ఎంచుకుంటుంది
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. -
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ముఖ్య తారలుగా కెఎస్ హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఏ ఫోన్కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి అంతే..!’, ‘రిచిగాడి పెళ్లి’ జీవితంలో మర్చిపోకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో ‘రిచిగాడి పెళ్లి’ని రూపొందించాం’’ అన్నారు హేమరాజ్. -
హరీష్ శంకర్ చేతులు మీదుగా "రిచి గాడి పెళ్లి" ట్రైలర్ లాంచ్
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం "రిచి గాడి పెళ్లి". కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని అర్ధమవుతుంది అన్నారు. ఇక దర్శకుడు కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ..ట్రైలర్ మంచి స్పందన లభిస్తుందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్కుమార్. -
Siddharth Roy: హీరోగా మారిన ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్.. ‘ఫస్ట్లుక్’లోనే లిప్లాక్
‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ‘సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ , నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైన రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెఫ్ట్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సీరీస్లో దొంగలు రొటీన్గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజాహెగ్డే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ ఇటీవలి కాలంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజాను కాస్త దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజా హెగ్డే అవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలో లాంచింగ్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే ప్రచారమా? లేదంటే డేట్స్ సర్దుబాటు కాలేదా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా బయటకు వచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది. -
‘భవదీయుడు భగత్సింగ్’ పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి‘భవదీయుడు భగత్సింగ్’ అనే టైటిల్ని ఖరారు చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్పైకి పోలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ని వదిలింది. సినిమా టైటిల్ని మార్పు చేస్తూ..'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్తో పాటు ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అనే థీమ్లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥 This time, it's beyond entertainment 😎🔥 Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8 — Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022 -
‘లవ్ యూ రామ్’ టీజర్ను రిలీజ్ చేసిన హరీష్ శంకర్
‘రోహిత్ నటించిన ‘నాట్యం’ చూశాను. అతనిలో మంచి డ్యాన్సర్, యాక్టర్ వున్నారు. ‘లవ్ యూ రామ్’ అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా వున్నాయి. దర్శకుడిగా అద్భుత చిత్రాలు అందించిన దశరథ్ నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ జంటగా దర్శకుడు కె. దశరథ్ అందించిన కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. డీవై చౌదరి దర్శకత్వంలో డీవై చౌదరి, కె. దశరథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ టీజర్ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీజర్ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా చూశాను. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘మిస్టర్ పర్ఫెక్ట్’తో హరీష్ శంకర్, నా జర్నీ మొదలైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారాయన’’ అన్నారు కె. దశరథ్. ‘‘ఈ సినిమాలో దశరథ్గారు కూడా నటించారు’’ అన్నారు డీవై చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: కె. వేద. -
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు .. పవన్ కోసం హరీష్ ..!
-
నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
‘పుష్ప’ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్లో చేరాడు. టాలీవుడ్లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినీ ప్రియులంతా పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింట్ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో బన్ని న్యూలుక్లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు. (చదవండి: సల్మాన్తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం) కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్, చెవికి పోగు పెట్టి రఫ్లో లుక్లో కనిపించాడు బన్ని. అయితే ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్ని ఇలా కనిపించాడు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్ని..తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో యాడ్ చేశాడు. దాని కోసమే బన్ని ఇలా నయా లుక్లో కనిపించాడు. ఈ ఫోటోని బన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. కొన్ని క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయింది. బన్ని నయా లుక్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లైకులు, రీట్వీట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. 🖤 pic.twitter.com/wm1GuLLmsA — Allu Arjun (@alluarjun) July 29, 2022 -
మరోసారి జతకట్టిన హరీశ్ శంకర్-బన్నీ, థాయ్లాండ్లో షూటింగ్..
దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు భారీ వసూళ్లు రాబట్టింది. తాజా వీరిద్దరు మళ్లీ జత కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీతో తమ బ్రాండ్ను ఎండార్స్ చేసేందుకు పలు వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. Get ready to see never before Avatar of…… “ICONSTAAR “ @alluarjun #adshoots — Harish Shankar .S (@harish2you) July 28, 2022 దీంతో వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్లో నటించాలని కోరుతూ బన్నీని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో యాడ్లో నటించనున్నాడు. అయితే ఇప్పటికీ వరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హరీశ్ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్లో జరిగనుందని సమచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. Icon Staar @AlluArjun is teaming up with director @harish2you and DOP Sudeep Chatterjee for an ad shoot for @AstralPipes being shot in Hyderabad. #AlluArjun pic.twitter.com/H2CSh7BAxG — Suresh Kondi (@SureshKondi_) July 28, 2022 చదవండి: బిగ్బాస్లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్? నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
పవన్తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?
ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్స్టార్ పవన్ కల్యాణ్. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. (చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..) మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
పవన్-హరీశ్ శంకర్ మూవీ నుంచి తప్పుకున్న పూజా! అందుకేనా?
లక్కీ లెగ్ హీరోయిన్గా టాలీవుడ్లో గుర్తింపు పొందిన బ్యూటీ పూజా హెగ్డే. ఆమె సినిమాకు ఒకే చేసిందంటే అది హిట్ అనేంతగా దర్శకులకు, హీరోలకు సెంటిమెంట్గా మారింది ఆమె. ఇలా బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్, నాగార్జున లుక్ రిలీజ్ ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్ అని ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్లో నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్లో కిన్నెర మొగిలయ్యకు ఇంటిస్థలం, రూ కోటి నగదు.. ఉత్తర్వులు జారీ దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్ మూవీ యనిమల్లో స్పెషల్ సాంగ్స్కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్న పూజా తాను ఈ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్తో అలరించిన సంగతి తెలిసిందే. -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్టాపిక్గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
హరీష్ శంకర్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను స్పీడ్గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్తో చిట్చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్చాట్లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దొంగతనం మొదలుపెట్టిన బిగ్బాస్-5 విజేత సన్నీ
ప్రముఖ నిర్మాత దిల్రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’. బిగ్బాస్ ఫేం వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్కు హరీష్ శంకర్ కథ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కొత్త వెబ్సిరీస్పై సన్నీ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం వెబ్సిరీస్ గ్రాండ్గా లాంచ్ అయ్యింది. దొంగతనం షురూ' అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా వీజే సన్నీకి అలీ, సోహైల్ సహా పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) -
ఆశిష్కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్వార్, వరస ట్వీట్స్తో మాటల యుద్ధం..
టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వార్కు దిగారు. ఒకరిపై ఒకరూ వరసగా సటైరికల్గా పంచ్లు వేసుకుంటూ మాటల యుద్దానికి దిగారు. ఇదంతా చూస్తుంటే వారి మధ్య ఎదో కోల్డో వారి జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్, రచయిత బీవీఎస్ రవి. బీవీఎస్ రవి చేసిన ట్వీట్కు హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై ఈ గొడవ దారి తీసింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ మొదట బీవీఎస్ రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్కు దర్శకుడు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్ను ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడంతో.. ఇది చూసిన నెటిజన్లు ‘చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏం జరిగింది. ఏదో జరగబోతుందని గట్టిగా కొడుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ — Harish Shankar .S (@harish2you) February 3, 2022 Giving statements on other’s statements at times reverberate as a statement from a critical condition in the struggle to exist. All the best. Continue to sail on social media democracy. https://t.co/6q37rJadCo — BVS Ravi (@BvsRavi) February 4, 2022 అనుభవించడంలో ఒక భాగం పరిపాలన,ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే. ( for those who under read my below tweet. This is said by Chankaya to Chandra gupta in the విశాఖదత్తుడు విరచిత "ముద్రారాక్షసమ్") https://t.co/LKKrnKgePx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C — Harish Shankar .S (@harish2you) February 4, 2022 -
Dil Raju: నా జీవితంలో అది చూడాలని ఉంది
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్వీసీ) బ్యానర్ని 2003లో స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాను. ఎస్వీసీపై 50వ సినిమా చేస్తున్నాం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ లోగో డిజైన్ చేశారు.. దేవుడి ఆశీర్వాదాలతో నా జీవితంలో ఎస్వీసీ లోగోను కూడా అలా చూడాలని ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్లో ఎస్. హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా చంద్రమోహన్ డైరెక్షన్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజు ప్రొడక్షన్లో ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తాయి. ‘హిట్, జెర్సీ’ సినిమాలతో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో హర్షిత్, హన్షితలకు ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బాధ్యతలను నేను, శిరీష్ అప్పగించాం’’ అన్నారు. ‘‘ఏటీఎమ్’ స్క్రిప్ట్, స్క్రీన్ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది’’ అన్నారు ‘జీ 5’ వైస్ ప్రెసిడెంట్ పద్మ. ‘‘ఏటీఎమ్’ తొలి సీజన్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ చంద్రమోహన్. ‘‘ఎస్వీసీని సినిమా రంగంలో ఆదరించినట్టే ‘దిల్’ రాజు ప్రొడక్షన్ని డిజిటల్ మాధ్యమంలోనూ ఆదరించాలి’’ అన్నారు హన్షిత రెడ్డి. ‘‘మా మేనేజర్ కల్యాణ్గారి వల్లే ‘ఏటీఎమ్’ కథను రాశాను’’ అన్నారు ఎస్. హరీష్ శంకర్. -
వెబ్ కంటెంట్పై దృష్టిపెట్టిన దిల్రాజు
Dil Raju And Harish Shankar Join Hands For Web Series: ప్రముఖ నిర్మాత దిల్రాజు ఇప్పుడు వెబ్ కంటెంట్పై దృష్టి పెట్టారు. 'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సిరీస్ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందిస్తుండగా చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్ను నిర్మించనున్నట్లు స్వయంగా దిల్రాజు ప్రకటించారు. ఇక హరీష్ శంకర్- దిల్రాజు కాంబినేషన్ కావడంతో ఈ వెబ్సీరిస్పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. -
ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను షేర్ చేసిన ఓ వీడియోపై సదరు నెటిజన్ స్పందించిన తీరుకు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కాగా ‘ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దు. కేసులు పెరుగుతున్నాయి. కానీ మరణాలు మత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసంర లేదు’ అంటూ ఓ వైద్యుడు చెప్పుకొచ్చిన వీడియోను హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. చదవండి: హీరోయిన్కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ.. ఒమిక్రాన్ వెరియంట్ పట్ల ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సదరు వైద్యుడు వీడియో పంచుకున్న హరీశ్ శంకర్పై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరికొందరూ నెటిజన్లు ‘హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వెరియంట్పై ప్రజల్లో ఆందోళన, భయం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లో భయం పోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికొ హరీశ్ శంకర్ తనదైన శైలితె ఘాటుగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ ‘ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా హరీశ్ శంకర్ సోషల్ మీడియాల్లో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెటిజన్లతో పంచుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. దేశలోని రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు. అంతే కాదు వింతలు విశేషాలను పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలను తరచూ తన పేజ్ ద్వారా నెటిజన్లకు, తన ఫాలోవర్స్కు అందిస్తుంటాడు. Am glad that stupids like u disappointed because guys like u never wanna give a hope to people even when an expert says something good and also he insists on precautions repeatedly !! https://t.co/tD5v3m80C5 — Harish Shankar .S (@harish2you) January 8, 2022 -
‘డేగల బాజ్జీ’గా బండ్ల గణేశ్, టైటిల్ ఖారారు
బండ్ల గణేశ్ హీరోగా ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ మూవీకి ‘డేగల బాజ్జీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కను బొమ్మపై గాయం, ఒక్క కన్నుతో సీరియస్గా చూస్తున్న బండ్ల గణేశ్ ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోంది. ఈ ఫస్టులుక్ విడుదల చేసిన హరీశ్ శంకర్, బండ్ల గణేశ్తో పాటు, మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. Thank you so much my dear blockbuster @harish2you 🤝 https://t.co/xg4RkctMgN — BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021 -
PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్
Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh First Look: పవర్స్టార్ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్లుక్తో పాటు టైటిల్ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి నుంచే అప్డేట్ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ను ఖారారు చేశారు. 'ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అంటూ క్యాప్షన్ను జోడించారు. పోస్ట్ర్ లుక్లో పవన్ బైక్పై కూర్చొని ఓ చేతిలో మైక్, మరో చేతిలో టీ గ్లాస్తో కనిపించారు. పవన్-హరీశ్ శంకర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. We all need your … Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9 — Harish Shankar .S (@harish2you) September 9, 2021 చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ హిందీ సూరరై పోట్రుకు లైన్క్లియర్ -
రేపు పవన్- హరీశ్శంకర్ మూవీ నుంచి అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్ సినిమా తీయాలని డైరెక్ట్ర్ హరీశ్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్ విడుదల చేశాడు డైరెక్టర్. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు ఈ మూవీ నుంచి క్రేజ్ అప్డేట్ రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. గురువారం(సెప్టెంబర్ 9) 9:45 గంటలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఎంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమాలో పవన్కు సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్పై రానున్నట్లు తెలుస్తోంది. Get ready for Next Level Celebrations 💥💥 A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM 😎😎@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/1uTGZpRNUd — Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2021 -
PSPK 28: జాతర షురూ అంటున్న హరీష్ శంకర్, పోస్టర్ రిలీజ్
PSPK28: నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్డే(సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఉదయం నుంచి అభిమానుల మీద అప్డేట్ల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోను పూర్తిగా చూపించకుండా సగం మాత్రమే చూపించారు. Many More Happy Returns to The One and Only..... @PawanKalyan 🤗🤗🤗🤗🤗#JAATHARA SHURU #Team #PawanKalyan28 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro pic.twitter.com/fVpG8WlJOz — Harish Shankar .S (@harish2you) September 2, 2021 'జాతర షురూ' అంటూ వదిలిన ఈ పోస్టర్లో పవన్ ఓ బైక్ మీద స్టైలిష్గా కూర్చున్నట్లు కనిపిస్తోంది. వెనకాల ఇండియా గేట్ ఉండటాన్ని చూస్తుంటే కథ ఢిల్లీ నేపథ్యానికి సంబంధించినదై ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది పవన్ కెరీర్లో 28వ సినిమా. ఇదిలా వుంటే ఈరోజు పవన్ బర్త్డే సందర్భంగా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజైంది. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. -
పవన్ కళ్యాణ్తో క్రేజీ ప్రాజెక్ట్ కొట్టేసిన పూజ హెగ్డే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే దిల్ రాజు నిర్మాతగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో తన అభిమానులను పలకరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా టైటిల్ను ‘భీమ్లా నాయక్’గా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్.. పవన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే చేస్తోన్న మొట్టమొదటి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. ఇక తాజా వార్త ఏంటంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించనుంది. ప్రియమణి మరో కథానాయికగా నటించనుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’తో పాటు ‘సంచారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్పై అధికారిక ప్రకటన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వెలుబడే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇక గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. -
ఆ పత్రికపై రకుల్ అసహనం, స్టార్ డైరెక్టర్ మద్దతు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటూ తెలుగు, తమిళంతో పాటు అటూ బాలీవుడ్లోను రకుల్ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్కు సంతకం చేసిన రకుల్ చేతిలో ఇప్పుడు దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ముగిసిందని, ప్రస్తుతం ఆమెకు అక్కడ సినిమాలు రావడంలేదని రకుల్ స్వయంగా చెప్పినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు చాలా ఆశ్చర్యం ఉంది. మీరు పెట్టిన హెడ్డింగ్ ప్రకారం టాలీవుడ్లో నాకు అవకాశాలు రావడం లేదని నేనేప్పుడు చెప్పాను?. అసలు ఏడాదికి సాధారణంగా ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తున్నాను. అంటే ఒక్క ఎడాదికి ఇవి సరిపోవా? అలా అయితే కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మా టీమ్కి సాయం చేయండి’ అంటూ రకుల్ ఆ పత్రికపై అసహనం వ్యక్తం చేసింది. అది చూసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ రకుల్ ట్వీట్పై స్పందించాడు. ‘షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసు రకుల్.. ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్స్ కోసం నీ డేట్స్ సర్దుపాటు చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నించావో తెలుసు. అది కుదరకపోవడంతో చివరకు ఆ ప్రాజెక్ట్ను వాయిదా పడింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో ఇలాంటి వాటికి సమాధాం చెప్పు’ అంటూ రకుల్కు శంకర్ మద్దుతునిచ్చాడు. .. And I know one of my Friends struggled a lot to plan ur dates when u liked their script and the project got postponed because of ur busy schedule. Keep Rocking @Rakulpreet and Let your work speak !!! https://t.co/GHsVsAO36R — Harish Shankar .S (@harish2you) June 20, 2021 చదవండి: బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు అబ్బాయిని నా దగ్గరకు పంపితే రకుల్ సీక్రెట్స్ అన్నీ చెప్తా :లక్ష్మీ -
‘షాక్’ ఇచ్చిన దర్శకుడితో రవితేజ సినిమా!
హీరో రవితేజ– దర్శకుడు హరీష్ శంకర్ మూడోసారి కలసి పని చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. రవితేజ హీరోగా నటించిన ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు హరీష్. ఆ తర్వాత తన రెండో చిత్రం ‘మిరపకాయ్’ని కూడా రవితేజతోనే చేశారాయన. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. రవితేజ – హరీష్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం రవితేజ తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై ఓ సినిమా చేయనున్నారు. పవన్ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టాక రవితేజ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారట హరీష్ శంకర్. ‘ఖిలాడి’కి బ్రేక్ ఇదిలావుండగా, రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రదర్శకుడు రమేశ్ వర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో స్వీయ నిర్భంధంలో ఉన్నాను. దయచేసి అందరూ మాస్క్ ధరించండి. అనవసరంగా బయట తిరగకండి.. ఇంట్లోనే క్షేమంగా ఉండండి’ అని పేర్కొన్నారు రమేశ్ వర్మ. దీంతో ‘ఖిలాడి’ షూటింగ్కి చిన్న బ్రేక్ పడ్డట్లే. చదవండి: కొత్త డైరెక్టర్తో రవితేజ -
అయాన్ బర్త్డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్ నేడు 6వ పుట్టిన రోజును జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అయాన్కు సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తండ్రి అల్లు అర్జున్ తనయుడికి ట్విటర్ వేదికగా స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపాడు. Many many happy returns of the day to my sweetest baby babu Ayaan . Your the love of my life. Wish u many more beautiful years to come . Love Nana #alluayaan #allufamily pic.twitter.com/fwvLSFH3Cn — Allu Arjun (@alluarjun) April 3, 2021 బన్నీ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మేనీ మేనీ హ్యీపీ రీటర్స్ ఆఫ్ ది డే మై స్వీట్ బేబీ బాబు ఆయాన్. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ నాన్న’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. అలాగే బాబాయ్ అల్లు శిరీష్ కూడా అయాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక డైరెక్టర్ హరీష్ శంకర్ అయాన్తో దిగిన ఫొటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళ అడవుల్లో షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ను జరుపుకుంటోంది. Happy Birthday Ayaan... wishing u a playful and joyful year ahead !! 🤗🤗🤗 thanks to stylish star for this cute moment @alluarjun pic.twitter.com/zkcIZPq2Ok — Harish Shankar .S (@harish2you) April 3, 2021 చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్డేట్ భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ -
మిస్సింగ్ కథతో...
పృథ్వీ, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటి కృష్ణమూర్తి’. శ్రీవర్థన్ దర్శకత్వంలో ప్రసాద్ నేకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్తో, మిస్సింగ్ కథతో థ్రిల్లర్గా మా చిత్రం తెరకెక్కింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఐఐటి కృష్ణమూర్తి’ ట్రైలర్ను విడుదల చేసి, ప్రేక్షకులను అలరిస్తుందని అభినందనలు తెలిపారు’’ అన్నారు. మైరా దోషి మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ నాకెంతో స్పెషల్ ఫిల్మ్. ఇందులో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు. శ్రీవర్థన్ మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి నాతో ఈ ప్రాజెక్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే జానర్తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం తెరకెక్కించటం జరిగింది’’ అన్నారు. ‘‘సినిమా కాన్సెప్ట్ బావుంది. దర్శకుని కథ, కథనాల ఎంపిక నచ్చింది. టీమ్కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
ఏడు పాత్రల మథనం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష¯Œ ్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం..’ గీతాన్ని దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగలూరి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష శానమోని, సహదర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
నేషనల్ మీడియాపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు
దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ( ‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’ ) ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK — Harish Shankar .S (@harish2you) September 26, 2020 -
‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’
టాలీవుడ్లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని చీకట్లోకి నెట్టేస్టున్నాయి. సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బాలుని కొలిచే అనేక హృదయాలు షాక్కు గురయ్యాయి. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఇన్ని రోజులుగా ఎదురు చూసిన వారికి బాలు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. (బ్రేకింగ్ : ఎస్పీ బాలు కన్నుమూత) తన గాత్రంతో లక్షల పాటలను పలికిన ఆ స్వరం నేడు మూగబోవడంతో ఎస్పీబీకి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తన స్వరంతో కోట్లాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప గాయకుడికి ట్విటర్ వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. గాన గంధర్వుడు ఇక లేరని చిత్ర నిర్మాత బీఏ రాజు తెలిపారు. ‘లెజండరీ గాయకుడు ఎస్పీబీ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినీ ఇంస్ట్రీకి తీరనిలోటు.. బాలు కుటుంబానికి నా సంతాపం’ అని ట్వీట్ చేశారు. ఓ శకం ముగిసింది ‘సంగీత ప్రపంచానికి చీకటి రోజు. బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. ఆయన అందించిన పాటల కారణంగా నా ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. ఎన్నో మరుపురాని పాటలను అందించారు. ఆయన స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాలు స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020 గాన గంధర్వుడు ఇక లేరు Legendary Singer SP Balasubrahmanyam breathed his last at 1:04 PM. Great loss to the Music World. Condolences to #SPB gari family and friends #RIPSPB pic.twitter.com/8S5hcsh6Uz — BARaju (@baraju_SuperHit) September 25, 2020 As the memories and conversations with Balu Garu come flooding back so do the tears... I still remember the call I got from him after my film Annamayya🙏He was such a unsaid integrable part of my life… దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! #ripspb 🙏 pic.twitter.com/pK8jYS5ONs — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 25, 2020 ‘ఆగిపోయింది మీ గుండె మాత్రమే. మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు. ఉంటారు.’ - హరీష్ శంకర్ ‘నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.. మిమ్మల్ని మి్ అవుతున్నాం మామా’.. - తమన్ ‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.’ - జూ. ఎన్టీఆర్ నమ్మలేకపోతున్నాను బాల సుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకురాలి. మీ పాటలు చిరస్మరణీయం, బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -మహేష్ బాబు వైజాగ్: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు. నాకు మంచి సన్నిహితుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - కేంద్ర మాజీ మంత్రి టి. సుబ్బరామిరెడ్డి Unable to process the fact that #SPBalasubramaniam garu is no more. Nothing will ever come close to that soulful voice of his. Rest in peace sir. Your legacy will live on. Heartfelt condolences and strength to the family 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2020 அன்னைய்யா S.P.B அவர்களின் குரலின் நிழல் பதிப்பாக பல காலம் வாழ்ந்தது எனக்கு வாய்த்த பேறு. ஏழு தலைமுறைக்கும் அவர் புகழ் வாழும். pic.twitter.com/9P4FGJSL4T — Kamal Haasan (@ikamalhaasan) September 25, 2020 #ripspb ...Devastated pic.twitter.com/EO55pd648u — A.R.Rahman (@arrahman) September 25, 2020 A voice which made us laugh,which made us cry, you’ll live with us forever, my deepest condolences to the family 🙏🏼 you’ll be missed SPB sir pic.twitter.com/iZf9TUy3FQ — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 25, 2020 Shri. S. P. Balasubrahmanyam Garu is an integral part of every Indian household. His voice and his contribution to music will always remain eternal. To the legend who gave us songs for every human emotion 🙏 Rest in peace sir. You will forever be missed. pic.twitter.com/CmUNe2JoRF — Ravi Teja (@RaviTeja_offl) September 25, 2020 Rest in peace SPB sir 💔 pic.twitter.com/kEwPxr1dSx — Anupama Parameswaran (@anupamahere) September 25, 2020 🙏🙏🙏😭😭 pic.twitter.com/qSI0zntwrN — Anil Ravipudi (@AnilRavipudi) September 25, 2020 Deeply saddened & heart broken to hear that the legendary singer #SPBalasubrahmanyam garu is no more. Great loss to Indian cinema. May his soul rest in peace 🙏 My deepest condolences to his family! Sir you will always be in our hearts and souls 🙏#ripspb pic.twitter.com/EbpL0yjvki — MM*🙏🏻❤️ (@HeroManoj1) September 25, 2020 He was not just a singer. He was a performer. It felt as if he was born to entertain the world with his expressions and his music. A great loss for our industry. Gone to soon. May his soul RIP . #balasubramanyam ji — Hansika (@ihansika) September 25, 2020 Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir! My heartfelt condolences to the family. RIP🙏 #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1 — Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020 -
వేదాంతం రాఘవయ్య
హీరోగా పలు సినిమాలు చేశారు సునీల్. ఇటీవలే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించారు. మరోసారి హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘వేదాంతం రాఘవయ్య’ అనే చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రాన్ని ఈ బ్యానరే నిర్మించింది. ఆ అనుబంధంతో ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
స్వప్నాలికి హరీష్ శంకర్ ప్రశంసలు..
పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన సోదరులు తన విద్యను కొనసాగించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాలు.. సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్ అనే యువతి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్వప్నాలి ప్రస్తుతం ఎంబీబీఎస్కు సన్నద్దమవుతోంది. అయితే ఆమె నివసించే ప్రాంతం మారుమూల గ్రామం అయినందున ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో తనకు ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతుంది. ఇది చూసి చలించి పోయిన యువతి సోదరులు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పైన ఒక షెడ్ నిర్మించారు. (డిజిటల్ అంతరాలు అధిగమించాలి) స్వప్నాలి తన కుటుంబం అండతో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొండమీద ఉన్న షెడ్ వద్దకు వెళ్లి చదువుకుంటోంది. అలాగే ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతోంది. ఇక దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎమ్మెల్యే నితేష్ రాణే.. ఆమె హాస్టల్ ఫీజు రూ .50 వేలు చెల్లించాడు. దీనిపై స్పందించిన పలువురు ‘తన కలల వైపు ప్రయాణించేందుకు అడ్డంకులు ఆపలేవని స్వప్నాలి పట్టుదలతో నిరూపించింది. ఆమెను చూస్తుంటే..మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది’ అంటూ యువతిని ప్రశంసిస్తున్నారు. (ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది) 12 తరగతిలో 98% స్కోర్ చేసి సునీత ఇప్పుడు ఎంబిబిఎస్ కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె గ్రామానికి ఆన్లైన్ తరగతులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఫోన్ లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్ రాదు, కాబట్టి ఆమె సోదరులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు 1/2 pic.twitter.com/4CtPQcUvJb — Naga Kishore (@nagakishore981) August 23, 2020 -
ఎట్టకేలకు మెత్తబడ్డ బండ్ల గణేష్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అవకాశమిచ్చినా తనను గుర్తుకు పెట్టుకోలేదని కొద్ది రోజుల కిత్రం దర్శకుడు హరీష్ శంకర్పై విమర్శలకు దిగిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ చిన్న జీవితంలో పోట్లాటలు, శత్రుత్వాలు అవసరం లేదని ట్విటర్లో పేర్కొన్నారు. హరీష్ తనకు కాల్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘గబ్బర్సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: గణేష్-హరీష్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు) అయితే, అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని ఈ విషయంపై బండ్ల గణేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి’అని బండ్ల గణేష్ గతంలో ఏకి పారేశాడు. (పొరపాటు జరిగింది.. క్షమించడంటూ బండ్ల ట్వీట్) @harish2you thank you so much brother for your concern. Felt really happy after your call , this is a small life no fights no enemies.🙏 — BANDLA GANESH. (@ganeshbandla) July 26, 2020 -
జగన్నాథమ్ వచ్చి మూడేళ్లయింది
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్)’. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బన్ని అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ చిత్ర బృందం కొన్ని స్టిల్స్ను విడుదల చేసింది. బన్ని పోలీస్ గెటప్లో, హూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. స్టిల్స్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (కరోనా ఎఫెక్ట్.. ‘పుష్ప’ అప్డేట్!) ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని కారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్లు సూపరో సూపరస్య సూపర్భ్యః. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. (పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్) పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో.. రావు రమేశ్ విలనిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్ఫామ్లో ‘డీజే’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్లో హిందీ డబ్బింగ్ వర్షన్లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ సినిమాతో పాటు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. I’m indebted to you for all ur support and dedication.. Sir.. @alluarjun 🙏🙏especially for making my 2nd 20cr+ movie in Nizam, #DJ is always a special film which gave me special friends Like @hegdepooja , @DoP_Bose Million thanks to @ThisIsDSP & @SVC_official https://t.co/Scad3w9xdi — Harish Shankar .S (@harish2you) June 23, 2020 -
హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్కు డౌట్
‘గద్దలకొండ గణేష్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరీశ్ కాంబినేషన్లో వస్తున్న పవన్ 28వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ను సిద్దం చేసిన దర్శకబృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ అనంతరం నిర్వీరామంగా షూటింగ్ జరిపేందుకు పూర్తి సన్నద్దమవుతోంది చిత్ర బృందం. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాక ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు హరీశ్ శంకర్. ఈ విషయాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. హరీశ్తో ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్. దీన్ని ఉద్దేశిస్తూ ‘గద్దల కొండ గణేష్ తర్వాత మరోసారి పవర్ఫుల్ దర్శకుడు హరీశ్తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్తో పవన్ అబిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి. పవన్-హరీశ్ సినిమా వాయిదా పడిందా అనే అనుమానంతో ఓ అబిమాని హరీశ్కు ట్వీట్ చేశాడు. ‘హరీశ్ అన్నా నువ్వు ఎన్ని సినిమాలైనా చేయ్. కానీ తర్వాతి చిత్రం పవన్తోనే ఉండాలి. అది కూడా చరిత్ర సృష్టించాలి’ అని పవర్స్టార్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దీనికి ప్రతి స్పందనగా ‘ తమ్ముడు.. పవర్స్టార్ మూవీ స్క్రిప్ట్, మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను చేసే ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ చిత్రం తరువాతే ఉంటుంది. నేను కూడా మీలాగే పవన్కు వీరాభిమాని అని మర్చిపోకు’ అంటూ హరీశ్ ట్వీట్ చేశారు. ఇక హరీశ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్తో పాటు పవర్స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకుంది. We are proud and happy to be working with Powerful Director @harish2you garu again after #GaddalakondaGanesh! More details to be announced once the Industry is back to business post lockdown! — 14 Reels Plus (@14ReelsPlus) May 18, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు 42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్ Thammudu..... Power Star movie script work and music work under progress!! What ever may be the new commitment would be only after #PSPK28 👍👍 Nenu kooda mee lanti Fan ani marchipoku!! https://t.co/9PdjDRsKIQ — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు..
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ ట్యాలెంట్ను అభినందించిన పీవీపీ ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. పీవీపీ ట్వీట్పై స్పందించిన హరీష్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల హరీష్ నైపుణ్యాన్ని తక్కువ చేసేలా నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీ తన ట్వీట్ ద్వారా హరీష్ ట్యాలెంట్ను గుర్తుచేయడంతోపాటు బండ్ల గణేష్కు గట్టి కౌంటర్ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. (చదవండి : వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్) కాగా, మే 11తో గబ్బర్సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పోరపాటును గుర్తించిన హరీష్ మరో ట్వీట్లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. అయితే అప్పటికే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా హరీష్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. హరీష్కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్ చేశాడు. మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.🙏🙏🙏🙏 Thank you for acknowledging my work Sir https://t.co/md0YjnZjqi — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
హరీష్పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ దర్శకనిర్మాతుల హరీష్ శంకర్, బండ్ల గణేష్ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘గబ్బర్సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఆ లెటర్లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. అయితే నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని.. దీనిపై బండ్ల గణేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి. అంతాక్ష్యరి ఎపిసోడ్ పవన్ సలహానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవర్స్టార్దే. అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడంలో డైరెక్టర్గా హరీష్ విజయం సాధించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఎవరి పాత్ర ఏంటిదో అందరికీ తెలుసని తన సన్నిహితుల దగ్గర హరీష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో వేచిచూడాలి. Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ -
పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’?
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నారు.పీరియాడిక జానర్లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ నటించనున్నారు. గబ్బర్సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ను డైరెక్టర్ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్లలో కూడా ఆ టైటిల్ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘జాన్వీ కపూర్’ వెనక ఇంత కథ ఉందా? శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 -
దేవిశ్రీ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్కు పండగే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజికల్గా ఎంత హిట్ సాదించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత అభిమానులతో పాటు టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ విడుదలై నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా ఆనాటి మధురస్మ్రుతులను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తకిరమైన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన తరువాతి సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకున్నాడు. గద్దలకొండ గణేష్తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్ శంకర్.. పవర్స్టార్తో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిచనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ స్వయంగా ప్రకటించాడు. తను దర్శకత్వం వహించబోతున్న పవన్ 28వ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ అందించనున్నాడని ఈ క్రేజీ డైరెక్టర్ ప్రకటించాడు. దీంతో హరీష్-పవన్-దేవిశ్రీ కాంబినేషన్లో రాబోయే చిత్రం గబ్బర్ సింగ్కు మించి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత క్రిష్ డైరెక్షన్లో విరూపాక్ష (ప్రచారంలో ఉన్న టైటిల్) చేయనున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ ప్రస్తుతం పవన్ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ను సిద్దం చేస్తున్నాడు. It is a wonderful day. As enrgetic as the release day 8 years ago. What better day to announce that we are coming back together to recreate the same musical energy again. @ThisisDSP will be scoring music for #PSPK28. We are coming again Ippude modalaindi.... pic.twitter.com/hXTA0cPDXW — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: దిల్ వాకిట్లో తేజస్విని కాబోయే తల్లికి శుభాకాంక్షలు! -
అమ్మకి అమ్లెట్ వేసిన డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయడం ద్వారా ఈ చాలెంజ్ను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ నుంచి ఈ చాలెంజ్ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇంటిని శుభ్రం చేయడంతో పాటుగా తన తల్లికి అమ్లెట్ వేసి పెట్టాడు. అంతేకాకుండా ప్లేట్ కూడా శుభ్రం చేశాడు. చివరిగా తన తండ్రి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్ మ్యాన్గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ చాలెంజ్ను ముందకు తీసుకెళ్లాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, యష్, కార్తి, దర్శకుడు హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను డీఎస్పీ కోరారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సందీప్రెడ్డి వంగల మాదిరి వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వీడియోలో తొలుత బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ చేసిన సినీ ప్రముఖల క్లిప్స్ చూపించారు. చదవండి : జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. -
పవన్తో మరో సినిమా.. మళ్లీ టాప్లోకి?
అందం, అభినయంతో దశాబ్దానికిపైగా కుర్రకారు మనసుదోచుకుని వారి డ్రీమ్ గాళ్ అనిపించుకుంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్రహీరోలతో సినిమాలు, వరుస బ్లాక్బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. సీన్కట్చేస్తే కుర్ర హీరోయిన్లు రావడం, సినిమా అవకాశాలు తగ్గడంతో రేసులో కొద్దిగా వెనకబడింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాజల్కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’రూపంలో అనుకోని అవకాశం దక్కించుకున్న కాజల్.. మరో బంపర్ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు పవర్స్టార్ పవన్ కల్యాణ్. వెణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరకుంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు పవన్. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్, గబ్బర్సింగ్తో భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్ల సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర లేటేస్ట్ అప్డేట్ అభిమానుల్ని అలరిస్తోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ను చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనధికారిక సమాచారం. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ప్రధాన కథానాయికగా కాజల్ను ఎంపిక చేశారని, మరో హీరోయిన్ ఎవరనేదానిపై దర్శకుడు ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఇక ఆచార్య, పవన్ సినిమాతో కాజల్ మళ్లీ టాప్ రేసులోకి రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్? నా మనసులో కొందరు ఉన్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’
సినిమా షూటింగ్లతో నిరంతరం బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెలిసిందే. షూటింగ్ ప్రదేశాలకు కూడా తారక్ అప్పుడప్పుడు పిల్లలను తీసుకొస్తుంటాడు. తాజాగా తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లతో కలిసి ముఖానికి రంగులు చల్లుకున్న ఫోటోతో ట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండంతో ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే ఎన్టీఆర్కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఎన్టీఆర్ చిన్న కొడుకును ఉద్ధేశించి ‘చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు’. అంటూ రీట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ) ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్కు ఇది 30వ సినిమా కావడం విశేషం. (యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) The way younger one is looking at camera says something …… odilithe ippude dookeselaa unnadu…………… 👌👌👌 https://t.co/k6TDsPbd5X — Harish Shankar .S (@harish2you) March 10, 2020 Little Tigerrrrrrr❤️❤️❤️❤️❤️ on the wayyy!!!!! — Harish Shankar .S (@harish2you) March 10, 2020 -
నా మూడేళ్ల కల ఇది
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా. -
అర్ధరాత్రి శబ్ధాలు భరించలేకున్నా: హరీష్ శంకర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దానివలన భారీ శబ్దాలు వస్తుండటంతో ఇబ్బందిగా ఉందంటూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. 'జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్ జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రి పెద్ద శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతిచ్చారా..? న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన పోలీసులు ఆయనకు ఫోన్ చేసి అడ్రస్ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్ సిబ్బందిని పంపారు. భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. పోలీసుల స్పందన పట్ల హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మరో ట్వీట్ చేశారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్క్లేవ్ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నారు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నారు. I am indebted to @cyberabadpolice @GHMCOnline @hydcitypolice for their immediate action against my request..... Thank you so much this how you restore our trust and make us to be more responsible cirizen... 🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) February 16, 2020 Cant believe this with in minutes the noise has been stopped...... big thanks from entire jubli enclave residents .... meeru taluchukunte emainaa cheyagalaru eppudainaa raagalaru ani niroopinchaaru 🙏🙏🙏 https://t.co/1OF8UrqL9E — Harish Shankar .S (@harish2you) February 16, 2020 -
మెగా ఆఫర్
చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం హరీష్ శంకర్కి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. త్వరలోనే చిరంజీవి – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు హరీష్. ఆ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్తో సినిమా పూర్తయ్యాక చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కిస్తారట హరీష్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత ‘లూసీఫర్’‡రీమేక్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారాయన. మరి.. చిరంజీవి–హరీష్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు? అంటే ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నే. -
జోడీ కుదిరిందా?
‘గబ్బర్సింగ్’లో తొలిసారి పవన్కల్యాణ్తో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో మళ్లీ జంటగా నటించారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడానికి రెడీ అవుతున్నారట పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ని మరోసారి డైరెక్ట్ చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతీహాసన్ని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రబృందం. -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
తర్వాత ఏం జరుగుతుంది?
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. ఆయన నటించిన తమిళ చిత్రం ‘బూమరాంగ్’ను అదే టైటిల్తో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఇందుజా రవిచంద్రన్ కథానాయికలు. రేపు(3న) విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అధర్వ నాకు ఇష్టమైన హీరో. చాలా ప్యాషనేట్ హీరో.. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్ప్లే రాశారు’’ అన్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. -
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్కౌంటర్ చేశారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపాడు. సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ కామెంట్ చేశాడు. ‘సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు పట్టించుకోకపోయినా పర్లేదు. కానీ దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ వార్తను విస్తృతంగా ప్రచారం చేయండి. అందరికీ తెలిసేలా చాటింపు వేయండి’ అని అభిమానులను కోరాడు. కాగా నవంబర్ 28న వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగింది. దీనికి కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలంటూ దేశంలో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని కేసు రీకన్స్టక్షన్ చేస్తుండగా పోలీసుల ఆయుధాలు తీసుకొని పారిపోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. Maa trailers teasers like cheyalapoyinaa parledhu pls ee encounter news Maatram trending cheyandi...... ILA JARIGINDHI ani chaatimpu veyandi pls...... 🙏🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) December 6, 2019 (చదవండి: దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్) -
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’
ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ తొలి షో నుంచే హిట్టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘సైరా’పై సెలెబ్రిటీలు ఏమన్నారంటే ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవితానికి చిరంజీవి గారు జీవం పోశారు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాకు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు’ - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. చిత్ర యూనిట్కు హ్యాట్సాఫ్'- డైరెక్టర్ హరీష్ శంకర్ ‘విజువల్ పరంగా సినిమా రిచ్గా, అద్భుతంగా ఉంది. చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించారు. 'సైరా' తప్పక చూడాల్సిన సినిమా. నిర్మాతగా రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్కు శుభాకాంక్షలు. కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించి కెమెరామన్ రత్నవేలు రియల్లీ గ్రేట్. ఈ మధ్యకాలంలో నేను చూసిని సినిమాల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇదే’ -హీరో మహేశ్ బాబు ‘నర్సింహారెడ్డిగా తెర మీద మెగాస్టార్ గర్జించారు. ప్రాజెక్టును బలంగా నమ్మి.. అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన రామ్చరణ్కు హ్యాట్సాఫ్. సురేందర్ రెడ్డి టేకింగ్ అద్భుతం. రత్నవేలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్. తమన్నా అద్భుతంగా నటించింది’ - అనిల్ రావిపుడి ‘పదునాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్కు, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్ చరణ్కి వందనం ! అభివందనం! నిద్రలేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేందర్రెడ్డికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు నమో నమః జై చిరంజీవా, జైజై సైరా’- పరుచూరి గోపాలకృష్ణ ‘సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమకు గాను మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు కంగ్రాట్స్. స్వాతంత్ర్య సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు. అలాగే నయనతార, తమన్నాలు తమ పాత్రలతో వెండితెరపై మెరిశారు’ - శ్రీను వైట్ల ‘ఎమోషన్స్, అనుభవానికి సైరా నర్సింహారెడ్డి పెద్ద పీట వేశారు. మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ లెజెండరీగా నిలిచింది. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్గా ఉన్నాయి’ - సుధీర్ బాబు చదవండి: సైరా ఫుల్ రివ్యూ (4/5) -
ఈ సీన్ సినిమాలో ఎందుకు పెట్టలేదు?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గణేష్ పాత్రలో వరుణ్ నటన ప్రశంసలు అందుకుంటోంది. తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్గా రూపొందిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు హరీశ్ శంకర్ తెలుగు నేటివిటికి దగ్గరగా తెరకెక్కించారు. అంతేకాకుండా పలు మార్పులు కూడా చేశాడు. చిత్రం విజయం సాధించడంతో యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డీలిటెడ్ సీన్ ఒకటి చిత్ర బృందం ప్రేక్షకుల కోసం యూట్యుబ్లో విడుదల చేసింది. ఈ చిత్రంలో గణేష్ సినిమా షూటింగ్లో ఉండగా.. పెంచలయ్య మనుషులు అతనిపై దాడి చేస్తారు. అప్పుడు వారిని చితకబాదిన గణేష్.. పెంచలయ్య(సుబ్బరాజు)కు వార్నింగ్ ఇస్తాడు. ఈ సీన్లో వరుణ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సీన్ సూపర్గా ఉందని.. ఎందుకు సినిమాలో పెట్టలేదని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. -
కల్యాణ్ బాబాయికి చూపిస్తా: వరుణ్ తేజ్
సాక్షి, విశాఖ : గద్దలకొండ గణేష్ కథ తనకు నచ్చినా.. ఎన్నో సందేహాలు తలెత్తాయని.. పెదనాన్న చిరంజీవి ధైర్యమిస్తూ వెన్ను తట్టడంతోనే ముందడుగు వేయగలిగానని గద్దలకొండ గణేష్ చిత్రం హీరో వరుణ్ తేజ్ అన్నారు. తన పాత్రకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నందుకు ఎంతో సంతోషం కలుగుతోందని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందరికీ ఈ పాత్ర నచ్చుతుందని అనుకున్నా కానీ మరీ ఇంత నచ్చుతుందని మాత్రం అనుకోలేదని చెప్పారు. విజయయాత్రలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు.. విడుదలైన తర్వాత పరిణామాల గురించి మాట్లాడారు. ‘పెదనాన్న చిరంజీవి ఇచ్చిన ధైర్యంతోనే గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. గద్దల కొండ గణేష్ సినిమా స్టోరీ విన్నప్పుడు నాకు తెగ నచ్చింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం వద్దన్నారు. దాంతో తటపటాయించాను. అప్పుడు పెదనాన్న గుర్తుకు వచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం, సినిమాలను బాగ జడ్జ్ చేయగలగే అవగాహన ఉన్న ఆయనకు విషయం చెబితే బాగుంటుందనిపించింది. నేను, డైరెక్టర్ హరీష్ శంకర్ వెళ్లి స్టోరీ చెప్పాం. ఆయన థ్రిల్లయ్యారు. స్టోరీ చాలా బాగుందని, మంచి పేరు వస్తుందని చెప్పారు. ఆ ధైర్యంతో ఈ సినిమా తీశాం. సినిమా చూసిన తర్వాత పెదనాన్న మాతో మాట్లాడుతూ, అప్పుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.’ అని వరుణ్తేజ్ చెప్పారు. పెదనాన్న సినిమాలు చేయాలనుకోను చిరంజీవి సినిమాలను చూడాలని ఉంటుంది తప్ప అలా నటించాలని ఉండదని వరుణ్తేజ్ అన్నారు. ‘ఆయన సినిమా అంటే ఇష్టం. వాటిని మళ్లీ తీసే సాహసం చేయను. సైరా సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. కల్యాణ్ బాబాయి కూడా ఆ సినిమా ప్రమోషన్లో ఉన్నారు.’ అని చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అభినందనలు మరిచిపోలేనివని చెప్పారు. ‘ ఆయన ఈ సినిమా చూసి చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. వెల్లువొచ్చి గోదారమ్మా పాటను ఆయనతోనే విడుదల చేయించినపుపడు కూడా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్నారు.’ అని తెలిపారు. ఇంత పేరు మునుపు లేదు.. గతంలో ఎన్ని సినిమాలు హిట్ అయినా తనకు ఇంత పేరు రాలేదని, ఎక్కడికి వెళ్లినా వరుణ్ అనే పిలిచేవారని వరుణ్తేజ్ చెప్పారు. ‘ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గద్దలకొండ గణేష్ అని పిలిస్తున్నారు. ఇది వింటే చాలా గర్వంగా ఉంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఇంతలా ఆకర్షిస్తుందని అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయాలని అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అలాంటి కథ రాలేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ చెప్పగానే ఎంతో ఉత్సహం కలిగింది.’ అని చెప్పారు. ‘కథను నిర్థారించాక గణేష్ పాత్ర ఎలా ఉండాలి.., ఎలా ప్రవర్తించాలి అనేదానిపై మూడు నెలల పాటు రోజుకు ఎనిమిది గంటలపైగా డైరెక్టర్, నేను చర్చించుకున్నాం. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది.’ అని చెప్పారు. వరుణ్తో అన్ని భాషల్లో సినిమా చేస్తా.. తెలుగు సినిమా ఇప్పుడు ఇతర భాషల ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుందని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ‘వరుణ్ పర్సనాలిటీ అన్ని భాషాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. తర్వలోనే వరుణ్తో అన్ని భాషల్లో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తా’ అని చెప్పారు. ఈ చిత్రం టైటిల్ మార్చడం గురించి మాట్లాడుతూ.. ‘కథలు రాసే హక్కు మాత్రమే మనకు ఉంది కానీ టైటిల్ పెట్టే హక్కు మనకు లేదు’ అనిపిస్తుందన్నారు. సినిమా పేరు మార్చుకుండా ఉండి ఉంటే ప్రేక్షకులను ఇంకా బాగా ఆకర్షించేదన్నది తన అభిప్రాయమని చెప్పారు. వైజాగ్ అంటే చాలా ఇష్టం ‘నేను నటనను సత్యానంద్ మాస్టర్ వద్ద నేర్చుకున్నా. ఆరు నెలల పాటు సీతమ్మధారలో ఉన్నా. వైజాగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్లొ బీచ్ లేకపోవడం వల్ల వైజాగ్ బీచ్ మరీ ఆకర్షిస్తుంది.’ అని వరుణ్ తేజ్ చెప్పారు. తొలిప్రేమ సినిమాను చాలామట్టుకు ఇక్కడే షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. సినిమా ట్రైలర్ చూసి కల్యాణ్ బాబాయి చాలా బాగుందన్నారని, అయితే సినిమా ఇంకా చూపించలేదని చెప్పారు. విజయోత్సవ యాత్ర ముగిశాక వెళ్లి కల్యాణ్ బాబాయికి చూపిస్తానన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా గద్దల కొండ గణేష్ విజయోత్సవ సభ
-
మా సైన్మాని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు
‘‘మా బాబాయ్కి (పవన్ కల్యాణ్) ‘గబ్బర్సింగ్’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన హరీష్ శంకర్గారు నా కోసం కథ తీసుకువస్తారనుకోలేదు. మా ఇద్దరికీ సినిమా తప్ప వేరే ఏదీ తెలీదు. హరీష్ ఏదైనా సినిమా కోసమే చేస్తారు. అందుకే నేను తనకు పర్సనల్గా కనెక్ట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా ‘గద్దలకొండ గణేష్’ సైన్మాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా టైటిల్ మార్చాలన్నప్పుడు చరణ్ అన్న ఇంటికి వెళ్లాను. అక్కడ చరణ్ అన్న, తారక్ కలిసి కాఫీ తాగుతున్నారు. ఆ రోజు నా ఒత్తిడిని తగ్గించిన వారిద్దరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘రెండు రోజుల్లో 50 శాతం, మూడో రోజుకి 70–75శాతం వరకూ అమౌంట్ వెనక్కి వచ్చింది’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘బ్రహ్మానందంగారి సినిమాలు చూడడం మాకు వరం. ఆయన్ని డైరెక్ట్ చేయడం గర్వకారణం. ఈ సినిమా ‘వాల్మీకి’ అనే టైటిల్తో మొదలైంది. అందుకే ఈ చిత్రం ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు హరీష్ శంకర్. నటి పూజా హెగ్డే, మృణాళిని రవి, నటుడు బ్రహ్మానందం, నటి డింపుల్ హయాతి, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, పాటల రచయిత భాస్కరభట్ల, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు. -
‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
-
‘గద్దలకొండ గణేష్’ సక్సెస్ మీట్
-
‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ
టైటిల్ : గద్దలకొండ గణేష్ (వాల్మీకి) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వరుణ్ తేజ్, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు సంగీతం : మిక్కీ జే మేయర్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట దర్శకత్వం : హరీష్ శంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్.. మరో సక్సెస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ తమిళ రీమేక్తో వచ్చాడు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. తమిళ సినిమా జిగర్తాండను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాల్మీకిగా మలిచాడు. అయితే చివరి నిమిషంలో కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. మరి ఈ చిత్రం వరుణ్కు మరో విజయాన్ని అందించిందా? లేదా అన్నది చూద్దాం. కథ అభి (అథర్వా) దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుంటాడు. రియలిస్టిక్గా ఉండేలా సినిమాను తెరకెక్కించేందుకు.. ప్రస్తుతం ఫామ్లో ఉన్న గ్యాంగ్స్టర్ కోసం వెతుకుంతుంటాడు. ఆ సమయంలో అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుస్తుంది. అతనిపైనే సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అతనికి ఎదురు తిరిగే వారిని, అతని గురించి ఆరా తీసేవారిని గణేష్ చంపుతూ ఉంటాడు. మరి గణేష్కు అభి ఎలా దగ్గరయ్యాడు.. అతనితో కలిసి సినిమాను ఎలా తెరకెక్కించాడు.. అందుకోసం అభి పడిన పాట్లు ఏమిటి? ఆ జర్నీలో గద్దలకొండ గణేష్ మారిపోయాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు. ఆహార్యం నుంచి భాషపై పట్టువరకు.. ఆ పాత్రకు సరిపోయేట్టు తనను తాను మలుచుకున్నాడు. సినిమా అంతా తన భుజాలపైనే మోశాడు. వన్ మ్యాన్ షోగా స్క్రీన్పై నటించాడు. గద్దలకొండ గణేష్గా నవ్వించడమే కాదు.. ఏడ్పించేశాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడని ఈ చిత్రంతో మరోసారి చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అభి పాత్ర గురించి చెప్పుకోవాలి. తమిళ హీరో ఆ క్యారెక్టర్ను పోషించడంతో.. తెలుగు ప్రేక్షకులకు అంతగా అంచనాలు ఉండవు. అయితే అథర్వా అభి పాత్రకు చక్కగా సరిపోయాడు. ఇక మున్ముందు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తాడేమో చూడాలి. పూజా హెగ్డే ఉన్నంతలో ఆకట్టుకుంది. శ్రీదేవీ పాత్రలో అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక మృణాళినీ కూడా పర్వాలేదనిపించింది. తణికెళ్ల భరణికి ఉన్నవి రెండు మూడు సీన్లే అయినా.. కంటతడి పెట్టించాడు. బ్రహ్మాజీ, సత్య, ఫిష్ వెంకట్, శత్రు ఇలా మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ సినిమాకు కథే ముఖ్యం. ఇదే విషయం వాల్మీకితో మరోసారి రుజువైంది. అయితే ఈ కథ ఇక్కడ పుట్టింది కాదు. తమిళ నాట సూపర్ హిట్గా నిలిచిన జిగర్తాండ చిత్రానిది ఈ కథ. టైటిల్ క్రెడిట్స్లో కథా రచయిత కార్తీక్ సుబ్బరాజు వేయడంతోనే ఈ కథకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులకు ‘జిగర్తాండ’ నచ్చినట్టే.. ఇక్కడి ప్రేక్షకులకు ‘గద్దలకొండ గణేష్’ నచ్చుతుంది. మన తెలుగు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు తీయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. అయితే అక్కడ బాబీ సింహా పోషించిన పాత్రను.. ఇక్కడ వరుణ్తేజ్ పోషించడంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. తెలుగులో వరుణ్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ మార్పులూ అనివార్యమే. అక్కడ బాబీ సింహా పాత్ర జోకర్లా మార్చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం వరుణ్ పాత్రను హైలెట్ చేశారు. గద్దలకొండ గణేష్ హీరోగా తీసిన ‘సీటీమార్’ సినిమాను జనమంతా పగలబడి నవ్వుతున్నారు? కానీ ఎందుకు అని వాల్మీకి చూసిన సగటు ప్రేక్షకుడికి తెలియదు. గద్దలకొండ గణేష్ బయోపిక్గా తెరకెక్కిస్తే అది గొడవలతో నిండి ఉండాలి కానీ.. కామెడీ ఎంటర్టైనర్ ఎలా అయిందనే అనుమానాలు రాక మానవు. ఇవే హరీష్ శంకర్ వదిలేసిన సన్నివేశాలు. ఇక్కడే ఇంకాస్త ఆలోచిస్తే.. సినిమాలో ఇంకా వినోదాన్ని పెంచే అవకాశం ఉండేది. అయితే తమిళ సినిమాను చూసిన ప్రేక్షకులకు మాత్రమే అలాంటి ఫీలింగ్ కలిగే అవకాశముంది. అయితే సినిమాను ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన హరీష్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తర్వాత చెప్పుకోవల్సింది మిక్కీ జే మేయర్. పాటలే కాదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. గద్దలకొండ గణేష్ పాత్ర అంతగా పండిందంటే.. మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా అందుకు ఓ కారణం. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ వరుణ్ తేజ్ సంగీతం మైనస్ పాయింట్స్ కథలో చేసిన మార్పులు నిడివి బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
వాల్మీకి కాదు... ‘గద్దలకొండ గణేష్’
సాక్షి, అనంతపురం, కర్నూలు : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే వాల్మీకి సినిమా మార్చాలంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో ....శాంతిభద్రతల దృష్ట్యా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ‘గద్దలకొండ గణేష్’ గా వస్తున్న వరుణ్ తేజ్ అయితే వాల్మీకి సినిమా టైటిల్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సినిమా పేరు మార్చాలంటూ... వాల్మీకి, బోయ సామాజక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ’వాల్మీకి’ చిత్ర బృందం వెనక్కి తగ్గింది. సినిమా టైటిల్పై వివాదానికి సంబంధించి చిత్ర యూనిట్ గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. కాగా వాల్మీకి సినిమా పేరును ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్లతో పాటు హీరో వరుణ్ తేజ్కు, చిత్రయూనిట్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. నోటీసులపై స్పందించిన చిత్ర యూనిట్.. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని గురువారం హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా సినిమా టైటిల్ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుతున్నట్లు పేర్కొంది. దీంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వాల్మీకి’ చిత్ర వివాదానికి లైన్ క్లియర్ అయినట్లే. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు.... ‘వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిత్ర యూనిట్ తాజా నిర్ణయంతో రెండు జిల్లాల్లోనూ సినిమా విడుదల కానుంది. వాల్మీకి టైటిల్ మార్చాలని మంత్రి లేఖ అలాగే వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ, కర్మాగారాలు శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ‘వాల్మీకి సినిమా ప్రారంభం నుంచి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వాల్మీకి కులస్తులతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సినిమా పేరు ఉందని నా దృష్టికి వచ్చింది. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో పాటు ప్రాంతీయ సెన్సార్ అధికారి రాజశేఖర్కు లేఖలు రాశాము’ అని తెలిపారు. -
ఇప్పుడు విలన్గా ఎందుకు అన్నారు : వరుణ్
ఓసారి చిరంజీవిగారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని హరీశ్గారు అన్నారు. అయితే నాతో తీస్తాననలేదు. చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్ అన్న చేయకపోతే నేను ట్రై చేస్తా. హైట్ని సీజీలో కవర్ చేస్తా (నవ్వుతూ). అయితే బయోపిక్ గురించి హరీశ్ సీరియస్గా అన్నారా? లేదా అనే విషయాన్ని చెప్పలేను. చిరంజీవిగారిని తను లవ్ చేసినంతగా వేరే ఎవరూ చేయలేరని హరీశ్ ఉద్దేశం. ‘‘ఆర్టిస్టుకు హద్దులు ఉండకూడదని నమ్ము తాను. ఏ పాత్రైనా చేయగలగాలి. రేపు నేను ఏదైనా డిఫరెంట్ పాత్ర చేసినప్పుడు వరుణ్ ఏంటీ ఇలా అని ఆడియన్స్ షాక్ అవ్వకూడదు. ఒక బౌండరీలోనే ఉండాలనుకోవడంలేదు’’ అన్నారు వరుణ్ తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, అథర్వ, పూజా హెగ్డే, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. 14రీల్స్ ప్లస్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానున్న సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రాల తర్వాత చాలా ప్రేమకథలు విన్నాను. ఆ సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ‘దాగుడు మూతలు’ కథ చెప్పారు. ‘ప్రస్తుతం నేను ప్రేమ కథ చేయాలనుకోవడం లేదు. మీ సై్టల్ ఆఫ్ మూవీ ఏదైనా ఉందా?’ అని అడిగాను. అప్పుడు తమిళ మూవీ ‘జిగర్తాండ’ చూశావా? అని అడిగారు. చూశానంటే మళ్లీ చూడమన్నారు. అలా ‘వాల్మీకి’ మొదలైంది. హీరో మంచివాడిగానే ఎందుకు ఉండాలి? ఓ బ్యాడ్బాయ్గా ఎందుకు ఉండకూడదు? అని నేను ఆలోచిస్తున్న సమయంలో హరీశ్ వాల్మీకి కథ చెప్పారు. ఈ సినిమా చేస్తున్నాను అనగానే చాలా మంది ‘ఇప్పుడు విలన్గా ఎందుకు?’ అన్నారు. దాంతో ఈ స్క్రిప్ట్ను చిరంజీవిగారి దగ్గరకు తీసుకువెళ్లాను. ఆయన హీరోనా? విలనా? అని అడగలేదు. కథ బాగుంది. సినిమా చెయ్యి అన్నారు. హరీశ్ని పిలిచి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వాటిని మేం పాటించాం. ఈ సినిమాలో నేను గద్దలకొండ గణేశ్ పాత్ర చేశాను. ‘పునాదిరాళ్లు’ సినిమాలో చిరంజీవిగారిది ఓ స్టిల్ ఉంటుంది. ఆ స్టిల్ను రిఫరెన్స్గా తీసుకుని గణేశ్ లుక్ని రెడీ చేసుకున్నాం. ఆ స్టిల్ను చిరంజీవిగారికి కూడా పంపాం. మంచిగా ఉండే గణేశ్ ఎందుకు క్రూరంగా మారాడు? అనే అంశాలను చెప్పడానికి ఓ బ్యాక్స్టోరీ యాడ్ చేశాం. ఈ పార్ట్లోనే పూజా హెగ్డే వస్తారు. ఈ బ్యాక్స్టోరీ ‘జిగర్తాండ’లో లేదు. ఇంకొన్ని మార్పులు కూడా చేశాం. ‘ఎఫ్ 2’లో నేను డీసెంట్ తెలంగాణ యాస పలికాను. కానీ ‘వాల్మీకి’లో నేను చెప్పిన తెలంగాణ యాస డైలాగ్స్ మాసీగా ఉంటాయి. గణేశ్ పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. హరీశ్గారు మంచి డైలాగ్స్ రాశారు. పూజా హెగ్డేతో నాలుగేళ్ల తర్వాత కలిసి నటించాను. పూజా పాత్ర కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తనది ముఖ్యమైన పాత్ర. 14రీల్స్ ప్లస్ బ్యానర్ తొలి సినిమాలో హీరోగా నటించడం హ్యాపీ. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. పని విషయంలో హారీశ్ మాత్రమే కాదు.. నేను కూడా చాలా ఫాస్ట్. మాట్లాడటమే కాస్త నెమ్మదిగా మాట్లాడతాను. పనిలో స్పీడ్ ఉంటుంది. డైరెక్టర్కు స్పీడ్ ఉన్నప్పుడు మనం కూడా స్పీడ్గా వెళ్లాలనిపిస్తుంది. హారీశ్గారిలో మంచి ఎనర్జీ ఉంది. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ రెస్పాన్స్ విషయంలో నేను కాస్త టెన్షన్ పడ్డాను. కానీ చేసేప్పుడు పెద్దగా టెన్షన్ పడలేదు. మిక్కీ జె. మేయర్, హరీశ్, మా కాస్ట్యూమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని నా టెన్షన్ను తగ్గించారు. నేను జస్ట్ డ్యాన్స్ చేశాను. పాటను విడుదల చేసిన తర్వాత వస్తోన్న స్పందనకు ఫుల్ హ్యాపీ. ‘జిగర్తాండ’ కల్ట్ మూవీ. ఈ సినిమాలో నటనకుగాను బాబీ సింహాకు జాతీయ అవార్డు వచ్చింది. రీమేక్లో తన పాత్రని నేను చేశాను. కానీ నా సై్టల్లో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఆల్రెడీ తమిళ సినిమా ‘జిగర్తాండ’ చూసిన వారికి మా ‘వాల్మీకి’ నచ్చుతుందా? లేదా అని చెప్పలేను. కానీ మంచి ఎంటర్టైనర్. ఒక సినిమాను ఎక్కువమందికి చేరువ కావాలనే రీమేక్ చేస్తాం. అలానే ‘వాల్మీకి’ సినిమా చేశాం. కొన్ని సినిమాలకు బడ్జెట్ కావాలి. బడ్జెట్ పరిమితుల వల్ల ‘అంతరిక్షం’ సినిమా విషయంలో కొన్ని అంశాలకు సంబంధించి రాజీ పడాల్సి వచ్చింది. అనుకున్నది రీచ్ కాలేకపోతున్నామా? అనే సందేహం షూటింగ్ సమయంలోనే వచ్చింది. ఆ సినిమాలో నేను వేసుకున్న స్పేస్ సూట్ని నా ఆఫీస్ ఎంట్రన్స్లో పెట్టుకున్నా. నా తప్పులను తెలుసుకోవడానికి. నెక్ట్స్ టైమ్ ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సూట్ను చూసుకుని ఓసారి లొపలికి వెళ్తాను (నవ్వుతూ). కానీ ‘అంతరిక్షం’లాంటి ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించడం ఆపను. ఒక సక్సెస్ వచ్చి నా మార్కెట్ పెరిగిందంటే డబ్బులు గరించి ఆలోచించను. మార్కెట్ పెరిగితే ఏదైనా కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటాను. కాస్త రిలాక్డ్స్గా సినిమాలు చేయడానికి కావాల్సిన సమయం, వయసు నాకు ఉన్నాయి. నా తొలి సినిమా ‘ముకుంద’ అప్పుడుసెట్లో చాలామంది ఉన్నారని సిగ్గుతో కెమెరా ముందుకు రావడానికి ఇబ్బందిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ‘సైరా’ ట్రైలర్ని రిలీజ్కి ముందు చూడలేదు. మంగళవారం రాత్రి చరణ్ అన్నను కలిసినప్పుడు చూద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను. బుధవారం చూశాను. చిరంజీవిగారు ఏ సినిమా చేసినా చూస్తా. నా సినిమా ఉన్నా.. నేను చిరంజీవిగారి సినిమాకే వెళ్తాను. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి సినిమాలో బాక్సర్గా నటిస్తున్నాను. సాగర్ చంద్ర దర్శకత్వంలో నేను చేయాల్సిన సినిమా ప్రస్తుతం హోల్డ్లో ఉంది. చేస్తామా? చేయమా? అని ఇప్పుడే చెప్పలేను. వెంకటేశ్గారిని రెగ్యులర్గా కలుస్తుంటా. ‘ఎఫ్ 3’ ఉండొచ్చు. -
ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను
‘‘ఉండ్రాజవరంలోని నా స్నేహితుని ఇంట్లో మడత మంచం మీద పడుకొని పాట ఎలా తీయాలి అని సీరియస్గా ఆలోచిస్తున్నాను. సెకనుకోసారి ఠంగ్, ఠంగ్ అని మోత వినిపించడంతో అతన్ని ‘ఏంటి’ అని అడిగాను. ఈ ఊళ్లో బిందెలు తయారు చేస్తారు అని చెప్పాడు. అంతే... పాట ఎలా తీయాలో ఐడియా తట్టింది’’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో గోపీ అచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన ‘దేవత’ చిత్రంలోని శోభన్బాబు, శ్రీదేవిల ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ‘దేవత’ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావటానికి కారణం అయిన ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ముఖ్యంగా చిత్రనిర్మాత డి. రామానాయుడు, స్వరకర్త చక్రవర్తి, పాట రాసిన వేటూరి గారు. ఇప్పుడు ఈ పాటను చూపించిన టీమ్ అందరూ నన్ను 37 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ‘మీరు చేసిన బిందెల మధ్యలో శోభన్బాబు, శ్రీదేవి ఉంటారు... చాలా బిందెలు అవసరం అవుతాయి. అవి వాడుకొని మళ్లీ ఇచ్చేస్తాం’ అని చెప్పాను. బిందెలు తయారు చేసే ఆయన 1000 బిందెలను చేసి ఇచ్చారు. మనం ఈ రోజుకీ ఈ పాటను చెప్పుకుంటున్నాం అంటే ఎందరో చేసిన కృషి ఫలితమే ఇది. నేను నిర్మాత బావుండాలని కోరుకునే దర్శకుడిని. ఇన్ని బిందెల్లో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందె నాకు ఇస్తే తీసుకెళ్తాను (నవ్వుతూ). నేను పూజను చూసిన మొదటిరోజే చెప్పాను. ఈ అమ్మాయి నంబర్వన్ హీరోయిన్ అవుతుందని. వరుణ్ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను హీరోయిన్ పూజని ఏ పండుతో కొడతాను అంటే చెర్రీ పండుతో ఆమె నడుము మీద కొడతాను’’ అని చమత్కరించారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా ఏడెనిమిదేళ్ల కల ఇది. 2019లో బిందెలతో పాట చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాను. యానంలో ఈ పాట షూట్ స్టార్ట్ చెయ్యగానే నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. శ్రీదేవిగారు చేసిన ఈ పాటలో పూజాని తప్ప ఎవరినీ ఊహించలేను. వరుణ్ చాలా బాగా డాన్స్ చేశాడు. నేను నిర్మాతలను 500 బిందెలడిగితే వాళ్లు నాకు 1500 బిందెలను ఇచ్చారు. ఇది వేటూరిగారు రాసిన పాట. ఈ పాట తీయటం రాఘవేంద్ర రావు లాంటి గురువుగారికి శిష్యుడు ఇస్తున్న పువ్వు ఇది. వేటూరిగారి లిరిక్స్ని వాడుకున్నందుకు ఆయన కుమారుడు వేటూరి రవిగారికి రెమ్యునరేషన్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను స్వతహాగా పాటలు, డాన్సులకు అంత కంఫర్ట్ కాదు. కానీ ఈ చిత్రంలో రీమిక్స్ సాంగ్ అనగానే చిరంజీవి గారిదో, పవన్ గారి పాటో ఉంటుంది అనుకున్నాను. కానీ, శోభన్బాబు గారి పాట అనగానే చాలా ఎగై్జట్ అయ్యాను. ఇంత బాగా రీక్రియేట్ చేస్తారనుకోలేదు. నేను బాలుగారి పాటలకు వీరాభిమానిని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపి అచంట, రామ్ ఆచంట, పూజా హెగ్డే, మిక్కీ. జె. మేయర్, అవినాష్, శేఖర్ మాస్టర్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నా దృష్టిలో అన్నీ రీమేక్ సినిమాలే
‘‘దాగుడుమూతలు’ అనే సినిమా తీయాలని కొన్ని నెలలు ప్రయత్నించాను. కుదర్లేదు. అప్పుడు రజనీకాంత్గారితో కార్తీక్ సుబ్బరాజ్ చేస్తున్న ‘పేటా’ ఫస్ట్ లుక్ వచ్చింది. అంతకుముందు కార్తీక్ తీసిన ‘జిగర్తండా’ను చూశాను. ‘పేటా’ లుక్ వచ్చాక మళ్లీ చూశాను. ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అనిపించింది. అలా ‘వాల్మీకి’ సినిమా స్టార్ట్ అయింది’’ అన్నారు దర్శకుడు హరీశ్ శంకర్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంగా హరీశ్ శంకర్ చెప్పిన విశేషాలు. ► ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక పాత్ర కోసం వరుణ్ తేజ్ని కలిశాను. ‘నాతో ఎందుకు చేయాలనుకుంటున్నారు?’ అని అడిగాడు. ‘ఫిదా, తొలి ప్రేమ’ వంటి సినిమాలు చేస్తున్నావు కదా. ఈ పాత్రకు బావుంటావనిపించింది’ అన్నాను. ‘నేను మీ స్టయిల్ సినిమా చేయాలనుకుంటున్నాను. అలాంటి సినిమా చేద్దాం’ అన్నాడు వరుణ్. ఆ తర్వాత ‘జిగర్తండా’ రీమేక్ ఉంది, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనగానే వరుణ్ ఆసక్తి చూపించాడు. ఈ సినిమాను చాలా డెడికేషన్తో చేశాడు వరుణ్. సెట్లో సీన్ పేపర్ పట్టుకొని చిన్నపిల్లాడు నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ ఉండేవాడు. ► ఎనిమిదేళ్ల తర్వాత ఓ రీమేక్ సినిమా చేశాను. నా దృష్టిలో ఏ సినిమా అయినా రీమేక్ కిందే లెక్క. ఒక సినిమా చేయడానికి ఒక పుస్తకమో, ఓ వ్యక్తో ఏదైనా సంఘటనో ప్రేరణ అయినప్పుడు మరో సినిమా ఎందుకు కాకూడదు? నాకు రీమేక్ అయినా సొంత కథతో సినిమా అయినా ఒకటే. ► హిందీ ‘దబాంగ్’ని తెలుగు (‘గబ్బర్ సింగ్)లో రీమేక్ చేసేటప్పుడు చాలా మార్పులు చేశాను. ఆ ధైర్యంతోనే టైటిల్ కార్డ్లో ‘మాటలు–మార్పులు–దర్శకత్వం’ అని వేసుకున్నాను. కానీ ‘వాల్మీకి’ సినిమాలో ఎక్కువ మార్పులు చేయలేదు. కొన్ని షాట్స్ అలానే తీశాం. అందుకని ‘మార్పులు’ అని ప్రత్యేకంగా వేసుకోలేదు. ఈ సినిమాలో సుకుమార్గారు, నితిన్, బ్రహ్మానందంగారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ► ఒక మనిషిలోని అత్యున్నతమైన మార్పుకు నిదర్శనం వాల్మీకి. ఆ టైటిల్ అయితే సినిమాకు బావుంటుందని పెట్టాం. టైటిల్ మీద చిన్న ఇష్యూ నడుస్తోంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ► పూజా హెగ్డే పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్లో వస్తుంది. తన పాత్ర సర్ప్రైజ్. వరుణ్–పూజా మీద ‘దేవత’ సినిమాలో ‘వెల్లువచ్చి గోదారమ్మ..’ పాట రీమిక్స్ చేశాం. పాత పాటలానే షూట్ చేశాం. ► అథర్వ మురళి పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నాం. దర్శకుడవ్వాలనే కసితో ఉండే కుర్రాడి పాత్ర చేయాలంటే ఏ ఇమేజ్ లేని నటుడైతే బెస్ట్ అని అతణ్ణి తీసుకున్నాను. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంటగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ల 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో తొలి సినిమా నేనే చేయడం ఆనందంగా ఉంది. ► ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నాను. కేవలం డబ్బు కోసం కాకుండా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. నా మిత్రులు కృష్ణ, మహేశ్ కోనేరులతో కలసి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ► చలంగారి ‘మైదానం’, యండమూరిగారి ‘ప్రేమ’ నవలలను సినిమాగా తీయాలనుంటుంది. కుదరదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గమనించి, అందులో మన శైలికి ఏది మ్యాచ్ అవుతుందో అలాంటి సినిమాలు తీయలి. ఓ సినిమాను ఎక్కువ మంది చూస్తే అది కమర్షియల్ సినిమా కిందే లెక్క. మనం ఈ సినిమా తీయాలి అనుకుని సినిమా తీయలేం. సినిమానే దర్శకుడిని ఎంచుకుంటుంది కానీ దర్శకుడు సినిమాని ఎంచుకోలేడు అని నేను నమ్ముతాను. నాకు త్వరత్వరగా సినిమాలు తీయాలని ఉన్నా అనుకోకుండా గ్యాప్ వస్తుంది. ► ప్రస్తుతం రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఏది ముందు మొదలవుతుందో తెలియదు. అందరూ బలంగా కోరుకుంటే పవన్ కల్యాణ్గారితో సినిమా ఉండొచ్చు. ఎన్టీఆర్గారితో చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేదు. ఆయనతో ఓ సినిమా తీసి రుణం తీర్చుకోవాలి. ► నాకు, ‘దిల్’ రాజుగారికి చిన్న చిన్న క్రియేటివ్ డిఫరెన్సెన్స్ ఉన్నాయి. అది ఏ నిర్మాత – దర్శకుడికైనా ఉండేవే. ‘దాగుడుమూతలు’ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రమే కావాలని నేను, స్టార్స్తో తీద్దాం అని ఆయన. క్రియేటివ్గా చిన్న చిన్న డిఫరెన్స్ తప్పితే ఆయనకు, నాకు మంచి అనుబంధం ఉంది. ► వరుణ్ హీరో అవ్వకముందు గడ్డం పెంచుకొని ఫొటోషూట్ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్ను నాగబాబుగారు నాకు చూపించారు. ఆ లుక్ నా మనసులో ఉండిపోయింది. వరుణ్ మేకోవర్కి కారణం నాగబాబుగారే. ఈ సినిమా కోసం ఆ లుక్ కావాలంటే వరుణ్ మౌల్డ్ అయ్యాడు. ఇందులో తన నటవిజృంభణ చూస్తారు. వరుణ్, నేను గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. -
'వాల్మీకి' ప్రీ రిలీజ్ వేడుక
-
గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే
‘‘మా కోబ్రా (కో–బ్రదర్. ‘ఎఫ్ 2’ లో వరుణ్ పాత్రను ఉద్దేశించి) లుక్ మొత్తం మార్చేశాడు.. ‘ఎఫ్ 2’ నుంచి ‘వాల్మీకి’ చిత్రానికి గెటప్ మార్చేశాడు. ఈ ట్రైలర్ చూడగానే టెరిఫిక్గా అనిపించింది. ‘గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. వరుణ్తేజ్, పూజాహెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఆ వాల్మీకి దొంగ.. మంచిగా మారి రామాయణం రాశారు. మరి.. ఈ వాల్మీకి ఏం రాశాడో థియేటర్స్కు వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది.. మా వరుణ్ రెచ్చిపోయి ఒక సూపర్ బ్లాక్బస్టర్ ఇస్తాడు. నా స్నేహితుడు పవన్ కల్యాణ్కు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ అనే బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చాడు. మా వరుణ్కి కూడా సూపర్ హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నాను. నిర్మాతలు రామ్, గోపి కలిసి నాతో ‘నమో.. వెంకటేశ’ చేశారు. చాలా ప్యాషన్తో సినిమా చేస్తారు.. కానీ, సింపుల్గా ఉంటారు. ‘వాల్మీకి’ పెద్ద హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ గద్దలకొండ గణేశ్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేశ్ వెంకటేశ్ సర్కి థ్యాంక్స్. నేను ఫోన్ చేసి రావాలనగానే వెంటనే ఓకే అన్నారు.. అంత మంచి మనసు ఆయనది. ‘వాల్మీకి’ నా 9వ సినిమా. ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్, లవ్స్టోరీలంటూ సినిమాలు చేశాను. ఫస్ట్ టైమ్ ఓ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. మామూలుగా లేదమ్మా. చిరంజీవిగారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ‘అరేయ్ మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్థం కావట్లేదు అని’.. ఇప్పుడు ఫైనల్గా ఆ రుచిని కొంచెం చూశా.. థ్యాంక్యూ డాడీ. మా దాహం తీరే సినిమా ఎవరిస్తారు అనుకున్నాం.. హరీష్గారి ‘గబ్బర్సింగ్’ చూసినప్పుడు ఇదీ సినిమా అనిపించింది. మా బాబాయికి అంతపెద్ద సినిమా ఇచ్చిన ఆయన నాతో చేయడం నా అదృష్టం. రామ్, గోపీగార్లతో నా ప్రయాణం ఇకముందు కూడా సాగుతుందని కోరుకుంటున్నా. ‘ముకుంద’ సినిమా తర్వాత పూజాహెగ్డేతో చేద్దామనుకున్నా. ఆ సినిమా చేస్తున్నప్పుడు ‘అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టి మా మధ్య మాటలు ఇవ్వలేదు ఏంట్రా?’ అనిపించింది.. కానీ ‘వాల్మీకి’లో హరీష్గారు మా ఇద్దరి మధ్య మంచి సీక్వెన్స్ ఇచ్చారు. శోభన్బాబుగారి ‘వెల్లువొచ్చే గోదారమ్మ..’ రీమిక్స్ పాట చాలా బాగా వచ్చింది. మీ అందర్నీ(అభిమానులు) చూస్తే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది.. థ్యాంక్యూ. నిన్ననే చిరంజీవిగారిని, చరణ్ అన్నని కలిశా. ‘సైరా’ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ, వాళ్ల ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ‘వాల్మీకి’ ట్రైలర్ చూసి బాబాయ్(పవన్ కల్యాణ్) నాతో, హరీష్గారితో మాట్లాడారు.. చాలా బాగుంది.. తెలంగాణ యాసలో చాలా బాగా మాట్లాడావు అన్నారు. మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ(అభిమానులు) మళ్లీ మళ్లీ థ్యాంక్స్. కచ్చితంగా మీ అందరికీ ‘వాల్మీకి’ నచ్చుతుంది. అక్టోబర్ 2న మన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా వస్తోంది. ‘వాల్మీకి’ని ఎంత హిట్ చేస్తారో అంతకు రెండు రెట్లు ‘సైరా’ ని కచ్చితంగా హిట్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘వాల్మీకి’ టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి.. సాహిత్యంపై పట్టుండి, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నాడేమో అనిపించింది. వరుణ్తేజ్ మామూలోడు కాదని గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ‘వాల్మీకి’ చూస్తే అసాధారణ నటుడు అనిపిస్తుంది. మా గురువు చిరంజీవిగారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్.. వారి మధ్యలో ఉన్నాడు అర్జునుడు నాగబాబు.. అతను సంధించి వదిలిన బాణం మన వరుణ్. మా బాస్ వెంకటేశ్ ఉన్నాడు ఎదురుగా.. ‘సుందరకాండ’ దగ్గరి నుంచి చాలా సినిమాల్లో మా కాంబినేషన్లో చేశాం. ఆయన కొన్ని సినిమాలనే ఎంచుకుని అతిథిగా వస్తుంటారు. ‘వాల్మీకి’ సినిమాకి ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. రామ్ ఆచంట, గోపీ ఆచంట మంచి క్రమశిక్షణ, మనసున్నవారు. ‘వాల్మీకి’అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘పవన్కల్యాణ్గారితో ‘గబ్బర్సింగ్, సాయిధరమ్ తేజ్తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్, బన్నీతో ‘డీజే’... ఇలా మెగా ఫ్యామిలీతో హిట్స్ కొట్టాడు హరీష్.. ఇప్పుడు వరుణ్తో కూడా ‘వాల్మీకి’తో హిట్ కొడుతున్నాడు. మా ‘ఎఫ్ 2’ వెంకటేశ్గారు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చారు.. ‘ఎఫ్ 2’ లాగా ‘వాల్మీకి’ చిత్రానికీ తిరుగులేదు. ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ, రామ్. ‘వాల్మీకి’ పెద్ద హిట్ కావాలి.. ఆల్ ది బెస్ట్ టీమ్’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘భాస్కరభట్లగారు ‘జర జర..’ పాట రాస్తున్నప్పుడు వాళ్ల అమ్మగారు చనిపోయారు.. అయినా రాసి ఇచ్చారు. చంద్రబోస్ అన్నయ్యగారితో నా సినిమాలో ఓ పాటైనా రాయించుకోకపోతే వెలితిగా ఉంటుంది. వనమాలిగారు చక్కనిపాట రాశారు. ఇతర భాషలతో పోలిస్తే రచయితలు, పాటల రచయితలకు మనం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అనిపిస్తోంది. మనకు నచ్చిన పాటలు, లిరిక్స్ని తోటివారితో షేర్ చేసుకోండి. తద్వారా మన భాషను మనం కాపాడుకున్నవాళ్లం అవుతాం. కెమెరామెన్ బోస్, మిక్కీ జి. మేయర్ ఈ సినిమాకి రెండు స్తంభాల్లాంటివారు. నాకోసం ఈ సినిమాలో ప్రత్యేక పాట చేసినందుకు డింపుల్కి థ్యాంక్స్. ‘డీజే’ లో పూజాహెగ్డే గ్లామర్ నచ్చితే, ‘వాల్మీకి’లో తన నటన నచ్చుతుంది. ‘ఎఫ్ 2’ టైమ్లో వెంకటేశ్గారిని కలిశా. ఆయన్ని కలిసే వరకూ తెలియదు అంత సరదాగా ఉంటారని. 85రోజులు షూటింగ్ చేశాం.. ఇన్ని రోజులూ నవ్వుతూ పనిచేసిన నా మొదటి హీరో వరుణ్. ఈ కాలం జనరేషన్లో ఓ హీరో ఫోన్ పక్కన పెట్టి పనిపైనే శ్రద్ధ పెట్టేవాడు వరుణ్ ఒక్కడే. నెలరోజులు తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పాడు. డబ్బులు పెట్టేవారు చాలామంది ఉంటారు.. కానీ ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, ‘దిల్’ రాజుగారు. వారం కిందట పవన్ కల్యాణ్గారిని కలిశా. ఆయనకి ‘వాల్మీకి’ ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ‘గబ్బర్సింగ్’ అప్పుడు ఎలా కోరుకున్నారో ఇప్పుడూ అదే సంకల్పంతో కోరుకోండి (పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి) అప్పుడే సినిమా కుదురుతుంది’’ అన్నారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ– ‘‘ఇక్కడి విచ్చేసిన మెగాస్టార్, పవర్స్టార్ ఫ్యాన్స్కి, మా తొలి సినిమా హీరో వెంకటేశ్బాబుకి థ్యాంక్స్. ఎప్పటి నుంచో వరుణ్తో సినిమా చేద్దామని రెండు మూడు కథలు అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు ‘వాల్మీకి’లాంటి మంచి కథతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పవర్స్టార్తో ‘గబ్బర్సింగ్’ తీసి ఎలా అలరించారో వరుణ్తో ‘వాల్మీకి’ తోనూ అలా అలరిస్తారు హరీష్’’ అన్నారు. ‘‘నాకు శ్రీదేవిలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు హరీష్ సర్కి చాలా థ్యాంక్స్’’ అన్నారు పూజాహెగ్డే. నిర్మాత అనీల్ సుంకర, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు భాస్కరభట్ల, చంద్రబోస్, వనమాలి, నటి డింపుల్ పాల్గొన్నారు. -
వాల్మీకి ట్రైలర్ విడుదల
-
వాల్మీకి ట్రైలర్ : గత్తర్లేపినవ్.. చింపేశినవ్ పో!
ఓ రీమేక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఏవిధంగా అందించాలో హరీష్శంకర్కు తెలిసనట్టు మరే దర్శకుడికి తెలీదేమో. అందుకే హిందీలో దబాంగ్ అంటే తెలుగులో గబ్బర్సింగ్ అంటూ రికార్డులన్నీ బ్రేక్ చేసేశాడు. మరోసారి అలాంటి ఓ రీమేక్తో మన ముందుకు వస్తున్నాడు ఆ దర్శకుడు. తమిళ్ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తేజ్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్, పోస్టర్స్, సాంగ్స్తో మంచి బజ్ను నెలకొల్పాయి. వరుణ్ తేజ్ తన లుక్తో ఆశ్చర్యపరుస్తున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ హైలెట్గా మారనున్నట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ జీవించినట్లు కనిపిస్తోంది. ‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు..’, ‘గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడూ.. నేను బొక్కలు ఇరగొట్టడం సేం టు సేం...’,అనే డైలాగ్లు అదిరిపోయాయి. ఈ చిత్రంలో అథర్వా, పూజా హెగ్డేలు ప్రత్యేకపాత్రలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘వాల్మీకి’లో సుకుమార్!
ఈ ఏడాది ఎఫ్2తో బ్లాక్ బస్టర్హిట్ కొట్టిన వరుణ్ తేజ్.. త్వరలోనే ఓ రీమేక్ మూవీతో పలకరించనున్నాడు. తమిళ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నారు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. ఈ మూవీని రీమేక్ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్.. సినిమాపై హైప్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీలో సుకుమార్ స్పెషల్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. కథానుగుణంగా.. ఈ మూవీలో వరుణ్ తేజ్పై ఓ సినిమాను తెరకెక్కించే పనిలో అథర్వా ఉంటాడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెరకెక్కించే సన్నివేశాల్లో సుకుమార్ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు ఓ క్లూను వదిలాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మేరకు సుకుమార్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వాల్మీకిలో సుకుమార్ నుంచి చిన్న సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. A Small surprise from @aryasukku in #Valmiki.... thank you so much darling Sukku..for your sweet gesture !!!!! #ValmikiOnSep20th !!!! pic.twitter.com/frzHdhSuW6 — Harish Shankar .S (@harish2you) September 3, 2019 -
‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’.. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
వాల్మీకి టీజర్.. నా విలనే.. నా హీరో
స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగలు రెండూ ఒకే సారి రావడంతో ఆనందం రెట్టింపైంది. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టీజర్స్, పోస్టర్స్, కొత్త సాంగ్స్తో స్టార్స్ తమ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇదే వరసలో వరుణ్ తేజ్ డిఫరెంట్ రోల్ను ట్రై చేస్తూ వస్తోన్న వాల్మీకి చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. ‘నా సినిమాలో నా విలనే నా హీరో’ అని అథర్వా చెప్పే డైలాగ్.. టీజర్ చివర్లో తెలంగాణ యాసలో వరుణ్ చెప్పే ’అందుకే పెద్దొళ్లు చెప్పిళ్లు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’ డైలాగ్ అదిరిపోయాయి. హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజాహెగ్డె హీరోయిన్ నటిస్తోన్న మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘వాల్మీకి’ టీజర్ రెడీ!
మెగా హీరో వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతీనాయక పాత్రలో నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. మరో కీలక పాత్రలో తమిళనటుడు అధర్వ మురళీ నటిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్ లుక్లో ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఆకట్టుకోగా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. The madness begins in two days!🤙🏽 Stay tuned for #ValmikiTeaser @harish2you @DoP_Bose @Atharvaamurali @hegdepooja pic.twitter.com/zHKwasW6rj — Varun Tej Konidela (@IAmVarunTej) August 13, 2019 -
వాల్మీకి సెట్లో ఆస్కార్ విన్నర్!
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ సెట్లో ఓ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సందడి చేశారు. జేఎఫ్కే, ద ఏవియేటర్, హూగో లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న రాబర్ట్ రిచర్డ్సన్ వాల్మీకి సెట్కు విచ్చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ‘సినిమాటోగ్రాఫర్లు దేవుడిగా భావించే రాబర్ట్ రిచర్డ్సన్ వాల్మీకి సెట్కు విచ్చేశారు. మూడు సార్లు ఆస్కార్ సాధించిన వ్యక్తి నా కోసం కెమెరా ఆపరేట్ చేస్తుంటే.. నేను యాక్షన్ చెప్పాను’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ సంఘటనను తన చివరి రోజు వరకు గుర్తు పెట్టుకుంటానంటూ ట్వీట్ చేశారు హరీష్. వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ మురళీ మరో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. 14 రీల్స్ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. Been blessed by the visit of God of Cinematography to Valmiki sets... What would you say when 3 time Oscar winner operates camera for you ... I have pulled my self to say ... ACTION... pic.twitter.com/cLqsyPTJGm — Harish Shankar .S (@harish2you) August 5, 2019 -
హీరోయినా..? ఐటమ్ గర్లా?
కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ నటుడు అధర్వ మురళీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్, సెట్ లో తీసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. పల్లెటూరి అమ్మాయిల రెండు జడలతో రెడీ అయిన నటి వెనుకకు తిరిగి నిలబడి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన హరీష్ ఈ అమ్మాయి ఎవరో చెప్పుకోండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్న నటి హీరోయిన్ పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డేనే అంటూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే కొందరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న డింపుల్ హయాతి అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తమిళలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. తమిళ్లో బాబీసింహా నటించిన ప్రతినాయక పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆంచటలు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. Guys See whose on Board ..🤗 pic.twitter.com/kjEzzeGA8l — Harish Shankar .S (@harish2you) July 26, 2019 -
‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద, కంచె, అంతరిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాగే హీరో బాడీ లాంగ్వేజ్ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే వరుణ్ తేజ్, ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయాలని భావించినా.. ఆగస్టు 30 న సాహో ఉండటంతో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
యాక్షన్ థ్రిల్లర్ ‘22’ షురూ..
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముహూర్తపు షాట్కు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ చిత్ర దర్శకుడుకి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హాజరయ్యారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) సి.అశ్వనీదత్, కె.ఎస్. రామారావు, యం.యస్.రాజు, అనీల్ సుంకర, శ్యామ్ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం విశేషం. కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులందరికీ చిత్ర యునిట్ ధన్యవాదాలు తెలిపింది. -
అనంతపురంలో ‘వాల్మీకి’
‘ఎఫ్2’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్లో వరుణ్ లుక్ ఫ్యాన్స్కు షాక్నిచ్చింది. సెలబ్రెటీలు సైతం వరుణ్ లుక్కు ఫిదా అయ్యారు. డీజే లాంటి చిత్రం తరువాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ సూపర్హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగెటివ్ రోల్ చేస్తుండగా.. మరో కీలకపాత్రలో అథర్వా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మూవీకి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అదరగొట్టిన ప్రీ టీజర్.. వరుణ్ లుక్ కేక
‘డీజే’ సినిమాతో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న దర్శకుడు హరీష్శంకర్.. చాలా గ్యాప్ తరువాత మరో రీమేక్పై కన్నేశాడు. తమిళ హిట్ సినిమా జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తూ.. వరుణ్తేజ్ను డిఫరెంట్ రోల్లో చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన వరుణ్ లుక్ వైరల్ కాగ.. తాజాగా ప్రీ టీజర్తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ‘ఎఫ్2’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత వరుణ్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కాసేపటిక్రితమే ప్రీ టీజర్ను రిలీజ్ చేసిన యూనిట్.. సినిమా ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్ వదిలినట్టుంది. వరుణ్ తేజ్ గెటప్తోనే తెలుస్తోంది ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రీ టీజర్తో వరుణ్ తేజ్ పవర్ఫుల్ లుక్ను రిలీజ్ చేశారు.14రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా.. తమిళ హీరో అథర్వ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. -
మాటల్లేకుండా.. ప్రీ టీజర్
ప్రమోషన్స్ను కొత్తపుంతలు తొక్కిస్తేనే.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ ఇలాంటి ట్రిక్కే ఉపయోగిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతోన్న వాల్మీకి చిత్రం నుంచి ఓ మాటల్లేని ప్రీ టీజర్ లాంటిది విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ సూపర్హిట్ మూవీ జిగర్తాండ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈమధ్య షూటింగ్కు వెళ్తున్న వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయినా నిర్విరామంగా ఎటువంటి అంతరాయం లేకుండా షూటింగ్ జరుపుతోంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి ప్రీ టీజర్ను జూన్ 24న సాయంత్రం 5.18గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీంట్లో ఎటువంటి డైలాగ్లు ఉండవని.. ఇంకా రావాల్సినవి ఉన్నాయంటూ హరీష్ ట్వీట్ చేశారు. పూజా హెగ్డే, తమిళ హీరో అథర్వా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. Guys it's just a pre teaser without dialogue .. Much More to come Pretty soon ......#ValmikiPreTeaser #ValmikiOnSep6th — Harish Shankar .S (@harish2you) 22 June 2019 -
‘వాల్మీకి’ ఎప్పుడొస్తున్నాడంటే..?
‘ఎఫ్2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్గా తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. వరుణ్ తేజ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. 14రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ను హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
జూలైలో జాయినింగ్
వాల్మీకి సెట్లో హీరోయిన్ లేకుండా వరుణ్ తేజ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ వాల్మీకి జోడీ జూలైలో ఎంట్రీ ఇస్తారని లేటెస్ట్గా తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మింస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్హిట్ ‘జిగర్దండ’ సినిమాకి రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట. జూలై నుంచి ‘వాల్మీకి’ టీమ్లో జాయిన్ అవుతారట పూజా హెగ్డే. మరోవైపు ఈ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
రూమర్స్పై హరీష్ శంకర్ క్లారిటీ
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ‘దబాంగ్’ రీమేక్ ‘గబ్బర్సింగ్’తో తిరుగులేని హిట్ కొట్టాడు. చివరగా డీజే సినిమాను తీసి పర్వాలేదనిపించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం వాల్మీకి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా హరీష్ శంకర్ పవన్ కల్యాణ్తో సినిమా తీయబోతున్నాడని, అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారని, వాల్మీకి చిత్రంలో పూజాహెగ్డే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వినిపించాయి. వీటిపై హరీష్ శంకర్ సోషల్ మీడియాలో స్పందించాడు. కొన్ని వార్తలు వైరల్ అవుతున్న కారణంగా వాటిపై క్లారిటీ ఇవ్వడం తన బాధ్యత అంటూ.. ‘పూజాహెగ్డే రెమ్యూనరేషన్పై వస్తున్న వార్తలు నిజం కాదు.. మీ అందరికీ తెలుసు నాకు పవన్ కల్యాణ్ను డైరెక్ట్ చేయడం అంటే ఇష్టమని.. అయితే నేను రీసెంట్గా నేను ఆయన్ను కలిసినట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇస్తూ... తన నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ అభిమానులందరూ ఎదురుచూడాలంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే పవన్తో సినిమాతో ఉంటుందా? అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. హరీష్ చెప్పినట్లు.. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఎదురుచూడాల్సిందే. I request all the film lovers to wait for the official announcement either from me or from Production House ... Thank you :) — Harish Shankar .S (@harish2you) May 4, 2019 -
ప్రాణం తీసిన బర్త్డే బంప్స్
-
ఈ తరహా బర్త్డే బంప్లు వద్దురా నాయనా!
సాక్షి, హైదరాబాద్ : బర్త్డేను స్నేహితుల మధ్య కేకు కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇంకాస్త పెద్దగా అంటే ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి విందిస్తాం. కానీ ఈ తరం యువత వినూత్న పోకడలతో బర్త్డే సంబరాలు చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. కేకు కట్ చేసిన అనంతరం ఆ కేకును బర్త్డే బాయ్కి పూయడం, అతని ముఖానికి కొట్టడం వంటివి ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ మధ్య బర్త్డే బాయ్ను చితక్కొట్టె నూతన సంప్రదాయనికి తెరలేపారు. కేకు కట్ చేసిన అనంతరం కిందపడేసి మరి చితకబాదుతున్నారు. ఇలానే రెండు నెలల క్రితం ఐఎమ్ఎమ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచాడు. బర్త్డే సందర్భంగా అతడు స్నేహితులకు పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీలో అతని స్నేహితుల పిచ్చి పీక్స్కు చేరి.. అతన్ని చితక్కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బర్త్డే బాయ్ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. స్నేహితుల దాడిలో అతని క్లోమం పూర్తిగా దెబ్బతినడంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగినా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. భారత మాజీ క్రికెటర్ ఈ తరహా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవద్దని కోరుతూ ఈ వీడియోను షేర్ చేశాడు. ‘ ఇది చాలా బాధకరం. ఓ విద్యార్థి బర్త్డే సంబరాల కారణంగా చనిపోయాడు. ఇది అమానుషమైన దాడి.. ఈ విధంగా ఎవరూ సెలబ్రేట్ చేసుకోవద్దు. దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి. ఈ తరహా బర్త్డే బంప్స్ వద్దు. ఇది ఎవరికి ఫన్నీ కాదు.’ అని పేర్కొన్నాడు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ హరీశంకర్ సైతం ఈ తరహా బర్త్డే సంబరాలను నిషేదించాలని ట్వీట్ చేశాడు. నెటిజన్లు సైతం ఇదెక్కడి బర్త్డే సెలబ్రేషన్స్రా నాయనా అంటూ కామెంట్ చేస్తున్నారు. This is so sad. A student who was given birthday bumps passed away. This is an assault and no way to celebrate. Please be responsible and no birthday bumps ,it isn't funny for anyone. pic.twitter.com/RoOY7hVe9Y — Virender Sehwag (@virendersehwag) May 2, 2019 This is ridiculous one should make a strict rule to ban this kind of celebrations ..... https://t.co/ZVUELvMOnH — Harish Shankar .S (@harish2you) May 1, 2019 -
వరుణ్ ‘వాల్మీకి’ లుక్ ఇదే!
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ రీమేక్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ డిఫరెంట్ మేకోవర్లో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వరుణ్ సినిమాలో లుక్కు సంబంధించి ఓ పోస్ట్ చేసినా అందులో లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ తాజాగా వరుణ్ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సెట్లో ఓ అభిమానితో కలిసి వరుణ్ దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాగా పెరిగిన జుట్టు, గెడ్డంతో వరుణ్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. -
డిఫరెంట్ లుక్లో వరుణ్
వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్రయూనిట్.. నేడు షూటింగ్ను ప్రారంభించింది. నేడు వరుణ్తేజ్పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. వరుణ్ లుక్కు సంబంధించిన ఓ పిక్ను హరీష్ శంకర్ పోస్ట్ చేస్తూ.. ‘వెల్కమింగ్ మై వాల్మీకి.. మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది.. ఇంకా ఇలాంటి రోజుల గురించి చూస్తుంటాను.. దేవీ శ్రీ ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్ సమ్మర్లో టెర్రఫిక్ వర్క్ చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. Welcoming My VALMIKI to the board ... @IAmVarunTej ... such a great first day shoot with you .... looking forward for many more ..... 🤗🤗🤗🤗 and special thanks to @DoP_Bose for the terrific work in this hot summer 🙏🙏🙏 pic.twitter.com/8Pxx6WH5LA — Harish Shankar .S (@harish2you) April 18, 2019