Haritha Haram
-
ఆమే వనమై...
ఎస్.పి గారి డ్యూటీ నేరాలను అరికట్టడం. భూమి మీద చెట్టు చేమా లేకుండా పోయేలా మనిషి వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మించిన నేరం ఉంటుందా? దానినీ అరి కట్టాలి కదా. కామారెడ్డి జిల్లా ఎస్పీగా శ్వేత పనిచేస్తున్న కాలంలో ఒక హరిత వనాన్ని పెంచడం తన కర్తవ్యం అనుకున్నారు. ఆరు ఎకరాల్లో ఎన్నో మొక్కలు నాటించారు. ఇప్పుడది అడవిని తలపిస్తోంది. హరిత రక్షక వనంగా నామకరణం చేసుకుంది.హరితహారం స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగారు అప్పటి కామారెడ్డి ఎస్పీ శ్వేత. కామారెడ్డిలో ఆరు ఎకరాల స్థలంలో 80 రకాలైనవి ఎన్నో మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు ఆమెతోపాటు పోలీసు సిబ్బంది నిరంతరం శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మూడేళ్ల కాలంలో ప్రతీ రోజూ ఎస్పీ శ్వేత అక్కడికి వెళ్లేవారు. జరుగుతున ్న పనులను పర్యవేక్షించేవారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ అక్కడే చేసేవారు. ఈ వనానికి ‘హరిత రక్షక వనం’ అని నామకరణం చేశారు.ఎనభై రకాల మొక్కలు...స్థానికంగా పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు నాటారు శ్వేత. రామ సీతాఫలం, బాదమ్, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, నేరేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మేడి, మునగ, నిమ్మ, ఉసిరి, వెలగ, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచఉసిరి, జిట్రేగి... మొదలైన రకాలకు సంబంధించి ఎన్నో మొక్కలు నాటారు.ప్రతీ మొక్కకు నీరందించడానికి డ్రిప్ ఏర్పాటు చేశారు. అక్కడ రెండు బోర్లు తవ్వించి వాటి ద్వారా నీటిని అందిస్తున్నారు. ‘హరిత రక్షక వనం’లో రెండు నీటి గుంతలు తవ్వించారు. అందులో నీరు నిల్వ ఉండేలా వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పై భాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను పెంచుతున్నారు. నీటిని నిల్వ చేయడం మూలంగా బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఇబ్బంది లేకుండాపోయింది.ఆ శ్రమ వృథా పోలేదు...‘హరిత రక్షక వనం’లో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు శ్రమించారు. ఆ మొక్కలను తమ ఇంటి పెరట్లో నాటిన మొక్కలలాగే చూసుకున్నారు. మొక్కల చుట్టు పెరిగే గడ్డిని తొలగించడం, నీరు మొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం, పనికిరాని చెత్తను తొలగించడంలాంటి పనులెన్నో చేసేవారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తే వారితో మొక్కలు నాటించేవారు. ఆ చెట్లకు వారి పేర్లతో నేమ్ప్లేట్లు ఏర్పాటు చేశారు. ‘చెట్లు అంటే....భూమాత రాసిన కవిత్వం’ అనేది భావుకతతో కూడిన మాటే కాదు బాధ్యతను గుర్తుకు తెచ్చే మాట.వృత్తిబాధ్యత, సామాజిక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ పచ్చటి వనాన్ని సృష్టించడం కష్టమేమీ కాదు అని నిరూపిస్తున్నారు శ్వేతలాంటి అధికారులు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డిమానసిక స్థైర్యాన్ని ఇచ్చారుశాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహరాల్లో బిజీగా ఉంటూనే రకరకాల సామాజిక అంశాలపై స్పందించేవారు శ్వేత. కరోనా కాలంలో పోలీసు సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని కలిగించి ఎంతో మందికి అండగా నిలిచారు. నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించారు. శారీరక« దారుడ్య పరీక్షలకు శిక్షణ ఇప్పించారు.ఇదీ చదవండి: గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్ అమ్మలాంటి చెట్లుకామారెడ్డి జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్థలం కనిపించి నాకు వనం పెంచాలన్న ఆలోచన వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు నిర్మించినపుడు అక్కడ వాతావరణం మారిపోతుంది. చల్లబడాలంటే సమాంతరంగా చెట్లు పెంచాలి. అందుకే 2017 దసరా రోజు నేను, అప్పటి కలెక్టర్ సత్యనారాయణ గారు ఇక్కడ మొక్కలు నాటాం. కామారెడ్డికి పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా వాళ్ళతో అక్కడ మొక్కలు నాటించాను. నాటడంతోపాటు మా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ వాటి సంరక్షణకు నిరంతరం శ్రమించారు. అక్కడి ఉసిరి చెట్టు దగ్గర మా అమ్మ ప్రతీ కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. నేను బదిలీ అయినా ఒక అమ్మలా ఆ చెట్టు గుర్తుకొస్తూ ఉంటుంది. – ఎన్. శ్వేత, ఐపీఎస్ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి! -
‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది
చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ● భద్రాచలం డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్ ఆఫీసర్తో పాటు, ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● అదే ఏడాది జూన్లో అశ్వాపురం రేంజ్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● ఇల్లెందు రేంజ్ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్మాల్ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్తోపాటు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్ ఇరవెండి పరిధి లో జామాయిల్ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ఉపేక్షించేది లేదు అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, డీఎఫ్ఓ -
మొక్కలపై శ్రద్ధేది?
వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు రూ.5లక్షలు ఖర్చు చేసి గత ఏడాది మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున కుండీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వాటి రక్షణకు ఎంతో శ్రద్ద చూపిన మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కూడా నీరు పోయడం లేదని స్థానికులు అంటున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేయాలి. అయితే బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు 53 మొక్కలు పూర్తిగా ఎండి పోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోగా, ఉన్న వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
‘హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులేశారు’
సాక్షి, రంగారెడ్డి: హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారాయన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉంది. గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకుంది. కానీ, ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత నాది. అలాగే గోదావరి నీటిని గండిపేట, హిమాయత్ సాగర్కు లింక్ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి త్వరలోనే నీళ్లు అందిస్తాం. మహేశ్వరం నియోజకవర్గానిక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు సైతం తీసుకుంటామన్నారాయన. ఇదీ చదవండి: మాజీ ఎంపీల భేటీ.. రోజంతా హడావిడి! -
‘హరితం’లో ప్రథమం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కారాలకు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హరితహారం పచ్చదనం విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాల పంపిణీలో రెండో స్థానం లభించింది. మూడున్నరేళ్ల కాలంలో అనేక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. ముఖ్యంగా పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగులో పేరుకుపోయిన పూడిక తొలిగించి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీరు చేరకుండా చేశారు. బుగ్గవాగును క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో దోమల బెడద తొలిగిపోయింది. కాగా, వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని శిల్పారామంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం అవార్డు అందుకోనున్నారు. పలు సమస్యలు పరిష్కారం.. కోరగుట్ట భగీరథ ట్యాంక్ నుంచి ఇందిరానగర్, ఫైర్ స్టేషన్, జగదాంబ సెంటర్, కోర్టు ఏరియాల్లో వేసవికాలం మినహా రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. మున్సిపాల్టీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంప్యార్డుకు చేరుస్తున్నారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లను శుభ్రం చేశారు. తద్వారా దుర్వాసన సమస్య పరిష్కారం అయింది. పట్టణంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను కూల్చేశారు. రైల్వే పట్టాల వెంట గల ఖాళీ స్థలం, పురాతన భవనాలను తొలిగించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలను స్వాధీనం చేసుకుని వివిధ మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్లు నిర్మించారు. ఆరు జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, ఆయా బస్తీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అంధకార సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన మహబూబాబాద్ క్రాస్రోడ్, గోవింద్ సెంటర్, కొత్తబస్టాండ్, బుగ్గవాగు, పాత బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, జగదాంబా సెంటర్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలక వర్గం అధికారంలోకి వచ్చాక పట్టణంలో మోడల్ మార్కెట్, మల్టీయుటిలిటీ సెంటర్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్ సెంటర్, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజావసర పనులు చేశారు. కేటీఆర్ ప్రోత్పాహంతో ముందడుగు ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, ఎమ్మెల్యే హరిప్రియ, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారం మరువలేనివి. పట్టణాన్ని అన్ని విధాలా అగ్రభాగంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేస్తోంది. మాతోపాటు కార్మికులు, సిబ్బంది, అధికారుల సమష్టికృషితో ఆక్రమణల తొలగింపు, బుగ్గవాగు క్లీనింగ్, ఆంబజార్ రోడ్ నిర్మాణం.. ఇలా రూ.153 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. – డి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ -
‘హరితహారం’ తరహాలో తమిళనాడులో ‘గ్రీన్మిషన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ‘హరితహారం’కార్యక్రమం అధ్యయనానికి సుప్రియా సాహు నేతృత్వంలో తమిళనాడు అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులోభాగంగా శనివారం అరణ్యభవన్లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ ఎ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ఎనిమిదేళ్లుగా అమలు చేస్తూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని సాహు కొనియాడారు. నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు బాగుందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం బాగుందని అభినందించారు. పర్యటనలో సాహు తీసిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సాçహు వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు పాల్గొన్నారు. -
Haritha Haram: పోడు రైతుకు హరితహారం గండం
పోడు రైతుకు హరిత గండం ముంచుకొస్తోంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు... వామపక్షాల మద్దతుతో తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి స్వరాష్ట్రం తెలంగాణ వరకు పోడు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్లు కొడుతుండటంతో పోడు రైతులు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో వారిపై ప్రతియేటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తరతరాలుగా అడవిని ఆధారం చేసుకొని బతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమవుతున్నారు. అడవికీ, ఆదివాసీకీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. అడవుల్లోని ప్రతి చెట్టూ ఆదివాసీలకు పూజనీయమే. అనేక చెట్లూ, జంతువులూ ఆదివాసీల తెగలను సూచిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ అడవీ, అడవిలోని జంతుజాలమూ సురక్షితంగా తమ తరువాతి తరాలకు అందాలని ఆదివాసీలు ప్రగాఢంగా కోరుకుంటారు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసీల అభిప్రాయాలను గౌరవిస్తూ... వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనీ, గ్రామసభల ద్వారా చేసిన తీర్మానాలూ, అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవినీ, ఆదివాసులను పరిరక్షించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ నేడు అటవీశాఖ అధికారులూ, పోలీసులూ రాజ్యాంగ నిర్దేశాలను తుంగలో తొక్కి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి, ఏళ్లుగా పరిష్కారం కాని ఆదివాసీ గిరిజనుల భూములకు పోడు పట్టాలు అందించాలి. అçప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది. – జటావత్ హనుము, హైదరాబాద్ -
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్బెల్ట్ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్
శంషాబాద్ రూరల్: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, నవీన్రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రియల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ‘సేవ్ సాయిల్’ పోస్టర్లను ఆవిష్కరించారు. -
హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 19.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది హరితహారాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎనిమిదో విడత హరితహారం కింద సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాల్వ గట్లపై పచ్చదనం పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారంలోగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళితబంధు, యాసంగి వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్దఎత్తున పచ్చదనం పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,400 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపునకు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితబంధు గురించి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిన యూనిట్లకుగాను లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించినవారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలి్పంచాలి ధాన్యం సేకరణ గురించి సోమేశ్ కుమార్ మాట్లాడుతూరాష్ట్రంలో ఏడు కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్ల బ్యాగులు త్వరలో వస్తాయని చెప్పారు. అన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్, పురపాలక శాఖ, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరి్వంద్కుమార్, రామకృష్ణారావు, రజత్కుమార్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త పీసీసీఎఫ్గా డోబ్రియల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎం డోబ్రియల్కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. హరితహారం అమల్లో గత ఆరేళ్లుగా కీలక బాధ్యతలతో పాటు ప్రస్తుత ఉన్నతా ధికారుల్లో సీనియర్గా ఉండడంతో ప్రభుత్వం డోబ్రియల్ను పీసీసీఎఫ్గా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాలు పూర్తయ్యాక ఆయన పూర్తి స్థాయి పీసీసీఎఫ్గా కొనసాగే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా మొదటి పోస్టింగ్ పొందారు. 1991 –94 వరకు భద్రాచలం డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదా లో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్గా పదోన్నతి పొందాక అదనపు కార్య దర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. అనంతరం స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ చాన్స్లర్గా పనిచేశారు (2003–14). తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్గా నియమితులైన డోబ్రియల్ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పదవీ విరమణ చేసిన పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు. -
Telangana: పోడుపై బహుముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎలా ముందుకెళ్లాలి? పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు. పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటవీ అంచున కేటాయింపు! అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 3,31,070 ఎకరాలు ..లక్ష మందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి. 2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు. -
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకోసం యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసర ముందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో ఎమెస్కో బుక్స్ ప్రచురించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు’– పల్ల వెంకన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా పల్ల వెంకన్న కుటుంబ సభ్యులకు, ప్రచురణకర్తలకు, పుస్తక రచయిత వల్లీశ్వర్కు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పల్ల వెంకన్న శక్తి అసాధారణమైనదని, ఐదో తరగతి వరకే చదువుకున్నా, శరీరం పూర్తిగా సహకరించని పరిస్థితుల్లో ఉన్నా ప్రకృ తి విజ్ఞానాన్ని ఔపోసన పట్టి వృక్ష శాస్త్రవేత్తలకు సైతం సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పర్యావరణం– ప్రగతిని సమ న్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పల్ల వెంకన్న తన దివ్యాంగత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడ్డారని, ఆ నిబద్ధతే అర ఎకరా నర్సరీని 40 నుంచి 50 ఏళ్ళలో వం దెకరాల స్థాయికి చేర్చిందని తెలిపారు. వెంకన్న దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, ఎమెస్కో బుక్స్ సీఈవో విజయకుమార్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
ఇటు హరితహారం... అటు హననమా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు చెట్లను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్య క్రమం చేపడుతుండగా.. మరోవైపు రవీంద్రభారతి ఆవరణలో రెండు భారీ వృక్షాలను కొట్టేయడానికి ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుకు సమీపంలో లేకపోగా.. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా కళాభారతి భవనం వెనుక ఉన్న ఈ వృక్షాలను ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించింది. ఆ రెండు వృక్షాలను కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు భారీ వృక్షాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొట్టేయకుండా చూడాలంటూ తాము వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదంటూ అదే ప్రాంత నివాసి, సామాజిక కార్యకర్త డబ్ల్యూ.శివకుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. కళాభారతి భవనం పశ్చిమ భాగంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న 50 ఫీట్లకుపైగా ఎత్తున్న రావిచెట్టు, మలబార్ వేప వృక్షాలు ఉన్నాయని, ఈనెల 18న వీటి కొమ్మలను కొట్టేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డేపల్లి రచన తెలిపారు. ఈ మేరకు పిటిషనర్ అక్కడ సిబ్బందిని ఆరా తీయగా ఈ రెండు చెట్లను కొట్టేస్తున్నట్లు తెలిపారన్నారు. ‘ఈ వృక్షాలు ప్రజల ప్రాణాలకుగానీ, భవనాలకు గానీ నష్టం కల్గించే పరిస్థితి లేదు. భవనాల మధ్య ఉండటంతో భారీ గాలి వీచినా కూలిపోయే పరిస్థితి లేదు. భారీ వృక్షాల కొమ్మలను కొట్టివేయాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి. వృక్షాలను పూర్తిగా తొలగించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా వృక్షాలను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించకుండా ఆదేశించండి’అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. -
ఈ మొక్కకు ఓ లెక్క ఉందండోయ్
కరీంనగర్రూరల్: తెలంగాణకు హరితహారంలో భాగంగా జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో రెండేళ్ల నుంచి నాటిన మొక్కలపై అటవీశాఖ ఆద్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని15 మండలాలతోపాటు జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఈ నెల 1నుంచి మొక్కలను లెక్కించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని మొక్కల వివరాలను ఈ నెల 15వరకు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. జిల్లావ్యాప్తంగా 148 ప్రాంతాల్లో సర్వే 2019,2020 సంవత్సరాల్లో నాటిన మొక్కలను సమగ్రంగా సర్వే చేసేందుకు వీలుగా జిల్లాలో 148 ప్రాంతాలను ఎంపిక చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ ఆధ్వర్యంలో సర్వేబృందాలను ఏర్పాటు చేసి మొక్కలను లెక్కిస్తున్నారు. రెండేళ్లలో నాటిన మొత్తం మొక్కల్లో ఒకశాతం చొప్పున సర్వే చేస్తున్నారు. 2019లో 85,363 మొక్కలు, 2020లో 52,164 కాగా.. జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో 3,747 మొక్కలు తనిఖీ చేస్తారు. కరీంనగర్ రేంజ్లోని కరీంనగర్ మండలం, కొత్తపల్లి మున్సిపాలిటీకి మహ్మద్ మునీర్ అహ్మద్, చొప్పదండి మండలానికి వీవీ భరణ్, గంగాధర మండలానికి కిరణ్మయి, రామడుగు మండలానికి సుజాత, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాలకు చైతన్య, హుజూరాబాద్ రేంజ్లో ఎఫ్ఆర్వోలు రాజేశ్వర్రావు,ఎల్లయ్య, సరిత, బీర్బల్, పూర్ణిమల ఆద్వర్యంలోని 10 బృందాలు సర్వే చేస్తున్నాయి. మొక్కల సమాచారం ఆన్లైన్లో నమోదు ఆయా ప్రాంతాల్లో సర్వే బృందాల ప్రతినిధులు స్థానిక గ్రామపంచాయతీల కార్యదర్శుల సహకారంతో మొక్కల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. నాటిన మొక్కల్లో ఎండిపోయిన, బతికిన మొక్కలు, ఒకే వరుసలో ఉన్న మొత్తం మొక్కలు, వాటిఎత్తు వివరాలను సేకరిస్తున్నారు. రహదారులకు రెండువైపుల నాటిన మొక్కలను వందశాతం లెక్కించడంతోపాటు గృహాల్లో నాటిన మొక్కలను 10శాతం లెక్కిస్తున్నారు. ప్రతి రోజు మొక్కల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో పూర్తి చేసి టీజీఎఫ్ఐఎంఎస్లో నమోదు చేస్తున్నట్లు కరీంనగర్ ఎఫ్ఆర్వో శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో మొక్కల సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్ -
వారి ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది: ఎంపీ సంతోష్
సాక్షి, మెదక్: హరితహారానికి మేముసైతం అంటున్నారు రేపటి పౌరులు. నాటిన మొక్కలు ఎండిపోకుండా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటాకింద బస్తీ పిల్లలు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపరుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్కు డబ్బాకట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకూ నీళ్లు పోస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలోకి తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు నీరందిస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ప్రాణవాయువుతో పాటు నీడనూ ఇస్తాయని వారు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంపీ సంతోష్ అభినందనలు.. వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. Gives me immense pleasure to see these little hearts from Veldurthi(V) of Medak, taking care of the saplings. Look at their enthusiasm and love for the plants. It is very much required for today’s generation for their better future with sustainable environment. LoveYou boys. 👌😊 pic.twitter.com/xEwshTvVjK — Santosh Kumar J (@MPsantoshtrs) August 5, 2021 -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారాలు–2021కు పాఠశాల విద్యా శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అన్నిరకాల స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, ఐఏఎస్ఈ, డైట్కు చెందిన ప్రిన్సిపాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్) తదితరులకు ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత గ్రేడ్ కలిగిన హెడ్ మాస్టర్లకు కనీసం 15 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఉపాధ్యాయులకు పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సాధారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులు కాదు. కానీ కొన్ని ప్రత్యేకతలున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఏఎస్ఈ, డైట్, సీటీఈఎస్లో పనిచేసే లెక్చరర్లు లేదా సీనియర్ లెక్చరర్లకు కనీసం పదేళ్ల బోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పరిగణనలోకి ‘హరితహారం’.. హరితహారం కార్యక్రమంలో అత్యుత్తమ కృషి సాధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను పరిగణనలోకి తీసుకుంటారు. 2019–21 మధ్య కాలంలో పాఠశాలల్లో చేపట్టిన హరితహారం మొక్కల మనుగడను పరిగణిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పేర్లను ఖరారు చేస్తాయి. ప్రతి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు.. జిల్లా స్థాయి ఎంపిక కమిటీలో కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్, మరో జిల్లా స్థాయి అధికారి ఉంటారు. జిల్లా నుంచి ఈ కమిటీ మూడు పేర్లు ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్ ఉంటారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు సిల్వర్ మెడల్ (గోల్డ్ ప్లేటెడ్), శాలువా, రూ.10 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను జిల్లా కమిటీలు వచ్చే నెల 10 లోపు రాష్ట్ర కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయా పేర్ల నుంచి జ్యూరీ కొందరిని ఎంపిక చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను ఖరారు చేస్తుంది. మొత్తంగా వివిధ కేటగిరీల్లో 43 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. -
రికార్డు: గంటలో 3.5 లక్షల మొక్కలు నాటారు!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి బి.నరేందర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్ను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రకృతి సహజంగా ఆక్సిజన్ అందించేందుకు తన పుట్టినరోజు సందర్భంగా మిలియన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. -
Photo Feature: నకిలీ టీకా.. నిరసన బాట
వర్షాల కారణంగా వచ్చి చేరుతున్న నీటితో తెలుగు రాష్ట్రాల్లోని చెరువులు, చెలమలు జలకళ సంతరించుకున్నాయి. నీటి ప్రవాహంతో వాగులు కళకళలాడుతున్నాయి. కోవిడ్ టీకాలకూ నకిలీల బెడద తప్పడం లేదు. ఫేక్ వ్యాక్సిన్ల బారి నుంచి ప్రజలను కాపాడాలని పాలకులను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కారణంగా అమర్నాథ్ వార్షిక యాత్ర రద్దు కావడంతో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు పడుతుండటంతో తెలంగాణలో ‘హరితహారం’ సందడి మొదలయింది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన
భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్గా మారిన గ్రీన్ ఛాలెంజ్.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్లైన్ యాప్, వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఇప్పటికే వాట్సప్ నంబర్ 9000365000, ఇగ్నైటింగ్ మైండ్స్ మొబైల్ యాప్ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ప్రభాస్ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు. సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్ ఛాలెంజ్.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్ జన్మదినం) వ్యాసకర్త ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు ఎం. కరుణాకర్రెడ్డి మొబైల్ : 98494 33311 -
మొక్కలు నాటిన సినీ నటుడు సామ్రాట్
-
జంగల్ బచావో.. జంగల్ బడావో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలతో భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా మార్చే లక్ష్యాలతో హరితహారం అమలవుతోంది. రాష్ట్రాన్ని పర్యావరణహితంగా మలచుకోవాలనే ఆకాంక్షలోంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ఐదు విడతలు పూర్తి చేసుకుని, ఆరవ విడతలోకి అడుగుపెడుతోంది. ఇందులో ప్రజలంతా పాల్గొని మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో కేసీఆర్ మొక్కలు నాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి పెరుగుతుండటంతో ఈ కార్యక్రమం కొనసాగింపులో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్లు ధరించడంతోపాటు నాటే ఒక్కో మొక్క దగ్గర ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తుల మధ్య ఆరడుగుల దూరాన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ జిల్లాలోని నర్సరీలు, వాటిల్లో లభిస్తున్న మొక్కల సంఖ్య, రకాలు, ఆయా నర్సరీల సమాచారంతో డైరెక్టరీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడాది దాదాపు 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విడత హరితహారం ప్రత్యేకతలు... ► జంగల్ బచావో.. జంగల్ బడావో (అడవిని కాపాడుదాం.. అడవిని విస్తరిద్దాం) నినాదం. ► వర్షాలకు అనుగుణంగా జిల్లాల్లో కొనసాగింపు. ► టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం. ► ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం. ► హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్లు, జీహెచ్ఎంసీలో 2.5 కో ట్లు. మిగతా పట్టణప్రాంతాల్లో 5 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ► పట్టణ ప్రాంతాలకు సమీప అడవుల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు. ► స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్లు, కేంద్ర సంస్థల్లో హరితహారం. ► ప్రతీ ఊరికో చిన్న పార్కు ఏర్పాటు. ► ప్రతీ నియోజకవర్గంలో ఉన్న అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు విధులు ► ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వడం, బాధ్యతగా పెంచేలా పంచాయతీల పర్యవేక్షణ. ► కోతుల బెడద నివారణకు 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళిక. ► గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పు చేయటం. ► ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత, రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపు. ► కేంద్ర ప్రభుత్వ వెదురు ప్రోత్సాహక సంస్థ సహకారంతో చిన్న, సన్నకారు రైతుల్లో వెదురు పెంపకానికి ప్రోత్సాహం. ► హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేక హరితహారం. 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల అభివృద్ధి. ► హైవేలు, రాష్ట్ర రహదారుల వెంట 30 కిలోమీటర్లకో నర్సరీ. -
గ్రేటర్లో జపాన్ మియా వాక్
మియావాకీ..తక్కువ విస్తీర్ణంలోనే పెరిగే పచ్చని వనం..జపాన్లోని ప్రత్యేక విధానం!. నగరంలో రోజురోజుకూ హరించుకుపోతున్న లంగ్స్పేస్ను పెంచేందుకు ఈసారి హరితహారంలో ఈ విధానానికి ప్రాధాన్యమివ్వనున్నారు.నగరవ్యాప్తంగా వీలైనన్ని చోట్ల ఈ వనాలను పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్న హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ హరితహారం లక్ష్యం 50 లక్షల మొక్కలు. ఖాళీ ప్రదేశాలతోపాటు ఈసారి ఎక్కువగా రోడ్లు, చెరువు గట్లు, బఫర్జోన్లు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీటితోపాటు మూసీ వెంబడి గ్రీనరీ పెంచేందుకు దాని పొడవునా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్గా మారిన గ్రేటర్ నగరంలో లంగ్స్పేస్ పెంచేందుకు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ పద్ధతి మియావాకీకి ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మార్గాల్లోని మేజర్ రోడ్లు, మైనర్ రోడ్లలో అవకాశమున్న అన్ని చోట్లా మొక్కలు నాటుతారు. కాలనీల్లోని రహదారుల్లోనూ స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో మొక్కలు నాటనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో వీలున్న ప్రాంతాల్లోనూ, గతంలో నాటిన మొక్కలు బతకని ప్రాంతాల్లోనూతిరిగి మొక్కలు నాటనున్నారు. అన్ని జోన్లలో.. జీహెచ్ఎంసీ లోని ఆరు జోన్లలోనూ ఈవిధానాన్ని అమలు చేయడంతోపాటు జోన్ల పరిధిలో ఈసారి అవెన్యూ ప్లాంటేషన్లు, గ్రీన్కర్టెన్లు వంటì వాటికి శ్రద్ధ చూపుతున్నారు. ఖాలీ ప్రదేశాలున్న ప్రాంతాల్లో ట్రీపార్కులుగా తీర్చిదిద్దడంతోపాటు అక్కడ వాకింగ్ ట్రాక్లు, తదితరసదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ల కింద, మీడియన్లలో తక్కువఎత్తుతో ఉండే ప్రత్యేక మొక్కలు నాటనున్నట్లు అడిషనల్ కమిషనర్ క్రిష్ట (బయోడైవర్సిటీ) క్రిష్ణ తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల కనుగుణంగా నగరంలో పచ్చదనాన్ని పెంచి, కాలుష్యాన్ని నియంత్రించి, ఉష్ణోగ్రతలు తగ్గించి, ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించేకు ప్రతియేటా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హరితహారం కోసం జీహెచ్ఎంసీ ఆయా నర్సరీల్లో మొక్కల్ని సిద్ధం చేస్తోంది. మియావాకీ అంటే.. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్కు చెందిన బొటానిస్ట్ అకీరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది. సూరారం, మాదన్నగూడ, నాదర్గుల్లలో అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయనున్నారు. అక్కడ మియావాకీ విధానాన్ని అమలు చేయనున్నారు. నగరవ్యాప్తంగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
యుద్ధప్రాతిపదికన మొక్కల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో పట్టణాల్లో హరితహారం నిర్వహణపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణలనుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్ల లోని 188 ఫారెస్ట్ బ్లాక్లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతీ చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ ద్వారా కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరుప్రక్కల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్ల వెంట నాటాలన్నారు. మెట్రో కారిడార్ల ఇరుప్రక్కలు, మీడియంలు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించాలన్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, అటవీ శాఖల ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.క్యాంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల అభివృద్ధికి గాను కేంద్రానికి పంపడానికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల కోసం క్యాంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్ బ్లాక్ల భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, డీఎఫ్ఓ, సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్ బ్లాక్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్ తెలిపారు. -
హరితహారం సంతృప్తినిచ్చింది
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్గా 36 ఏళ్ల పాటు వివిధ శాఖల్లో పనిచేయడంతో పాటుగా ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేశ్వర్ తివారీ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా అరణ్యభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ.. హరితహారం రూపకల్పనలో భాగస్వామ్యం కావడం తన సర్వీసులో అత్యంత సంతృప్తినిచ్చిన విషయమని చెప్పారు. హరితహారం కార్యక్రమం ఐదేళ్లుగా విజయవంతంగా అమలు కావటం తన సర్వీస్ మొత్తంలో సంతోషాన్ని ఇచ్చిన విషయమని చెప్పారు. తివారీతో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్తో సహా కర్నూలు జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన తివారీ, ప్రభుత్వంలో రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎఫ్.డీ.సీ ఎం.డి రఘువీర్, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ 'వనం'
పర్యావరణ హితం కోరి తమ వంతుగా మొక్కలను నాటే కార్యక్రమాలను చాలా మంది చేపడుతుంటారు. ఆ తర్వాత ఆ మొక్కల సంరక్షణగాల్లో దీపంలాగే ఉంటుంది. కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే అనేక సామాజిక అంశాలపైనా స్పందిస్తున్నకామారెడ్డి జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు సిబ్బంది కలిసి ఓ వనాన్నే ఏర్పాటుచేశారు. ఆరెకరాల స్థలంలో 80 రకాలైన 3,500 మొక్కలు నాటి వాటినిసంరక్షించడం ద్వారా ఇప్పుడు అడవిని తలపిస్తున్నారు. ప్రకృతికీ రక్షణగాఉన్నామంటూ తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం కోసం పట్టణ శివార్లలో 31.30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆరు ఎకరాల స్థలాన్ని ఎస్పీ శ్వేత మొక్కల పెంపకం కోసం ఎంపిక చేసి, మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు నిరంతరం ఆమెతో పాటు పోలీసు సిబ్బందీ శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దయ్యాయి. ఈ స్థలంలో హరితహారం కింద మొక్కలు నాటాలని సంకల్పించిన ఎస్పీ శ్వేత అప్పటి కలెక్టర్ సత్యనారాయణతో చర్చించారు. నీటి సౌకర్యం కల్పిస్తే వనాన్ని సృష్టిస్తానని మాటిచ్చారు. కలెక్టర్ తన నిధుల నుంచి రూ.2.18 లక్షలు విడుదల చేసి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారు. డ్రిప్ సౌకర్యమూ కల్పించారు. దీంతో జిల్లా ఎస్పీ శ్వేత ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల సాయంతో మొక్కలు నాటి, వాటిని కాపాడేందుకు శ్రమించారు. మూడేళ్లుగా.. ప్రతీ రోజూ ఎస్పీ రక్షకవనానికి వెళుతూ అక్కడి పనుల్లో భాగమవుతున్నారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ కార్యక్రమాలు పోలీసులు ఇక్కడే చేస్తుంటారు. ఈ వనానికి హరిత రక్షక వనం అన్న నామకరణ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీస్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, విప్ గంప గోవర్దన్లతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతను ‘వనదేవత’గా పోలీసు సిబ్బంది కొనియాడారు. భూమిని చదును చేసిమొక్కలు నాటుతున్న పోలీసు సిబ్బంది (ఫైల్) 80 రకాల మొక్కలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు .. రామ సీతాఫలం, బాదం, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, మారేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మామిడి, మేడి, మునగ, నిమ్మ, పసన, ఉసిరి, వెలగ, మారేడు, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచ ఉసిరి, జిట్రేగి తదితర రకాలకు సంబంధించి 3,500 మొక్కలు నాటారు. వనంలో నీటి గుంతలు ఈ వనంలో రెండు నీటి గుంతలు తవ్వించి, అందులో నీరు నిల్వ ఉంచుతున్నారు. వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పైభాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను వదిలారు. నీటి నిల్వ వల్ల బోరుబావుల్లో భూగర్భజలానికి ఇబ్బంది లేకుండాపోయింది. హరితవనంలో తవ్విన నీటి గుంత అందరి సహకారం హరిత హారం స్ఫూర్తితోనే పర్యావరణ పరిరక్షణకు పోలీసు శాఖ ఏదైనా చేయాలని భావించాను. ఆ ఆలోచనలోంచి వచ్చినదే హరిత రక్షక వనం. మట్టిదిబ్బలు, రాళ్లతో నిండి ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని చదును చేసి అందులో మొక్కలు నాటాలని సంకల్పించాను. ఆ రోజు కలెక్టర్ సత్యనారాయణ గారిని నీటి వసతి కల్పించాలని కోరిన వెంటనే మంజూరు చేశారు. డ్రిప్ సౌకర్యం కూడా కల్పించారు. ఇక మా ఏఆర్ పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది అందరం కలిసి మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంలోనూ అందరం శ్రమించాం. అందరి శ్రమకు తగ్గట్టుగానే ఇప్పుడు అడవిగా మారింది. మరో రెండు, మూడేళ్లలో మరింత వృద్ధి్ద చెందుతుంది.– ఎన్.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి పోలీసుల శ్రమ ఈ వనంలో రోజూ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు శ్రమిస్తారు. మొక్కలు నాటిన నాటి నుంచి రోజూ పర్యవేక్షిస్తున్నారు. మొక్కల చుట్టూ పెరిగే కలుపు తొలగించడం, నీరు మొక్కమొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం,పనికిరాని చెత్తను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఏఆర్ పోలీసుల శ్రమకు ఫలితం దక్కింది. వారి నిరంతర శ్రమతో ఇప్పుడు ఈ ప్రాంతం అడవిగా మారింది.– సేపూరి వేణుగోపాలాచారి,సాక్షి, కామారెడ్డిఫొటోలు: అరుణ్ -
పెద్ద మొక్కలు అందుబాటులో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా నాటేందుకు వీలైనంత పెద్ద మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశించారు. ఇప్పటికే నాటిన మొక్కలు చనిపోయిన చోట్ల పెద్ద మొక్కలతో వెంటనే మార్పు చేయించాలని, ఈ విషయంలో నోడల్ అధికారుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని, వారే బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో రెండో విడత పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అరణ్య భవన్లో తెలంగాణకు హరితహారం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్యయ కమిటీ సమావేశంలో హరితహారం అమలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. మొదటి విడత పల్లె ప్రగతి జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితిని జిల్లాల వారీగా అధికారులు ఆరాతీశారు. నాటిన మొక్కలు బతికిన శాతం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, రానున్న రోజుల్లో నీటి సౌకర్యం, రక్షణ చర్యలు, రానున్న సీజన్లో నాటాల్సిన మొక్కల కోసం నర్సరీల్లో ఏర్పాట్లపై చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రస్తుతం గ్రీనరీ బాగుందని, మరింతగా పచ్చదనం ఔటర్ చుట్టూ పెరిగేలా హెచ్ఎండీఏ దృష్టి పెట్టాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్తో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
2.5 ఎకరాలు..లక్ష మొక్కలు
గచ్చిబౌలి: జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకిర మియవాకి అందించిన సాంకేతిక సహకారంతో జీహెచ్ఎంసీ అధికారులు మియవాకి అడవులను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో మియవాకి కోసం వెస్ట్ జోనల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భూసారం పెంపొందించే ప్రక్రియ పూర్తి కాగా, మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జపాన్లోనిహిరోషిమా యూనివర్సిటీ శాస్త్రవేత్త అకిరా మియవాకి స్థానిక జాతుల మొక్కలతో సహజ అడవులను పురుద్ధరించడంపై అధ్యయనం చేశారు. ఈ నేపథ్యలో పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై మొక్కలు నాటి అడవులుగా తీర్చిదిద్దారు. బెంగళూర్, చెన్నై, మహరాష్ట్ర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా మియవాకి అడవులను పెంచారు. తెలంగాణలోనూ ఈ తరహా అడవులను నెలకొల్పేందుకు ప్రయోగాత్మకంగా హెచ్సీయూలో సన్నాహాలు చేపట్టారు. 20 వేల ఆయుర్వేద మొక్కలు 2.5 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గుంతలు తవ్వే పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 35 వేల మొక్కలు నాటనున్నారు. అనంతరం మూడు నెలల తర్వాత రెండో దశలో మరో 35 వేల మొక్కలు నాటుతారు. ఆ తర్వాత మరో మూడు నెలలకు మరో 30 వేల మొక్కలు నాటుతారు. బోరులో నీరు పుష్కలంగా ఉన్నందున కాల్వల ద్వారా నీటిని అందించనున్నట్లు వెస్ట్ జోనల్ యూబీడీ అధికారులు తెలిపారు. 67 రకాల మొక్కలు సిద్ధంగా ఉంచామని, 80 వేల మొక్కలు స్థానిక అడవి జాతి మొక్కలు కాగా, 20 వేల అయుర్వేద మొక్కలు నాటనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి పర్యావరణ పరిరక్షణకు మియవాకి అడవుల అభివృద్ధి ఎంతో అవసరం. వర్షాభావ పరిస్థితులతో పాటు కాలుష్యం సమస్య నానాటికి ఆందోళనకరంగా మారుతోంది. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు అడవులను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలలో ఈ తరహా అడవులను నెలకొల్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ త్వరలో మియవాకి సాంకేతికతతో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – హరిచందన దాసరి, వెస్ట్ జోనల్ కమిషనర్ భూసారం పెంపు ఇలా.. ♦ హెచ్సీయూలో మియవాకి అడవుల కోసం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో ఐదు అడుగుల మేర మట్టిని పూర్తిగా తొలగించారు. అందులో ఎర్ర మట్టి, కొబ్బరి పీచు, వరి పొట్టు, పశువుల, మేకల ఎరువు, వేప పిండితో నింపారు. కొబ్బరి పీచు, వరి పొట్టు తేమను ఎక్కువ రోజులు కాపాడతాయి. ఇందులో ఎలాంటి రసాయనాలు వాడటం లేదు. ♦ 7 మీటర్ల వెడల్పులో గుంతలు తవ్వి మొక్కలు నాటుతారు. మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలి ఏడు మీటర్లు వెడల్పులో మళ్లీ మొక్కలు నాటుతారు. ♦ ఖాళీ స్థలంలోనే కాల్వలు చేసి నీటిని పారిస్తారు. ♦ నీటి కొరత ఎదురైతే డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. ♦ ఒకే గుంతలో 8 నుంచి 12 మొక్కలు నాటుతారు. ♦ మొక్కకు మొక్కకు చాలా తక్కువ దూరం ఉండటంతో సూర్యరశ్మి కోసం అవి పోటీపడతాయి. ఈ క్రమంలో కొన్ని మొక్కలు ఎండిపోయేందుకు అవకాశం ఉంటుంది. ♦ రెండేళ్ల అనంతరం అది చిట్టడవిగా మారడంతో నీటిని పారించాల్సి అవసరం ఉండదు. -
'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ
తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర అతిథులకు తెలియజేయాలనే భావనతో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ అధ్వర్యంలో లండన్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. హరితహారం, చేనేతకు చేయూత, కాకతీయ కళాతోరణం వంటి కళాకృతుల ప్రత్యేకతతో తెలంగాణ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. లండన్లోని భారత హైకమిషన్, దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 'ఇండియా డే వేడుకలకు' టాక్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత, చరిత్ర, బాషా-సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించి హాజరైన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, సాధించిన విజయాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్టాల్ని ఏర్పాటు చేశామని సంస్థ కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు. చేనేతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను, టాక్ సంస్థ తన ప్రదర్శనలో ఉంచి వేర్ హ్యాండ్లూమ్, వీ సపోర్ట్ వీవర్స్ వంటి హ్యాష్టాగ్లను ప్రతిజ్ఞ మాదిరిగా ఫ్రేమ్లో ఉంచి వారి మద్దతును కోరారు. అలాగే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్త కార్యక్రమాన్ని కూడా తెలంగాణ స్టాల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక ప్రతిజ్ఞతో కూడిన సెల్ఫీ ఫ్రేమ్ను ఏర్పాటు చేసి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించామని టాక్ కార్యదర్శి నవీన్ రెడ్డి తెలిపారు. స్టాల్ను సందర్శించిన భారత హై కమిషనర్ రుచి ఘనశ్యామ్, భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు ఎంపీ సంతోష్ కృషిని అభినందించి సెల్ఫీ దిగి తమ మద్దతును తెలియజేశారు. స్టాల్లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు, తెలంగాణ ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. కాకతీయ కళాతోరణం ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ గొప్పతనం విదేశీగడ్డపై ఉట్టిపడేలా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా నిర్మించిన టాక్ ముఖ్య నాయకులు మల్లారెడ్డిని హై కమిషనర్ రుచి ఘనశ్యామ్, కార్యదర్శి నారంగ్ ప్రత్యకంగా ప్రశంసించారు. టాక్ సభ్యులు భారత హై కమిషనర్ రుచి ఘనశ్యామ్ని తెలంగాణ చేనేత శాలువతో సన్మానించారు. టాక్ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ స్టాల్ని సందర్శించిన అతిథులందరికి మన హైదరాబాద్ బిర్యానీ రుచిచూపించామని నాయకులు రాకేష్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, జాయింట్ సెక్రటరీ నవీన్ రెడ్డి, ఈవెంట్స్, కల్చరల్ ఇన్ఛార్జి అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, సత్య చిలుముల, స్పోర్ట్స్ సెక్రటరీలు మల్లారెడ్డి, రాకేష్ పటేల్, మహిళా విభాగం సభ్యులు శుషుమ్న రెడ్డి, సుప్రజ పులుసు, శ్వేతా రెడ్డి, శ్రీలక్ష్మి, శ్రీవిద్య ఇతర టాక్ సభ్యులు రవిప్రదీప్ పులుసు, మధుసూదన్ రెడ్డి, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, వంశీ రేక్నార్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై ‘హరితహారం’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు హరితహారం కార్యక్రమం మెరిసింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు, అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి శుక్రవారం బ్రెజిల్లోని క్యూరీటుబా లో జరిగిన 25వ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఐయూఎఫ్ఆర్వో) సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్ వివరించారు. సిద్దిపేట జిల్లా లోని ‘గజ్వేల్–ములుగు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ప్రకృతి దృశ్యాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు. గత నెల 29న ప్రారంభమైన ఐయూఎఫ్ఆర్వో సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో 110 దేశాల్లో విధాన రూపకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలతో కూడిన ప్రపంచ నెట్వర్క్, భాగస్వామ్యపక్షాలు పాల్గొన్నాయి. -
తమాషా చేస్తున్నారా? - కలెక్టర్ ఆగ్రహం
జగిత్యాల: తమాషా చేస్తున్నారా...ఒక్క మొక్క చనిపోయినా ఊరుకునేది లేదు..మొక్కలకు రక్షణ కల్పించాలని, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అందరు సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం ఐఎంఏ హాల్ నుంచి నర్సింగ్ కళాశాల, డీఆర్డీఏ ఆఫీసు, మహిళ సంక్షేమ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు సక్రమంగా లేకపోవడం, బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖ నాటిన మొక్కల బాధ్యత వారే చూసుకోవాలన్నారు. ప్రతీ మూడు రోజులకోసారి పరిశీలిస్తానన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులున్నారు. -
ఫారెస్ట్ అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంపీ సంతోష్కుమార్ హరితహారంలో భాగంగా ఇటీవల పెద్దఎత్తున మొక్కలు నాటిని విషయం తెలిసిందే. మంగళవారం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆ ప్రాంతాన్నిపరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్టు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 15 రోజులు కావొస్తున్నా వాటికి సపోర్టు కర్రలు ఎందుకు నాటలేదని, చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ ఎందుకు నాటలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొక్కలను నాటినప్పటి నుంచి ఫీల్డ్ఆఫీసర్ ఇటు పక్కకు రాలేదని, నాటిన మొక్కలను సంరక్షించనందుకు కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డిని ఆదేశించారు. అనంతరం గుట్టలో గల ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కీసరగుట్ట అబివృద్ధికి ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కీసరగుట్టలోని ఎంట్రెన్స్లో గల సిమెంట్ నంది విగ్రహాన్ని మార్చి, దానిస్థానంలో రాతితో చెక్కించి నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కీసరగుట్ట జాతర సందర్భంగా పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడకుండా స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. జెడ్పీ వైస్చైర్మన్ బెస్త వెంకటేష్, డీఆర్డీఏ పీఓ కౌటిల్యారెడ్డి, సీపీఓ సౌమ్య, ఎంపీపీ ఇందిర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, సర్పంచ్ మాధురి, ఉపసర్పంచ్ కందాడి బాలమణి పాల్గొన్నారు. -
మేకలయితే ఏంటి.. ఫైన్ కట్టాల్సిందే
పటాన్చెరు టౌన్/మక్తల్: గ్రామాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పనులు నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఆసక్తికరమైన రీతిలో జరిమానాలు విధించిన సంఘటనలు వెలుగు చూశాయి. ముత్తంగిలో జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి స్థానిక గుల్షన్ హోటల్ నిర్వాహకులు చెత్త పారబోస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ శ్రీశైలం, కోఆప్షన్ సభ్యుడు శ్రీధర్గౌడ్లు పట్టుకున్నారు. రహదారి పక్కన చెత్త వేసినందుకు ఆ హోటల్ యాజమాన్యానికి బుధవారం ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆ హోటల్ నిర్వాహకులు చెల్లించారు. అలాగే హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు మేయడంతో వాటి యజమానికి రూ. 3 వేల జరిమానా విధించినట్లు గ్రామ కార్యదర్శి కిషోర్ తెలిపారు. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో కూడా మేకలు హరితహారంలో నాటిన మొక్కలు మేసినందుకు అధికారులు వాటి యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మేకలను పట్టుకుని కట్టేశారు. యజమాని వచ్చి రూ.10 వేలు చెల్లిస్తేనే మేకలను వదులుతామని చెబుతున్నారు. -
మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..
సాక్షి, చేవెళ్ల : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కను మేక తినడంతో ఆ మేక యజమానికి జరిమానా పడింది. పంచాయతీ అధికారులు మేక యజమానికి రూ. 500 జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దేవల్ వెంకటాపూర్ (చిలుకూరు బాలాజీ దేవాలయం ఉన్న ప్రాంతం)లో ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే, అదే గ్రామానికి చెందిన బైకని మల్లమ్మకు చెందిన మేకలు మొక్కలను తినేశాయి. ఈ నెల 21న ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు గుర్తించారు. జరిమానాకు సంబంధించిన రశీదును పంచాయతీ కార్యదర్శి రంజిత్కుమార్, సర్పంచ్ గునుగుర్తి స్వరూప మల్లమ్మకు అందజేశారు. -
ఒక్కరోజే.. 6 లక్షల మొక్కల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి శుక్రవారం హరితహారం నిర్వహించాలనే లక్ష్యంతో తొలి శుక్రవారం జరిగిన హరితహారంలో మేయర్ బొంతు రామ్మోహన్తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటడంతోపాటు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో వెరసి 6 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. మేయర్ రామ్మోహన్ మియాపూర్లోని ప్రశాంతనగర్లో హరితహారంలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఫీవర్ ఆసుపత్రిలో, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట్ విద్యుత్ దహనవాటిక ఖాలీ స్థలంలో మొక్కలు నాటారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్ తో కలిసి మొక్కలు నాటారు. ఎల్బీనగర్ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం స్థానిక కార్పొరేటర్లతో కలిసి బండ్లగూడ జి.ఎస్.ఐ లో మొక్కలు నాటారు. ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ లోని సాయి కాలనీ, టి.బి కాలనీలలోఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మొక్కలను నాటడంతో పాటు స్థానికులకు ఉచితంగా పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుద్వేల్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి వెంకటేశ్వరకాలనీ, జె.వి.ఆర్ పార్కులో మొక్కలు నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రముఖ చలన చిత్ర నటుడు నరేష్ జూబ్లిహిల్స్ లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ , డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తదితర ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ఉచితంగా పంపిణీ చేశారు.జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ గురునాథం చెరువుకట్టపై నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. జోనల్, అడిషనల్ కమిషన్లు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
హరిత పార్కులు ఇవిగో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన పలు పార్కులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హరితహారం ఫలాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి 22 కి.మీ. దూరంలో నాగార్జున సాగర్ రోడ్డులో సంజీవని వనం 60 హెక్టార్లలో అభివృద్ధి చేసిందని చెప్పారు. 500 రకాల మొక్కలతో మంచిర్యాల జిల్లాలో 345 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గాంధారి వనం పార్కు తెలంగాణతోపాటు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. నగరం శివారులోని ఆరోగ్య సంజీవని పార్క్ గుర్రంగూడ, కండ్లకోయలోని పార్క్, దూలపల్లిలో 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రశాంతివనంలలో నగరవాసులకు ఆటవిడుపు కలిగించేలా పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శంషాబాద్ సమీపంలోని పంచవటి పార్క్ అరుదైన పక్షులకు నిలయంగా ఉందన్నారు. వీటి ఫొటోలను కూడా కేటీఆర్ షేర్ చేశారు. -
'మొక్కలను సంరక్షిస్తే రూ. లక్ష నజరానా'
సాక్షి, సిద్దిపేట : మొక్కలు చక్కగా నాటి వాటి సంరక్షణ చేసిన గ్రామానికి, విధులు సక్రమంగా నిర్వహించిన అధికారులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో గ్రామాల వారీగా హరితహారం స్థితిగతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అలాగే రెండో బహుమతి కింద రూ.50వేలు, మూడో బహుమతి రూ.25 వేల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పని చేయని వారిపై చర్యలు కూడా శాఖ పక్షాన ఉంటాయని హెచ్చరించారు. మండలాల వారీగా సమీక్షకు హాజరైన వ్యవసాయశాఖ, ఈజీఎస్ అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శుల హాజరు స్థితిగతులను క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. వచ్చే సమావేశంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. భవిష్యత్తులో సమీక్షలో ఉపన్యాసాలు ఉండవని కేవలం గ్రామాల వారీగా క్షుణ్ణంగా సమీక్ష నిర్వహిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలంటూ సూచిస్తూ మొక్కుబడి సమావేశాలు నిర్వహించకుండా సీరియస్గా పని చేసే ఉద్దేశం ఉంటేనే సమీక్షలు నిర్వహిద్దామని లేకపోతే సమయం వృథా చేయడం వద్దంటూ సమీక్ష లక్ష్యం, ఉద్దేశం గూర్చి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఇటీవల సీఎం శాసనసభలో స్పష్టంగా తెలిపిన హరితహారంపై నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యల గూర్చి గుర్తు ఆయన చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి రాదు అనే నమ్మకంతో తాను ఉన్నాడని సమష్టిగా గ్రామాల్లో హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే చర్యలను చేపట్టాలన్నారు. తొలి సమావేశం కావడంతో లక్ష్య సాధనలో వైఫల్యం చెందిన గ్రామాల అధికారులను, ప్రజాప్రతినిధులకు మరొక అవకాశం ఇస్తున్నామన్నారు. సరిగ్గా 30 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని పరిస్థితిలో మార్పు ఉండాలంటూ సూచించారు. మొక్క నాటిన రైతుకు రాబడి రైతులు జీవిత కాలం కష్టపడి పంట తీస్తారు. వృద్ధాప్యంలో ఇంటి వద్ద ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి లాగా ఉద్యోగ విరమణ తర్వాత పెన్ష¯Œన్ ఉండదని కొంచెం అధికారులు రైతులను చైతన్య పరిచి మొక్కలు నాటించడం వలన భవిష్యత్తులో ఒనగూరే ఆదాయం గూర్చి వివరిస్తే మన లక్ష్యం సుగమం అవుతుందంటూ హరీశ్రావు అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక టేకు మొక్కను శాస్త్రీయంగా సాగు చేయడం వల్ల 50 సంవత్సరాల వయస్సులో ఎకరంలో వంద టేకు మొక్కలు నాటడం వల్ల వాటిలో 70 మొక్కలు బతికినా వాటిని భవిష్యత్తులో విక్రయించడం వల్ల లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని లెక్కలతో వివరించారు. దినసరి ఆదాయం కావాలనుకునే రైతులకు పొలం గట్లపై మునగ, నిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, జామ లాంటి పండ్ల మొక్కలను నాటడం వల్ల వచ్చే ఆదాయం గూర్చి రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటూ సూచించారు. ప్రతి ఇంటి ముందు ఒక వేపచెట్టు నాటే లక్ష్యంతో సిద్దిపేట నియోజకవర్గంలో హరితహారాన్ని నిర్వహించాలని అదే ప్రధాన అంశంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం సిద్దిపేటఅర్బన్, సిద్దిపేటరూరల్, నారాయణరావుపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల హరితహార లక్ష్యం, ప్రస్తుత స్థితిగతుల నివేదికను ఆధారంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీటీసీలను ఒక్కొక్కరితో మాట్లాడుతూ లక్ష్యం చేరేందుకు చేపడుతున్న చర్యలు, ప్రస్తుతం హరితహారం స్థితిగతులు, గ్రామ ప్రజల భాగస్వామ్యం, రైతుల్లో చైతన్యపరమైన సదస్సుల గూర్చి ఆరా తీస్తూ సలహాలు, సూచనలు అందిస్తూ సమీక్షను నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జెడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, తుపాకుల ప్రవళ్లిక, కుంబాల లక్ష్మి, ఎంపీపీలు శ్రీదేవి, వంగ సవిత, బాలమల్లు, మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు పాల్గొన్నారు. -
'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'
సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' చాలెంజ్లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్ కుమార్ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్ ఏ స్మైల్'కు హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్లు ఉన్నారు. -
‘హరిత’ సైనికుడు
సాక్షి, అల్గునూర్(పెద్దపల్లి ) : ‘వానలు వాపస్ రావాలి..కోతులు వాపస్ పోవాలి’ అని కేసీఆర్ చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నాడు మక్తపల్లివాసి. కేసీఆర్ స్ఫూర్తితో మొక్కల పెంపకానికి నడుం బిగించాడు. ఇప్పటి వరకు లక్ష సీడ్బాల్స్ సొంతంగా తయారు చేయించి పంపిణీ చేయించిన హరిత ప్రేమికుడు ఎన్ఆర్ఐ నరేందర్ పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన చింతం కనకలక్ష్మి–రాములు దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు నరేందర్. నరేందర్ అమెరికాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడ్డారు. మిత్రులతో కలిసి నవ సమాజ నిర్మాణ సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు పేదల పిల్లల ఉన్నత చదువుకు సాయం అందిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి ఆర్థికసాయం చేయిస్తున్నారు. గతేడాది అడవుల్లోని జంతువులు, పక్షులు నీరులేక చనిపోతున్నాయని మిత్రుల ద్వారా తెలుసుకున్న నరేందర్ అడవుల్లో నీటికుండీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హరితహారంపై దృష్టి.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నరేందర్ తిమ్మాపూర్ మండలాన్ని హరిత మండలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే స్వగ్రామం మక్తపల్లికి వచ్చిన నరేందర్ బెంగళూర్లోని ప్రముఖ విత్తన కంపెనీ, నర్సరీ తయారీ కంపెనీని కలిసి సీడ్బాల్స్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్ష సీడ్ బాల్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. చింత, తుమ్మ, రావి, జువ్వి, మర్రి, మారేడు, మేడి, నేరేడు, మామిడి, పుల్చింత, సపోటా, జామ తదితర విత్తనాలతో సీడ్బాల్స్ తయారు చేయాలని కోరాడు. సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేశాడు. తొలి విడతగా సుమారు 50 కిలోల సీడ్ బాల్స్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి పంపించగా విత్తనాలను ఆయన మిత్రులు గురువారం గ్రామంలో బాబింగ్ చేశారు. -
తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి?
మోత్కూరు : వర్షాభావ పరిస్థితుల్లో గ్రామాల్లో తాగడానికి నీరు దొరకడం లేదని, నర్సరీల్లో మొక్కలు ఎలా పెంచాలని, నాటి వాటిని ఎలా సంరక్షించాలని? పలు గ్రామాల సర్పంచ్లు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఐదో విడత హరితహారంపై సమీక్ష సమావేశం ఎంపీపీ దీటీ సంధ్యారాణి అధ్యక్షతన జరిగింది. నర్సరీల్లో పెంచడానికి బోర్లు వట్టిపోయాయని, ఎలా పెంచాలని? నాటిన మొక్కలను ఎలా సంరక్షించాలని? దాచారం, పొడిచేడు, అనాజిపురం, రాగిబావి గ్రామాల సర్పంచ్లు అండెం రజిత, పేలపూడి మధు, ఉప్పల లక్ష్మమ్మ, రాంపాక నాగయ్య అధికారులను ప్రశ్నించారు. నర్సరీల్లో మొక్కలు పెంచుతున్న వనసేవకులకు ఇప్పటివరకు బిల్లు రాలేదని, వాటిని ఎలా నిర్వహిస్తారని? దాచారం సర్పంచ్ అధికారులను ప్రశ్నించారు. ఎంపీపీ దీటీ సంధ్యారాణి మాట్లాడుతూ 7,45,861 మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఇంటింటికీ మొక్కలు పెంచే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. ఎంపీడీఓ బి.సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కల పెంపకంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
గ్రేటర్కు మూడు కోట్ల మొక్కలతో ‘హరితహారం’
సాక్షి, హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం ఐదో విడత ఈ నెలలో చేపట్టనున్నారు. గత నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది హరిత హారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే మూడు కోట్ల మొక్కలను నాటేందుకు వీలుగా జీహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాటా, కృష్ణలు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొక్కలను పెంచడానికి రాజేంద్రనగర్, కొంగరకలాన్లోని నర్సరీలకు అప్పగించి వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కోటిన్నర మొక్కలను ప్రైవేటు నర్సరీలకు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు వేసి అందులో ఎంపికైన ప్రైవేటు నర్సరీలకు మొక్కల పెంపకాన్ని అప్పగించి.. మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
‘ఉపాధి’కి భరోసా..‘హరితహారం’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ఉపాధి హామీ కూలీలకు ధీమాను కల్పిస్తోంది. వచ్చేనెలలో చేపట్టనున్న ఐదో విడత హరితహారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తద్వారా ఉపాధి కూలీలకు తగినంతగా పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో వాటి సంరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కిలోమీటరు దూరానికి ఒక్కో ఉపాధి కూలి... ఐదో విడతలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు మొక్కల పెంపకంలో వందరోజుల పనిదినాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వ్యవసాయ భూముల్లో నాటే ఒక్కో మొక్కకు నెలకు రూ.5 వంతున ఇచ్చి వాటి సంరక్షణకు బాటలు వేయాలని నిర్ణయించారు.. రహదారి వెంట నాటిన మొక్కల రక్షణకు ఒక్కో ఉపాధి కూలీకి కిలోమీటరు దూరం చొప్పున బాధ్యతలు అప్పగించి, రోజుకు రూ. 211 సగటు వేతనంగా చెల్లిస్తారు. మొక్కల పెంపకంతో ఉపాధి కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో పాటు హరితహారం లక్ష్యాన్నీ సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతదాకా 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.2 లక్షల మంది కూలీలకు పని కల్పించారు, ఈ ఏడాదికి గాను 12 కోట్ల పని దినాల కల్పనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలో ఎక్కువ పని రోజులు కల్పించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం పని రోజులను పెంచింది. 2019–20 లో భాగంగా జూన్ 4వ తేదీ వరకు 5.7 కోట్ల పని దినాలు రూ. 147 సగటు వేతనంతో పని కల్పించి, మొత్తం రూ. 947.2 కోట్లు వెచ్చించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత ఆర్థిక సంవత్సరంలోనే అ«ధిక పనులు చేసిన రికార్డు రాష్ట్రంలో నమోదైంది.గతేడాది కూలీలకు రూ. 148.4 సగటు వేతనంతో 11.2 కోట్ల పని దినాలు కల్పించారు. 25.2 లక్షల కుటుంబాలకు చెందిన 42.4 లక్షల మంది కూలీలకు పని దొరికింది. రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. కూలీలకు వేతనాలుగా రూ. 1706.1 కోట్లు, రూ. 1042.9 కోట్లు పరికరాల కోసం కేటాయించారు. -
పెళ్లిలో అతిథులకు మొక్కల పంపిణీ
సిద్దిపేటజోన్: హరితహారం స్ఫూర్తితో ఆ కుటుంబం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెళ్లికి వచ్చిన అతిథులకు మొక్కలను బహూకరించి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలో శుక్రవారం గాంధీనగర్కు చెందిన శైలజ, రామసుబ్బారావుల ద్వితీయ పుత్రిక సుమన వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు వివిధ రకాల పండ్ల మొక్కలను బహుమతిగా అందజేశారు. ఈ వివాహానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా కూడా అతిథులకు మొక్కలను అందజేశారు. ఇలా మొక్కలను బహుమతిగా ఇవ్వడం కొత్త ఆలోచన అని, ఇదే స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగించాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకిషన్శర్మ తదితరులు ఉన్నారు. -
వనపంచాయతీలతో వన్య సంరక్షణ
గత యాభై సంవత్సరాలలో గిరిజనులు, అడవిపై ఆధారపడి బతికే ఇత రులు కూడా బ్రతుకుతెరువుకై పెద్ద ఎత్తున అడవులు నరికి వాటిని వ్యవసాయం కిందకు తీసుకువచ్చారు. దీనితో అటవీశాఖ, గిరిజనుల మధ్య ఉద్రిక్తతలు మొదలైనాయి. పరిస్థితులను గమనించి కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంగా 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. దీనితో చాలా వరకు పేదలకు లాభం కలిగినా, సమస్య ఇంకా తీరిపోలేదు. తరిగిపోతున్న అడవులను రక్షించడానికి, అలాగే క్షీణస్తున్న అడవులను అభివృద్ధి చేయడానికి 1980వ దశకంలో ప్రజల భాగస్వామ్యంతో అడవులు అభివృద్ధి చేయాలని ఉమ్మడి అటవీ యాజమాన్యం అనే పథకం అమలులోకి వచ్చింది. దీనిలో భాగంగా అడవుల అంచున ఉన్న గ్రామాలలో వన సంరక్షణ సమితుల ఏర్పాటు జరిగింది. ఈ సమితులు అడవులను కాపాడటమేకాక అడవులలో మొక్కల పెంపకం కూడా చేపట్టాయి. మొదట్లో ఈ కార్యక్రమం బాగానే ఉన్నా, రానురాను అటవీశాఖ సిబ్బంది సహకారం లోపించి వన సంరక్షణ సమితులు నామమాత్రంగానే మిగిలిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అడవులను, అలాగే వన్యప్రాణులను రక్షించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కెమెరాలు పెట్టడం, అడవిలో విద్యుత్తు లైన్లపై ఆంక్షలు, కలపదొంగలపై కఠినచర్యలు, కలప కోత మిషన్లపై చర్యలు, వడ్రంగి వృత్తి పనివారిపై చర్యలు మొదలుపెట్టినారు. ఇదిగాక అటవీ చట్టాన్ని ఇంకా కఠినతరం చేస్తూ శిక్షను పెంచడం కూడా∙తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అటవీ ఉత్పత్తులను రిజర్వు అడవుల నుండి కాక ఇతరత్రా అందుబాటులోనికి తీసుకురావాలి. అటవీ సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ఏ గ్రామ శివారులో ఉన్న అడవులను ఆ గ్రామస్తులు కాపాడాలని ప్రణాళిక చేయవలసిన అవసరముంది. గ్రామంలో ప్రజల పౌరసేవలకై గ్రామ పంచాయతీ ఉన్నట్లుగా, అడవుల రక్షణకు, అడవి అభివృద్ధి కోసం వనపంచాయతీ అవసరం ఎంతైనా ఉంది. వన పంచాయతీల వల్ల ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ సహకారంతో అడవులను కాపాడటమే కాక తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం కూడా అమలు చేయించవచ్చు. ఆ గ్రామంలో కానీ, సమీప అడవిలో కానీ నాటవలసిన మొక్కల అవసరాలను నిర్ధారించి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వనపంచాయతీలు చేపడతాయి. ఇందుకు పొదుపు సంఘాలు, ఇతర మహిళా గ్రూపులు తమ ఇళ్ల వద్ద స్థల లభ్యత అనుసరించి రెండు నుంచి ఐదు వేల మొక్కలు పాలిథీన్ సంచులలో పెంచుతారు. ఇలా పెంచిన మొక్క ఒక్కంటికి ఐదు నుంచి ఆరు రూపాయిలు ఇస్తారు. అదీకాక రైతులు తమ భూములలో, గట్ల వెంబడి తొందరగా పెరిగి ఆదాయాన్ని ఇచ్చే సుబాబుల్, వెదురు, సీతాఫలం వంటి మొక్కలు వాణిజ్యపరంగా పెంచుకోవడానికి ఈ గ్రామవారీ నర్సరీలు సహాయపడతాయి. ప్రస్తుతం అరకొరగా నడుస్తున్న వన సంరక్షణ సమితులను అటవీశాఖ అధీనం నుంచి తప్పించి వనపంచాయితీలకు అప్పగిస్తే∙బాగుంటుంది. అడవుల పెంపకానికి ఇక భూమి లభ్యత లేదు. కాకపోతే మొక్కలు పెంచడానికి అడవి బయట భూమి దొరకవచ్చు. ప్రజలు మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మొక్కల పెంపకం ఒక వ్యవసాయ అనుబంధవృత్తిగా అభివృద్ధి చెందాలి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సుబాబుల్, వెదురు వంటి మొక్కలను వాణిజ్యపరంగా పెంచి కాగితం, ఇతర కలప ఆధారిత పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ముందుగా వారికి నాణ్యమైన నర్సరీ మొక్కలు, ఎరువులు సరఫరా చేస్తున్నాయి. అటవీ చట్టానికి సవరణలు చేసి టేకు వంటి వృక్షజాతులు తప్ప ఇతర జాతుల కలప, బొగ్గు, పొయిలకర్ర, తునికి ఆకు వంటి వాటిని అటవీ ఉత్పత్తుల జాబితాలో నుంచి తొలగించిన రైతులు వీటి రవాణా కొరకు అటవీశాఖ కార్యాలయాలS చుట్టూ రహదారి పర్మిట్ల కోసం తిరగవలసిన అవసరం ఉండదు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఒక మొక్క అడవి బయట నాటితే, అడవిలోని ఒక మొక్కను కాపాడినట్లే. అడవులను కాపాడాలంటే అటవీ చట్టం సులభతరం కావాలి. రైతులు పెంచిన వృక్షజాతులపై రవాణా పర్మిట్ వంటి నిబంధనలు సడలించాలి. అప్పుడే ప్రజలు చెట్ల పెంపకాన్ని ఒక వాణజ్యపరమైన వృత్తిగా తీసుకొని లాభపడతారు. అలాగే వృక్ష సంవద పెరిగి పర్యావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. యం. పద్మనాభరెడ్డి కార్యదర్శి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ -
జంగిల్ బచావో, జంగిల్ బడావో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పచ్చదనం పెంచాలని, అడవులను సంరక్షించాలని, స్మగ్లర్లను శిక్షించాలని పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా కొత్తచట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న అటవీచట్టాలను సమీక్షించాలని, ఆక్రమణదారులను, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు సిద్ధం చేయాలని అన్నారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఇక్కడి ప్రగతిభవన్లో పోలీస్, అటవీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయుధ పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బృందాలు అడవిలో నిరంతరం తనిఖీలు నిర్వహించడంతోపాటు బయటకు వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డి.ఎఫ్.వో.లు కలసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి బహుముఖ వ్యూహం అమలు చేయాలి. ముఖ్యంగా 4 రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతమున్న అడవిని పూర్తిస్థాయిలో రక్షించాలి. అటవీభూమిలో కోల్పోయిన పచ్చదనం(చెట్ల)ను పునరుద్ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలి. హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగరాలతోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనం పెంచాలి’అని సీఎం దిశానిర్దేశం చేశారు. స్మగ్లింగ్ జీరోసైజ్కు రావాలి ‘జంగిల్ బచావో, జంగిల్ బడావో(అడవిని కాపాడాలి, అడవిని విస్తరించాలి) అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. స్మగ్లింగ్ జీరోసైజుకు రావాలి. స్మగ్లింగ్కు పాల్పడేవారిపై పి.డి.యాక్ట్ నమోదు చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. అడవిలో ఒక్కచెట్టు కూడా పోకుండా జాగ్రత్త పడాలి. అడవులను రక్షించే విషయంలో చిత్తశుద్ధి, దృఢచిత్తం, అంకితభావం కలిగిన అధికారులను ఆయా ప్రాంతాల్లో నియమించాలి. వారికి సాయుధ పోలీసుల భద్రత కూడా అందించాలి. చెక్పోస్టుల వద్ద కూడా సాయుధ పోలీసుల పహారా పెట్టాలి’అని సీఎం ఆదేశించారు. ప్రజలే ముఖ్యం– వారి భవిష్యత్తే లక్ష్యం ‘మాకు ప్రజలే ముఖ్యం. వారి భవిష్యత్తే లక్ష్యం. అంతకు మించిన ప్రాధాన్యం మరొకటి లేదు. భావి తరాలు బాగుండాలనే అడవుల రక్షణ, పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్మగ్లింగ్కు పాల్పడితే అందరికన్నా ముందు వారినే అరెస్టు చేయండి’అని సీఎం చెప్పారు. తెలంగాణలో 24 శాతం అటవీభూమి ఉందని అధికారిక లెక్కల్లో ఉంది. కానీ, వాస్తవంగా 12 శాతం పచ్చదనం కూడా లేదు. అటవీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది. అటవీభూములపై సాగు హక్కులు కలిగినవారితో కూడా ఉభయ తారకంగా ఉండే చెట్ల పెంపకం చేయించాలి’’అని సీఎం సూచించారు. ‘‘నగరాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం వల్ల రోగాలొస్తున్నాయి. హైదరాబాద్లో ఉండడం మన అదృష్టమని భావిస్తున్నాం. జాగ్రత్తగా ఉండకపోతే అది దురదృష్టంగా మారుతుంది. అన్ని నగరాలు, పట్టణాల్లో చెట్లు పెంచాలి’’అని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే గ్రీన్ సెస్ పచ్చదనం పెంపునకు కాంపా నిధులను వినియోగించడంతోపాటు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, నిధుల కొరత రాకుండా అవసరమైతే గ్రీన్సెస్ వసూలు చేస్తామని, గ్రీన్ఫండ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నవీన్చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పీసీసీఎఫ్(విజిలెన్స్) రఘువీర్, అడిషన్ పీసీసీఎఫ్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ని చెట్లు కొట్టేశారు.. ఎన్ని నాటారు?
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పేరుతో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని చెట్లు కొట్టేశారు.. ఎంత విస్తీర్ణంలో కొట్టేశారు.. వాటిస్థానంలో ఎన్ని చెట్లను నాటారు.. ప్రస్తుతం వాటి వయసు ఎంత.. అవి ఏ స్థితిలో ఉన్నాయి.. తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద, పెద్ద చెట్లను కొట్టేసి, వాటిస్థానంలో చిన్న, చిన్న పూలమొక్కలను నాటడాన్ని అభివృద్ధిగా పరిగణించలేమని అభిప్రాయపడింది. భారీ చెట్లస్థానంలో పూలమొక్కలు నాటడం బ్యూటీపార్లర్కు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకోవడం లాంటిదని వ్యాఖ్యానించింది. చెట్లను కూల్చివేస్తున్న ప్రాంతాల్లో మళ్లీ వాటి స్థానంలో మొక్కలు నాటే విషయంలో పెద్దగా పురోగతి లేదని పేర్కొంది. గతంలో రోడ్ల వెంట చింత చెట్లు ఉండేవని, వాటి ద్వారా ఆయా గ్రామపంచాయతీలకు ఆదాయం వచ్చేదని, అయితే ప్రస్తుతం చింతచెట్లు కనుమరుగయ్యాయని తెలిపింది. తాము కోరిన వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం–నాగార్జునసాగర్ జాతీయ రహదారి వెంబడి వందల సంఖ్యలో ఉన్న భారీ చెట్లను కొట్టేస్తుండటంపై న్యాయవాది తేరా రజనీకాంత్రెడ్డి 2016లో హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్గా పరిగణించిన హైకోర్టు, దీనిపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం శనివారం మరోసారి విచారణ జరిపింది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకోండి... గతవారం ధర్మాసనం ఆదేశించిన మేరకు రహదారులు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ) ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీంద్రరావు, నల్లగొండ డివిజనల్ అటవీ అధికారి (డీఎఫ్వో)లు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ 2016లో కొట్టేసిన చెట్ల స్థానంలో ఎందుకు మళ్లీ చెట్లు నాటలేదని ప్రశ్నించింది. దీనికి అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ రహదారుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నాటిన మొక్కలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కడైతే పనులు పూర్తయ్యాయో అక్కడ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హరితహారం కార్యక్రమం ద్వారా విస్తృతస్థాయిలో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇప్పటికే పనులు పూర్తయిన చోట్ల ఎన్ని మొక్కలు నాటారని ప్రశ్నించింది. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుంటూ నాటిన మొక్కల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకోవడం పెద్ద సమస్య కాదంది. పెద్ద, పెద్ద చెట్లను కొట్టేసి వాటిస్థానంలో అందాన్నిచ్చే చిన్న, చిన్న మొక్కలను నాటడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంత విస్తీర్ణం మేర ఎన్ని చెట్లను కొట్టేశారు.. వాటిస్థానంలో ఎన్ని మొక్కలు నాటారు.. వాటి వయస్సు.. వాటి ప్రస్తుత స్థితి తదితర వివరాలను ఓ అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
మొక్క.. పర్యావరణం పక్కా
ఆదిలాబాద్రూరల్: దినదినం ఆడవులు అంతరించిపోతున్న దృష్ట్యా వాతావరణం కాలుష్యంగా మారడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ శాతాన్ని పెంచడంలో భాగంగా జాతీయ రహదారి 44కు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జైనథ్ మండలం మాండగడ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం నిర్మల్ జిల్లా వరకు సుమారు 84 కిలోమీటర్ల పొడవు మేరకు వీటిని నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో గల నీడను ఇచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పూల మొక్కలను నాటుతున్నారు. నాటిన మొక్కలను పశువులు తినకుండా వాటి చుట్టూ ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి వాటిని రక్షించనున్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా ప్రతీ రోజు ట్యాంకర్ ద్వారా నీళ్లను పోస్తున్నారు. చల్లని వాతావరణం జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో నాటుతున్న మొక్కలతో జాతీయ రహదారి గుండా ప్రయాణించే ప్రయాణికులకు చల్లని వాతావరణం అందనుంది. అలాగే వాహనాల నుంచి వెలుబడే పొగతో వాతావరణం కాలుష్యం కాకుండా అరికట్టేందుకు వీలు ఉంటుంది. నీడ నిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒకే రకమైన పూల మొక్కలను కాకుండా కొన్ని కిలో మీటర్ల దూరంలో వివిధ రకాల పూల మొక్కలను నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గాలి, దుమారం వచ్చినప్పుడు నాటిన మొక్క కింద పడిపోకుండా దానికి సపోర్టుగా మధ్యలో ఒక కర్రను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రూ.300 ఖర్చు అడవుల జిల్లా ఆదిలాబాద్గా పిలువబడే జిల్లాలో మరింత చెట్లను పెంచుతున్నారు. జాతీయ రహదారి నంబర్ 44కు ఇరువైపులా మూడు వరుసల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, ఇంద్రవెళ్లి, ఇచ్చోడ, నేరడిగొండ రేంజ్ పరిధిలో నాటుతున్న నీడనిచ్చే, పూలనిచ్చే ఒక్కో మొక్కకు రూ. 300 ఖర్చు చేస్తున్నారు. 84 కిలోమీటర్ల పొడవులో 22వేల మొక్కలను నాటనున్నారు. మొక్కలు పెద్దవి అయ్యేంత వరకు ఆ మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోయడంతో పాటు ఎరువులను సైతం పోయనున్నారు. ఇరువైపులా నాటుతున్న మొక్కలతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందనుంది. -
నెలాఖరులోగా హరితహారం పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఆదేశించారు. జిల్లాల వారీగా కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాల కుదింపు అనుమతించబోమని, అన్ని జిల్లాలు ఈ నెలాఖరుకల్లా తమ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. హరితహారం పురోగతిపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మళ్లీ రెండు వారాల తర్వాత హరితహారంపై చీఫ్ సెక్రటరీ సమీక్ష ఉంటుందని ఈలోగా లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ పీ.కె.ఝా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న గోపాలపురం పాఠశాల
ఖమ్మంఅర్బన్ : నగరంలోని 8వ డివిజన్ గోపాలపురం పాఠశాల వివిధ ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఆవరణలో మొక్కలు నాటి..వాటిని సంరక్షిస్తూ ఆహ్లాదాన్ని నింపారు. దాతల సహకారంతో డిజిటల్ తరగతుల బోధన సాగుతోంది. బడి నగరంలో ఉండడంతో వికలాంగ ఉపాధ్యాయులు సమీపంలో ఉంటుందని ప్రత్యేక విజ్ఞప్తితో ఇక్కడ పనిచేస్తుండగా..వీరు ఎంతో శ్రద్ధతో పాఠశాల రూపురేఖలనే మార్చి..శెభాష్ అనిపించుకుంటున్నారు. పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు 69మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వీవీ.సత్యనారాయణ, ఉపాధ్యాయులు బండి నాగేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సీహెచ్.శివరామకృష్ణ పర్యవేక్షణలో విద్యా బోధన, పాఠశాల పర్యవేక్షణ సాగుతోంది. తరగతి గదుల గోడలన్నీ వివిధ దేశనాయకులు, విద్యావంతుల చిత్రపటాలు, వాల్ రైటింగ్లు, పాఠశాలకు సంబంధించిన వివరాలతో నిండి ఉంటాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంతను రూపొందించి నీటి పొదుపు ప్రాధాన్యం వివరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలను చూస్తే కార్పొరేట్ స్కూల్ ఏమో అనేట్లు తీర్చిదిద్దారు. డిజిటల్ తరగతుల కోసం ఎల్ఈడీ టీవీ ఉంది. రోజూ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ప్రతి ఏటా విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూలను అందించేందుకు ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు విశేషంగా కృషి చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటడమే కాకుండా ప్రతి విద్యార్థి ఇంట్లో ఒక గులాబీ, ఒక పండ్ల, ఒక నీడనిచ్చే మొక్కలను నాటించారు. బడిలో వాటిని కాపాడుకోవడంతో అవన్నీ పెరిగి పచ్చదనం నింపాయి. ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుతోపాటు అంటెండర్గా తాత్కలికంగా పనిచేస్తున్న ఎస్కె.రషీద్ చొరవ కూడా ఎంతో ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరి సమష్టి కృషి వల్లనే నగరంలోనే ఉన్నా..ప్రైవేట్ స్కూల్కు వెళ్లకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. -
విద్యా సంస్థల్లో హరితహారం
మెదక్ అర్బన్ : హరిత పాఠశాల – హరిత తెలంగాణ నినాదాంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ఈనెల 25న హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం కలెక్టర్లు, విద్యాశాఖ, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా మాట్లాడుతూ హరిత పాఠశాల – హరిత తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నాల్గో దశలో భాగంగా విద్యాసంస్థల్లో ’హరిత పాఠశాల – హరిత తెలంగాణ‘ పేరుతో ఈనెల 25న ఘనంగా నిర్వహించాలన్నారు. విద్యాశాఖలో హరితహారం నిర్వహించేందుకు విద్యార్థులతో గ్రీన్ బ్రి గేడ్లను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్ళు సమకూర్చడం జరుగుతుందని ఝా స్పష్టం చేశారు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాల, ఉన్నత విద్య, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, యూనివర్సిటీల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో, వసతి గృహాల్లో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామరావు, డీఆర్వో రాములు, డీఎఫ్వో పద్మజారాణి, రాజిరెడ్డి, పాల్గొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి మెదక్ అర్బన్ : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో నిత్యం రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయని తమ వద్దకు వచ్చే ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. -
హరితహారానికి మద్దతుగా బైక్ ర్యాలీ
-
సమంతకు సవాల్ విసిరిన పీవీ సింధూ..!
హీరోయిన్ సమంతకు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సిందూ చాలెంజ్ విసిరారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట మొక్కలను నాటుతూ ఒకిరికొకరు సవాల్ చేసుకుంటున్నారు. తాజాగా క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నుంచి గ్రీన్ చాలెంజ్ను స్వీకరించిన సింధూ శనివారం మూడు మొక్కలు నాటి హరిత సవాల్ని బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్, హీరో సూర్య, సమంతకు పాస్ చేశారు. గ్రీన్ చాలెంజ్కు తనను నామినేట్ చేసిన లక్ష్మణ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చగా ఉంచేందుకు అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో సింధూ సిల్వర్ మెడల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వంశీ పైడిపల్లి విసిరిన గ్రీన్ చాలెంజ్ను సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సమంత స్వీకరించలేకపోయింది. యూటర్న్ చిత్రంతో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్న సమంత సింధూ విసిరిన ఈ సవాల్నైనా స్వీకరిస్తుందో లేదో చూడాలి..! -
లక్ష మొక్కలు పీకేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోంది. అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు. 2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది. కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న అటవీ భూములను మళ్లీ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారు. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు... రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తోంది. 2015–19 మధ్య మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 80 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు, మరో 20 కోట్ల మొక్కలను దట్టమైన అడవుల్లో నాటాలని నిర్ణయించింది. మిగిలిన 130 కోట్ల మొక్కలను మైదాన ప్రాంతాల్లో నాటుతోంది. వేల ఎకరాల్లో కబ్జాకు గురైన భూముల్లో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 2,535.7 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చింది. నాటిన మొక్కలను ఎక్కడికక్కడ పీకేస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని, మానవ శ్రమ, ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పీసీసీఎఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటవీ భూముల క్రమబద్ధీకరణ హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పీసీసీఎఫ్ విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు... ఏడేళ్లలో 50 వేల ఎకరాల అడవులు అన్యాక్రాంతం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అటవీ భూములను ఆక్రమించిన గ్రామస్తులను వేధించరాదంటూ గత జూన్ 22న అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ సెక్షన్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. కానీ 2014 జూన్కు ముందు కబ్జాకు గురైన అటవీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అటవీశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్–2006) హక్కులు కల్పించింది. ఈ చట్టం కింద 1,86,534 దరఖాస్తులు రాగా అందులో అర్హతగల 93,494 దరఖాస్తులను ఆమోదించి 3,00,092 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన అటవీ భూముల కబ్జాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ వద్ద సమాచారం లేదు. 2008–09లో సైతం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పెద్ద ఎత్తున అడవులను నరికేసి భూములను కబ్జా చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 2007 నుంచి 2014 నాటికి కొత్తగా 58,032 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల్లో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటూ సిబ్బందిపై భౌతిక దాడులు చేసేలా స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు... ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన గన్మెన్లతో కలసి గత నెల 18న కొత్తగూడెం పరిధిలోని చాటకొండ రిజర్వ్ ఫారెస్ట్లో 100 ఎకరాల అటవీ భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నారు. అటవీ సిబ్బందిని బెదిరించి బలవంతంగా అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అవి అటవీ భూములంటూ కలెక్టర్ ఫోన్లో ధ్రువీకరించినా లాభం లేకపోయింది. జూలై 7న బెల్లంపల్లి డివిజన్లో గిరెపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో రాజారాం, వెమనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి మూడోసారి అటవీ భూముల కబ్జాకు ప్రయత్నించారు. పాఖాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో అటవీ భూమిని ట్రాక్టర్తో చదును చేసే యత్నాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి డి. నాగరాజుపై అశోక్నగర్ గ్రామ సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా హాజీపూర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని 10 హెక్టార్లలో నాటిన మొక్కలను గత నెల 5న బెల్యానాయక్ తండావాసులు పీకేశారు. ఏటూరునాగారం అటవీ సంరంక్షణ ప్రాంతంలో గత నెల 5న ఐదు ట్రాక్టర్లతో భూములను చదును చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వెళ్లిన వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తోపాటు మరో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను గ్రామస్తులు రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 13 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించారు. పెద్దపల్లి అటవీ ప్రాంతంలోని 75 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై గత నెల 5న కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మామిడిగూడ అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై గత నెల 2న టడ్వాల్ మండలం బోటిలింగాల గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. -
ఉద్యోగం వదిలేశా: రచ్చ రవి
సాక్షి, జగిత్యాల: ‘నా స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రం. నన్ను సినీ ఇండస్ట్రీయే ఎంతో గొప్పవాన్ని చేసింది. సినీరంగంలో దాదాపు 45 సినిమాల్లో అగ్రనాయకులతో నటించా. నన్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రజలు లేకుంటే నేను లేను. మున్సిపల్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చినా నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వెళ్లా. ఇంట్లో డాక్టర్ కావాలని తల్లిదండ్రులకు కోరిక ఉన్నా యాక్టర్నయ్యాను. డాక్టర్లనే నవ్వించడంతో ఇంట్లో వారు కూడా నన్ను అభినందిస్తున్నార’ని జబర్దస్త్ ఫేం రచ్చరవి తెలిపారు. శుక్రవారం జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఎంతో ఇష్టమని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్రెడ్డి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా జగిత్యాలకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఆదరించడం ఆనందంగా ఉందని.. ముఖ్య లక్ష్యం మన ఊరులో మన జమ్మిచెట్టుతో దసరా జరుపుకోవడమేనని వివరించారు. కొన్ని గ్రామాల్లో తుమ్మచెట్టుతో జమ్మి జరుపుకునే దుర్గతి వచ్చిందని.. రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా విజృంభించడంతో చెట్లే లేకుండా పోయే పరిస్థితి నెలకొందన్నారు. మనం ఎంత సంపాధించామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో అనేక చోట్ల దయగల పెట్టెలను ఏర్పాటు చేశానని.. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. నా మొదటి సినిమా వెయ్యి అబద్దాలు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. -
ప్రజాధనం–పచ్చదనం–మనం
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసంఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్యక్రమంగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నెరవేర్చాలి. హక్కుల గురించి మాత్రమే మాట్లాడే మను షులకు బాధ్యతల్ని గుర్తు చేస్తే చురుక్కుమంటుంది. తమ విధులు–బాధ్యతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి దంటారు. మన సామూహిక బాధ్యతలు కూడా ఏతావాతా మనందరం ఉమ్మడి హక్కులు నిండుగా అనుభవించడానికే అని చెబితే... ఎట్టెట్టా? అని ముక్కున వేలేసుకుంటారు. వ్యక్తిగత హక్కుల భద్ర తకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. హక్కులు, బాధ్య తలూ ఒకే నాణేనికి రెండు వైపులంటే... ‘ఓయబ్బో! ఈయనొచ్చాడయా దిగి... మాకు నీతి పాఠాలు చెప్ప డానికి, హు...!’ అన్నా అంటారు. కానీ, ఇది పచ్చి నిజం! మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య–ఉపాధి అవ కాశాల కల్పన... ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు మనం హక్కుల గురించి మాట్లాడినంత బాధ్యతల గురించి మాట్లాడం, మాట్లాడనీయం. అదీ ముఖ్యంగా పౌరుల బాధ్యతల గురించైతే అస్సలు మాట్లాడం! ఎంతసేపు ప్రభుత్వాల బాధ్య త–జవాబుదారితనం, అధికారుల విధులు–కర్త వ్యాలు, వాటి విజయ–వైఫల్యాలే మనకు సదా కథా వస్తువు. మన హక్కుల గురించి, అవి భంగపోయిన తీరు గురించి ఎంతైనా మాట్లాడతాం. అవతలి వారి బాధ్యతల గురించి, వాటి అమలులో వైఫల్యం గురించి అంతకన్నా పిసరు ఎక్కువగానే మాట్లా డతాం. మరి మన బాధ్యతల సంగతి? మన విధి నిర్వహణ మాటో! మన జవాబుదారితనం ఏం గాను? కొన్ని విషయాల్లో మనం బాధ్యతల్ని విస్మరిం చడం ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలు సుకుంటే గుండె తరుక్కుపోతుంది. పర్యావరణమే తీసుకుంటే, దాని పరిరక్షణ రాజ్యాంగం మనకు నిర్దే శించిన బాధ్యత. ఈ విషయంలో ఏ మేరకు మనం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నామని ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! పౌరులుగా, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనకూ ఈ విషయంలో విహిత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధ నాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసం ఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్య క్రమంగానే మిగిలిపోతుంది. మంచి పనికి పౌర మద్దతుండాలి జనాకర్షణ పథకాలతో ఓట్లు పిండుకునే రాజ కీయాలు నడుస్తున్న కాలంలో, ఏ వత్తిడి లేకపోయినా ప్రభుత్వాలు ‘హరితహారం’ వంటి బృహత్ కార్య క్రమం తీసుకోవడాన్ని విమర్శకులు కూడా అభినంది స్తారు. అయిదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. నాలుగో విడత హరితహారాన్ని బుధవారమే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ యేడు 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 33 శాతం ఉండా ల్సిన అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉన్నట్టు ప్రభు త్వం చెబుతోంది. అది కూడా సందేహమేనని పర్యా వరణవేత్తలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం లోనూ మార్పులు చేసి హరితహారాన్నొక శాశ్వత కార్యక్రమం చేయాలన్న సర్కారు తలంపునకు స్థాని కంగా పౌర సహాకారం ఉంటే తప్ప ఏదీ సాకారం కాదు. ఒకటి, రెండేళ్లలో ప్రతి గ్రామంలో నర్సరీని నడిపే దిశగా అడుగులు పడాలన్నది సర్కారు ఆకాంక్ష. ప్రభుత్వంలోని వివిధ శాఖల్ని అనుసంధా నపరచడం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయడం, వివిధ రూపాల్లో ఉపాధిహామీ పథకపు నిధుల్నే ప్రధానంగా వినియోగించడం... ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమా నికి గడచిన మూడేళ్లలో 2473 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. గొప్ప కార్యక్రమమే అయినా... మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటిని బతికించడంలో లేదనే విమర్శ ఉంది. ఎక్కడికక్కడ మొక్కల మనుగడ దక్కేది తక్కువే కావడం ఆందో ళన కలిగిస్తోంది. సగటు నలబై శాతం కూడా దక్క ట్లేదు. నాయకుల శ్రద్ద, అధికారుల నిబద్దత, స్థానిక సంస్థల పాత్ర, పౌర సంఘాల ప్రమేయం, ప్రజల భాగస్వామ్యం మొక్కల్ని అధికశాతం బతికించుకోవ డంలో కీలక పాత్ర వహిస్తాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధిక శాతం మనుగడ నమోదవడం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అత్యల్ప శాతం మొక్కలే బత కడం ఇందుకు నిదర్శనం. వాటిని బతికించుకోవా ల్సిన బాధ్యత పౌరులు, ప్రజా సంఘాలపైనా ఉంది. ప్రచారంపై ఉన్న శ్రద్ద పనిపై ఏది? మొక్కలు నాటే, అడవులు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అదే స్థాయి శ్రద్ద పౌరుల్ని భాగస్వాముల్ని చేయడంపై చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్వహి స్తున్న ‘వనం మనం’ ఇందుకు నిరద్శనం. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాట డాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 2015–16లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కారు లెక్క! నేలమీద అవి ఎక్కడున్నాయో జాడే లేదు! మొక్కకు సగటున రూ.15 ఖర్చయినట్టు రికార్డు రాశారు. ఇలా ఒక సంవత్సరం రూ.360 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 18.46 కోట్లు నాటామని, ఈ యేడు మరో 25 కోట్ల మొక్కలు లక్ష్యమనీ అంటోంది. 25 కోట్ల మొక్కల్ని అందించేపాటి నర్సరీల వ్యవస్థే రాష్ట్రంలో లేదనేది విమర్శ. లెక్కలే తప్ప మొక్కలు లేవని, ఉన్న మొక్కలు కూడా మొక్కుబడి పనుల వల్ల సరిగా నాట కుండానే రోడ్ల పైన పారవేసి పోతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అటవీ ప్రాంతం ఇప్పుడు 24 శాతం ఉందని చెప్పే ప్రభుత్వం, 2029 నాటికి 50 శాతం చేయాలని ‘మిషన్ హరితాం ధ్రప్రదేశ్’ చేప ట్టినట్టు విస్తృత ప్రచారం చేస్తోంది. పనిలో పనిగా కార్పొరేట్ రంగాన్ని, స్థానికసంస్థల్ని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని. పౌర సంఘాల్ని కూడా భాగ స్వాముల్ని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ‘పారిస్ ఒప్పందం’లో పలు పర్యావరణ స్వీయ నిర్భందాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులైతే నెమ్మదిగా వేస్తోంది. జనాన్ని చైతన్య పరిచే చర్యలే లేవు. ‘నష్టపరిహార అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ’ (కంపా) కింద పెద్ద ఎత్తున నిధులున్నా వాటిని వినియోగించడం లేదని ఏటా ‘కాగ్’ తప్పుబడు తోంది. రూ.39000 కోట్లుండగా ఏటా రూ.6000 కోట్లు కొత్తగా జత అవుతున్నాయి. పౌర భాగస్వా మ్యంపై ప్రభుత్వాలేవీ పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం రక్షణ ఒకరి బాధ్యత మరొకరికి హక్కు అయినట్టే, ఒకరి హక్కు ఇంకొకరి బాధ్యత అని దేశంలోని న్యాయ స్థానాలు పలుమార్లు తీర్పుల్లో స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ సవ్యంగా జరిగితేనే పౌరులం దరి జీవించే హక్కుకు భద్రత! ఇలా అందరి హక్కు రక్షణ క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత కూడా అవుతుంది. రాజ్యాంగం 21వ అధికరణంలోని జీవించే హక్కును సమగ్రంగా వివరిస్తూ, కాలుష్యరహిత జీవితం పౌరుల ప్రాథ మిక హక్కని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (ఎమ్.సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా) 1987లోనే స్పష్టత ఇచ్చింది. అధికరణం 19 (1)(జి) ప్రకారం ఏ వృత్తయినా, ఏ వాణిజ్య– వ్యాపారమైనా నిర్వహించుకోవడం పౌరుల ప్రాథ మిక హక్కే అయినప్పటికీ, దానికి కొన్ని పరిమితు లున్నాయి. సమాజం, ఇతర జనసమూహాల ఆరో గ్యాన్ని దెబ్బతీసే విధంగా పౌరులెవరూ తమ స్వేచ్ఛాయుత వాణిజ్య–వ్యాపారపు హక్కును విని యోగించుకోజాలరనీ సుప్రీంకోర్టు (కూవర్జీ బి.బరుచ్చా వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్, అజ్మీర్–1954 కేసులో) చెప్పింది. పౌర హక్కుల పరంగా... వాణిజ్య స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య వివాదం తలెత్తినపుడు న్యాయస్థానాలు సహజంగానే పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గాలని కూడా న్యాయ స్థానం స్పష్టం చేసింది. దానికి లోబడే ఏ వాణి జ్య–వ్యాపార కార్యకలాపాలైనా చేసుకోవచ్చంది. వేదాల నుంచి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రకృతితో మమైకమై సకల జీవ రాశితో మనిషి సహజీవనం సాగించడాన్నే నొక్కి చెప్పారు. అదే జరిగింది ఇంతకాలం. ‘మానవుని స్వర్గం భూమ్మీదే ఉంది. ఈ సజీవ భూగ్రహం అన్ని జీవులది. ఇది ప్రకృతి వరం. దీన్ని పరిరక్షించు కుంటూ ప్రేమాస్పద జీవనం సాగించాలి’ అని అధ ర్వణవేదంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ అన్నది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఆచరణగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా తగు భద్రత ఏర్పా ట్లున్నాయి. అటవుల సంరక్షణ, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణలో గ్రామస్థాయి నుంచి స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కల్సిస్తూ మనం రాజ్యాం గాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పౌరులకు అందించడం, అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత (అధికరణం 47, 48) అనేది తిరుగులేని భద్రత! అదే సమయంలో పౌరుల బాధ్యతను కూడా రాజ్యాంగం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. అడ వులు, చెరువులు, నదులు, జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని అభివృద్ధి పరుస్తూ సకలజీవుల పట్ల దయ, అనుకంపతో ఉండ టం ప్రతి పౌరుని బాధ్యత (అధికరణం 51–ఎ (జి)) అని చెబుతోంది. ఇప్పుడా స్ఫూర్తి సర్వత్రా రగలాలి. ప్రతి పౌరుడూ తన స్థాయిలో స్పందించాలి. ప్రతి గ్రామమూ కదలాలి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం విజయవంతమయ్యేలా తోడ్పడాలి. అది ‘కంపా’ అయినా, ‘హరితహారమై’నా, ‘వనం మనం’ అయినా... అక్కడ ఖర్యయ్యే ప్రతిపైసా ప్రజాధనం. అది వృధా కానీయకుండా ప్రయోజనం కలిగించేలా చూసే, చూడాల్సిన బాధ్యత మనది, మనందరిది! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
మోగిన హరిత హారన్..
సాక్షి, సిద్దిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం గజ్వేల్లో ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇందిరా పార్కు చౌరస్తాలో కదంబ మొక్క నాటారు. ఆ వెంటనే సైరన్ మోగడంతో చిన్నాపెద్దా, అధికారులు, నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మొక్కవోని దీక్షతో కదిలారు. లక్ష్యాన్ని మించి 1,25,235 మొక్కలు నాటి హరితహారానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం నేరుగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చేరుకొని అక్కడ విడుపకా భాగ్యమ్మ ఇంటికి వెళ్లి కొబ్బరి మొక్క నాటారు. అనంతరం ఆమె కుటుంబీకులతో కొబ్బరి, సపోటా ఇతర పండ్ల చెట్లు నాటించారు. ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వారికి సూచించారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి సహజ వనరుల అభివృద్ధిలో భాగంగా సింగాయిపల్లిలో పెంచిన అడవిని పరిశీలించారు. తక్కువ కాలంలో సహజసిద్ధమైన అడవిని రూపొందించిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు నగదు బహుమతి అందచేస్తామని తెలిపారు. పచ్చటి అడవులు, ఆహ్లాదకర వాతావరణంలో ఎమ్మెల్యేలందరితో వన భోజనాలకు వస్తామని అధికారులకు చెప్పారు. మొక్క నాటగానే మోగిన సైరన్ గజ్వేల్లో సీఎం మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో అధికారులు సైరన్ మోగించారు. ఐదు నిమిషాలు ఆగకుండా సైరన్ మోగడంతో అందరూ మొక్కలు నాటేందుకు కదిలారు. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ అరుణను పిలిచి హరితహారం తీరుపై మహిళలు ఏమంటున్నారు? వారి స్పందన ఎలా ఉందంటూ సీఎం ఆరా తీశారు. సిద్దిపేటలో అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా 1,00116 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు గజ్వేల్ పట్టణవ్యాప్తంగా 1,25,235 మొక్కలను నాటడం విశేషం. కొబ్బరి మొక్క నాటిన సీఎం హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లోని కూర భారతమ్మ ఇంటికి వెళ్లి కొబ్బరి మొక్క నాటారు. అనంతరం భారతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. నాటిన మొక్కలను పిల్లల లెక్క సాదుకోవాలని సూచించారు. తర్వాత అక్కడ్నుంచి సీఎం బస్సులో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చింతా ప్రభాకర్, మదన్మోహన్, వివేకానందరెడ్డి, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ అధికారి పీకే ఝా, డోపియల్, సిన్హా, స్పెషల్ సెక్రటరీలు భూపాల్రెడ్డి, అజయ్మిశ్రా, తివారీ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు. అటవీ పరిరక్షణకు గ్రీన్ బ్రిగేడ్ వర్గల్ (గజ్వేల్): సహజ అడవుల పునరుజ్జీవం కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసిన వర్గల్ మండలం సింగాయపల్లి అడవిని సీఎం కేసీఆర్ సందర్శించారు. గజ్వేల్ వెళ్తుండగా రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న ఈ అడవి వద్ద ఆగారు. 20 నిమిషాలపాటు అడవిలో గడిపిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. మొక్కలను, ఫైర్లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల కృషిని ప్రశంసించారు. ఈ అడవిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రస్థాయిలో అడవుల అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. అడవుల పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ బ్రిగేడ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గజ్వేల్లోని మదీనా మసీదులోని కబ్రస్థాన్లో 1,900 మొక్కలు నాటిన పోలీస్ శాఖను సీఎం అభినందించారు. కురిసిన వర్షం.. జనం హర్షం గజ్వేల్ రూరల్: గజ్వేల్లో సీఎం కదంబ మొక్క నాటగానే ఒక్కసారిగా చిరుజల్లులు కురిశాయి. అనంతరం ముఖ్యమంత్రి ప్రజ్ఞాపూర్లోని కూర భారతమ్మ ఇంట్లో మొక్క నాటేందుకు వెళ్తున్న సమయంలో మరోసారి వర్షం పడింది. సీఎం అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో సుమారు 20 నిమిషాలకు పైగా వర్షం కురిసింది. తాము నెల నుంచి ఎదురుచూస్తున్నా పడని వర్షం.. సీఎం మొక్క నాటిన వెంటనే కురిసిందంటూ జనం హర్షం వ్యక్తం చేశారు. అరుణమ్మా.. అమ్మలక్కలేమంటున్నారు? గజ్వేల్: ‘‘అరుణమ్మా... హరితహారంపై అమ్మలక్కలేమంటున్నారు...? మొ క్కలు నాటేందుకు ముందుకొస్తున్నారా..’’అంటూ సీఎం కేసీఆర్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దుంబాల అరుణను అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్లో హరితహారాన్ని ప్రారంభించిన అనంతరం పక్కనే ఉన్న అరుణను పిలిచి.. మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళల స్పందన ఎలా ఉందంటూ ఆరా తీశారు. ‘‘మీరు పట్టణానికి ఎంతో చేశారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నమూనాగా నిలబెట్టారు. ఇదే విషయాన్ని మహిళలకు చెబుతున్నాం. మొక్కలు నాటి వాటిని పరిరక్షించి సీఎంకి కానుకగా ఇద్దాం’’అని చెబితే అంతా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని ఆమె సీఎంకు చెప్పారు. మురిసిపోయిన భారతమ్మ జగదేవ్పూర్ (గజ్వేల్): ‘‘మొక్కలు నాటగానే అయిపోదు. వాటిని పెద్ద చేస్తేనే లెక్క. నేను మొక్క పెట్టి పోతా.. మీ పిల్లల లెక్క సాదుకోవాలె. ఇంట్లో ఎంత మంది ఉన్నరు? ఎన్ని మొక్కలు నాటుతున్నరు’’అని సీఎం కేసీఆర్ కూర భారతమ్మను ఆప్యాయంగా పలకరించారు. ప్రజ్ఞాపూర్లో భారతమ్మ ఇంట్లో కొబ్బరి మొక్క నాటిన అనంతరం ఆమె కుటుంబీకులతో సీఎం కాసేపు ముచ్చటించారు. తమ ఇంటి పెరట్లో 18 మొక్కలు నాటుతున్నామని ఆమె సమాధానమిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి సీఎం ఫొటోలు దిగారు. సీఎం మొక్క నాటి వెళ్లగానే కాలనీ వాసులు భారతమ్మ ఇంటికి బారులు తీరారు. వందలాది మంది వచ్చి సీఎం నాటిన కొబ్బరి మొక్కను చూసి సంబరపడ్డారు. యువకులు, ప్రజాప్రతినిధులు మొక్క వద్ద సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ‘‘సీఎం సారు నాటిన కొబ్బరి మొక్కను నా మనుమళ్లును చూసుకున్నట్టే చూసుకుంటా. మా ఇంటికి సీఎం వస్తాడని కలలో కూడా అనుకోలేదు’’అని భారతమ్మ ఆనందం వ్యక్తం చేశారు. పొరుగు వారితో మాటామంతీ భారతమ్మ ఇంట్లో మొక్క నాటేందుకు వచ్చిన సీఎంకు పక్కింటి మహిళ ఎల్లా రేణుక మంగళహారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టింది. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు ఆమెతో సీఎం మాట్లాడారు. ‘‘పూల మొక్కలు బాగున్నాయి. ఇప్పుడు ఏం మొక్కలు పెడుతున్నరు. ఇంతకు ముందు పెట్టిన మొక్కలు మంచిగున్నయా? ఎక్కడెళ్లి నీళ్లు తెచ్చి పోస్తున్నరు’’అని సీఎం అడగ్గా.. ‘‘సారూ గతంలో నాటిన పూల మొక్కలు ఇప్పుడు మస్తు పూలు పూస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్లే పోస్తున్నా’’అని రేణుక సమాధానం చెప్పారు. -
తండ్రి విసిరిన చాలెంజ్ను స్వీకరించిన సితార
-
సితార నాటిన మొక్క!
సెలబ్రెటీలకే కాదు వారి పిల్లలకు ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలో తన ఫోటోలు, తనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. మొన్న జరిగిన సితార బర్త్డే కూడా ట్విటర్లో ట్రెండింగ్గా మారింది. తాజాగా తన తండ్రి విసిరిన చాలెంజ్ను స్వీకరించిన సితార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో గ్రీన్ చాలెంజ్ ఏ రేంజ్లో పాపులర్ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రెటీలు ఈ చాలెంజ్లో భాగమవుతున్నారు. మహేష్ బాబు విసరిన చాలెంజ్ను సితార స్వీకరించి.. ఓ మొక్కను నాటిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్గా మారుతోంది. మరోపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విసిరిన ఈ గ్రీన్ చాలెంజ్ను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ స్వీకరించారు. అలాగే మహేష్ బాబు విసిరిన చాలెంజ్ను డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్వీకరించి సమంత, కాజల్, దేవి శ్రీ ప్రసాద్లకు సవాల్ విసిరారు. -
నేడు నాలుగో విడత ‘హరితహారం’
-
నేడు గజ్వేల్లో ‘హరితహారం’
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్ : హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం గజ్వేల్లో మొక్కలు నాటనున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒకటి, ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో మరొకటి, ఇందిరాచౌక్ దగ్గర ఇంకొకటి మొత్తం మూడు మొక్కలను సీఎం నాటుతారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, రోడ్లపై, ఔటర్రింగ్ రోడ్డుపై, ప్రభుత్వ–ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ గజ్వేల్కు చేరుకుని ఇందిపార్కు చౌరస్తాలో ‘కదంబ’మొక్క నాటడంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగిస్తారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్లో వినాయక ఆలయం ముందు ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో ఓ మొక్క నాటుతారని సమాచారం. సైరన్ మోగిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఏకకాలంలో ప్రజలు మొక్కలు నాటుతారు. ఏర్పాట్లు పూర్తి.. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇళ్లలో పెంచేందుకు చింత, మామిడి, నేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి తెప్పించారు. దాదాపు 1.25 లక్షల మొక్కలను ములుగు, గజ్వేల్ నర్సరీలతో పాటు కల్పకవనం అర్బన్ పార్కుల్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి మొక్కలను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కోక్లస్టర్లో 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకు వీలుగా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1.25 లక్షల గుంత లను తవ్వించారు. సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, నేరేడు), 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సిద్ధం చేశారు. ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ఇంట్లో రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్లలోని ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేశారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీగార్డులను కూడా అధికారులు సిద్ధం చేశారు. మొక్కలు నాటిన తర్వాత వర్షాలు సరిగా పడకపోతే నీటిసౌకర్యం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. కాగా, గజ్వేల్లో సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు పరిశీలించారు. గజ్వేల్ మున్సిపాలిటీ, అర్బన్ ఫారెస్ట్ ఏరియాల్లో కలిపి మొత్తం 1.36 లక్షల మొక్కలు నాటాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. 799 ప్రాంతాల్లో కంటి వెలుగు.. ఆగస్టు 15న మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 799 ప్రాంతాల్లో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని, ప్రతి కేంద్రంలో కూడా కచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కంటి పరీక్షలు చేయడానికి అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు, అద్దాలను గ్రామాలకు చేర్చాలని చెప్పారు. -
కేటీఆర్ చాలెంజ్ను స్వీకరించిన సచిన్
ఇటీవల దేశ వ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్నెస్ చాలెంజ్ను స్వీకరించి తమ వర్క్ అవుట్ వీడియోలను పోస్ట్ చేశారు. అయితే తాజాగా తెలంగాణ నేతలు మాత్రం పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర చాలెంజ్కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) విసిరిన చాలెంజ్ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వీకరించారు. కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ స్వీకరించిన సచిన్ కొన్ని మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. తనను ఇలాంటి చాలెంజ్కు ఆహ్వానించినందుకు కేటీఆర్కు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్యూ మాస్టర్.. మీరు కూడా మరో ఐదుగురిని హరితహారం చాలెంజ్కు నామినేట్ చేయండి అని సచిన్కు సూచించారు. హరితహారంలో లక్ష్మణ్ సైతం.. వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్మెన్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ను స్వీకరించారు. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టమని పేర్కొంటూ మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. కేటీఆర్ చాలా గొప్ప చాలెంజ్ను మొదలుపెట్టారు. నేను కూడా వీరేంద్ర సెహ్వాగ్, మిథాలీరాజ్, పీవీ సింధులను హరితహారం చాలెంజ్కు ఆహ్వానించారు. మూడు మొక్కలు నాటాలని తన ట్వీట్లో లక్ష్మణ్ చాలెంజ్ చేశారు. లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. Thank you, @KTRTRS, for nominating me for the green challenge #HarithaHaram. I accept the challenge and hope all of you do too. The key to a greener planet is in our hands. pic.twitter.com/vMzifaGjlm — Sachin Tendulkar (@sachin_rt) 28 July 2018 Thanks Master 🙏🙏 You also have to nominate five more to take the challenge further #HarithaHaram https://t.co/G0wyHxrnrq — KTR (@KTRTRS) 28 July 2018 Many thanks Laxman 👍 https://t.co/lSd0ia9dJI — KTR (@KTRTRS) 28 July 2018 కవిత చాలెంజ్ స్వీకరించిన రాజమౌళి -
ఆదివాసీలను అవమానిస్తారా?
సాక్షి, కొత్తగూడెం : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను, ఉద్యమకారులను తీవ్రంగా అవమానిస్తోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. గురువారం కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై మహాధర్నా నిర్వహించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని విమర్శించారు. గిరిజన రైతులను అవమానిస్తున్నారని, పోడు భూములకు పట్టాలు అడిగితే కేసీఆర్ సొంత ఆస్తిలో వాటా అడుగుతున్నట్లు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి పాలన చేస్తున్న కేసీఆర్ మగాడేనా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్ కుటుంం మాత్రమే బంగారంలా పదవులు అనుభవిస్తోందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు ఎత్తేయకుండా హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ తానే తెచ్చినట్లు భావించుకుంటున్నారని, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కుండువాలు కప్పుకున్నవారికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తున్నారని అన్నారు. రెండు ట్రాక్టర్లు ఉన్నవారికే మూడో ట్రాక్టరు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్కు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసే సమయం ఉంటుంది కానీ.. ప్రజల సమస్యలు తెలుసుకునే తీరిక మాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మల్లు రమేష్, రాయల నాగేశ్వరరావు, మాలోత్ రాందాస్నాయక్, లకావత్ గిరిబాబు, హరిప్రియ, బాణోత్ పద్మావతి, లెనిన్, ధనుంజయ్నాయక్, ఏసుపాదం, దీపక్చౌదరి, సత్యనారాయణ చౌదరి, చెన్నకేశవరావు, దేవ్లానాయక్, ఓంప్రకాష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కొక్కరికి.. వెయ్యి ఈత మొక్కలు!
బషీరాబాద్ : 4వ విడత హరితహారంలో తొమ్మిది లక్షల మొక్కలు నాటాలని జిల్లా ఆబ్కారీ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కలు నాటాలంటే సుమారు రెండు వేల ఎకరాల స్థలం కావాలని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మూడో విడతలో చెరువుగట్లపై, గీతా కార్మిక సొసైటీ భూముల్లో, అసైన్డ్ భూముల్లో 8 లక్షల మొక్కలు నాటారు. సంరక్షణలేక పోవడంతో అందులో సగానికి పైగా ఎండిపోయాయి. దీంతో ఈసారైనా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయనుంది. ఈ విడత లక్ష్యం చేరుకోవడానికి ఎక్సైజ్ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో తొమ్మిది లక్షల ఈత మొక్కలను ఎక్కడ నాటాలనే ఆలోచనలో పడింది. ఇప్పుడున్న చెరువు గట్లు మీద పెట్టినా స్థలం సరిపోదని భావించిన ఆబ్కారీ అధికారులు సరికొత్త ఆలోచనకు తెరలేపారు. హరితహారం లక్ష్యాన్ని గీతా కార్మికులకు నిర్ధేశించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొక్కలు నాటడానికి స్థలాలులేకుంటే గౌడల పట్టా భూముల్లోనైనా నాటించాడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఒక్కో గీతా కార్మికుడికి ఐదు వందల నుంచి వెయ్యి ఈత మొక్కలు నాటాలని ఆదేశిస్తున్నారు. గౌడలు ఇంత పెద్దమొత్తంలో మొక్కలు ఎలా నాటాలని లోలోన మదన పడుతున్నారు. అధికారుల ఆదేశాలు విస్మరిస్తే కష్టాలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పట్టా భూముల్లో నాటండి తాండూరు నియోజకవర్గంలో 4వ విడత హరితహారం కింద 3లక్షల ఈత మొక్కలు నాటాలని లక్ష్యం ఉంది. దీనికోసం ఒక్కో గీతా కార్మికుడు తప్పనిసరిగా వెయ్యి మొక్కలు నాటాలని తాండూరు ఎక్సైజ్ సీఐ రమావత్ టుక్యానాయక్ ఆదేశిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని మైల్వార్లో ఓ గీతా కార్మికుడి ఇంటికి మంగళవారం వెళ్లి విషయాన్ని చెప్పడంతో అతడి నోట మాట రాలేదు. ‘ఇన్నీ మొక్కలు ఇస్తే ఎక్కడ నాటాలి సార్.. పోయినేడాది నాటిన మొక్కలకే జాగ లేదు.. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి..’ అంటూ ఆ గీతా కార్మికుడు సీఐని ప్రశ్నించారు. మీ పట్టా భూముల్లో నాటండడని సీఐ సమాధానం చెప్పారు. -
గ్రామానికి ఒక నర్సరీ..
జనగామ : జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో కలిసి ప్లాంటేషన్ల పెంపకం, నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కోసం ముందస్తుగా మొక్కలను పెంచేందుకు అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలతో నర్సరీలను పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీర్ ఆదేశాల మేరకు ఈ సమీక్ష.. శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, లక్ష్యాలను చేరుకోని అధికారులు, సిబ్బందిపై పంచాయతీరాజ్ యాక్టు–2018 ప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు, కార్యదర్శులు ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. నర్సరీలతోపాటు ప్రతి కుటుంబం ఆరు మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించుకునే విధంగా అవగాహన కలిగించాలని తెలిపారు. అనంతరం మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ హరితహారం పర్యావరణ సమతుల్యత, వాతావరణ పరిస్థితులను కాపాడాలన్నారు. 33 శాతానికి పైగా అడవులు ఉంటేనే పుష్కలంగా వర్షాలు కురస్తాయన్నారు. డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5,6 తేదీల్లో మండలస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసుకుని, వచ్చే ఏడాది కోసం ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. సమీక్షలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బండ పద్మాయాదగిరిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ ఈశ్వరయ్య, హేమలత, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి ఓఎస్డీతో నటి జీవిత భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో మంగళవారం సినీనటి జీవిత రాజశేఖర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవిత హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. ఓఎస్డీతో సమావేశం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు. జులై 1 న తమ కూతురు శివాని పుట్టినరోజు సందర్భంగా హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు. -
నాటిన ప్రతి మొక్కను కాపాడాలి
చందుర్తి (వేములవాడ) : హరితహారంలో నాటి ప్రతి మొక్కను కాపాడాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో హరితహారంలో నాటిన మల్బరీ తోటను శుక్రవారం పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధిహామీ వన నర్సరీని పరిశీలించి, ప్రతి మొక్కను ఎండి పోకుండా కాపాడి లక్ష్యాన్ని సాధించాలని ఉపాధిహామీ సిబ్బందికి సూచించారు. అలాగే ఉపాధిహామీలో నిర్మించిన పశువుల పాక, పశువుల తొట్టిని పరిశీలించి ఉపాధిహామీ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం వైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని కోరారు. ఆయన వెంట ఉపాధిహామీ పీడీ రవీందర్, ఏపీడీ మదన్మోహన్, మండల ప్రత్యేకాధికారి మోహన్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు దనుంజయ్ ఉన్నారు. అర్హులందరికీ పింఛన్లు.. అర్హులదరికీ వచ్చే నెల నుంచి పింఛన్లు తప్పకుండా అందిస్తామని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మండలంలోని మానాల గ్రామంలో అర్హులకు పింఛన్ అందడం లేదనే ఫిర్యాదు మేరకు శుక్రవారం కలెక్టర్ ఆ గ్రామంలో స్వయంగా విచారణ చేపట్టారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు అందడం లేదని.. వచ్చే నెల నుంచి అందజేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్పై గ్రామస్తుల ఆగ్రహం కలెక్టర్ సాక్షిగా రుద్రంగి తహసీల్దార్ రమేశ్బాబుపై మానాల గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సుమారు 60మందికిపైగా కల్యాణలక్ష్మి పథకానికి ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ డబ్బులు అందలేదంటూ బుక్యా అమర్సింగ్, గుగలోతు రాజం, సుద్దపెల్లి గంగరాజం, సిద్దిమల్ల రాజం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం లోపు పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను అందజేయాలని కలెక్టర్, తహసీల్దార్ను హెచ్చరించారు. ప్రకృతి ఒడిలో అల్పాహారం మానాల ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న ప్రకృతి ఒడిలో కలెక్టర్, జిల్లా, మండల స్థాయి అధికారులతో అల్ఫాహారం చేశారు. వెంటేశ్గౌడ్ అనే గీత కార్మికుడు తాటి ముంజలను కోసి ఇవ్వగా కలెక్టర్ వాటిని ఆరగించారు. -
తప్పుడు లెక్కలు చెబితే చర్యలు
మెదక్జోన్: నాటిన మొక్కల విషయంలో తప్పుడు లెక్కలు చెబితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని, మొక్కలు చనిపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం క్యాంపు కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో హరితహారంపై విద్యాశాఖ, ఎంపీడీఓ, పోలీస్, ఎక్సైజ్, ఉపాధిహామీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో హరితహారంలో నాటిన మొక్కల్లో తప్పుడు లెక్కలు చూపినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో శాఖలోని అధికారులు వారు మొక్కలు నాటే లక్ష్యం ఎంత? ఎన్ని మొక్కలు నాటారు. వాటిలో ఎన్ని చనిపోయాయి? ఎన్నింటిని రక్షించారు? అనే వివరాలతో పూర్తిస్థాయి లెక్కలు తనకు బుధవారం అందించాలని ఆదేశించారు. ఈ లెక్కల్లో తప్పులు ఉంటే చర్యలు తప్పవన్నారు. పోలీసులు మొక్కలు నాటినప్పటికీ వాటిని పరిరక్షించడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రహరీలు లేకున్నా మొక్కలను రక్షించారని, సంరక్షించాలనే తపన ఉంటే నాటిన ప్రతీ మొక్కను రక్షించవచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాములు, డీఎఫ్ఓ పద్మజ,డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,ఎస్ఐలు, ఎంఈఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పాఠశాల తనిఖీ.. కొల్చారం(నర్సాపూర్): ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం నిర్వహణ తీరుపై ఆరా తీసేందుకు మంగళవారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ కొల్చారం మండలంలో సందర్శించారు. మండల పరిధిలోని అంసాన్పల్లి, వరిగుంతం ఉన్నత పాఠశాలలను సందర్శించిన ఆమె అక్కడి పాఠశాలల్లో హరితహారం మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జేసీ నగేష్, డీఎఫ్ఓ పద్మజారాణి, ఎంపీడీఓ వామనరావు, ఎంఈఓ నీలకంఠం, పాఠశాల సిబ్బంది ఉన్నారు. మొక్కల పెంపకంపై హెచ్ఎంలతో సమీక్ష నర్సాపూర్: విద్యార్థులకు విద్యతో పాటు చుట్టూ మంచి పర్యావరణం కూడా అవసరమని రాష్ట్ర హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో పాఠశాలల్లో మొక్కల పెంపకంపై సమీక్ష నిర్వహించారు. హరితహారంలో మొక్కల పెంపకంలో జిల్లా వెనుకబడిందని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సాపూర్, కొల్చారం తదితర మండలాల్లో పాఠశాలల్లో మొక్కల పెంపకం బాగుందని సంబంధిత హెచ్ఎంలను అభినందించారు. హెచ్ఎంలు మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రహరీలు లేని పాఠశాలల చుట్టూ గచ్చికాయ మొక్కలు నాటితే పశువులు రాకుండా ఉండడంతో పాటు నాటిన ఇతర మొక్కలకు రక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఎఫ్ఓ పద్మజా రాణి, నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ దశరథ్, ఎఫ్ఆర్ఓ రాఘవేందర్రావు, ఎంఈఓ జెమినీ కుమారి పాల్గొన్నారు. -
నిలవని మొక్క..
హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.. కోట్ల మొక్కలు పెంచి.. నాటేందుకు రూ.కోట్లు ఖర్చు చేసింది.. వాటి రక్షణపై పర్యవేక్షణ కొరవడింది.. నీరందక.. చుట్టూ కంచె ఏర్పాటు చేయక.. అర్ధంతరంగా వాడిపోతూ.. ఎండిపోతున్నాయి.. వీటిలో ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్అండ్బీ రోడ్ల వెంట నాటిన మొక్కలే ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విడతలవారీగా చేపట్టి.. మొక్కలు నాటుతోంది. 2017–18లో హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా 1.80 కోట్ల మొక్కలు జిల్లాలో నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రూ.కోట్లు ఖర్చు చేసి నర్సరీల్లో మొక్కలు పెంచి.. నాటిన అధికార యంత్రాంగం వేసిన మొక్కలను రక్షించేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ నాటిన మొక్కలు పూర్తిస్థాయిలో బతకడం లేదు. మూడో దశ హరితహారంలో జిల్లాలో 1.80 కోట్ల మొక్కలు నాటారు. వాటికి సరైన రక్షణ, నీటి సౌకర్యం లేకపోవడంతో సుమారు 60 లక్షల మొక్కలకుపైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేవలం 65 శాతం మొక్కలు మాత్రమే బతికున్నాయి. చనిపోయిన వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్అండ్బీ రోడ్ల వెంబడి నాటిన మొక్కలే అధికంగా ఉన్నాయి. రూ.కోట్లు ఖర్చు.. హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నర్సరీల ద్వారా మొక్కలు పెంచేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టలేకపోతోంది. జిల్లాలో మూడో విడత హరితహారానికి ఐదు శాఖలు మొక్కలను పెంచాయి. వీటిలో డీఆర్డీఏ నుంచి జిల్లాలో 25 నర్సరీల ద్వారా రూ.1.17కోట్లు ఖర్చు చేసి 28 లక్షల మొక్కలను పెంచారు. వీటిలో ఉపాధిహామీ పథకం ద్వారా 11,32,041 మొక్కలు నాటారు. వీటికోసం తీసిన గుంటకు, మొక్కను నాటినందుకు కూలీ ఖర్చు, మెటీరియల్, నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ కోసం రూ.2.94కోట్లు ఖర్చు చేశారు. దీంతో డీఆర్డీఏ ద్వారా మొక్కలను పెంచి.. నాటినందుకు రూ.4కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో వాటిని బతికించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఒక్కో మొక్కకు రూ.25 ఖర్చు.. నాటిన మొక్కలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకం గా నిధులు ఖర్చు చేస్తోంది. రోడ్ల వెంట మొక్కలు నాటిన తర్వాత వాటిని పశువులు తినకుండా ప్రత్యేకంగా రక్షణ వలయాలు ఏర్పాటు చేసేందుకు రూ.139 చొప్పున ఖర్చు చేస్తోంది. ప్రతి మొక్కకు నీళ్లు పోసి నెలకు రెండుసార్లు ఎరువు అందించేందుకు రూ.25 వెచ్చిస్తోంది. రోడ్ల వెంబడి, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కల కోసం ఆ నిధులను ఖర్చు చేస్తున్నా రు. ఇంత చేస్తున్నా.. పూర్తిస్థాయిలో మొక్కల రక్షణకు చర్యలు చేపట్టకపోవడం.. పలు ప్రాంతాల్లో వేసిన మొక్కలు ఎదగకపోవడంతోపాటు చనిపోతున్నాయి. దీంతో హరితహారం లక్ష్యం నీరుగారిపోతోంది. నీరు లేదు.. ఎరువు లేదు.. హరితహారంలో నాటిన మొక్కల రక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. వాటికి రక్షణ వలయాలు ఏర్పాటు చేయడంతోపాటు నీరు పోయడం, ఎరువులు అందించేందుకు nప్రత్యేకంగా ఖర్చు చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద నాటిన ఒక్కో మొక్కకు రూ.25 పెంపకం ఖర్చుకు కేటాయించింది. అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలకు నీరు పోసేవారు కరువయ్యారు. పలు ప్రాంతాల్లో మొక్కలు ఎదగడం లేదు. కొన్నిచోట్ల చనిపోతున్నాయి. ప్రజల భాగస్వామ్యం కరువు.. పంచాయలో తీల పరిధిప్రభుత్వ శాఖలు వేసిన మొక్కలను రక్షించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. అధికారు లు కూలీలను ఏర్పాటు చేసి.. మొక్కలను నీరందిస్తున్నా.. ఎదుగుదలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. ఇందులో ప్రజలు భాగస్వాములు కాలేకపోతున్నారు. గ్రా మాల్లో ఇళ్ల వద్ద, పొలం గట్లు, రోడ్ల వెంబడి వేసిన మొ క్కలను కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో పశువుల కు ఆహారంగా మారుతున్నాయి. కార్యక్రమంలో ప్రజల ను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తే నాటిన మొ క్కలన్నింటినీ బతికించొచ్చు. ఇందుకు అవగాహన కల్పించాలని పలువురు పర్యావరణవేత్తలుపేర్కొంటున్నారు. -
హరితహారం.. దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: తాను హెలికాప్టర్లో వస్తుంటే తెలంగాణలో గ్రీనరీ కనిపించిందని కేంద్ర అటవీ, పర్యావరణ, కల్చరల్ శాఖల మంత్రి డాక్టర్ మహేశ్శర్మ అన్నారు. తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని, రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఆర్ఎఫ్సీలోని హోటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి క్యాలెండర్, స్టిక్కర్స్ను, ఈపీటీఆర్ఐ వార్షిక నివేదికలను మహేశ్శర్మ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్నతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్శర్మ మాట్లాడుతూ, చారిత్రక ఘట్టాలకు తెలంగాణ నిలువుటద్దమనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక అభిమానం అని చెప్పారు. హరితహారం కార్యక్రమం తెలంగాణ మెడలో మణిహారమని, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడం అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు. టూరిజానికి మంచి భవిష్యత్తు ఉందని, టూరిజం ద్వారా తెలంగాణ భవిష్యత్ మార నుందన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైవ్ స్టాక్ హెరిటేజ్ ఫాం నెలకొల్పాలని జోగు రామన్న కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా పాల్గొన్నారు. -
మేమొస్తున్నామని డ్రామా చేశారా?
చందంపేట(దేవరకొండ): ‘నర్సరీలపై ఇంత నిర్లక్ష్యమా? మేము వస్తున్నామని ఎక్కడి నుంచో మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారా? డ్రామా చేస్తున్నారా? బుర్ర పనిచేయడం లేదా? పది రోజుల్లో మళ్లీ వస్తా.. నర్సరీల్లోని మొక్కలన్నీ బతకాలి..’ అంటూ తెలంగాణకు హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్లాపురం, కోరుట్ల గ్రామాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీలను నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి ఆమె పరిశీలించారు. వన నర్సరీల పెంపకంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. తాము వస్తున్నట్లు సమాచారం మేరకు తాత్కాలికంగా కొన్ని మొక్కలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, మట్టి నమూనాలు లేకుండా మొక్కలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. మొక్కల సంరక్షణకు పంపిణీ చేసిన నెట్లను కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలో ఉన్న నర్సరీల్లో గ్లీనరీ కనిపించాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ప్రతి మొక్క బతకాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవుల శాతాన్ని 30 శాతం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉందన్నారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో వంద కోట్లు, సామాజిక అడవుల కింద 120 కోట్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.80 కోట్ల నిధులు ఉన్నాయి : కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 80 కోట్ల నిధులున్నాయని నల్లగొండ కలెక్టర్ ఉప్పల్ తెలిపారు. నర్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో నర్సరీలో పనులకు రావడం లేదని కూలీలు కలెక్టర్కు తెలిపారు. వేతనాలు రేపటిలోగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో వర్క్షాప్ ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శాంతారాం, ఆర్డీఓ లింగ్యానాయక్, ఎఫ్డీ లోవు సుదర్శన్రెడ్డి, జి.రవి, ఎఫ్ఆర్వో సర్వేశ్వర్, ఇన్చార్జ్ ఎంఈఓ శంకర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, శేఖర్ ఉన్నారు. -
నిర్దిష్ట సమాచారమిస్తే విచారణ
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంటే ఇవ్వాలని, విచారణ జరిపిస్తామని అటవీశాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో మాట్లాడారు. హరితహారం కింద అవినీతి జరుగుతోందని, మొక్కలు నాటకున్నా, మొక్కలకు నీళ్లు పోయకపోయినా.. ఇవన్నీ చేసినట్లు కాగితాలపై తప్పుడు లెక్కలు చూపి కొందరు అధికారులు నిధులను స్వాహా చేస్తున్నారని విపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సభ్యులు ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి బదులిచ్చారు. 2019 నాటికి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది నాటిన మొక్కల్లో 27.72 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. మొక్కల సంరక్షణకు వేసవిలో 3,200 ట్యాంకర్లతో నీరు అందించామన్నారు. అధికార పార్టీ సభ్యులు బి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్ రెడ్డి, పూల రవీందర్, భూపాల్ రెడ్డి, ఎ.కృష్ణారెడ్డి.. హరితహారం ప్రయోజనాలు వివరించారు. భవిష్యత్తులో జరగనున్న జాతీయ రహదారుల విస్తరణను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన స్థలాన్ని విడిచిన తర్వాతే హరితహారం కింద మొక్కలను నాటాలని బీజేపీ సభ్యుడు ఎం.రాంచంద్రరావు సూచించారు. హరితహారం కార్యక్రమంలో కక్కుర్తికి పాల్పడి దొంగ లెక్కలు చూపితే దేవుడు కూడా క్షమించడని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. 2019 నాటికి 140 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ఎంఐఎం సభ్యుడు అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రశ్నించారు. -
అది అపహాస్యహారం!
సాక్షి, హైదరాబాద్: హరితహారం అపహాస్యహారంగా మారిందని కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని.. అసలు కరీంనగర్లో సీఎంనాటిన మొక్కనే రక్షించలేని దుస్థితి ఉంటే.. మిగతా మొక్కలు ఎలా బతికి ఉంటాయని నిలదీశారు. హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ తరఫున డీకే అరుణ మాట్లాడారు. ‘‘ఐదేళ్లలో 231 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కలు 81 కోట్లని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇంకా ఏడాదిన్నరలో మిగతా మొక్కలు నాటడం సాధ్యమా? నాటిన మొక్కల్లో 91 శాతం బతికాయని మంత్రి చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రజలను సంసిద్ధులను చేయకుండా వందల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న హరితహారం అపహాస్యహారంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమేనని నిరూపించేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉందా?..’’అని నిలదీశారు. అంతా కాగితాలపైనే..! పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నంత మాత్రాన పథకాలు విజయవంతం అవుతాయనుకుంటే పొరపాటేనని, హరితహారం విషయంలో ప్రభుత్వం ఇదే చేస్తోందని డీకే అరుణ విమర్శించారు. మొక్కలను రక్షించేందుకు ఉద్దేశించిన గ్రీన్ బ్రిగేడ్ కాగితాలకే పరిమితమైందన్నారు. హైదరాబాద్లో నాలుగు గోడల మధ్య కూర్చుని అంకెలు సిద్ధం చేస్తే పథకం విజయవంతమైనట్టేనా? అని ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ, కాళేశ్వరం, పాలమూరులాంటి ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల అటవీ భూమిని వినియోగిస్తుండడంతో.. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయ చర్యలేమిటని నిలదీశారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం జరిగిన ఖర్చుపై సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) జరిగి ఉంటే సభ్యులకు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. ఖర్చు వివరాలు సభ ముందు పెట్టండి హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం బతికే ఉన్నాయని అటవీ శాఖ మంత్రి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటినట్టు పేర్కొన్నారని.. తన నియోజకవర్గంలో అన్ని మొక్కలు ఎక్కడ నాటారో చూపాలని ప్రశ్నించారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని.. ‘ఆ లెక్కలు జీహెచ్ఎంసీ వెలుపలివి. జీహెచ్ఎంసీ లెక్కలు వేరే ఉన్నాయి. ఇచ్చిన కాగితాలు సరిగా చదవకుండా మాట్లాడితే ఎలా?’అని ప్రశ్నించారు. హరితహారానికి రూ.2,008 కోట్లు ఖర్చయినట్టు వివరాలు సభ ముందుంచాలన్నారు. మామూలు మొక్కలే నాటుతున్నారు హరితహారంలో పెళుసుగా ఉండే మొక్కలే నాటుతున్నారని, వాటి బదులు గట్టివైన రావి, చింత, వేప, మామిడి లాంటి రకాలను నాటా లని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సూచించారు. తొందరగా పెరగాలన్న లక్ష్యంతో మామూలు మొక్కలను నాటుతున్నారని, నీటి ఎద్దడిని తట్టుకోగలిగే మొక్కలను నాటితేనే హరితహారానికి అర్థముంటుందని స్పష్టం చేశారు. వన్యప్రాణి చట్టం తరహాలో మొక్కలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు అవసరమన్నారు. సలహా సంఘాన్ని వేయండి: అక్బరుద్దీన్ హరితహారం పథకం అమలు తీరు పరిశీలన, సూచనలు ఇవ్వడం కోసం ఓ సలహా సంఘాన్ని వేయాలని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ సూచిం చారు. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని ప్రభుత్వం చెబుతోందని, అదే సమయంలో వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్న తీరును పట్టించుకోవటం లేదని విమర్శించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంఖ్య విషయంలో సంబంధిత వెబ్సైట్లోనే వేర్వేరు సంఖ్యలను పేర్కొన్న విషయాన్ని ఎత్తిచూపారు. -
బహ్రెయిన్లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతలు జయశంకర్ సారుకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారం తెలంగాణకు మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు బహ్రెయిన్లో హరితహారం చేపట్టారు. బహ్రెయిన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై సార్ పరిశీలన చాలా గొప్పగా ఉండేదని.. ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్ లాంటి నేతలు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
హరిత హారంలో రాణీ, జోగేంద్ర
-
‘శాట్స్’ హరితహారానికి విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హరితహారం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి ఆద ర్శ్నగర్లోని రిడ్జ్ హోటల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో శాట్స్ విద్యార్థులు, అధికారులు, టూరిజం శాఖ సిబ్బంది దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ పి. రాములు, ఎండీ క్రిస్టియానా చొంగ్తూ, సీనియర్ కోచ్ ఎస్ఎం ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ, మాజీ అథ్లెట్ పి. శంకర్, టీటీ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
హరిత మిథాలీ
-
'నగరంలో కోటి మొక్కలు నాటుతాం'
హైదరాబాద్ : సనత్నగర్లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మొక్కలు నాటారు. హరిత తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో కోటి మొక్కలు నాటబోతున్నామని తెలిపారు. -
ఇంటింటికీ మొక్కలు
సాక్షి, హైదరాబాద్: తులసి, కరివేపాకు, కలబంద, బంతి, చామంతి, క్రోటన్స్, మందార, ఫౌంటెన్ గ్రాస్, సైకస్, ఫైకస్, గన్నేరు, జామ.. ఇలా ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఈసారి హరితహారం కార్యక్రమంలో పంపిణీకి సిద్ధమయ్యాయి. నగర వ్యాప్తంగా బుధవారం హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం రహదారుల వెంట.. ఖాళీ స్థలాల్లో.. నీడనిచ్చే వృక్షాల మొక్కలను అధిక సంఖ్యలో నాటినప్పటికీ, వాటిని సంరక్షించే వారు కరువైన నేపథ్యంలో ఈసారి ఇళ్లలో పెంచే మొక్కలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రేటర్లోని కోటి మొక్కల్లో 93.72 లక్షల మొక్కలు ఇళ్లకే పంపిణీ చేసేందుకు నిర్ణయించిన జీహెచ్ఎంసీ అందుకు అనుగుణంగా ఇళ్లలో పెంచే మొక్కలనే భారీ సంఖ్యలో అందుబాటులో ఉంచింది. ఎవరింట్లో మొక్కను వారు శ్రద్ధగా కాపాడతారనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొక్కల పంపిణీకి అన్ని డివిజన్లలో ముఖ్య ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోరిన వారందరికీ లేదనకుండా మొక్కలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిఇంట్లో మొక్కలు నాటాలనేదే లక్ష్యమన్నారు. మొక్కలు ఇచ్చిన వారి పేర్లు, ఆధార్ వివరాలు కూడా సేకరించనున్నట్లు తెలిపారు. తద్వారా మొక్కలు దుబారా కాకుండా ఉంటాయన్నారు. గోడలపై పెరిగే గ్రీన్కర్టెన్స్కు కూడా ఈసారి ప్రాధాన్యమిచ్చారు. తొలిరోజే 1.99 లక్షల మొక్కలు .. హరితహారం ప్రారంభం రోజునే గ్రేటర్లోని 141 ప్రధాన ప్రాంతాల్లో 1,95,700 లక్షల మొక్కలు నాటడంతోపాటు పలువురికి ఉచితంగా పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. పలు స్వచ్చంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, జీహెచ్ఎంసీ వార్డు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. పలు కాలనీలలో నాటిన మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్లను స్వచ్ఛందంగా అందజేశారని పేర్కొన్నారు. దేశమంతా 50 కోట్ల మొక్కలు.. ఒక్క రాష్ట్రంలోనే 47 కోట్లు: కేటీఆర్ నగరంలోని వెస్ట్జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మొక్కలు నాటిన మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ.. దేశంలోని 28 రాష్ట్రాల్లో వెరసి 50 కోట్ల మొక్కలు నాటుతుండగా, ఒక్క తెలంగాణలోనే ఈ సంవత్సరం 47 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ నగరంలో ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తొలగించే చెట్టను వేరే ప్రాంతాల్లో తిరిగి ట్రాన్స్లొకేట్ చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్