Indira Park
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
మూసీ పక్కన టెంపుల్స్ కూల్చే దమ్ముందా?.. కిషన్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్కు సవాల్ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని రేవంత్కు కల వచ్చినట్టుంది.రేవంత్కి మరో సవాల్ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
-
కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా
-
ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై దాడికి దిగిన కాంగ్రెస్ నేతలు
-
ఇందిరాపార్కు వద్ద ANMల ఉద్రిక్తత
-
గాంధీభవన్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతుల నిరసనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు.. ఇందిరా పార్క్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్ చేయాలని ఏఎన్ఎంలు ఆందోళన చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు -
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా
-
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
తలసాని Vs రేవంత్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. తలసాని Vs రేవంత్ కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. -
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ప్రభుత్వం అరెస్ట్లు చేస్తోంది: షర్మిల
-
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
హైదరాబాద్లో హై టెన్షన్.. అసెంబ్లీ టూ ప్రగతి భవన్ రోడ్డు మూసివేత!
సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించారు. వీఆర్ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున జిల్లాల నుంచి వీఆర్ఏలు హైదరాబాద్కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందిరా పార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. -
ఇందిరా పార్క్లో హోలీ సంబరాలు
-
9న ఉపాధ్యాయుల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వస్తున్నట్టు తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించింది. యూఎస్పీసీ నేతలు సోమవారం హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. బలవంతపు బదిలీలు చేశారు.. టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ, టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్లో ‘నాన్ లోకల్స్ గో బ్యాక్’ అనే నినాదం బలపడే వీలుందన్నారు. టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. పరస్పర బదిలీల్లోనూ అన్యాయమైన నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వివాహానికి ముందు స్థానికతను ప్రమాణంగా తీసుకుంటే ఎంతోమంది నష్టపోతారని తెలిపారు. పరస్పర బదిలీల్లో సీనియారిటీని కోల్పోవాల్సిన పరిస్థితి టీచర్లకు నష్టం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని డీటీఎఫ్ నేత టి.లింగారెడ్డి అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ఎదురీత తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని టీచర్లు ఎంతమాత్రం సహించలేరని టీపీటీఎఫ్ నేత మైస శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని యూఎస్పీసీ టీచర్లకు పిలుపునిచ్చింది. విలేకరుల సమావేశంలో జాదా వెంకట్రావ్, ఎ.రమణ, గాలయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్భవన్కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. -
గవర్నర్ తమిళిసైని కలిసిన టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారు చదవండి: మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్ ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ముగిశాఖ టీఆర్ఎస్ మంత్రులు బస్సులో రాజ్భవన్కు చేరుకున్నారు. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర విధానం వల్ల రైతులు దెబ్బతింటున్నారని, కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని స్పష్టం చేశారు. పంజాబ్లో మాదిరిగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని.. గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు ‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం ఢిల్లీ దాకా పోవాలి. కేంద్రం కళ్ళు తెర్పించడానికి ఈ యుద్ధం. మంత్రులే ధర్న కు కూర్చుంటున్నారు అంటున్నారు. 2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు’ కాదు అని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సాయి చంద్ పాటకు మంత్రి కేటీఆర్ చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. -
ఇందిరాపార్క్ వద్ద రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా
-
లవర్స్కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్లో ప్రముఖ పార్క్లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత: ఛలో రాజ్భవన్ అడ్డగింత
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా లోటస్పాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ నుంచి లోటస్పాండ్కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్పాండ్కు తరలించారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల -
‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు. చదవండి: జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ ప్రమోషన్లు వదులుకుని మరీ తిష్ట? ఎవరా అధికారులు? -
హైదరాబాద్: పంచతత్వ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్
-
ఇందిరా పార్కులో ‘గంధం’ దొంగలు
ముషీరాబాద్/కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హారి్టకల్చర్ అధికారులు గాం«దీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇందిరాపార్క్ నుంచి సందర్శకులు వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు సిబ్బంది లైట్లను ఆర్పి వారు వెళ్లేపోయేవారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లను అలాగే ఉంచేవారు. ఇటీవల ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్ మొత్తం లైట్లను ఆరి్పవేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్ట్యాంక్ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పదేళ్ల క్రితం ఇదే తరహాలో స్మగ్లింగ్ పదేళ్ల క్రితం ఇదే పార్క్లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు. రెండ్రోజుల కిత్రం.. గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్ట్యాంక్బండ్ వైపుగా తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్కు వచ్చే వాకర్స్ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాం«దీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్క్ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు. దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ను వివరణ కోరగా.. రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. -
మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్
హైదరాబాద్: మహానగరం మణిహారాలసమాహారంగా రూపుదాల్చుతోంది. ట్రా‘ఫికర్’ లేకుండా ఇప్పటికే నిర్మించిన ఫ్లైఓవర్లకు మరో రెండు ఫ్లై ఓవర్లు తోడుకానున్నాయి. ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించబోయే స్టీల్ బ్రిడ్జిని, రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు మరో బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్లతో కలసి మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహానగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్ విశ్వనగరంగా పురుడుపోసుకుంటోందని అన్నారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ దీర్ఘకాలికంగా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రూ.426 కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో చేపట్టిన రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.350 కోట్లతో 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి, రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు రూ.76 కోట్ల వ్యయంతో 900 మీటర్ల బ్రిడ్జి అందుబాటులోకి రానుం దని చెప్పారు. నగరంలో మరో రూ.6 వేల కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో పనులు నడుస్తున్నాయన్నారు. లాక్డౌన్ సమయంలో దాదాపు నాలుగురెట్ల వేగంతో కోట్లాది రూపాయల నిర్మాణపనులు పూర్తి చేశామని వివరించారు. హైదరాబాద్ రహదారులపై రద్దీ తగ్గాలనే ఉద్దేశంతో ఎస్ఆర్డీపీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొత్త లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు నిర్మించుకుంటూ ముందుకుపోతున్నామని వివరించారు. నిర్వహణ పటిష్టంగా ఉండాలని 710 కిలోమీటర్ల ముఖ్యమైన రోడ్లను సీఆర్ఎంపీ పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించామని చెప్పారు. భవిష్యత్లో రక్షణ రంగం స్థలాల అవసరం ఉంటుందని, నాగపూర్, రామగుం డం హైవేలపై సైతం 18 కిలోమీటర్ల మేర స్కైవేలు నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరిశీలిస్తోందని, దీనికి కేంద్రమం త్రి కిషన్రెడ్డి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్లో 36 కిలోమీటర్ల స్కైవేలు నిర్మిస్తే వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను విశ్వనగరంగా నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా, విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, కోవిడ్–19 కట్టడి గురించి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, ఇంకా కొన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కలసిమెలసి అభివృద్ధి చేసుకుందాం: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలకతీతంగా కలసిమెలసి అభివృద్ధి చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాహాళ్లకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ క్రాస్రోడ్స్కు మంచి పేరు ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాంతం’అని ఆయన అన్నారు. నగరంలోకి పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్ సమస్య ఉండొద్దని, పెట్టుబడుదారులు ఇప్పుడు బెంగళూరు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య కారణంగా భయపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ కుట్ర వెనుక మోహన్ భగవత్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రభుత్వం తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్ కోరారు. అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం దీక్ష
-
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన భట్టి
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆర్సీ కుంతియా దీక్షను ప్రారంభించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, శ్రీధర్ బాబు, జీవన్రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్ తదితర పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా అశేష కాంగ్రెస్ శ్రేణుల ఇందిరాపార్కుకు తరలి వచ్చాయి. ఈ క్రమంలో గత కాంగ్రెస్తో పాటు మహాకూటమిలో భాగమైన పలువురు టీటీడీపీ నేతలు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. టీజేఎస్ కన్వీనర్ కోదండరాం కూడా తన మద్దతు తెలిపారు. కాగా అధికార టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..‘శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే.. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలని రాజ్యాంగంలో ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని టీఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియాలో అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదు. ప్రజలు ఎవరిని గెలిపించినా మేము డబ్బుతో ఆ నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ విషయం గురించి ప్రజలే ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృత చర్యలను గమనించాలి’ అని భట్టి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. -
వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్లో వీహెచ్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్పై వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ వీహెచ్ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. నగేష్ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్ నేత వీహెచ్పై నగేశ్ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్పై చర్యలు తీసుకోనున్నారు. -
కేసీఆర్కి కౌంట్డౌన్ మొదలైంది: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్కి కౌంట్డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్లో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్ష
-
ఇందిరాపార్క్ వద్ద ఎమ్ఎస్వోల మహా ధర్నా
-
అరెస్ట్లకు నిరసనగా అయ్యప్ప భక్తుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : శబరిమల ఆలయం వద్ద భక్తుల అరెస్ట్లను నిరసిస్తూ .. రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగారు. అయ్యప్ప ఐక్య వేదిక నేతృత్వంలో మంగళవారం ఇందిరా పార్క్లో అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్వాములు శబరిమల దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రభుత్వాలు కలగజేసుకుని కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. చివరకు అయ్యప్ప స్వాములు కూడా ధర్నాలు చేయాల్సి రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ధర్నాలో పాల్గొని అయ్యప్ప భక్తులకు మద్దతు తెలిపారు. -
ధర్నాచౌక్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ను కొనసాగించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో ప్రభుత్వం ధర్నాచౌక్ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ను యథావిధిగా కొనసాగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాచౌక్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల వరకు ధర్నా చౌక్ను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. ఇకపై ధర్నా చౌక్లో యథావిధిగా నిరసనలు తెలుపడానికి కోర్టు అనుమతినిచ్చింది. -
కేసీఆర్పై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిరా పార్క్ తరలింపును అడ్డుకుంటునందుకు కేసీఆర్ను తనను బెదిరించారన్నారు. ఇందిరాపార్క్లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పార్క్కి అందరు వచ్చే సమయంలో మంటలు వ్యాపించడంతో వాకర్స్ ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇందిరా పార్క్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెత్త చెదారంతో ఇందిరా పార్క్ డంపింగ్ యార్డ్లా తయారైందని మండిపడ్డారు. -
అణచివేత కుదరదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన ప్రదర్శనలను ప్రభు త్వం నిషేధించడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతంలో ధర్నాలపై ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబట్టింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతే తప్ప ఎక్కడో ఊరు అవతల 50 కిలోమీటర్ల దూరంలో ధర్నాలు చేసుకోమంటే ఎలా? అడవిలో సెల్టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. మనుషులు ఉన్న చోటే సెల్టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్ కూడా. జనాల మధ్యలో ధర్నాలు చేయకుండా రిషీకేశ్కు వెళ్లి చేయమంటారా? అధికారంలోకి వచ్చేందుకు ఈ ధర్నా చౌక్ చాలా మందికి ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?’అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ధర్నాచౌక్ కోసం గుర్తించిన ప్రాంతాలు, అక్కడ కల్పించిన సౌకర్యాల వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ రోజున ధర్నాచౌక్ వ్యవహారాన్ని తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు రాసిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణించింది. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హనుమంతరావు తరఫు న్యాయవాది సి. దామోదర్రెడ్డి వాదిస్తూ ఎన్నో ఏళ్లుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకే దానికి ధర్నాచౌక్ అని పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్ వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతివ్వడం లేదని, నగరానికి 25 కిలోమీటర్ల అవతల ధర్నాలు చేసుకోవాలని చెబుతోందని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ శంషాబాద్, షామీర్పేట, జవహర్నగర్, మేడిపల్లి తదితర ప్రాంతాలను ధర్నాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేశామని, వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపడుతుండటం వల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. చెరువుల దగ్గర ఇళ్లు కట్టుకుని.. నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయంటే ఎలా? ఈ సందర్భంగా ధర్మాసం స్పందిస్తూ ‘ఎప్పటి నుంచో ఉన్న చెరువు దగ్గరకు వచ్చి జనాలు ఇళ్లు కట్టుకుంటారు. ఆ తరువాత ఆ చెరువు వల్ల వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని, దాన్ని పూడ్చేయాలని అడుగుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. ఇందిరాపార్క్ ఎప్పటి నుంచో ఉంది. ఆ తరువాతే దాని చుట్టుపక్కల ఇళ్లు వచ్చాయి. ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాలు, నిరసన కార్యక్రమాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతేతప్ప నిషేధం విధిస్తామంటే ఎలా? ఎక్కడో 50 కిలోమీటర్ల దూరానికి వెళ్లి ధర్నాలు చేసుకోమనడం ఎంత వరకు సబబు? సెల్ఫోన్ టవర్లను అడవుల్లో పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది. సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. అందుకే మనుషులు ఉండే చోటే సెల్టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్లు కూడా. జనాల మధ్యలో కాకుండా రిషీకేశ్లో ధర్నాలు చేసుకోమంటారా?’అంటూ ప్రశ్నించింది. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించడం ఏమాత్రం సబబు కాదని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. 2017లో దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ధర్నాల కోసం పలు ప్రాంతాలను ఎప్పటిక చేశామని చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తదుపరి విచారణలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, వాదనల సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు బిగ్గరగా మాట్లాడటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ కేసులో మీరు పిటిషనర్ కాదు. మీరు రాసిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణించి విచారణ జరుపుతోంది. లేఖ రాయడంతో మీ పని ముగిసింది. మీరు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు’అని తేల్చిచెప్పింది. దీంతో ఆయన వాదనలు ముగిసే వరకు మౌనంగా ఉన్నారు. -
నగరంలో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఇందిరాపార్క్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అర్పేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ధర్నాచౌక్తో ఇబ్బంది లేదు
►ఇది ప్రజాభిప్రాయం.. ►దీనివల్ల స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి ►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి కవాడిగూడ: ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనివల్ల స్థానికంగా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఉపాధి దొరుకుతోందని ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదివారం ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, టీజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజల అభిప్రాయల సేకరణకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భీమమైదానం, తాళ్లబస్తీ, ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, అంబేడ్కర్నగర్ తదితర బస్తీల్లో ఇంటింటికి వెళ్లి ధర్నాచౌక్తో గల ఇబ్బందులను అడిగారు. దీంతో స్థానికులు పైవిధంగా స్పందించారు. ప్రజలు తమ బాధలు చేప్పుకునేందుకు అనేక సంవత్సరాలుగా ధర్నాచౌక్కు వస్తున్నారని, వారివల్ల ఇబ్బందులు లేవన్నారు. ఇందిరాపార్కు వద్దనే ధర్నాచౌక్ను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో–కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకురాలు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహయ కార్యదర్శి జి.అనురాధ, ఝాన్సీ మాట్లాడారు. ప్రజాగొంతుకగా ఉన్న ధర్నా చౌక్ను నగర శివార్లకు తరిలించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కుట్రలో భాగమయ్యారన్నారు. ధర్నా చౌక్ తరలింపు వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నారు. ప్రజలంతా ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగాలని కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. దీనిపై అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి, అఖిలపక్షంతో సమాలోచనలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
హింస బాధ్యత సర్కారుదే!
స్పష్టం చేసిన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ - ప్రభుత్వం అనుకూల, వ్యతిరేక వర్గాలకు ఒకేరోజు అనుమతి ఇచ్చింది - అనుకూల ధర్నా పేరిట వచ్చింది టీఆర్ఎస్ శ్రేణులు, మఫ్టీ పోలీసులే - పోలీసులు దాడిలో 35 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి - ధర్నాచౌక్ను యథాతథంగా కొనసాగించాల్సిందే - కమిటీ నేతలు కోదండరాం, చాడ, తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం జరిగిన హింసకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలకు ఒకే రోజు ప్రభుత్వం అవకాశం కల్పించి రెచ్చ గొట్టిందని మండిపడింది. ధర్నాచౌక్ కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పంద న కోసం వారం పాటు వేచి చూస్తామని.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. సోమవారం ధర్నాకు ప్రభుత్వం అనుమతినిచ్చి అక్కడే టెంట్లు, కుర్చీలు, మంచినీళ్లు ఏర్పాటు చేసినందున.. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తు న్నట్లు పేర్కొంది. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించి, పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, జనసేన నేతలకు ధన్య వాదా లు తెలిపింది. ధర్నాచౌక్ ఘటనపై సోమ వారం సాయంత్రం మగ్దూంభవన్లో పరి రక్షణ కమిటీ సమావేశమైంది. ఇందులో చాడ వెంకటరెడ్డి, ఆదిరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీర భద్రం, డీజీ నరసింహారావు (సీపీఎం), కోదండరాం, వెంకటరెడ్డి (టీజేఏసీ), సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ–చంద్రన్న), పోటు రంగారావు, రమాదేవి (న్యూడెమోక్రసీ– రాయల), విమ లక్క (అరుణోదయ), రవిచంద్ (టీడీఎఫ్), నలమాస కృష్ణ (టీపీఎఫ్), పీఎల్ విశ్వే శ్వరరావు (ఆప్), తాండ్రకుమార్ (ఎంపీసీఐ– యూ), నరహరి (ఎస్యూసీఐ–సీ), కె.సజ య (సామాజిక కార్యకర్త) పాల్గొని చర్చిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరు కుట్ర పూరితం ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం వ్యవహ రించిన తీరును ఖండిస్తున్నామని చాడ వెంక టరెడ్డి చెప్పారు. తమ ధర్నాకు అనుమతి ఇచ్చి నట్లే ఇచ్చి... అనుకూల ధర్నా పేరిట తమ నిరసనను అణచివేయడానికి కుట్ర పన్నార న్నారు. సీఐ శ్రీదేవి, కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో అనుకూల ధర్నాలో పాల్గొన్నారని, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందు లో చేరి ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని చెప్పారు. ధర్నాచౌక్ను యథాతథంగా కొనసా గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించడమే సోమవారం నాటి ఘటనకు కారణమని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాకు అనుమతించాక అక్క డికి చేరుకోవడం తమ హక్కు అని.. దానిని ఉల్లంఘించిన పోలీసులపై చర్య తీసుకోవా లని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికార గర్వంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజానికి వారే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఏసీపీ నర్సయ్య స్వయంగా లాఠీ పట్టుకుని కార్యకర్తలను కొట్టారని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనను విచక్ష ణారహితంగా కొట్టి, గాయపరిచారని సాది నేని వెంకటేశ్వర రావు తెలిపారు. మహిళలపై మగ పోలీసులు దాడి చేశారని విమలక్క చెప్పారు. అనుకూల ధర్నాకు టెంట్లు, సదు పాయాలు ఎవరు సమకూర్చారో చెప్పాల న్నారు. ధర్నాచౌక్తో మార్నింగ్ వాకర్స్కు ఇబ్బంది లేదని వారి సంఘం కూడా స్పష్టం చేసిందని డా.సుధాకర్ వెల్లడించారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు: కోదండరాం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, ఐక్యంగా పనిచేస్తామని.. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. పోలీసులు ధర్నాకు అనుమతిచ్చామని చెప్పి.. నిర సనకారులను గొడ్లను బాదినట్లు బాదా రని మండిపడ్డారు. 35 మందికిపైగా గాయపడ్డారని, అందులో 12 మందికి తలకు దెబ్బలు తగలడంతో పాటు కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించారు. సోమ వారం నుంచి ధర్నాచౌక్ను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘నాలుకలు కొస్తాం, తలకాయలు తీస్తా మన్న భాషే ప్రభుత్వంలోని వారికి వచ్చి న భాష’ అని విమర్శించారు. ఖమ్మం మిర్చి రైతులపై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించు కోవాలన్నారు. -
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్లోని ధర్నాచౌక్ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ధర్నా చౌక్’పై నిర్ణయాన్ని ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెక్కలేనన్ని ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ కోసం స్వరాష్ట్రంలో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము కేవలం ధర్నా చౌక్ స్థలం కోసం ఉద్యమించడం లేదని, బాధిత ప్రజలు తెలిపే నిరసన హక్కు కోసం ఉద్యమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్ను ఎత్తివేసే నిర్ణయం వాపసు తీసుకోవాలంటూ కోదండరాం నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జేఏసీ చేపట్టిన ఏ కార్యక్రమమూ విఫలం కాలేదని, ధర్నా చౌక్ విషయంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను నిరసనలుగా వ్యక్తపరిచే హక్కు ఇన్నాళ్లూ ధర్నా చౌక్ వద్దే సాగిందని, భవిష్యత్తులోనూ అక్కడే కొనసాగాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ను కొనసాగించాలని డీజీపీని కోరామని, ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. లేకుంటే చలో ధర్నా చౌక్ చేపడతామని, లాఠీ దెబ్బలు, పోలీసు తూటాలకు భయపడే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్పార్క్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షంలో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్దన్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, సీపీఐ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం తరఫున నర్సింహారావు, జేఏసీ కో కన్వీనర్ బైరి రమేష్, కో చైర్మన్ పురుషోత్తం, పీఓడబ్ల్యూ సం«ధ్య, ప్రజాఫ్రంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బతుకు.. బర్బాద్!
ధర్నాచౌక్ తరలింపు నిర్ణయంతో చితికిన బడుగు జీవితాలు అది వేనవేల గొంతుకల ధిక్కార ప్రాంతం.. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమ్మె హక్కుకు చిరునామా.. విద్యా ర్థుల బిగిపిడికిలి బావుటా.. మహిళా సంఘాలు, ఆశవర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల ప్రకటనకు వేదిక.. అదే కూతవేటు దూరంలోని పాలకుల చెవిని సోకేలా నినదిస్తూ నిత్య సందడితో కనిపించే ధర్నాచౌక్!! ధర్నాచౌక్ను నగర శివార్లకు తరలించాలన్న నిర్ణయంతో.. ఆ గల్లీతో పెనవేసుకున్న పేదల బతుకులిప్పుడు బజారున పడ్డాయి. నినాదాలతో పొడిబారిన గొంతులకు నిమ్మకాయ సోడా ఇచ్చే యాదగిరి బండి, కొబ్బరినీళ్లతో సేదదీర్చే రాజరాజేశ్వరి, నినాదాలను మోసుకొచ్చే ఫ్లెక్సీ బాయ్ లింగస్వామి, నినాదాలను ప్రతిధ్వనించే ఎస్డీఎస్ సౌండ్ సిస్టమ్ ఇబ్రహీం, వైఎస్సార్ పాదయాత్ర మొదలుకొని, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీశ్రావు లాంటి ఎందరో రాజకీయ నేతలకు 16 ఏళ్లుగా తన టెంట్తో నీడనిచ్చిన సాయి టెంట్ హౌజ్ వెంకటేశ్, ఎండనకా, వాననకా అతిచౌకగా అన్నం వండి వార్చి ఉద్యమకారుల ఆకలి తీర్చిన సాయి తిరుమల మెస్, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సలీం బజ్జీ బండి, రాజేశ్ చాయ్బండి, పాన్షాప్ గణేశ్, టీ వాలాలు, సిగరెట్ టేలాలూ అన్నీ ఇప్పుడు ధర్నా చౌక్తోపాటే మూగబోయాయి! మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. వారి అరిగోసకు అక్షర రూపం ఈ కథనం... – సాక్షి, హైదరాబాద్ పని దొరుకుడు కష్టమైంది మాది భువనగిరి దగ్గర జంపల్లి. ఇంటర్ వరకు చదివిన. ముగ్గురు చెల్లెళ్లు, అమ్మను నేనే చూడాలి. నాన్న లేరు. పనికోసం హైదరాబాద్కొచ్చిన. పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు ధర్నాచౌక్లో ఫ్లెక్సీలు ఫిట్ చేయడం నా పని. అందుకు మా ఓనర్ నాకు రోజుకి రూ.450 ఇస్తాడు. కానీ ఇప్పుడు పని దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు నెలరోజులు దొరికేటిది.ఇప్పుడు పది రోజులే దొరుకుతంది. నాలాంటి కూలీలు వేలమంది ఉన్నారు. – లింగస్వామి, ఫ్లెక్సీ బాయ్ ఇప్పుడెక్కడికి పోవాలె? నేను వరంగల్ నుంచి వచ్చాను. 18 ఏళ్ల నుంచి ఈ ధర్నా చౌక్లనే ఉంటున్న. ఇప్పుడె క్కడికి పోవాలె? పొద్దునొచ్చి, రాత్రిదాక ఇక్కడే సోడాలు అమ్ముత. వైఎస్ గారి పాద యాత్రప్పుడు మొదటిసారిగా సోడా బండి కొనుక్కున్న. ధర్నాచౌక్ ఉన్నప్పుడు రూ.వె య్యి దాకా ఉండే గిరాకి ఇప్పుడు సగం కన్నా తక్కువైంది. ఏం జేయాల్నో తెలుస్తలేదు. – యాదగిరి, నిమ్మ సోడా బండి మా బతుకులే పోయినయ్ ధర్నాచౌక్ పోయినంక మా బతుకులే పోయినయ్. గరీబోల్లకి ఏం బిజినెస్ చేయొస్తదమ్మ? బజ్జీలేసుకున్డు దప్ప. గదిగూడ ఏసుకోకుంటైపాయె. ధర్నా చౌక్ ఉన్నప్పుడు పది కిలోల బజ్జీపిండితోని బజ్జీలేసేటోణ్ణి. ఇప్పుడు 2 కిలోల పిండి కూడా ఒడుస్తలేదు. – సలీం, బజ్జీ బండి నిర్వాహకుడు రోజుకు 800 వచ్చేవి.. నేను నడవ లేను. 85 శాతం వైకల్యంతో ఏం పనిచేయొస్తది? అందుకే ఫ్రెండ్ బండి దగ్గర చాయ్లమ్ము తున్న. అప్పుడు ధర్నా లు జేసేటోళ్ళు వచ్చేది కాబట్టి రోజుకి S 7, ఎనిమిదొందలొచ్చేటియి. ఇప్పుడు 200 కూడా దొరుకుతలేవు. – రాజేశ్, చాయ్బండి ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే ఇక్కడ పదహారేళ్లుగా టెంట్ హౌస్ నడుపుతున్నా. ఇన్ని రోజులు ధర్నాచౌక్ను నమ్ముకొని బతికిన. బిడ్డలిద్దరిదీ ఇంటర్ అయిపోయింది. కొడుకు టెంత్ అయింది. బిడ్డలని ఇంజనీరింగ్ చదివించాలను కున్నాను. కానీ ధర్నా చౌక్ ఎత్తేసినంక మొత్తం బతుకేపోయింది. దుకాణానికి రూ.5,500 అద్దె కూడా కట్టలేకపోతున్నాం. షాప్ ఎత్తేయాలనుకుంటున్నా. ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే. డిగ్రీలో చేర్పిస్తాన్న. కేసీఆర్, హరీశ్రావు, కల్వకుంట్ల కవిత అందరికీ టెంట్లు మోసినం. అయినా యిప్పుడు ఫాయిదా లేదు! – వెంకటేశ్, సాయిరాం టెంట్ హౌస్ బిజినెస్ మొత్తం పడిపోయింది మేం కూడా టీఆర్ఎస్సే. అయితే ధర్నాచౌక్ బోయినంక బిజినెస్ మొత్తం పడిపోయింది. రూ.40 ఇస్తే కడుపునిండా అన్నం పెట్టెటోళ్లం. రోజుకి నాలుగైదు వేలొచ్చేటియి. యిప్పుడు వెయ్యి కూడా బిజినెస్ జరగట్లేదు. – రాజు, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంటి కిరాయికి కూడా డబ్బులు రావడం లేదు మేమిద్దరం రోజంతా పనిచేస్తే ఐదారొందల కొబ్బరి బోండాలు అమ్మే వాళ్లం. ఇప్పుడు 100 కాయలు కూడా అమ్ముడుకావడం లేదు. ఇంటి కిరా యికి కూడా డబ్బులు రావడం లేదు. – రాజేశ్వరి, రాజబాబు కొబ్బరి బోండాం బండి మా షాపు నాయినే ఓపెన్ చేశారు ఇక్కడ మా నాన్న పాన్టేలా నడుపుతడు. గిరాకీ సగం పడిపోయింది. మేమంతా టీఆర్ఎస్సే. ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ షాప్ ఓపెన్ చేశారు. ధర్నా చౌక్ ఎత్తివేసినంక నష్టంమొస్తున్న మాట నిజమే. ప్రభుత్వం ఏంజేసినా ప్రజల కోసమే అని ఇంకా నమ్ముతున్నం. – గణేశ్, పాన్షాప్ -
ఇందిరాపార్కు ఆక్రమణ విజయవంతం చేయాలి
ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15న నిర్వహించనున్న ఇందిరా పార్కు ఆక్రమణను విజయవంతం చేయాలని భాగస్వామ్య పక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో పాల్గొనే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక సంఘాలు ధర్నాచౌక్ ఆక్రమణలో భాగస్వాములయ్యేలా చూడాలని తీర్మానించాయి. పోలీసులు అడ్డంకులు సృష్టించినా, నిర్బంధిం చినా పార్కును చేరుకొని ప్రజాకాంక్షను ప్రభుత్వానికి చాటాలని నిర్ణయించాయి. ఇందిరా పార్కు ఆక్రమణ కార్యాచరణపై మంగళవారం రాత్రి మఖ్దూంభవన్లో సమావేశం జరిగింది. ఇందిరాపార్కు నిరసనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజాసంఘాలు హెచ్చరించాయి. పార్కు ఆక్రమణకు అనుమతి కోరుతూ 11న డీజీపీని, 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుసుకోవా లని తీర్మానించాయి. ధర్నాచౌక్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 12న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు గన్పార్కు అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాయి. సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), ఎం.కోదండరాం (టీజేఏసీ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), విమలక్క (అరుణోదయ) తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాచౌక్ ప్రజా గొంతుక: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ను నిషేధించి అప్రకటిత అత్యవసర పరిస్థితిని సృష్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధం విధించడంతో పాటు అక్కడ నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజా గొంతుకగా నిలిచిన ధర్నాచౌక్ పరిరక్షణలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ధర్నాచౌక్ కోసం దీర్ఘకాలిక ఉద్యమం
⇒ లెఫ్ట్, ప్రజాసంఘాల నిర్ణయం ⇒ నేడు ప్రజాసంఘాల నేతలతో సదస్సు సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిరసనలకు అవకాశం కల్పించే వరకు వివిధ రూపాల్లో దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ దిశలో ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీగా ఏర్పడినా, రాబోయే రోజు ల్లో దానిని విస్తృతపరిచి కలిసొచ్చే శక్తులను భాగ స్వాములను చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ముం దుగా జిల్లాస్థాయిల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై ప్రచార కార్య క్రమాలు నిర్వహించి, అన్ని జిల్లాలు, మండల స్థాయిల నుంచి ఈ ఉద్యమంలో వివిధ వర్గాలు పాల్గొనేలా చేయా లని వామపక్షాలు, ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో రౌండ్టేబుల్ సమావే శాలను నిర్వహించాలని నిర్ణయించాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రజాసంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులతో కూడిన రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యాచరణ చేపట్టే దిశలో ఈ నెల 14 వరకు జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టను న్నారు. 15 నుంచి వచ్చేనెల 9 వరకు మగ్దూంభవన్లో రిలే నిరాహారదీక్షల ద్వారా మద్దతును కూడగట్టాలని, మే 10న హైదరాబాద్ ఆక్రమ ణను చేపట్టాలని నిర్ణయించారు. ఇతర పార్టీల భాగస్వామ్యంపై భిన్నాభిప్రాయాలు... ఇదిలా ఉండగా ధర్నాచౌక్ పునరుద్ధరణ విషయంలో కాం గ్రెస్, బీజేపీ, టీడీపీలను కూడా కలుపుకుని పోవాలని గురువారం రాత్రి జరిగిన భేటీలో కొందరు సూచించినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడుతున్న విధంగానే ఇతర పార్టీలు కూడా కృషి చేస్తేనే విస్తృత ప్రాతిపదికపై కలవొచ్చునని సీపీఐ, సీపీఎం నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
ధర్నాచౌక్ను అక్కడే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కువద్ద ఉన్న ధర్నాచౌక్ను అక్కడే కొనసాగించాలని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ తరలింపు యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలంటూ ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని జంతర్మంతర్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా చేద్దామంటూ చెప్పిన సీఎం.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధర్నాచౌక్ను నగర శివార్లలోకి తరలిస్తామంటే ఎలా అని శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నించారు. రిజర్వేషన్ల వల్ల నష్టం జరుగుతోందంటూ పోలీస్శాఖలో ఏసీపీ స్థాయి అధికారి వాట్సాప్ గ్రూప్లో సందేశం పెట్టడం తీవ్రమైన అంశమని, దీనిపై చర్య తీసుకోవాలని ఎమ్మెస్ ప్రభాకర్ కోరారు. ఇటువంటివి అత్యంత అభ్యంతరకరమని, ఈ వ్యాఖ్యలను చేసినట్లు తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కడియం చెప్పారు. -
తరలిస్తే సహించం
బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక హైదరాబాద్: ఇందిరాపార్కు వద్దనున్న «ధర్నాచౌక్ను నగర శివార్లకు తరలిస్తే సహిం చమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల నిషేధానికి నిరసనగా గురు వారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాద యాత్ర నిర్వహించారు. బీజేపీ శాసన సభాపక్షనేత జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన ఇందిరాపార్కు ధర్నాచౌక్ను తరలిస్తామంటే ఊరుకోబోమని, ఉద్యమా నికి ఊపిరిగా నిలిచిన పార్టీలను, ప్రజా సంస్థలను ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేస్తా మని చెబుతున్న కేసిఆర్.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్చను, ప్రజాస్వామ్యాన్ని హరించిన ఫలితంగా 1977 ఎన్నికలల్లో ఇందిరాగాంధీకి ప్రజలు ఎలాంటి గుణ పాఠం చేప్పారో గుర్తుచేశారు. ధర్నాచౌక్పై నిషేధాన్ని వెంటనే ఉపసంహ రించుకో వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహనికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధర్నాచౌక్ను కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తంచేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అఖిలపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ధర్నా చేస్తామని సాక్షాత్తూ శాసనమండలిలోనే చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్రంలో మాత్రం ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ లేకుండా చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారు గవర్నర్కు విన్నవించారు. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), కె.లక్ష్మణ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు), చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), నాగయ్య(సీపీఎం), కె.శివకుమార్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), మంద కృష్ణమాదిగ (ఎంఆర్పీఎస్), గోపాలశర్మ,, ఇటిక్యాల పురుషోత్తం (తెలంగాణ జేఏసీ), వెంకటేశ్వర్రావు (న్యూ డెమొక్రసీ), టి.కుమార్ (ఎంసీపీఐ– యూ), జానకి రాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్) తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నరుపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇందిరాపార్కు దగ్గర వందలకొద్ది సభలు, సమావేశాలు, నిరసన దీక్షలు జరిగాయని అఖిలపక్షం నేతలు గవర్నర్కు వివరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నదనే కుంటి సాకుతో ధర్నాచౌక్ను ఇందిరా పార్కువద్ద లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని క్యాంపు కార్యాల యానికి వేలమందిని తరలించారని, దానికి ట్రాఫిక్ అంతరాయం కలుగలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాచు. రాష్ట్రంలో 25 ఏళ్లుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలను, క్లిప్పింగులను మంద కృష్ణ మాదిగ గవర్నర్కు చూపించారు. ధర్నాచౌక్ను తరలించవద్దని, శాంతియు తంగా జరిగే నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు. -
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
హైదరాబాద్: ‘సమస్యలను చెప్పుకోవడం, సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను నిర్భందించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటల ఫలితంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
‘ధర్నాచౌక్ అంటే ప్రభుత్వానికి భయమెందుకు?’
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన సాగుతున్నట్లయితే, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి అధికార పక్షాన్ని ప్రశ్నించారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మండలిలో పలు అంశాలపై విపక్ష నేతలు మాట్లాడుతూ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలుకాకపోవడంతో రైతులకు సకాలంలో రుణాలు అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు అంతా ఫీల్గుడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించిందని దుయ్యబట్టారు. ధర్నాచౌక్ను వేరే ప్రాంతానికి తరలించాలని భావించడం ఏరకమైన ప్రజాస్వామ్యమో ప్రభుత్వం చెప్పాలన్నారు. -
మార్పుపై పునరాలోచించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్ను మరో చోటికి మార్చే విషయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. ధర్నాచౌక్ను అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాచౌక్ను నగర శివార్లలోని ప్రాంతాలకు తరలిస్తే ధర్నాలు, నిరసనల ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా, సీఎంను ప్రత్యక్షంగా కలసి వినతులు సమర్పించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ వాస్తవ విషయాలను గుర్తించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను గుర్తించక ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. -
మూగబోయిన ‘ధర్నాచౌక్’
ఇందిరాపార్కు వద్ద నిరసనలకు అనుమతులివ్వని పోలీసులు ⇒ రాజధాని చుట్టూ నాలుగు ప్రాంతాల గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాజధానిలో నిరసనలకు కేరాఫ్గా ఉన్న ధర్నాచౌక్ మూగబోయింది. ఇక్కడ ధర్నాలు నిర్వహించుకోవడానికి పోలీ సులు అనుమతులు నిలిపివేశారు. నగరానికి నాలుగు వైపులా... కాప్రాలోని జవహర్నగర్, ఘట్కేసర్ సమీపంలోని ప్రతాప్ సింగారం, దుండిగల్ వద్ద గండిమైసమ్మ, శంషాబాద్ల్లో ‘ధర్నాచౌక్స్’ఏర్పాటు చేశారు. ఆందోళనకా రులను అక్కడికే పంపిస్తున్నారు. అనుమతు లు కూడా ఆయా ప్రాంతాల అధికారుల నుంచే తీసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక ఉత్తర్వులు లేకుండానే... ఇందిరాపార్క్ సమీపంలో నిరసనలు చేసు కోవడానికి ప్రత్యేకంగా ధర్నాచౌక్కు కేటాయి స్తున్నట్లు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ జీవో కానీ, ఆదేశాలు కానీ ఇవ్వలేదు. రాజధాని కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరసనకారులకు సచివాలయం వద్దే నిరసలు తెలిపేవారు. అయితే దీనికి ఓ వేదిక కావాలనే ఉద్దేశంతో 1996–97ల్లో ఇందిరాపార్క్ పక్కనున్న 40–50 ఎకరాల గ్రౌండ్ను ఎంపిక చేశారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఇది ధర్నా చౌక్గా మారిపోయింది. ఇందిరాపార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియం నిర్మించిన తర్వాత వివాదం రేగింది. కొందరు ఆ ప్రాంతంలో నిరసనల నిర్వహణపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు అక్కడ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వద్దం టూ ఆదేశించింది. ఈ పరిణామం తర్వాత ఇందిరాపార్క్–ఎన్టీఆర్ స్టేడియం మధ్య ప్రాంతాన్ని 2002లో ధర్నా చౌక్గా ఎంపిక చేసిన పోలీసులు అక్కడే నిరసనలకు అనుమతులు ఇస్తూ వచ్చారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో... గత పదిహేనేళ్లలో ధర్నాచౌక్ చుట్టపక్కల జనా వాసాలు, ట్రాఫిక్ గణనీయంగా పెరిగిపోయా యి. అనేక కార్యాలయాలు, ఆస్పత్రులు వెలి శాయి. దీంతో ఇక్కడ ఆందోళనప్పుడు స్థాని కులకు ఇబ్బందులు తప్పట్లేదు. సమీపంలోని ఎల్ఐసీ కాలనీ వాసులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కొన్నిసార్లు పోలీసులు రోడ్లు మూసేస్తుండటంతో రాకపోకలూ సాధ్యం కావట్లేదని మెరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది. అందరికీ అందుబాటులో ఉండేలా... నగర శివార్లలో ధర్నాచౌక్ కోసం ఒకే ప్రాం తంలో 30–40 ఎకరాల స్థలం ఎంపిక చేయా లని పోలీసు విభాగం తొలుత భావించింది. అయితే ఏదో ఓ పక్కన ఉంటే మిగిలిన వైపు జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బందని కొందరు అధికారులు వాదించారు. దీంతో నగరానికి నాలుగు వైపులా 20 నుంచి 25 కిమీ దూరంలో ఉన్న జవహర్నగర్, ప్రతాప్ సింగారం, గండిమైసమ్మ, శంషాబాద్లో అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో ప్రాంతం విస్తీర్ణం గరిష్టంగా ఐదెకరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రశ్నించే గొంతును మూయడం అసాధ్యం... చీమల దండుని నిలిపివేసేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అన్ని అడ్డుగోడలను దాటుకొని చీమలు చేరాల్సిన చోటుకి చేరుకుంటాయి. ఇది సహజ సూత్రం. అలాగే ధర్నా చౌక్ తరలించి, ప్రశ్నించే గొంతులను మూయడం అసాధ్యమైన విషయం అని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ధర్నా చౌక్ని మార్చడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. – కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రాథమిక హక్కులకు భంగం ప్రజల్లో ఉన్న నిరసన కారణాలను తెలుసు కొని వాటిని పరిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరం. ప్రజల అసంతృప్తిని అణచివేయాలని చూడడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కలకు వ్యతిరేకం. నిరంకుశం. – జీవన్కుమార్, మానవ హక్కుల సంఘం హింస వైపు ఉసిగొల్పడమే... రాజధానిలో కాకుండా పక్క జిల్లాలకు ధర్నా చౌక్ని మార్చడమంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేనట్టు. నిరసనను తెలిపే హక్కుకూడా లేకుండా చేసి, హింసవైపు వుసిగొల్పడమే. – నారాయణరావు, పౌరహక్కుల సంఘం నిరసన హక్కును హరించడమే... ఇది ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కుని హరించడమే. ఉద్యమాల కారణంగానే తెలంగాణ వచ్చింది. నాడు చంద్రబాబు జన సంచారంలేని ఇందిరాపార్కుకి ధర్నాచౌక్ను మార్చారు. కేసీఆర్ ప్రభుత్వం మరింత అసహనాన్ని ప్రదర్శించడం దుర్మార్గం. – సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం -
ఫుట్పాత్పై ప్రసవ వేదన
అక్కడే ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ హైదరాబాద్: అర్ధరాత్రి వేళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఓ నిండుచూలాలికి పురిటి నొప్పులు వచ్చాయి. స్థానికులు 108కి సమా చారమందించారు. అనంతరం ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్లోని ఇందిరా పార్కు సమీపంలో నివాసం ఉండే జ్యోతి(24) నల్లకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరింది. రాత్రి 11.10కి నల్లకుంట చేరుకోగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో చౌరస్తా సమీపంలోని ఓ స్వీట్ షాప్ వద్ద ఫుట్పాత్పై కూలబడిపోయింది. నొప్పులతో ఇబ్బందిపడుతున్న ఆమెను చూసిన ఇద్దరు యువకులు పోలీసులు, 108కి సమాచారమందించారు. 108 సిబ్బంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళల సహకారంతో జ్యోతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ధర్నా శివార్..!
► ధర్నా చౌక్ను నగర శివారుకు మార్చాలని పోలీసు శాఖకు ప్రభుత్వ ఆదేశం ► ఇందిరాపార్క్ వద్ద 16 ఏళ్లుగా సాగుతున్న నిరసనల ప్రస్థానానికి త్వరలో తెర ► శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్య నేపథ్యంలోనే.. ► 30 ఎకరాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తించాలని సూచన ► మియాపూర్, ఉప్పల్, నాగోల్, రాజేంద్రనగర్లలో పోలీసుల స్థలాన్వేషణ ► అన్ని సదుపాయాలతో నిరసనలు జరుపుకునేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్ : వివిధ వర్గాల ప్రజలు రాజధానిలో తమ నిరసన గళం వినిపించేందుకు చిరునామాగా నిలిచిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రాంతం త్వరలో మూగబోనుంది. విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళనలు జరుపుకునేందుకు ఉన్న వేదిక మరోచోటుకు తరలివెళ్లనుంది. హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నగరం మధ్యలో ఉన్న ధర్నా చౌక్ను నగర శివారుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ధర్నా చౌక్ కోసం ఇతర ప్రాంతాల్లో స్థలం వెతికే పనిలో నిమగ్నమయ్యారు. 16 ఏళ్లుగా అదే వేదిక... ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరం వరకు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఆందోళనలు జరిగేవి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్కడే నిరసన తెలిపేవారు. అయితే చంద్రబాబు హయాంలో సచివాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలు చేయకూడదంటూ ఆదేశించి మరోచోటుకు తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తమ అనుమతితో ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చని అప్పటి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాపార్క్–డీబీఆర్ మిల్స్ రోడ్ను ధర్నా చౌక్గా ఏర్పాటు చేశారు. ఉద్యమాలు, నిరసనలు అక్కడే జరిగేవి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నా చౌక్ ప్రస్థానం అతి త్వరలో ఇందిరా పార్క్ వద్ద ముగియనుంది. నగర శివారులో 30 ఎకరాల్లో... సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ.. ఇలా ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నీ సెంట్రల్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ పరిధిలోనే ధర్నాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా నిరసనకారులు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవారు. అయితే ఇక ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ను తరలిస్తే ఎక్కడ పెడతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మియాపూర్, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, సాగర్ రోడ్, రాజేంద్రనగర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధర్నా చౌక్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 25 నుంచి 30 ఎకరాల్లో ధర్నా చౌక్ను విశాలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, బహిరంగ సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇలా ప్రతి కార్యక్రమాన్నీ అన్ని సదుపాయాలతో అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు ఉన్న ‘దగ్గరి ప్రాంతం’ నుంచి శివారుకు ధర్నా చౌక్ను తరలించాలనుకోవడంపై కొంత నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ధర్నా చౌక్ను ఇందిరా పార్క్ వద్ద నుంచి తరలించాలా లేక అదే ప్రాంతంలో కొనసాగాలించాలా అనే అంశంపై గతంలో మూడు అసెంబ్లీ హౌస్ కమిటీలు ఏర్పాటైనప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. గతంలోనే హైకోర్టులో పిటిషన్... ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యం పోలీసు చర్యలతో విసిగిపోతున్నామని ఆ ప్రాంత సమీపంలోని ఎల్ఐసీ కాలనీ అసోసియేషన్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు అక్కడి రోడ్డు మార్గాన్ని మూసేస్తుండటం వల్ల తాము ఇళ్లకు వెళ్లేందుకు గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ అసోసియేషన్ తమ పిటిషన్లో పేర్కొంది. అందువల్ల ధర్నా చౌక్ను తమ నివాసాల పరిసరాల నుంచి తరలించాలని కోర్టును కోరింది. దీనిపై పోలీసు శాఖ కౌంటర్ వేసినా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఎల్ఐసీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. -
లవ్కు నో ఎంట్రీ
నిత్యం వందలాది ప్రేమ జంటలతో కళకళలాడే ఇందిరాపార్కు వాలంటైన్ డే నాడు మాత్రం వెలవెలబోయింది. సాధారణ రోజులల్లో ఇక్కడి ప్రతి చెట్టు, పుట్ట వద్ద జంటలే ప్రేమ కబుర్లలో మునిగితేలేవారు. మంగళవారం పార్కు నిర్వాహకులు, పోలీసులు సైతం ప్రేమ జంటలకు అనుమతిని నిరాకరించి, బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్కు కళతప్పింది. – కవాడిగూడ జంటలు లేవాయె.. నిత్యం ప్రేమ జంటలతో నిండిపోయే బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కు సైతం మంగళవారం కళ తప్పింది. పార్కుల్లో తిరిగే ప్రేమ జంటలకు పెళ్లి చేస్తామంటూ భజరంగ్దళ్ హెచ్చరికల నేపధ్యంలో జంటలు ఇటువైరు వచ్చేందుకు సాహసించలేదు. – బంజారాహిల్స్ వాలంటైన్ డేను పురస్కరించుకుని మంగళవారం పార్కులు కళ తప్పితే.. నెక్లెస్ రోడ్డు మాత్రం ప్రేమ జంటలతో కళకళలాడింది. అక్కడి పచ్చికపై కూర్చుని కబుర్లాడుకుని.. సెల్ఫీలు దిగారు. కేక్ కట్చేసుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు. -
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
-
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసం.. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 22 న నిరుద్యోగులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి సభ నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల తీరు సరిగా లేదన్నారు. జేఏసీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడడం శోచనీయమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో చూశాం.. మేము భయపడేవాళ్లం కాదన్నారు. సమాజంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు.. ఇది పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు వేచి చూశాం.. ఉద్యోగాల విషయంలో ఎక్కువ కాలం వెయిట్ చేస్తే వయసు అయిపోతుందన్నారు. ఉద్యోగాలపై చర్చకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. -
ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి
-
రేషన్ డీలర్ల పోరుబాట
• ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ • 10న ఇందిరా పార్కు వద్ద నిరసన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయినప్పటికీ తమ సమస్యలు మాత్రం తీరడం లేదంటూ ప్రభుత్వ చౌక ధరల దుకాణ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చేయడం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అయినా సర్కారు స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గతేడాది ఆగస్టులో ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేశ్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రికి 15 సార్లు విజ్ఞప్తి చేశామని, కమిషనర్ను కలిసినా, ప్రభుత్వం తమ సమస్యలను పక్కన పెట్టేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు 10వ తేదీన ఒక రోజు దీక్ష చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని రమేశ్బాబు చెప్పారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ⇔ రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేకుంటే కనీసం రూ.20వేల –రూ.30వేల గౌరవ వేతనమన్నా ఇవ్వాలి. ⇔ ఆరోగ్య కార్డులు, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి. ⇔ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ విధానం అమలు చేస్తున్న 1,545 రేషన్ డీలర్లకు తొమ్మిది నెలలుగా ఇవ్వాల్సిన కమీషన్ను చెల్లించాలి. ఒక్కో డీలర్కు కనీసం రూ. లక్ష దాకా కమీషన్ ఇవ్వాల్సి ఉంది. ⇔ ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకో వడానికి చెల్లించాల్సిన డీడీల కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. -
ఇందిరా పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా
-
అవి సర్కారు హత్యలే
- చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులపై సీపీఐ నేత నారాయణ - ఇందిరా పార్కు వద్ద చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో ధర్నా - వెంటనే చేనేత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ హైదరాబాద్: చేనేత కార్మికుల ఆత్మ హత్యలు, ఆకలి చావులు సర్కారు హత్య లేనని, వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. చేనేత విధా నం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద చేనేత కార్మి కులు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చేనేత కార్మికులు ధర్నా శిబిరం వద్ద మగ్గాలపై వస్త్రాలు నేస్తూ, మహిళలు రాట్నాలపై పనిచేస్తూ నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి నారాయణ మాట్లా డుతూ.. పాలకులు దేవుళ్లకు పట్టువస్త్రాలు సమర్పించి భక్తిని చాటుకుంటారే తప్ప.. వాటిని నేసే చేనేత కార్మికులపై మాత్రం వారికి భక్తి ఉండదని అన్నారు. తిరుపతి వెంకన్న, బెజవాడ అమ్మ వారికి రూ.కోట్ల ఆభరణాలు సమర్పించాలనుకునే కేసీఆర్.. ఆ డబ్బును చేనేత కార్మికులకు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాలకు బడ్జెట్లో నిధులుంటాయి కానీ.. చేనేతకు మాత్రం నిధుల కేటాయింపు ఉండదని, చేనేతకు సహాయం అనేది వృత్తికి సంబంధించినది కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. చేనేత సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాటం చేయాలని, ఇందుకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చేనేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని, సమగ్రమైన చేనేత విధానాన్ని ప్రకటించాలని, సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సహకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గిట్టుబాటు కూలీ లభించక అనేక మంది చేనేత కార్మికులు వలస పోతున్నారని వాపోయారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ మనిషికి నాగరికత నేర్పిన చేనేత కార్మికులు ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక నాయకులు ధనుంజయ, గడ్డం జగన్నాథం, సిల్వేరు కాశీనాథ్, గోశిక యాదగిరి, పాశికంటి లక్ష్మీనర్సయ్య, వెంకటేష్, కూరపాటి రమేష్, గర్ధాసు బాలయ్య, సత్యనారాయణ, రాంచంద్రం, నరేందర్, కాశీనాథం తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద హోంగార్డులు గురువారం ఆందోళనకు దిగారు. కానిస్టేబుళ్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం హోం గార్డులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకపోతే తమ ఆందోళలను భవిష్యత్ లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
రేపు ఇందిరాపార్క్ వద్ద రైతు దీక్ష
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. -
కేజీబీవీ సమస్యలపై నేడు మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న మహాధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్కార్డులు, వేసవి సెలవులు తదితర డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్నట్లు వివరించారు. -
ఇందిరాపార్క్ వద్ద వీహెచ్ ధర్నా
హైదరాబాద్ : భాగ్యనగరంలో గతంలో గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఇప్పుడు నగరమంతా గుంతలే దర్శనమిస్తున్నాయని ఆయన విమర్శించారు. నగరంలోని రహదారుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బుధవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. నగర జీవి ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
హక్కులను హరిస్తుంటే సహించం
మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటం: ఉత్తమ్ ఇందిరాపార్కు వద్ద పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పేద రైతులు, కూలీలు, ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వమే కాలరాస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు వంద రోజులు దీక్ష చేసిన నేపథ్యంలో సంఘీభావంగా హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఉత్తమ్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, నాయకులు సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎం.కోదండ రెడ్డి హాజరయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లా సూర్యప్రకాశ్ తదితరులు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వం పేద ప్రజలను గ్రామాల నుంచి పోలీసులతో, రెవెన్యూ అధికారులతో తరిమివేస్తున్నదని విమర్శించారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు పోరాడుతున్నా.. ప్రభుత్వం నిర్బంధం విధించి, పోలీసులతో కేసులు పెట్టి, బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. భూ సేకరణ చేయకుండా, బెదిరించి కొనుగోలు చేస్తున్నదన్నారు. దీనివల్ల భూమి లేని పేదలకు, భూమిపై ఆధారపడిన వృత్తిదారులు, కూలీలకు పునరావాసం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయకుండా, బలవంతపు భూ సేకరణతో హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మల్లన్న సాగర్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, రైతులపై కేసులు పెట్టి వేధించడంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటామన్నారు. అప్రజాస్వామికంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రె స్ అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ కింద భూములు పోగొట్టుకున్న రైతులకు తిరిగి అప్పగిస్తామని జైపాల్రెడ్డి అన్నారు. ఇచ్చే పరిస్థితి లేకపోతే భూ సేకరణ చట్టం-2013 కింద పరిహారం అందచేస్తామన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ 27 నెలల కేసీఆర్ పాలన అబద్ధాలతోనే సాగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ల సొంత జిల్లాలలోనే వంద రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. వీటిపై ప్రజల పక్షాన జరిగే పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు. నేడు గవర్నర్ను కలవనున్న పీసీసీ మల్లన్న సాగర్లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడంపై గవర్నర్కు పీసీసీ సోమవారం ఫిర్యాదు చేయనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు గవర్నర్ను కలసి వినతి పత్రం అందజేయనున్నారు. అనంతరం గజ్వేల్లో జరిగే మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావ సభకు హాజరు కావడానికి బయలుదేరి వెళ్లనున్నారు. -
'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు. -
'అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష'
హైదరాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని మాజీ మంత్రులు పొన్నల లక్ష్మయ్య, డీకే అరుణ ఆరోపించారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను వారు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని విమర్శించారు. అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టామని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన వల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని పొన్నాల విమర్శించారు. గద్వాల్ జిల్లా కోసం రెండు నెలలుగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా డీకే అరుణ గుర్తు చేశారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
స్వరాష్ట్రంలోనూ ఒరిగిందేమీ లేదు
దోమలగూడ: తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గిరిజన గురుకుల పుల్టైం, గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన గురుకులాల ఉపాధ్యాయులకు కొత్త రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హరినాయక్, ప్రధానకార్యదర్శి మల్సూర్ యాదవ్ మాట్లాడుతూ గిరిజన గురుకులాలు, కళాశాలల్లో 15 ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. మారుమూల ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. ]మానవతా దృక్ఫథంతో తమ సమస్యలను పరిష్కరించి జీవో 27 ప్రకారం కనీస వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షల్లో నాయకులు లక్షీ్ష్మప్రసాదు, సుజాత, అనిత, టీక్యానాయక్, నారాయణ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఆదివాసీమంచ్ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధీరావత్ రవినాయక్, రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాకు సిద్ధమవుతున్న విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి చెప్పడానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎంసెట్-2 బాధిత విద్యార్థుల తాకిడి అధికమైంది. తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలపడానికి సచివాలయం వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసుల చర్యలను విద్యార్థులు ఆగ్రహించారు. తమ గోడు ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమవుతుండగా.. వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సామూహిక నిరహార దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాగి రాములు కోరారు. ఆదివారం ఐబీలో నిరాహార దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ కంట్రిబ్యూషన్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అరోగ్యకార్డులు అన్ని కార్పోరేట్, ప్రయివేట్ అసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలతో పాటు ఓపీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, దత్తాత్రి, భాస్కర్దేశ్, నర్సింలు, తిరుపతి, అశోక్ తధితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా
హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. -
ఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద గురువారం వారు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఫాదర్స్ డే సందర్భంగా తండ్రుల వినూత్న నిరసన
హైదరాబాద్ : వారంతా పిల్లల ఆత్మీయతకు దూరమైన తండ్రులు. కోర్టు తీర్పుల కారణంగా పిల్లలకు దూరమై మానసికంగా వేదన చెందుతున్నవారు. తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఇందిరాపార్క్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యా భర్తలు విభేదాలతో విడిపోయిన కేసుల్లో... పిల్లలను తల్లుల కస్టడీకి అప్పగించడం వల్ల తాము వారి ఆప్యాయతకు దూరమవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లులకు పూర్తి కస్టడీ ఇవ్వడం అంటే పిల్లలను హింసించడమేనని, తండ్రి అంటే వీర్యదాత కాదని, సమాన హక్కులు, సమాన తల్లిదండ్రులు, సమాన ప్రేమ, నేను తండ్రిని ఉగ్రవాదిని కాదు.. అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. -
మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేదీ ఎమ్మార్పీ?
స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో పోరుబాట ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా తల్లిదండ్రులు, వలంటీర్లు, విద్యార్థి నేతలు భారీగా హాజరు స్కూళ్ల దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ధ్వజం ఫీజు నియంత్రణ చట్టాలు, జీవోల అమలుకు డిమాండ్ లేకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ ‘‘స్కూళ్లా.. పుస్తకాల దుకాణాలా, ఇంజనీరింగ్కు రూ. లక్ష.. ఎల్కేజీకి రూ. 3 లక్షలా? సేవ ముసుగులో విద్యా వ్యాపారమా?’’ ‘‘యాజమాన్యాలకు బెంజ్ కార్లు.. తల్లిదండ్రులకు గంజి నీళ్లా?’’ ‘‘మేనిఫెస్టోలో పెట్టారు.. అమలు చేయడం మరిచారు.. మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేది ఎమ్మార్పీ?’’ - ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’పై కడుపు మండిన తల్లిదండ్రులు సూటిగా సంధించిన ప్రశ్నలివీ.. సాక్షి, హైదరాబాద్: ఏటేటా పెరిగిపోతున్న ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందాపై తల్లిదండ్రులు దండెత్తారు. స్కూళ్ల ధనదాహానికి నిరసనగా రాజధాని హైదరాబాద్లో కదంతొక్కారు. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తల్లిదండ్రులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, విద్యార్థి సంఘాల నేత లు అధిక సంఖ్యలో హాజరై ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటాన్ని ప్రశ్నించారు. ఇదేం దోపిడీ అంటూ నినాదాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టెక్సాస్ ఫీజులా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ కోసం వచ్చిన చట్టాలు, జీవోలు అమలయ్యే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే కొంతవరకు ప్రైవేటు దోపిడీని అరికట్టవ చ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ చైర్పర్సన్ అరవింద జాటా, ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ, హెచ్ఎస్పీఏ విక్రాంత్, ఆశిష్, సుబ్రమణ్యం, రవికుమార్, డాక్టర్ వినయ్కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్టిక్కర్ ఆవిష్కరణ.. ‘సీఎం సార్.. దయచేసి స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టండి’ అనే స్టిక్కర్ను హెచ్ఎస్పీఏ ప్రతినిధులు ఆవిష్కరించారు. వాహనాలకు వాటిని అంటిస్తూ ఫీజు దోపిడీని వివరించారు. మరో విప్లవానికి దారితీస్తుంది.. స్కూలు ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు రోడ్డెక్కడం విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని చెప్పడానికి నిదర్శనమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వ్యాఖ్యానించారు. ‘మహాధర్నా’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఫీజు ఉద్యమం మరో విప్లవానికి దారి తీస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు పోరాడుతున్నా చేతగాని దద్దమ్మలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ‘దొంగలందరూ కలసి తల్లిదండ్రుల బలహీనతలను వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వమూ వత్తాసు పలుకుతోంది. ఫీజు దోపిడీ సాగించే స్కూళ్లన్నీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలవే. ఇందులో సీఎంకూ భాగస్వామ్యం ఉంది’ అని ఆరోపించారు. ఓ తల్లి ఆవేదన... ‘‘నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందట ఓ పెద్ద స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నా కుమారుడికి రూ. 60 వేల ఫీజు కట్టా. నాలుగో తరగతికి వచ్చే సరికి మరో రూ. 15 వేలు పెంచారు. ఇదేమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అంతేనంటూ సమాధానమిచ్చారు. ఈ ఏడాది మరో రూ. 10 వేలు పెంచారు. ఇవన్నీ చెల్లించాలంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి’’ - శారద, (ప్రైవేటు ఉద్యోగిని) వైఎస్ తెచ్చిన జీవో అమలు చేయాలిwhere is restriction on private schools fees 2009లో అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెచ్చిన జీఓ నం 91ను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ జీవోను పాలకులు విస్మరించడం మూలంగానే ప్రైవేటు స్కూళ్లు యథేచ్ఛగా ఫీజు దోపిడీని సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఐటీ సెల్ అధ్యక్షుడు చల్లా మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ సాగిస్తూ తల్లిదండ్రుల ఇళ్లల్లో మట్టికొడుతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య దుయ్యబట్టారు. బడుల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యను వ్యాపారం చేయడానికి వీల్లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం విమర్శించారు. -
ఏఎస్సై బాధితుల రిలే దీక్షలు ప్రారంభం
హైదరాబాద్: కరీంనగర్ ఏఎస్సై మోహన్రెడ్డి బాధితులు రిలే దీక్షలను బుధవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలను చేయనున్నారు. సుమారు 50 మంది బాధితులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై మోహన్రెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలతో అరెస్టైన మోహన్రెడ్డి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా?
ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం. తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ. తల్లిగర్భం ధరించినప్పటినుంచి ఐదేళ్ళ వరకు తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అందేలా చూడటం కూడా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఫ్లోరైడ్ రహిత, రక్షిత తాగునీటిని అందించాల్సిన బాధ్యత సైతం ఏలికలదే. వీటిలో ఏ ఒక్క విషయంలో పాలకులు తమ బాధ్యత మరిచినా దాని దుష్ర్పభావం చిన్నారుల జీవితాలపై పడుతుంది. మరి మనచుట్టూ వివిధ రకాలైన వైకల్యాలతో పుట్టిన చిన్నారుల పట్ల దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంటే దానిని ఏమనాలి? వైకల్యం ప్రకృతి ఇచ్చిన శాపమైతే, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండడం సమాజం ఇచ్చిన మరో శాపం కిందే పరిగణించాలి. అలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా ఒక లక్షా 30 వేల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం వారు దాదాపు 2 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. మూగ, చెవిటి, అంధత్వం లాంటి వివిధ రకాలైన అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక అవసరాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. అయితే వారి అవసరాలకు తగిన విధంగా అన్ని అవకాశాలున్న పిల్లల మాదిరిగానే విద్యా వకాశాలను కల్పించాలని వారి కోసం అనేక చట్టాలు చేసింది. 1992లో వచ్చిన భారత పునరావాస మండలి చట్టంలోని 27, 28, 30, 31 సెక్షన్లు వికలాంగుల విద్యాభివృద్ధికి తోడ్ప డేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని సూచిస్తుంది. 1999 లో వచ్చిన జాతీయ ట్రస్ట్ ప్రకారం తల్లిదండ్రులు లేని వికలాంగులైన పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకొని వారి బాధ్యతలను చూడాలని చెపుతోంది. వీటితోపాటు విద్యా హక్కు చట్టంలో కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్ని రకాలుగా విద్యావకాశాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు ఈ పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలాగే కేవలం శిక్షణ కలిగిన మహిళా టీచర్లు మాత్రమే వీరికి బోధించాల్సి ఉం టుంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదని తెలంగాణ ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆరోపిస్తోంది. విద్యాహక్కు చట్టం (2009), ప్రాథమిక హక్కు 21(ఎ) చట్టాలు కూడా అమలు కావడం లేదు. ఇందులో 2009 నాటి చట్టంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు నాటి మానవవనరుల అభివృద్ది మంత్రి గొప్ప ఆశను కల్పించే అంశాన్ని ప్రతిపాదించారు. పాఠశాలకు హాజరు కావడం కూడా సాధ్యంకాని స్థితిలో ఉన్న బాల బాలికలకు ఇంటి దగ్గరే చదువు నేర్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేకపోయింది. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉచిత నిర్బంధ విద్య కూడా ఉంది. అది కూడా అమలు జరగడం లేదు. ఇలాంటి హామీలు అమలు కాకపోతే ప్రధానంగా నష్టపోయేది ప్రత్యేక అవసరాలు కలిగిన ఇలాంటి చిన్నారులే. సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల కారణంగా కొందరు బాలలు ఇంటి వద్ద అక్షరానికి నోచుకుంటున్నా, పాఠశాలలకు వెళ్లే సమ యానికి వారికి కొన్ని వాస్తవికమైన ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. వీరి స్థాయినీ, పరిస్థితినీ అర్థం చేసుకుని బోధించగల, ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యా యులు అక్కడ ఉండడం లేదు. ఇదొక విషాదం. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి అక్ష రాస్యత మీద ఆధారపడి ఉందన్న మాట నిజమే కానీ, ఇలాంటి శాపగ్రస్త బాలలకు చదువు గొప్ప వరమవుతుంది. ఆ అవసరం వారికి ఇంకాస్త ఎక్కువ. వారిలోని నిరాశా నిస్పృహలను తొలగించి, కొత్త జీవితం సంతరించుకుని, ఆత్మగౌరవంతో బతకడానికి వీరికి చదువు మరీ మరీ అవస రమన్న సంగతి ఇప్పటికైనా గుర్తించాలి. ఈ అంశం మీద ప్రజా చైతన్యం అత్యవసరం. ఇది అలాంటి బాలబాలికలను కలిగి ఉన్న తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. మొత్తం సమాజం దీనిని తమ బాధ్యతగా స్వీకరించి, వారిని తమతో సమంగా నడిచేటట్టు చేయడం కోసం కనీసం ప్రయత్నించాలి. నిజానికి ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి బాలల పట్ల దృష్టి పెట్టింది. ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం- 2007 అందుకు సంబంధించినదే. దీని ప్రకారం సమితిలోని సభ్య దేశాలన్నీ వికలాంగ బాలల సమస్యలను పరిష్కరించి, వారికి కూడా అభివృద్ధి ఫలితాలు అందేలా చేయాలి. దీనిని నాటి కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగిపోయింది. కానీ అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది మూగ, చెవిటి, అంధ, మానసిక వైకల్యం గల పిల్లలున్నా వారి సంఖ్యకు తగిన విధంగా పాఠశాలలు లేవు. వీరికోసం ప్రత్యేకించిన కళాశాల ఒక్కటి కూడా లేదు. వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సౌకర్యాలు అంతంత మాత్రమే. వీరి లాంటి విద్యార్థులకు బోధించడానికి అవసరమైన ప్రత్యేక అర్హతలు కలిగిన ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ప్రభుత్వం తయారు చేయలేదు. ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం. తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు ఇక్కడ ఎక్కువ. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అని ఒక పేరు పెట్టినా ఆ విధంగా ఈ నిర్భాగ్యులను ప్రభుత్వం కనికరించడం లేదు. కనీసం అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు అక్రమమార్గంలో సౌకర్యాలు పొందుతున్నా, అలాంటి అనైతిక వర్తనను కూడా ప్రభుత్వాలు అరికట్టలేక పోతున్నాయంటే, ఈ పిల్లల పట్ల ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది. ఈ అంశంలో అలాంటి అవినీతిపరుల కన్ను తెరిపించే చర్యలు కూడా అవసరమే. వికలాంగులకు ఇప్పటికే ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్ ని పది శాతానికి పెంచాలని, వీరికోసం ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని, వీరికి ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులను నియమించా లంటూ వస్తున్న డిమాండ్లు ఎంతో సమంజసమైనవి. కొత్త రాష్ట్రం ఏర్పడడం సంతోషదాయకమే. కానీ పాత సమస్యలు అలాగే మిగిలిపోతే తెలంగాణను సాధించుకున్న ప్రయోజనం నెరవేరుతుందా? - అత్తలూరి అరుణ (ఈ నెల 29వ తేదీన ఇందిరాపార్కు వద్ద వేలాది మంది మూగ, చెవిటి, అంధ పిల్లలతో భారీ బహిరంగ సభను తలపెట్టిన సందర్భంగా ...) -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
-
ఇందిరాపార్క్ వద్ద పేపర్ మిల్లు కార్మికులు ధర్నా
ఆదిలాబాద్ : మూసివేసిన సిర్పుర్ పేపర్ మిల్లు వెంటనే తెరిపించాలని ఆ సంస్థ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11 నెలలుగా మూసివేసిన పేపర్ మిల్లు తిరిగి తెరిపించాలని కోరుతూ మిల్లు కార్మికులు ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడుతుంది. పేపర్ మిల్లు కార్మికుల చేపట్టిన ఈ ధర్నాకు వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. -
ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు
ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. -
ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీల దీక్ష
హైదరాబాద్: ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తమను దూరం చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీలు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఎంపీటీసీలను ఆహ్వానించకపోవటం తగదన్నారు దీక్షల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఈ నెల 22న ఎంపీటీసీ సభ్యుల నిరసన దీక్ష
పంజగుట్ట(హైదరాబాద్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం తెలిపింది. అదే విధంగా నేటి నుంచి అన్ని గ్రామ, మండల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ... గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఎన్నో సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. గ్రామంలో సర్పంచ్, వైస్ సర్పంచ్, ఆఖరుకు వార్డు సభ్యులకు కూడా స్థానం కల్పించి తమను మాత్రం విస్మరించారని తెలిపారు. తమను ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా గుర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,473 మంది ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈనెల 22న జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారని కరుణాకర్ తెలిపారు. -
వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు
దిక్కుమాలినోళ్ల ఓట్లతోనే సీఎం అయ్యావని గుర్తుంచుకో * కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక * ఇందిరాపార్కు వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా హైదరాబాద్: ‘‘కార్మిక సంఘాలు దిక్కుమాలినవా? టీఆర్ఎస్, కేసీఆర్ పుట్టక ముందు నుంచే కార్మిక సంఘాలున్నాయి. అధికారం చేతిలో ఉందని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దిక్కుమాలిన వాళ్లు వేసిన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యావు. దిక్కుమాలిన వాళ్లే మూడున్నరేళ్ల తర్వాత నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. దిక్కులేనివాళ్లకు దిక్కు చూపించే చుక్కలు వామపక్షాలని, దిక్కు చూపించకుండా చుక్కలు చూపుతున్న తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. మంత్రులు ముఖ్యమంత్రితో మాట్లాడే కనీస ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదన్నారు. తమకు ప్రజాస్వామ్య, సామాజిక, జన తెలంగాణ కావాలే తప్ప.. దోరల తెలంగాణ, నియంతృత్వ తెలంగాణ కాదని, ఇదే మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తే.. ఆయన పాలనకు ప్రజలు పాతర వేస్తారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాజధానికి భారీగా తరలివచ్చిన కార్మికులు.. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మత్తులో ఉన్నాడో, చెవుల్లో సీసం పోసుకున్నాడో సీఎంకు వినపడటంలేదన్నారు. వామపక్షాల పంచాయతీల్లో ముందు జీతాలు పెంచాలన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇస్తే తాము అక్కడే తేల్చుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయా? అని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ వస్తే, ఎన్నిక ల ప్రచారంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనే మాటే ఉండదని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం పర్మినెంట్ అనే మాటే లేదంటున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దోరల ఆలోచనలను పుణికి పుచ్చుకున్న కేసీఆర్ సమ్మె విరమించాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో ప్రజలు పేదలవుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు ఉయ్యాల్లో ఊగుతోందని విమర్శించారు. పంచాయతీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 15 వేలకు పెంచడంతో పాటు వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు, సీసీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క, సూర్యం (ఐఎప్టీయూ), నర్సింహన్ (ఏఐటీయూసీ), సాయిబాబా, పాలగుడు భాస్కర్, భూపాల్, రమ(సీఐటీయూ), జానకిరాములు(ఆర్ఎస్పీ), గోవర్ధన్, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ), ఎంకే బోస్ (టీఎన్టీయూసీ), రాధాకష్ణ(బీఎంఎస్), మురహరి(ఎస్యూసీఐ) తదితరులు పాల్గొని మాట్లాడారు. -
వామపక్షాల ‘మున్సిపల్’ దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షలను బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న నేతలందరినీ బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్మికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి నేతలను పోలీసులు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆగ్రహించిన వామపక్షాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం (ఈ నెల 17న) రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. గురువారం (16న) నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వామపక్షాల నాయకులు తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్రెడ్డి (సీపీఐ), సాధినేని వెంకటేశ్వర్రావు (న్యూడెమోక్రసీ, చంద్రన్న వర్గం), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమోక్రసీ, రాయల వర్గం), సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్యూసీఐ), భూతల వీరన్న (సీపీఐ ఎంఎల్) తదితరులు ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలో కూర్చుకున్నారు. ఈ దీక్షలకు అనుమతి తీసుకోకపోవడం, దీక్షలకు సంఘీభావంగా రాష్ట్రంలోని 63 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి గురువారం కార్మికులు వేలాదిగా తరలిరావాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వామపక్షాల నేతలను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. కార్మికులు, నాయకులు వారిని తీవ్రం గా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు.. కార్మికులను పక్కకు తొలగించి నేతలను అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. బలహీనవర్గాలను పట్టించుకోరా..? అంతకు ముందు సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాఘవులు దీక్షలను ప్రారంభించి, మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అగ్రకులాలు ఎక్కువగా ఉండి ఎక్కువ జీతాలు సంపాదించుకుంటున్న వారికి జీతాలు పెంచుతూ.. సమాజం ఈసడించుకునే పనిలో, బలహీనవర్గాలు అధికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల వేతన సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా జీవనం సజావుగా సాగడానికి శ్రమించే కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. సైన్యాన్ని, పోలీసులను దించి, ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెను అణిచివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులేమైనా దేశద్రోహులా, దురాక్రమణదారులా అని నిలదీశారు. కార్మికులతో తలపడితే అధికారాన్ని వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి, ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తదితరులు సంఘీభావం ప్రకటించారు. కాగా.. సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరించే బదులు మరింత జటిలం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. బంద్కు అన్ని సంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాలు సహకరించాలని సీపీఎం నేత బి.వెంకట్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అణచివేత, నిర్భంధంతో సమ్మెను ఆపజాలరని సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) నేత కె.గోవర్ధన్ పేర్కొన్నారు. ఎవరి దారిలో వారే! * 90% మంది విధుల్లోకి: కమిషనర్ * కొనసాగుతోందన్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెపై ఇంకా ఎటూ తేలడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని, ఇంకా మొండికేస్తే ఆమరణ దీక్షలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేస్తుండగా.. దాదాపు 90 శాతం మంది కార్మికులు విధుల్లో చేరారని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్కుమార్ పేర్కొన్నారు. దాదాపు సమ్మె ముగిసిపోయినట్లేనని, కార్మికులంతా విధులకు వస్తున్నారని చెప్పారు. విధులకు గైర్హాజరు కావడమే కాక విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్న 28 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకోవ డంతోపాటు ఐదుగురు ఎస్ఎఫ్ఏ(శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లను తొలగించామన్నారు. హైదరాబాద్లో బుధవారం 3వేల టన్నులకుపైగా చెత్తను తరలించామని, మొత్తం చెత్తను గురువారం సాయంత్రంలోగా తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులను వినియోగించి సమ్మెలో ఉన్న వారిని అరెస్టు చేశారని, మహిళా కార్మికులని కూడా చూడకుండా పోలీస్స్టేషన్లలో ఉంచారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి. -
ఎన్నికల హామీలను అమలు చేయాలి: సీపీఐ
పేదలకు ఇళ్లు నిర్మించాలని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గత పాలకుల మాదిరిగా ఎన్నికల ముందు పేదలు, గుడిసెవాసులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. గుడిసెవాసులకు పట్టాలివ్వాలని, నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గోదావరి జలాల్లో పవిత్రస్నానాన్ని ఆచరిం చిన సీఎం కేసీఆర్ అదే పవిత్రహృదయంతో గుడిసెవాసులకు ఇళ్లస్థలాల పట్టాలిచ్చి డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకిచ్చిన ఎన్నికల హామీలన్నిం టినీ అమలు చేయాలని, లేదంటే కేసీఆర్ కళ్లు తెరిపించాల్సి వస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరిం చారు. తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక ఈ 14 నెలల్లో ఒక్కదానిని కూడా తీర్చలేదని, రోజుకో వాగ్దానం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. పేదలు, గుడిసెవాసులు ఎవరూ కూడా బంగారు తెలంగాణ కావాలని కోరుకోవడం లేదని, పేదలకు కావాల్సింది ఇళ్లస్థలాలు, పక్కాఇళ్లు, రెండుపడకగదుల ఇళ్లేనన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని, లేనియెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న సీఎం ముం దుగా పాత నగరంలోని 1,100 మురికివాడల ప్రజల కనీస సౌకర్యాల గురించి ఆలోచించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా సూచించారు. హైదరాబాద్లోని పేదలకు లక్ష పట్టాలు పంపిణీ చేశామని సీఎం అబద్ధం చెబుతున్నారని, వాస్తవానికి 60 వేల దరఖాస్తులకుగాను ఇంకా 50 వేలు పెండింగ్లో ఉన్నాయని సౌత్జోన్ కార్యదర్శి ఈటి నర్సింహ అన్నారు. గుడిసెవాసుల సమస్యలు తెలుసుకోడానికి పదిరోజులు పాదయాత్ర చేసి మహాధర్నా నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీఎస్బోస్, ఎస్.ఛాయాదేవి, ప్రేంపావని పాల్గొన్నారు. -
నగరంలో కదం తొక్కిన హిజ్రాలు
-
హక్కులు జిందాబాద్
-
నగరంలో కదం తొక్కిన హిజ్రాలు
హైదరాబాద్: ఇందిరా పార్కు వద్ద హిజ్రాలు తమ హక్కుల కోసం ఆదివారం ధర్నా చేపట్టారు. ఉద్యోగం కావాలి.. ఉపాధి కావాలి.. రక్షణ కావాలి.. అంటూ తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, ట్రాన్స్జెండర్లపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. -
‘ఔట్లుక్’ కార్టూన్పై నిరసన
ఇందిరాపార్కు వద్ద తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆందోళన హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై అసభ్యకరంగా కార్టూన్ వేసి, కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ మ్యాగజైన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, గ్రూప్ వన్ ఆఫీసర్స్, సివిల్స్ అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. నోటికి మాస్కులు ధరించి, ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ఔట్లుక్ చర్యపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అధికారి సాధు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ స్మితా సబర్వాల్పై ఔవుట్లుక్ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ప్రధానమంత్రి నుంచి అవార్డును అందుకున్న ఉత్తమ అధికారిణి స్మితా సబర్వాల్ అని కొనియాడారు. ప్రతికా స్వేచ్ఛ పేరిట వ్యక్తుల స్వేచ్ఛను హరించడం సరికాదని, ఇది ఎల్లో జర్నలిజం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ (ఐపీఎస్), బలరాం, శైలజ (ఐఆర్ఎస్), రమణారెడ్డి (ఐఆర్పీస్), ఉదయనాథ్ (ఐఆర్ఎఎస్), రాహుల్ గౌలీకార్ (ఐఐఎస్), బాలలత (డిఫెన్స్), రవికుమార్ (డిఇఓ), నాగమునయ్య (ఎస్ఓ, అసెంబ్లీ), నరసింహన్ (ఎఎస్ఓ, సెక్రటేరియట్) లతో పాటు సివిల్స్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు ఉపాధ్యాయులు గుర్తుకు రావడం లేదు
పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపయోగపడిన ఉపాధ్యాయులు ఇప్పుడు సీఎం కేసీఆర్కు గుర్తుకు రాకపోవడం విడ్డూరమని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను అణచివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు. పీఆర్టీయూ జూన్ 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధ ర్నా సన్నాహక సమావేశంలోవెంకట్రెడ్డి ప్రసంగించారు.సర్వీసు రూల్స్ అమల్లోకి తేవాలని, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండితులు, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలన్న డిమాండ్లతో ఈ పోరాటం తలపెట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సేవ్ ఎన్టీఆర్ స్టేడియం..సేవ్ ఇందిరాపార్క్
మారేడ్పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్సాగర్ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. -
ఇందిరా పార్కులో ‘ఎమ్మెల్సీ’ ప్రచారం
కవాడిగూడ :హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ను గెలిపించాలని కోరుతూ సోమవారం ఉదయం ఇందిరాపార్కులో రాష్ట్ర హోం శాఖామాత్యులు నాయిని నర్సింహా రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ, దేవీప్రసాద్లు ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వాకర్స్ను కలిసి దేవీప్రసాద్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సకల జనుల సమ్మె సక్సెస్ వెనుక దేవీప్రసాద్ పాత్ర ఉందని నాయిని అన్నారు. నారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమాజానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి దేవీప్రసాద్ అన్నారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని సీపీఐ సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల పక్షాన వారి ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం బలమైన గొంతుగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ఛైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు, ముషీరాబాద్ నియోజకవర్గ అడ్హాక్ కమిటీ సభ్యులు ముఠా గోపాల్, వి. శ్రీనివాస్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, ఎస్.యాదగిరి, శంకర్ లూక్, పెంటారెడ్డి, సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని, సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణలు దేవీ ప్రసాద్ ఎన్నికల ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే వాకర్స్తో కొద్దిసేపు షటిల్ ఆడారు. -
కంచే గంధం మేసింది..
ఇందిరాపార్కులో గంధపు దుంగల అపహరణ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తోటమాలి కవాడిగూడ: ఇందిరా పార్కులో కొన్నేళ్లుగా యదేచ్ఛగా సాగుతున్న గంధపు దుంగల దొంగతనం బట్టబయలైంది. పార్కులో పనిచేసే ఓ ఉద్యోగి కాషాయ వస్త్రాలు ధరించి దుంగలను తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. ఇందిరాపార్కులో సుమారు 250కి పైగా గంధపు చెట్లు సహజంగా మొలిచాయి. పార్కు అధికారులు ఈ చెట్లకు ప్రత్యేక నంబర్లను వేసి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రిజిస్ట్రర్ కూడా ఉంది. కానీ దాన్ని సక్రమంగా నిర్వహించడం లేదు. రెండేళ్ల క్రితం పార్కులోని గంధం చెట్లను నరుకుతుండగా ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం నరికిన గంధపు దుంగలను స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి తరలిస్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకుని షాక్ తిన్నారు. సదరు వ్యక్తి పార్కులో తోటమాలిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి భద్రయ్య. ఇతనికి పార్కులోని క్యాంటీన్లో పనిచేసే ఓ యువకుడు సహకరిస్తున్నాడు. గంధపు దుంగలను క్యాంటీన్లోనే భద్రపరచి అనంతరం బయటకు తరలిస్తున్నారు. పార్కులో గంధపు చెట్ల నరికివేతలోను, కొమ్మలు మాయం చేయడంలోను పార్కు అధికారుల అందండలపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం దొరికిన దుంగలు కాల్చిన చెట్ల నుంచి నరికినట్టు ఉండడంతో.. గత 15 రోజుల్లో రెండు సార్లు పార్కులో చెలరేగిన మంటలు ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇందిరాపార్కు ఉద్యానవన అధికారి శ్రీధర్ను వివరణ కోరగా గంధం దుంగల తరలింపుపై గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రం: చాడ
హైదరాబాద్: కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మతోన్మాద చర్యలను నిరసిస్తూ ఇందిరా పార్కు నుంచి సుందరయ్య పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకొస్తే మంచి రోజులు వస్తాయని మోదీ చెప్పారని, అయితే అవి బడాబాబులకేనని స్పష్టమవు తోందన్నారు. కోల్ ఇండియా ఓఎన్జీసీ వాటాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి తమ హక్కులను సాధించుకోవాలని, అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిం చాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో కాషాయ మతాన్ని జొప్పిస్తున్నారని, భారత్ను హిందూరాజ్యం చేసేందుకు కుట్ర లు చేస్తున్నారని విమర్శించారు. మతఘర్షణలు పెరగడంతో పాటు ఉపాధిహామీ పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు మూర్తి, ఎస్యూసీఐ నాయకుడు శ్రీధర్, ఆర్ఎస్పీ నాయకుడు జానకిరాము, ఎంసీపీఐయూ నాయకుడు ఉపేందర్రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలపై స్పందించండి: లెఫ్ట్
* రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం * ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరు సాగుతుందని ప్రకటన సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై తన వైఖరిని ప్రకటించాలని పది కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరిక జారీ చేశా యి. ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు పది జిల్లాల్లో రైతు కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు చేపట్టిన బస్సు జాతాలకు ముగింపుగా గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి. ‘రైతుల ఆత్మహత్యల ను నివారించాలి, ఆర్థిక భద్రతను కల్పించాలి-ప్రభుత్వం వెంటనే స్పందించాలి’ నినాదం తో నిర్వహించిన ధర్నాలో పది వామపక్షాల నేతలు, రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నేతలు మాట్లాడుతూ...ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రైవేట్ రుణాలను సంస్థాగత రుణాలుగా మార్చాలని, వాటిపై రెండేళ్ల మారటోరియం విధించాలని, రైతులకు వడ్డీలేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారి కుటుంబాల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు తాము చేపట్టిన మొదటి దశ ఉద్యమం ముగిసినా, ప్రభుత్వం స్పందించేదాకా ఎన్నేళ్లయినా పోరాటం కొనసాగించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆత్మహత్యలు 5 వేలకు పెరుగుతాయి ప్రభుత్వం సహాయ చర్యలను వెంటనే చేపట్టకుంటే వ్యవసాయరంగ సంక్షోభం ముదిరి రైతుల ఆత్మహత్యలు అయిదువేలకు పెరిగే ప్రమాదముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 500 మంది రైతుల ఆత్మహత్యలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించినా రూ.25 కోట్లు మాత్రమే అవుతుందన్నారు. ఆడపడుచుల కన్నీళ్లు తుడవలేని కరుకు గుండె సీఎంవా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజే్వలులో అభివృద్ధిని సమీక్షించిన సీఎం కేసీఆర్, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులు పంట రుణాలను చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకటరామయ్య రైతులకు సూచించారు. తాము 160 మంది చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించామని, ఈ ఆత్మహత్యలు నిజమో కాదో తేల్చుకోవాలని ప్రభుత్వానికి సీపీఎం నేత సారంపల్లి మల్లారె డ్డి సవాల్ విసిరారు. పశ్య పద్మ (సీపీఐ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), సాదినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ), బండా సురేందర్రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), జానకిరాములు (ఆర్ఎస్పీ), మూర్తి (లిబరేషన్), మురహరి (ఎంసీపీఐ-సీ), వీరయ్య (సీపీఐ-ఎంఎల్) ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కాగా, రెండో దశ ఉద్యమ కార్యాచరణను శుక్రవారం ఎంబీ భవన్లో సమావేశమై వామపక్షాల నేతలు ఖరారు చేయనున్నారు.. -
'హే కృష్ణా'.... ఇందిరా పార్కే బెటర్!
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ....అన్నట్లుగా ఉంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పరిస్థితి. అనవసరంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టానురా కృష్ణా..అని మధనపడుతున్నారట. ఎన్నికల ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎరక్కపోయి వచ్చాను ...ఇరుక్కుపోయాను అని అనుచరుల వద్ద వాపోతున్నారట. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎర చూపి రంగంలోకి దింపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ...ఆ తర్వాత తూచ్ అంటూ చివరకు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించటమే కృష్ణయ్య అసంతృప్తికి కారణమైంది. కనీసం తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ పదవైనా దక్కుతుందేమో అనుకుంటే ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎంను చేస్తామన్న బాబు... ఆఖరుకు శాసనసభా పక్షనేత పదవి కూడా ఇవ్వలేదని కృష్ణయ్య గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం పచ్చ కండువాను కూడా ఇష్టపడటంలేదు. దాంతో కొద్దిరోజుల క్రితం కృష్ణయ్య సైకిల్ దిగి ...కారు ఎక్కుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో కానీ ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. ఆయన మాత్రం తనదారి...సపరేట్ అన్న చందంగా వ్యవహరించారు. సభలో టీడీపీ గందరగోళం సృష్టించినా కృష్ణయ్య మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉండటం విశేషం. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తే...వారినే అనుసరించేవారు అంతే. సమావేశాలకు హాజరైనా..పార్టీ సభ్యులతో సంబంధం లేనట్లు రావటం, వెళ్లడం సైలెంట్గానే జరిగాయి. ఈ వ్యవహారమంతా గమనించిన టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి...ఉండబట్టలేక కృష్ణయ్యను కదిలించారట. దాంతో కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టుగా..'సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. ఇంతకన్నా ఇందిరా పార్క్ దగ్గరే నయం...ఉద్యమాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు మాట్లాడేవాడిని. నేను మాట్లాడాలనుకుంటే...ఇందిరా పార్క్ వద్దకు వెళ్లటమొక్కటే మార్గం' అని వాపోయారట. -
పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు
* కేంద్రం తీరుపై కార్మికసంఘాల ధ్వజం * ఇందిరాపార్కు వద్ద ధర్నా, భారీ ర్యాలీ హైదరాబాద్: పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్లుగా ఉందని కార్మికసంఘాల నేతలు ఆరోపించారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం హైదరాబాద్లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కార్మికసంఘాల నేతలు మాట్లాడుతూ... పారిశ్రామిక వేత్తలకు, పాలకులకు మధ్య రహస్య ఒప్పందాలు జరగుతున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్రం తిలోదకాలిస్తోందని, అందులో భాగంగానే కార్మిక చట్టాల్లో సవరణకు పాల్పడుతోందని విమర్శించారు. కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులు హక్కుల ఉల్లంఘనకు, తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావులు ప్రసంగించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశం, ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ సుధీర్, ఐఎఫ్టీయూ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర రావు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే బోస్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రెండ్లీ పోలీస్ : ధర్నాకి వచ్చిన వారికిలా..!
-
నల్లచొక్కాలతో జూడాల నిరసన
హైదరాబాద్: సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో నల్లచొక్కాలు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ క్రాంతి, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, నేతలు డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ డాక్టర్ల రూరల్ సర్వీస్ను రెండేళ్లకు పెంచాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డిమాండ్లను పరిష్కరించాలి: చాడ జూడాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. -
జర్నలిస్టుల సమస్యలపై 10 నుంచి రిలే దీక్షలు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 10వ తేదీ నుంచి వారంపాటు ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య విలేకరులకు తెలిపారు. డిసెంబర్ 4న అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ఉద్యోగభద్రతపై రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, 5న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను 2015 జనవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తెలంగాణ జూడాల రిలే దీక్షల ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభవుయ్యాయి. ఇందిరాపార్కు ధర్నా చౌక్లో ప్రారంభమైన జూడాల దీక్షల శిబిరాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సందర్శించారు. అనంతరం మాట్లా డుతూ 28 రోజులుగా జూనియర్ డాక్టర్లు న్యాయమైన కోర్కెల కోసం చేస్తున్న సమ్మె సహేతుకమైందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జూడాల కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ క్రాంతి, నాగార్జున, రాఘవేంద్ర, ధనుంజయ్, అభిలాష్ పాల్గొన్నారు. -
ఇందిరా పార్కులో ‘నిమజ్జన’ సరస్సు
తెలంగాణ సీఎం కేసీఆర్ యోచన అందులోనే గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం హుస్సేన్సాగర్ పరిరక్షణ, శుద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం హైదరాబాద్: నిండా కలుషితమై దుర్గంధం వెదజల్లుతున్న హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ హుందాతనాన్ని పెంచేలా ఈ సరస్సును తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా... గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం కోసం సాగర్కు సమీపంలోని ఇందిరాపార్కులో ఒక సరస్సును నిర్మిద్దామని కేసీఆర్ ప్రతిపాదించారు. సాగర్నీటితోనే దానిని నింపడంతో పాటు.. కొత్త సరస్సును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు. ఇక సాగర్లోకి చేరే మురుగునీటిని పూర్తిగా మళ్లించాలని, అందుకోసం డ్రైనేజీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కేసీఆర్ హుస్సేన్సాగర్ను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డులోని పలు చోట్ల హుస్సేన్ సాగర్ నీరు కలుషితమవుతున్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. బాల్కాపూర్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కూకట్పల్లి, పికెట్ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు హుస్సేన్సాగర్లో కలుస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, హెచ్ఎండీఏ ప్రత్యేకాధికారి ప్రతీప్ చంద్ర, హెచ్డబ్ల్యూడబ్ల్యూస్బి ఎండీ ఎం.జగదీష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులతో సమీక్షించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్సాగర్ కలుషితమవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సమీపంలోనే ఉన్న ఇందిరాపార్కులో 15-20 ఎకరాల స్థలంలో చిన్నపాటి సరస్సును నిర్మించి.. అందులోనే గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం జరపాలనే ప్రతిపాదన చేశారు. బోటింగ్ తదితర సౌకర్యాలతో ఈ సరస్సును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్కు భంగం కలగకుండా హుస్సేన్సాగర్ నీటితోనే ఆ సరస్సును నింపుదామన్నారు. ఈ అంశంలో సలహాలు, సూచనలు, అభిప్రాయాల సేకరణ కోసం హైదరాబాద్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గణేశ్ ఉత్సవ కమిటీతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రక్షాళన చేయండి.. ప్రపంచంలోని చాలా నగరాల మధ్యలో హుస్సేన్సాగర్లాంటి సరస్సులున్నా.. అవి దుర్గంధం వెదజల్లడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు హుస్సేన్సాగర్ గొప్ప ఆకర్షణ అని, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాంటిది సాగర్ కలుషితమై దుర్గంధం వెదజల్లడం చూస్తే అవమానకరంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నిపుణులను రప్పించి సాగర్ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్సాగర్ పరిధిలోని పూర్తి భూభాగాన్ని పరిరక్షించాలని.. ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మురుగు చేరకుండా చూడండి.. హుస్సేన్సాగర్లోకి చేరిన మురుగునీటిని శుభ్రం చేయడం కన్నా.. అసలు మురుగు నీరు అందులో చేరకుండా అడ్డుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగర్లోకి నాలాల ద్వారా రోజుకు 527 మిలియన్ లీటర్ల మురికి నీరు వస్తోందని.. కేవలం 368 మిలియన్ లీటర్ల నీటిని తరలించడానికి మాత్రమే పైపులైన్ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ... నాలాల నుంచి వచ్చే నీరంతా నేరుగా సాగర్ తూము నీరు పోయే చోటికి చేరేలా కాలువలు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలో మంచి నీటిని హుస్సేన్సాగర్లో నింపి తర్వాత షట్టర్లు మూసివేయాలన్నారు. -
ఆదర్శరైతుల తొలగింపు?
మహబూబ్నగర్ వ్యవసాయం: ప్రభుత్వం రాష్ట్రంలోని ఆదర్శరైతులను తొలగించేందుకు పూనుకున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఆదర్శరైతుల్లో మళ్లీ కలవరం మొదలైంది. వీరి తొ లగింపునకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండుమూడు రోజుల్లో వెలువడనున్నట్లు తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, నెలరోజుల క్రితం తొలగింపు ఊహాగానాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శరైతులు మూకుమ్మడిగా హైదరాబాద్లోని ఇందిరాపార్కు ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొంది ఆందోళన విరమించారు. మరోసారి వారు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న ఆదర్శరైతులు నేడు(సోమవారం)ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని పూనుకున్నారు. ఇలా జిల్లాలో పనిచేస్తున్న 2747 మంది ఆదర్శరైతులు పరిస్థితి సంకటస్థితిలోకి వెళ్లింది. 2007లో నియమితులైన వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29కోట్లు చెల్లిస్తోంది. ఇదిలాఉండగా, ఏడాది నుంచి తమకు వేతనం ఆదర్శరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆద ర్శ రైతులను కక్షపూరితంగా తొలగింపునకు పూనుకుంటోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం నుండి ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. అలాగే 25న ‘చలో హైదారాబాద్’కు పిలుపునిచ్చారు.’ అని ఆదర్శరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం స్పందనను బట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని వెల్లడించారు. -
‘రికార్డుల’ ఆవిష్కరణ
విశ్వ వ్యాప్తంగా ‘శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు’ 10 లక్షల కాపీల వితరణ 13 రికార్డులు కైవసం కవాడిగూడ: సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి రచించిన గ్రంథం 13 రికార్డులను సొంతం చేసుకుంది. ఆయన స్వీయానుభవంతో రాసిన ‘శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు’ గ్రంథావిష్కరణ ఆది వారం ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీయార్ స్టేడియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు గ్రంథాన్ని ఆవిష్కరించారు. శివుడే ఆది దేవుడు సీడీని నాయిని నర్సింహారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వామి రమణానంద మాట్లాడుతూ శివారాధనతో సకల దేవతలను పూజించినట్లేన ని పేర్కొన్నారు. శివుడే ఆదిదేవుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై శివుడి అనుగ్రహం ఉందన్నారు. 1100 శివాలయాల్లో.. ఈ గ్రంథాన్ని విశ్వ వ్యాప్తంగా ఆదివారం 11 గంటల వ్యవధిలో 10 లక్షల కాపీలను వితరణ చేసినట్టు రమణానంద తెలిపారు. ప్రత్యేకంగా 1100 శివాలయాల్లో గ్రంథ వితరణ చేసినట్లు పేర్కొన్నారు. ఒకేసారి 10 లక్షల కాపీలు ఆవిష్కరించడంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ ఎమేజింగ్ రికార్డ్స్, ఆర్హెచ్ఆర్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎవరెస్టు వరల్డ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, ది బుక్ ఆఫ్ తెలంగాణ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులను స్వామి రమణానంద మహర్షి సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, పైలా శేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎల్. రాజం, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, రవీంద్రనాథ్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా గ్రంథాన్ని అందజేశారు. -
చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం
హైదరాబాద్, చుండూరు తీర్పును ఎండగడుతూ ఈనెల 30న ఇందిరా పార్కు వద్ద వివిధ ప్రజా సంఘాలతో కలసి ధర్నా నిర్వహిస్తామని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కన్వీనర్, సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం బుధవారం పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు దళితుల ఊచకోత కేసును తమ అవసరాల కోసం కేవలం ఏడు రోజుల్లో విచారణ ముగించారని ఆయన మండిపడ్డారు. జిల్లా స్పెషల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చే స్తూ 8 మంది దళితులను హత్య చేసిన ఒక సామాజిక వర్గానికి చెందిన హంతకులందరూ నిర్దోషులే అంటూ తీర్పు చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఐఆర్కోసం ఆర్టీసీ కార్మికుల దీక్ష
హైదరాబాద్, న్యూస్లైన్: కార్మికులకు తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్వద్ద రెండు రోజుల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ. అశ్వథ్థామరెడ్డి, ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి వీఎస్ రావులు మాట్లాడుతూ జనవరి 26న జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి వేతనంతో పాటు ఐఆర్ చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మధ్యంతర భృతి రాక ఆర్టీసీలో లక్షా 25 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 217 డిపోల్లో నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరగనున్నాయి. -
రాజధాని ముట్టడి
* కదంతొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు * వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ * ఇందిరాపార్క్ వద్ద ‘చలో హైదరాబాద్’ ధర్నా * రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని, * ఐకేపీ జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి * సచివాలయం ముట్టడికి యత్నం.. * అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు * చర్చలకు పిలిచిన సీఎస్... రేపు మరోసారి సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు రాజధానిని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం 23 జిల్లాల నుంచి ఒక చేతిలో జెండా.. మరో చేతిలో సద్దిమూటతో వచ్చి ‘చలో హైదరాబాద్’ ధర్నాను నిర్వహించారు. తమకు ఇస్తున్న వేతనాన్ని కనీసం రూ. 10 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాదిగా తరలివస్తున్న అంగన్వాడీ వర్కర్లను అడ్డుకోవడానికి పోలీసులు నానా తంటాలూ పడ్డారు. చివరికి ధర్నాకు అనుమతి లేదంటూ.. సభకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో అంగన్వాడీలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బైఠాయించడంతో.. ట్రాఫిక్ స్తంభించింది. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. - సీఐటీయూ నాయకత్వంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్’ సభ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు ధర్నాకు హాజరయ్యారు. - అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. - అంగన్వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించాలని, ఐకేపీ జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సచివాలయం ముట్టడికి యత్నం.. - గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. ఇందిరాపార్కు నుంచి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు సీఐటీయూ అధ్యక్షుడు సాయిబాబు, ప్రధాన కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి బయలుదేరారు. - పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 వరకు బైఠాయించారు. - దీంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు ఆహ్వానించడంతో... పోలీస్ స్టేషన్ నుంచి సీఐటీయూ నాయకులను పోలీసులే సచివాలయానికి తీసుకెళ్లారు. -కాగా.. వివిధ జిల్లాల నుంచి తరలివస్తున్న దాదాపు 300 మందికిపైగా అంగన్వాడీలను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పారిపోయారని సీపీఎం కేంద్ర కమిటీ నాయకుడు ఎస్. వీరయ్య మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన వారి అడ్రస్ 10 ఏళ్ల పాటు గల్లంతయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు వ్యాఖ్యానించారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనాన్ని రూ.10 వేలకు పెంచాల్సిందేనని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రోజా డిమాండ్ చేశారు. 26న పూర్తిస్థాయి చర్చలు.. అంగన్వాడీలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 26వ తేదీ బుధవారం మరోసారి చర్చలు జరుపుదామని ప్రతిపాదించారని అంగన్వాడీ యూనియన్, సీఐటీయూ నాయకులు తెలిపారు. 26న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరితో చర్చలు జరుగనున్నాయని చెప్పారు. తమ సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాల వివరాలను కూడా అందజేశామని పేర్కొన్నారు. 26న చర్చిద్దామని సీఎస్ చెప్పారని... ఈ చర్చలకు ప్రభుత్వ అధికారులు ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలతో రావాలని కోరామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. మంగళ, బుధవారాలలో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అంగన్వాడీ కార్యకర్తలకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు పిలుపునిచ్చారు. అంగన్వాడీలపై దాడి అమానుషం: రాఘవులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం... నిరసన తెలపడానికి వచ్చిన అంగన్వాడీ సిబ్బందిపై అమానుషంగా దాడి చేయించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని... మహిళలని కూడా చూడకుండా దారుణంగా లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. -
అంగన్వాడీల సమ్మె బాట
-
'సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం'
హైదరాబాద్ : తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. కనీస వేతనం పదివేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు ఇందిరా పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరారు. కాగా అంగన్వాడీలు తలపెట్టిన సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అంగన్వాడీ కార్యకర్తలు సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలకు తాము భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్ఫష్టం చేశారు. సభ నిర్వహించి తీరుతామని వారు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. -
అంగన్వాడీ ఉద్యోగులకు విజయమ్మ భరోసా
అంగన్వాడీ ఉద్యోగుల చేస్తున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు కోరుతూన్న డిమాండ్ న్యాయబద్దంగా ఉన్నాయని తెలిపారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను కలసి విజయమ్మ తన సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని విజయమ్మ ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ విజయమ్మతోపాటు ఆ పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావులు అంగన్వాడి ఉద్యోగులను కలసిన వారిలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
కనీస వేతనం పదివేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం పది వేల రూపాయలు చేయాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సుధాభాస్కర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా మాట్లాడుతూ, పని గంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పెన్షన్తో సహా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. వారంరోజుల్లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీక్షకు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం కార్యదర్శి చంద్రారెడ్డి, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలి: సీపీఎం అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న లక్షా 80 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరారు. -
అనూహ్య హత్యకు నిరసనగా హైదరాబాద్లో పాస్టర్ల ధర్నా
హైదరాబాద్: అనూహ్య హత్యకు నిరసనగా శుక్రవారం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ బైబిల్ హౌస్ నుంచి ఇందిరాపార్కు వరకూ శాంతి ర్యాలీ చేపట్టారు. ధర్నాలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నట్లు సీబీఐ విచారణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ స్వరణ్జిత్ సేన్, సీఎస్ఐ మోడరేటర్ దైవాశ్వీరాదం, ఆర్చ్ బిషప్ తుమ్మ బాల, ఫాదర్ బాలా, మెదక్ డయాసిస్ వైస్ ఛైర్మన్ ఏసీ సాల్మన్ రాజు, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, వివిధ క్రిస్టియన్ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. -
మీరంతా మాయగాళ్లు: న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యవాదులమని చెప్పుకుంటున్న మీరంతా మీ పదవులకు రాజీనామాలు ఎందుకు చేయలేదు.. ఇకనైనా ఊసరవెల్లి మాటలు కట్టిపెట్టండి.. మీరంతా మాయగాళ్లు... మిమ్మల్ని జనం నమ్మడం లేదు...’’ అంటూ పలువురు న్యాయవాదులు ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు, ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్బాబులపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ బుధవారం ఇందిరా పార్కువద్ద న్యాయవాదులు నిర్వహించిన మహాధర్నా ఇందుకు వేదికైంది. సభావేదిక వద్ద ‘గ్యోబాక్’ అంటూ పలువురు న్యాయవాదులు నినాదాలు చేస్తూ.. వారి ప్రసంగానికి అడ్డుతగిలారు. కొందరు న్యాయవాదులు ఈ నేతలకు మద్దతుగా మాట్లాడడంతో ధర్నా రసాభాసగా ముగిసింది. అడ్వకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్సీవీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాలు నేతలు ధర్నాలో పాల్గొన్నారు. అక్కడేం జరిగిందంటే... ఉండవల్లి, ఆశోక్బాబులపై గరంగరం - నిలబడి ఆవేశంగా మాట్లాడే సమయం అయిపోయిందని, ఇప్పుడు కూర్చొని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఎంపీ ఉండవల్లి కూర్చొనే ప్రసంగించారు. అర్హతలేని టీ-బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం ధైర్యం చేయదన్నారు. - ఈ సందర్భంగా ఓ న్యాయవాది లేచి... మీరెందుకు రాజీనామా చేయలేదని ఉండవల్లిని ప్రశ్నించారు. మరో న్యాయవాది లేచి ఊసరవెల్లి మాటలొద్దు... మీ మీద మాకు నమ్మకం లేదని విమర్శించారు. - రాష్ట్ర విభజనను అడ్డుకుని ఉద్యమాలు, పోరాటాలు చేయడమనేది తమ బాధ్యత కాద ని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. ఇది కేవలం రాజకీయ అంశమని, ఇప్పటివరకూ గుర్రం పని గాడిద చేసిందని వ్యాఖ్యానించారు. మీరు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు, మీరు అమ్ముడుపోకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని న్యాయవాదులు అశోక్బాబుపై విరుచుకుపడ్డారు. జన విషయంలో చంద్రబాబు విధానమే కరెక్టనీ టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు చెప్పారు. దీంతో న్యాయవాదులు వారి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పార్టీ తరఫున ఒకే విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎవరేమన్నారు... మైసూరారెడ్డి, వైఎస్సార్సీపీ నేత: ఆనాటి పరిస్థితులను బట్టి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు ఆర్టికల్-3ని తీసుకొస్తే ఇప్పుడు కేంద్రం దానిని దుర్వినియోగం చేస్తోంది. అసెంబ్లీలో 77వ నిబంధన కింద ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు ఉంది. ఆ ప్రకారమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ అభిప్రాయం చెప్పడమంటే అది కూడా ఓటింగే అవుతుంది. డాక్టర్ మిత్రా, తెలుగు ప్రజా వేదిక ఉపాధ్యక్షుడు: సోనియా, చిదంబరం తదితర నేతలకు చట్టం, రాజ్యాంగం గురించి అవగాహన లేదు. ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేకుండా రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర విభజన చేస్తున్నారు. -
ఇందిరా పార్క్ వద్ద టిడిపికి చేదు అనుభవం
-
నగరంలో సాంస్కృతిక పార్కులు
ఐదింటిని ఎంపికచేసిన జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన పార్కులివే.. ఇందిరా పార్కు జలగం వెంగళరావు పార్కు కృష్ణకాంత్ పార్కు చాచానెహ్రూ పార్కు కేఎల్ఎన్వై పార్కు సాక్షి, సిటీబ్యూరో: చుట్టూ పచ్చని మైదానం.. మనసును ఆహ్లాదపరిచే చల్లగాలులు.. వీటి తో పాటు వీనులకు విందు చేసే సంగీ తం.. ఆకట్టుకునే నృత్యాలు.. వారంపాటు పనిభారంతో అలసినవారు వారాంతంలో ఈ ఆహ్లాదం చాలనుకుం టారు. ఉద్యానవనాలకు వెళ్లేవారిని ఆహ్లాదకర వాతావరణంతో రంజింప చేయాలని జీహెచ్ఎంసీ తలపోస్తోంది. అందుకుగాను ఎంపిక చేసిన పార్కుల్లో సాం స్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలు గా అవసరమైన విద్యుత్ సరఫరాతోపాటు ఆడియో సిస్టం.. ప్రదర్శనలకు వీలుగా వేదికలు నిర్మించి సదరు పార్కులను ‘కల్చరల్ పార్కులు’గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాక, సంబంధిత విభాగాలతో సమన్వయం కుదుర్చుకొని ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇం దిరాపార్కులో ప్రదర్శనలకు యాంపీథి యేటర్ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సెంట్రల్జోన్ పరిధిలోని పేరెన్నికగన్న పార్కుల్లో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఏర్పాటయ్యాక, వీటికి వచ్చే స్పందనను బట్టి ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. పేరెన్నికగన్న వారి ప్రదర్శనలే కాక.. ఆసక్తితో ప్రదర్శనలిచ్చేవారికి కూడా ఈ వేదికల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త కళాకారుల అరంగేట్రానికి సైతం వీటిని వేదికలుగా మలచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. శని, ఆదివారాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. వివిధ రంగాల్లో ఎనలేని సేవచేసిన నగరానికి చెందిన వారిని సముచితంగా సత్కరించాలనే యోచన ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. వారి కృషికి తగిన గుర్తింపునివ్వడం ద్వారా కొత్తవారికి కూడా ప్రేరణగా ఉంటుందన్నారు. 6 ఏసీబీ వలలో నగర పంచాయతీ కమిషనర్ ఎన్ఓసీ జారీకి రూ.2 లక్షలు డిమాండ్ రూ.50 వేలకు ఒప్పందం మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు మన్సూరాబాద్,న్యూస్లైన్: డిప్యూటేషన్పై పెద్దఅంబర్పేట నగర పంచాయతీ కమిషనర్గా పనిచేస్తున్న ఉపేందర్రెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. జీహెచ్ఎంసీ ఈస్ట్జోన్ జాయింట్ కమిషనర్ ఉపేందర్రెడ్డి డిప్యూటేషన్పై పెద్దఅంబర్పేట నగర పంచాయతీ కమిషనర్గా వచ్చారు. ఎల్బీనగర్కు చెందిన సుంకోజు శ్రీనివాస్ పెద్దఅంబర్పేటలో సుష్మిత కన్స్ట్రక్షన్స్ పేరుతో లైట్వెయిట్ బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనిఖీ నిర్వహించిన ఇంచార్జి శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాములు..కమిషనర్ను కలవాలని ఫోన్నెంబర్ ఇచ్చారు. శ్రీనివాస్ కమిషనర్ ఉపేందర్రెడ్డిని కలవగా ఎన్వోసీ సర్టిఫికెట్ జారీకి రూ.4.50 లక్షలు డిమాండ్ చేయగా...రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదట రూ.50వేలు చెల్లించి ఎన్వోసీ ఇచ్చాక మిగతా మొత్తమివ్వాలని మాట్లాడుకున్నారు. కామినేని బిగ్బజార్ వద్ద శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాములు వచ్చి కలుస్తాడని, అతనికి డబ్బులివ్వాలని కమిషనర్..శ్రీనివాస్కు సూచించారు. చేసేదిలేక మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డికి దీనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ముందుగానే బిగ్బజార్ వద్ద మాటువేసిన ఏసీబీ అధికారులు శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాములుకు ఫిర్యాదుదారు శ్రీనివాస్ రూ.50వేలు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారుల సూచన మేరకు..రాములు కమిషనర్ ఉపేందర్రెడ్డికి ఫోన్చేసి శ్రీనివాస్ నుంచి రూ.50 వేలు ముట్టాయని తెలుపగా..నీ వద్దే ఉంచుకోవాలని, రేపు తీసుకుంటానని కమిషనర్ బదులిచ్చారు. ఈ సంభాషణలను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. అనంతరం కమిషనర్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే అవినీతి నిరోధకశాఖకు 9440446134 నెంబర్కు సమాచారమివ్వాలని డీఎస్పీ శంకర్రెడ్డి కోరారు. -
‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయండి : ఏపీఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్’ పేరిట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవోల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులపై ఒత్తిడి పెంచేందుకు చేపడుతున్న ఈ ధర్నాను విజయవంతం చేయాలని పలు సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా మద్దతివ్వాలని ఆదివారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. ఈ సందర్భంగా ‘చలో హైదరాబాద్’ ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని, అవసరమైతే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యవాదుల ఓట్లతో గెలిచిన జేపీ ఆ విషయాన్ని మరచి మాట్లాడడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జేపీపై పోటీకి ఉద్యోగుల్లో ఒకరిని దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. -
తెలంగాణ వ్యతిరేకుల భరతం పడతాం
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: సీమాంధ్రుల కబంధహస్తాల్లో బం దీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి క ల్పించేవరకు పోరాటం కొనసాగుతుంద ని టీజేఏసీ రాష్ట్ర కోచైర్మన్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. తెలంగాణ ను అడ్డుకునే శక్తుల జాబితాను తయారుచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం వ చ్చిన తరువాత వారి భరతం పడతామని హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థాని క టీఎన్జీఓ భవన్లో విలేకరులతో మా ట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ సీమాంధ్ర ఉద్యమాన్ని నడపడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందన్నారు. బిల్లులో తెలంగాణకు న ష్టంచేసే అంశాలు చాలాఉన్నాయని, వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం టీజేఏసీ ఆధ్వర్యంలో జా తీయస్థాయిలో అన్ని పార్టీలను కలిసి విన్నవిస్తామన్నారు. తెలంగాణపై అసెం బ్లీలో చర్చ మొదలైందని, అల్లరిచేస్తూ చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకే ఎందుకని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. సీమాంధ్ర సీఎం డ్రామాలు ఈనెల 23 వరకేనని, ఎట్టి పరిస్థితిలోనూ బిల్లు రాష్ట్రపతికి పంపాల్సిందేనన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలనే డిమాండ్తో ఈనెల 7న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణవాదులు, ప్రజలు అధికసంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో తెలంగాణ వ్యతిరేకులపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జిల్లా చైర్మన్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండానే రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. అనంతరం తెలంగాణ సాధనసభ పోస్టర్ను విడుద ల చేశారు. కార్యక్రమంలో టీజేఏసీ నా యకులు బాల్కిషన్, జీవన్, చంద్రనాయక్, వెంకటయ్య, రామకృష్ణారావు, సా యిబాబా, మున్నూరు రవి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలి యూనియన్లు ఉద్యోగుల సంక్షేమ కోసం పాటుపడాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ కోరారు. టీఎన్జీఓ మక్తల్ తాలుకా కమిటీ క్యాలెండర్ను ఆదివారం ఆయన స్థానిక టీఎన్జీఓ భవన్లో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలకపాత్ర అన్నారు. ఉద్యోగులను వేధిస్తే చూ స్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులపై పెట్టిన కేసులను వెత్తివేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రా జేందర్రెడ్డి, జీవన్, బాల్కిషన్, రామకృష్ణరావు, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సంకల్ప దీక్ష కాదది...
-
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం
-
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్లో సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం సంకల్ప దీక్ష చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఆ దీక్షలో పాల్గొన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ పేర్కొన్నారు. సంకల్ప దీక్షలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివరావులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు తమ సంకల్ప దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్షకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతోపాటు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సంకల్ప దీక్ష స్థలి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
రేపు,ఎల్లుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష
-
7న సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష: కోదండరాం
-
7న సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష: కోదండరాం
జనవరి 7న నగరంలోని ఇందిరాపార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపడతామని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన ఐకాస కార్యాలయం వద్ద మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నీ రోజులు తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణల కోసం తమ ఆందోళనలు కొనసాగుతునే ఉంటాయని కోదండరాం చెప్పారు. -
వోల్వో 'బాధితుల ఆరని మంటల దీక్ష'
-
వోల్వో 'బాధితుల ఆరని మంటల దీక్ష'
హైదరాబాద్ : మహబూబ్నగర్ వోల్వో బస్సు ప్రమాద బాధితులు ఇందిరా పార్కు వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలన్నారు. బాధితుల ధర్నాకు సీపీఐ ఎమ్మెల్యే చంద్రవతి సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు, ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రమాదానికి గురైన బస్సు యాజమానులు ఎవరో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేయగలదని చంద్రావతి అన్నారు. దేశం మొత్తం దిగ్ర్భాంతి వ్యక్తం చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలు చెబుతుందే కానీ, చేతల్లో శూన్యమని ఆమె విమర్శించారు. -
వోల్వో బస్సు ప్రమాద బాధితుల కమిటీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన జరిగి 18 రోజులైనప్పటికీ యజమానులను అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బస్సు ప్రమాద బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో చేతకాని ప్రభుత్వం ఉందని దుయ్యబ ట్టారు. 45 మందిని పొట్టనపెట్టుకున్న వోల్వో బస్సు యజమానులను అరెస్టు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమ ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నిషేధించకపోతే ప్రజలే వాటిని తగలబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బస్సును ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినందున ఆ మరణాలు సర్కారు హత్యలేనని చెప్పారు. మహబూబ్నగర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్లోని వోల్వో షోరూమ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ధర్నాకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డిల రాజకీయ ప్రాబల్యం కారణంగానే కేసులు పెట్టడంలేదని ఆరోపించారు. వారిద్దరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వోల్వో బస్సులకు అనుమతిచ్చే విషయంలో సమగ్రంగా పరిశీలన జరగాలని కాం గ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సూచించారు. బాధితుల కమిటీ సభ్యుడైన అబ్దుల్ మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 18రోజులైనా దోషులను ప్రకటించపోవడం బాధాకరమన్నారు. ఇదే వేరే దేశంలోనైతే బహిరంగంగా కాల్చేసేవారని పేర్కొన్నారు. -
కమిషనర్ ఖబడ్దార్ !
కవాడిగూడ,న్యూస్లైన్: ‘మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే పట్టించుకోవు. సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చేందుకు వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వవు. కార్మికులంటే అంత అలుసా..? వైఖరి మార్చుకోకుంటే చెత్తలో పారేస్తామని’ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబును ెహ చ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగ,కార్మిక ఐక్యసంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ జరి గింది. అంతకుముందు కార్మికులు సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన సభలో ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ ,టీఎన్టీయూసీ, టీఆర్ఎస్ కేవీ తదితర కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్, కృష్ణారావు, రాధాకృష్ణ తదితరులు ఉద్వేగంగా మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసేందుకు నోటీసు ఇస్తానికి వెళ్లితే కమిషనర్ కృష్ణబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కార్మిక సంఘాల నేతలతో సానుకూలంగా చర్చల్లో పాల్గొంటూ రాత్రి సమయాల్లో ఫోన్లలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు న్యాయబద్ధంగా కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని, కరువుభత్యం చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్కార్డులు, జీపీఎఫ్ అకౌంట్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కట్ చేస్తున్న పీఎఫ్,ఈఎస్ఐ సొమ్మును వారి ఖాతా ల్లో జమకావడం లేదని, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ (ఏఐటీయూసీ), శంకర్ (బీఎంఎస్), వెంకటేష్(సీఐటీయూ), రెబ్బ రామారావు,వెంకటేష్ (హెచ్ఎంఎస్), శ్రీనివాస్ (టీఎన్టీయూసీ), భరత్ (ఏఐయూటీయూసీ), సాయిరెడ్డి, భాస్కర్రావు(టీఆర్ఎస్కేవీ) తదితరులు పాల్గొన్నారు. -
7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘చలో హైదరాబాద్’ పిలుపుతో సెప్టెంబరు మొదటివారంలో రాజధానిలో భారీ శాంతిర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించిన సద్భావనాదీక్ష (శాంతిదీక్ష)లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 4-7 తేదీల మధ్య తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్కు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయాలు లేవని, సంపన్న సీమాంధ్రులే తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా కలిసే ఉంటామని చెప్పడానికి సెప్టెంబరు మొదటివారంలో భారీశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉపద్రవం ఏదో వస్తున్నట్టుగా, భారతదేశం నుండి విడిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇదే ఫెడరల్ వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రాలన్నీ ఇప్పటిలాగానే పనిచేస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హైదరాబాద్లో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్తూ ఇటు ప్రజలను, అటు అధిష్టానాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. నదీ జలాల పంపకం, హైదరాబాద్ వంటివాటిని వివాదం చేసే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా ఇదే ఐకమత్యంతో పోరాడాల్సిందేనని కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు పోవాలని, లేదంటే అది ఆత్మవంచన యాత్రే అవుతుందని టీఆర్ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎవరికీ మంచిదికాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటే ఎవరూ సహించబోరని ఆయన చెప్పారు. వైషమ్యాలు పెంచడానికి ఎంఐఎం కుట్రలు: కవిత తెలంగాణపై ఇలాంటి కుట్రలే కొనసాగితే ఇప్పటిదాకా బతుకమ్మలు ఎత్తుకున్న చేతులతోనే బరిసెలను పడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల ఇంటిపై ఎంఐఎం పేరు రాసుకోవాలని అసదుద్దీన్ చెప్తున్నారని, రాజకీయ లబ్ధికోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా మోసపూరితంగా వ్యవహరించకుండా చంద్రబాబునాయుడు వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చినవారితో సామరస్యంగా ఉంటామని, పొట్టలు కొట్టేవారితోనే తమ పోరాట మని చెప్పారు. ప్రజల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టకుండా, శాంతియుత విభజనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో జేఏసీ నేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు, జల వనరులరంగం నిపుణులు ఆర్.విద్యాసాగర్రావు తదితరులు ప్రసంగించారు. సెప్టెంబరు 7న శాంతిర్యాలీ..? జేఏసీ నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి7 తేదీల మధ్యనే దీనిని నిర్వహించాలని మొదట భావించారు. అయితే సెప్టెంబరు 3, 4 తేదీల్లో ముల్కీ అమరుల సంస్మరణ దినంగా జరుపుకోనున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న ఉండటంతో శాంతి ర్యాలీని 7న నిర్వహించాలని జేఏసీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
నేటి నుంచి 108 ఉద్యోగుల దీక్షలు
సాక్షి, హైదరాబాద్: జీవీకే యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా గురువారం నుంచి స్థానిక ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు భూపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, జీవీకే యాజమాన్యం గానీ పట్టించుకోలేదని, అందుకే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వివరించారు. -
సర్కారీ హత్యలే : బీవీ రాఘవులు ఆగ్రహం
హైదరాబాద్, న్యూస్లైన్: అత్యవసర సేవల విభాగమైన 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిరోజూ హత్యలు చేస్తోందని, వైద్యసేవలు అందక ప్రజలు చనిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 రోజు లుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ చేపట్టారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకూ 108 ఉద్యోగులు భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ధర్నాచౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవులు ప్రసంగించారు. ప్రభుత్వ సొమ్ముతో 108ను నిర్వహిస్తుండగా సోకు మాత్రం జీవీకే యాజమాన్యానికి దక్కుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జీవీకే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం రూ.15 వేలు కూడా వేతనం లేకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాములు, భూపాల్, ఏవీ నాగేశ్వరరావు, 108 ఎంపాయీస్ నాయకులు అప్పిరెడ్డి, సూర్యనారాయణ, బలరాం, శ్రీనివాస్రెడ్డి, రమేష్, శంకర్ రెడ్డి, వీరస్వామి, కిరణ్, శివ పాల్గొన్నారు. 108 ఉద్యోగుల భారీ ర్యాలీ: ధర్నా సందర్భంగా 108 సిబ్బంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ 108 యాజమాన్యం 256 మందిని అకారణంగా డిస్మిస్ చేయటంతో పాటు 108 మందిని జైలుకు పంపిందన్నారు.