Intelligence
-
దగా యాష్..నిఘా ట్రాష్
సాక్షి, పెద్దపల్లి: భారతావనికి ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు పంచుతుంటే, విద్యుదుత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద (యాష్) రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. బూడిదతో ఎన్నిరకాలుగా దందా చేయవచ్చో, అన్నిరకాలుగా అక్రమమార్గాల్లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం కేంద్రంగా యాష్ పాండ్లో జరుగుతున్న అక్రమాలపై ఇంటలిజెన్స్ రిపోర్టు సీఎంవో కార్యాలయానికి చేరుకున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట పడలేదు. దీంతో బూడిద సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. చివరకు గోదావరిఖని పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేస్థాయికి చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నేషనల్ హైవేకి తరలింపు పేరుతో..ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద.. చెరువులో నిర్ణీత స్థాయికి మించితే కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఎనీ్టపీసీ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందులో బూడిదను ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ జాతీయ అవసరాల దృష్ట్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు.. రామగుండంలోని కుందనపల్లిలోని బూడిద చెరువు నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు లోడింగ్, రవాణా ఖర్చులు సైతం ఎన్టీపీసీయే భరిస్తుంది. రవాణా చార్జీలుగా టన్నుకు రూ.1,250 చొప్పున చెల్లిస్తుంది. అంటే ఒక లారీకి రూ.50 వేల వరకు బూడిద రవాణాకు చెల్లిస్తుంది. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్త దందాకు తెర తీశారు. నేషనల్ హైవే పేరిట తరలించే లారీల్లో సగం లారీలను నేషనల్ హైవేల నిర్మాణానికి చేరుస్తూ, మిగిలిన సగం లారీల బూడిదను బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.పాండ్ నుంచి లోడింగ్ అయి బయటకు వచ్చాక వాటికి నంబర్ ప్లేట్లు మార్చి జీపీఎస్ను మరో లారీలో పెట్టడం తదితర జిమ్మిక్కులతో నేషనల్ హైవేకు తరలించాల్సిన బూడిదను.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. దీంతో పక్కదారి పట్టించిన ఒక్కొక్క లారీకి ఎన్టీపీసీ నుంచి రవాణా చార్జీల పేరిట రూ.50 వేలు, ఇటుక బట్టీలకు లారీ బూడిదను రూ.50 వేలకు అమ్మి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బూడిదతో పాటు నిర్వహణ ఖర్చుల పేరిట అక్రమార్కులు డబుల్ ధమాకా పొందుతున్నారు. లోడింగ్ పేరుతో..పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తిలో భాగంగా వెలువడే నీటితో కలిసిన బూడిదను.. బూడిద చెరువులో నింపుతారు. ఆ బూడిదను డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు టన్నుకు రూ.130 చొప్పున 38 ఏజెన్సీలు 15 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద తరలించేలా టెండర్లు ఖరారు చేశారు. కాగా, ఎన్టీపీసీ ఈ టెండర్లను రద్దు చేసి రూ.1కే టన్ను ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. దీంతో 114 మంది ఈ టెండర్లను దక్కించుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారిలో ఐదుగురు.. రాజకీయ బలంతో లోడింగ్ పేరుతో దందాకు తెర తీశారు. లారీల సామర్థ్యాన్ని బట్టి రూ.4,600 నుంచి రూ.9,600 వరకు అక్రమంగా వసూలు చేస్తూ ఇటుకబట్టీలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు వెయ్యి వాహనాల్లో బూడిద తరలిస్తూ రూ.లక్షల్లో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో..బూడిద చెరువులోకి వచ్చి చేరే బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతో పాటు ఇతరత్రా నిర్మాణాలకు ఉచితంగా ఎన్టీపీసీ అందిస్తుంది. కానీ, ఈ బూడిద తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యంతో అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వెయ్యి లారీల చొప్పున సరఫరా అవుతుండటంతో.. అంతే మొత్తంలో బూడిద దందాలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా జిల్లాలో బూడిద పంచాయితీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కారి్మక సంఘం అధ్యక్షుడు కౌశిక్హరి తడిబట్టలతో గోదావరిఖని పోచమ్మ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
Sakshi Cartoon: ఉక్రెయిన్కు నిఘా సమాచారం నిలిపివేసిన అమెరికా
-
జాబిల్లిపై ల్యాండర్ల సందడి!
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది. ఈ ల్యాండర్ సృష్టికర్త, ఆపరేటర్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’. 1972లో అపోలో-17 మానవసహిత మిషన్ తర్వాత చంద్రుడిపై అమెరికా వ్యోమనౌక ఒకటి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కావడం ఇది రెండోసారి. అమెరికన్ ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ప్రయోగించిన ‘ఒడిస్సియస్’ ల్యాండర్ (ఐఎం-1) సైతం నిరుడు ఫిబ్రవరిలో జాబిల్లి దక్షిణ ధృవంపై ఓ బిలంలో దిగింది. 1972లో చివరిసారిగా చంద్రుడిపై ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు దిగి నడయాడిన 50 ఏళ్ల అనంతరం ‘ఒడిస్సియస్’ తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఘనత సాధించింది. అయితే దిగుతూనే ఓ కాలు విరిగి ల్యాండర్ ఒక పక్కకు ఒరిగినప్పటికీ దాన్ని కూడా సాఫ్ట్ ల్యాండింగ్ గానే శాస్త్రవేత్తలు పరిగణించారు. మనకు కనిపించే చంద్రుడి (ఇవతలి వైపు) ఈశాన్య ప్రాంతంలో ఘనీభవించిన లావాతో నిండిన ఓ ప్రాచీన, సువిశాల బిలం ‘మేర్ క్రిసియం’ ఉపరితలంపై నాలుగు కాళ్లతో ‘బ్లూ ఘోఃస్ట్’ ల్యాండర్ ఆదివారం దిగింది. కారు సైజులో ఉన్న ఈ ల్యాండర్ నిర్మాణానికి ‘నాసా’ నిధులు అందించింది. దీని జీవిత కాలం రెండు వారాలు. ఈ వ్యవధిలో అది చంద్రుడి ఉపరితలంపై నాసా నిర్దేశించిన సుమారు పది శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపడుతుంది. ఇళ్లలో మనం వాడే వాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా. అలాంటి ‘వాక్యూమ్’తో చంద్రధూళిని లోపలికి పీల్చుకుని ల్యాండర్ విశ్లేషిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పది అడుగుల లోతు వరకు డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ‘ఒడిస్సియస్’, ‘బ్లూ ఘోస్ట్’ రెండూ ప్రైవేటు సంస్థల ల్యాండర్లు కావడం మరో విశేషం. చంద్రబిలం చీకట్లోకి దూకనున్న ‘గ్రేస్’ హోపర్!‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ గత నెల 26న ప్రయోగించిన మరో ల్యాండర్ ‘అథీనా’ (ఐఎం-2) కూడా ఈ నెల 6న చంద్రుడి దక్షిణ ధృవం చెంత దిగబోతోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ రాకెట్ ఫాల్కన్-9తో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘అథీనా’తోపాటే ‘లూనార్ ట్రైల్ బ్లేజర్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ‘లాక్ హీద్ మార్టిన్’ సంస్థ తయారుచేసిన 200 కిలోల ఈ బుల్లి ఉపగ్రహం చంద్రుడికి దగ్గరగా ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తూ నీటి వనరుల మ్యాపింగ్ పనిలో నిమగ్నమవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ‘మాన్స్ మౌటన్’ వద్ద దిగనున్న 15 అడుగుల ల్యాండర్ ‘అథీనా’లో... మినీ రోవర్ ‘మాప్’ (మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్ఫామ్), ‘గ్రేస్’ హోపర్ ఉన్నాయి. కంప్యూటర్ సైంటిస్టు గ్రేస్ హోపర్ పేరు దానికి పెట్టారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన పరిసరాల చుట్టూతా ఓ మైలు వ్యాసార్ధం పరిధిలో ‘గ్రేస్’… హైడ్రజీన్ ఇంధనం నింపిన తన థ్రస్టర్స్ సాయంతో గెంతుతూ అన్వేషిస్తుంది. ల్యాండర్ దిగే ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో... ఎన్నడూ సూర్యకాంతి సోకని, శాశ్వతంగా చీకటిగా ఉండే 65 అడుగుల లోతైన ‘హెచ్ బిలం’లోకి ‘గ్రేస్’ లంఘించబోతోంది. గడ్డ కట్టిన నీటి కోసం బిలంలోని నేల ప్రాంతాన్ని శోధించడం దాని ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ పనిని చక్రాలతో కదిలే రోవర్ చేయలేదు! ‘గ్రేస్’ రోబో మూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది. పరిసరాలు, పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకుని, కార్యోన్ముఖం చేయగల (సిచ్యువేషనల్ అవేర్నెస్) కెమెరా, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), నక్షత్రాల స్థానాన్ని గుర్తిస్తూ ముందుకు కదలడానికి ఉపయోగపగే ‘స్టార్ ట్రాకర్’ సాయంతో ‘గ్రేస్’ ఒక చోట నుంచి మరో చోటికి గెంతుతుంది. మొదట 20, తర్వాత 50, ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ మూడు గెంతుల్లో బిలం చేరుకుని దాని నేలపై వాలుతుంది. గడ్డకట్టిన నీటి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంది. ముప్పావు గంట సేపు అక్కడ ఉండి, ఫొటోలు తీశాక మళ్లీ ‘గ్రేస్’ ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై హోపర్ ప్రయోగం ఇదే ప్రథమం. రోవర్లు చేయలేని పనులను సుసాధ్యం చేసేందుకు తలపెట్టిన సాంకేతిక ప్రదర్శన ఇది. చైనా వచ్చే ఏడాది ‘చాంగే-7 మిషన్’తో చంద్రుడిపైకి ఇలాంటి హోపర్ పంపనుంది. ‘పెర్సెవరెన్స్’ రోవర్ వెంట అరుణగ్రహం అంగారకుడిపైకి నాసా పంపిన ‘ఇంజెన్యుటీ’ హెలికాప్టర్ ఆ గ్రహ వాతావరణంలో ఎగురుతూ పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. చందమామపై ‘అథీనా’ ల్యాండర్ పనిచేసేది పది రోజులే. ‘నాసా’ రూపొందించిన పది శాస్త్రీయ పరికరాలను అందులో అమర్చారు. వీటిలో ఎక్కువ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో గడ్డకట్టిన నీరు, ఇతర వనరుల జాడను కనుగొనడానికి ఉద్దేశించినవి. ఈ అన్వేషణలో నీటి ఆధారాలేవైనా బయల్పడితే వాటిని చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే మానవ ఆవాసాలకు వినియోగించుకోవాలనేది నాసా ఆలోచన. 14న చంద్రగ్రహణానికి ప్రత్యక్ష సాక్షులు!పరిస్థితులన్నీ సవ్యంగా సాగితే... ఈ నెల 14న చంద్రగ్రహణానికి ‘బ్లూ ఘోస్ట్’, ‘అథీనా’ ల్యాండర్లు ప్రత్యక్ష సాక్షులవుతాయి. గ్రహణ వేళలో భూమి ఛాయ చంద్రుడిని క్రమంగా కప్పివేయడాన్ని ల్యాండర్లు రెండూ వీక్షిస్తాయి. ఆ తర్వాత మరో రెండు రోజులకు చంద్రుడిపై ల్యాండర్లు దిగిన ప్రాంతంలో ‘14 రోజుల రాత్రి కాలం’ మొదలై క్రమంగా చీకట్లు ముసురుకుంటాయి. అప్పుడిక ల్యాండర్లు పనిచేయడానికి సౌరశక్తి ఉండదు. పైగా అక్కడ అతి శీతల వాతావరణం నెలకొంటుంది. అంటే... ల్యాండర్లు రెండూ డెడ్ అవుతాయి. 2030 కల్లా చంద్రుడిపైకి అమెరికన్లు!తమ ‘ఆర్టెమిస్’ కార్యక్రమంతో ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా యోచిస్తోంది. వాస్తవానికి ‘ఐఎం-2 మిషన్’ను నాసా రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ‘బ్లూ ఘోస్ట్’, ఐఎం-1, ఐఎం-2... ఇవన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్పీఎస్)లో భాగం. 2028 వరకు ఇలాంటి మిషన్స్ చేపట్టడానికి నాసా రమారమి రూ.25 వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ శాస్త్ర సాంకేతికతను వృద్ధి చేస్తోంది. (Credits: Sky News, NASASpaceflight.com, Space Intelligence, The Hindu, India Today, Space.com, Gizmodo, Scientific American, CNN)-జమ్ముల శ్రీకాంత్ -
నాకు స్ఫూర్తి మా నానమ్మ
ఎందుకంటే.. ‘ఒక పొజిషన్ అచీవ్ చేయమనెప్పుడూ చెప్పలేదు మా నానమ్మ. అయితే ఒక పొజిషన్లో ఉంటే చేయగలమో చెప్పింది. మన పనులతో ఎంతమందిని ప్రభావితం చేయగలమో చెప్పింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ ఎప్పుడూ మమ్మల్ని అబ్బాయిలకు డిఫరెంట్ అని పెంచలేదు. అందుకే మేం వాళ్లతో ఈక్వల్ కాదనే భావన మాకెప్పుడూ రాలేదు. అమ్మ కానీ, నానమ్మ కానీ మాకు ఎక్కడ తగ్గాలో నేర్పారు. అది మహిళలకున్న సహజగుణమని మేం గ్రహించేలా చేశారు. నిజానికి మనకు ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. కానీ ఎక్కడ తగ్గాలో తెలియదు. అది తెలుసుకోవాలి. సహనం మనకున్న సహజమైన లక్షణం. దాన్నెందుకు కోల్పోవాలి మనం! అది మనకున్న ఆరా! దాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ నేను మా నానమ్మ, అమ్మ ద్వారే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో నాకు వాళ్లే స్ఫూర్తి!’ -
ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లు..పాక్ ఇంటెలిజెన్స్ వార్నింగ్
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్లకు సంబంధించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సమాచారమందించినట్లు తెలుస్తోంది. ట్రోఫీలో మ్యాచ్లకు హాజరయ్యే విదేశీయులను ముఖ్యంగా చైనా,అరబ్ దేశస్తులను ‘ఐఎస్కేపీ’ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసే ప్రమాదముందని హెచ్చరించింది. చైనా,అరబ్ దేశస్తులు ఎక్కువగా సందర్శించే హోటళ్లు, ఇతర ప్రదేశాలపై ఐఎస్కేపీ ఉగ్రవాదులు నిఘా ఉంచినట్లు తెలిపింది. కిడ్నాప్ చేసిన వారిని ఉంచేందుకు మ్యాచ్లు జరుగుతున్న ఆయా నగరాల శివార్లలో ఐఎస్కేపీ ప్రత్యేక గదులు అద్దెకు తీసుకున్నట్లు సమాచారమిచ్చింది. అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించే విషయంలో పాకిస్తాన్ సామర్థ్యాన్ని తాజా ఇంటెలిజెన్స్ నివేదిక మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ఐఎస్కేపీ దాడులపై ఒకే తరహా సమాచారం అందించించడం గమనార్హం. -
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
మన్యంలోకి మళ్లీ మావోలు!
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. 2022లో ఏవోబీని విడిచిపెట్టి.. రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్ కార్యకలాపాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్ట్ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లాలని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాక్ టు ఏవోబీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్లు ఎన్కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్గఢ్లోనే హతమవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్లను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్లు, మిలీషియా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్ల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్ నేత ట్రంప్కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్కు కీలక పదవి దక్కింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్ పొగిడారు.ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి.. అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డ్లో చేరారు. 2004లో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్గా సేవలందించారు. మేజర్గా పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్గా పదోన్నతి పొందారు. 31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్ జిల్లా నుంచి డెమొక్రటిక్ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్లో ట్రంప్ అనుకూల పోస్ట్లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్లో రిపబ్లికన్ పారీ్టలో చేరారు. టీనేజీలో హిందువుగా మారి.. తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్ సెనేటర్గా గతంలో పనిచేశారు.18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్తో కలిసి తులసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్కు తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి. -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
బంగ్లా అల్లర్లు: భారత్కు ఉగ్ర ముప్పు!
ఢిల్లీ: రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షేక్ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు. త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కు ఎంపికయ్యి నీతి ఆయోగ్లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్పూర్కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్తో జార్ఖండ్లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
సీఎం జగన్పై దాడి.. అహంకారపూరిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్మెంట్దే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్కు, సీఎస్కు బాధ్యత లేదా’ అని అన్నారు. ‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి నామీద పెట్టాలని ప్రయత్నించావు. ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నారు’ అంటూ సీఎం జగన్పై దాడిని అవహేళన చేస్తూ మాట్లాడారు. సీఎం జగన్పై హత్యాయత్నాన్ని అవహేళనగా మాట్లాడటంపై ప్రజలు బాబు తీరుని అసహ్యించుకున్నారు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కినా ఎవరి జీవితాలూ మారలేదని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ బాబు అబద్ధాలు చెప్పేశారు. వలంటీర్లతో నేరాలు, ఘోరాలు చేయించారని అన్నారు. ఈసారి ఓటు కూటమికి వేయాలని, తాను మళ్లీ సీఎం అవుతానని బాబు అనడంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. పవన్ సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తి అంటూ పరోక్షంగా రాజకీయాల్లో అనుభవం లేదని చెప్పడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్పందించని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామా అని బాబు అడిగినా ప్రజలు స్పందించలేదు. తనపైనా చాలాసార్లు రాళ్ల దాడి జరిగిందని, ఇప్పుడు చేసిన రాళ్ల దాడిపై చప్పట్లు కొట్టి నిరసన తెలపండని చంద్రబాబు అడిగినా.. ఒక్కరూ స్పందించకపోవడంతో టాపిక్ మార్చేశారు. బాబు బస్సుపైకి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థితో పాటు జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించారు. వారిని కూడా సెక్యూరిటీ వెనుక నిలబెట్టారు. మిగిలిన వారెవ్వరికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీజేపీ, జనసేన నేతల్లో అసహనం వ్యక్తమైంది. జిల్లాలో మూడు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. వారిని గెలిపించమని చెప్పకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా రెండు సభలకు జనం అంతంతమాత్రంగానే వచ్చారు. ఈ సభలకు చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా రావడంతో వచ్చిన కొద్దిమంది జనం, కార్యకర్తలు బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. శ్రేణుల ఎదుటే బండారును అవమానించిన బాబు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల ఎదుటే తీవ్రంగా అవమానించారు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారు.. ఆ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం చంద్రబాబుని కలిశారు. టికెట్ ఇవ్వకుండా అవమానించడం సరికాదని చంద్రబాబుతో అనడంతో.. ఒక్కసారిగా బాబు రెచ్చిపోయారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా? టికెట్ లేదని చెప్పిన తర్వాత కూడా వేషాలేస్తున్నావ్. మర్యాదగా చెప్పినట్లు నడుచుకో. జనసేనకు సహకరించు’ అంటూ దాదాపు పది నిమిషాలు బండారుపై చిందులేశారు. ఇంత అవమానించి.. చివరకు బండారుని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. చంద్రబాబుకి నమస్కారం చెప్పి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణమూర్తి.. కార్యకర్తలు, అనుచరులతో కూడా మాట్లాడలేదు. మాడుగుల టికెట్ అయినా ఇవ్వాలని బండారు కోరారని, అందుకు ఒప్పుకోని చంద్రబాబు.. సీనియర్ నేతకు కనీస మర్యాద ఇవ్వకుండా ఘోరంగా అవమానించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గులకరాయికే ఇంత ఇదా?: పవన్ కళ్యాణ్ తెనాలి: సీఎం జగన్కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు అల్లరి చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్పై ఎవరో రాయి విసిరారట. అదేమిటోగానీ ఎన్నికలు అనేసరికి ఏదొకటి జరుగుతుంది. గాయాలవటమో... చంపేయటమో... చంపటమో జరుగుతోంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది? ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? గత ఎన్నికల్లో విశాఖలో కోడికత్తితో గాయం చేశారు.. వైఎస్ వివేకాను ఏ కత్తితో పొడిచారో తెలియదు...’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి బహిరంగ సభలో వారాహి నుంచి పవన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల అమర్నాథ్ను చెరుకుతోటలో పెట్రోలు పోసి అడ్డంగా తగలేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? 35 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? గతంలో చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపించినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? మీకు గులకరాయి తగిలితేనే ఇంత ఇదా! అంటూ విమర్శలు చేశారు. సానుభూతి తెలియజేస్తూ స్టేట్మెంట్ ఇవ్వాలని పార్టీ నాయకులు తనకు సూచించారన్నారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఇస్తానని ప్రశ్నించానన్నారు. ‘ఏమో...అతనే కొట్టేసుకున్నాడేమో? ఎవరికి తెలుసు? కరెంటు కూడా పోయిందట! నాన్న–పులి కథలా ఒకసారి జరిగితే అనుకోవచ్చు. ప్రతిసారీ జరుగుతుంటే అబద్ధమంటున్నాం. సెంటిమెంటల్ డ్రామాలు ఆపండి... నాటకాలు భరించలేకున్నా. అందరిపైనా దాడిచేసే వ్యక్తిపై ఎవరైనా దాడిచేస్తారా? అయినా దాడిచేస్తే ఎంతసేపు పట్టుకోవటానికి?’ అని పేర్కొన్నారు. -
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్ఫేక్ కంటెంట్పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
భారత్.. మూడో అతిపెద్ద ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది. యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం. సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్యస్థానంగా మార్చుతోంది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్ ఈ–కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తుంది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్కు ఆకర్షిస్తాయి. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు. ఈ–కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసే యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయి. భారత్లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుంది. భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. -
'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'
రియాద్: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. హమాస్ తీరు శోచనీయం ఇస్లామిక్ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్ను విమర్శించారు. ఇజ్రాయెల్లాగే హమాస్ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్ తీరును ఫైసల్ తప్పుబట్టారు. The legendary chief of Saudi Intelligence Turki -Al- Faisal could not have said it better. Worth a listen 👇🏾 pic.twitter.com/0YjQAd158I — Manish Tewari (@ManishTewari) October 19, 2023 ఇజ్రాయెల్ రక్తపాతం.. పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రాశ్చాత్య మీడియా తీరు సరికాదు.. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
హమాస్ దాడి.. పూర్తిగా ఇజ్రాయెల్ వైఫల్యమే’
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు. చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు. కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు డిప్యూటీ కమాండర్గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్కు డైరెక్టర్గా ఉన్నారు. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఖాకీబాస్ల సమావేశం? మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రభాకర్ రావు, అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్జోన్ ఐజీ చంద్రశేఖర్లతోపా టు సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్.. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్జీ (డి్రస్టిక్ట్ రిజర్వ్డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. -
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్ఝున్వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్గా, ఎంటర్ప్రెన్యూర్గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్ఝున్వాలా. -
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్టాపిక్గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
పుతిన్నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ నిఘా వ్యవస్థ గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దేశ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేసే వాళ్ల కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్నే ఎక్కువగా నమ్ముతానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్లో.. తన నమ్మకాలు మారయంటూ..సీఐఏ, నాసా, ఎఫ్బీఐ వంటి సైబర్ సెక్యూరిటీ తోసహా గూఢచార సంస్థలను తక్కువ చేస్తూ రాసుకొచ్చారు. పైగా ఇలాంటి స్థితిలో తాను రష్యా అధ్యక్షుడినే ఎక్కువగా నమ్ముతానంటూ పోస్ట్ పెట్టారు. 2018లో అధ్యక్షుడిగా వైట్హౌస్లో ఉండగా కూడా పుతిన్కి మద్దతుగా మాట్లాడి.. పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలతో యూఎస్లోని రిపబ్లికన్లు, డెమోక్రటిక్ సభ్యులు విస్మయానికి గురయ్యారు. యూఎస్ ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసే వాళ్ల గురించి, వారి పనితనం గురించి తక్కువ చేసి మాట్లాడటాన్ని మిగతా నాయకులంతా తీవ్రంగా ఖండించారు. పైగా రష్యా అధ్యకుడి గురించి ప్రస్తావించడం వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇదిలా ఉంటే.. 2016 యూఎస్ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు ప్రమేయం ఉన్నట్లు ఇంటిలిజెన్సీ నిర్ధారించడాన్ని కూడా ట్రంప్ అంగీకరించడంతో విమర్శల పాలయ్యాడు. దీని ఫలితంగా రష్యా ప్రమేయానికి సంబంధించి.. యూఎస్ న్యాయశాఖకు చెందిన ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో అతని అంతర్గత సభ్యులను సంత్సరాల తరబడి విచారించింది. ఇది ఒక రకంగా ట్రంప్ రాజకీయ జీవితాన్ని నష్టపరిచేందుకు దారితీసింది. చివరికి అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడమే గాక సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇటీవలే ఆయన తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించేవాడిని అంటే పోస్ట్ పెట్టి వార్తలో నిలిచారు. అది మరువక మునుపై మరోసారి అనూహ్యమైన రీతీలో వ్యాఖ్యలు చేసి అపఖ్యాతిని కొనితెచ్చుకుంటున్నారు ట్రంప్. (చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!) -
Hyderabad:‘ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది. ఇలాంటి వాటితో జీహెచ్ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఆన్లైన సంబంధిత ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ లోపాలకు చెక్.. ► ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్ అసెస్మెంట్లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు. ► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్మెంట్ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్సెక్షన్ సిబ్బంది ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం. ► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని, వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు. ► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. ► ఈ సిస్టమ్ డెవలప్ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది. ► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు. ► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్బోర్డులు విని యోగించి భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు. భవన వినియోగం తెలుస్తుంది.. ఖైరతాబాద్లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది. ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: కరోనా కేసుల్లేవ్ -
ఆక్టోపస్కు.. మనకు.. ముత్తాత ఒకరే.. మనుషుల్లా కలలు కూడా కంటాయట!
భూమ్మీద ప్రతి జీవికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి ఎక్కువ, కొన్నింటికి తక్కువ. పెద్ద జంతువులు ఏమోగానీ కొన్నిరకాల సాధారణ జీవులు వాటి స్థాయికి మించి తెలివి చూపుతుంటాయి. ఇందులో ఆక్టోపస్లు ప్రత్యేకం. అవి కొన్నిసార్లు మనుషుల్లాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, ఆక్టోపస్లకు కామన్గా ఉన్న పాయింటే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆ తెలివి ఎక్కడిదనే పరిశోధనతో... సాధారణంగా జలచరాలతో పోలిస్తే జంతువులకు జ్ఞానం ఎక్కువ. వాటి మెదడు క్లిష్టమైన నిర్మాణంతో, ఎక్కువ సామర్థ్యంతో ఉండటమే దీనికి కారణం. కానీ జలచరాలే అయినా ఆక్టోపస్లు చిత్రంగా తెలివిని ప్రదర్శిస్తాయి. మనుషులు, జంతువులను గుర్తించగలడం, అందులో నచ్చినవారిని ఇష్టపడటం, డబ్బాల మూతలను తిప్పితీయడం, కర్రపుల్లలు, ఇతర వస్తువులను పరికరాల్లా వాడగలగడం, గుర్తు పెట్టుకోగలగడం వంటివి చేస్తాయి. వాటికి ఉన్న ఎనిమిది టెంటకిల్స్ను మనం చేతులను వినియోగించినట్టుగా.. సున్నితంగా నత్తగుల్లలను తెరవడానికి, శత్రువులపై వేగంగా దాడి చేయడానికి వాడగలవు. పూర్తిస్థాయిలో ఎదిగిన మెదడు, విస్తృతమైన నాడీ వ్యవస్థనే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఒక జలచరం ఇలా ఎదగడానికి కారణమేమిటన్న అన్వేషణలో ఒకనాటి మూలాన్ని గుర్తించారు. 51.8 కోట్ల ఏళ్ల కిందట.. భూమ్మీద జీవం ఆవిర్భవించిన తొలినాళ్లు అవి. సూక్ష్మజీవుల స్థాయిలో మొదలైన జీవం సుదీర్ఘకాలం ప్రాథమిక స్థాయిలోనే.. సముద్రాల్లో వివిధ రకాల పురుగులు, ఇతర రూపాల్లో ఉండేది. అలాంటి ఓ పురుగులాంటి జీవి పేరు ‘ఫసివెర్మిస్ యున్ననికస్’. సముద్రం అడుగున నేలకు అతుక్కుని జీవించేది. ఇది సుమారు 51.8 కోట్ల ఏళ్ల కింద పరిణామ క్రమంలో.. రెండు వేర్వేరు జీవులుగా మారిపోయింది. ఆ రెండింటిలో ఒకటి మనుషులకు ముత్తాత అయితే.. మరొకటి ఆక్టోపస్లకు మూలం అని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. నాడీ వ్యవస్థలోని మైక్రో ఆర్ఎన్ఏలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ తెలివి నుంచే.. జీవుల జన్యువుల పనితీరును నియంత్రించే మూల పదార్థాలే మైక్రో ఆర్ఎన్ఏలు. ఇందులో కొన్ని మైక్రో ఆర్ఎన్ఏలు మెదడు నిర్మాణం తీరు, సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ మైక్రో ఆర్ఎన్ఏలు సాధారణంగా జలచరాల్లో తక్కువగా, నేలపై తిరుగాడే జంతువుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే జలచరాల్లో చాలా వరకు వివిధ రకాల జీవుల నుంచి అభివృద్ధి చెందగా.. మనుషులు, ఆక్టోపస్లు రెండు జాతులు కూడా ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచే రూపొందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ జీవులు అప్పట్లోనే కాస్త తెలివిని ప్రదర్శించేవని.. శరీరంలో అవసరం లేని భాగాలను స్వయంగా వదులుకుంటూ పరిణామం చెందాయని తేల్చారు. నాటి జీవుల్లో మైక్రో ఆర్ఎన్ఏలే ఈ సామర్థ్యానికి కారణమని అంటున్నారు. మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకొని.. ఈ అంశంపై పరిశోధన చేసిన జర్మనీలోని బెర్లిన్ మాక్స్ డెల్బ్రక్ సెంటర్ శాస్త్రవేత్త నికోలస్ రజేవ్స్కీ తాము గుర్తించిన వివరాలను వెల్లడించారు. ఆక్టోపస్ల మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి.. వాటిలో కొత్తగా 42 మైక్రోఆర్ఎన్ఏ రకాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తంగా వీటిలో 90 మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నట్టు వివరించారు. అదే ఆక్టోపస్లకు సమీప జీవులైన ఆయ్స్టర్లు, స్క్విడ్లు వంటివాటిలో ఐదే మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నాయని తెలిపారు. ఒకనాటి ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచి విడిపోతూ పరిణామం చెందినప్పుడు ఆక్టోపస్లు మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకోగలిగాయని.. అందుకే మెదడు ఎదిగి, జ్ఞానాన్ని చూపగలుగుతున్నాయని వివరించారు. కొసమెరుపు ఏమిటంటే.. ఆక్టోపస్లు మనుషుల్లా కలలు కూడా కంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి నిద్రపోయినప్పుడు కలల వల్లే వాటి రంగు, చర్మంపై ఆకారాలు మారిపోతూ ఉంటాయని అంటున్నారు. -
ల్యాబ్లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్లో పెంచుతోంది. డిష్బ్రెయిన్గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఎంపీ రఘురామ కుమారుడిపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కాని స్టేబుల్పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్లు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 12న ఇదే పిటిషన్ విచారించి కొట్టివేశామని, ఆర్డర్ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
ఇంటర్ బోర్డుపై ఇంటెలిజెన్స్ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, పరీక్ష పేపర్లలో వరుస తప్పిదాలు, ప్రైవేటు కాలేజీలకు ఉన్నతాధికారులు కొమ్ముగాయడం, బోర్డులో సంబంధం లేని వ్యక్తుల జోక్యంపై కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితిపై నిఘా వర్గాల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్టు సమాచారం. మొత్తం ఇంటర్ బోర్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ మంత్రి దృష్టికీ వచ్చాయి. వీటికితోడు ఈసారి ఇంటర్ ప్రశ్నపత్రాల్లో వరుసగా తప్పులు దొర్లాయి. హిందీభాషా ప్రశ్నపత్రం ముద్రించనే లేదు. ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాదం చేసే వ్యక్తులే లేరని బోర్డు చెప్పడంపైనా విమర్శలొచ్చాయి. ఇక పరీక్షల విభాగంలో కీలకమైన వ్యక్తుల నియామకం అడ్డదారిలో జరిగినట్టు కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆఖరుకు హాల్ టికెట్లు కూడా ముందుగా కాలేజీలకు ఇచ్చి, ఆ తర్వాతే విద్యార్థి లాగిన్లో ఓపెన్ అయ్యేలా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం ఇంటెలిజెన్స్ను కోరినట్టు తెలిసింది. -
ఆ పేలుడు ఘటనలో క్లూ... ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ
Pizza order gave Firs Clue: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పిజ్జా ఆర్డరే వాళ్లకు అసలైన క్లూ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ కార్యాలయం పై దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంటెలిజెన్స్ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్టు తెలిసింది. అతను గేటు నుంచి బయటకు రాగనే కార్యాలయానికి సమీపంలో ఆగి ఉన్న తెల్లటి మారుతి స్విఫ్ట్ కారును ఆ అధికారి గమనించాడు. అతను పిజ్జాతో లోపలికి వెళ్లిన మరు క్షణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఈ కారుపై దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్లను, సుమారు 7 వేల మొబైల్ డంప్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ బోరర్ (ఐబీ) సమీపంలో డ్రోన్తో చిన్న సైజు ఆర్పీజీని పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అతను గతంలో చేసిన దాడులన్ని సరిహద్దు అవతల నుంచే ప్లాన్ చేసేవాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ డ్రోన్లు ఒక పెద్ద సవాలని, వాటిని ఆపడానికి ఒక పద్ధతి ఉంటేగానీ ఇలాంటి ఘటనలను ఆపడం అసాధ్యం అని చెప్పారు. పైగా ఈ దాడి అధికారులను ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించేలా చేసింది. ఇటీవల కాలంలో పంజాబ్లో ఇలాంటి ఘటను మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవడం: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు) -
పంజాబ్ ఇంటెలిజెన్స్హెడ్ ఆఫీసుపై రాకెట్ దాడి
చండీగఢ్: పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్–ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్పీజీ) విసిరినట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి కిటికీలు, ఫర్నీచరు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కాదని అన్నారు. దీంతో సీనియర్ పోలీసు సుపరిడెంట్ ఆఫీసర్తో కూడిన బృందం కార్యాలయం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇక దీనికి సంభంధించి మొహాలీ పోలీసులు మాట్లాడుతూ.. సెక్టార్ 77, SAS నగర్లో ఉన్న పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్లో సోమవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో చిన్నపాటి పేలుడు సంభవించింది. అయితే ఎటువంటి పాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం సీనియర్ అధికారులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను సైతం పిలిపించారని తెలిపారు. అయితే ఈ దాడి ఉగ్రవాదులు చేశారా లేక కార్యాలయంలోని పేలుడు పదార్థాల వలన జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పంజాబ్ పోలీసులు టార్న్ తరణ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన తాజా ఘటనతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోలీసులను పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. -
ఇప్పుడే ‘ఎన్నికల’ బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పోలీసుశాఖలో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా అధికారుల ప్రొఫైల్స్ను ఇంటెలిజెన్స్ విభాగం వడపోస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇటు నేతలకు ఇబ్బందిలేకుండా, అటు ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ వేటు పడకుండా ఉండేలా అధికారుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండేళ్లపాటు వారిని కదిపే అవసరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా ముఖ్యమైన అధికారి. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతల కదలికలు వంటి విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో వారే కీలకం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ చీఫ్ను మా ర్చాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధికారిస్థానంలో రాజధానిలోని కీలక కమిషనరేట్కు బా«ధ్యులుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ కమిషనర్ల మార్పు కూడా.. కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట సహా కీలకచోట్ల పోలీస్ కమిషనర్లను మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. పదోన్నతులు పొందడం, లాంగ్ స్టాండింగ్, వివాదాస్పద అంశాలు వంటి కారణాల రీత్యా సంబంధిత అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, గద్వాల ఎస్పీలతోపాటు వరం గల్, పెద్దపల్లిలోని డీసీపీలను మార్చనున్నట్టు తెలిసింది. ఆయా కమిషనరేట్లలో శాంతిభద్రతల విభాగంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులను మార్చే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అటాచ్డ్ అధికారులకు జూన్లో.. రాష్ట్రంలో 20 మందికిపైగా పదోన్నతి పొంది వెయిటింగ్, అటాచ్మెంట్, లుక్ ఆఫ్టర్ ఆదేశాలతో ఉన్న ఐపీఎస్ అధికారులకు జూన్ తొలి వారంలో పోస్టిం గ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జోన్లు, అదనపు సీపీలు, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీ, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖ తదతర విభాగాల అధికారులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇన్స్పెక్టర్లకూ సిఫార్సులు! జిల్లాలతోపాటు కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్హెచ్వోలు (ఇన్స్పెక్టర్లు), సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ లు సైతం ఎన్నికలే లక్ష్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లను ఇప్పటినుంచే ఎంచుకుని పోస్టింగ్ ఇప్పించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలా సిఫార్సుల కోసం ఇతర జిల్లా లేదా ఇతర రేంజ్ పరిధిలో పనిచేసిన వారిని ఎంచుకోవాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఎలక్షన్ కమిషన్ కొందరు అధికారులను బదిలీ చేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. స్థానికత, వివాదాలు, పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేయాలని సూచనలు వచ్చినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నాటికి కసరత్తు పూర్తిచేసి జూన్లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత రాష్ట్రంలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు భారీగా ఉంటాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలలుగా బదిలీ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న డీఎస్పీ/ఏసీపీలకు జూన్ మొదటివారంలో మోక్షం కలుగుతుందని తెలిసింది. డీఎస్పీ పోస్టింగ్ విష యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీస్శాఖలో చర్చ జరుగు తోంది. ఆయా జిల్లాల్లో ఎక్కువకాలం పనిచేయనివారు, వివాదాలు లేని అధికారులకే సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సులపై ఇంటెలిజెన్స్లో అధికారులు పరిశీలన చేస్తారని, సంబంధిత అధికారి పూర్తి ప్రొఫైల్ను పరిశీలించాకే పోస్టింగ్కు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. -
భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత!
లండన్: తమ అనుకూల నేతను ఉక్రెయిన్ అధినేతగా చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మాజీ ఎంపీ యెవెహెన్ మురయేవ్ను రష్యా ఎంచుకొని ప్రోత్సహిస్తోందని యూకే విదేశీ వ్యవహరాలు, కామన్వెల్త్ కార్యాలయం (ఎఫ్సీడీఓ) శనివారం ప్రకటించింది. ఈ మేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఇలాంటి ప్రయత్నాలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా కుట్రలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా వెనక్కు తగ్గాలని, ఇలాంటి కుట్రలు మానుకొని ప్రజాస్వామ్య మార్గం అవలంబించాలని కోరారు. ఉక్రెయిన్పై రష్యా ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా తాము, తమ మిత్ర దేశాలు ఊరుకోమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసకునే ఉద్దేశంతో రష్యా సరిహద్దులోకి లక్షమంది సైనికులను తరలించిందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై యుద్ధం చేసి ఆక్రమించుకునే బదులు, తమకు అనుకూల నేత చేతిలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఉంటే మంచిదని రష్యా భావిస్తోన్నట్లు ఎఫ్సీడీఓ తెలిపింది. యెవెహెన్ మాత్రమే కాకుండా పలువురు ఉక్రెయిన్ రాజకీయనేతలకు రష్యాతో సంబంధాలున్నట్లు తెలిపింది. 2015 నుంచి ఉక్రెయిన్లో బ్రిటన్ సేనలు సాయంగా ఉంటున్నాయి. బ్రిటన్ ఆరోపణలను రష్యా ఖండించింది. బ్రిటన్ ఆధ్వర్యంలో నాటో కూటమి సాగించే తప్పుడు ప్రచారంలో ఇదంతా భాగమని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. (చదవండి: ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని) -
ఆ 3 జిల్లాలపై ఇంటెలిజెన్స్ నజర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో వీటిపై ఆసక్తి నెలకొంది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. కొన్ని జిల్లాల్లో రెండేసి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగనున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నట్లు తెలిసింది. ఆరుగురి వెనుక అధికారపార్టీ నేతలు! రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొద్ది రోజులుగా హాట్ టాపిగ్గా మారింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జిల్లాలో స్థానిక సంస్థల కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టీ ఆ జిల్లాపైనే ఉంది. దీనికి తగ్గట్టుగా స్వతంత్ర అభ్య ర్థులు 9 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా మిగిలిన అభ్యర్థులు అధికార పార్టీకి చెందినవారేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి. పైగా ఒక్కో అభ్యర్థికి 10 మంది ప్రతిపాదకులు సంతకాలు చేయడం గమనార్హమని నిఘా వర్గాల అధికారులు తెలిపారు. 9 మంది అభ్యర్థులను 90 మంది ప్రతిపాదించడం అంటే క్యాంపు రాజకీయాలకు తెరదీసినట్టేనని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. కాంగ్రెస్గా భావిస్తున్నవారిని మినహాయిస్తే, మిగతా ఆరుగురి వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీసింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతలే ఇలా స్వతంత్రుల ద్వారా నామినేషన్లు వేసి, అవసరమైన పక్షంలో తమ సత్తా చూపించాలని భావిస్తున్నట్టు తెలిపింది. క్యాంపు రాజకీయాలపై కన్ను కరీంనగర్లో విపక్ష నేతలంతా ఒక్కటైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అధికార పార్టీ అసంతృప్త నేతలను సైతం తమతో కలుపుకొని క్యాంపు రాజకీయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గుర్తించాయి. 1,326 ఓట్లు ఉన్న కరీంనగర్ లో 350 నుంచి 400 మందిని ఓ కీలక నేత ద్వారా గోవాలోని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్నగర్, రంగారెడ్డిపై... గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి.. 2007లో మహబూబ్నగర్ జిల్లా నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ జిల్లాపై ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డితో పాటు అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోనూ అధికార పార్టీకి చెందిన అసంతృప్తులే నామినేషన్లు వేస్తారని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించి, తర్వాత అధికార పార్టీలో చేరిన వారిని స్వతంత్రులుగా బరిలోకి దించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఇంటె లిజెన్స్ గుర్తించింది. అయితే ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. -
రంగంలోకి ఇంటెలిజెన్స్ .. హుజూరాబాద్ ప్రజలకు ప్రశ్నలు?
సాక్షి, హైదరాబాద్: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో ఇంటెలిజెన్స్ విభాగం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఇంటెలిజెన్స్ విభాగం.. అధికారులు, సిబ్బందిని అక్కడ మోహరించింది. ఈటల టీఆర్ఎస్కు రాజీనామా తర్వాత నియోజకవర్గంలో పరిణామాలను అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించారు. సర్వేలు చేసి పార్టీల బలాలు, బలహీనతలను ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. హుజూరాబాద్ ఎన్నిక ఆగస్టులోనే వస్తుందని భావించి భారీస్థాయిలో సిబ్బందితో సర్వేలు రూపొందించారు. అప్పుడు బెంగాల్లో జరిగే ఉప ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో నిఘా విభాగం కొంత రిలాక్స్ అయ్యింది. 100 నుంచి 150 మంది... ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఇంటెలిజెన్స్లో ఉన్న పొలిటికల్ విభాగం ఉన్నతాధికారులు మూడు రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిని హుజూరాబాద్లో మోహరించారు. మొత్తంగా 100 నుంచి 150 మందిని నియోజకవర్గంలో నియమించినట్లు తెలిసింది. పార్టీల వారీగా అధికారులు, సిబ్బందిని విభజించి డ్యూటీలు వేశారని తెలిసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందించనున్నారు. పార్టీలు, కులాలు, వయసు... ఇంటెలిజెన్స్ బృందాలు సర్వేలో భాగంగా ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు సంబంధించి ప్రశ్నలు కూర్పు చేసినట్లు సమాచారం. అలాగే కులాలు, మతాలు, ఓటర్ల వయసు, వారి వృత్తి, పార్టీలపరంగా, మహిళల్లో కేటగిరీల వారీగా, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీ సర్వేలో 5 నుంచి 6 వేల మంది నుంచి వివరాలు సేకరించేలా నిఘా విభాగం భారీ కసరత్తు చేసింది. ఎన్నిక ముగిసే వరకు ప్రతీ నాలుగు రోజులకోసారి సర్వే పూర్తి చేసి నిఘా విభాగాధిపతికి అందజేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి ప్రశ్నలు.. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు, సీఎం పనితీరు, దళితబంధు, అభ్యర్థి ఎంపిక బీజేపీకి సంబంధించి ప్రశ్నలు.. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు, పెట్రో ధరలు, అభ్యర్థి వ్యవహారాలు, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్కు సంబంధించి ప్రశ్నలు.. ప్రతిపక్షం పనితీరు, అభ్యర్థి పోటీ ఇవ్వగలడా, టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారంతోనే పోటీనివ్వనుందా -
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్గా మారాడు. -
Escape From Taliban: అఫ్గన్లకు ఇప్పుడు ఇవే దిక్కు
అఫ్గన్ అల్లకల్లోలం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభీతితో పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ఈ తరుణంలో వారు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారని ఎంఐటీ రివ్యూ వెల్లడించింది. గూగుల్ ఫామ్స్ గూగుల్, వాట్సాప్.. ఇప్పుడు తాలిబన్ల కంటపడకుండా తప్పించుకునేందుకు అఫ్గన్లకు మార్గనిర్దేశకాలుగా మారాయి. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు.. ఆఫ్గన్ల పేర్లతో ఆన్లైన్ లిస్ట్లు తయారుచేసి సాయం అందిస్తున్నారు. మరికొన్ని గ్రూపులు తాలిబన్ల కదలికల ఆధారంగా ఎలా వెళ్లాలో అఫ్గన్ పౌరులకు సూచనలు చేస్తున్నాయి. వీటిలో చాలావరకు కాబూల్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడి పౌరులకు సాయపడుతున్నాయి. ఇందుకోసం గూగుల్ ఫామ్స్ను సర్క్యులేట్ చేస్తున్నారు. నిఘా సూచనలు ప్రశ్నలు..వాటికి సమాధానాలు అందించడం కోసం గూగుల్ ఫామ్స్ చాలా తేలికైన వ్యవహారం. అంతేకాదు అందులోనే పౌరుల పూర్తి సమాచారం మొత్తం పొందుపరుస్తున్నారు. ఇక వాట్సాప్లోనూ సమాచారం ఫార్వర్డ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానిక గ్రూపులతో పాటు అమెరికా విభాగాలు సైతం.. ఈ-మెయిల్స్ ద్వారా కాకుండా వాట్సాప్ గ్రూపులనే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి. మిగతావి కష్టం ఓవైపు ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ తాలిబన్ల కంటెంట్ కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి సులువుగా ఉపయోగించుకుంటున్నారు తాలిబన్లు. దీంతో వీటిలో ఎలాంటి అప్డేట్స్ పెట్టొద్దని అఫ్గన్లకు సూచనలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫామ్స్, వాట్సాప్ గ్రూపుల వినియోగం పెరిగింది. చదవండి: Afghanistan Trade: తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్కు ఇక భారీ దెబ్బే! -
పోలీసులు,ఇంటెలిజెన్స్కు సవాల్గా మారిన ‘మల్లేపల్లి’
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు, కౌంటర్ ఇంటెలిజెన్స్కు మల్లేపల్లి సవాల్గా మారింది. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా కొరవడటంతో పాటు సెర్చ్ ఆపరేషన్లు తగ్గాయి. మర్కాజ్ ఘటనతో మల్లేపల్లిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్లో స్లీపర్ సేల్స్కు అడ్డాగా మల్లేపల్లి మారింది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. 8 ఏళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను మల్లేపల్లిలో ఎన్ఐఏ పట్టుకుంది. మల్లేపల్లిలో వస్త్ర దుకాణాలను ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. సూరత్,ముంబై నుంచి వస్త్రాల ఇంపోర్ట్కి కేరాఫ్ అడ్రెస్గా మల్లేపల్లి ఉండగా, ఆ ప్రాంతంలో 1200లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. యూపీ బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం పెడుతున్నారు. -
కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ పర్యటన వరంగల్ చరిత్రలో మిగిలిపోయేలా సాగింది. అయితే, ఆద్యంతం ఉల్లాసంగా సాగిన ఆయన పర్యటనను అందరూ నెమ్మదిగా మరచిపోయే తరుణంలో ఆ రోజు జరిగిన పరిణామాలపై సీఎంఓ వర్గాలు సమగ్ర నివేదిక కోరడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన సందర్బంగా ఐదు రోజుల ముందు నుంచే కసరత్తు చేసినా.. ఆ రోజు చోటుచేసుకున్న చెదురుముదురు సంఘటనలు, వాటికి గల కారణాలను పోలీసు, ఇంటలిజెన్స్ వర్గాల విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా కట్టడి చేసినప్పటికీ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో హఠాత్తుగా కొన్ని విద్యార్థి సంఘాల బాధ్యులు కాన్వాయ్కు అడ్డుగా రావడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. పెద్ది.. అడ్డగింత సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొనేందుకు వస్తుండగా ఆయన వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుండి సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు ఆయన గన్మెన్లతో కలిసి నడిచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత జయశంకర్ వర్దంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏకశిల పార్కు వద్దకు వెళ్లిన సందర్భంగా కూడా మరోసారి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జయశంకర్కు నివాళులరి్పంచేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్బంగా ఎవరినీ పంపించబోమని పోలీసులు తేల్చిచెప్పారు. కాగా, తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, సీఎం కేసీఆర్ రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు, వారి భద్రత దష్ట్యా పోలీసులకు, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నడిచి వెళ్లానని ఆయన అదే రోజు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలపై సీఎంఓ వర్గాలు నివేదిక కోరడం, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపిన పోలీసులను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న ఓ పోలీసు అధికారిని వాగ్వాదానికి దిగగా... అసలేం జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. చదవండి: వరంగల్ అర్బన్ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్ -
ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు. చదవండి: (చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను) అన్ని విధాలుగా ఆలోచించే.. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరిన ఈటల తర్వా కీలక స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పార్టీ శాసనసభా పక్ష నేతగానూ వ్యవహరించారు. అలాంటి ఈటల రాజేందర్ను తప్పించడంపై సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఎంతో మంది నేతలు పార్టీని వీడినా ఉద్యమ ఉధృతిలో వారి ప్రభావం టీఆర్ఎస్పై పెద్దగా లేకుండా పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కీలక నేతను తప్పించాల్సి రావడంతో, అన్నీ పరిశీలించే చర్యలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈటలకు ఘన స్వాగతం సోమవారం రాత్రి భారీ కాన్వాయ్తో హుజూరాబాద్కు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనుచరులు, అభిమానులు బాణసంచా కాల్చారు. కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినదించారు. కాగా.. ఈటల రెండు రోజులు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే మకాం వేసి, అన్ని స్థాయిల నాయకులతో మండలాల వారీగా సమావేశమయ్యే యోచనలో ఈటల ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాతే, ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఏకాకి అయ్యారా? మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై తన కేడర్, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసే సూచ నలు కనిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటి నుంచి మూడు రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల నివాసానికి బారులు తీరారు. వివిధ కుల సంఘాల నేతలు, కొందరు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు కూడా కలిసి సంఘీభావం ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఈటల ప్రస్తావనే ఎత్తకపోవడం గమనార్హం. పలువురు మంత్రులు, ఇతర నేతలు వేర్వేరు అంశాలపై మాట్లాడుతున్నా.. భూకబ్జాలు, ఈటల బర్తరఫ్పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇలా పార్టీ ముఖ్యులెవరూ ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం లేదని కేసీఆర్ ముందుగానే అంచనా వేశారని నేతలు చెబుతున్నారు. అయితే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు ఈటల నివాసం వద్ద జరుగుతున్న పరిణామాల వివరాలు సేకరిస్తున్నారని, ఈటలతో సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కదలికలపైనా నిఘా పెరిగిందని సమాచారం. -
ఆర్థిక మోసాలపై డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్తో పాటు టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేయడంపై టెలికం శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ యూనిట్ను, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ‘అనవసర కాల్స్, మెసేజీలతో టెలికం యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న టెలీమార్కెటర్లు, ఇతరత్రా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. టెలికం వనరులను ఉపయోగించుకుని సామాన్యుడి కష్టార్జితాన్ని దోచేసే ఆర్థిక మోసాలు కూడా జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు‘ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఏర్పాటవుతుంది. -
ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా రమేష్రెడ్డి
సాక్షి, అమరావతి: ఎస్పీ ఆవుల రమేష్రెడ్డిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీగా రమేష్రెడ్డిని తప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సిఫారసు చేయడంతో ఆయన్ను ప్రభుత్వం వెయిటింగ్లో పెట్టింది. రమేష్రెడ్డిని ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. -
ట్రంప్ కోసం రష్యా ప్రయత్నాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు వ్యతిరేకంగా రష్యా కుట్ర చేస్తోందని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అనుకూలంగా రష్యాతో సన్నిహిత సంబంధాలున్న కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. అయితే, చైనా మాత్రం ట్రంప్ మరోసారి ఎన్నిక కాకూడదని కోరుకుంటోందని తెలిపారు. ఆ దిశగా ప్రజాభిప్రాయం మార్చేందుకు చైనా ట్రంప్పై విమర్శల పదును పెంచిందని వివరించారు. -
దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!...
సాక్షి, అమరావతి: ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో పేర్కొన్నారు. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
మెదడు పనితీరును మెరుగుపరిచే నిద్ర
ఎంతటి మేధావులయినా తమ మేధోతత్వాన్ని ఇనుమడింప చేసుకోవాలంటే కంటినిండా నిద్రపోవాలని, లేదంటే క్రమంగా వారి తెలివితేటలు మసకబారడమే కాకుండా, ఆయుష్షు కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్దాయానికి, మనిషి సగటున రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నాడనే దానికి సంబంధం ఉందని, కంటినిండా నిద్రపోయేవారు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని ప్రొఫెసర్ జేమ్స్ రోలండ్ చెబుతున్నారు. మనిషి ఎంత పట్టుదలతో ఉన్నా, మహా అయితే 48 గంటలు మాత్రమే నిద్ర పోకుండా ఉండగలడని, ఆ తర్వాత కూడా నిద్ర ఆపుకోవాలని చూసినా, అది ఫలించదని, నిద్ర ముంచుకు రావడమే కాకుండా అప్పటికే శరీరంలో మితిమీరిన రీతిలో అవలక్షణాలు తొంగి చూస్తాయంటున్నారు పరిశోధకులు. అసలు అలా కావాలని నిద్రను నిలుపుకొంటే పూర్తిగా చావును కొనితెచ్చుకున్నట్టే అవుతుందనీ, ప్రఖ్యాత ప్రజావైద్యుడు ద్వారకానాథ్ కొట్నిస్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనా– జపాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులకు ఏకబిగిన నిద్రను లెక్క చేయకుండా దాదాపు మూడురోజులపాటు శస్త్ర చికిత్స చేయడం వల్ల అతని శరీరంలో ఎన్నో విపత్కర పరిణామాలు తలెత్తాయనీ, దాంతో 32 సంవత్సరాల వయస్సులోనే మూర్ఛవ్యాధి సోకడం వల్ల మరణించాడని గుర్తు చేస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన ప్రఖ్యాత ప్రజావైద్యుడు, ప్రపంచంలోనే వైద్యవృత్తిలో ధర్మాత్ముడిగా, ఆ వృత్తికి అత్యంత హుందాతనాన్ని, యశస్సును తీసుకొచ్చిన నార్మన్ బెతూన్. 49 ఏళ్లకే చనిపోయాడనీ, అందుకు కారణం కేవలం నిద్ర సరిగాపోకుండా విపరీతమైన సేవా కార్యక్రమాల్లోను, కొత్త శస్త్ర చికిత్స పరికరాల రూపకల్పనలోను తలమునకలు కావడమేననీ, ఈ విషయాలు ఎంత పాతవైనప్పటికీ, నిద్రపోకుండా ప్రయోగాలు, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసి తీరాలంటున్నారాయన.దీనిని బట్టి చూస్తుంటే పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో రేయింబవళ్లు విద్యార్థుల్ని బట్టీలు పట్టించి చదివిస్తే ర్యాంకులు వస్తాయి గానీ మేధో పరిణితి, విచక్షణ, సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నూతనత్వం, ఉత్తేజం, ఉత్సాహం, తాజాదనం నేటి విద్యార్థుల్లో రాకపోవడానికి, లేకపోవడానికి గల కారణాలలో నిద్ర సరిగా లేకపోవడం కూడా ఒకటని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నిద్ర పోవాలి. ఏదో ఒక గమ్యం మీద కలలు కనాలన్నా, ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నా నిద్ర తప్పనిసరి అన్నమాట. -
ఏపీ ఎన్నికలపై బోగస్ సర్వే; ఒకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ పెట్టిన కేసులో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పాండురంగారావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చేసినట్టుగా చెబుతూ బోగస్ సర్వేను యూట్యూబ్లో పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు పాండురంగారావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశముంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే భవన్లో టీఎఫ్సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకుందని సమాచారం. (చదవండి: బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్సీ’ కార్యాలయం!) -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
-
పక్కనే ఉన్నా పసిగట్టలేకపోయారు..
న్యూయార్క్ : తాలిబన్ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ అలియాస్ ముల్లా ఒమర్ అమెరికా సైనిక శిబిరాలకు అత్యంత చేరువలోని రహస్య గదిలో ఉన్నా అమెరికన్ దళాలు గుర్తించలేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్లోని అమెరికా శిబిరాలకు నడక దూరంలోనే ముల్లా ఒమర్ ఏళ్ల తరబడి నివసిస్తున్నారని ఈ పుస్తకం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపింది. గతంలో ముల్లా తలదాచుకున్న ఈ ఇంటిపై అమెరికా దళాలు సోదాలు చేపట్టినా ఇందులో ఆయన కోసం నిర్మించిన రహస్య గదిని అవి పసిగట్టలేకపోయాయని పుస్తకంలోని అంశాలను ప్రచురించిన గార్డియన్, వాల్స్ర్టీట్ జర్నల్ కథనాలు వెల్లడించాయి. అమెరికా ట్విన్ టవర్స్పై దాడి అనంతరం ఒమర్ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది. కాగా అల్ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ మాదిరిగానే ఒమర్ సైతం పాకిస్తాన్లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. 2006 నుంచి ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా వార్తలు అందిస్తున్న డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ ప్రచురించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు దుమారం రేపుతున్నాయి. -
‘పుల్వామా’ను రాజకీయం చేయడం కాదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్ లోయలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం స్వేచ్ఛగా సంచరించిందంటే ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే’ అని 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే, శుక్రవారం నాడు జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య ఇది. అదే రోజు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయంలో ఏ నిర్ణయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటామని యావత్ ప్రతిపక్షం ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం గమనార్హం. (‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్) పుల్వామా దాడి సంఘటనను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నామని బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం ఒడిశా, చత్తీస్గఢ్లలో జరగాల్సిన తన సభలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇటార్సిలో జరగాల్సిన తన సభను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఝాన్సీలో జరగాల్సిన బహిరంగ సభను మాత్రం మోదీ రద్దు చేసుకోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించండంటూ ఆ సమావేశంలో మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. మోదీ శనివారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడంతోపాటు పల్వామా సంఘటన గురించి ప్రస్తావించి ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు. అదివారం అస్సాం ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ‘ కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కనుక జవానుల ప్రాణ త్యాగాన్ని వృధా పోనీయం’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ నాయకుడు భరత్ పాండ్యా సోమవారం నాడు వడోదరలో మాట్లాడుతూ కేంద్రంలో ఇంతకుముందున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోక పోవడం వల్ల నేడు జవాన్ల ప్రాణాలు పోయాయని అన్నారు. ‘నేడు జాతీయవాదాన్ని నింపుకున్న హృదయాలతో యావత్ జాతి ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఓట్లుగా మలుచుకోవడం మన బాధ్యత’ అని పాండ్య పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడే ఆదేశించింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నిరసన సభల్లో పార్టీ జెండాలకు బదులుగా పార్టీ ఎన్నికల గుర్తయిన కమలాన్ని ఎక్కువ ప్రదర్శించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. శవం పక్కన చిద్విలాసంగా బీజేపీ ఎంపీ ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో శనివారం నాడు సీఆర్పీఎఫ్ జవాను అజిత్ కుమార్ అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పాల్గొన్నారు. తాను అంతిమ యాత్రలో పాల్గొంటున్నానని, పైగా సైనికుడి భౌతికకాయం పక్కనున్నననే విషయాన్ని కూడా విస్మరించిన బీజేపీ ఎంపీ, పార్టీ ర్యాలీలో పాల్గొన్నట్లుగా చిద్విలాసంగా నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ, చేతులూపుతూ వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి అనేక వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించగా, బీజేపీకి ప్రచార బలగాలు ఎక్కువున్నాయని, ఈ సమయంలో తాము ఏం మాట్లాడినా ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేసే ప్రమాదం ఉందని వారన్నారు. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు. -
పుల్వామా దాడిలో అన్ని వైఫల్యాలే!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఓ టెర్రరిస్టు దాడిలో 44 మంది సైనికులు మరణించడం ఎవరు ఎప్పటికీ పూడ్చలేని లోటు. ఎదను తన్నుకుంటూ పెల్లుబికి వచ్చిన కన్నీళ్లను భారత జాతి కొద్ది కాలానికి మరచిపోవచ్చు. కానీ వారి కుటుంబాలు ఎప్పటికీ మరచి పోలేవు. ఇంతటి విషాధాన్ని మిగిల్చిన దారుణ సంఘటనకు ప్రత్యక్షంగా టెర్రరిస్టులు, పాకిస్థాన్ కారణం కావచ్చు. పరోక్షంగా మనం అంటే, మన వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం, అధికార యంత్రాంగం, విధాన నిర్ణేతలు కారణం కాదా? మన వ్యవస్థలు పటిష్టంగా ఉండి ఉంటే ఇంతటి దారుణాన్ని నిలువరించి ఉండేవాళ్లం కాదా?! మొదటి వైఫల్యం 80 వాహనాలను, 2,500 మంది సైనికులను ఒకేసారి గణతంత్ర దినోత్సవం పరేడ్లాగా ఎక్కడైనా పంపిస్తారా ? అందుకు అనుమతిస్తారా ? సైన్యం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లాలంటే విడతలుగా, జట్టు జట్టుగా వెళ్లాలని సైనిక నిబంధనావళే తెలియజేస్తోంది. ఉగ్రవాదుల అలజడి ఎక్కువగా ఉన్న దక్షణ కశ్మీర్ రోడ్డులో అంత మంది సైనికులు ఒక్కసారి ఎందుకు వెళ్లారు ? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక జాతీయ రహదారి మూసుకుపోయినందున రెండు రోజుల పాటు జమ్మూలో సైనికులు నిలిచి పోవాల్సి వచ్చిందని సైనిక అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు వాతావరణం అనుకూలించగానే కొంత మందిని విమానాల ద్వారా, మరి కొంద మందిని వాహనాల ద్వారా పంపించ వచ్చుగదా? అలా ఎందుకు చేయలేదు ? విమానాలకు ఖర్చు ఎక్కువవుతుందనా? రెండో వైఫల్యం సైనిక వాహనాలకు మధ్య పౌర వాహనాలను చొచ్చుకొని రావడం వల్ల ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రావడాన్ని సకాలంలో గుర్తించలేక పోయామని సైనిక అధికారులు చెబుతున్నారు. పౌర వాహనాలను ఎందుకు అనుమతించారు ? రాజకీయ నాయకుల కాన్వాయ్ పోతుంటే పౌర వాహనాలను నిలిపివేస్తారుగానీ, దేశాన్ని రక్షించే సైన్యం పోతుంటే నిలిపివేయరా ? వారి ప్రాణం పోయాక సాల్యూట్ కొడితే ఏం లాభం? (నా గుండె కూడా మండుతోంది) ఇంటెలిజెన్స్ వైఫల్యం త్వరలో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందంటూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సీఆర్పీఎఫ్కు ఇంటెలిజెన్స్ వర్గాలు సాధారణ హెచ్చరిక జారీ చేసిందట. ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎవరు జరుపుతారో? మాత్రం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పలేక పోయాయి, కనుక్కోలేక పోయాయి. ఆత్మాహుతి దాడి గురించి ఎక్కడ ఉప్పందిందో అక్కడి నుంచి అనువనువు శోధించుకుంటూ వస్తే ఎక్కడో ఓ చోట దాడికి కుట్ర జరగుతోందన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని ఉండేవారు. బాంబర్ 350 కిలోల పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరిస్తున్నప్పుడు కనుక్కునే అవకాశం ఉండింది. వాహనంతో సైనిక వాహన శ్రేణిని ఢీకొన్న ఆత్మాహుతి బాంబర్కు, కుట్ర దారులకు మధ్య చివరి వరకు సమాచార మార్పిడి జరిగి ఉంటుంది. మధ్యలో సమాచారాన్ని ట్రేస్ చేసి పట్టుకోక పోవడమూ వైఫల్యమే. ఆర్వోపీ వైఫల్యం సైన్యం ఓ చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు ‘రోడ్ ఓపెనింగ్ పార్టీ’ లేదా ‘ఆర్వోపీ’ క్లియరెన్స్ తప్పనిసరి. ఎక్కడైన మందు పాతరలు ఉన్నాయా, ఎక్కడయినా శత్రువులు పొంచి ఉన్నారా? ఎక్కడైన అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అన్న అంశాలను తేల్చుకోవడానికి ఆరోవోపీ సిబ్బంది ముందుగా వెళుతుంది. ఆ సిబ్బందికి బాధ్యత వహిస్తున్న అధికారి అనుమతి ఇస్తేనే సైన్యం కదలాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్వోపీ తనిఖీ చేసిందా ? లేదా ? తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చిందా? తేల్చాలి. పేలుడు పదార్థాలతోపాటు కాల్పులు కూడా వినిపించాయని సీఆర్పీఎఫ్ ఐజీ తెలిపారు. అదే నిజమయితే ఆర్వోపీ తన విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయినట్లే (ఉగ్ర మారణహోమం) సైన్యానికి పూర్తి స్వేచ్ఛ పుల్వామా మారణ హోమంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇప్పటి నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిందని, సైనికులపై దాడులు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయన అధికారంలోకి రాగానే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉండాల్సింది. కశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆ రాష్ట్రం నడుస్తోంది. అలాంటప్పుడు విధానపర లోపం కేంద్రానిదే అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే పాకిస్థాన్ పీచమణచడమే కాదు, ఈ వైఫల్యాలన్నింటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత కన్నీరు కారిస్తే ఏం లాభం?!? -
వైఎస్ జగన్ ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్ హడావుడి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హడావుడి చేస్తున్నారు. వైఎస్ జగన్ నివాసానికి వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం బుధవారం వైఎస్ జగన్తో సమావేశం కానున్న నేపథ్యంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలను వారు ఎప్పటికప్పుడూ విజయవాడకు చేరవేస్తున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు కోసం పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రతిపక్ష నేత ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు సమాచార సేకరణ కోసం ఇలా హడావుడి చేయడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. -
పిడుగుల దినోత్సవం
అల్లరి చేసే చిన్నారులను చిచ్చర పిడుగులతో పోలుస్తారు. కొందరు పిల్లలు సాధించిన విజయాలను చూస్తే కొంతమంది పిల్లలు పుట్టుకతో పిడుగులు. అనుకోక తప్పదు. కొందరు చిన్నారులు వయసులో మాత్రమే చిన్నవాళ్లు. పెద్దలు సైతం సాధించలేని విజయాలను సొంతం చేసుకున్న ఘనత వారిది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించిన చిన్నారులు కొందరు, మేధాశక్తితో మేధావులనే మెప్పించిన వాళ్లు కొందరు, కాల్పనిక శక్తిని చాటిన వారు కొందరు, కళా సేవా రంగాల్లో కొందరు... ఆటలాడుకునే వయసులో ఆడుతూ పాడుతూనే అద్భుతాలను సాధించిన కొందరు చిన్నారుల విజయగాథలు బాలల దినోత్సవం సందర్భంగా... శ్రవణ్–సంజయ్ కుమరన్ శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్ అన్నదమ్ములు. చెన్నైలో ఉంటారు వీళ్లు. శ్రవణ్ వయసు పదహారేళ్లు, సంజయ్ వయసు పదిహేనేళ్లు. సాధారణంగా ఈ వయసులోని పిల్లల చేతికి మొబైల్ఫోన్ చిక్కితే వీడియోగేమ్స్ ఆడటం లేదా చాటింగ్ చేయడంతో కాలక్షేపం చేస్తారు. ఈ గడుగ్గాయిలు అలాంటిలాంటి వాళ్లు కాదు. బడికి వెళ్లే వయసులోనే మొబైల్ ఫోన్లతో ఆటలాడుకున్నారు. అంతటితో ఆగలేదు. మొబైల్ ఫోన్లలోని రకరకాల యాప్స్ వాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి యాప్స్ స్వయంగా రూపొందించాలని బలంగా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రకరకాల మొబైల్ఫోన్స్పై ప్రయోగాలు ప్రారంభించారు. సొంతంగా యాప్స్ రూపొందించారు. వాటిని బంధు మిత్రులకు పరిచయం చేశారు. యాప్స్ అద్భుతంగా పనిచేస్తుండటంతో ఈ గడుగ్గాయిలకు బంధు మిత్రుల నుంచి ప్రోత్సాహం దొరికింది. తల్లి దండ్రుల సహకారం కూడా తోడైంది. దాదాపు డజను వరకు యాప్స్ రూపొందించారు. తాము రూపొందించిన యాప్స్ను స్వయంగా తామే మార్కెట్లోకి విడుదల చేయడానికి వీలుగా 2012లో ‘గో డైమెన్షన్స్’ పేరిట కంపెనీని ప్రారంభించారు. దానికి ఈ అన్నదమ్ములే సీఈవోలు. దేశంలోని అతి పిన్నవయస్కులైన సీఈవోలుగా రికార్డులకెక్కారు. శ్రవణ్ ఇప్పుడు పన్నెండో తరగతి, సంజయ్ పదో తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరి విజయగాథ ఫోర్బ్స్ మ్యాగజీన్కెక్కిందంటే వీళ్లు సాధించిన ఘనత ఏ స్థాయికి చెందినదో ఊహించుకోవాల్సిందే. వీళ్లు రూపొందించిన యాప్స్ అన్నింటిలోకీ ఆహార వృథాను అరికట్టడానికి వీళ్లు రూపొందించిన ‘గో డొనేట్’ యాప్ విశేషంగా ప్రశంసలు పొందింది. మెలిటా టెస్సీ పదిహేనేళ్ల వయసులో ఉండే చాలామంది పిల్లలు వ్యాసరచన రాయడానికే తంటాలు పడతారు. చెన్నైకి చెందిన చిన్నారి మెలిటా టెస్సీ మాత్రం ఆ వయసులో ఏకంగా నవల రాసేసింది. చిన్నారుల కాల్పనిక శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె నవల ‘బ్యాటిల్ ఆఫ్ ది స్ఫియర్స్ ప్రతులు దేశవ్యాప్తంగా పలు పుస్తక ప్రదర్శనల్లోను, బుక్స్టోర్స్లోను, ఆన్లైన్లోను ఇప్పటికీ హాట్కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మెలిటాకు ఇష్టమైన వ్యాపకం చదవడం. తొమ్మిదేళ్ల వయసులోనే ‘డెయిరీ ఆఫ్ వింపీ కిడ్’ నవల చదివింది. ఆ తర్వాత ఇక ఆగలేదు. దొరికిన నవలలను, కథల పుస్తకాలను వదలకుండా చదవసాగింది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కోరిన పుస్తకాన్నల్లా ఆమెకు సమకూర్చారు. చదవడంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఏదైనా రాస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో పదమూడేళ్ల వయసులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టింది. పదిహేనేళ్ల వయసుకే పర్యావరణ పరిరక్షణ ముఖ్యాంశంగా తొలి కాల్పనిక నవలను విజయవంతంగా రాసేసింది. నోషన్ ప్రెస్ ప్రచురణకర్తలకు ఈ నవల నచ్చడంతో వారు దీనిని ప్రచురించారు. కాల్పనిక సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమని, ‘హ్యారీ పాటర్’ రాసిన జేకే రౌలింగ్ తన అభిమాన రచయిత్రి అని చెబుతుంది మెలిటా. కౌటిల్య పండిట్ ‘గూగుల్ బోయ్’గా ప్రసిద్ధి పొందిన కౌటిల్య పండిట్ సాధించిన సంచలన విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. హరియాణాకు చెందిన కౌటిల్య పండిట్ వయసు పదకొండేళ్లు. కొన్నాళ్లు కోహండ్ గ్రామంలో తన తండ్రి సతీశ్ శర్మ నడుపుతున్న ఎస్డీ మోడర్న్ స్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం చండీగఢ్లోని భవన్ విద్యాలయలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అసాధారణమైన జ్ఞాపక శక్తితో బాలమేధావిగా గుర్తింపు పొందాడు. తన ఐదేళ్ల వయసు నుంచే వివిధ ప్రదర్శనల్లో ఈ చిచ్చర పిడుగు చూపిన ప్రతిభా పాటవాలు టీవీ చానెళ్లకు పాకాయి. ఇంత చిన్న వయసులోనే గొప్ప జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న కౌటిల్య పండిట్ మేధా సామర్థ్యాన్ని కురుక్షేత్ర వర్సిటీ సైకాలజీ విభాగం నిపుణులు స్వయంగా పరిశీలించారు. కౌటిల్య ఐక్యూ 130గా వారు తేల్చారు. పదేళ్ల వయసు పిల్లల్లో ఈ స్థాయి ఐక్యూ అత్యంత అరుదని చెప్పారు. సోనీ టీవీ ‘ఎంటర్టైన్మెంట్ కేలియే కుbŒ∙భీ కరేగా’ కార్యక్రమానికి కౌటిల్యను ఆహ్వానించింది. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ కార్యక్రమంలో క్షణమైనా ఆలోచించకుండానే అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతూ అమితాబ్ బచ్చన్నే నోరెళ్లబెట్టేలా చేశాడు ఈ చిచ్చరపిడుగు. కౌటిల్య ప్రతిభకు ముచ్చటపడిన గణితవేత్త ఆనంద్కుమార్ తాను నడుపుతున్న ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్కి ఆహ్వానించారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ‘సూపర్ 30’ విద్యార్థులను కౌటిల్య ప్రతిభా పాటవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం జ్ఞాపకశక్తి మాత్రమే కాదు, కౌటిల్యకు రాజకీయ పరిజ్ఞానం, సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. ఆ చైతన్యంతోనే గుర్గావ్లో ‘క్లీన్ ఎయిర్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా వీళ్లిద్దరూ బాల్య మిత్రులు. ఢిల్లీలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో క్లాస్మేట్స్. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు సాధారణంగా స్కూలు, ట్యూషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అరుదుగా దొరికే తీరిక వేళల్లో సినిమాలు, ఆటలు వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా నాలుగేళ్ల కిందట పదో తరగతిలో ఉండేవారు. అప్పుడు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనుషులు నడిచేటప్పుడు కూడా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఏదో రీతిలో సద్వినియోగం చేయవచ్చు కదా అని ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రయోగాలు ప్రారంభించారు. పోర్టబుల్ మొబైల్ చార్జర్ రూపొందించారు. వీరు రూపొందించిన చార్జర్ను షూస్కు అనుసంధానించారు. నడుస్తూనే ఈ చార్జర్ ద్వారా మొబైల్ ఫోన్ల చార్జింగ్ చేసుకోవచ్చు. మామూలు చార్జర్లతో పోలిస్తే ఈ చార్జర్ రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జ్ కావడానికి ఇంట్లో గంటసేపు చార్జింగ్ పెట్టాల్సి వస్తే, వీరు తయారు చేసిన చార్జర్లో పెట్టి, అరగంట నడక సాగిస్తే చాలు. ఆనంద్, మోహక్లు రూపొందించిన ‘వాకీ మొబి చార్జర్’ వార్తలకెక్కి మేధావులను ఆకట్టుకుంది. హృదయ్ పటేల్ యుద్ధ క్రీడల్లో ఘనత సాధించాలంటే ఎంతో ఓపిక, అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి సాధన కావాలని అంతా నమ్ముతారు. పసితనం వీడని హృదయ్ పటేల్ తైక్వాండో తరగతిలో శిక్షణ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అంతర్జాతీయ పోటీలో పాల్గొని ఏకంగా బంగారు పతకాన్ని సాధించి ఆరితేరిన చాంపియన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెంగళూరులో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఈ చిచ్చర పిడుగు అల్లరి రోజు రోజుకీ పెరుగుతుండటంతో కొంతైనా అల్లరి తగ్గించుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతడిని 2016 నవంబర్లో తైక్వాండో కోచింగ్ సెంటర్లో చేర్చారు. అప్పటికి అతడి వయసు మూడేళ్ల లోపే. కోచింగ్లో చేరిన మరుసటి సంవత్సరమే, అంటే 2017 జూలైలో దక్షిణ కొరియాలో జరిగిన చున్చియాన్ కొరియా ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్న వారందరిలోనూ హృదయ్ పటేల్ అతి పిన్న వయస్కుడు కావడంతో అక్కడి మీడియాను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులందరూ అతడినే ఆసక్తిగా గమనించసాగారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అరవై మంది చాంపియన్లను అవలీలగా ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకోవడంతో హృదయ్ పటేల్ రికార్డులకెక్కాడు. ఆ ఘనవిజయంతో అంతర్జాతీయ మీడియాలో అతడి పేరు మార్మోగింది. నిజానికి కొరియా వెళ్లడానికి అతడికి స్పాన్సర్షిప్ దొరకలేదు. కనీసం ఆరేళ్లయినా నిండితే గానీ అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి స్పాన్సర్షిప్ ఇవ్వలేమని ఒక యువజన సంస్థ చేతులెత్తేసిందని హృదయ్ తల్లి పింకాల్ చెప్పారు. అయితే, హృదయ్ ప్రతిభపై నమ్మకం ఉంచిన తన భర్త నవీన్భాయ్ పటేల్ అప్పు చేసి మరీ అతడిని కొరియా తీసుకువెళ్లాడని తెలిపారు. తైక్వాండోలో చేరినా అతడి అల్లరి ఏమాత్రం తగ్గలేదని మురిపెంగా చెబుతారామె. హృదయ్ పటేల్ ప్రస్తుతం బెంగళూరులోని జైన్ హెరిటేజ్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటున్నాడు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ గడుగ్గాయి ‘నా దగ్గర ఒకే బెల్టుంది. అది గ్రీన్ బెల్ట్’ అని బదులిస్తాడు. అది తైక్వాండోలో సాధించినదే. అనీష్ భాన్వాలా గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడం ఏమంత తేలికైన విషయం కాదు. హరియాణా కుర్రాడు అనీష్ భాన్వాలాకు మాత్రం అదో సాదాసీదా ఆట. పట్టుమని పదిహేనేళ్ల వయసులోనే ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. గత ఏడాది నుంచే అనీష్ భారత షూటింగ్ టీమ్లో కొనసాగుతున్నాడు. కర్నాల్లోని సెయింట్ థెరిసా కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకుంటున్న అనీష్ గత ఏడాది జరిగిన కామన్వెల్త్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జర్మనీలో గత ఏడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో రెండు రజత పతకాలను, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో వ్యక్తిగతంగా బంగారు పతకాన్ని, టీమ్ తరఫున రజత పతకాన్ని సాధించాడు. అనీష్ చిన్నప్పటి నుంచే షూటింగ్పై ఆసక్తి చూపేవాడు. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి తెలిసినవారి వద్ద నుంచి పిస్టల్ను ఎరువు తెచ్చి, స్కూలు మైదానంలో షూటింగ్ రేంజ్ వద్ద సాధన చేయించేవాడు. ç శ్రుతి పాండే రెండేళ్ల వయసులో చిన్నారులు బుడి బుడి అడుగులు వేస్తుంటారు. మెల్లగా పరుగులు తీయడానికి ఉత్సాహం చూపుతారు. అలాంటి బుడి బుడి అడుగుల వయసులో శ్రుతి పాండే మాత్రం యోగాసనాలు వేయడం ప్రారంభించింది. అలహాబాద్లో ఆమె నర్సరీలో ఉన్నప్పుడే స్కూల్లో ఆమె ప్రదర్శనకు టీచర్లు ముగ్ధులయ్యారు. ఆమెకు నాలుగేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆమెను గురు హరిచేతన్ యోగా శిక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె ప్రదర్శించిన యోగాసనాలకు గురువు సైతం అబ్బురపడ్డారు. వెంటనే ఆమెను తన కేంద్రంలో చేర్చుకుని శిక్షణ ప్రారంభించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత క్లిష్టమైన యోగాసనాలను అవలీలగా వేయగలగడం సాధించింది. ఇక ఆమెకు నేర్పాల్సిందేమీ లేదని గురువు నిర్ధారించి, ఆమెనే శిక్షకురాలిగా తయారు చేశారు. తన ఆరేళ్ల వయసులోనే, 2011లో బ్రహ్మ సరస్వతి ధామ్లో దాదాపు ముప్పయి మందికి యోగా శిక్షణ ప్రారంభించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన యోగా శిక్షకురాలిగా రికార్డులకెక్కింది. ఆమె వద్ద శిక్షణ పొందిన తొలి బృందంలో అన్ని రకాల వయసుల వారు, అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. వాళ్లలో వ్యాపారవేత్తలు, గృహిణులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుంచే యోగా ప్రారంభించడం మంచిదని, దేశంలోని ప్రతి పాఠశాలలోనూ యోగా శిక్షణను తప్పనిసరి చేయాలని కూడా ఆమె అంటుంది. శుభేందుకుమార్ సాహు సాధారణంగా హైస్కూల్ పిల్లలు సైన్స్ పాఠాలను చదువుకోవడంతోనే సరిపెడతారు. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికి చెందిన శుభేందుకుమార్ సాహు మాత్రం అక్కడితో సరిపెట్టుకోలేదు. సైన్స్ పాఠాల్లో చదువుకున్న ఆవిష్కరణలు, వాటి వెనుకనున్న శాస్త్రవేత్తల గాథలు అతడిని ఆకట్టుకున్నాయి. తాను కూడా నలుగురికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి ఆవిష్కరించాలనుకున్నాడు. ఆ తపనతోనే రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరానికి రూపకల్పన చేశాడు. కోల్కతాలో జరిగిన సైన్స్ ప్రదర్శనలో తాను రూపొందించిన పరికరాన్ని ‘గిఫ్ట్ ఫర్ ఫార్మర్స్’ పేరిట ప్రదర్శించాడు. సులువుగా విత్తనాలు నాటడానికి, నేల దున్నడానికి, పురుగుమందులు చల్లడానికి పనికొచ్చే ఈ యంత్రం పనితీరు శాస్త్రవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీనికి గుర్తింపుగా 2016లో శుభేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్మెంట్స్’ సత్కారం లభించింది. రాష్ట్రపతి అవార్డు రావడంతో శుభేందు జాతీయ మీడియాలో మెరిశాడు. శుభేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. జయకుమార్ పేదరికంలో మగ్గుతూ చదువుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటూనే ఆవిష్కరణలు చేయడమంటే అద్భుతమనే చెప్పాలి. శివకాశికి చెందిన జయకుమార్ అలాంటి అద్భుతాన్నే సాధించాడు. రెండేళ్ల కిందట తక్కువ ఖర్చుతో మంటలను ఆర్పే పరికరాన్ని రూపొందించాడు. అప్పడు అతడు తొమ్మిదో తరగతి విద్యార్థి. జయకుమార్ తల్లి బాణసంచా కర్మాగారంలో దినసరి కూలి. కొన్నేళ్ల కిందట బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె గాయపడింది. తన తల్లిలాగ మరెవరూ అగ్నిప్రమాదాల్లో గాయపడరాదని తలచిన శివకుమార్ తన స్కూల్ టీచర్ సహాయంతో తక్కువ ఖర్చుతోనే అగ్నిమాపక యంత్రాన్ని రూపొందించాడు. ఈ పరికరం రూపొందించినందుకు శివకుమార్కు 2016లో నేషనల్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. సైరి రహాంగ్డాలే అక్కడక్కడా బాల కళాకారులు ఉండటం అరుదే గాని, వారు తమ తమ కళా ప్రదర్శనలకు, వాటి ద్వారా వచ్చే విజయాలకు మాత్రమే పరిమితమైపోతుంటారు. పదిహేనేళ్ల సైరి రహాంగ్డాలే ధోరణి ఇందుకు పూర్తిగా భిన్నం. భరతనాట్యంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ఘన విజయాలు సాధించిన సైరి, తన నాట్యప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తోంది. నాట్య ప్రదర్శనల ద్వారా డబ్బు రావడం మొదలయ్యాక, తాను ఆ డబ్బును చుట్టు పక్కల పేద పిల్లల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పిందని, ఆమె సంకల్పానికి తాము వీలైనంతగా చేయూతనిస్తున్నామని సైరి తల్లిదండ్రులు మీతా, ప్రకాశ్ రహాంగ్డాలే చెప్పారు. తమిళనాడులోని సేలంలో చదువుకుంటున్న సైరి పంచరత్న అవార్డు, నిత్యశ్రీ అవార్డు వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంది. -
చిన్న సమస్య కూడా రానివ్వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలకు ఏ చిన్న సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో భద్రతకు చేయాల్సిన ఏర్పా ట్లు, బందోబస్తు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తదితరాలపై సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ సమీక్షించారు. సమీక్షలో నార్త్జోన్ (వరంగల్) కింద ఉన్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్కుమార్ పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సున్నిత ప్రాంతా ల్లో జరిగిన అల్లర్లు, గొడవలు, ఇతరత్రా అంశాలపై ఆయా జిల్లాల ఎస్పీలు డీజీపీకి వివరించారు. బూత్స్థాయి వరకు భద్రతను పటిష్టం చేయడంతో పాటు ముందుస్తుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లు, రౌడీషీటర్లను బైండోవర్ చేయడం, వారిపై నిఘా పెట్టాలని సూచించినట్లు సమాచారం. మావో ప్రభావిత జిల్లాల్లో అలర్ట్.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మావోలు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు సూచిం చినట్లు తెలిసింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుం డా చూసుకోవాలని, ఇందుకు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ఎన్నికల కమిషన్ సీఈవో రజత్కుమార్తో సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జితేందర్ తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది ఈ నెల 12 నుంచి శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. -
తిరుమల ఆలన... పాలన
శ్రీవారి దర్శనం కోసం నిత్యం తరలివచ్చే లక్షలాది మంది భక్త జనులకు సేవలు అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. కొండంత పాలన జరిగేది తిరుపతిలోని కార్యాలయం నుంచే. ఒక్కమాటలో చెప్పాలంటే కొండను నడిపేది కింది కార్యాలయ ఉద్యోగులే. వేలాది మంది ఉద్యోగులు స్వామి సన్నిధి(టీటీడీ)లో ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నప్పటికీ సేవాభావంగానే విధులు నిర్వహిస్తున్నామన్న భావనతో జీవితాలు కొనసాగిస్తున్నారు. 22వేలకు పైగా ఉద్యోగులు టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా 30కి పైగా విభాగాలు, దాదాపు 52 అనుబంధ శాఖలు ఉన్నాయి. వాటిలో 22వేలకు పైగా పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా వేకువ జామున 3 గంటలకే నిద్రలేచి తిరుమలలోనూ, తిరుపతిలోనూ రాత్రివేళ 11 వరకు వంతులవారీగా దేవస్థానానికి, తద్వారా భక్తులకు సేవగా భావించి పనిచేస్తున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం వీరందరికీ జీతభత్యాల కోసం ఏటా సుమారు రూ.490 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. ఆలయం నుంచి భక్తుల సౌకర్యాల వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తిరుమల శ్రీవారి ఆలయంలో నుంచి తిరుపతిలోని పరిపాలనా విధానాలు రూపొందించే పాలనా భవనం, భక్తులకు సౌకర్యాలు కల్పించే విభాగాల్లోనూ సేవగానే విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా జీయంగార్ల వ్యవస్థ పరిధిలోకే వస్తారు. ∙స్వామివారి ఆలయంలో జీయర్ల ఆధ్వర్యం, పర్యవేక్షణలో అర్చకులు దేవదేవునికి నిత్య పూజలు, కైంకర్యాలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ∙స్వామివారికి వేదమంత్రాలతో అర్చనాది సేవలు అందించేందుకు వేదపండితులు తమ నిత్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ∙ వీరితో పాటు ఆలయంలో భక్తులకు దర్శనం, ఇతర పూజాది కైంకర్యాలు క్రమబద్ధంగా, నిర్ణీత సమయానికి నిర్వహింపచేసేందుకు ఏఈవోలు, సూపరిం టెండెంట్లు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తి తన్మయత్వంతో విధులు నిర్వహిస్తున్నారు. ∙ఆలయం వెలుపల నిత్యం స్వామివారి ఉత్సవవర్లకు వాహన బేరర్లు, మంగళ వాయిద్యాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు మాత్రం స్వామివారి ఉత్సవవర్లను మోయడం వల్ల నేరుగా స్వామికే సేవ చేసినంత భావనతో విధులు నిర్వహించి పులకించిపోతుంటారు. ∙మిగిలిన సేవల్లో తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు, అన్నప్రసాదాల పంపిణీ, ఇందుకోసం అవసరమైన సరుకుల కొనుగోళ్లు, దాతల నుంచి విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను తిరుపతిలోని పరిపాలనా భవనం పరిధిలో కొనసాగుతున్నాయి. ఇవి నిరంతరం కొనసాగితేనే స్వామివారి పూజలు, అందుకు విచ్చేసే లక్షలాది భక్తులకు అన్ని సేవలు నిరాటంకంగా సాగుతాయి. ∙భక్తుల సదుపాయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలను అమలుపరచేందుకు కూడా జీయంగార్ల సూచనలు, సలహాలను పాటించి పనులు చేపడుతుంటారు. ∙స్వామివారి మూలమూర్తితో పాటు అనుబంధ దేవతలకు, టీటీడీ అనుబంధ ఆలయాలకు పుష్పాలంకరణ, సరఫరా చేపట్టేందుకు కొనసాగుతున్న ఉద్యానవన విభాగంలోనూ వందలాది మంది ఉద్యోగులు, చిరుద్యోగులు సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారు. ∙అభివృద్ధి పనులు, భక్తుల క్యూలైన్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు పనిచేసే ఇంజనీరింగ్ విభాగానిది టీటీడీలో ప్రధాన పాత్రనే చెప్పాలి. దీని పరిధిలోకే వచ్చే ఎలక్ట్రికల్ విభాగంలో అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు, వందల సంఖ్యలో ఉద్యోగులు, వేల సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ∙టీటీడీకి సంబంధించి భక్తులకు కావాల్సిన సమస్త సమాచారం తెలిపేందుకు పౌర సంబంధాల శాఖ పరిధిలో పనిచేస్తున్న కాల్సెంటర్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. నిఘా, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం తిరుమల పుణ్యక్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడితో పాటు అత్యున్నత నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అటు తిరుమల ఆలయానికి, ఇటు భక్తులకు ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా నిరంతరం టీటీడీ కోసం ప్రత్యేక నిఘా, ¿¶ ద్రత వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే మార్గంలోని టోల్గేట్ నుంచి తిరుమల టోల్గేట్లు, ఆలయం, తిరుమలలో అణువణువూ జల్లెడ పట్టేలా అత్యాధునిక పరిజ్ఞానంతో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. క్షణం కూడా రెప్పవాల్చకుండా పటిష్టమైన నిఘా పహారా సాగుతోంది. ఈ విభాగంలోనూ పదుల సంఖ్యలో అధికారులు, వందల్లో ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం దేశంలోని అనేక ప్రభుత్వ శాఖల్లోకెల్లా టీటీడీకి చెందిన పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగాల సమన్వయం తో పనిచేసే పారిశు«ధ్ధ్య కార్మికుల నిరంతర కృషి ఫలితంగా తిరుమలకు స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం దక్కింది. భక్తులకు క్షణక్షణం సేవలు అందించడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మాత్రం వెలకట్టలేనివి. సుమారు 9 వేల మంది కార్మికులు నిత్యం షిప్టుల వారీగా పనిచేస్తూ తిరుమల పుణ్యక్షేత్రం, స్వామివారి ఆలయం లోపల ప్రాంతాలు, ఘాట్రోడ్డు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. టీటీడీ అన్నదాన భవనం, ఇతర క్యాంటీన్లు, హోటళ్ల ప్రాంతాల్లో సైతం పారిశుద్ధ్యాన్ని నిర్వహించడంలో పారిశుద్ధ్య విభాగం కార్మికులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు.వీటన్నిటితో పాటు స్వామివారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాపితం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వివిధ ప్రాజెక్టుల ఉద్యోగులు, కళాకారులు, ప్రచురణల విభాగం, ధర్మప్రచార సంస్థలు, భక్తుల సేవలో తరించే కళ్యాణకట్ట ఉద్యోగులు, తిరుమలలో ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ట్రాన్స్పోర్టు విభాగంలోని ఉద్యోగుల సేవలు స్వామివారికే అన్నట్లు నిత్యం కొనసాగుతూ భక్తుల మన్ననలు పొందుతున్నాయి. – పి.గురుమూర్తి తిరుపతి అర్బన్ -
‘నిఘా’పై జగడం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగాల మధ్య కోల్డ్వార్కు దారి తీసింది. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ సమాంతరంగా పనిచేయడం తెలంగాణ అధికారులకు కోపం తెప్పిస్తోంది. ఎన్నికల సర్వేలు నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు, ఈడీ కేసుల నమోదు నేపథ్యం గురించి, ఓటుకు నోట్లు కేసులో ఏసీబీ చర్యల గురించి ఏపీ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఏపీ సీఎం చంద్రబాబుకు అప్డేట్ చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు మింగుడుపడటం లేదు. వరంగల్లో మొదలైన రగడ... రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు వల్ల కలిగే లాభనష్టాలు, గెలిచే అవకాశమున్న సీట్ల సంఖ్య, ఎక్కడెక్కడ ఎవరి బలాబలాలు ఏమిటన్న అంశాలపై ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది 20 రోజుల క్రితం తెలంగాణలో మకాం వేశారు. ఇందులో భాగంగా వరంగల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఓ డీఎస్పీ నేతృత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ బృందం సర్వే చేయడం సంచలనం రేపింది. ములుగు, వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లిలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అవే నియోజకవర్గాల్లో సర్వే చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు రుచించలేదు. అలాగే వైరా, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సర్వే చేస్తున్నప్పుడే ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన అదనపు ఎస్పీ నేతృత్వంలో 18 మంది సిబ్బంది తారసపడటం కూడా మింగుడు పడలేదు. తాము ఏయే నియోజకవర్గాల్లో సర్వే చేపడతామనే విషయం ఏపీ అధికారులకు ఎలా లీౖకై ందన్న అంశంపై తెలంగాణ ఉన్నతాధికారులు సమాలోచనలు చేశారు. మొత్తం 84 మంది ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది, అధికారులు తెలంగాణలో సర్వే చేస్తున్నట్లు గుర్తించారు. రెండూ ఒకే భవనంలో... రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు తర్వాత ఏపీ అ«ధికారిక కార్యకలాపాలన్నీ అమరావతి తరలివెళ్లగా ఏపీ ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ 90 శాతం విజయవాడ, అమరావతికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పెద్దగా ఏపీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు సాగించలేదు. కేవలం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందే భద్రత పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాల కోసం ఏపీ అధికారులు భాగ్యనగరానికి వచ్చేవారు. కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బాబు ఆదేశంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో దిగడం, అమరావతి నుంచి సిబ్బందిని రప్పించడం.. ఉమ్మడి జిల్లాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికి సర్వే బాధ్యతలు, నిఘా కార్యకలాపాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కొనసాగడం వల్లే ఈ సమాచారం లీకై ఉంటుందా అనే కోణంలో ఇక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. సర్వే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇక్కడ అధికార పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ అసంతృప్త అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు? వారి వెనుకున్న కారణాలు ఏమిటి? నేతలెవరన్న సమాచారం ఏపీకి చేరడంతో లీక్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూపీ లాగుతున్నారు. రెండు విభాగాలు ఒకే చోట కార్యకలాపాలు సాగించడం వల్లే సమాచార మార్పిడి జరుగుతోందా లేక కోవర్టులు ఎవరైనా లీక్ చేస్తున్నారన్న అంశాలపై తెలంగాణ పోలీసుశాఖ దృష్టి సారించింది. మరోవైపు ఐటీ దాడులపై తాము సేకరించిన, ఏపీకి పంపించిన కీలక నివేదికలు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల చేతుల్లోకి ఎలా వెళ్లాయన్న అంశాలపై ఏపీ నిఘా ఉన్నతాధికారులు సైతం ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 74 స్థానాల్లో (హైదరాబాద్ మినహా) చేసిన సర్వే నివేదిక ఇప్పుడు తెలంగాణ నిఘా అధికారుల వద్ద ఉండటం కూడా ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ను ఆందోళనలో పడేసినట్లు తెలుస్తోంది. అగ్గి రగిల్చిన ఐటీ సోదాలు సర్వేలతోనే పర్వాలేదు అనుకొని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలోని ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు చేసేందుకు ప్రత్యేక బృం దాలు ఏర్పడటం, ఎక్కడెక్కడ చేయబోతున్నాయన్న విషయాలు ముందే గ్రహించి ప్రముఖులను అప్రమత్తం చేయడంతో రాష్ట్ర నిఘా అధికారులు కంగుతిన్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించకపోవడం, పైగా ప్రముఖుల ఇళ్ల వద్ద రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది కంటే ముందే ఏపీ అధికారులు ఉండి సమాచారం సేకరించడం ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. -
మన్యంలో మళ్లీ అలజడి
కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో మళ్లీ తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, అదే స్థానం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆదివారం నక్సలైట్ల తుపాకి గుళ్లకు బలయ్యారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగే గ్రామదర్శిని సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ ఇద్దరినీ దాదాపు 65మందికిపైగా నక్సలైట్లు అడ్డగించి అతి సమీపం నుంచి కాల్చిచంపారు. 2016 అక్టోబర్లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండర్ ఒకరు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుండేవి. హత్యలు, ఎన్కౌంటర్లు, మందుపాతర పేలుళ్లతో అది అట్టుడికేది. కానీ విభజన తర్వాత 2016 నాటి ఎన్కౌంటర్ ఉదంతం మినహా చెప్పుకోదగిన ఘటన చోటుచేసుకోలేదు. అయితే అలాగని ఆ ప్రాంతం నక్సలైట్ల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు. అడపా దడపా వారి కార్యకలాపాల జాడ కనబడుతూనే ఉంది. పైగా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి విలీన వారో త్సవాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేగాక కిడారి నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారంపైనా, ఆయన నడుపుతున్న క్వారీపైనా మావో యిస్టులు హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే తాను గ్రామదర్శిని సభకు వెళ్లలేనని కిడారి చెప్పినా చంద్రబాబు వెళ్లితీరాలని ఆదేశించారని, చివరకు ఈ దారుణం చోటుచేసుకున్నదని అంటున్నారు. కనీసం ఏజెన్సీలో పోలీసు నిఘా సక్రమంగా ఉన్నా వారిద్దరూ క్షేమంగా తిరిగి రాగ లిగేవారు. ఇది లేదు సరిగదా... వారు పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లారని హోం మంత్రి చిన రాజప్ప అంటున్నారు. కానీ తాము బందోబస్తు కల్పించాలని స్థానిక పోలీసులను కోరా మని, కానీ వారు పట్టించుకోలేదని కిడారి వ్యక్తిగత సహాయకుడు చెబుతున్నారు. ఇలాంటి సమ యాల్లో హోంమంత్రి స్థాయి నాయకుడు అన్నివైపుల నుంచీ సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఆయన పోలీసులిచ్చిన ప్రకటన చదివి చేతులు దులుపుకున్నారని అర్ధమవుతోంది. వీరిద్దరి హత్య తర్వాత స్థానికంగా ఏ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయో ఆయనకు తెలియనిది కాదు. నక్సలైట్ల ఘాతుకం గురించి ఫోన్లో సమాచారం ఇస్తే, అక్కడి నుంచి మృతదేహాలను మీరే తీసు కురండని ఒక ఎస్ఐ సలహా ఇచ్చారని కిడారి అనుచరుడొకరు చెబుతున్నారు. నాలుగు గంటల పాటు వారి మృతదేహాలు ఘటనాస్థలి వద్దే ఉండిపోయాయి. చివరకు అనుచరులే వాటిని తీసు కెళ్లాల్సివచ్చింది. పోలీసులు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి కిడారి, సోమ అభిమానులు రెచ్చిపోయి అరకు, డుంబ్రిగూడ పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. భారీ విధ్వంసం సృష్టించారు. రికా ర్డులు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఏడాదిక్రితం తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అధికార పార్టీలో చేరి, ఆ పార్టీ ఆదేశాలతో ఒక సభ నిర్వహించడానికెళ్తున్న ఎమ్మెల్యే మాటకే అక్కడ దిక్కులేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు పాలన ఎంత అస్తవ్యస్థంగా సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. నక్సలైట్లు చీకటి మాటున ఈ దాడి చేయలేదు. మిట్ట మధ్యాహ్నం ప్రధాన రహదారి పక్కనే కాపుగాశారు. అది మరీ మారుమూల ప్రాంతమేమీ కాదు. సెల్ఫోన్ టవర్లకు సమీపంలోనే ఘటనా స్థలి ఉంది. ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో బయటి ప్రపంచానికి చేరేయటం చాలా సులభం. కానీ నక్సలైట్ల దాడి తర్వాత అరగంటకుగానీ పోలీసులకు ఆ సంగతి తెలియలేదు. ఇంకా విచిత్రమేమంటే దాడికి పాల్పడినవారు నలుగురైదుగురు కాదు... వారు భారీ సంఖ్యలో ఉన్నారు. పైగా వారంక్రితమే వారంతా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతమంది ఏజెన్సీలో ప్రవేశించినా నిఘా వర్గాలకు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా నక్సలైట్లు ఏదైనా వారోత్సవాలకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడతారు. కానీ ఈసారి అలా జరగలేదు సరిగదా నిఘా సైతం లేదు. కనీసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు గనుక, అటువైపు వెళ్లొద్దని ప్రజా ప్రతినిధులకైనా సూచనలివ్వలేదు. ఇటీవలికాలంలో అధికారంలో ఉంటున్నవారు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలపై నిఘా ఉంచేం దుకు వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు దీన్ని మరింతగా దిగజా ర్చారు. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయో ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అక్కడికి తరలించారు. కొన్నేళ్లక్రితం తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన భంగ పడ్డారు. ఆయన సన్నిహితుడు రేవంత్రెడ్డి డబ్బు సంచులతో పోలీసులకు దొరికిపోయారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేతో బాబు సంభాషణల ఆడియో బయటికొచ్చింది. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తే మీరేం చేస్తున్నారని అప్పట్లో బాబు ఇంటెలిజెన్స్ విభాగంపై విరుచుకుపడ్డా రని కథనాలు వెలువడ్డాయి. బహుశా ఆ కారణం వల్ల ఈసారి ఇంటెలిజెన్స్ సిబ్బంది మొత్తం తెలం గాణలో మోహరించినట్టు కనబడుతోంది. ఇలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? నక్సలైట్ల దాడి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. అయితే ఇదంతా జాగ్రత్తగా సాగాలి. అమాయకు లైన గిరిజనులను వేధించకుండా దాడికి కారకులైనవారిని పట్టుకోవటంపైనే దృష్టి సారించాలి. అలాగే గిరిజనుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్న మైనింగ్ కార్యకలాపాలు మూతబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలను నివారించటం సాధ్యం. -
మంత్రి జగదీశ్రెడ్డిపై రెక్కీ?
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా డ్రోన్ కెమెరాలతో గ్రామం మొత్తాన్ని చిత్రీకరించారని, ఇందులో మంత్రి ఇంటి పరిసరాలను కూడా తీశారని సమాచారం. ఈనెల 2న పోలీసు బలగాలు ప్రగతి నివేదన సభకు వెళ్లడంతో నిఘా లేదని భావించిన సదరు వ్యక్తులు దూర ప్రాంతంనుంచి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి ఇటీవల తన స్వగ్రామంలో పాత ఇంటి పక్కనే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. నెల రోజుల క్రితం కూడా ఆయన నాగారం వెళ్లారు. స్వగ్రామం కావడంతో ఆయన వచ్చినప్పుడల్లా గ్రామంలో తనతో సన్నిహితంగా ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లి పలకరిస్తారు. మంత్రి ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ పోలీసు బందోబస్తు ఉంటుంది. గ్రామమంతా చిత్రీకరణ.. ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు అలాగే తుంగతుర్తి రోడ్డు, హెల్త్ సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులు, గ్రామం నుంచి బయటకు వెళ్లే డొంక రోడ్లను చిత్రీకరించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంత్రిపై దాడి చేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా తప్పించుకునేందుకు డ్రోన్తో నాగారం పరిసరాలను చిత్రీకరించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా విభాగాలు కూడా వారం రోజులుగా ఈ విషయమై గ్రామస్తులు ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మా దృష్టికి వచ్చింది: వెంకటేశ్వర్లు, ఎస్పీ ‘నాగారంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విషయం మా దృష్టికి కూడా వచ్చింది. రోడ్లు, ఇళ్లు, మంత్రి ఇంటిని కూడా చిత్రీకరించారని తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. రెండు, మూడు రోజుల్లో దీన్ని ఎవరు తీశారో తేలుస్తాం’. -
చంద్రబాబు దొంగల ముఠాను తెలంగాణకు పంపారు
-
చంద్రబాబుపై బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. శనివారం ఆయన సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలిసి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజేంట్లు కొంత మంది కాంగ్రెస్లో ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసుపెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని ఎందుకు అడగాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బాల్కసుమన్ హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలని సూచించారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పనిచేయాలన్నారు. చదవండి: తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్! -
తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ను పరుగులు పెట్టిస్తోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని టీటీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో టీడీపీ పట్టున్న ప్రాంతాలు.. గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఓటు బ్యాంకు.. నేతల వలసలు.. తదితర అంశాలన్నింటిపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏపీ ఇంటలిజెన్స్ పొలిటికల్ విభాగంలో పని చేస్తున్న 60 మంది హైదరాబాద్లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చి క్యాంపు ఏర్పాటు చేశారు. 4 రోజల క్రితం వచ్చిన వీరిని ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పాటు చేసి సర్వే విధులు అప్పగించినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఏయే స్థానాలను గెలవచ్చు.. పొత్తుపై టీడీపీ ఓటర్ల స్పందన అంశాలపై కూడా త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ 20పైనే నజర్... ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ బృందాలు 20 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు టీటీడీపీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, ఉప్పల్, సనత్నగర్లో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే రూరల్ ప్రాంతాలైనా నిజామాబాద్లో ఓ అసెంబ్లీ, మెదక్లో నారాయణ్ఖేడ్, వరంగల్లో నర్సంపేట్, కరీంనగర్లో కోరుట్ల, ఖమ్మంలో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, నల్గొండలో కోదాడ, మహబూబ్నగర్లో మక్తల్, వనపర్తి, దేవరకద్ర, ఆదిలాబాద్లో ఖానాపూర్ లేదా ఆసిఫాబాద్లో బృందాలు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా ఇదే స్థానాలను టీటీడీపీ కోరే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో వాళ్లెలా చేస్తారు? ఒక రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ పరమైన అంశాలపై పక్క రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేయడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అంశంగా మారుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థతో సర్వే చేయించుకుంటే అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రానికి చెందిన పోలీసులు సర్వే చేయడం నిబంధనలకు విరుద్ధమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తెలివి ఎక్కువైతే అసలుకే మోసం!
తెలివైన వారిని, అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ(ఈజీ గోయింగ్) సరదాగా ఉండే వారిని అందరూ ఇష్ట పడతారని,అలాంటి వారినే ప్రేమికులుగా ఎన్నుకుంటారని అంతా భావిస్తుంటారు.అయితే, ఆ భావన సరికాదని తాజా అధ్యయనంలో తేలింది. మరీ ఎక్కువ తెలివితేటలు, టేకిట్ఈజీ మెంటాలిటీ గల వారిని భాగస్వాములుగా చేసుకోవడానికి ప్రేమికులెవరూ ఇష్టపడరని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.తెలివితేటలయినా, దయాగుణమైనా, అందం అయినా ఓ స్థాయి వరకే బాగుంటుందని తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన గిలిస్ గిగ్నాక్ తెలిపారు. సాధారణంగా తెలివితేటలు, సరదాతత్వం, దయాగుణం, అందం కలవాడు భాగస్వామిగా రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటారని పరిశోధన తేల్చిన ఫలితం. వర్సిటీ పరిశోధకులు ఈ నాలుగు అంశాలపై వందల మంది యువతీ యువకుల అభిప్రాయాలను అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. తెలివితేటలు మరీ ఎక్కువగా ఉన్న వారు భాగస్వామిగా ఉంటే తమకు అభద్రతా భావం కలుగుతుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు. ఈజీ గోయింగ్ మెంటాలిటీ ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుందని, వారికెలాంటి ఆశయాలు ఉండవని కూడా అభిప్రాయపడినట్టు గిలిస్ చెప్పారు.తమతో సమానమైన తెలివితేటలున్న వారినే భాగస్వాములుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమయ్యాయి. -
ఎలా మభ్యపెడదాం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంతో టీడీపీ సర్కారు తాత్కాలిక చర్యలతో మరోసారి మభ్యపెట్టేందుకు ఉపక్రమించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోవడంతో ఇప్పటికే తమపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఏమి చేస్తే ప్రజలను మరోసారి మభ్య పెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో నిఘా వర్గాలు ప్రజల నుంచి ఈమేరకు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేలో కూడా టీడీపీ సర్కారు వైఫల్యాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడి కావడంతో ఎక్కువ ఖర్చు కాని తాత్కాలిక పనులు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. నమ్మటం లేదనే నిర్ణయానికి వచ్చిన అధినేత టీడీపీ గత ఎన్నికలకు ముందు చెప్పిన రైతు, డ్వాక్రా రుణాల మాఫీ హామీని నెరవేర్చకపోవడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పడకపోవడం, నిరుద్యోగ భృతి అదిగో.. ఇదిగో అంటూ నాలుగేళ్లుగా కాలయాపన చేయడం లాంటి అనేక వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఇక ఏ మాత్రమూ నమ్మకం లేదన్న అభిప్రాయానికి స్వయంగా ప్రభుత్వాధినేతలే వచ్చా రు. దీంతో గత ఎన్నికలకు ముందు ప్రకటించిన దీర్ఘకాలిక హామీలను నెరవేర్చకుండా ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు తాత్కాలిక ఉపశమ నం కల్పించడం ద్వారా దృష్టి మళ్లించి ఏదో ఒకటి చేశామనే అభిప్రాయం ఏర్పడేలా సర్కారు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ సమస్యలను తీరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై కొద్దిగైనా నమ్మకం కలుగుతుందనే కోణంలో మండలాలవారీగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయిస్తోంది. గత సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు ‘మీ మండలంలో ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి? చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా కట్టాల్సి ఉందా? ఏ పనులు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది?’ తదితర వివరాలను ప్రజల నుంచి ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇంటెలిజెన్స్ జరిపిన సర్వేలో ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో తాజా సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. సమస్యలు పరిష్కరించాలంటూ 1100 టోల్ ఫ్రీ నెంబరుకు కుప్పలు తెప్పలుగా ఫోన్లు రావడం, వాటిని పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే వర్గాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. టీడీపీపై ప్రజలకు నమ్మకం లేదు అధికార టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఏ ఒక్క పనీ కావడం లేదని, కొద్దిపాటి సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినవారికే దక్కుతున్నాయని ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పెద్దగా భారం పడని సమస్యలను గుర్తించి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రజలు చెబుతున్న సమస్యలు ఏమిటి? వాటి ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత? అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తద్వారా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రాజధాని నిర్మాణం లాంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చి తాత్కాలిక చర్యలతో వ్యతిరేకత తగ్గించుకోవాలనే దిశగా టీడీపీ సర్కారు పావులు కదుపుతోంది. రాజకీయాల కోసం అధికార యంత్రాంగం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గతంలో కూడా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. పింఛను వస్తోందా? రేషన్కార్డు ఉందా? బూత్ స్థాయిలో బలమైన నాయకులు ఎవరు? వారిని ప్రభావితం చేసే వారు ఎవరు? లాంటి అంశాలతో సర్వే చేపట్టింది. దీనికోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా రెండు నెలల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇప్పుడు మరోసారి 66 ప్రశ్నలతో రాజకీయ కోణంలో సర్వే చేయడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించడం చర్చనీయాంశమవుతోంది. సర్వేలో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత ‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకూ స్పష్టంగా తెలుసు. తమకు న్యాయం జరగడం లేదని అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో అసంతృప్తి నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చడం, వాల్మీకులకు ఎస్టీ హోదా లాంటి సామాజిక వర్గాల సమస్యలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాజధాని నిర్మాణం తదితర అంశాల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్లే నమ్మకం పెరిగేందుకు ఏం చేయాలన్న దానిపై సర్వే చేస్తున్నాం. ప్రభుత్వంపై వ్యతిరేకత మా సర్వేలో స్పష్టంగా కనపడుతోంది. ఇదే అంశాన్ని నివేదికలో పొందుపరుస్తాం’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇంటెలిజెన్స్ సీఐ వెల్లడించారు. సర్వేలో కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సర్వేను ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహిస్తున్నాయి. మండలానికి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే వివరాలను నియోజకవర్గ స్థాయిలో ఒక ఎస్ఐ ర్యాంకు అధికారి క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్లవారీగా సీఐ స్థాయి అధికారి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం డీఎస్పీ స్థాయి అధికారికి ఈ వివరాలను అందచేస్తున్నారు. జిల్లా నివేదికను ఎస్పీ స్థాయి అధికారి ఇంటెలిజెన్స్ డీఐజీకి సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లోని అధికారి ద్వారా సీఎంకు చేరుతున్నట్లు సమాచారం. -
కశ్మీర్పై ‘కమల’వ్యూహం
జమ్మూకశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఉన్నట్టుండి బీజేపీ ఎందుకు బయటకు వచ్చింది..? కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా కాషాయదళం సాధించేదేమిటి..? వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ‘భవిష్యత్ రాజకీయ నష్టాల’ నివారణలో భాగంగానే జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క కశ్మీర్కే పరిమితం కాకుండా విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకుందని అంచనా వేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలకు జమ్మూకశ్మీర్ అనేది ఓ భావోద్వేగాన్ని రగిలించే అంశంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఈ వర్గాలను కాపాడుకునే చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ అడుగు వేసిందని భావిస్తున్నారు. గవర్నర్ పాలన రూపంలో అంతర్గత భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్లో, పాకిస్తాన్ సరిహద్దువ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మూడేళ్ల పీడీపీ–బీజేపీ పాలనలో కశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు, వాటికి మద్దతు తెలిపే సానుభూతిపరుల పట్ల అనుసరించిన వ్యూహాలకు పూర్తి భిన్నమైన కార్యాచరణను ఇప్పుడు కేంద్రం చేపట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలోనే జమ్మూకశ్మీర్ ఉంటే బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందనేది ఆ పార్టీ అభిప్రాయం. పాలనపై పూర్తి నియంత్రణ.. కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా బీజేపీ ఆ రాష్ట్రంపై పూర్తిపట్టు సాధించింది. అక్కడి పరిస్థితులను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మిలిటెంట్ల కార్యకలాపాలు అణచివేసేందుకు భద్రతాపరంగా కఠిన చర్యలకు గవర్నర్ పాలనను ఉపయోగించుకోనుంది. చొరబాట్లను అడ్డుకునేందుకు సైనిక చర్యలతో పాటు సానుభూతిపరులపై నిఘా పెరుగుతుంది. సైన్యం, ఇతర భద్రతా దళాలు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు గవర్నర్ పాలన ఉపయోగపడుతుంది. వీటికి రాజకీయపరమైన పరిమితులు అడ్డుగా నిలిచే అవకాశముండదు. తీవ్రవాదులు, వారి సానుభూతిపరుల కార్యకలాపాల నియంత్రణకు సైనిక చర్యలకు దిగడం ద్వారా కశ్మీర్లో వేర్పాటువాద శక్తులపై పైచేయి సాధించిన సంకేతాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, జాతీయ భావజాల నినాదాలు ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా రాజకీయ ఫలాలు పొందాలని భావిస్తోంది. ‘కశ్మీర్లో శాంతిస్థాపన’నినాదాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా బీజేపీ మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు భావిస్తున్నారు. పెరగనున్న సైనిక చర్యలు.. నిఘా వర్గాల సమాచారాన్ని ఉపయోగించడంతో పాటు, కశ్మీర్ పోలీసులతో మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా భారత సైన్యం కచ్చితమైన లక్ష్యాలతో కార్యాచరణకు దిగే అవకాశాలున్నాయి. గత మహబూబా ముఫ్తి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నిఘా వర్గాలు తమకు పూర్తి సహకారం అందించలేదన్న అభిప్రాయం సైన్యానికి ఉంది. ఇప్పుడు సైన్యం ఉగ్రవాద అణచివేత కార్యక్రమాలను ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సైనిక చర్యలకు ప్రతిగా హింసాత్మక ఘటనలు కూడా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థలు మిలిటెంట్ రిక్రూట్మెంట్ను విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్లలోనే అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగిన సంవత్సరంగా 2018 మిగలొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లోనే 95 మంది తీవ్రవాదులు హతమయ్యారు. హింసాత్మక ఘటనల కారణంగా 40 మంది భద్రతా సిబ్బంది, 38 మంది పౌరులు మరణించారు. -
కష్టం.. మెదడుకి ఇష్టం
లండన్: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్ బ్రెయిన్ హైపోథిసిస్ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది. -
తెలివిని కొనలేం
డబ్బుతో కొనలేని థింగ్స్ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. ‘ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు’ అన్న ఓ నెటిజన్ కామెంట్కు ఆమె బదులిస్తూ.. ‘‘ఇంటెలిజెన్స్ని డబ్బుతో కొనలేమని ష్యూర్గా చెప్పగలను’’ అన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా టీఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు లావణ్య. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీఎస్. -
టీజేఎస్ ప్రభావమెంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. టీజేఎస్, కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, టీజేఏసీ నుంచి ఉద్యమించిన టీజేఎస్ రాజకీయంగా నిల దొక్కుకుంటుందా, అధికార టీఆర్ఎస్కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించాయి. ఆ సభ నుంచే ప్రారంభం... తెలంగాణ జన సమితి గత నెల 29న హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు పొలిటికల్ అనాలసిస్ జాబితాలో టీజేఎస్ను చేర్చాయి. అన్ని రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం, సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో రూపొందించే ఇంటెలిజెన్స్ వర్గాలు... అందులో భాగంగానే గత నెల చివరి నుంచి నాలుగు రోజుల క్రితం వరకు టీజేఎస్పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ, వివిధ కులాలు, వర్గాల నుంచి అభిప్రాయం సేకరించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఐదు ప్రశ్నలకు అవును, కాదు, ఇప్పుడే చెప్పలేం అన్న సమాధానాల ద్వారా అభిప్రాయాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో భారీ చర్చ...: తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ప్రభావం... సర్వేలో టీజేఎస్కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్ఎస్పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు చర్చ జరుగుతోంది. అయితే పూర్తిస్థాయి పార్టీకి ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్ మేనేజ్మెంట్లో పార్టీ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్ఆర్ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ తన నివేదికలో పొందుపరిచింది. అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీల నుంచి ప్రస్తుతానికి టీజేఎస్లోకి వలసలకు అవకాశం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు అడిగిన ప్రశ్నలివే... టీజేఎస్ పార్టీ గురించి మీకు తెలుసా? కోదండరాం, ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారా? టీజేఎస్ ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనుకుంటున్నారా? టీజేఎస్ పార్టీ చెప్తున్నట్టు సామాజిక న్యాయం ఆపార్టీ ప్రజలకు అందిస్తుందని భావిస్తున్నారా? టీజేఎస్ పార్టీకి రాజకీయ పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కల్గి ఉందని భావిస్తున్నారా? -
‘బొండాగిరి’పై ఇంటెలిజెన్స్ ఆరా..!
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి బొప్పికట్టించిన ‘బొండాగిరి’ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు బొండా వ్యవహారాల చిట్టాను సేకరించినట్టు సమాచారం. నగరంలో సాధారణ వ్యక్తిగా మొదలైన ప్రస్థానం, చిత్తూరు జిల్లాలో అజ్ఞాతవాసం, ఆపై రాజకీయంగా సాగిస్తున్న దందాల వరకు అన్ని వివరాలనూ సేకరించారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ఆయన తనయుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్ రేస్, యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరుల ప్రమేయమున్న పలు వ్యవహరాలపై కూడా ఆరా తీశారు. బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఉన్న సత్యనారాయణపురం సీతారామ కళ్యాణమండపానికి తాళం వేయడం నుంచి మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ప్లాట్ను ఆక్రమించుకోవడం (వైద్యం అందక ఆమె 13 ఏళ్ల కుమార్తె సాయిశ్రీ మృత్యువాత పడడం), విజయవాడ శివారు కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా సోదరుడు పెన్సింగ్ వేసి ఆక్రమించడం, సింగ్నగర్, పాయకాపురం బర్మాకాలనీల్లో ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు, ప్లాట్లు ఆక్రమించడం ఇలా అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే సతీమణి సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి రాంబాబు మరో ఆరుగురు ఉండటం సంచలనం రేపింది. ఈ అన్ని సంఘటనల వివరాలతో ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. బొండా ఉమాపై అనర్హత వేటువేయండి విజయవాడ సిటీ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూకబ్జాలు, దందాలపై చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బొండా అనుచరులు గతంలో సుమశ్రీ అపార్ట్మెంట్ను ఆక్రమించుకోవడం, సెటిల్మెంట్లతో నిస్సహాయులను బెదిరించడం ఇలా ఎన్నో దారుణాలు వెలుగుచూసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. -
టార్గెట్ మేడారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం ‘సమ్మక్క సారక్క’జాతరకు వచ్చే నేతలను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ల్యాండ్మైన్లు బయటపడటంతో అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది, మావోయిస్టులు ఎవరి కోసం ల్యాండ్మైన్లు అమర్చారో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించాయి. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు జరిగే మేడారం జాతర భద్రతను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీలు, అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవల జరిగిన చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల ఎన్కౌంటర్ వ్యవహారంపైనా ఆరా తీసినట్లు సమాచారం. కీలక ప్రాజెక్టులు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించినా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని ఎస్పీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను స్థానిక దళ సభ్యులు బెదిరిస్తున్నారన్న అంశాలపైనా డీజీపీ చర్చించినట్లు సమాచారం. వారికి అదనపు భద్రత: భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. కీలక పదవుల్లో ఉన్న వారితోపాటు స్థానిక అధికార పార్టీ నేతలకూ మరింత భద్రత కల్పించాల్సిన అవసరముందని ఉన్నతాధికారులకు ఎస్పీలు వివరించినట్లు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేతలు పర్యటించడం ఇబ్బంది తెచ్చేలా ఉందని ఎస్పీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. గ్రేహౌండ్స్తో జల్లెడ..! భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి, పసర, ఏటూరునాగారం, ములుగు, వాజేడు, వెంకటాపురం, మహదేవపూర్, కాటారం, మహాముత్తరం ప్రాంతాలపై పోలీస్ శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. 100–150 కి.మీ. దూరంలోని ప్రాంతాలను జల్లెడ పట్టేందుకు గ్రేహౌండ్స్ ప్రత్యేక బృందాలను రంగం లోకి దించనున్నట్లు తెలిసింది. జాతరకు ఎన్ని బలగాలు కావాలి, గతంలో ఎంత మందితో బందోబస్తు నిర్వహించారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది అవసరం తదితరాలను డీజీపీ చర్చించినట్లు సమాచారం. -
మావోల కట్టడికి ఆపరేషన్–2018
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులను నియంత్రించేందుకు ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లు సమష్టిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి. ఈ మేరకు నాలుగు రాష్ట్రాల డీజీపీలతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మంగళవారం కీలక భేటీ నిర్వహించింది. ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల డీజీపీలతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కీలకం రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా.. ఏపీ–ఒడిశాలతో సరిహద్దు, ఛత్తీస్గఢ్లలో విస్తృతంగా ప్రభావం ఉంది. తెలంగాణ, ఏపీల పోలీస్ శాఖలో ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)వ్యూహాత్మక చర్యలు, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్తో మావోయిస్టులను ప్రభావవంతంగా నియం త్రించగలిగారు. అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసు శాఖలు మావోయిస్టులను నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. కేంద్రం భారీ స్థాయిలో సీఆర్పీఎఫ్ బలగాలను దింపుతున్నా.. ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కార్యాచరణ తెరపైకి వచ్చింది. యాక్షన్ ప్లాన్–2018 పేరిట తీసుకునే ఈ చర్యలు, మావోయిస్టు కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని సీఆర్పీఎఫ్ తాజా భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సంయుక్త కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ డీజీపీలను కోరినట్లు తెలిసింది. తెలంగాణ ఎస్ఐబీ ఇచ్చే సమాచారాన్ని ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసు శాఖలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ఆపరేషన్స్లో సూచనలు, సలహాలను పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అగ్ర నేతలు తెలుగువారే కావడంతో.. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం.. ఈ నాలుగు రాష్ట్రాల కమిటీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కూడా ఇక్కడి నాయకులే కావడంతో సమాచారం అందించాలని తెలంగాణ పోలీస్శాఖను సీఆర్పీఎఫ్ కోరింది. ఇక తెలంగాణ ఆవిర్భావం నుంచి స్తబ్దుగా ఉన్న మావోయిస్టు తెలంగాణ కమిటీని పునరుత్తేజితం చేసే కార్యాచరణ రచించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జూలైలో జరిగిన ప్లీనరీలో తెలంగాణ కమిటీని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ.. విస్తృతంగా రిక్రూట్మెంట్ చేపట్టాలని కేంద్ర కమిటీ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎల్డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) నిధులను ఉపయోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సారి నుంచి మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (ఎంఓపీఎఫ్) నిధుల్లో 60 శాతానికిపైగా గోదావరి పరీవాహక జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
జాధవ్ ఆ ‘కీలక’ సమాచారాన్ని చెప్పాడు: పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాధవ్తో తమతో పంచుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘ పాకిస్థాన్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని జాధవ్ మాతో పంచుకుంటున్నాడు’ అని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, జాధవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలుపలేదు. గూఢచర్యం ఆరోపణలపై జాధవ్కు పాక్ ఆర్మీ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. -
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
-
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిం చాయి. కశ్మీర్ లోయలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న బృందాలుగా రైల్లో ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి యత్నించే అవకాశముందన్నాయి. ఈ వివరాలను ప్రధాని భద్రత బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు, యోగి భద్రతా అధికారులకు అందించారు. కాగా, మోదీ, యోగి భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ముంబై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలిపింది. వీరిద్దరిపై దాడుల గురించి మాట్లాడుకుంటుండగా రాయ్గఢ్లో కొందరు విన్నారని, దాడుల కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంది. మోదీపై దాడి చేయడానికి తాను, మరో మిలిటెంట్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఉకాషా అనే లష్కరే ఉగ్రవాది ఓ వ్యక్తితో జరిపిన సంభాషణలో చెప్పినట్లు గతేడాది నిఘా అధికారులు గుర్తించారు. పంచాయతీలది కీలక పాత్ర భారత గ్రామీణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పంచాయతీలు శక్తిమంత మైన మార్గాలని, దేశ పరివర్తనలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ట్వీట్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. -
ఆ ఇద్దరికీ సంబంధం ఉందా..!
- నల్లగొండ జిల్లాకు చెందిన సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసు - ఉద్యోగాలిప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపణ - బాధితుడిని విచారించిన ఇంటెలిజెన్స్ సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తనతో పాటు ఎనిమిది మందికి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ గత గురువారం సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సీఎం పేషీలో ఉండే అజిత్రెడ్డి, గంగాధర్తోపాటు హాలియా మండలానికి చెందిన కృష్ణారెడ్డిలు తనను మోసం చేసినందునే ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగిందన్న దానిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ముఖ్యమంత్రి పేషీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం రాత్రి బాధితుడు సతీశ్రెడ్డిని అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అరగంటకు పైగా విచారించారు. ఈ కేసులో సీఎం పేషీకి చెందిన అజిత్రెడ్డి, గంగాధర్ల ప్రమేయం ఉందా? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అనే కోణాల్లో బాధితుడు సతీశ్రెడ్డిని ప్రశ్నించారు. జరిగిన విషయాన్నంతటినీ వివరించిన అనంతరం కొన్ని ఫొటోలను చూపించి అజిత్రెడ్డి, గంగాధర్ను గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగారని, తాను ఇద్దరినీ గుర్తుపట్టి చూపించానని సతీశ్రెడ్డి చెబుతుండట గమనార్హం. ఈ కేసులో అజిత్రెడ్డి, గంగాధర్ను తప్పించేందుకు పోలీసు లపై ఒత్తిడి తెస్తున్నారని సతీశ్రెడ్డి ఆరోపిస్తున్నాడు. మంగళవారం అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కేసులో కృష్ణారెడ్డిని మాత్రమే బాధ్యులను చేసే దిశలో పోలీసులు వెళుతున్నట్లు తనకు అనుమానం వస్తోందన్నారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పోలీసుల అదుపులో కృష్ణారెడ్డి? ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలియా మండలానికి చెందిన పల్రెడ్డి కృష్ణారెడ్డిని సోమవారం రాత్రి నల్లగొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసేందుకు ముందు రోజు డబ్బులు తీసుకున్న కృష్ణారెడ్డిని బాధితుడు సతీశ్రెడ్డి కలిశాడని, అప్పుడు కృష్ణారెడ్డి కూడా సతీశ్రెడ్డితో తన గోడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. తనను గంగాధర్ మోసం చేశాడని, ఈ విషయాన్ని అజిత్ దృష్టికి తీసుకెళితే అలా చేయడానికి వీల్లేదు.. కూర్చోబెట్టి మాట్లాడుదాం.. విషయాన్ని పెద్దది చేయకండి అని సర్ది చెప్పాడని కృష్ణారెడ్డి సతీశ్రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. కాగా, నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయ ఉద్యోగితో పాటు హైదరాబాద్కు చెందిన ప్రసాద్రెడ్డి, హైదరాబాద్కే చెందిన మరో భార్యాభర్తల నుంచి.. ఇలా చాలా మంది వద్ద నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడని కృష్ణారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. -
ఐసిస్.. అన్నంత పనీ చేస్తోందా?
తాజ్మహల్ను టార్గెట్గా చేసుకుని భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్.. (ఐసిస్) అన్నంత పని చేసేందుకు సిద్ధమవుతోందా? ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సంభవించిన జంటపేలుళ్లను చూస్తే అలాగే అనిపిస్తోంది. తాజ్మహల్కు దగ్గరలోనే ఉన్న ఈ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక చెత్తకుండీ దగ్గర మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో ఇంటి వద్ద ఇంకో బాంబు పేలింది. రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. అయితే.. అదృష్టవశాత్తు బాంబులు అంత శక్తిమంతమైనవి కాకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమీ సంభవించలేదు. అయితే.. తమ ఉనికిని చాటుకోడానికి, లేదా తాజ్మహల్ సమీపంలోనికి కూడా తాము ప్రవేశించగలమని చెప్పడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు పోలీసు వర్గాలకు వస్తున్నాయి. భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి ఇటీవలే హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్మహల్ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్ను టెలిగ్రాం యాప్లో పోస్ట్ చేశారు. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్లో ఉంది. అలాగే దీనికి ఇన్సెట్లో వాడిన మరో బొమ్మలో తాజ్మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. దానికి తగ్గట్లుగానే ఆగ్రా నగరంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో ఇప్పుడు అంతా అప్రమత్తం అవుతున్నారు. నిఘా వర్గాలు ఐసిస్ హెచ్చరికలను మధ్యలోనే ట్రాక్ చేసి, వాటి విషయాన్ని బయటపెట్టినా కూడా నగరంలో భద్రత అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఆగ్రా లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల ఏమైనా జరగరానిది జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో పాటు విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. -
ట్రంప్పై మళ్లీ దుమారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచార కర్తలు, సలహాదారులు తరచుగా రష్యా ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సంప్రతింపులు జరిపినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెల్సింది. ఇరువర్గాల మధ్య జరిగిన సంభాషణలను మధ్యలో ట్రేస్ చేశామని, అయితే ఆ సంభాషణల తీవ్రత ఎంతుందో తెలసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేరు బహిర్గతం చేయడం ఇష్టంలేని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ పాల్ మనఫోర్ట్, భద్రతా సలహాదారు మైఖేల్ ఫిన్తో కూడా రష్యా ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు తరచు సంప్రతింపులు జరిపినట్లు తేలిందని, ఈ విషయమై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఓ రష్యా రాయబారితో జరిపిన చర్చల గురించి తనకు తెలియజేయలేదన్న కారణంగా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫిన్ను ట్రంప్ ఇటీవల తొలగించారు. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్గం కషి చేసిందని, అందుకే కృతజ్ఞతగా పుతిన్ పట్ల ట్రంప్ మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ సలహాదారులకు, రష్యా అధికారులకు మధ్య తరచుగా సంప్రతింపులు జరిగాయన్న అంశానికి ప్రాధాన్యత చేకూరింది. అయితే ఈ తాజా ఆరోపణలను ట్రంప్ బుధవారం నాడు ట్విట్టర్లో ఖండించారు. రష్యా అధికారులతో తన సలహాదారులెవరికి సన్నిహిత సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో ఓడిపోవడానికి సాకుగా ఇలాంటి ఆరోపణలను ఆశ్రయిస్తారని ట్రంప్ ఆరోపించారు. ఇదే విషయమై మైఖేల్ ఫిన్ను మీడియా సంప్రతించగా, ఈ ఆరోపణలు అభూత కల్పనలని కొట్టి వేశారు. తనకు సంబంధించినంత వరకు రష్యా అధికారులతో ఎలాంటి సంప్రతింపులు జరపలేదని ఆయన అన్నారు. -
నేరేడ్మెట్లో మేధా హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం
-
మిలాఖత్
లడ్డూ దందాలో ఇంటిదొంగలే కీలకం దళారులతో చేతులు కలిపిన నిఘా, కౌంటర్ సిబ్బంది, ట్రేలిఫ్టర్స్ సీసీ కెమెరాల పనితీరుపైనా అనుమానాలు తిరుమల : కొండ లడ్డూ అక్రమదందాలో కంచే చేనుమేస్తోందా.. నిఘా సిబ్బందే దళారులతో చేతులు కలిపారా..? కౌంటర్ సిబ్బంది.. ట్రే లిఫ్టర్స్ చేతుల మీదుగానే లడ్డూలు పక్కదారి పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. చీమచిటుక్కుమన్నా పసిగట్టి గుట్టువిప్పాల్సిన సీసీ కెమెరాలూ ఈ అక్రమ దందాను చిత్రీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిఘా సిబ్బందే బేరసారాలు దళారులతో నిఘా సిబ్బంది మిలాఖతై భక్తులతో బేరసారాలు సాగిస్తున్నారు. కొందరు దళారుల్ని అసిస్టెంట్లుగా నియమించుకుని ఈ అక్రమ వ్యాపారంలో తలమునకలైపోయారు. కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తుడికి ఇచ్చే ఒక ఉచిత లడ్డూ టోకెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తుల్లో ఒకరికి ఇచ్చే రూ.10 చొప్పున రెండు సబ్సిడీ టోకెన్లతోనే ఈ అక్రమ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం సినిమాల్లో మాదిరిగానే సినిమాల్లో డాన్ను కలిసే తరహాలోనే తిరుమలకొండ మీద లడ్డూల అక్రమ వ్యాపారం సాగుతోంది. దళారులు పక్కా స్కెచ్తో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఓ దళారి భక్తుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మరో దళారి కౌంటర్ నుంచి లడ్డూలు తీసుకొస్తాడు. ఇంకోదళారి ఆ భక్తుడికి లడ్డూలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. వీరికి టీటీడీ నిఘా సిబ్బంది, కౌంటర్ సూపర్వైజర్, ట్రే లిఫ్టర్లు వారివారి స్థాయిలో సహకారం అందిస్తారు. చివరగా వచ్చిన ఆ డబ్బులు అందరూ పంచుకుంటారు. మూడో కంటికి తెలియకుండా.. లడ్డూ కౌంటర్ల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సాక్షిగానే లడ్డూల అక్రమ విక్రయాలు సాగుతున్నాయి. ఈ దృశ్యాలు వాటికి కనిపించటం లేదు. దళారుల కదిలికల్ని పసిగట్టడంలేదు. సీసీ కెమెరా అపరేట్చేసే సిబ్బందీ వీటిని రికార్డు చేయడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్రమ దందాలో పాత్రదారులెందరో? భక్తులకు కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్లు ఇచ్చే బాధ్యతల్ని ఓ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ సంస్థలో పనిచేసే కొందరు సిబ్బంది ఈ అక్రమ దందాలో ప్రధాన పాత్రధారులు. టోకెన్లను దొడ్డిదారిలో తరలిస్తూ లక్షలాది రూపాయలు టీటీడీకి నష్టం కలిగిస్తున్నారు. వీరితో కొందరు విజిలెన్స్, టీటీడీ సిబ్బంది కలసిపోయి అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల చిట్టా కొందరు విజిలెన్స్ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
మేధాశక్తి ఎవరబ్బ సొమ్ము కాదు
– పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ రామాంజనేయులు కర్నూలు(అర్బన్): మేధాశక్తి ఎవరబ్బ సొమ్ము కాదని అగ్రవర్ణాలకు దీటుగా దళితులు సంఘటితంగా అన్ని రంగాల్లో ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.ప్రవీణ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ దళితులు ఆస్తులు లేనివారే కానీ ఆత్మగౌరవం లేనివారు కాదని చెప్పారు. దళితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుస్తూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యతతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని దళిత వర్గాలను అభివృద్ధి దిశగా పయనిస్తున్న దళిత అధికారులు చేయూతనందించాలని కోరారు. రాజ్యాధికారం ద్వారానే దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, పదవుల కోసం ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలన్నారు. దళితుడిగా పుట్టినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ 30 మందితో ఏర్పాటైన అసోసియేషన్ నేడు అందరి సహకారం వల్ల 300 మందితో కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, సీపీఓ ఆనంద్నాయక్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి, డీఎస్పీలు వినోద్కుమార్, మురళీధర్, వెంకటరత్నం, హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ పాండురంగయ్య, పంచాయతీరాజ్ ఈఈ సురేంద్రనాథ్, ఇరిగేషన్ ఏఈ ప్రసాదరావు, ఆర్యూ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్, డైరీ కమిటీ చైర్మన్ శివకుమార్, అసోసియేషన్ ప్రతినిధులు రాజశేఖర్, సునీల్కుమార్, అర్జున్నాయక్, తహసీల్దార్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల వాడకంపై సర్కారు ఆరా
♦ బడ్జెట్ అంచనాలు, గత బడ్జెట్ సవరణల సమర్పణకు ఆదేశం ♦ నిధుల మంజూరు, చేసిన ఖర్చు వివరాలివ్వాలని సర్క్యులర్ జారీ ♦ బడ్జెట్ కసరత్తుపై మంత్రివర్గ భేటీలోగా సమర్పించాలని ఆదేశం ♦ నిధుల దుర్వినియోగంపై సీఎంవో అంతర్గత సర్వే ♦ 24 ప్రభుత్వ శాఖల పనితీరుపై ఇంటలిజెన్స్ నివేదికకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. రానున్న బడ్జెట్ అంచనాలతోపాటు గత బడ్జెట్ సవరణ ప్రతిపాదనలను సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించింది. 2016–17 బడ్జెట్లో కేటాయించిన, మంజూరైన నిధులు, ఖర్చు, చేపట్టిన పనులు, మరిన్ని నిధుల అవస రం వివరాలను పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సరŠుక్యలర్ జారీ చేసింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలోగా వివరాలను సమర్పించాల్సి ఉందని, అందుకే సమగ్ర ప్రతి పాదనలు పంపించాలని అప్రమత్తం చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వివిధ శాఖల ఆదాయ వ్యయాలపై ఏ మేరకు ప్రభావం చూపిందనే వివరాలను విడిగా నివేదిక రూపం లో ఇవ్వాలని కోరింది. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, దుర్వినియోగం ఫిర్యాదులపై సీఎం కార్యాలయం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ప్రతి పైసాకూ లెక్కుందా? వివిధ శాఖల్లో నిధుల వినియోగం జరిగిన తీరుపై రాష్ట్ర ఇంటలిజెన్స్ నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదికను సీఎం కేసీఆర్ కోరినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ముఖ్యంగా 24 ప్రభుత్వ ప్రధాన విభాగా ల్లో నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఇంటలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా సర్వే చేయించి నివేదిక రూపొందించే పని మొదలైంది. రెండు విభాగాల ఆధ్వర్యంలో మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి కేటాయించిన నిధులు, ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులు, వాటిలో ఎంత ఖర్చు చేశారన్న అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించారు. ఖర్చు చేసిన నిధులతో ఎంత మేరకు పనులు, కార్యక్రమాలు జరిగాయనే కోణంలో మరో నమూనా తయారుచేశారు. నిధులుండి కూడా పనులు ప్రారంభం కాకున్నా, పనులు ప్రారంభమై నిధులు దుర్వినియోగం జరిగిన ఆరోపణలుంటే నివేదించేందుకు వీలుగా మూడో ప్రొఫార్మా రూపొందించారు. ఈ మూడు కోణాల్లో సర్వే చేసేందుకు ఇంటలి జెన్స్, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగ నుండటంతో ఈ బృందాలు తమ సర్వేను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మూడు దశలుగా సర్వే... మొదటగా విద్యుత్, గృహ నిర్మాణం, ఆరోగ్య, విద్యా శాఖలపై దృష్టి సారించాలని అధికారులు సర్వే బృందాలను ఆదేశించారు. రెండో దశలో సంక్షేమ, వ్యవసాయం, నీటిపారుదల శాఖల అంశాలు, తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. మిగిలిన విభాగాలను చివరగా సర్వే చేయించి 10–15 రోజుల్లో సీఎం కేసీఆర్కు అందించాలని నిర్ణయించారు. ఈ నివేదిక ఆధారంగా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలను సీఎం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి విభాగంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పనితీరును సైతం నివేదిక ద్వారా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
కొరియర్ పార్శిళ్లపై డేగ కన్ను
► హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి వెళ్తున్న భారీ ప్యాకింగ్స్ ►పాత నోట్లుగా అనుమానిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు ► రెండు సంస్థల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: రద్దయిన నోట్ల మార్పిడి నగరంలో కష్టసాధ్యం కావడంతో నగదు బయటి ప్రాంతాలకు తరలిపోతోందా..? దీనికి కొన్ని కొరియర్ సంస్థలు పరోక్షంగా సహకరిస్తున్నాయా..? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ నేపథ్యంలో ప్రధానంగా రెండు సంస్థల కార్యకలాపాలపై డేగకన్ను వేసినట్లు తెలిసింది. వీటితో పాటు ఇతర సంస్థల నుంచి ఉత్తరాదికి వెళ్లే పెద్ద ప్యాకింగ్లపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. పెరిగిన నిఘా.. కేసులు... పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలీసులతో పాటు ఐటీ, సీబీఐ తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మార్పిడి ముఠాలు చిక్కడంతో పాటు లెక్కలు లేని నగదు సైతం స్వాధీనమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరంలో ఈ ‘మార్పిడి’ సాధ్యం కాకపోవడంతో నల్ల కుబేరులు ఉత్తరాదికి చెందిన ముఠాలను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ‘రోడ్డు’ ద్వారా తరలించడం కుదరక... నోట్ల రద్దు ప్రకటించిన తొలి రోజుల్లో ఎస్కార్ట్ హుండీ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఈ దందాలో సిటీ నుంచి పాత నోట్లు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు అధికారులు అనుమానించారు. ఈ విధానంలో ఉత్తరాదిలో ఉన్న ఏజెంట్లు వివరాలు కేవలం నగదును పంపే వ్యాపారస్తులకు తెలుస్తుండేవి. వీరు ఓ కారు/ తేలికపాటి వాహనంలో పాత నోట్లును నేర్పుగా పేర్చి, ఈ కారును నమ్మకమైన వ్యక్తికి అప్పగించి ఉత్తరాదిలో చేర్పించారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై దృష్టిపెట్టి దాడులు చేసేలోపే ఈ దందాకు బ్రేక్ పడింది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల సరిహద్దులు, ఇతర రాష్ట్రాల్లోనూ రహదారులపై తనిఖీలు పెరగడంతో ఈ దందాను వదిలేసినట్లు తెలిసింది. ప్రత్యేక నిఘా... నిబంధనల ప్రకారం నగదును కొరియర్ ద్వారా పంపే ఆస్కారం లేదు. అయితే కొన్ని సంస్థల నిర్వాహకుల సహకారంతో నల్లబాబులు ఈ దందా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల రెండో విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇది మరింత జోరందుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలిసింది. ప్రధానంగా రెండు కొరియర్ సంస్థలు ఈ దందాకు సహకరిస్తున్నాయనే అనుమానంతో వాటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏం చేస్తారో అంతు చిక్కట్లేదు..! నగరం నుంచి రోజూ భారీగా కొరియర్ పార్శిల్స్ ద్వారా నగదు ఎక్కడికి వెళ్తోంది? అక్కడ వ్యవస్థీకృత ముఠాల ద్వారా మార్పిడికి పాల్పడుతున్నారా? ఆదాయం చూపే ఆస్కారం ఉన్న బినామీల ద్వారా డిపాజిట్లు చేయిస్తున్నారా? అనే అంశాలపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమానిత లావాదేవీలు, కార్యకలాపాలకు సంబంధించి జాబితా సిద్ధం చేసుకున్న అధికారులు త్వరలో దాడులు చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
నిషేధిత విక్రయాలపై నిఘా
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ భెంసా: నిషేధిత విక్రయాలపై పకడ్బందీగా నిఘా సారిద్దామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. శనివారం భైంసా డీఎస్పీ కార్యాలయంలో పట్టణవాసులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేదిత గుట్కా లు, అక్రమమధ్యం, మట్కా, జూదంలాంటి సమాచారం తెలిస్తే నేరుగా తనకు అందించవచ్చన్నారు. ప్ర భుత్వం నిషేదించిన వాటిని విక్రయించరాదని సూ చించారు. పట్టణ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిద్దామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామని, ఇం దుకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పన్ను లు చెల్లించకుండా దొడ్డిదారిన అక్రమంగా వెళ్లే వాహనాలపై ప్రజలు నిఘా ఉంచాలని, అట్టిసమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలి యజేయాలని కోరారు. ప్రతీ ఒక్కరు మొక్కలు సంరక్షించాలి నిర్మల్ అర్బన్: ప్రతీ ఒక్కరు మొక్కలను సంరక్షించాలని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని సా యుధ దళ కార్యాలయంలో శుక్రవారం ఆయన యూ నిట్ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యాల యూన్ని సందర్శించారు. పోలీసులకు విశ్రాంతి కోసం బ్యారక్ను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో జనరేటర్, ఇన్వర్టర్ను ఏర్పా టు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క లు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్ఐ సాయినాథ్, ఎంటీవో కృష్ణ, ఆర్ఎస్సైలు వినోద్, శ్రీకాంత్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నోట్లరద్దుతో పాక్ ఐఎస్ఐ కొత్త కుయుక్తులు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తనవద్ద పెద్దమొత్తంలో ఉన్న భారత కరెన్సీని మార్చుకోవడానికి తెరచాటు యత్నాలకు దిగుతున్నట్టు సమాచారం. తన వద్ద ఉన్న పాత కరెన్సీని ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున మార్చుకునేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో దేశంలోని బ్యాంకులన్నింటినీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో డిపాజిట్ అయ్యే నగదు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోకి పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని తరలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఐఎస్ఐ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
భారీగా బలగాలను మోహరించిన పాక్
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల అనంతరం అసలు దాడులే జరగలేదంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దూకుడు పెంచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. దీంతోపాటు అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించినట్లు గుర్తించామని భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. దీనికి ప్రతిగా భారత్ కూడా ఎల్ఓసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించిందని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. మరోసారి ఇండియన్ ఆర్మీ పాక్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్న నేపథ్యంలో పాక్ సైనిక బలగాల మోహరింపు చేపడుతుందని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రతీకార చర్యకు పాల్పడాలన్న ఉద్దేశంతో ఉన్న పాక్.. అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేకత దృష్ట్యా నేరుగా సైన్యం ద్వారా కాకుండా ఉగ్రవాదుల రూపంలో ఫిదాయిన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. సర్జికల్ దాడుల అనంతరం పాకిస్తాన్ లష్కర్-ఏ-తాయిబా, జైషే మహ్మద్ టెర్రర్ క్యాంపులను పీఓకే నుంచి తరలించినట్లు సమాచారం. -
వందలమంది ఉగ్రవాదులను పంపిస్తున్నారా?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని ఊడి సెక్టార్ పై దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు మూడు రోజులు ముందుగానే హెచ్చరించాయట. గత ఆగస్టు 28 నుంచే ఉగ్రవాదులు ఊడి స్థావరంపై దాడులు ఎలా చేయాలనే అంశాన్ని ఆచరణలో పెట్టాయని, ప్రతి రోజు ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని వారు దూరం నుంచి వీక్షించి అనుకున్న ప్రకారం దాడి చేశారని ఢిల్లీకి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. ఎనిమిదిమంది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్థాన్ భారత్ మధ్య వాస్తవాదీన రేఖ వద్ద ఎప్పుడు ఊడిపై దాడి చేద్దామా అని ఎదురుచూస్తున్నారని సరిహద్దులోని బలగాలకు సెప్టెంబర్ 15న సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎనిమిదిమంది ఉగ్రవాదులు ఇతర ఉగ్రవాదులు ఊడిలోని ఓ కొండప్రాంతంలో దాచుకొని ఆగస్టు 28 నుంచి రహస్యంగా ఊడి స్థావరాన్ని పరిశీలించారని, దీనిని గుర్తించి తాము సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నిర్లక్ష్యం చేయడంతోపాటు ఆ సమయంలో జమ్ముకశ్మీర్ లో విధించిన హైఅలర్ట్ పైనే ఎక్కువగా సైన్యం దృష్టిసారించడం కూడా ఉగ్రవాదులు చొచ్చుకురావడానికి ఇందుకు మరో కారణంగా నిలిచిందట. మరోపక్క, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల తర్వాత వందల సంఖ్యలో ఉగ్రవాదులను సరిహద్దు దాటించి భారత్ లోకి పంపించే కుట్రలు కూడా పాక్ చేస్తోందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయట. భద్రతా లోపం వల్లే ఉగ్రవాదులు చొచ్చుకొచ్చారన్నట్లుగా ఇప్పటికే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. -
‘మీ సేవ’లో సంస్కరణలు
∙వినియోగదారులకు సేవలు వేగవంతం ∙పారదర్శకత పెంపునకు చర్యలు కాజీపేట : మీ సేవ కేంద్రాల్లో సంస్కరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విని యోగదారులకు ఇకపై సేవలు వేగవంతం చేసేలా ప్రక్షాళన ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ వేడుకల నుంచే సంస్కరణ చర్యలు అమల్లోకి వచ్చినట్లు ఆయా కేంద్రాలకు, సం బంధిత అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో టీఎస్ ఆన్లైన్ కేంద్రాలు, సీఎస్సీ, ఈసేవ కేంద్రాలు అన్ని కలిపి సుమారు 600 సెంటర్లు.. 36 విభాగాలకు చెందిన 322 సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈసేవ కేంద్రాలు ప్రతి లావాదేవీకి రూ.5 నుం చి 10 వరకు ప్రభుత్వం నుంచి కమీషన్ పొం దుతున్నాయి. కమీషన్లు సకాలంలోనే అందుతున్నా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో కేంద్రాల్లో లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈఎస్డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) పర్యవేక్షణ కిందకు తీసుకొచ్చింది. దీంతో ఈఎస్డీ నిరంతర పర్యవేక్షణ సాగించి ఈసేవ కేంద్రాల పనితీరును గాడిన పెట్టనుంది. టీఎస్టీఎస్కు బాధ్యతలు... జిల్లాలో మీసేవ కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం అమలు చేయనుంది. అన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలను సైతం ఏర్పాటు చేయనుంది. ఇలా హైదరాబాద్ నుం చే అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెస్తున్న సాంకేతిక వ్యవస్థతో కేంద్రాల పనితీరు మెరుగుపర్చి వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా కృషిచేస్తున్నారు. మీసేవలో మధ్యవర్తులుగా కొనసాగుతున్న ఏజెన్సీల స్థానంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్)కు బాధ్యతలు కట్టబెట్టింది. నిర్వాహకుల వేతనాల పెంపు... మీసేవా కేంద్రాల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల నిర్వహణ నిబంధనలను కఠినతరం చేసింది. మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్ల జీతాలను ప్రభుత్వం 50 శాతం పెంచింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరి వేతనాలు రూ.10 వేలకు పెరగవచ్చు. ఇవి కూడా ఏజెన్సీలకు కాకుండా నేరుగా ఆపరేటర్ల ఖాతాల్లో జమ అవుతాయి. ఇకపై మీసేవా కేంద్రాల్లో టోకెన్ పద్ధతి పెట్టి 15 నిమిషాల్లో లావాదేవీలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. -
నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు
గ్రామ రహదారిపై సీసీ కెమెరాలు కొడకండ్ల : నేరాల అదుపు కోసం మండలకేంద్రంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు రక్షణ, భద్రత లక్ష్యంగా స్థానిక ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యం తో.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు గల రోడ్డులో ప్రధాన కూడళ్లలో దాదాపు రూ.లక్ష రూపాయల విరాళాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతనమైన 8 సీసీ కెమెరాలను విద్యుత్ స్తంభాలకు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క కెమెరా 100 మీటర్ల వరకు చిత్రీకరించే సామర్ధ్యం కలిగిన ఈ కెమెరాల ద్వారా నేరాలు, చోరీలు జరిగినపుడు నిందితులను సులభంగా గుర్తించడమే కాకుండా అజాగ్రత్తగా వాహనాలు నడపడం, చిల్లర తగాదాలు వంటి నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాలన్నింటికీ అనుసంధానంగా ప్రత్యేకంగా పోలీసు కమాండ్ కంట్రోల్రూంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేరాల నియంత్రణతో పాటు మండలకేంద్ర ప్రజలు రక్షణ, భద్రతే లక్ష్యంగా పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లను ఎంపిక చేసి ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల బిగింపు పనులు పూర్తవగానే వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాతల సహకారం అభినందనీయం ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. తాము పిలుపునిచ్చిన వెంటనే వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి సహకరించి విరాళాలు అందించడం అభినందనీయం. నిఘానేత్రాల నిఘాతో శాంతి భద్రతల పరిరక్షణ సులభమవుతుంది. - ఎస్సై ఎంబాడి సత్యనారాయణ -
రంజాన్కు భారీ బందోబస్తు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల దృష్టి కీలక ప్రాంతాల్లో డేగకంటి నిఘా గురు, శుక్రవారాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సిటీబ్యూరో:రంజాన్ పండుగ సందర్భంగా గురు, శుక్రవారాల్లో జరుగనున్న సామూహిక ప్రార్థనలకు నగర, సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చార్మినార్లోని మక్కామసీద్, మీరాలమ్ ఈద్గా, సికిం ద్రాబాద్లోని జామే మసీద్తో పాటు జంట కమిషనరే ట్ల పరిధిలోని అనేక ప్రార్థన స్థలాల వద్ద డేగకన్ను నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఐసిస్ ఉగ్ర కుట్రల నేపథ్యంలో సున్నిత, అనుమానాస్పద ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా ప్రార్థనా స్థలాల వద్ద 24 గంటలూ సోదాలు చేస్తూ ముస్లిం సోదరులకు భద్రతపై పూర్తి భరోసా ఇచ్చారు. కమిషనరేట్లలోని సిబ్బం ది, అదనపు బలగాలు కలిపి మొత్తమ్మీద 12 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. జంట కమిషరేట్ల పరిధిలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మఫ్టీ పోలీసుల నిఘాతో పాటు నగర భద్రతా విభాగాల ఆధీనంలో బాంబు నిర్వీర్య బృందాలు కూడా పనిచేయనున్నాయి. హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీ స్థాయి అధికారులు వరకూ బందోబస్తులో భాగస్వామ్యులవుతున్నారు. నగర కమిషనర్ మహేందర్రెడ్డి, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ నవీన్ చం ద్, ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత్ రంజాన్ బందోబస్తును పర్యవేక్షించనున్నారు. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు... రంజాన్ సందర్భంగా మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఉదయం ఎనిమిది నుంచి 11.30 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. పండుగ సందర్భాల్లోనే కాకుండా ఎల్లవేళలా అందరూ మత సామరస్యంతో కలిసి మెలిసి ఉండా లి. ముస్లిం సోదరులందరికీ మా రంజాన్ శుభాకాంక్షలు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీ సమీప ఠాణాలకు, కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారమివ్వండి. -మహేందర్రెడ్డి, మహేశ్ భగవత్, నవీన్చంద్ (పోలీసు కమిషనర్లు) -
భ (ర)క్షక భటులపై ‘నిఘా’
పోలీసు శాఖలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఎస్పీ వ్యూహం ♦ సివిల్తో పాటు, ఏఆర్ విభాగంలోనూ ప్రక్షాళన ♦ తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ కడప అర్బన్: జిల్లాలో పోలీసు యంత్రాంగంపై ‘పోలీస్ బాస్’ నిఘా పెంచారు. సమాజాన్ని సంరక్షించాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడుతూ, ప్రజల సొమ్మును అప్పనంగా కాజేస్తూ , కేసులను తమ స్వార్థం కోసం ఎలాగైనా తారుమారు చేసేవారి తాట తీసేందుకు చర్యలు మొదలయ్యాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి పీహెచ్డీ రామకృష్ణ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూనే, మరోవైపు అవినీతి పోలీసుల భరతం పడుతున్నారు. ⇒ కేసుల నమోదు వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించినందుకు ఏకంగా ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలకు ఛార్జ్మెమోలను జారీ చేశారు. ⇒ ఎర్రచందనం వ్యవహారాల్లో సంబంధాలున్నాయనే ఆరోపణలు తన దృష్టికి రావడంతో దువ్వూరు ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వీఆర్కు రప్పించారు. ⇒ జిల్లా పోలీసు కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంలో రాత్రి వేళ స్వయంగా ఆయన పర్యవేక్షించి వెంటనే ఐదుగురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు. ⇒ ఏఆర్ విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఐగా వ్యవహరిస్తున్న అధికారి, మరో ఆర్ఐ సిబ్బందిని వేధించడంతోపాటు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వారిలో ఒకరిని వెంటనే హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగానికి, మరొకరిని అనంతపురానికి బదిలీ చేశారు. ⇒ జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ప్రధాన కీలక విభాగం ఎంటీఓ (మోటార్ ట్రాన్స్ పోర్టు). ఈ విభాగానికి చెందిన అధికారి దాదాపు లక్షల్లో అవినీతికి పాల్పడ్డారని, అతనికి మరో అధికారి అండదండలు ఉండటంతోనే అప్పనంగా దోచుకున్నారని తెలియడంతో సదరు అధికారిని హెచ్చరించారు. తనపై ఎక్కడ వేటు పడుతుందోనని ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అవినీతికి పాల్పడిన అధికారి స్థానంలో మరో ఆర్ఎస్ఐని నియమించినట్లు తెలిసింది. ⇒ఎంటీఓ సెక్షన్లో దాదాపు రూ. 80 లక్షల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరో ఉన్నతాధికారితో ‘పోలీస్ బాస్’ సమగ్రంగా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ⇒ తాజాగా జిల్లాలో ముగ్గురు కానిస్టేబుళ్లను వివిధ కారణాలతో సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు ఏఆర్ విభాగానికి చెందిన వారు కాగా, మరొకరు సివిల్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ⇒ సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తప్పవని అంటున్నారు. ⇒ఇటీవల సంబేపల్లె ఎస్ఐ పోలీస్ స్టేషన్కు వచ్చే కేసుల నమోదు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంగా వీఆర్కు రప్పించినట్లు సమాచారం. ⇒ కడప నగరంలో ఏకంగా ఓ ప్రధాన స్టేషన్ సీఐని, మరో స్టేషన్ ఎస్ఐని ఎర్రచందనం టాస్క్ఫోర్స్లో విధులు నిర్వహించాలని మూడు వారాల నుంచి అటాచ్డ్ విధులకు ఆదేశించినట్లు తెలిసింది. ⇒ జిల్లాలో ఇప్పటికే మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్లతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న పోలీ సు అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేసి సమగ్ర విచారణ అనంతరం వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. జిల్లాలోని ఆరు సబ్ డివిజన్ల పరిధిలో లోతుగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ముగ్గురిని వివిధ కారణాలతో సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వీరిలో ⇒ సంబేపల్లె పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న టి. రాజగోపాల్ (పిసి. 1701) కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 18న జూదమాడుతూ పట్టుబడినట్లు సమాచారం. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. ⇒ గాలివీడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ డ్రైవర్గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పెంచలయ్య (ఏఆర్ పిసి: 2217) గత నెల 21న నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా అతన్ని సస్పెండ్ చేశారు. ⇒ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పి. నిత్యేశ్వరయ్య (ఏఆర్ పిసి: 689) రాయచోటిలో గత నెల 20న ఓ లాడ్జిలో వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడటంతో అతన్ని సస్పెండ్ చేశారు. -
మహానాడుకు చేరిన టీడీపీ కుమ్ములాటలు
► మేయర్, అసమ్మతి గ్రూపులు వేర్వేరుగా శిబిరాలు ► టీడీపీలో కలకలం రేపిన ‘సాక్షి’ కథనం ► ఇంటెలిజెన్స్ ఆరా ► ‘వీళ్లు మారరంతే..’ అంటూ చంద్రబాబు సీరియస్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీ కుమ్ములాటల పంచాయితీ మహానాడుకు చేరింది. మేయర్, అసమ్మతి వర్గాలు వేర్వేరుగా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. అసమ్మతి వర్గం నేతలు గురువారం బయలుదేరి తిరుపతి వెళ్లారు. మహానాడు తరువాత తాడోపేడో తేల్చేద్దామని అసమ్మతి వర్గం జబ్బలు చరుస్తోంది. ఇప్పటి వరకు 23 మంది కార్పొరేటర్ల సంతకాలను సేకరించిన అసమ్మతి వర్గం గడిచిన రెండు రోజులుగా తన బలాన్ని పెంచుకోలేకపోయింది. నెలకు రెండు లక్షల మామూళ్ల ప్లాన్ ఆశించినస్థాయిలో విజయవంతం కాకపోవడంతో నేతలు కంగుతింటున్నారు. ఇదే అదనుగా భావించిన మేయర్ గ్రూపు అసమ్మతిని చీల్చేందుకు ఎత్తులు వేస్తోంది. ఐదుగురు కార్పొరేటర్లతో మేయర్ కోనేరు శ్రీధర్ స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు భోగట్టా. తాము తొందరపడ్డామని, ఇకపై తప్పు చేయబోమని వారు స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో తమ వర్గం కార్పొరేటర్ల చేజారిపోకుండా ఉండేందుకు మహానాడులో ప్రత్యేకంగా హోటల్ గదులను అసమ్మతి వర్గం నాయకులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మేయర్ గ్రూపునకు సంబంధించి వ్యవహారాలను ఫ్లోర్లీడర్ జి.హరిబాబు చూసుకుంటున్నట్లు వినికిడి. ఒక్క చాన్స్ ఇచ్చినా చాలు.. అసమ్మతి గ్రూపు నుంచి ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ, పి.త్రిమూర్తిరాజు మేయర్ చైర్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఏడాదికి ఒకరికి చొప్పున మేయర్గా అవకాశం ఇచ్చినా చాలు అనే ప్రతిపాదనను అధిష్టానం వద్ద వినిపించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ముప్పా, చెన్నపాటి అభ్యర్థిత్వాలపై సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ముప్పా అభ్యర్థిత్వాన్ని గద్దె రామ్మోహన్ బలపరుస్తుండగా, బొండా ఉమా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గాంధీ విషయంలో ఇది రివర్స్ అయింది. త్రిమూర్తిరాజుకు ఏకగ్రీవంగా ఆమోదిస్తే సామాజిక సమీకరణలు తేడా వచ్చే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శ్రీధర్తో తనకు ఎలాంటి వైరం లేదని, డిప్యూటీ మేయర్ గోగుల రమణను మార్చాలన్నదే తన అభిప్రాయమని బొండా తన సన్నిహిత వర్గం వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు కోనేరు శ్రీధర్కు అనుకూలంగా మారుతున్నాయి. మరోపక్క అసమ్మతి వర్గం మామూళ్ల వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. ‘ముదురుతున్న చైర్వార్’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనం టీడీపీలో కలకలం రేపింది. ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నెలవారీ మామూళ్లు ఎర వేసిన మాట వాస్తవమేనని విచారణలో తేలింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ మామూళ్ల వ్యవహారాన్ని ధృవీకరించనట్లు భోగట్టా. సంతకం చేస్తే నెలకు రూ.2 లక్షలు ఇస్తామని అసమ్మతి వర్గం నేతలు చెప్పారని, తాను అందుకు అంగీకరించలేదని ఆ కార్పొరేటర్ ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద తెలిపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. బాబు సీరియస్! నగరపాలక సంస్థ టీడీపీలో మూడు రోజులుగా సాగుతున్న టీడీపీ పాలి‘ట్రిక్స్’పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ‘ఎన్ని చెప్పినా వీళ్లు (కార్పొరేటర్లు) మారరు.. మంత్రి ఉమా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది’ అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక బాబుకు అందినట్లు తెలుస్తోంది. మహానాడు అయ్యాక కార్పొరేటర్లకు క్లాస్ తీయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని భోగట్టా. -
జైలు నుంచి యాసిన్ భత్కల్ ఫోన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎమ్) చీఫ్ యాసిన్ భత్కల్ ను ఐఎస్ఐఎస్, అనసర్ ఉద్-తవ్హీద్ ఫీ బిలాద్ అల్ హింద్(ఏయుటీ) సంస్థలకు చెందిన నేతలు కలిశారా? అనే వార్తలకు అవుననే! సమాధానం వినిపిస్తోంది. జైలు నుంచి భత్కల్ తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. గత జూన్ లో తన భార్యతో మాట్లాడిన భత్కల్ త్వరలో దామస్కస్ నుంచి సాయం అందుతుని చెప్పినట్లు భారత ఐసిస్ రిక్రూటర్ లుగా ఉన్న ఆషీక్ అహ్మద్ అలియాస్ రాజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ అఫ్జల్ లు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన ఇంటిలిజెన్స్ అధికారులు భత్కల్ అరెస్టు తర్వాత ఇప్పటివరకు అతన్ని కలిసిన వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
నేటితో బీఎస్ఎన్ఎల్ ఎన్నికల ప్రచారానికి తెర
► రేపు జిల్లా వ్యాప్తంగా యూనియన్ల గుర్తింపు ఎన్నికలు ► 12 మధ్యాహ్నానికి ఫలితాలు తిరుపతి అర్బన్: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్లోని వివిధ ఉద్యోగ సంఘాలకు జరగనున్న గుర్తింపు ఎన్నికల ప్రచారం సోమవారం ఉదయం 9 గంటలతో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 10 సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయాల పరిధిలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 19 యూనియన్లు పోటీలో నిలుస్తుండగా, చిత్తూరుజిల్లాలో మాత్రం కేవలం 5 యూనియన్లే పోటీలో ఉన్నాయి. వాటి లో ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్(బీఎస్ఎన్ఎల్ ఈ యూ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికం ఎంప్లాయిస్(ఎన్ఎఫ్టీఈ)ల మధ్యే పోటీ నెలకొననుంది. జిల్లాలో మొత్తం 757 మంది ఉద్యోగులు, కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలను 12వ తేదీ మధ్యాహ్నానికి ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. గత 14 ఏళ్లుగా బీఎస్ఎన్ఎల్లో జరుగుతున్న ఈ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే విజయపథంలో నిలబడి ఏకైక గుర్తింపు సంఘంగా పేరు తెచ్చుకుంది. ఆ క్రమం లో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కూడా కొన్ని ప్రాంతాల్లో గట్టిపోటీని ఇస్తోందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు వె ల్లడిస్తున్నాయి. పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు బీఎస్ఎన్ఎల్ సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియ నెలన్నర క్రితమే జిల్లా లో ఆరంభమైనప్పటికీ గత వారం రోజుల నుంచి తిరుపతితో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో యూనియన్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. యూనియన్లు తమ తమ ఎన్నికల గుర్తులను, సీరియల్ నెంబర్లను ఓటర్లకు స్పష్టంగా ప్రచారం చేసే విధం గా బ్యానర్లలో అధిక ప్రాధాన్యత ఇచ్చా యి. అలాగే కరపత్రాలు, ప్యాకెట్ పుస్తకాలను కూడా ప్రచురించి ఓటర్లకు పంపిణీ చేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.80 లక్షలకు పైగా యూనియన్లు ఖర్చు చేసినట్లు బీఎస్ఎన్ఎల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీకి నివేదికలు పంపాయి -
స్పీకర్ గన్మెన్పై కేసు నమోదు
► మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ప్రబుద్దుడు ► కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన శాసనసభాపతి భూపాలపల్లి: విధులను విస్మరించి.. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి అడ్డంగా దొరికిన గన్మెన్పై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) 12వ బెటాలియన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కొంతకాలం క్రితం ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలోకి మారాడు. కొద్ది రోజులుగా శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారికి పర్సనల్ సెక్కూరిటీ ఆఫీసర్(పీఎస్వో)గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణానికి చెందిన ఒక మహిళ తన సమస్య పరిష్కారానికి శాసన సభాపతికి చెందిన స్థానిక క్యాంపు కార్యాలయం వద్దకు పలుమార్లు వచ్చింది. ఈ క్రమంలో పీఎస్వో వెంకటేశ్వర్లు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి శాసన సభాపతి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బస చేశారు. డ్యూటీలో ఉండగానే వెంకటేశ్వర్లు సదరు మహిళకు ఫోన్ చేశాడు. సింగరేణి ఉద్యోగి అయిన సదరు మహిళ భర్త రాత్రి డ్యూటీకి వెళ్ళిన అనంతరం 11.30 గంటలకు ఆ ఇంట్లోకి చొరబడడ్డాడు. అయితే అంతకు ముందే అనుమానంతో ఉన్న ఆ మహిళ భర్త తన ఇంటి సమీపంలోనే కాపుకాసి వెంకటేశ్వర్లును పట్టుకున్నాడు. దీంతో చేసేది లేక అతడు తన బట్టలు, చెప్పులు, సెల్ఫోన్ను వదిలి రోడ్డు వెంట పరుగులు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ మధుసూదనాచారి అతడిని మందలించి పోలీసు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. అంతేకాక కఠినంగా శిక్షించాలని ఎస్పీని ఆదేశించినట్లు సమాచారం. కాగా మహిళ భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు వెంకటేశ్వర్లుపై ఐపీసీ 448 (అక్రమంగా ఇతరుల ఇంట్లోకి ప్రవేశించడం), 497 (లోబరుచుకోవడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లు బట్టలు, చెప్పులు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. టీఎస్ఎస్పీ ఉన్నతాధికారులకు సమాచారం అందించి నేడో, రేపో వెంకటేశ్వర్లును అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. -
వణుకు
► టాప్-10 అవినీతిపరుల జాబితా ► ఎవరెవరు ఎంత తిన్నారనే విషయంపై ఆరా ► వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ ► ప్రధానంగా జిల్లా అధికారులపైనే దృష్టి ► త్వరలో ప్రభుత్వానికి నివేదిక ► ఇప్పటికే అవినీతి శాఖల జాబితా సిద్ధం అవినీతిలో అగ్రగాములు ఎవరంటే.. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఇక టాప్-10 విషయానికొస్తే.. ఠాగూర్ సినిమాను తలపింపక మానదు. ఒకరు పది లక్షలు అంటే.. మరొకరు ఇరవై లక్షలు. నువ్వు అక్కడ తిన్నావంటే.. నువ్వేం తక్కువా అనే ప్రశ్న. ఎవరికి వారు ఈ కళలో ఆరితేరిన వారే. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలాంటి జాబితా ఒకటి సిద్ధం చేస్తుండటం ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశమవుతోంది. వాళ్లతో పోల్చుకుంటే నేను తిన్నదెంత అనే అంచనాల్లో తలమునకలవుతున్నారు. అచ్చం సినిమా తరహాలోనే.. జాబితాలో ఎవరి పేర్లు ఉండొచ్చనే విషయం హాట్ టాపిక్గా మారింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఏయే అధికారి ఎంత మొత్తం లంచాల రూపంలో గుంజుతున్నారు? అత్యంత అవినీతిపరుడైన అధికారి ఎవరు? ఈ వివరాలతో కూడిన టాప్-10 జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ జాబితాను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం. విషయం ఆనోటా ఈనోటా బయటకు రావడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ జాబితాలో అవినీతిని కట్టడి చేయాల్సిన శాఖ అధికారి పేరు కూడా ఉందనే విషయం తాజాగా చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా జిల్లా అధికారులపైనే దృష్టి కేంద్రీకరించి ఈ జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అత్యంత అవినీతి ప్రభుత్వ శాఖల జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులపై నేరుగా పేర్లతో సహా జాబితా ప్రభుత్వానికి చేరనుండటంతో వ్యవహారం కాస్తా హాట్ టాపిక్గా మారింది. ఆధారాలతో సహా... కేవలం అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేస్తే.. ఈ జాబితాకు సాధికారత ఉండదని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే.. ఫలానా అధికారి ఏయే వ్యవహారాలలో ఎలా వ్యవహరించారు? ఫలానా డీల్లో ఎంత మొత్తం గుంజారనే వివరాలను కూడా జాబితాలో పొందుపరచనున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇలా సంపాదించిన అవినీతి డబ్బును ఎక్కడెక్కడకు మళ్లించారనే విషయాన్ని పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తద్వారా తాము అందించే నివేదికకు సార్థకత చేకూరుతుందనేది ఇంటెలిజెన్స్ వర్గాల భావనగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత అవినీతి అధికారుల జాబితాపై ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ప్రాథమిక నిర్ధారణకు.. టాప్-10 అవినీతి అధికారుల జాబితా తయారు చేసేందుకు సిద్ధమైన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రాథమికంగా ఏయే అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారనే వివరాలను సేకరించినట్టు సమాచారం. అయితే, ఇక్కడితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. అయితే, టాప్-10 అవినీతి అధికారుల జాబితాలో ప్రధానంగా పోలీసు అధికారులు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇందులో ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా కర్నూలు నగరానికి కొద్దిదూరంలో ఉన్న మండలం.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండలంలో పనిచేసే ఒక డిప్యూటీ తహశీల్దారు(డీటీ) పేరు ఇందులో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సదరు డీటీ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారని తెలుస్తోంది. ఇక కర్నూలు కార్పొరేషన్లో పనిచేసే ఒక ఇంజనీరు ఆస్తులపైనా వీరు కన్నేసినట్టు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలోని మరో అధికారి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వినిపిస్తోంది. మొత్తంగా జాబితా వ్యవహారం అవినీతి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కొసమెరుపు: జిల్లాలో అవినీతి పరుల గుండెల్లో దడ పుట్టించాల్సిన అవినీతి నిరోధక శాఖ అధికారుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండనుండటం గమనార్హం. -
నగరంపై నిఘా
నల్లమల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు భూతం అన్నపూర్ణ అరెస్ట్తో పోలీసులు అప్రమత్తం నగరంలో సానుభూతిపరుల కదలికలపై ఆరా విజయవాడ : మావోయిస్టు షెల్టర్ జోన్గా ఉన్న బెజవాడ నగరంపై పోలీసులు నిఘా ఉంచారు. నగరంలోకి కొత్తగా ఎవరెవరు వస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, సానుభూతిపరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలపై నగర కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్ దళ డెప్యూటీ కమాండర్ భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, సృజనను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నూతన రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మంగళవారం అదుపులోకి తీసుకొని బుధవారం అరెస్టు చూపిన ఘటన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలకలం రేపింది. దీంతో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై రెండు జిల్లాల్లో పోలీస్ నిఘా పెరిగింది. మళ్లీ కలకలం... విజయవాడ నగరం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉంది. నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో, నగర శివారు గ్రామాల్లో కొందరు ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులు నగరంలో తలదాచుకోవటంతో పాటు వైద్య సేవల కోసం ఎక్కువగా వస్తుంటారు. కృష్ణా జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం లేకపోవటంతో మొదటి నుంచి ఎక్కడా మావోయిస్టు కార్యకలాపాలు లేవు. జిల్లాలో, నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు తప్ప ఒకస్థాయి మావోయిస్టు నాయకులు ఎవరూ లేరు. ఈ క్రమంలో 2004కు ముందు విజయవాడలో వెంకటేశ్వర్లు అనే మావోయిస్టు లొంగిపోవటం మినహా ఇతర ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు నేత సంచరించటం కలకలం రేపింది. ముఖ్యంగా ఇక్కడి గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, ఇసుక మాఫియా ఆగడాలపై మావోయిస్టు పార్టీ స్పందించి కొందరు నేతలకు అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ దీనిపై దృష్టిసారించారు. పోలీసులకు సవాలే... రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని నగరంగా మారింది. నగరంలో సీఎం సహా అనేకమంది వీవీఐపీల కార్యక్రమాలు నిత్యంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మావోయిస్టు కార్యకలాపాలు నగరంలో మొదలైతే పోలీసులకు భద్రతాపరంగా సవాలుగా మారే అవకాశం ఉంది. దీంతో అన్నపూర్ణ అరెస్ట్ ఘటనతో మరింత అప్రమత్తం అయ్యారు. నల్లమలతో పాటు రాష్ట్రంలోనే మావోయిస్టుల కీలక షెల్టర్ జోన్గా ఉన్న విజయవాడపై పోలీస్ నిఘా పెంచారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముఖ్యంగా సానుభూతిపరులు, వారికి మద్దతు పలికే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలపై నిఘా ఉంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెరిగింది. -
‘వీణవంక’లో ఇద్దరు మైనర్లు: నాయిని
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దుర్ఘటన ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, నిందితులందరికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఈ కేసు స్వయంగా డీజీపీ అనురాగ్శర్మ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో సమయానికి స్పందించని అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పారు. అత్యాచారాలపై అంతా సిగ్గుపడాలి: త్రిపురాన సాక్షి, హైదరాబాద్: కరీంనగర్లో జరిగిన రెండు అత్యాచార ఘటనలకు సంబంధించి అందరూ సిగ్గుపడాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరులతో వెంకటరత్నం మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. వీణవంక మండలంలో పదో తారీఖున ఘటన జరిగితే... 24వ తేదీ వరకూ కేసు నమోదు కాకపోవడం విచారకరమన్నారు. అలాగే మూడురోజుల క్రితం కాతారం మండలంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో పట్టుబడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడాలన్నారు. నిర్భయ చట్టం వచ్చాక కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం దారుణమన్నారు. గ్యాంగ్రేప్పై ఇంటెలిజెన్స్ ఆరా వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల దళిత యువతి(20)పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరా తీశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు సామూహిక అత్యాచార ఘటనపై పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. నిందితుల్లో ఇద్దరు యువకులు మైనర్లు అని పోలీసులు ప్రకటించగా, అంజయ్య అనే నిందితుడి వయస్సుపై దళిత, ప్రజాసంఘాలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని జనన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించినట్లుగా సమాచారం. బాధితురాలి స్నేహితురాల పోలీస్లకు ఏ నంబర్ నుంచి ఫోన్ చేసిందనే కోణంలో కూడా దర్యాప్తు చేసినట్లు సమాచారం. వీణవంక ఎస్సై, కానిస్టేబుల్పై వేటు కరీంనగర్ క్రైం: వీణవంక ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటుపడింది. హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి డీజీపీ అనురాగ్శర్మతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు వీణవంక ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పర్శరాములను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జోయల్డేవిస్ మంగళవారంరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీణవంక బాధితురాలికి రక్షణ కల్పించాలి: వీణవంక ఘటనలో పోలీసు విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరపాలని రాష్ట్ర మహిళా ఐక్య కార్యచరణ సంఘం ఒక ప్రకటనలో కోరింది. మంగళవారం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మహిళా సమాఖ్య సభ్యులు కలిశారు. -
'ఏపీలో ఇంటెలిజెన్స్ బాగానే పని చేస్తోంది'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తోందని చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం విశాఖ జిల్లాలో రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. ఈ చర్చలో విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు 27 శాతం తగ్గాయని పేర్కొన్నారు. -
ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఇంటిలిజెన్స్కే..
పరపతి లేని పోలీసులు పొరుగు జిల్లాలకే నోట్ : పోలీస్ క్యాప్ వాడండి సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ పాలనలో మొదలైన సిఫార్సుల పోస్టింగ్లు పోలీసు శాఖను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని ఎస్సై, సీఐ, డీఎస్పీల బదిలీలు చేపట్టడంతో ‘పరపతి’ లేని పోలీసులు అన్యాయమైపోతున్నారు. ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నప్పటికీ కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలు తెచ్చుకోలేని కారణంగానో లేదా.. పైరవీకారుల సిఫార్సులు లేకపోవడం వల్లనో కొందరు ఖాకీలు లూప్లైన్లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇంటలిజెన్స్ విభాగానికి బదిలీ అవుతున్నారు. ప్రజాప్రతినిధుల అండగల పోలీసులకు మాత్రం ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కీలకమైన లా అండ్ ఆర్డర్ పోస్టింగులే దక్కించుకుంటున్నారు. ఇంటిలిజెన్స్కు ఆరుగురు జిల్లాలోని వివిధ స్టేషన్లల్లో పనిచేస్తున్న ఆరుగురు ఎస్సైలను ఇటీవల హైదరాబాద్లోని ఇంటలిజెన్స్ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని అడిషనల్ డెరైక్టర్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వారిని ఆదేశించారు. వీళ్లంతా మూడేళ్లపాటు ఆ విభాగంలో పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆచంట ఎస్సై పి.విశ్వం, భీమవరం టూటౌన్ ఎస్సై పి.విష్ణుమూర్తి, డీసీఆర్బీ ఎస్సై కె.చిరంజీవి, పెదవేగి డీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న కె.స్వామి, ఏలూరు ట్రాఫిక్ ఎస్సై కేవీఎస్వీ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వి.వెంకటేశ్వరరావులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బదిలీ లేఖలను తీసుకుని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఉన్నతాధికారులు ‘ఇక్కడేం చేస్తారు. విజయవాడ వెళ్లండి’ అని తిప్పి పంపినట్టు తెలుస్తోంది. కేవలం పైరవీలు చేతకాకపోవడం వల్లనే ఆ ఆరుగురిని జిల్లా దాటి పంపించివేశారన్న వాదనలు పోలీసు శాఖలో వినిపిస్తున్నాయి. -
న్యూ ఇయర్ ‘బిజినెస్’పై నజర్..!
అమ్మకం పన్నుల చెల్లింపులపై ఆరా.. కార్పొరేట్ కొనుగోళ్లపై నిఘా... సిటీబ్యూరో: గ్రేటర్లో న్యూ ఇయర్ పురస్కరించుకొని జరిగే ‘స్పెషల్ బిజినెస్’ పై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ మహా నగ రం కేంద్రంగా ప్రతి యేట నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లు, గిఫ్ట్లు తదితర క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. ప్రతి యేట ప్రత్యేక వ్యాపారం టర్నోవర్ కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందన్నది అంచనా. కానీ వాణిజ్య పన్నుల శాఖకు అమ్మకం పన్ను వసూళ్లు తక్కువగా ఉండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. కార్పొరేట్ సంస్ధలు తమ బ్రాండ్ పేర్ల ముద్రణ లతో వ్యాపార సంస్థల వద్ద ముద్రించే, కొనుగోలు చేసే డైరీలు, క్యాలెండర్లు, టేబుల్ క్యాలెండర్లు తదితర గిఫ్ట్ల సమాచార సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద న్యూ ఇయర్ బిజినెస్పై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. బిజినెస్ టర్నోవర్, వ్యాట్ ట్యాక్స్ చెల్లింపులపై అధికారులు దృష్టి సారించారు. పన్ను ఎగవేతదారులు టార్గెట్గా... మహా నగరంలో పన్ను ఎగవేతదారులుటార్గెట్గా వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది. కోట్లాది రూపాయల విలువగల వ్యాపారం ఎలాంటి పన్నులు చెల్లింపు లేకుండా సాగుతోంది. క్షేత్ర స్థాయి అధికారులకు తెలిసినా, మామూళ్ల ఒప్పందాలతో ఉన్నతస్థాయి వరకు సమచారం అందడం లేదన్నది బహిరంగ రహస్యమే. అదే సమయంలో వే బిల్లులు, సీ-ఫారాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానం ద్వారా అక్రమ రవాణా రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోంది. ఎన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేసినా పలుసరుకులు పన్నులు లేకుండా బాహాటంగా హైదరాబాద్కు దిగుమతి అవుతోంది. తక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తూ భారీ వ్యాపారాలు సాగిస్తున్న వారిపై సైతం దృష్టి సారించింది. ఆన్లైన్పై... నూతన ఇయర్ వ్యాపారం కూడా వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. తాజాగా ఆన్లైన్ బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆ వ్యాపారానికి సరైన లెక్కలు లేకుండా పోయాయి. ప్రస్తుతం సాగుతున్న వ్యాపారానికి, పన్నుల వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది. దీంతో ఆన్లైన్ వ్యాపారం పై సైతం నిఘా పెట్టాలని నిర్ణయించారు. జయభేరి క్లబ్లో ‘వీ’ పార్టీ సిటీబ్యూరో: హైటెక్సిటీలోని హైటెక్స్ రోడ్ జయభేరి క్లబ్లో నూతన సంవత్స వేడుకలను ‘వీ-పార్టీ 16’ పేరిట గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అతి పెద్ద పూల్సైడ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. డీజే మినాజ్ సంగీత హోరులో న్యూ ఈయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకొనే వారికి జయభేరి స్వాగతం పలుకుతోంది. ఈ వేడుకల్లో అన్లిమిటెడ్ ఫుడ్, బివరేజెస్ అందజేస్తారు. డ్యాన్సులో పాల్గొనే జంటలకు ప్రత్యేక ఫ్లోర్ సిద్ధం చేశారు. అలాగే యాంకర్ గేమ్స్ నిర్విహ ంచి గెలిచిన వారికి బహుమతులను అందజేస్తారు. టాటూ,ఫేస్ పెయింటింగ్,ఫైర్ అండ్ బాటిల్ జగ్లర్,బాన్ ఫైర్ వంటి ఉత్తేజభరితమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనదలచిన వారు ఎంట్రీ పాస్ల కోసం ఫోన్ : 9248455551 నెంబర్కు సంప్రదించవచ్చు. ఎన్వైఈ 2016 స్థలం: పెర్ల్ ప్యాలెస్, ప్యామిలీ వరల్డ్, బేగంపేట స్పెషల్: న్యూ ఇయర్ బాష్, లైవ్ డీజే పెర్ ఫార్మెన్స్, అన్లిమిటెడ్ పుడ్ నెంబర్స్: 7095341015, 9701111882 రియో కార్నివాల్- 2016 స్థలం: ఆదిత్యా పార్క్, అమీర్పేట స్పెషల్: లైవ్ డీజే పెర్ ఫార్మెన్స్, అన్లిమిటెడ్ పుడ్, నెంబర్స్: 7032711443, 9246577883, 7032711448 ‘ఫుడ్ పార్కు’ రెడీ... ఆటోనగర్: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న నిర్వహించే వేడుకలకు ఆటోనగర్లోని ఫుడ్ఫార్కు ఏసీ గార్డెన్ రెస్టారెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులతో కలిసి కుటుంబ సభ్యులంతా వేడుకలు జరుపుకునేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. చిన్నారుల కోసం ఫ్రీ స్టాల్స్, కారికేచర్, పాట్ మేకింగ్, బెలూన్హౌస్, ట్రంపోలింగ్, టాటూస్, షుగర్క్యాండీ, అదే విధంగా మహిళల కోసం నెయిల్ ఆర్ట్, మెహిందీ, దాండియా, తంబోలా, బ్యాంగిల్ మేకింగ్, పురుషుల కోసం సోడా, డ్యాన్స్, మ్యూజిక్, తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. దీంతో పాటు అన్ని రకాల వెజ్, నాన్వెజ్ వంటకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వారు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్-8885239239 నెంబర్లో సంప్రదించాలని కోరారు. జూ పార్కులో... బహదూర్పురా: నూతన సంవత్సరం తొలిరోజు వేలాదిగా జూకు తరలివచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ గోపిరవి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు 10-12 టికెట్ కౌంటర్లను, అదనపు మంచినీటి సదుపాయం, సెక్యూరిటీ సిబ్బంది, గైడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలాదిగా తరలివచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. జూలోని అసిస్టెంట్ క్యూరేటర్తో పాటు కిందిస్థాయి అధికారి నిత్యం జూలో పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. యానిమల్ కీపర్లు ఆయా ఎన్క్లోజర్ల వద్ద ఉంటూ సందర్శకులకు వన్యప్రాణుల విశిష్టతను వివరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూ సందర్శకులు బయటి నుంచి ఎలాంటి ఆహర పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావద్దన్నారు. -
కాల్మనీ నిందితులపై రౌడీ షీటు
-
కాల్‘కేటు’లపై ఉక్కుపాదం!
రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసుల సమాయత్తం వివరాలు సేకరిస్తున్న నిఘా విభాగం విజయవాడ సిటీ : కాల్మనీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. కాల్మనీ వ్యాపారం పేరిట దందాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు రౌడీషీట్ల మంత్రం ప్రయోగిస్తున్నారు. మాజీ రౌడీషీటర్లపై వెంటనే పాత రౌడీషీట్లను పునరుద్ధరించడంతో పాటు దందాలు చేసినట్టు సమాచారం ఉన్న వారిని కొత్తగా జాబితాలో చేర్చనున్నారు. నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే పలువురి వివరాలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గన్మెన్లను వెంటేసుకొని వడ్డీ వ్యాపారం దందా నిర్వహిస్తున్న మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్పై తిరిగి రౌడీషీటు ప్రారంభించారు. గతంలో పలువురు మహిళలు శివకుమార్ ఆగడాలపై కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల్లోని పలుకుబడితో అప్పటికప్పుడు శివకుమార్ బయటపడ్డాడు. కాల్మనీ బాధితులకు పోలీసు కమిషనర్ సవాంగ్ భరోసా ఇవ్వడంతో ఓ మహిళ అతని ఆగడాలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
అనుమానం లేదు... డౌట్ ఉంది...
సతిబాధ నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పని మనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ‘మీకు నీలిమా అంటే ఇష్టం కదండీ’... ‘అవును.’ ‘ఎంతిష్టం?’ ‘ఇప్పటి వరకూ ఉన్న ఎక్స్పీరియన్స్ను బట్టి నీలిమాయే బెస్ట్ అనుకుంటున్నాను’... ‘హు. అనుకున్నా. నన్నెప్పుడు పట్టించుకున్నార్లేండి. ఆ నీలిమా వెంటే పడి ఛావండి’.... లేచెళ్లిపోయింది. ఇప్పుడు తప్పేం మాట్లాడానని? సిటీలో ఏ రెస్టరెంట్కు వెళ్లినా మూసీ నుంచి గ్రాస్ తెచ్చి వండి పెడుతున్నారు. నీలిమాలో అయితే కనీసం చికెన్ అడిగితే కెచిన్నో, మటన్ అడిగితే టమన్నో సర్వ్ చేస్తున్నారు. అందుకే అది ఇష్టం అని చెప్పాను. కాని కాదట. మా ఆవిడ ప్రస్తావించింది ఆ నీలిమా కాదట. ఫోర్ నాట్ టూ నీలిమా అట. అసలు మా కాంప్లెక్స్లో ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాట్ ఒన్ కానీ నాట్ నాట్ టూ కానీ అంతకన్నా తెలియదు. ఇక సదరు నీలిమా అనే ఆ సంప్రదాయబద్ధ స్త్రీమూర్తి అంతకన్నా తెలియదు.మరి నన్ను అనుమానించడం తగునా? నాకు ఈ బాధ ఏంటి మదనా? ‘పెళ్లయిన కొత్తలో అడిగింది- మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమండీ... సౌందర్య?’ ‘ఊహూ’. ‘సిమ్రాన్?’ ‘అ..హ...హూ’. ‘అలాగైతే వాణీ విశ్వనాథ్ అయి ఉంటుందిలేండి. మలయాళీలు చాలా చక్కగా ఉంటారని ఒకసారి అన్నారుగా’... ‘అ....హా..... హో...నో’... ‘మరెవరూ ఇష్టం లేదా’? ‘సావిత్రి’. ‘ఎవరూ? స్టూడెంట్ నం.1లో గజాలా పక్కన ఉంటుంది. ఆ అమ్మాయేనా’? ‘అయ్యో. పాత సినిమాల్లో ఉంటుందే ఆ సావిత్రే’. అంతే. ఎప్పుడు టీవీలో పాత సినిమాలొచ్చి సావిత్రి కనిపించినా ఒక డ్రై క్లాత్ తీసుకొని అడ్డం నిలబడి టీవీని తుడవడానికి రెడీ అయిపోతుంది. ఒక్కోసారి సావిత్రి చేయి కనిపిస్తుంది. ఒక్కోసారి సావిత్రి ముక్కు. సమస్త సావిత్రిని చూసే భాగ్యం ఆ రోజు నుంచి నాకు తుర్రుమంది. ఆ రోజు ఉదయం ఫోన్ మోగింది. అప్పటికి సరదాగా వంట చేద్దామని వంట గదిలో ఉన్నా. ‘బెండకాయ చేయనా’ అంటే ‘వద్దు... అవి లేడీస్ ఫింగర్స్... బంగాళదుంప చేయండి’... అంటే తొక్క తీసి తీరిగ్గా తరుగుతూ ఉన్నా. ఫోన్ మోగింది. చేయి ఖాళీ లేక ‘ఎవరో చూడు’ అనంటే ఫోన్ తీసింది. అవతల మా బాస్ పి.ఏ. ఉత్త హడావిడి మేళం. ఫోన్ ఎత్తింది మా మణిమకుటం అని తెలియక- ‘ఈవెనింగ్ సిక్స్కి’ అని పెట్టేసింది. ‘ఈవెనింగ్స్ సిక్స్కేమిటి? అది మీ ఆఫీస్ అయిపోయే టైమ్ కదా. ఎంతకాలంగా సాగుతోంది ఈ భాగోతం’ అంది. ‘అయ్యో. అది మీటింగ్ టైమే. మా బాస్ ఆ టైమ్లోనే మీటింగ్ పెడతాడు’ అనంటే వింటేగా. చివరకు ఆ రోజు మీటింగ్లో కూచున్నాక ఫోన్ ఆన్ చేసి పెట్టి మా ఆవిడకు మీటింగ్లో మా బాస్ ఎలా కామెడీగా కొరుక్కు తింటాడో అర్థం చేయిస్తే తప్ప నన్ను వదల్లేదు. ఒకరోజు ఢిల్లీ మిఠాయివాలా దగ్గర కిలో స్వీట్స్ కొని, సౌతిండియా షాపింగ్మాల్లో తనకిష్టమైన నిమ్మకాయరంగు వర్క్శారీ కొని తీసుకెళ్లి కానుకగా ఇచ్చి రాత్రి భోజనం అయ్యాక సోఫాలో తన అనుమతితో పక్కన కూచుని మంచి మూడ్లో ఉందని కన్ఫమ్ చేసుకున్నాక అడిగాను- నా మీద నీకంత డౌట్ ఎందుకు? ’ఊహూ.. చెప్పను’. ‘మా బంగారం కదూ’ ‘ఊహూ...’ ‘మా జోస్ అలూకాస్ కదూ’ ‘మరీ... మరీ... పెళ్లయిన రాత్రి గదిలోకొచ్చాక- నేను పక్కన కూచుంటే- చనువుగా చేయి పట్టుకున్నారు కదా- అందుకు. మీరెంత ముదుర్లయితే ఒక ఆడపిల్ల చేయి అంత చనువుగా పట్టుకోగలరు చెప్పండి.’.... ‘ఓసి నీ అనుమానం కట్టప్ప తోలుకెళ్ల... అసలే ముప్పయ్యేళ్లకు పెళ్లయ్యింది. అందాకా దారిన పోయే ఏ ఆడపిల్ల చెయ్యి చనువుగా పట్టుకున్నా గుడ్లు పీకి వాసన్కూ పళ్లు పీకి పార్థాకు పంపిస్తుంది. ఇన్నాళ్లకు పెళ్లాం వచ్చింది కదా కాదనే ధైర్యం ఎవరికుంది అని చేయి పట్టుకుంటే ఇదా నువ్విచ్చే సర్టిఫికెటు. వేసే ఐ.ఎస్.ఐ బ్రాండు’.... ‘ఏమో. ఎవరు చూడొచ్చారు. మీ మగాళ్లను నమ్మకూడదు’ ఇంత డౌట్ ఉన్నాక ఇక ఏ సిప్లా మందులు పని చేస్తాయి కనక? మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. నాతోడిదే జీవితం. కాని ఈ డౌట్ ఉంది చూశారూ... దాంతోనే ప్రాబ్లమ్. స్త్రీ కదా సాటి స్త్రీతోనే విరుగుడు సాధిద్దాం అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళదామంటే... ససేమిరా ససే సక్కుబాయి... లేడీ డాక్టర్ అయితే మీరు లైనేస్తారు... మగడాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి అంది. రాసిన చాలామందులు గులాబీ పూలకుండి మింగుతూ ఉంది. నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పనిమనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ఇంత డౌట్ చేసేస్తోంది కదా నిజం చేసేద్దామా అని ఒక్కోసారి అనిపిస్తుంది. బాబోయ్. అంత ధైర్యమా. డౌట్తో చస్తున్నాను. అనుమానంతో చచ్చిపోనూ? - భా.బా (భార్యా బాధితుడు) తా.క: దయచేసి నా ఫోన్ నంబర్ ఇవ్వొద్దని మనవి. నా ఏడుపు నాకుంది. సాటి మగవాళ్ల ఏడుపు వినలేను. సారీ... హెల్ప్ ప్లీజ్: ఇది అచ్చయిన రోజు పేపర్ మా ఇంటికి రాకుండా చూడగలరా. కొంచెం భయంగా ఉంది. -
దండకారణ్యంలో దడ.. దడ
మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఎ) వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకూ జరిగే ఈ వారోత్సవాల్లో ఉద్యమంలో అమరులకు నివాళులర్పించడమే కాకుండా భారీ విధ్వంసానికి మావోలు వ్యూహ రచన చేస్తున్నారని ఇంటిలిజెన్స్ హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. -సాక్షి, విశాఖపట్నం విశాఖ మన్యంలో మావో ఉద్యమం 1981-82 మధ్య ప్రారంభమైంది. 1885లో జర్రెల ప్రారంతో తొలి దాడి జరిగింది. అనంతరం ధారకొండలో కొందరిని హత్య చేశారు. అక్కడి నుంచి మావోల కార్యకలాపాలు విస్తరించడం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో పోలీసులు మావోల అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం శాంతి చర్చలకు పిలవడంతో రెండేళ్ల పాటు ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరువాత కొద్దిగా కదలికలు ఉన్నప్పటికీ 2014 వరకూ మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారు. గతేడాది గమ్మెలి సంజీవరావు అనే వ్యక్తిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. దానికి కొనసాగింపుగా చింతపల్లి మండలం కోరుకొండ సమీపంలో వీరవరంలో సింహాచలం అనే వ్యక్తిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. వారిని గిరిజనులు అడ్డుకుని మావోయిస్టు పార్టీ దళ కమాండర్ శరత్తో పాటు మిలీషియా సభ్యులు గణపతి, నాగేశ్వరావులను హతమార్చడంతో మళ్లీ ఉద్యమం ఎరుపెక్కింది. అప్రమత్తమైన బలగాలు : బాక్సైట్ అంశాన్నే మావోయిస్టులు ఆయుధంగా మార్చుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. మళ్లీ పార్టీని బలోపేతం చేసేదిశగా ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు విశాఖ మన్యంలో అడుగుపెట్టారని గుర్తించారు. గతేడాది ‘పీఎల్జీఎ’లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అమర వీరులకు నివాళిగా 30 అడుగుల స్థూపాన్ని నిర్మించాలని మావోలు అనుకున్నప్పటికీ దానిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఈసారి బాక్సైట్ ఉద్యమం నేపధ్యంలో భారీ విధ్వంసానికి మావోలు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సాధారణ రోజుల్లో ఉపయోగించే సిబ్బందికి అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలను పీఎల్జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు రప్పిస్తున్నారు. అత్యాధునిక అయుధాలు, వైర్లెస్ సెట్లు, వాహనాలను వారికి సమకూర్చుతున్నారు. కాలి నడకన కిలోమీటర్ల కొలదీ దూరాలు ప్రయాణిస్తూ ఈ బలగాలు తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, సెల్ టవర్లు, ఘాట్ రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు అణువణువునూ జల్లెడపట్టనున్నాయి. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ ప్రతి ఇంటినీ సోదా చేయనున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని, అనుమానితులను మన్యంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించారు. -
నిఘా నీడలో వెంకన్న ఆలయం
తిరుమల ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పారిస్ ఘటన తర్వాత నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో టీటీడీ భారీ భద్రతా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆలయానికి అదనపు భద్రత కల్పించారు. ఇప్పటికే ఎస్పీఎఫ్, ఏఆర్ కమాండోలు అప్రమత్తంగా పహారా కాస్తున్నారు. యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ దళాలు కూడా అనుక్షణం శ్రీవారి భద్రతలో అప్రమత్తంగా ఉన్నాయి. భక్తులు సంచరించే ముఖ్య కూడళ్లలో కూడా నిఘా ఉంచారు. బాంబ్, డాగ్ స్వ్కాడ్లు అప్రమత్తమై రెండు రోజులుగా తిరుమలలో ముమ్మరంగా త నిఖీలు నిర్వహించాయి. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా నిఘాను పెంచారు. అలిపిరి, తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్లో తనిఖీలు రెట్టింపు స్థాయిలో నిర్వహించారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న టీటీడీ సీవీఎస్వో నాగేంద్రకుమార్.. అందుకనుగుణంగా భద్రతా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ పోలీసు విభాగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. -
గొర్రెల మేధస్సు
పరిపరి శోధన గొర్రెలను బుద్ధితక్కువ జంతువులుగా తీసిపారేస్తాం గానీ, వాటికీ కొంచెం మేధాశక్తి ఉందట! కాస్త ఓపికతో శిక్షణ ఇస్తే మనుషుల ముఖాలను అవి భేషుగ్గా గుర్తుపడతాయని బ్రిటన్లోని బబ్రహామ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. శిక్షణ ఇచ్చే కాలంలో ముఖాలను గుర్తుపట్టిన గొర్రెలకు నజరానాగా ప్రత్యేక ఆహారం ఇచ్చి చూశామని, దీంతో అవి మరింత ఉత్సాహంగా మనుషుల ముఖాలను గుర్తుపట్టడం మొదలుపెట్టాయని వారు చెబుతున్నారు. దాదాపు యాభై వరకు ముఖాలను అవి తేలికగా గుర్తుంచుకోగలవని అంటున్నారు. -
వలస నాయకులపై నిఘా పెట్టిన చినబాబు, పెదబాబు
-
ఆ నేడు 15 సెప్టెంబర్, 1860
జ్ఞాన సముద్రుడు మహా గ్రంథాలే కాదు... మహనీయుల జీవితాలు కూడా మౌనంగా దారి చూపుతాయి. అటువంటి మహనీయుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గుర్తు తెచ్చుకోవడం అంటే... ఎప్పటికప్పుడు సరికొత్త స్ఫూర్తిని అందిపుచ్చుకోవడమే. జ్ఞానం ఉన్నచోట క్రమశిక్షణకు లోటు రావచ్చు. క్రమశిక్షణ ఉన్నచోట జ్ఞానలేమి కనబడవచ్చు. కానీ మోక్షగుండం మేధస్సు ఎంత పదునైనదో, క్రమశిక్షణ అంత గట్టిది. ఉపన్యాసం ఇవ్వాల్సిన రోజు నాలుగు గంటలకి నిద్రలేచి నోట్స్ తయారు చేసుకోవడం, మెరుగులు దిద్దుకోవడం లాంటివి చేసేవారు. తన బట్టలు తానే ఉతుక్కొని, ఐరన్ చేసుకునేవారట. ఏ పనీ ఆషామాషీగా చేయడం ఆయనకు ఇష్టముండేది కాదు... అది ఉపన్యాసమైనా సరే, ప్రాజెక్ట్కు సంబంధించిన పనైనా సరే. జీవితానికి సంబంధించిన నైతికవిలువలు, జ్ఞానధోరణులకు విశ్వేశ్వరయ్య జీవితం ప్రతీకగా మారింది. ‘‘విశ్వేశ్వరయ్యకు ఉన్నంత జ్ఞానం ఉంది’’ అంటారు జ్ఞానానికి సంబంధించిన అంచనాల్లో. ‘‘వీధిదీపాల కింద కష్టపడి చదువుకున్నారు’’ అంటూ తల్లిదండ్రులు పిల్లలకు విశ్వేశ్వరయ్య జీవితాన్ని పాఠంగా చెబుతారు. ఎంత కాలం గడిచినా.... చరిత్రను వెలిగించే స్ఫూర్తిదాయకమైన అరుదైన పేర్లు కొన్ని ఉంటాయి. విశ్వేశ్వరయ్య పేరు అలాంటిదే. ఆయన పుట్టిన రోజును ‘ఇంజనీర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన నుంచి సరికొత్త స్ఫూర్తిని ఎప్పటికప్పుడు అందుకుంటున్నాం. -
ఖాకీ.. దొంగల్లో కలవరం
పోలీసులపై ఫిర్యాదుకు వెనుకాడని స్మగ్లర్లు వడ మాలపేట ఉదంతంతో వణుకుతున్న పోలీసులు స్మగ్లర్లకు చుట్టాలుగా మారి చట్టాలకు తిలోదకాలిచ్చిన జిల్లా ఖాకీల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. ఇన్నాళ్లూ ఎర్ర దొంగల పేరుతో లక్షలు సంపాదించిన వారంతా తమ పేరెక్కడ బయటపడతుందోనని లోలోన వణికిపోతున్నారు. ఇన్నాళ్లూ తమకు ముచ్చెమటలు పట్టించిన పోలీసుల కక్కూర్తిని బయట పెట్టేందుకు స్మగ్లర్లు ధైర్యంగా ముందుకొస్తుండడమే.. దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తిరుపతి సిటీ/తిరుపతి క్రైం: వడమాలపేట పోలీసుల ఉదంతం జిల్లా పోలీసు యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి డబ్బు వసూలు చేసి అడ్డంగా దొరికిన వడమాలపేట ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్కు బుక్కైపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రదొంగల నుంచి ఆ మ్యామ్యాలు స్వీకరించిన పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. స్మగ్లర్లను గతంలో వేధింపులకు గురిచేసిన పలువురు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు తీవ్ర భయాందోళనలతో వణికిపోతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను, కూలీలను అరెస్ట్ చేయాడానికి రాయలసీమ పరిధిలో పోలీస్ టాస్క్ఫోర్సు బృందాలను ప్రత్యేకంగా నియమించారు. ఇదే అదునుగా భావించిన లా అండ్ ఆర్డర్ పోలీసులు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారి వివరాలను ఆరా తీస్తూ వారిని అనధికారికంగా స్టేషన్లకు పిలిపించి లక్షలాది రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ పేరుతో.. దోపిడీ స్మగ్లర్లకు చెందిన వాహనాలు, విలువైన వస్తువులను పోలీసులు విచారణ పేరుతో తీసుకుని వెనక్కి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి అర్బన్ జిల్లాలో ఏర్పడిన టాస్క్ఫోర్స్ పోలీసులు... ఎర్రస్మగ్లర్ల పేరుతో కొంతమందిని విచారణకు తీసుకొచ్చి వారి వద్ద లక్షల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు బయటకు చెప్పుకోలేక, ఏవరికైనా ఫిర్యాదు చేస్తే మరింతగా వేధింపులు ఉంటాయని లోలోలపలే కుమిలిపోయేవారు. అయితే ఇప్పుడు కొందరు ధైర్యం చేసి పోలీసుపైనే ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఇంకా ఎంతమంది పోలీసులున్నారో.. ఎర్రచందనం స్మగ్లర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు వడమాల పేట ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసులు నమోదు అయ్యింది. దీంతో ఈ లెక్కన స్మగ్లర్లను డ బ్బు వేధింపులకు గురిచేస్తున్న పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఎందరున్నారో ఇకపై వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కడప, చిత్తూరు జిల్లాల్లో పనిచేసే 134 మంది పోలీసులకు, అధికారులకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయాలు ఉన్నట్లు అప్పట్లోనే టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి నివేదికలు తయారు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన అధికారిని 2014లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కార్వేటినగరం సర్కిల్ పరిధిలో ఒక హత్యకేసులో భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో సీఐతోపాటు ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఇటివల ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో అనధికారికంగా హైదరాబాదుకు చెందిన వ్యక్తిని ఒక ఎస్ఐ, బ్లూకోల్ట్ కానిస్టేబుల్ రెండు రోజుల పాటు విచారణ పేరుతో నిర్బధించారనే ఆరోపణలు వెలుగు చేశాయి. పైగా బాధితుడి నుంచి కారు, బంగారు ఉంగారాన్ని స్వాధీనం చేసుకుని వదలిపెట్టినట్లు సమాచారం. ఆ కేసులో బాధితుడు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పెషల్బ్రాంచి డీఎస్పీ విచారణ చేపట్టినట్లు సమాచారం. పోలీస్ శాఖలో అనేకమంది స్మగ్లర్లతో చేతులు కలిపి లక్షలాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పోలీసుల వేధింపులకు గురై లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న ఎర్ర స్మగ్లర్లకు వడమాలపేట ఉదంతం చెప్పలేనంత గుండె ధైర్యాన్ని ఇస్తుందని పోలీసు శాఖలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. -
‘ఉల్లి’పై నిఘా నేత్రం!
సబ్సిడీ ఉల్లి విక్రయ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో అమ్మకాలు అక్రమాలకు అవకాశం లే కుండా ఆకస్మిక తనిఖీలు సిటీబ్యూరో : రైతుబజార్లలో నిఘా మాటున సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును ఉన్నతాధికారులు బీఆర్కే భవన్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతుబజార్లో సబ్సిడీ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆన్లైన్కు అనుసంధానం చేయడం ద్వారా ఉల్లి అన్లోడ్ దగ్గరి నుంచి అమ్మకాల వరకు అన్ని దశల్లోనూ నిఘా పెట్టారు. ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్నగర్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ పెరుగుతుండటాన్ని ఆన్లైన్ ద్వారా గమనించిన ఉన్నతాధికారులు రద్దీని నియంత్రించేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు లైన్లు పెట్టాలని ఫోన్ ద్వారా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే ఒక్కొక్కరికి 2 కేజీల కంటే ఎక్కువ పరిమాణంలో ఉల్లిని విక్రయిస్తున్నారా...? ఐడీ ప్రూఫ్స్ చూస్తున్నారా.. లేదా ? ఏ టైంకు కౌంటర్లు తెరిచారు ? ఒక్కొక్కరికి ఉల్లిని విక్రయించేందుకు ఎంత సమయం పడుతోంది ? గంట వ్యవధిలో ఎంతమందికి సరుకు అందజేస్తున్నారు..? ఎన్ని బ్యాగ్ల ఉల్లి అయిపోయింది ? వంటి విషయాలను సిబ్బందిని అడగకుండా కేంద్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఒకవేళ జనాల రద్దీ అధికమై సరుకు సరిపోని పరిస్థితిని గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అక్కడికి 2గంటల వ్యవధిలోగా సరుకును చేరవేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండో రోజైన గురువారం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డిలు మెహిదీపట్నం రైతుబజార్ను సందర్శించి సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును గమనించారు. పక్కాగా నిఘా.. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలి వెళ్లే అవకాశం ఉందని అనుమానించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ పక్కాగా నిఘా పెట్టారు. ఓ వైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుండగా... మరో వైపు విజిలెన్స్ టీంలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రైతుబజార్ల సిబ్బందిపై డేగ కన్ను వేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్స్ వద్ద కూడా ఉల్లి దారిమళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి మన కూరగాయల వాహనాలు ఏయే ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నాయో అక్కడికి వెళ్లి మఫ్టీలో అమ్మకాల తీరును గమనిస్తున్నారు. రైతు బజార్లు, ఔట్లెట్స్లో వినియోగదారుడు ఐడీ ప్రూఫ్ చూపగానే రెండేసి కిలోల ఉల్లి అందిస్తున్నారు. నాణ్యమైన ఉల్లిని కేజీ రూ.20లకే అందిస్తుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోళ్లు చేస్తుండటం కన్పించింది. అయితే... కొందరు చిరువ్యాపారులు తమ కుటుంబ సభ్యులను లైన్లో నిలబెట్టి ఒకరికి డ్రైవింగ్ లెసైన్స్, మరొకరికి ఆధార్ కార్డు, ఇంకొకరికి గ్యాస్ కనెక్షన్ ఐడీ, బ్యాంకు పాస్బుక్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి చూపుతూ సబ్సిడీ ఉల్లిని పెద్ద మొత్తంలో తీసుకొంటున్నారు. అలాగే ఒక రైతుబజార్లో పరిశీలించిన ఐడీ విషయం మరో రైతుబజార్లో తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ఒకేరోజు రెండు మూడు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కొని చిరువ్యాపారులు రిటైల్గా అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. -
దొంగలు బాబోయ్ దొంగలు!
తాళంవేసి కనిపిస్తే ఇల్లు గుల్ల్లే మహిళల మెడలో గొలుసుల చోరీ విజయవాడ సిటీ : దొంగలు జోరుమీదున్నారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు కొల్లగొడుతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు గొలుసులు తెంచుకెళ్తున్నారు. సీసీఎస్ పునర్వ్యవస్థీకరణ బలం వీరిని ఏమాత్రం నిలువరించలేకపోతోంది. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే రాత్రి చోరీలు మినహా మిగిలిన నేరాల్లో దొంగలదే పైచేయి. పాత కేసుల్లో, పొరుగు జిల్లాల్లో చేసిన నేరాల్లో నిందితులను పట్టుకోవడం మినహా సీసీఎస్ సాధించిన పురోగతి ఏమీ లేదని చెప్పవచ్చు. ఆరు నెలల వ్యవధిలో చోరీల సంఖ్య భారీగానే ఉంది. వేసవిలో రాత్రి చోరీలు తగ్గినప్పటికీ మిగిలిన చోరీలు పెరిగాయి. నిఘా లోపం, నేరస్తులను గుర్తించడంలో సీసీఎస్ నిఘా(ఇంటిలిజెన్స్) విభాగం వైఫల్యం చెందింది. ఒకే రోజు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో గొలుసు దొంగలు విజృంభించడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. అది మరువక ముందే ఆదివారం రాత్రి గుణదలకు చెందిన వృద్ధురాలి మెడలో ఆగంతకులు గొలుసు తెంచుకుపోయారు. ఇంటి చోరీలు సగటున రోజుకు రెండు జరుగుతున్నాయి. కొన్ని చోరీలు పోలీసులు నమోదు కూడా చేయడం లేదు. అదేమంటే బాధితులనే బాధ్యులను చేస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వనిపిస్తున్నాయి. కొత్త దొంగల దృష్టి నగరంపై కొత్త దొంగలు దృష్టిసారించినట్టు పోలీ సులు అంగీకరిస్తున్నారు. మెజారిటీ చోరీల్లో నేరస్తుల వేలి ముద్రలు, ఇతర ఆధారాలు దొరక్కపోవడమే ఇందుకు నిదర్శనం. సులువుగా డబ్బు సంపాదిం చేందుకు అలవాటుపడిన యువత నేరాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. పొరుగు ప్రాంతాల నుంచి ఇక్కడి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని వీరు నేరాలు చేస్తున్నారు. పాత దొంగల సహకారంతోనే వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వారిచ్చిన సమాచారం ఆధారంగా దొంగలు తెగబడి నేరాలు చేస్తున్నారు. ఆపై సులువుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అటకెక్కుతున్న పాత కేసులు పోలీసుల ఉదాసీనత కారణంగా పాత కేసుల్లో నేరస్తులు చిక్కడం లేదు. అనేక కేసుల్లో విచారణ పెండింగ్లో ఉంది. పేరు మోసిన దొంగల ఆచూకీ కోసం దృష్టిపెడుతున్న సీసీఎస్ పోలీసులు ఇతర నేరగాళ్లను పట్టించుకోవడం లేదు. పేరున్న నేరస్తులు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆనుపాళ్లు తెలుసుకొని అరెస్టు చేస్తున్నారు. వారి నుంచి రికవరీ చేసే సొత్తులో ఇతర ప్రాంతాలకు చెందినవే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. కొత్త నేరస్తులను గుర్తించడంలో సీసీఎస్ నిఘా విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సీసీఎస్ పునర్వ్యవస్థీకరణ తర్వాత స్టేషన్ స్థాయిలో క్రైం సిబ్బందిని తొలగిం చారు. కేసుల నమోదు, గస్తీ బాధ్యతలను శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు. ఉన్న కేసుల దర్యాప్తుకే సమయం సరిపోవడం లేదని చెపుతున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆస్తి నేరగాళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నేరగాళ్ల సమాచారం పోలీసులకు చేరడం లేదు. తనఖాతో మస్కా గతంలో చోరీ సొత్తును నేరగాళ్లు బంగారు నగల షాపుల్లో విక్రయించేవారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ షాపుల నిర్వహకుల ద్వారా పోలీసులకు ఇట్టే తెలిసిపోయేది. ప్రైవేటు ఆర్థిక సంస్థల రంగ ప్రవేశంతో పరిస్థితి మారింది. తగిన గుర్తింపు పత్రాలు ఉంటే చాలు ఆయా సంస్థల్లో నగలు తనఖా పెట్టుకోవచ్చు. నగల షాపుల్లో విక్రయిస్తే చోరీ సొత్తు కాబట్టి అరకొర నగదు ఇచ్చేవారు. ఇదే ఆర్థిక సంస్థల్లో తనఖా పెడితే 70 నుంచి 80 శాతం మేర నగదు రావడంతో దొంగలు తెలిసిన వ్యక్తుల ద్వారా తనఖాకే మొగ్గు చూపుతున్నారు. నేరగాళ్ల ఆచూకీ పోలీసులకు తెలియకపోవడానికి ఇది కూడా కారణం. -
నల్లగొండ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా నిర్థారించినట్లు తెలుస్తోంది. పానగల్లో తప్పించుకున్న ఇద్దరు యువకులు.. ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ప్రకటించారు. కాగా మే 26వ తేదీన నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు పిస్టల్తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్లు బైక్పై సివిల్డ్రెస్లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. దాంతో ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు యువకులు... దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఠారెత్తిస్తున్నారు!
- రాజధానిపై కన్నేసిన మాదకద్రవ్యాల ముఠాలు - అప్రమత్తమైన ‘ఇంటెలిజెన్స్’ - ఆరాతీస్తున్న పోలీసులు విజయవాడ సిటీ : రాజధానిపై మాదకద్రవ్యాల ముఠాలు కన్నేశాయా.. ఇక్కడుండే కొందరి సాయంతో ఈ ముఠాలు పాగా వేయనున్నాయా.. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం మాదకద్రవ్యాల ముఠాల గురించి సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు సిమీ ఉగ్రవాదుల కదలికలు.. నకిలీ నోట్ల చెలామణి ముఠాలు.. రియల్ మాఫియాకు కేంద్రంగా మారిన రాజధాని మాదకద్రవ్యాల ముఠాలకు కేంద్ర స్థావరం కానుందనే సమాచారం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. సేకరించిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ పోలీసులు మాదకద్రవ్యాల ముఠాను పట్టుకున్నారు. వారి విచారణలో విదేశాల నుంచి సముద్ర మార్గంలో మాదకద్రవ్యాలను హైదరాబాద్కు తరలించినట్టు నిందితులు అంగీకరించారు. విదేశాల నుంచి మచిలీపట్నం పోర్టుకు చేరుకున్న తర్వాత విజయవాడకు చెందిన ఒకరిద్దరు వ్యక్తుల సాయంతో హైదరాబాద్కు తీసుకొచ్చినట్టు నిందితులు సమాచారమిచ్చారు. దీనిపై ఇక్కడి పోలీసులకు నిఘావర్గాలు సమాచారం ఇచ్చాయి. దాన్ని నిర్థారించుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. నిజంగానే ఇక్కడి వ్యక్తులు సహకరించారా.. లేక విచారణను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు తప్పుడు సమాచారం ఇచ్చారా.. అనే దిశగా పోలీసులు దృష్టిసారించినట్టు తెలిసింది. గతంలో మాదకద్రవ్యాల ముఠాల మూలాలు ఇక్కడ ఉండడం కూడా పోలీసులను ఆలోచనలో పడేసింది. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద హెరాయిన్ తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. దీంతో సరుకును వదిలేసి ముఠా సభ్యులు పరారయ్యారు. కొందరు స్థానికుల సాయంతోనే వీరు తప్పించుకున్నట్టు అప్పట్లో పోలీసులకు సమాచారం వచ్చింది. తిరిగి ఇలాంటి ఘటనలు లేనప్పటికీ.. శివారు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందనే అనుమానంపై తరుచూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిఘావర్గాల సమాచారంపై పోలీసులు అప్రమత్తమైనట్టు తెలిసింది. ముందునుంచే అనుమానాలు కొత్త రాజధాని ఏర్పాటు సమయంలో నకిలీ నోట్ల ముఠాలు, మాదకద్రవ్యాల ముఠాలు ముందస్తు స్థావరాలు ఏర్పాటుచేసుకుంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తూ వచ్చారు. ఆదినుంచే ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాజధాని పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేయడం పరిపాటని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ తరహా ముఠాలు రావచ్చని అనుమానించిన పోలీసువర్గాలు నిఘాను పటిష్టం చేశాయి. ఇప్పటికే నకిలీ నోట్ల ముఠాలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సమాచారం తమ అనుమానాలను బలపరిచిందని, దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయనున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
పాక్ పడవ పట్టివేత
రూ.600 కోట్ల మాదకద్రవ్యాల స్వాధీనం 8 మంది అరెస్టు పోరుబందర్: గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఓ అనుమానాస్పద పడవను భారత నేవీ, తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.600 కోట్ల విలువైన 232 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న 8 మంది పాకిస్తాన్ సిబ్బందిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో.. నేవీ, కోస్ట్ గార్డ్లు సంయుక్తంగా సోమవారం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఐసీజీ డీఐజీ ఎస్ఈ గుప్తా మంగళవారం తెలిపారు. నేవీతో పాటు ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలు పాక్ సిబ్బందిని విచారించనున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం పడవను మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఇండియన్ కోస్ట్డార్డ్కు చెందిన నౌక సంగ్రామ్ పాక్ పడవను అడ్డుకోగా.. నేవీ నౌక కొండూల్ ఈ ఆపరేషన్కు పూర్తి సహకారం అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా మంగళవారం సంగ్రామ్ నౌకలో మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టారు. పడవ నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలతో పాటు శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ వ్యవస్థలను ప్రదర్శించారు. నాలుగు నెలల క్రితం అరేబియా సముద్రంలో పాక్ పడవ ఒకదానిని కోస్ట్గార్డ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా.. దాన్ని సిబ్బందిగా భావిస్తున్నవారే పేల్చివేశారు. -
దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా..
ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన దేవస్థానం, పోలీసు అధికారులు కొండపై నిఘా కట్టుదిట్టం ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక విజయవాడ : నిత్యం భక్తులతో జనసమ్మర్థంగా ఉండే ఇంద్రకీలాద్రిపై సిమీ ఉగ్రవాదులు కన్నేశారా.. దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా.. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్) దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో సోమవారం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అబుఫైజల్ గ్యాంగ్కు చెందిన సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్ అహ్మద్ హతమైన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి ఫైజల్ సహా ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా.. ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఇద్దరూ గతంలో విజయవాడలో జనసమ్మర్థంగా ఉండే కొన్ని ముఖ్యమైన స్థలాలపై రెక్కీ నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. రెండోసారి విజయవాడకు వస్తూనే ఎన్కౌంటర్లో చనిపోయారని, మిగిలిన నలుగురు ఉగ్రవాదులు రాజధాని ప్రాంతంలోనే తలదాచుకున్నారనే అనుమానాలు ఇంటిలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే బస్స్టేషన్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. అధికారులు అప్రమత్తం... ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు వెంటనే దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవయ్యతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కమాండెంట్ నాగమల్లేశ్వరరావు, సివిల్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బందితో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి చర్చించారు. దేవస్థానంలో మూడు షిఫ్టుల్లోనూ కలిపి 113 మంది ఓపీడీఎస్ సిబ్బంది, 18 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 20 మంది హోమ్గార్డులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి వీరు సరిపోతారని, అయితే వీరు నిరంతరం నిఘాను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. సెల్ఫోన్లపై నిషేధం! ప్రస్తుతానికి దేవస్థానంలో సెల్ఫోన్లను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే సెల్ఫోన్లకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి భక్తులు అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పోలీసు, సెక్యురిటీ అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న డాగ్ చెకింగ్, భక్తుల బ్యాగుల చెకింగ్లను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి భక్తుల బ్యాగులను అనుమతించకూడదనే నిబంధన మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. దేవస్థానానికి వచ్చే దారులన్నింటిలోనూ రాత్రివేళల్లోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దేవస్థానంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తామని, అవసరమైతే మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక... విజయవాడ నగరంలో సిమీ ఉగ్రవాదుల జాడలు కనపడుతున్న నేపథ్యంలో దేవస్థానంలో తీసుకునే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న రక్షణ చర్యలపై పోలీసు, దేవస్థానం అధికారులు ఒక ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోరిక మేరకే ఈ నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సెక్యురిటీ పరంగా ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు వస్తే వాటిని కూడా తక్షణం అమలు చేసేందుకు దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. -
టెన్షన్.. టెన్షన్
అక్రమార్కుల్లో వణుకు ఆమ్యామ్యాలపై నిఘా నేత్రం నిన్న పింఛన్లు, నేడు సీఎం సహాయ నిధిపై ఆరా పరకాల : సర్కారు కార్యాలయూల్లో అలజడి.. అవినీతి పరుల్లో ఆందోళన.. తమ నీడను తామే నమ్మలేని పరిస్థితి.. అవినీతి బాగోతాలు ఎప్పుడు బయటపడుతాయోనని కలవరం.. క్షేత్రస్థారుులో ఇటీవల నెలకొన్న పరిస్థితి ఇదీ. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించని నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల కదలికపై నిత్యం నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లంచం అడిగే అధికారులు, అవినీతి బాగోతాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయూలని స్వయంగా సీఎం కేసీఆర్ టోల్ఫ్రీ నంబర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసరా పింఛన్ల అమలు పర్యవేక్షణ కోసం విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సీఎం సహాయ నిధి లబ్ధిదారుల వివరాలు నిర్ధరించేందుకు సీఐడీ పోలీసులు రహస్యంగా ఆరా తీస్తున్నారు. ఇది ఉద్యోగుల్లో టెన్షన్ పెంచుతోంది. మండలంలో జరిగిన ఆసరా పింఛన్ల గోల్మాల్లో విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత నెల 21న ఎంపీడీవో కార్యాలయంలో విచారణ జరిపారు. ఇప్పుడున్న పింఛన్ లబ్ధిదారుల్లో 20శాతం మంది బోగస్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. విజిలెన్సు అధికారులు ఆసరా పింఛన్ల జాబితాను గ్రామాల వారీగా తీసుకున్నారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు ముందు గుర్తించిన గ్రామాల్లోనే రహస్య విచారణకు సిద్ధపడుతున్నారు. నివేదిక ను సీఎంకు ఇస్తారు. లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు 04023454071 టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటికే మండలం నుంచి చాలా మంది ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. నగర పంచాయతీలో కొందరు అధికారులు ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ లక్షల్లో వసూలు చేసిన వ్యవహారంపైనా ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన రోడ్డు విస్తరణలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసినట్లు కో ఆప్షన్ సభ్యుడు మేరుగు శ్రీశైలం తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై బాధితులు ఫోన్ చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఎక్కువ ఫోన్లు పరకాల నుంచే టోల్ఫ్రీకి చేరుతున్నాయని సమాచారం. సీఎం సహాయ నిధి లబ్ధిదారుల వివరాలను సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీఐ జి. మోహన్ రెండు రోజుల క్రితం పట్టణంలోని డాక్టర్లును కలిసి వివరాలు తెలుసుకున్నారు. సీతారాంపురం గ్రామాన్ని సందర్శించారు. ఎవరి ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు? దళారుల ప్రమేయం ఉందా? అనే విషయూలు ఆరా తీస్తున్నారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో సీఐడీ విస్తృతంగా విచారణ చేసింది. {పభుత్వ కార్యాలయాల్లో ఇంటలిజెన్సు అధికారులు సామాన్య ప్రజల్లాగే ఆయా కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను అక్కడకు వచ్చే వారితో మాటలు కలిపి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘాల వర్గాల కన్ను ఉండగా ఇప్పుడు అధికారులపై అదే మంత్రాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం. -
దొంగనోట్ల ముఠా కోసం వేట !
భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం క్రితం వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పెద్దినేని రవిప్రసాద్, పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడు పవన్ కుమార్ రెడ్డి పట్టుబడ్డారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు బయట పడగా, వీటిని ముద్రించటం వారి ఇద్దరి వల్లనే సాధ్యమైందా ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విలీనమైన మండలాల్లో ఇటీవల దొంగనోట్లు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఇప్పటికే పెద్ద మొత్తంలోనే దొంగనోట్ల మార్పిడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో దీని వెనుక మరికొంతమంది పాత్ర ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా, భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ మళ్లీ ఊపందుకోవటంపై జిల్లా పోలీసుశాఖ ఉన్నతాధికారులు సీరియస్గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ యువ ఎస్సై దొంగనోట్ల కేసు వ్యవహారంలో తలదూర్చి ఏకంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా దొంగనోట్లు దొరికితే, అది భద్రాచలంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లుగా బయట పడుతుండటం జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆలోచనలో పడేసింది. భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ, నల్లబెల్లం విక్రయాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల అమ్మకాలు వంటివి అడపా దడపా బయట పడుతుండటంతో దీని వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించారుు. ఎందుకిలా జరుగుతోంది భద్రాచలం పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలపాలకు అడ్డుక ట్ట వేసేందుకు పోలీసులు నడుం బిగించారు. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరన్ ప్రెండ్లీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా దివస్ను కూడా నిర్వహిస్తూ, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా భద్రాచలం పట్టణంలో దొంగనోట్ల ముద్రణ వ్యవహారమే పోలీసుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. చిన్నపాటి పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సరిపడా పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. పట్టణ పోలీసు స్టేషన్తో పాటు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. వీరితో పాటు నిఘా వర్గాలు సైతం పనిచేస్తున్నాయి. అరుునప్పటికీ అసాంఘిక చర్యలు వెలుగులోకి రావడం వారిని కలవరపాటుకు గురిచేస్తున్నారుు. నిఘా పటిష్టం చేయాల్సిందే భద్రాచలం పట్టణంలోని శివారు కాలనీల్లో కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. నాలుగు రాష్ట్రాల కూడలిగా ఉన్న భద్రాచలంలో వివిధ వ్యాపారాల నిర్వహణ కోసమని ఇక్కడికి అనేకమంది వస్తుంటారు. పట్టణానికి అనుకొని ఉన్న ప్రాంతం అంతా ప్రస్తుతం ఏపీలో విలీనం అయింది. నెల్లిపాక మండల కేంద్రంగా ఏపీ పోలీసులు పాలన సాగిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంపై అవగాహన పూర్తి స్థాయిలో లేకపోవటం కొంత ఇబ్బంది కలిగించే అంశమని పట్టణవాసులు అంటున్నారు. భద్రాచలం పోలీసులు వారితో సమన్వయం చేసుకొని శివారు కాలనీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
గులాబీలో నిఘా గుబులు
అమాత్యుల సహాయకుల వివరాల సేకరణ అప్పుడు పొన్నాల పీఏ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర.. ఇప్పటికే సేకరించిన ఇంటెలిజెన్స్ వరంగల్ : అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇంటెలిజెన్స్ భయం పట్టుకుంది. రాజకీయ పదవులు వచ్చే విషయంలో ఇంటెలిజెన్స్ నివేదికలు కీలకమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. కొందరు మాత్రం ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మంత్రుల స్థాయి ప్రజాప్రతినిధులే ఈ విషయంలో ముందుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల వద్ద, వారి కార్యాలయాల్లో పని చేసిన ఉద్యోగులను, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు నియమించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ మంత్రుల వద్ద పని చేసిన కొందరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొత్త మంత్రుల వద్ద చేరారు. స్వయంగా ఆదేశాలు ఇచ్చినా ఇలా జరగడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే మంత్రులు ఈ విషయాన్ని సరిదిద్దుకున్నారు. జిల్లాలో విచిత్ర పరిస్థితి జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య వద్ద వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న ఉద్యోగిని.. వరంగల్ ఎంపీగా గెలిచిన తర్వాత కడియం శ్రీహరి తన వద్ద నియమించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల విషయంలో లోక్సభ సభ్యుల ప్రస్తావన లేదనే విషయంతో దీనిపై ఇబ్బంది రాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చిన మార్పులతో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలక స్థానంలో ఉన్న శ్రీహరి.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న నాయకుడి వద్ద పని చేసిన ఉద్యోగిని కొనసాగిస్తుండడంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి కార్యక్రమాల విషయాలు తమకంటే కొందరు కాంగ్రెస్ నేతలకే ముందుగా తెలుస్తున్నాయని టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి ప్రజాప్రతిధులు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నేతలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. శ్రీహరి లోక్సభ సభ్యుడిగానూ ఉన్నందు వల్ల సదరు సహాయకుడు ఇంకా కొనసాగుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం వారు సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ విషయంలో శ్రీహరి ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంటెలిజెన్స్ వేగం తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కొత్త రాష్ట్రం ఏర్పాటుతో తమకు పని పరంగా ఊరట లభిస్తుందని భావించారు. వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉంన్నాయి. ఉద్యమ సమయంలో కంటే ఇప్పుడు పని పెరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కార్యక్రమాలపై నివేదికల తయారీతో నిత్యం బిజీగా ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం మిగిలిన ప్రజాప్రతినిధుల కంటే మంత్రులు, ఆ స్థాయి ప్రజాప్రతినిధుల విషయంలో ప్రతి అంశంపై నివేదికలు రూపొందిస్తోంది. జిల్లాలో మంత్రులు పాల్గొనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలపై ఏ రోజుకారోజు సమాచారాన్ని చేరవేస్తోంది. మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులపై మంత్రులు, వారి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నిఘా పెడుతోంది. ఆయా గ్రామాలు, తమ పరిధిలోని పనులు, ఇతర అంశాలపై మంత్రుల వద్దకు వచ్చే వారితో మంత్రుల సిబ్బంది ఎలా ఉంటున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఈ అంశాలతోనే తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల విషయంలోనూ ఈ నివేదికలకు ప్రాధాన్యత ఉంటోంది. -
మూర్ఖపు విద్య
పిల్లల కథ అనగనగా గంగాపురం అనే ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారిలో ముగ్గురికి సర్వశాస్త్రాల్లోనూ ప్రావీణ్యం ఉంది. కానీ తెలివి తేటలు, లౌక్యం మాత్రం శూన్యం. స్నేహితుల్లో నాలుగోవాడైన రంగరాజుకు అంతగా చదువు రాకపోయినా, కావాల్సినన్ని తెలివితేటలు ఉన్నాయి. నలుగురు స్నేహితులు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒక రోజు పొరుగు రాజ్యానికి బయలుదేరతారు. ‘‘మాకంటే సరే, చదువురాని నీకు అక్కడ ఏం పని దొరుకుతుంది?’’ అని ముగ్గురు స్నేహితులూ రంగరాజును ఎగతాళి చేస్తారు. ‘‘ఏదో ఒక పని దొరక్కపోదులే’’ అని శాంతంగా బదులిస్తాడు రంగరాజు. మార్గమధ్యంలో వీరు ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అలా నడుస్తుండగా వారికి ఒక సింహం కళేబరం కనిపిస్తుంది. దాన్ని చూసిన మొదటి వాడు, పడివున్న ఎముకలన్నింటినీ సరిగ్గా సింహం ఆకారంలో పేర్చుతాడు. రెండో వాడు ఆ ఎముకలకు చర్మం, మాంసాలను చేకూరుస్తాడు. ఇక మూడోవాడు దానికి ప్రాణం పోస్తానంటాడు. వారి చర్యలను గమనిస్తున్న రంగరాజు, ‘‘మిత్రులారా! మీరు గొప్ప పండితులని నాకు తెలుసు. ఇంతవరకూ మీరు ప్రదర్శించిన విద్యావినోదం నన్నెంతగానో ముగ్ధుడిని చేసింది. కానీ సింహం క్రూర జంతువు. దానికి ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు తీస్తుంది’’ అని హెచ్చరించాడు. అయినా ఆ స్నేహితులు వినలేదు. వీళ్ల మూర్ఖత్వం బాగా తెలిసిన రంగరాజు ఒక పక్కకు వెళ్లి, పెద్ద బూరుగుచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకేం, మూడోవాడు తన విద్య ప్రదర్శించగానే, సింహం ప్రాణంతో లేచి నిలబడింది. దాంతో ముగ్గురూ ప్రాణభయంతో పరుగు అందుకున్నారు. -
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
-
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్-ఇ- తోయిబా ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పాక్ సరిహద్దుల్లోనూ భద్రత పెంపుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 10 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో మోహరించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. -
నిఘా పెంచండి
నగరంలో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయూలి కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆదేశం బెంగళూరు : బెంగళూరు నగరంలో ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజా రక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. బొమ్మనహళ్లి పరిధిలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డులో స్వచ్ఛభారత్, బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సతీష్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రితో చర్చించామన్నారు. ఇందులో భాగంగా తన శాఖ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛభారత్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బొమ్మనహళ్లి బీజేపీ అధ్యక్షుడు మాలా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ స్వభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానికులతో సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ బొమ్మనహళ్ళి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డుల్లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు సయ్యద్ అన్వర్, బీజేపీ నాయకుడు సయ్యద్ సలాం, బీజేపీ యువమొర్చా అధ్యక్షుడు రమేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు నాగేంద్ర, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతకుముందు స్థానికులు చేపట్టిన స్వచ్చభారత్ కాార్యక్రమంలో అనంతకుమార్ పాల్గొని వీధుల్లో గోడలకు రంగులు వేశారు. -
పాక్లో కౌంటర్ టైజం ఫోర్స్ ఏర్పాటు
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరును తీవ్రతరం చేసిన పాకిస్తాన్.. ఇందుకుగానూ ఫెడరల్ కౌంటర్ టైజం ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ దళం తక్షణం అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. రక్షణ శాఖకు అనుబంధంగా ఇది పని చేస్తుందని, దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఈ దళం పౌర, మిలిటరీ, నిఘా, భద్రతా ఏజెన్సీలు, కౌంటర్ టైజం విభాగాలతో కలసి పనిచేస్తుందని తెలిపింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసంలో శుక్రవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదురి నిసార్ కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ.. ఐదువేల మందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, శుక్రవారం నాటి సమావేశంలో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై నిఘా పెట్టాలని వివిధ ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదల సంస్థలు, మిలిటెంట్లకు అందే నిధులపై ఆర్థిక శాఖ, స్టేట్ బ్యాంక్ పర్యవేక్షించనుంది. -
80 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి భారీగా 80 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇలా భారీ ఎత్తున బదిలీలు చేయడం ఇది రెండో సారి. నవంబర్ చివరి వారంలో జరిగిన గత బదిలీల్లో పోస్టింగ్ దక్కని 64 మంది డీఎస్పీలకు తాజాగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో ఒక్కరికి కూడా శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ దక్కకపోవడం గమనార్హం. పేరు ప్రస్తుత స్థానం కొత్త స్థానం జి.వెంకటేష్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్ పి.నాగారాజరెడ్డి వెయిటింగ్ సీఐడీ ఎస్.శ్రీనివాసా చార్యులు వెయిటింగ్ ట్రాఫిక్ చార్మినార్ బి.మల్లిఖార్జున వెయిటింగ్ సీఐడీ ఎన్.మహేందర్ వెయిటింగ్ ట్రాన్స్కో ఎస్.గోద్రు వెయిటింగ్ ఎసిబి జిపి వాసుసేన వెయిటింగ్ సిఐ సెల్ సైబరాబాద్ జి.అశోక్కుమార్ వెయిటింగ్ ఎసిబి వి.ప్రకాశ్రావు వెయిటింగ్ ఎస్పి సిఐడి టి.నాగరాజ్కుమార్ వెయిటింగ్ క్రైమ్ సైబరాబాద్ ఎం.మహేశ్వర్ వెయిటింగ్ ఎస్బి సైబరాబాద్ టి.గోవింద్రెడ్డి వెయిటింగ్ పిటిసి అంబర్పేట్ వివి రమణకుమార్ వెయిటింగ్ అప్పా బి.మనోహర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్ కె.సురేందర్రెడ్డి వెయిటింగ్ టిఎస్ ఆర్టీసి కె.శ్రీనివాస్రావు వెయిటింగ్ సీఐడీ కె.వెంకట లక్ష్మి వెయిటింగ్ అప్పా ఇ.సుప్రజ వెయిటింగ్ సిటిసి హైదరాబాద్ డి.కవిత వెయిటింగ్ అప్పా కె.ఈశ్వర్రావు వెయిటింగ్ వరంగల్ అర్భన్ కె.సురేష్కుమార్ వెయిటింగ్ ఎసిబి ఎ.సురేష్బాబు వెయిటింగ్ సీఐడీ ఎస్వి మాధవరెడ్డి వెయిటింగ్ అప్పా ఎస్హెచ్ అహ్మద్ వెయిటింగ్ ఎసిబి సి.సత్యనారాయణరెడ్డి వెయిటింగ్ డిటిసి వరంగల్ పి.పరమేశ్వర్రెడ్డి వెయిటింగ్ సిఐడి పి.వేణుగోపాల్రావు వెయిటింగ్ సిసిఎస్ సైబరాబాద్ పి.బాలకృష్ణారావు వెయిటింగ్ ఇంటెలిజెన్స్ పి.రవీందర్రావు వెయిటింగ్ ఎస్బి వరంగల్ బి.అశోక్కుమార్ వెయిటింగ్ ఎస్బిఖమ్మం బి.సాయిశ్రీ వెయిటింగ్ డిటిసి ఖమ్మం ఎస్.మనోహర్రావు వెయిటింగ్ పిసిఎస్ అండ్ ఎస్ ఎం.శ్రీధర్రెడ్డి వెయిటింగ్ ట్రాఫిక్ ఎల్బినగర్ ఎస్.శ్రీనివాస్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్ కె.మనోహర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్ కె.మోహన్ వెయిటింగ్ ఎసిబి జె.రామ్మోహన్రావు వెయిటింగ్ పిటిసి కరీంనగర్ జి.శ్రవణ్కుమార్ వెయిటింగ్ డిటిసి కరీంనగర్ ఎం..తాజుద్దిన్ అహ్మద్ వెయిటింగ్ ఎసిపి సిసిఎస్ సిటి పి.నర్సింహులు వెయిటింగ్ ఇంటెలిజెన్స్ సిటి కె.మురళిధర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్ కె.చక్రవర్తి వెయిటింగ్ టీఎస్ఎస్పీ నల్లగొండ హేమావతి వెయిటింగ్ ట్రాన్స్కో సి.రాజిరెడ్డి వెయిటింగ్ ఎస్బీ సిటీ జి.ప్రకాష్రావు వెయిటింగ్ ఇంటెలిజెన్స్ టి.సాయిమనోహర్ వెయిటింగ్ ఏసీబీ ఎస్.శ్రీధర్ వెయిటింగ్ వరంగల్ పీటీసీ సీహెచ్.చెన్నయ్య వెయిటింగ్ సీఐడీ ఎం.శ్రీనివాస్రావు వెయిటింగ్ సీసీఎస్ సిటీ ఎల్.ఆనంద్భాస్కర్ వెయిటింగ్ సీఐడీ టి.అమర్కాంత్రెడ్డి వెయిటింగ్ విజిలెన్స్ డి.వెంకటనర్సయ్య వెయిటింగ్ జెన్కో డి.శ్రీనివాస్ వెయిటింగ్ విజిలెన్స్ టియస్.రవికుమార్ వెయిటింగ్ అంబర్పేట పీటీసీ పద్మనాభరెడ్డి వెయిటింగ్ సీఎస్ఓ ఐడీపీఎల్ సి.ప్రభాకర్ వెయిటింగ్ ఎస్బీ కరీంనగర్ పి.రవిందర్ వెయిటింగ్ సీసీఎస్ సిటీ శ్రీనివాస్ వెయిటింగ్ సీసీఎస్ సిటీ వి.శ్రీనివాసులు వెయిటింగ్ సీసీఎస్ సిటీ కల్వకోట ప్రసన్న వెయిటింగ్ సీసీఎస్ సిటీ సీహెచ్.సృతకీర్తి వెయిటింగ్ ఎస్బీ నల్లగొండ రాఘవేంద్రరెడ్డి వెయిటింగ్ ట్రాఫిక్ కూకట్పల్లి కె.శ్రీలక్ష్మీ వెయిటింగ్ సీఐడీ జి.స్వరూపరాణి వెయిటింగ్ పీసీఎస్ అండ్ ఎస్ ఎం.రవీంద్రారెడ్డి సీఎస్ఓ ఐడీపీఎల్ ఇంటెలిజెన్స్ చైతన్యకుమార్ అప్పా ఇంటెలిజెన్స్ రమేష్ ఇంటెలిజెన్స్ ఎక్సైజ్ సీహెచ్కుమారాస్వామి ఖమ్మం ఏఆర్ పీటీసీ వరంగల్ వీఎం.సునిత ట్రాఫిక్ కూకట్పల్లి సీసీఎస్ నల్లగొండ పీవీ నారాయణస్వామి టీఎస్ఎస్పీ అదిలాబాద్ టీఎస్ఎస్పీ యూసుఫ్గూడ పి.సంజీవ్ పీటీసీ వరంగల్ ఏఆర్ ఖమ్మం జి.ఆంజనేయులు ట్రాఫిక్ చార్మినార్ ఎస్పీఎఫ్ ఈ.శంకర్రెడ్డి టీఎస్ఎస్పీ నల్లగొండ హెచ్ఆర్సీ యన్.విజయ్కుమార్ ఎస్బీ మెదక్ సీసీఎస్ సిటీ యన్.రవి సీసీఎస్ సిటీ ఎస్బీ మెదక్ కె.శ్రీనివాస్రావు సీఐడీ ట్రాన్స్కో రామచంద్రుడు సీఐడీ ట్రాన్స్కో రామాంజనేయులు టీఎస్ఎస్పీ డిచ్పల్లి సీఐడీ కె.వెంకట్రావు ఎస్బీ ఖమ్మం డీజీపీ కార్యాలయం యన్.నతానియల్ ట్రాఫిక్ ఎల్బీనగర్ డీజీపీ కార్యాలయం -
అమలాపురం డీఎస్పీగా అంకయ్య
అమలాపురం టౌన్ : అమలాపురం డీఎస్పీగా ఎల్.అంకయ్య నియమితులయ్యారు. విజయవాడ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఈయన బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. అంకయ్యకు జిల్లాతో 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఆరు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా, రెండు చోట్ల సీఐగా పనిచేశారు. 1989 ఎస్సై బ్యాచ్కు చెందిన అంకయ్య జిల్లాలోని వై.రామవరం, సామర్లకోట, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేటల్లో ఎస్సైగా పనిచేశారు. రాజమండ్రి టౌన్, రాజమండ్రి రూరల్, రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐగా బాధ్యతలు నిర్వహించారు. హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహానికి గురైన అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈయన స్థానంలో తొలుత రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రామచంద్రరావు నియమితులయ్యారు. అయితే ఆయన అమలాపురం వచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన బదిలీ ఆగింది. తర్వాత జరిగిన బదిలీల ప్రక్రియలో అంకయ్య నియమితులయ్యారు. కొత్త డీఎస్పీ మంగళవారం బాధ్యతలు స్వీకరించాక వీరారెడ్డి రిలీవ్ కానున్నారు. కోనసీమ నాకు కొట్టిన పిండే జిల్లాలో ఎస్సై, సీఐగా 20 ఏళ్ల పాటు పనిచేయడం, కోనసీమలోని కొత్తపేట ఎస్సైగా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతం తనకు కొట్టిన పిండేనని కొత్త డీఎస్పీ అంకయ్య అన్నారు. విజయవాడ నుంచి ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడారు. కోనసీమ పరిస్థితులకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేస్తానన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై తక్షణం స్పందించేలా చర్యలు చేపడతానన్నారు. -
‘జనశక్తి’పై ఆరా
మోర్తాడ్: మండలంలోని ఏర్గట్లలో జనశక్తి నక్సల్స్ సంచారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. రెండు రోజుల కింద ఏర్గట్లలో సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీకి చెందిన ఆజ్ఞాత కార్యకర్తలు సభ నిర్వహించి, బ్యానర్లను ఏర్పా టు చేశారు.దీంతో ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీ స్తున్నారు. జనశక్తి నక్సల్స్ కదలికలు మొదలైనట్లు ప్రచారం జరుగడంతో పోలీసులు మాజీలను విచారిస్తుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈనెల 30న నిర్వహించనున్న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాల ని కోరుతూ జనశక్తి కార్యకర్తలు ఏర్గట్లలోని స్మారక స్థూపం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఏర్పాటు చేస్తూ పాటలు పాడి అమరవీరులకు నివాళులు అర్పించినట్లు ప్ర చారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యానర్లను తొలిగించినప్పటికి గ్రామానికి వచ్చిన వారు ఎవరై ఉంటారని వివరాలు సేకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ నక్సల్స్ కదలికలు కనిపించడం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనశక్తి పార్టీకి చెందిన మాజీలపైనా పోలీసులు దృష్టిసారిం చారు. గ్రామంలో జనశక్తి నక్సల్స్ కదలికలు కల్లోలం రేపుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. -
ఇంటెలిజెన్స్ అధికారి ఇంటికే కన్నం
కిలో బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు దైవదర్శనానికి వెళ్లొచ్చేలోగా ఘటన సైదాబాద్: దొంగలు బరి తెగించారు... ఏకంగా ఓ ఇంటెలిజెన్స్ కార్యాలయ అధికారి ఇంటినే టార్గెట్ చేశారు... రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారం, 7 తులాల వెండి ఎత్తుకెళ్లారు.. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం... లక్డీకాపూల్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో అడ్మిన్ ఆఫీసర్గా పని చేస్తున్న వైవీఎస్ భాస్కరశర్మ సైదాబాద్ డివిజన్ లోకాయుక్తకాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఈనెల 27న కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. గురువారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఆందోళనకు గురైన భాస్కరశర్మ కుటుంబసభ్యులు లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్థారణకు వచ్చి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో భద్రపర్చిన సుమారు రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారు నగలు, 7 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. మలక్పేట ఏసీపీ సీహెచ్ సుధాకర్, స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని సందర్శించి చోరీ తీరును పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇది తెలిసిన వారి పనా? లేక ప్రొఫెషనల్స్ చేసిన చోరీనా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఆఫీసర్ ఇంట్లోనే చోరీ జరగడంతో ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు మొదట జాగ్రత్తపడ్డారు. చివరకు విషయం బహిర్గతం కావడంతో చోరీ జరిగిందని అంగీకరించారు. మీడియాను మాత్రం ఘటనా స్థలంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. కాగా, గత వారమే సరస్వతీనగర్లో న్యాయవాది ఇంట్లో 30 తులాల బంగారం చోరీ జరిగిన విషయం మరువకముందే తాజాగా.. ఇంటెలిజెన్స్ అధికారి ఇంట్లో భారీ దొంగతనం జరగడంతో ఈ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చోరీల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
‘టెండర్ల'పై ఇంటెలిజెన్స్ ఆరా!
టవర్సర్కిల్ : కరీంనగర్ కార్పొరేషన్లో టెండర్ల రద్దు అంశంపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. టెండర్లు రద్దు చేసి, సమస్య ముగిసి పోయిందనుకున్న అధికారులకు చుక్కెదురైంది. అవకతవకల్లో బాధ్యుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. అర్హత లేని కంపెనీకి రూ.10 కోట్ల విలువైన పారిశుధ్య నిర్వహణ టెండర్లు కట్టబెట్టే యత్నాలు జరగడం... అక్రమాలపై ఁసాక్షి* వరుస కథనాలు ప్రచురించడంతో టెండర్లు రద్దు చేస్తూ కమిషనర్ శ్రీకేశ్ లట్కర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. టెండర్లలో అవకతవకలపై ఇంటెలి జెన్స్ అధికారులు దృష్టి సారించారు. శనివారం నగరపాలక సంస్థకు చేరుకుని ఆరా తీశారు. కమిషనర్ సెలవులో ఉండడంతో ఎస్ఈ, ఈఈని ప్రశ్నించినట్లు తెలిసింది. గంటపాటు అధికారులతో మాట్లాడిన ఇంటెలిజెన్స్ విభా గం అధికారులు టెండర్ల ఫైళ్లు పరిశీలించి, పలు ప్రశ్నలు సంధించి, ఇంజినీరింగ్ అధికారుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. అనంతరం కొంత మంది కాంట్రాక్టర్లు, నాయకులతో మాట్లాడి టెండర్లకు సంబంధించి రాజ కీయ పాత్ర, పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అధికారులు నిబంధనలు తుంగ లో తొక్కడం, ఆ తర్వాత దిద్దుకునే ప్రయత్నం చేయడం, అది కుదరకపోవడంతోనే టెండర్ల రద్దు జరిగిందా...! లేక టెండర్ల రద్దు వెనక ఎమైనా ఉద్దేశం దాగి ఉందా? అనే అంశంపై దృష్టి సారించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆ కోణంలోనే ప్రశ్నించినట్లు సమాచారం. టెండర్లలో రెండు నెలల జాప్యం.. టెక్నికల్ బిట్ తెరిచి అర్హత లేని ఏజెన్సీలకు కూడా ఫైనాన్స్ బిట్ తెరవడం వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆదేశాలతోనే? పనులు దక్కుతాయని ఆశపడిన కాంట్రాక్టర్లకు నిబంధనలు అడ్డు వచ్చాయి. ఐఏఎస్ కమిషనర్గా ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పిదంతోనే తమకు పనులు దక్కలేదని ఈ విషయాన్ని రాష్ట్ర రాజధాని వరకు కాంట్రాక్టర్లు తీసుకెళ్లారు. కరీంనగర్ నగరపాలక సంస్థ శానిటేషన్ టెండర్ల బాగోతం రాజధానికి చేరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని, విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగంలో సీఐ స్థాయి అధికారి మరో ఇద్దరు అధికారులు రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందోననే అధికారుల్లో గుబులు మొదలైంది. అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందనే చర్చలు మొదలయ్యాయి. -
మెదడు పెద్దగా ఉన్నా.. అంతే తెలివితేటలు!
మెదడు పెద్దగా ఉండే జీవులకు తెలివితేటలూ ఎక్కువగా ఉంటాయన్న భావన తప్పట. పెద్ద జీవులకు మెదడు పెద్దగా ఉన్నంత మాత్రాన చిన్న జీవులకన్నా మించిన తెలివి ఉండబోదట. పెద్ద ఎలుకలు(ర్యాట్స్), చిట్టెలుకలు(మైస్)పై పరిశోధన నిర్వహించిన అమెరికాలోని ‘కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ’ శాస్త్రవేత్తలు ఈ సంగతి వెల్లడించారు. మెదడు పెద్దగా ఉండే పెద్ద ఎలుకలకు చిట్టెలుకల కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తున్నారు. కానీ విషయాలను నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలుకలు, చిట్టెలుకల మధ్య పెద్దగా తేడా లేదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద ఎలుకలు, చిట్టెలుకల్లో సంక్లిష్ట విషయాలు నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, శబ్దాలకు స్పందన, ప్రవర్తన, ఇతర పలు అంశాలను పరీక్షించిన వీరు.. ఎట్టకేలకు రెండింటి తెలివితేటల స్థాయి ఒకటేనని తేల్చారు. చిట్టెలుకల కన్నా పెద్ద ఎలుకలు కాస్త వేగంగా విషయాలను నేర్చుకున్నప్పటికీ.. వాటికి శిక్షణ ఇచ్చే పద్ధతులు మెరుగ్గా ఉండటం వల్లే అలా జరిగిందని వీరు అంటున్నారు. -
ఏపీ మంత్రులపై టీడీపీ నిఘా
{పతీ మంత్రి పేషీలో లోకేశ్ నిఘా సీసీ కెమెరాలు .. మీడియా లైజనింగ్ ఆఫీసర్ల ఏర్పాటు హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తన మంత్రులపైనే నిఘా పెట్టింది. సాధారణంగాప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. అయితే ఇప్పుడు మంత్రుల పేషీల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముద్దుగా మీడియా లైజనింగ్ ఆఫీసర్లు (ఎంఎల్ఓ) అని పేరు పెట్టారు. మంత్రులు ప్రతీరోజు ఎన్ని గంటలకు ఆఫీసుకు వస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలకు ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నారు, ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంటోందనే వివరాలను సేకరిస్తారు. సమాచారాన్ని ఏ రోజుకు ఆ రోజు లోకేశ్కు ఆన్లైన్ ద్వారా పంపిస్తారు. ఆన్లైన్లో మీడియా లైజనింగ్ ఆఫీసర్లు పంపిన సమాచారాన్ని, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అంశాలను బేరీజు వేసుకుని లోకేశ్ మంత్రుల పనితీరును అంచనా వేస్తారు. ఎవరినైనా మంత్రివర్గం నుంచి తొలగించాల్సివస్తే సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అంశాలను వినియోగిస్తారు. ఇందుకోసం పార్టీలో పనిచేసినవారిని, వివిధ పత్రికలు, టీవీల్లో పనిచేసి పార్టీకి ప్రధానంగా చంద్రబాబుకు విధేయులైన 30 మందిని లోకేశ్ ఎంపిక చేసి జాబితాను సీఎం ద్వారా సమాచార కమిషనర్కు పంపారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా మరో పదిమంది పేర్లను సమాచార కమిషనర్కు పంపారు. మంత్రుల దగ్గర పనిచేయడానికి 20 మందిని మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ సమాచార కమిషనర్ ఆదేశాలను జారీ చేయాల్సి ఉంది. సమాచార శాఖ కమిషనర్ దాన కిషోర్ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంతో ఆయన సంబంధిత ఫైలు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. -
27న సీఎం జయలలిత బెంగళూరు రాక
నగరంలో భారీ బందోబస్తు బెంగళూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరు వస్తున్న సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఆమె శనివారం బెంగళూరు వస్తున్నారు. ఈ మేరకు గురువారం నుంచి పరప్పన అగ్రహార జైలు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ఈ కేసు విచారణ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఇక్కడి పరప్పన అగ్రహార జైలు ఆవరణంలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తమిళనాడు ఇంటెలిజెన్స్ ఐజీపీ సహా ఐపీఎస్ అధికారులు బెంగళూరు చేరుకుని ఇక్కడి పోలీసు అధికారులతో చర్చించారు. బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (సీసీబీ) పీ. హరిశేఖర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం చెన్నై వెళ్లి జయ భద్రతపై అక్కడి అధికారులతో చర్చించారు. 20 వేల మంది మద్దతుదారులు వస్తారని అంచనా బెంగళూరులో తమిళ సోదరులు లక్షల మంది ఉన్నారు. దానికి తోడు కర్ణాటక సరిహద్దులోని క్రిష్టగిరి, ధర్మపురి జిల్లాల్లోని ఆమె మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సుమారు 20 వేల మందికిపైగా పరప్పన అగ్రహార జైలు ప్రాంతాలకు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే కొందరు అభిమానులు లాడ్జిలను బుక్ చేసుకున్నారు. శనివారం తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. -
దోపిడీ కేసు దర్యాప్తులో పురోగతి
రాయనపాడు ఘటనలో నిందితుల ఫొటోలు గుర్తించిన బాధితులు మరో దోపిడీకి పాల్పడే అవకాశం పొరుగు జిల్లాల్లో అప్రమత్తం విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్లో సంచలనం కలిగించిన రాయనపాడులో దోపిడీ ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులుగా భావిస్తున్న వారి ఫొటోలను బాధిత కుటుంబం గుర్తించడంతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పం పారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని రాయనపాడు గ్రామానికి చెందిన కొలిపర్తి సురేష్బాబు ఇంట్లో దొంగలు పడి పెద్ద మొత్తంలో నగలు, నగదును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును కమిషనరేట్ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నేరం జరిగిన విధానాన్ని బట్టి దుండగులు మహారాష్ట్ర ముఠాలుగా గుర్తించారు. రైల్వేట్రాక్ల సమీపంలో ఆవాసం మహారాష్ట్ర ముఠాలు రైల్వే ట్రాక్లకు సమీపంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దోపిడీలు చేస్తుంటాయి. వీరిలో కంజరబట్, పార్థీ, ముంగా జాతి ముఠాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్లకు చేరువలో గుడారాలు వేసుకొని నివాసం ఉంటూ దోపిడీలకు పాల్పడటం వీరి నైజమని పోలీసు అధికారులు చెబుతున్నారు. పగటి వేళల్లో ప్లాస్టిక్ సామాన్లు, పూసలు, కుంకుమ విక్రయించే నెపంతో పరిసర ప్రాంతాల్లో మహిళలు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. గోచీకట్టు చీరకట్టుతో మహిళలు తిరుగుతుం టారని పోలీసులు పేర్కొంటున్నారు. రాత్రివేళల్లో మగవాళ్లు సామూహికంగా వెళ్లి దోపిడీలు చేస్తుంటారని చెబుతున్నారు. నేరం చేసే సమయంలో ప్రతిఘటన ఎదురైతే హత్యలు చేసేందుకు సైతం వీరు వెనుకాడరు. దోపిడీ చేసిన వెంటనే అక్కడి గుడారాలు ఎత్తేసి మరో చోటికి మకాం మార్చుతారు. మహారాష్ట్రకు చెందిన మూడు ముఠాలు నేరాలకు పాల్పడే తీరు ఒకే విధంగా ఉంటుంది. పార్థీ ముఠాగా నిర్థారణ రాయనపాడులో దోపిడీ ఘటనలో పార్థీ ముఠా పాల్గొందని పోలీసులు ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. మిగిలిన ముఠాల సభ్యులు మహారాష్ట్రలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పార్థీ ముఠాలకు చెందిన సభ్యులు మాత్రమే స్వస్థలాలు వదిలేసి బయ ట తిరుగుతున్నట్టు పోలీసు అధికారులకు సమాచారం ఉంది. ఈ ముఠా సభ్యులను 2010లో హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయగా, 2011లో బెయిల్పై బయటకు వచ్చి పరారీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచరిస్తున్న పార్థీ ముఠాల సభ్యులు.. రాయనపాడులో దోపిడీ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీకాకుళం వరకు నిఘా వివిధ ప్రాంతాల్లో గత కొద్ది రోజు లుగా జరిగిన దోపిడీ ఘటనలను పోలీ సులు గుర్తించి, దొంగలను పట్టుకునేందుకు శ్రీకాకుళం జిల్లా వరకు నిఘా ముమ్మరం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులను అప్రమత్తం చేశా రు. గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా బీబీ గూడెం, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వ రంగల్ జిల్లా రఘునాధపల్లిలో దోపిడీలు జరిగాయి. ఆ తర్వాత ఈ ముఠా రాయనపా డు వచ్చి దోపిడీకి పాల్పడి ఉంటుందని భా విస్తున్నారు. శ్రీకాకుళం వైపు వెళ్లే క్రమంలో వీరు మరికొన్ని దోపిడీలు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా వీరు మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని, ఆ మార్గంలో నిఘా ఉంచామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వీరు మరో దోపిడీ చేయకుండా నిలువరించడంతో పాటు పట్టివేత లక్ష్యంగా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. -
పోలీసు శాఖకు జవసత్వాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పోలీస్శాఖ మరింత శక్తివంతం కానుంది. ఇన్నాళ్లూ సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బంది పడిన ఈ శాఖకు అదనపు విభాగాలతోపాటు, అధికారులు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం మిగిలిన 13 జిల్లాల్లో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ విభాగాలకు అధికారులు రానున్నారు. ఇంటెలిజెన్స్, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ విభాగాల్లో కొన్ని శ్రీకాకుళం కేంద్రంగా పని చేస్తుండగా.. మరికొన్ని విభాగాలు పొరుగు జిల్లాలు కేంద్రంగా పని చేస్తుండటంతో పాలనాపరమైన ఇబ్బందులెదురువుతున్నాయి. ఈ ఇబ్బందులు తొలగించే క్రమంలో జిల్లాకు కొత్తగా కనీసం ఐదుగురు డీఎస్పీలను ప్రభుత్వం కేటాయిస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) నిర్ణయించిన మేరకు రాజధాని నుంచి కొత్త డీఎస్పీలు రానున్నట్టు తెలిసింది. అదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్పీలైన కొంతమంది, సీఐలుగా పనిచేసి ఉద్యోగోన్నతి సాధించిన మరికొందరు జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఏసీబీకి డీఎస్పీ అవినీతి నిరోధక శాఖ జిల్లా విభాగం ప్రస్తుతం విజయనగరం డీఎస్పీ పరి ధిలో పని చేస్తోంది. ఈ విభాగం శ్రీకాకుళం కార్యాలయంలో సీఐ, ఇతర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల కేసుల నమోదు, దాడులు, ఆకస్మిక తనిఖీల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి త్వరలో శ్రీకాకుళం కేంద్రంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు మంజూరు కానుందని అధికారులు చెబుతున్నారు. విశాఖలో పనిచేస్తున్న ఓ ఏసీపీ డీ ఎస్పీగా ఇక్కడ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. రెండుగా విజిలెన్స్?: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి శ్రీకాకుళం పట్టణంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఉంది. ఓ ఎస్పీ, ఇద్దరు సీఐలు, మరికొంతమంది ఎస్ఐలు పని చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు, కేసుల నమోదు వ్యవహారాలన్నీ ఈ కార్యాలయమే చూస్తోంది. రెండు జిల్లాల్లోనూ అక్రమాలు, కేసులు పెరిగినందున సిబ్బందికి పనిభారం పెరిగింది. అధికారులు ఇక్కడ నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లి తనిఖీలు చేయడం కష్టమవుతోంది. సమయం కూడా వృథా అవుతోంది. విజిలెన్స్ విభాగాన్ని విడదీసి మరో డీఎస్పీ పోస్టు మంజూరు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా సీఐడీ విభాగం: ఇప్పటివరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు కలిపి విశాఖపట్నం కేంద్రంగా సీఐడీ విభాగం పనిచేస్తోంది. పోలీస్శాఖలో నమోదయ్యే భారీ కేసుల ఛేదనకు, ప్రభుత్వం ఆదేశించే మరికొన్ని ప్రత్యేక కేసుల దర్యాప్తును చేపడుతున్న ఈ విభాగానికి మూడు జిల్లాల పరిధిలో పనిచేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. పెద్ద పెద్ద కేసుల పరిష్కారానికి విశాఖ నుంచి అధికారులు, సిబ్బంది తరచూ రావడం ఖర్చు, శ్రమతో కూడుకున్న పని అని అధికారులు గుర్తించారు. దీంతో ఇకపై జిల్లా యూనిట్గా సీఐడీ విభాగం ఉండాలన్న ప్రతి పాదనలు వెళ్లాయి. భవిష్యత్తులో ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ విభాగం జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతుందని అధికారవర్గాలసమాచారం. ఎస్బీకి మరో డీఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇప్పటి వరకూ ఇద్దరు స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తుండేవారు. పని విభజనలో భాగంగా మరో పైస్థాయి అధికారి అవసరం ఏర్పడింది. దీంతో వారం క్రితమే డీఎస్పీని నియమించారు. విశాఖలో పలు విభాగాల్లో పనిచేసిన టేకి మోహనరావు అనే అధికారి ఇటీవలే ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. పలాస (కాశీబుగ్గ), పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లకు వేర్వేరుగా శాంతిభద్రతల డీఎస్పీలున్నారు. వీరిలో శ్రీకాకుళం డీఎస్పీకి ఇటీవల రివర్షన్ ఉత్తర్వులు రావడం, తరువాత ఉన్నతాధికారి వద్దకు వెళ్లడంతో ఆయనకు మళ్లీ పోస్టింగ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే విశాఖలో పనిచేస్తున్న మరో డీఎస్పీ ఇక్కడి శాంతిభద్రతల విభాగానికి రానున్నట్టు తెలిసింది. అదేవిధంగా పాలనాపరమైన విధులు నిర్వహించేందుకు ఓఎస్డీ (ప్రత్యేకాధికారి) ఒకరు, నేరవిభాగ అధికారిగా మరో ఓఎస్డీ ఇక్కడ ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఆర్మ్డ్ రిజర్వు అధికారిగా ఏఆర్డీఎస్పీ, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర అధికారిగా (డీపీటీసీ) మరో డీఎస్పీ, ఇంటెలిజెన్స్ విభాగానికి శ్రీకాకుళం కేంద్రంగా మరో డీఎస్పీ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యను పెంచేందుకు, పోలీస్శాఖను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా మరికొందరు డీఎస్పీలు రానున్నట్టు పోలీస్వర్గాల భోగట్టా. -
జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంపు
తాండూరు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచుతామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ టీవీ శశిధర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మా ట్లాడారు. నేరాలను తగ్గించేందుకు జి ల్లా సరిహద్దు అయిన కర్ణాటక బార్డర్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పా రు. కొత్త వ్యక్తుల కదలికలపై తమ సిబ్బంది నిఘా ఉంచుతారన్నారు. దారి దోపిడీలను అరికట్టేందుకు హైవే పెట్రోలింగ్ను పకడ్బందీగా అమలుపరుస్తామని డీఐజీ పేర్కొన్నారు. పెద్దేముల్ మండలంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుందేళ్లు వేట కోసమే అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడి అయిందన్నారు. బైక్ వెళ్తున్న నలుగురుని పోలీ సులు ఆపే ప్రయత్నం చేశారని, ఈక్రమంలో బైక్ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందినట్లు డీఐజీ వివరిం చారు. ఒక సింగిల్ బోర్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ యన పేర్కొన్నారు. తాండూరు ప్రాం తంలో మట్కా బెట్టింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ శశిధర్రెడ్డి చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమ స్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండగ సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పెట్రోలింగ్తో పాటు గట్టి బందోబస్తు ఏర్పా ట్లు చేస్తున్నట్లు డీఐజీ వివరించారు. సీఐల బదిలీల విషయం తన పరిధిలో లేని అంశమని ఆయన చెప్పా రు. డీఎస్పీ కార్యాలయంలో వివిధ కేసుల పురోగతితో పాటు రికార్డులను డీఐజీ పరిశీలించారు. అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారి, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్, రూరల్ సీఐలు వెంకట్రామయ్య, రవికుమార్ ఉన్నారు. కాగా సమావేశ అనంతరం డీఐజీ తాండూరు టౌన్, కరణ్కోట ఠాణాలను తనిఖీ చేశారు. -
సమయానికి రారు..పనిచేయరు
మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయంలో ముగ్గురే హాజరు ఇదీ పీఆర్ ఈఈ కార్యాలయ పనితీరు చిత్తూరు(టౌన్): చిత్తూరు పంచాయతీరాజ్ ఈఈ (పాజెక్ట్స్ విభాగం) కార్యాలయ సిబ్బంది పనితీరు విమర్శలకు దారితీసోంది. ఇక్కడి సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు హాజరుకావడం లేదు. గురువారం ఈ కార్యాల యాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంపై నిఘా ఉంచింది. 10.30 గంటలకు ముందే ఈఈ అమరనాథరెడ్డి తన చాంబరులో ఉన్నారు. ముగ్గురు అటెండర్లు తమ విధుల్లో కనిపించారు. డీఏవో(డివిజినల్ అకౌం ట్స్ ఆఫీసర్) క్యాబిన్ ఖాళీగా కనిపిం చింది. ఎనిమిది సీట్లకు గాను ఆరు సీట్లలో సిబ్బంది కనిపించలేదు. 11.30 గంటలపుడు ఒకరు వచ్చారు. మిగిలిన ఐదుగురు మధ్యాహ్నం వరకు కనిపించలేదు. డీఏవో కూడా కనిపించలేదు. విచారించగా తిరుపతి నుంచి రావాల్సి ఉందని సమాధానమిచ్చారు. సూపరిం టెండెంట్తోపాటు ఇద్దరు సెలవులో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ఐదుగురు విధులకు డుమ్మా కొట్టిన విషయం వెలుగుచూసింది. పక్కనే జెడ్పీ సీఈవో, మరోవైపు జెడ్పీ చైర్పర్సన్, కాస్త దూరంలో ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్) కార్యాలయాలు ఉన్నా ఏమాత్రమూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బయటి ప్రాంతాల్లో కాపురం.. పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు, సిబ్బం ది బయటి ప్రాంతాల్లో కాపురముంటూ నిత్యం బస్సుల్లో వచ్చి వెళుతున్నారు. పనిచేసే చోటే కాపురముండాలన్న ప్ర భుత్వ నిబంధనను ఏ ఒక్కరూ పట్టిం చుకోవడం లేదు. తిరుపతి, కార్వేటినగరం, పుత్తూరు, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం బసుల్లో ప్ర యాణిస్తూ విధులకు హాజరవుతున్నా రు. తిరుపతి నుంచి వచ్చే వారయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరుకు ఏ సమయానికి చేరుకుంటే ఆ సమయం లో విధులకు హాజరవుతున్నారు. కొంద రు ప్యాసింజర్ రైలులో వస్తున్నారు. వీటిలో ప్రయాణించే వారు మధ్యాహ్నం 12 గంటల లోగా ఏ రోజూ చేరుకోలేకపోతున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు. జీతాలు కట్ చేస్తాం ఈ విషయాన్ని పంచాయతీరాజ్ ఈఈ అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే పలుమార్లు సమయ పాలన పాటిం చాలని ఆదేశించానన్నారు. గురువారం కార్యాలయం బోసిపోయిన విషయాన్ని ఆయన అంగీకరించారు. డీఏవో తిరుప తి నుంచి రావడం వల్ల ఆలస్యమవుతు న్న విషయం వాస్తవమేనన్నారు. ఇకపై ఇదేవిధంగా వ్యవహరిస్తే ఒకటి రెండుసార్లు అటెండెన్స్ రిజిస్టరులో సీఎల్ మా ర్కు చేస్తానని, అప్పటికీ మార్పు రాకపో తే జీతాలు కట్ చేస్తానని పేర్కొన్నారు. -
మీ టాలెంట్ మీకు తెలుసా?
ప్రేరణ ప్రతిఒక్కరిలో అంతర్గతంగా ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రజ్ఞ ఉంటాయి. వాటిని గుర్తించి, వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారు. బాల్యంలో మందమతులుగా ముద్రపడినవారు సైతం తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ప్రముఖ బ్రిటిష్ నృత్యకారిణి గిలియన్ లైనీ ఉదంతం కూడా అలాంటిదే. గిలియన్ లైనీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి ఆమె తల్లికి ఓ ఉత్తరం వచ్చింది. స్కూల్లో గిలియన్ ప్రవర్తనపై సదరు టీచర్ ఫిర్యాదు చేస్తూ పెద్ద ఉత్తరం రాసింది. చిన్నారి చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎప్పుడూ మందకొడిగా ఉంటోందని అందులో తెలిపింది. అంతేకాకుండా హోమ్వర్క్ కూడా సమయానికి పూర్తి చేయదని, ఇక ఆమె చేతిరాత చాలా ఘోరంగా ఉందని విమర్శించింది. గిలియన్కు లెర్నింగ్ డిజార్డర్ ఉందనే అనుమానం తనను వేధిస్తోందని, ఆమెను అలాంటి విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే మంచిదని సలహా కూడా ఇచ్చింది. అంతర్గత నైపుణ్యం మేల్కొంది టీచర్ నుంచి వచ్చిన ఉత్తరం చదివిన గిలియన్ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. టీచర్ ఇచ్చిన సలహాను పాటించడం కంటే ముందు తన బిడ్డ ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కారం కోసం చిన్నారిని సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. వెంటనే గిలియన్ను తీసుకొని వెళ్లి ఒక సైకాలజిస్టును కలిసింది. ఆయన గిలియన్ ముఖ కవళికలను, కాళ్లు, చేతుల కదలికలను నిశితంగా పరిశీలించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ ఆమె తల్లిని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లేటప్పుడు గదిలోని రేడియోను ఆన్ చేసి, సౌండ్ పెంచాడు. గదిలో గిలియన్ మాత్రమే ఉంది. ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం ఒక్కసారిగా మేల్కొంది. కుర్చీలోంచి లేచి రేడియోలో వస్తున్న పాటలకు అనుగుణంగా కాళ్లు, చేతులను లయబద్ధంగా కదపసాగింది. ఇప్పుడు ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. గది బయట ఉన్న సైకాలజిస్టు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని ఆమె తల్లికి చూపించాడు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతులేని ఆశ్చర్యానికి లోనైంది. గిలియన్లో ఎలాంటి లోపం లేదని సైకాలజిస్టు తేల్చిచెప్పాడు. ఆమె నృత్యంలో ప్రతిభ చూపుతుందని, శిక్షణ కోసం డ్యాన్స్ స్కూల్లో చేర్పించమని సూచించాడు. సాన పెడితే వజ్రమే అదృష్టవశాత్తూ గిలియన్ తల్లి ఆ సూచనను అమల్లో పెట్టింది. ఇక మిగిలిందంతా చరిత్రే. గిలియన్ లైనీ గొప్ప నృత్యకారిణిగా పేరుగాంచింది. ప్రపంచంలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందింది. తనలోని టాలెంట్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నురాలిగా ఎదిగింది. ఇక్కడ తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సైకాలజిస్టుకే. ఎనిమిదేళ్ల బాలికలోని ప్రతిభను ఆయన గుర్తించడం వల్లే ఒక గొప్ప డ్యాన్సర్ ప్రపంచానికి లభించింది. ఒక వైద్యుడిగా ఆమెకు మందులు ఇవ్వడం లేదా స్పెషల్ స్కూల్కు పంపడం వంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన గిలియన్లోని సహజ ప్రతిభను పసిగట్టాడు. ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడంతో గిలియన్ వజ్రంగా మారింది. మార్కులే కొలమానం కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కచ్చితంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. మరి వాటినెందుకు గుర్తించలేకపోతున్నారు? మన ప్రతిభను మనం తెలుసుకోకుండా బయటి నుంచి చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. స్కూల్లో పిల్లల ప్రతిభను మార్కుల ఆధారంగా మాత్రమే కొలుస్తుంటారు. మంచి మార్కులు రాకపోతే వారిని అసమర్థులు, బుద్ధిహీనులుగా పరిగణిస్తారు. చదువుపై అంతగా ఆసక్తి లేని పిల్లలకు మరో రంగంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించి వెలికితీసే అవకాశం ఉండాలి. స్కూల్లో మంచి మార్కులు సాధించేవారు మరో రంగంలో వెనుకబడి ఉండొచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని తెలుసుకోవాలి. కలలను నిజం చేసుకోండి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలో నిలిపే విశిష్టమైన టాలెంట్ మీలో ఉందా? కలలను నిజం చేసుకొనేందుకు శ్రమించండి. ఎవరికి తెలుసు.. మీలోని ప్రతిభ మిమ్మల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లొచ్చు. గిలియన్లోని ప్రతిభను కనిపెట్టిన సైకాలజిస్టు అందరికీ అవసరమే. ఆ సైకాలజిస్టు.. మన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కావొచ్చు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారిలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వారికి తెలియజేయండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
నిఘా నేత్రాల నీడన కలెక్టరేట్
హన్మకొండఅర్బన్ : కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మొత్తం ఆవరణలో 24 కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే కెమెరాలను కలెక్టర్, డీఆర్వో కార్యాలయాల ముందు, వెనుక భాగాల్లో, హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం, కాన్ఫరెన్స్హాల్, వీడియో కాన్ఫరెన్స్హాల్, ఈవీఎంలు భద్రపరిచే గోదాముతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో కలెక్టరేట్లో అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు కార్యాలయాల వద్ద జనం రద్దీ, వాహనాల అపహరణ వంటి విషయాలు ఎప్పటికప్పుడు అధికారులు ప్రత్యక్షంగా గమనించే వీలుంటుంది. కాగా, కెమెరాలను కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే టీవీకి అనుసంధానం చేయనున్నారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ నివాసం వద్ద కూడా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాహనాలు భద్రం.. కలెక్టరేట్లో కొద్ది రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో కాన్ఫరెన్స్ హాల్ పక్కన ఉన్న నెట్వర్క్ రూంలో బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. అలాగే ప్రగతి భవనం వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు కొద్ది రోజుల క్రితం ఎస్టీఓ సమీపంలో ఓ బైక్ చోరీకి గురైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలతో దొంగతనాలు, అపరిచిత వ్యక్తులను పసిగట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
కాలచక్రంపపంచానికి శాంతి చక్రం
సందర్భం దలైలామా నిర్వహించే కాలచక్ర ఉత్సవం ప్రపంచ బౌద్ధ ఉత్సవాలలో ప్రముఖమైనది. టిబెట్ దేశానికి చెందిన ఈ బౌద్ధ సంప్రదాయం ప్రపంచ మానవాళిలో ప్రేమ, దయ, కరుణ, ప్రజ్ఞ, ఉపేక్ష భావాల్ని పెంపొందించి, సర్వ జీవుల్లో సమరస భావాన్ని నింపి, మానవ మనస్సుల్లోని సంకుచితత్వాన్ని పారద్రోలి, శాంతి పరిమళాలు వెదజల్లడం కోసం కృషి చేస్తుంది. ప్రతి మనిషి నిస్వార్థంగా మారడానికి, దుఃఖాన్నుండి విముక్తి కావడానికి కావలసిన మానసిక, శారీరక సాధనల్ని ఈ కాలచక్రం నిర్దేశిస్తుంది. ఈ కాలచక్ర పూజా విధానం మనుషుల మనస్సుల్లో పరిపూర్ణత్వాన్ని నింపుతుందని బౌద్ధుల నమ్మకం. కాలచక్ర అంటే? కాలానికి సంబంధించినదే ఈ కాలచక్ర. మనం సాధారణంగా క్యాలెండరు లేదా పంచాంగాన్ని కాలచక్రం అంటాం. అంటే కాలాన్ని కొలిచే విధానంగా కాలచక్రాన్ని భావిస్తాం. కానీ బౌద్ధుల ఈ ‘కాలచక్ర’ కాలానికి సంబంధించినదే అయినా, అది రోజులకు, వారాలకు, పక్షాలకు, మాసాలకు, రుతువులకు ఆయనాలకు సంబంధించినది మాత్రం కాదు. ఈ సృష్టి రచనకు సంబంధించినది కాలచక్ర - విధానాలు ఈ కాలచక్ర ఒక అద్భుతమైన తత్త్వం. ప్రకృతి, మనిషి వేరువేరు కావని చెప్పే ఒక విశ్వ ఐక్యతావాదం. ఆ విషయం కాలచక్రంలో ప్రధానంగా ఉన్న మూడు విధానాలు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది బాహ్య కాలచక్ర. దీన్ని ‘కాలచక్ర భూమి’ అని కూడా అంటారు. విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, సౌరవ్యవస్థ, భూమి, మూలకాలు, మూల రాశులు - ఇలా భౌతిక జగత్తంతా ఈ బాహ్యకాలచక్రలో భాగమే. రెండోది అంతర కాలచక్ర. మనిషి, పుట్టుక, జీవనం, అనుభవాలు, మనస్సు, నాడీ చలనాలు, హృదయ స్పందనలు - ఇలా మనిషీ మనస్సు కలిసినదంతా ఈ విభాగంలోకి వస్తుంది. ఇక మూడోది ప్రత్యామ్నాయ కాలచక్ర. పైన చెప్పిన రెండు రకాల అంతర, బాహ్య కాలచక్రాల్ని ఒకటిగా అనుసంధానం చేసే విధానం ఇది. ఈ అనుసంధానం చేసే పద్ధతి ధ్యాన పద్ధతి. - బొర్రా గోవర్ధన్ టిబెట్లో దలైలామాలు, పంచన్లామాలు అక్కడి బౌద్ధ గురువులు. కాలచక్ర పథ మార్గాన్ని నడిపించే గురువులు వాళ్ల్లే. ఒకటవ, రెండవ, ఏడవ, ఎనిమిదవ, పద్నాలుగవ దలైలామాలు ఈ కాలచక్ర కార్యక్రమాల్ని ఎక్కువగా నిర్వహించారు. ప్రస్తుత దలైలామా 14వ దలైలామా. అయన అసలు పేరు ‘టెన్జిన్ గాట్సో’. ఆయన ఇప్పటికి 33 కాలచక్రలు నిర్వహించారు. ప్రస్తుతం జూన్ 3 నుంచి 14వ తేదీవరకు భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ‘లే’ (లడక్) లో 34వ కాలచక్రను నిర్వహిస్తున్నారు. 2006లో అమరావతిలో నిర్వహించిన కాలచక్ర ముప్పయ్యవది. కాలచక్ర పూజావిధానం కాలచక్ర అనేది భిక్షుదీక్షను ఇచ్చే కార్యక్రమం. దీక్ష నిచ్చే గురువును ‘వజ్రగురువు’ అంటారు. ఆయన ఒక ఉన్నత ఆనసం మీద కూర్చుని కార్యక్రమం నిర్వహిస్తారు. కాలచక్రలో ప్రధానంగా మూడు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో బాహ్యకాలచక్రలో ఉండే నక్షత్రాది గ్రహాలు ఉంటాయి. రెండో వలయంలో అంతర కాలచక్రలో ఉండే శరీర, మనోస్థితులు ఉంటాయి. మూడో వలయంలో బుద్ధి, కాలం ఉంటాయి. అంటే ఆయా వలయాలు ఆయా రాశులకు సంకేతాలుగా ఉంటాయి. ఈ మూడు వలయాల్ని 12 రోజుల్లో దాటుకుంటూ చివరికి చేరాలి. ఈ 12 రోజుల్ని 11 దశలుగా పూర్తి చేయాలి. ఈ దశల్ని అభిషేకాలంటారు. లామా ఈ కాలచక్రను కొన్ని మండలాలుగా విభజిస్తాడు. ఈ మండలాల్ని రంగురంగుల ఇసుకతో నింపుతాడు. కాలచక్ర చిత్రాన్ని గీస్తాడు. ఆ చక్రంలో 720 మంది దేవతల్ని ప్రతిష్ఠిస్తాడు. కోర్కెలకు ప్రతీకగా శ్వేత వర్ణ బొమ్మల్ని కాలచక్ర కాళ్లకింద అణచివేస్తున్నట్లు చిత్రిస్తాడు. ఈ బొమ్మల్లో చక్రం.. పరిణామానికి (పురుషుడు), కాలం.. ప్రజ్ఞ (స్త్రీ) కి ప్రతీకలుగా భావిస్తారు. అయితే కాలచక్ర తంత్రం స్వభావరీత్యా స్త్రీతంత్రం. స్త్రీలు ఆచరించేది కాదు. ఈ తంత్ర స్వభావం అది. అందుకే ఈ తంత్రాన్ని ‘విశ్వమాత’గా పిలుస్తారు. కాలచక్ర అంటే విశ్వమాత అని. చివరి రోజున గుణాలకు ప్రతీకలైన రంగురంగుల ఇసుకను చెరిపివేసి, సైకత ఆలయాన్ని కూల్చేసి, ఆ ఇసుకను, రంగుల్నీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ నది ప్రవహించే కాలానికి ప్రతీక. ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో బోధి చిత్తాన్ని పొందిన భిక్షువులు దుఃఖరహితులై, శాంతి కాముకులై, సర్వజీవశ్రేయస్సు కోసం పాటుపడతారు. ప్రపంచాన్ని శాంతికమలంలా పూయిస్తారు. కాలచక్ర అంటే ప్రపంచశాంతి చక్రమే. -
బీజేపీపై అమెరికా నిఘా!
2010లో ఎన్ఎస్ఏకు అనుమతినిచ్ఛిన ఆ దేశ కోర్టు 193 దేశాలు, ప్రఖ్యాత సంస్థలపైనా.. వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా పెద్దన్న పోకడ మరోసారి బహిర్గతమైంది. ప్రపంచదేశాలపై ఆధిపత్యం కోసం ఏమైనా చేసే అమెరికా.. ఆయా దేశాల ప్రభుత్వాల పైననే కాదు.. అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలపైన కూడా ‘దృష్టి’ పెడ్తుందన్న విషయం తాజాగా వెల్లడైంది. భారత్లోని ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీతో పాటు ఇతర దేశాల్లోని మరో ఐదు రాజకీయ పార్టీలపై నిఘా పెట్టేందుకు 2010 సంవత్సరంలో అమెరికా జాతీయ భద్రత సంస్థ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ-ఎన్ఎస్ఏ)కు అక్కడి ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ కోర్టు అనుమతించిందంటూ తాజాగా వెల్లడైన వార్త సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, భారత్ సహా 193 దేశాల ప్రభుత్వాల పైన.. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ అణుశక్షి సంస్థ(ఐఏఈఏ)ల వంటి అంతర్జాతీయ సంస్థలపైనా నిఘా పెట్టేందుకు ఎన్ఎస్ఏకు ఆ కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతి ద్వారా తమ మిత్రదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాల సమాచారం సేకరించేందుకు ఎన్ఎస్ఏకు అధికారం లభించినట్లైంది. అమెరికా దుశ్చర్యలను ఇప్పటికే పలుమార్లు ‘లీక్’ చేసి యూఎస్ కంటిలో నలుసుగా మారిన ఎడ్వర్డ్ స్నోడెన్నే ఈ తాజా సమాచారం వెనక ఉండటం విశేషం. స్నోడెన్ అందించిన వివరాలతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం.. బీజేపీతో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ముస్లిం బ్రదర్హుడ్(ఈజిప్ట్), నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్(ఈజిప్ట్), అమాల్(లెబనాన్), బొలివరియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్ ఆఫ్ వెనుజులా పార్టీలపై నిఘా పెట్టడానికి ఎన్ఎస్ఏ అనుమతి పొందింది. ఈ వార్తలపై బీజేపీ, కాంగ్రెస్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో చేపట్టనున్న అమెరికా పర్యటన పైనా ఈ వార్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. సెప్టెంబర్లో మోడీ అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. బీజేపీ పైనే ఎందుకు? 2010లో కాంగ్రెస్ అధికార పార్టీ. అంతకుముందు ఏడాదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. కానీ, కాంగ్రెస్ను కాదని, ఇతర పార్టీలన్నింటినీ వదిలేసి అధికారంలో లేని, అధికారంలోకి వస్తుందనే ఆలోచన కూడా ఎవరికీ లేని బీజేపీని అమెరికా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. -
ఎరువుల అమ్మకాలపై విచారణ
విశాఖ రూరల్ : జిల్లాలో ఎరువుల అమ్మకాలపై నిఘా పెడతామని, తూకాలు సక్రమంగా లేని వాటిపై విచారణ జరిపిస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీ ణ్కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి మొత్తం 14 ఫోన్కాల్స్ వచ్చాయి. ఇందులో చోడవరం నుంచి వచ్చిన కాల్లో పసుపర్తి ఆదినారాయణ అండ్సన్స్ షాపులో తక్కువ తూకానికి ఎరువులు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా దీనిపై విచారణ చేస్తామన్నారు. విశాఖ మర్రిపాలెం నుంచి వచ్చిన కాల్లో గ్రూప్-4లో పీహెచ్సీ కోటా కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామని, కాని ఉద్యోగం రాలేదని, ఇంకోసారి పరిశీలించాలని కోరారు. కశింకోటలో మద్రాసు సిమెంట్ ఫ్యాక్టరీవారి పొలాలకు నీరుపారే కాలువగట్టును ఆక్రమించుకొని రోడ్డు వేయ డం వల్ల కాలువ వెడల్పు తగ్గిపోయిందని, రైతులకు ఇబ్బంది కలుగుతుందని, చర్యలు తీసుకోవాలని కోరగా పరిశీలిస్తామని జేసీ చెప్పారు. తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన తదితర సమస్యలపై ఫోన్కాల్స్ వచ్చా యి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి 127 దరఖాస్తులు కలెక్టరేట్ సమావేశ మంది రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గృహాలు, రేషన్కార్డులు, పింఛన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ వై.నరసింహారావు, వికలాంగ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నర్సింహమూర్తి వికలాంగుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. -
ఆమె తెలివి... ముగ్గురికి ప్రాణం పోసింది
విజయం మామూలప్పుడు ఎవరైనా తెలివితేటలు చూపిస్తారు. కానీ ప్రమాదంలో పడినప్పుడు కంగారు పడకుండా, తెలివిగా ఆలోచించి బయట పడటంలోనే అసలు తెలివితేటలు కనిపిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న చిట్టితల్లి అలా తెలివిగా ఆలోచించి ముగ్గురి ప్రాణాలను కాపాడింది. పదేళ్ల ఈ చిన్నారి పేరు బ్రియానా వ్యాన్స. తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో నివసిస్తోంది. ఇటీవల అక్కడ పెద్ద తుఫాను వచ్చింది. భయంకరంగా వచ్చిన ఈదురు గాలులకు చాలా ఇళ్లు కుప్పకూలాయి. చెట్లు నేల రాలాయి. బ్రియాన్ ఇంటిముందు ఉన్న పెద్ద చెట్టు కూడా కూలిపోయింది. అది సరిగ్గా బ్రియాన్ తండ్రి గ్రెగరీ మీద కూలడంతో అతడు దాని కింద ఇరుక్కుపోయాడు. ఓ పక్క విపరీతమైన గాలి. మరో పక్క వరద నీరు. పైగా ఒళ్లంతా గాయాలు. దాంతో బయటకు రాలేకపోయాడు. కాసేపుంటే చనిపోయేవాడే. అప్పుడే బ్రియాన్ తండ్రిని చూసింది. అతడి పరిస్థితి అర్థమైంది. తన చేతిలో ఉన్న సెల్ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి... ‘మా నాన్న చనిపోయేలా ఉన్నాడు, కాపాడండి’ అంటూ పోస్ట్ చేసి, తన అడ్రస్ పెట్టింది. కొద్ది క్షణాల్లోనే దాన్ని చాలామంది చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు అంబులెన్సును తీసుకుని వచ్చి గ్రెగరీతో పాటు, ఆ చెట్టు కింద ఇరుక్కున్న మరో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడారు. రియల్ హీరో అంటూ బ్రియాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ దెబ్బతో బ్రియాన్ వర్జీనియాలో పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది!