Intelligence
-
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
మన్యంలోకి మళ్లీ మావోలు!
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. 2022లో ఏవోబీని విడిచిపెట్టి.. రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్ కార్యకలాపాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్ట్ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లాలని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాక్ టు ఏవోబీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్లు ఎన్కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్గఢ్లోనే హతమవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్లను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్లు, మిలీషియా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్ల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్ నేత ట్రంప్కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్కు కీలక పదవి దక్కింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్ పొగిడారు.ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి.. అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డ్లో చేరారు. 2004లో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్గా సేవలందించారు. మేజర్గా పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్గా పదోన్నతి పొందారు. 31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్ జిల్లా నుంచి డెమొక్రటిక్ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్లో ట్రంప్ అనుకూల పోస్ట్లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్లో రిపబ్లికన్ పారీ్టలో చేరారు. టీనేజీలో హిందువుగా మారి.. తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్ సెనేటర్గా గతంలో పనిచేశారు.18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్తో కలిసి తులసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్కు తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి. -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
బంగ్లా అల్లర్లు: భారత్కు ఉగ్ర ముప్పు!
ఢిల్లీ: రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షేక్ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు. త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కు ఎంపికయ్యి నీతి ఆయోగ్లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్పూర్కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్తో జార్ఖండ్లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
సీఎం జగన్పై దాడి.. అహంకారపూరిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్మెంట్దే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్కు, సీఎస్కు బాధ్యత లేదా’ అని అన్నారు. ‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి నామీద పెట్టాలని ప్రయత్నించావు. ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నారు’ అంటూ సీఎం జగన్పై దాడిని అవహేళన చేస్తూ మాట్లాడారు. సీఎం జగన్పై హత్యాయత్నాన్ని అవహేళనగా మాట్లాడటంపై ప్రజలు బాబు తీరుని అసహ్యించుకున్నారు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కినా ఎవరి జీవితాలూ మారలేదని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ బాబు అబద్ధాలు చెప్పేశారు. వలంటీర్లతో నేరాలు, ఘోరాలు చేయించారని అన్నారు. ఈసారి ఓటు కూటమికి వేయాలని, తాను మళ్లీ సీఎం అవుతానని బాబు అనడంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. పవన్ సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తి అంటూ పరోక్షంగా రాజకీయాల్లో అనుభవం లేదని చెప్పడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్పందించని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామా అని బాబు అడిగినా ప్రజలు స్పందించలేదు. తనపైనా చాలాసార్లు రాళ్ల దాడి జరిగిందని, ఇప్పుడు చేసిన రాళ్ల దాడిపై చప్పట్లు కొట్టి నిరసన తెలపండని చంద్రబాబు అడిగినా.. ఒక్కరూ స్పందించకపోవడంతో టాపిక్ మార్చేశారు. బాబు బస్సుపైకి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థితో పాటు జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించారు. వారిని కూడా సెక్యూరిటీ వెనుక నిలబెట్టారు. మిగిలిన వారెవ్వరికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీజేపీ, జనసేన నేతల్లో అసహనం వ్యక్తమైంది. జిల్లాలో మూడు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. వారిని గెలిపించమని చెప్పకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా రెండు సభలకు జనం అంతంతమాత్రంగానే వచ్చారు. ఈ సభలకు చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా రావడంతో వచ్చిన కొద్దిమంది జనం, కార్యకర్తలు బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. శ్రేణుల ఎదుటే బండారును అవమానించిన బాబు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల ఎదుటే తీవ్రంగా అవమానించారు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారు.. ఆ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం చంద్రబాబుని కలిశారు. టికెట్ ఇవ్వకుండా అవమానించడం సరికాదని చంద్రబాబుతో అనడంతో.. ఒక్కసారిగా బాబు రెచ్చిపోయారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా? టికెట్ లేదని చెప్పిన తర్వాత కూడా వేషాలేస్తున్నావ్. మర్యాదగా చెప్పినట్లు నడుచుకో. జనసేనకు సహకరించు’ అంటూ దాదాపు పది నిమిషాలు బండారుపై చిందులేశారు. ఇంత అవమానించి.. చివరకు బండారుని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. చంద్రబాబుకి నమస్కారం చెప్పి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణమూర్తి.. కార్యకర్తలు, అనుచరులతో కూడా మాట్లాడలేదు. మాడుగుల టికెట్ అయినా ఇవ్వాలని బండారు కోరారని, అందుకు ఒప్పుకోని చంద్రబాబు.. సీనియర్ నేతకు కనీస మర్యాద ఇవ్వకుండా ఘోరంగా అవమానించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గులకరాయికే ఇంత ఇదా?: పవన్ కళ్యాణ్ తెనాలి: సీఎం జగన్కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు అల్లరి చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్పై ఎవరో రాయి విసిరారట. అదేమిటోగానీ ఎన్నికలు అనేసరికి ఏదొకటి జరుగుతుంది. గాయాలవటమో... చంపేయటమో... చంపటమో జరుగుతోంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది? ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? గత ఎన్నికల్లో విశాఖలో కోడికత్తితో గాయం చేశారు.. వైఎస్ వివేకాను ఏ కత్తితో పొడిచారో తెలియదు...’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి బహిరంగ సభలో వారాహి నుంచి పవన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల అమర్నాథ్ను చెరుకుతోటలో పెట్రోలు పోసి అడ్డంగా తగలేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? 35 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? గతంలో చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపించినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? మీకు గులకరాయి తగిలితేనే ఇంత ఇదా! అంటూ విమర్శలు చేశారు. సానుభూతి తెలియజేస్తూ స్టేట్మెంట్ ఇవ్వాలని పార్టీ నాయకులు తనకు సూచించారన్నారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఇస్తానని ప్రశ్నించానన్నారు. ‘ఏమో...అతనే కొట్టేసుకున్నాడేమో? ఎవరికి తెలుసు? కరెంటు కూడా పోయిందట! నాన్న–పులి కథలా ఒకసారి జరిగితే అనుకోవచ్చు. ప్రతిసారీ జరుగుతుంటే అబద్ధమంటున్నాం. సెంటిమెంటల్ డ్రామాలు ఆపండి... నాటకాలు భరించలేకున్నా. అందరిపైనా దాడిచేసే వ్యక్తిపై ఎవరైనా దాడిచేస్తారా? అయినా దాడిచేస్తే ఎంతసేపు పట్టుకోవటానికి?’ అని పేర్కొన్నారు. -
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్ఫేక్ కంటెంట్పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
భారత్.. మూడో అతిపెద్ద ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది. యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం. సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్యస్థానంగా మార్చుతోంది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్ ఈ–కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తుంది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్కు ఆకర్షిస్తాయి. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు. ఈ–కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసే యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయి. భారత్లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుంది. భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. -
'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'
రియాద్: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. హమాస్ తీరు శోచనీయం ఇస్లామిక్ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్ను విమర్శించారు. ఇజ్రాయెల్లాగే హమాస్ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్ తీరును ఫైసల్ తప్పుబట్టారు. The legendary chief of Saudi Intelligence Turki -Al- Faisal could not have said it better. Worth a listen 👇🏾 pic.twitter.com/0YjQAd158I — Manish Tewari (@ManishTewari) October 19, 2023 ఇజ్రాయెల్ రక్తపాతం.. పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రాశ్చాత్య మీడియా తీరు సరికాదు.. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
హమాస్ దాడి.. పూర్తిగా ఇజ్రాయెల్ వైఫల్యమే’
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు. చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు. కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు డిప్యూటీ కమాండర్గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్కు డైరెక్టర్గా ఉన్నారు. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఖాకీబాస్ల సమావేశం? మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రభాకర్ రావు, అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్జోన్ ఐజీ చంద్రశేఖర్లతోపా టు సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్.. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్జీ (డి్రస్టిక్ట్ రిజర్వ్డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. -
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్ఝున్వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్గా, ఎంటర్ప్రెన్యూర్గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్ఝున్వాలా. -
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్టాపిక్గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
పుతిన్నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ నిఘా వ్యవస్థ గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దేశ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేసే వాళ్ల కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్నే ఎక్కువగా నమ్ముతానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్లో.. తన నమ్మకాలు మారయంటూ..సీఐఏ, నాసా, ఎఫ్బీఐ వంటి సైబర్ సెక్యూరిటీ తోసహా గూఢచార సంస్థలను తక్కువ చేస్తూ రాసుకొచ్చారు. పైగా ఇలాంటి స్థితిలో తాను రష్యా అధ్యక్షుడినే ఎక్కువగా నమ్ముతానంటూ పోస్ట్ పెట్టారు. 2018లో అధ్యక్షుడిగా వైట్హౌస్లో ఉండగా కూడా పుతిన్కి మద్దతుగా మాట్లాడి.. పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలతో యూఎస్లోని రిపబ్లికన్లు, డెమోక్రటిక్ సభ్యులు విస్మయానికి గురయ్యారు. యూఎస్ ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసే వాళ్ల గురించి, వారి పనితనం గురించి తక్కువ చేసి మాట్లాడటాన్ని మిగతా నాయకులంతా తీవ్రంగా ఖండించారు. పైగా రష్యా అధ్యకుడి గురించి ప్రస్తావించడం వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇదిలా ఉంటే.. 2016 యూఎస్ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు ప్రమేయం ఉన్నట్లు ఇంటిలిజెన్సీ నిర్ధారించడాన్ని కూడా ట్రంప్ అంగీకరించడంతో విమర్శల పాలయ్యాడు. దీని ఫలితంగా రష్యా ప్రమేయానికి సంబంధించి.. యూఎస్ న్యాయశాఖకు చెందిన ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో అతని అంతర్గత సభ్యులను సంత్సరాల తరబడి విచారించింది. ఇది ఒక రకంగా ట్రంప్ రాజకీయ జీవితాన్ని నష్టపరిచేందుకు దారితీసింది. చివరికి అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడమే గాక సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇటీవలే ఆయన తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించేవాడిని అంటే పోస్ట్ పెట్టి వార్తలో నిలిచారు. అది మరువక మునుపై మరోసారి అనూహ్యమైన రీతీలో వ్యాఖ్యలు చేసి అపఖ్యాతిని కొనితెచ్చుకుంటున్నారు ట్రంప్. (చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!) -
Hyderabad:‘ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది. ఇలాంటి వాటితో జీహెచ్ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఆన్లైన సంబంధిత ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ లోపాలకు చెక్.. ► ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్ అసెస్మెంట్లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు. ► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్మెంట్ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్సెక్షన్ సిబ్బంది ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం. ► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని, వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు. ► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. ► ఈ సిస్టమ్ డెవలప్ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది. ► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు. ► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్బోర్డులు విని యోగించి భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు. భవన వినియోగం తెలుస్తుంది.. ఖైరతాబాద్లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది. ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: కరోనా కేసుల్లేవ్ -
ఆక్టోపస్కు.. మనకు.. ముత్తాత ఒకరే.. మనుషుల్లా కలలు కూడా కంటాయట!
భూమ్మీద ప్రతి జీవికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి ఎక్కువ, కొన్నింటికి తక్కువ. పెద్ద జంతువులు ఏమోగానీ కొన్నిరకాల సాధారణ జీవులు వాటి స్థాయికి మించి తెలివి చూపుతుంటాయి. ఇందులో ఆక్టోపస్లు ప్రత్యేకం. అవి కొన్నిసార్లు మనుషుల్లాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, ఆక్టోపస్లకు కామన్గా ఉన్న పాయింటే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆ తెలివి ఎక్కడిదనే పరిశోధనతో... సాధారణంగా జలచరాలతో పోలిస్తే జంతువులకు జ్ఞానం ఎక్కువ. వాటి మెదడు క్లిష్టమైన నిర్మాణంతో, ఎక్కువ సామర్థ్యంతో ఉండటమే దీనికి కారణం. కానీ జలచరాలే అయినా ఆక్టోపస్లు చిత్రంగా తెలివిని ప్రదర్శిస్తాయి. మనుషులు, జంతువులను గుర్తించగలడం, అందులో నచ్చినవారిని ఇష్టపడటం, డబ్బాల మూతలను తిప్పితీయడం, కర్రపుల్లలు, ఇతర వస్తువులను పరికరాల్లా వాడగలగడం, గుర్తు పెట్టుకోగలగడం వంటివి చేస్తాయి. వాటికి ఉన్న ఎనిమిది టెంటకిల్స్ను మనం చేతులను వినియోగించినట్టుగా.. సున్నితంగా నత్తగుల్లలను తెరవడానికి, శత్రువులపై వేగంగా దాడి చేయడానికి వాడగలవు. పూర్తిస్థాయిలో ఎదిగిన మెదడు, విస్తృతమైన నాడీ వ్యవస్థనే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఒక జలచరం ఇలా ఎదగడానికి కారణమేమిటన్న అన్వేషణలో ఒకనాటి మూలాన్ని గుర్తించారు. 51.8 కోట్ల ఏళ్ల కిందట.. భూమ్మీద జీవం ఆవిర్భవించిన తొలినాళ్లు అవి. సూక్ష్మజీవుల స్థాయిలో మొదలైన జీవం సుదీర్ఘకాలం ప్రాథమిక స్థాయిలోనే.. సముద్రాల్లో వివిధ రకాల పురుగులు, ఇతర రూపాల్లో ఉండేది. అలాంటి ఓ పురుగులాంటి జీవి పేరు ‘ఫసివెర్మిస్ యున్ననికస్’. సముద్రం అడుగున నేలకు అతుక్కుని జీవించేది. ఇది సుమారు 51.8 కోట్ల ఏళ్ల కింద పరిణామ క్రమంలో.. రెండు వేర్వేరు జీవులుగా మారిపోయింది. ఆ రెండింటిలో ఒకటి మనుషులకు ముత్తాత అయితే.. మరొకటి ఆక్టోపస్లకు మూలం అని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. నాడీ వ్యవస్థలోని మైక్రో ఆర్ఎన్ఏలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ తెలివి నుంచే.. జీవుల జన్యువుల పనితీరును నియంత్రించే మూల పదార్థాలే మైక్రో ఆర్ఎన్ఏలు. ఇందులో కొన్ని మైక్రో ఆర్ఎన్ఏలు మెదడు నిర్మాణం తీరు, సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ మైక్రో ఆర్ఎన్ఏలు సాధారణంగా జలచరాల్లో తక్కువగా, నేలపై తిరుగాడే జంతువుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే జలచరాల్లో చాలా వరకు వివిధ రకాల జీవుల నుంచి అభివృద్ధి చెందగా.. మనుషులు, ఆక్టోపస్లు రెండు జాతులు కూడా ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచే రూపొందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ జీవులు అప్పట్లోనే కాస్త తెలివిని ప్రదర్శించేవని.. శరీరంలో అవసరం లేని భాగాలను స్వయంగా వదులుకుంటూ పరిణామం చెందాయని తేల్చారు. నాటి జీవుల్లో మైక్రో ఆర్ఎన్ఏలే ఈ సామర్థ్యానికి కారణమని అంటున్నారు. మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకొని.. ఈ అంశంపై పరిశోధన చేసిన జర్మనీలోని బెర్లిన్ మాక్స్ డెల్బ్రక్ సెంటర్ శాస్త్రవేత్త నికోలస్ రజేవ్స్కీ తాము గుర్తించిన వివరాలను వెల్లడించారు. ఆక్టోపస్ల మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి.. వాటిలో కొత్తగా 42 మైక్రోఆర్ఎన్ఏ రకాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తంగా వీటిలో 90 మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నట్టు వివరించారు. అదే ఆక్టోపస్లకు సమీప జీవులైన ఆయ్స్టర్లు, స్క్విడ్లు వంటివాటిలో ఐదే మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నాయని తెలిపారు. ఒకనాటి ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచి విడిపోతూ పరిణామం చెందినప్పుడు ఆక్టోపస్లు మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకోగలిగాయని.. అందుకే మెదడు ఎదిగి, జ్ఞానాన్ని చూపగలుగుతున్నాయని వివరించారు. కొసమెరుపు ఏమిటంటే.. ఆక్టోపస్లు మనుషుల్లా కలలు కూడా కంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి నిద్రపోయినప్పుడు కలల వల్లే వాటి రంగు, చర్మంపై ఆకారాలు మారిపోతూ ఉంటాయని అంటున్నారు. -
ల్యాబ్లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్లో పెంచుతోంది. డిష్బ్రెయిన్గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఎంపీ రఘురామ కుమారుడిపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కాని స్టేబుల్పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్లు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 12న ఇదే పిటిషన్ విచారించి కొట్టివేశామని, ఆర్డర్ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
ఇంటర్ బోర్డుపై ఇంటెలిజెన్స్ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, పరీక్ష పేపర్లలో వరుస తప్పిదాలు, ప్రైవేటు కాలేజీలకు ఉన్నతాధికారులు కొమ్ముగాయడం, బోర్డులో సంబంధం లేని వ్యక్తుల జోక్యంపై కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితిపై నిఘా వర్గాల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్టు సమాచారం. మొత్తం ఇంటర్ బోర్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ మంత్రి దృష్టికీ వచ్చాయి. వీటికితోడు ఈసారి ఇంటర్ ప్రశ్నపత్రాల్లో వరుసగా తప్పులు దొర్లాయి. హిందీభాషా ప్రశ్నపత్రం ముద్రించనే లేదు. ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాదం చేసే వ్యక్తులే లేరని బోర్డు చెప్పడంపైనా విమర్శలొచ్చాయి. ఇక పరీక్షల విభాగంలో కీలకమైన వ్యక్తుల నియామకం అడ్డదారిలో జరిగినట్టు కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆఖరుకు హాల్ టికెట్లు కూడా ముందుగా కాలేజీలకు ఇచ్చి, ఆ తర్వాతే విద్యార్థి లాగిన్లో ఓపెన్ అయ్యేలా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం ఇంటెలిజెన్స్ను కోరినట్టు తెలిసింది. -
ఆ పేలుడు ఘటనలో క్లూ... ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ
Pizza order gave Firs Clue: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పిజ్జా ఆర్డరే వాళ్లకు అసలైన క్లూ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ కార్యాలయం పై దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంటెలిజెన్స్ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్టు తెలిసింది. అతను గేటు నుంచి బయటకు రాగనే కార్యాలయానికి సమీపంలో ఆగి ఉన్న తెల్లటి మారుతి స్విఫ్ట్ కారును ఆ అధికారి గమనించాడు. అతను పిజ్జాతో లోపలికి వెళ్లిన మరు క్షణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఈ కారుపై దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్లను, సుమారు 7 వేల మొబైల్ డంప్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ బోరర్ (ఐబీ) సమీపంలో డ్రోన్తో చిన్న సైజు ఆర్పీజీని పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అతను గతంలో చేసిన దాడులన్ని సరిహద్దు అవతల నుంచే ప్లాన్ చేసేవాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ డ్రోన్లు ఒక పెద్ద సవాలని, వాటిని ఆపడానికి ఒక పద్ధతి ఉంటేగానీ ఇలాంటి ఘటనలను ఆపడం అసాధ్యం అని చెప్పారు. పైగా ఈ దాడి అధికారులను ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించేలా చేసింది. ఇటీవల కాలంలో పంజాబ్లో ఇలాంటి ఘటను మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవడం: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు) -
పంజాబ్ ఇంటెలిజెన్స్హెడ్ ఆఫీసుపై రాకెట్ దాడి
చండీగఢ్: పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్–ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్పీజీ) విసిరినట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి కిటికీలు, ఫర్నీచరు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కాదని అన్నారు. దీంతో సీనియర్ పోలీసు సుపరిడెంట్ ఆఫీసర్తో కూడిన బృందం కార్యాలయం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇక దీనికి సంభంధించి మొహాలీ పోలీసులు మాట్లాడుతూ.. సెక్టార్ 77, SAS నగర్లో ఉన్న పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్లో సోమవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో చిన్నపాటి పేలుడు సంభవించింది. అయితే ఎటువంటి పాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం సీనియర్ అధికారులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను సైతం పిలిపించారని తెలిపారు. అయితే ఈ దాడి ఉగ్రవాదులు చేశారా లేక కార్యాలయంలోని పేలుడు పదార్థాల వలన జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పంజాబ్ పోలీసులు టార్న్ తరణ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన తాజా ఘటనతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోలీసులను పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. -
ఇప్పుడే ‘ఎన్నికల’ బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పోలీసుశాఖలో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా అధికారుల ప్రొఫైల్స్ను ఇంటెలిజెన్స్ విభాగం వడపోస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇటు నేతలకు ఇబ్బందిలేకుండా, అటు ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ వేటు పడకుండా ఉండేలా అధికారుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండేళ్లపాటు వారిని కదిపే అవసరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా ముఖ్యమైన అధికారి. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతల కదలికలు వంటి విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో వారే కీలకం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ చీఫ్ను మా ర్చాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధికారిస్థానంలో రాజధానిలోని కీలక కమిషనరేట్కు బా«ధ్యులుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ కమిషనర్ల మార్పు కూడా.. కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట సహా కీలకచోట్ల పోలీస్ కమిషనర్లను మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. పదోన్నతులు పొందడం, లాంగ్ స్టాండింగ్, వివాదాస్పద అంశాలు వంటి కారణాల రీత్యా సంబంధిత అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, గద్వాల ఎస్పీలతోపాటు వరం గల్, పెద్దపల్లిలోని డీసీపీలను మార్చనున్నట్టు తెలిసింది. ఆయా కమిషనరేట్లలో శాంతిభద్రతల విభాగంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులను మార్చే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అటాచ్డ్ అధికారులకు జూన్లో.. రాష్ట్రంలో 20 మందికిపైగా పదోన్నతి పొంది వెయిటింగ్, అటాచ్మెంట్, లుక్ ఆఫ్టర్ ఆదేశాలతో ఉన్న ఐపీఎస్ అధికారులకు జూన్ తొలి వారంలో పోస్టిం గ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జోన్లు, అదనపు సీపీలు, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీ, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖ తదతర విభాగాల అధికారులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇన్స్పెక్టర్లకూ సిఫార్సులు! జిల్లాలతోపాటు కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్హెచ్వోలు (ఇన్స్పెక్టర్లు), సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ లు సైతం ఎన్నికలే లక్ష్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లను ఇప్పటినుంచే ఎంచుకుని పోస్టింగ్ ఇప్పించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలా సిఫార్సుల కోసం ఇతర జిల్లా లేదా ఇతర రేంజ్ పరిధిలో పనిచేసిన వారిని ఎంచుకోవాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఎలక్షన్ కమిషన్ కొందరు అధికారులను బదిలీ చేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. స్థానికత, వివాదాలు, పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేయాలని సూచనలు వచ్చినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నాటికి కసరత్తు పూర్తిచేసి జూన్లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత రాష్ట్రంలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు భారీగా ఉంటాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలలుగా బదిలీ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న డీఎస్పీ/ఏసీపీలకు జూన్ మొదటివారంలో మోక్షం కలుగుతుందని తెలిసింది. డీఎస్పీ పోస్టింగ్ విష యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీస్శాఖలో చర్చ జరుగు తోంది. ఆయా జిల్లాల్లో ఎక్కువకాలం పనిచేయనివారు, వివాదాలు లేని అధికారులకే సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సులపై ఇంటెలిజెన్స్లో అధికారులు పరిశీలన చేస్తారని, సంబంధిత అధికారి పూర్తి ప్రొఫైల్ను పరిశీలించాకే పోస్టింగ్కు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. -
భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత!
లండన్: తమ అనుకూల నేతను ఉక్రెయిన్ అధినేతగా చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మాజీ ఎంపీ యెవెహెన్ మురయేవ్ను రష్యా ఎంచుకొని ప్రోత్సహిస్తోందని యూకే విదేశీ వ్యవహరాలు, కామన్వెల్త్ కార్యాలయం (ఎఫ్సీడీఓ) శనివారం ప్రకటించింది. ఈ మేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఇలాంటి ప్రయత్నాలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా కుట్రలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా వెనక్కు తగ్గాలని, ఇలాంటి కుట్రలు మానుకొని ప్రజాస్వామ్య మార్గం అవలంబించాలని కోరారు. ఉక్రెయిన్పై రష్యా ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా తాము, తమ మిత్ర దేశాలు ఊరుకోమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసకునే ఉద్దేశంతో రష్యా సరిహద్దులోకి లక్షమంది సైనికులను తరలించిందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై యుద్ధం చేసి ఆక్రమించుకునే బదులు, తమకు అనుకూల నేత చేతిలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఉంటే మంచిదని రష్యా భావిస్తోన్నట్లు ఎఫ్సీడీఓ తెలిపింది. యెవెహెన్ మాత్రమే కాకుండా పలువురు ఉక్రెయిన్ రాజకీయనేతలకు రష్యాతో సంబంధాలున్నట్లు తెలిపింది. 2015 నుంచి ఉక్రెయిన్లో బ్రిటన్ సేనలు సాయంగా ఉంటున్నాయి. బ్రిటన్ ఆరోపణలను రష్యా ఖండించింది. బ్రిటన్ ఆధ్వర్యంలో నాటో కూటమి సాగించే తప్పుడు ప్రచారంలో ఇదంతా భాగమని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. (చదవండి: ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని) -
ఆ 3 జిల్లాలపై ఇంటెలిజెన్స్ నజర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో వీటిపై ఆసక్తి నెలకొంది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. కొన్ని జిల్లాల్లో రెండేసి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగనున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నట్లు తెలిసింది. ఆరుగురి వెనుక అధికారపార్టీ నేతలు! రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొద్ది రోజులుగా హాట్ టాపిగ్గా మారింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జిల్లాలో స్థానిక సంస్థల కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టీ ఆ జిల్లాపైనే ఉంది. దీనికి తగ్గట్టుగా స్వతంత్ర అభ్య ర్థులు 9 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా మిగిలిన అభ్యర్థులు అధికార పార్టీకి చెందినవారేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి. పైగా ఒక్కో అభ్యర్థికి 10 మంది ప్రతిపాదకులు సంతకాలు చేయడం గమనార్హమని నిఘా వర్గాల అధికారులు తెలిపారు. 9 మంది అభ్యర్థులను 90 మంది ప్రతిపాదించడం అంటే క్యాంపు రాజకీయాలకు తెరదీసినట్టేనని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. కాంగ్రెస్గా భావిస్తున్నవారిని మినహాయిస్తే, మిగతా ఆరుగురి వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీసింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతలే ఇలా స్వతంత్రుల ద్వారా నామినేషన్లు వేసి, అవసరమైన పక్షంలో తమ సత్తా చూపించాలని భావిస్తున్నట్టు తెలిపింది. క్యాంపు రాజకీయాలపై కన్ను కరీంనగర్లో విపక్ష నేతలంతా ఒక్కటైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అధికార పార్టీ అసంతృప్త నేతలను సైతం తమతో కలుపుకొని క్యాంపు రాజకీయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గుర్తించాయి. 1,326 ఓట్లు ఉన్న కరీంనగర్ లో 350 నుంచి 400 మందిని ఓ కీలక నేత ద్వారా గోవాలోని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్నగర్, రంగారెడ్డిపై... గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి.. 2007లో మహబూబ్నగర్ జిల్లా నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ జిల్లాపై ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డితో పాటు అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోనూ అధికార పార్టీకి చెందిన అసంతృప్తులే నామినేషన్లు వేస్తారని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించి, తర్వాత అధికార పార్టీలో చేరిన వారిని స్వతంత్రులుగా బరిలోకి దించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఇంటె లిజెన్స్ గుర్తించింది. అయితే ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. -
రంగంలోకి ఇంటెలిజెన్స్ .. హుజూరాబాద్ ప్రజలకు ప్రశ్నలు?
సాక్షి, హైదరాబాద్: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో ఇంటెలిజెన్స్ విభాగం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఇంటెలిజెన్స్ విభాగం.. అధికారులు, సిబ్బందిని అక్కడ మోహరించింది. ఈటల టీఆర్ఎస్కు రాజీనామా తర్వాత నియోజకవర్గంలో పరిణామాలను అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించారు. సర్వేలు చేసి పార్టీల బలాలు, బలహీనతలను ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. హుజూరాబాద్ ఎన్నిక ఆగస్టులోనే వస్తుందని భావించి భారీస్థాయిలో సిబ్బందితో సర్వేలు రూపొందించారు. అప్పుడు బెంగాల్లో జరిగే ఉప ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో నిఘా విభాగం కొంత రిలాక్స్ అయ్యింది. 100 నుంచి 150 మంది... ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఇంటెలిజెన్స్లో ఉన్న పొలిటికల్ విభాగం ఉన్నతాధికారులు మూడు రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిని హుజూరాబాద్లో మోహరించారు. మొత్తంగా 100 నుంచి 150 మందిని నియోజకవర్గంలో నియమించినట్లు తెలిసింది. పార్టీల వారీగా అధికారులు, సిబ్బందిని విభజించి డ్యూటీలు వేశారని తెలిసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందించనున్నారు. పార్టీలు, కులాలు, వయసు... ఇంటెలిజెన్స్ బృందాలు సర్వేలో భాగంగా ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు సంబంధించి ప్రశ్నలు కూర్పు చేసినట్లు సమాచారం. అలాగే కులాలు, మతాలు, ఓటర్ల వయసు, వారి వృత్తి, పార్టీలపరంగా, మహిళల్లో కేటగిరీల వారీగా, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీ సర్వేలో 5 నుంచి 6 వేల మంది నుంచి వివరాలు సేకరించేలా నిఘా విభాగం భారీ కసరత్తు చేసింది. ఎన్నిక ముగిసే వరకు ప్రతీ నాలుగు రోజులకోసారి సర్వే పూర్తి చేసి నిఘా విభాగాధిపతికి అందజేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి ప్రశ్నలు.. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు, సీఎం పనితీరు, దళితబంధు, అభ్యర్థి ఎంపిక బీజేపీకి సంబంధించి ప్రశ్నలు.. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు, పెట్రో ధరలు, అభ్యర్థి వ్యవహారాలు, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్కు సంబంధించి ప్రశ్నలు.. ప్రతిపక్షం పనితీరు, అభ్యర్థి పోటీ ఇవ్వగలడా, టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారంతోనే పోటీనివ్వనుందా -
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్గా మారాడు. -
Escape From Taliban: అఫ్గన్లకు ఇప్పుడు ఇవే దిక్కు
అఫ్గన్ అల్లకల్లోలం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభీతితో పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ఈ తరుణంలో వారు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారని ఎంఐటీ రివ్యూ వెల్లడించింది. గూగుల్ ఫామ్స్ గూగుల్, వాట్సాప్.. ఇప్పుడు తాలిబన్ల కంటపడకుండా తప్పించుకునేందుకు అఫ్గన్లకు మార్గనిర్దేశకాలుగా మారాయి. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు.. ఆఫ్గన్ల పేర్లతో ఆన్లైన్ లిస్ట్లు తయారుచేసి సాయం అందిస్తున్నారు. మరికొన్ని గ్రూపులు తాలిబన్ల కదలికల ఆధారంగా ఎలా వెళ్లాలో అఫ్గన్ పౌరులకు సూచనలు చేస్తున్నాయి. వీటిలో చాలావరకు కాబూల్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడి పౌరులకు సాయపడుతున్నాయి. ఇందుకోసం గూగుల్ ఫామ్స్ను సర్క్యులేట్ చేస్తున్నారు. నిఘా సూచనలు ప్రశ్నలు..వాటికి సమాధానాలు అందించడం కోసం గూగుల్ ఫామ్స్ చాలా తేలికైన వ్యవహారం. అంతేకాదు అందులోనే పౌరుల పూర్తి సమాచారం మొత్తం పొందుపరుస్తున్నారు. ఇక వాట్సాప్లోనూ సమాచారం ఫార్వర్డ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానిక గ్రూపులతో పాటు అమెరికా విభాగాలు సైతం.. ఈ-మెయిల్స్ ద్వారా కాకుండా వాట్సాప్ గ్రూపులనే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి. మిగతావి కష్టం ఓవైపు ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ తాలిబన్ల కంటెంట్ కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి సులువుగా ఉపయోగించుకుంటున్నారు తాలిబన్లు. దీంతో వీటిలో ఎలాంటి అప్డేట్స్ పెట్టొద్దని అఫ్గన్లకు సూచనలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫామ్స్, వాట్సాప్ గ్రూపుల వినియోగం పెరిగింది. చదవండి: Afghanistan Trade: తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్కు ఇక భారీ దెబ్బే! -
పోలీసులు,ఇంటెలిజెన్స్కు సవాల్గా మారిన ‘మల్లేపల్లి’
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు, కౌంటర్ ఇంటెలిజెన్స్కు మల్లేపల్లి సవాల్గా మారింది. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా కొరవడటంతో పాటు సెర్చ్ ఆపరేషన్లు తగ్గాయి. మర్కాజ్ ఘటనతో మల్లేపల్లిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్లో స్లీపర్ సేల్స్కు అడ్డాగా మల్లేపల్లి మారింది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. 8 ఏళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను మల్లేపల్లిలో ఎన్ఐఏ పట్టుకుంది. మల్లేపల్లిలో వస్త్ర దుకాణాలను ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. సూరత్,ముంబై నుంచి వస్త్రాల ఇంపోర్ట్కి కేరాఫ్ అడ్రెస్గా మల్లేపల్లి ఉండగా, ఆ ప్రాంతంలో 1200లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. యూపీ బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం పెడుతున్నారు. -
కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ పర్యటన వరంగల్ చరిత్రలో మిగిలిపోయేలా సాగింది. అయితే, ఆద్యంతం ఉల్లాసంగా సాగిన ఆయన పర్యటనను అందరూ నెమ్మదిగా మరచిపోయే తరుణంలో ఆ రోజు జరిగిన పరిణామాలపై సీఎంఓ వర్గాలు సమగ్ర నివేదిక కోరడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన సందర్బంగా ఐదు రోజుల ముందు నుంచే కసరత్తు చేసినా.. ఆ రోజు చోటుచేసుకున్న చెదురుముదురు సంఘటనలు, వాటికి గల కారణాలను పోలీసు, ఇంటలిజెన్స్ వర్గాల విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా కట్టడి చేసినప్పటికీ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో హఠాత్తుగా కొన్ని విద్యార్థి సంఘాల బాధ్యులు కాన్వాయ్కు అడ్డుగా రావడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. పెద్ది.. అడ్డగింత సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొనేందుకు వస్తుండగా ఆయన వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుండి సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు ఆయన గన్మెన్లతో కలిసి నడిచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత జయశంకర్ వర్దంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏకశిల పార్కు వద్దకు వెళ్లిన సందర్భంగా కూడా మరోసారి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జయశంకర్కు నివాళులరి్పంచేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్బంగా ఎవరినీ పంపించబోమని పోలీసులు తేల్చిచెప్పారు. కాగా, తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, సీఎం కేసీఆర్ రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు, వారి భద్రత దష్ట్యా పోలీసులకు, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నడిచి వెళ్లానని ఆయన అదే రోజు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలపై సీఎంఓ వర్గాలు నివేదిక కోరడం, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపిన పోలీసులను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న ఓ పోలీసు అధికారిని వాగ్వాదానికి దిగగా... అసలేం జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. చదవండి: వరంగల్ అర్బన్ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్ -
ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు. చదవండి: (చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను) అన్ని విధాలుగా ఆలోచించే.. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరిన ఈటల తర్వా కీలక స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పార్టీ శాసనసభా పక్ష నేతగానూ వ్యవహరించారు. అలాంటి ఈటల రాజేందర్ను తప్పించడంపై సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఎంతో మంది నేతలు పార్టీని వీడినా ఉద్యమ ఉధృతిలో వారి ప్రభావం టీఆర్ఎస్పై పెద్దగా లేకుండా పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కీలక నేతను తప్పించాల్సి రావడంతో, అన్నీ పరిశీలించే చర్యలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈటలకు ఘన స్వాగతం సోమవారం రాత్రి భారీ కాన్వాయ్తో హుజూరాబాద్కు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనుచరులు, అభిమానులు బాణసంచా కాల్చారు. కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినదించారు. కాగా.. ఈటల రెండు రోజులు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే మకాం వేసి, అన్ని స్థాయిల నాయకులతో మండలాల వారీగా సమావేశమయ్యే యోచనలో ఈటల ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాతే, ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఏకాకి అయ్యారా? మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై తన కేడర్, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసే సూచ నలు కనిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటి నుంచి మూడు రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల నివాసానికి బారులు తీరారు. వివిధ కుల సంఘాల నేతలు, కొందరు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు కూడా కలిసి సంఘీభావం ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఈటల ప్రస్తావనే ఎత్తకపోవడం గమనార్హం. పలువురు మంత్రులు, ఇతర నేతలు వేర్వేరు అంశాలపై మాట్లాడుతున్నా.. భూకబ్జాలు, ఈటల బర్తరఫ్పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇలా పార్టీ ముఖ్యులెవరూ ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం లేదని కేసీఆర్ ముందుగానే అంచనా వేశారని నేతలు చెబుతున్నారు. అయితే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు ఈటల నివాసం వద్ద జరుగుతున్న పరిణామాల వివరాలు సేకరిస్తున్నారని, ఈటలతో సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కదలికలపైనా నిఘా పెరిగిందని సమాచారం. -
ఆర్థిక మోసాలపై డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్తో పాటు టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేయడంపై టెలికం శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ యూనిట్ను, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ‘అనవసర కాల్స్, మెసేజీలతో టెలికం యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న టెలీమార్కెటర్లు, ఇతరత్రా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. టెలికం వనరులను ఉపయోగించుకుని సామాన్యుడి కష్టార్జితాన్ని దోచేసే ఆర్థిక మోసాలు కూడా జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు‘ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఏర్పాటవుతుంది. -
ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా రమేష్రెడ్డి
సాక్షి, అమరావతి: ఎస్పీ ఆవుల రమేష్రెడ్డిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీగా రమేష్రెడ్డిని తప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సిఫారసు చేయడంతో ఆయన్ను ప్రభుత్వం వెయిటింగ్లో పెట్టింది. రమేష్రెడ్డిని ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. -
ట్రంప్ కోసం రష్యా ప్రయత్నాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు వ్యతిరేకంగా రష్యా కుట్ర చేస్తోందని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అనుకూలంగా రష్యాతో సన్నిహిత సంబంధాలున్న కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. అయితే, చైనా మాత్రం ట్రంప్ మరోసారి ఎన్నిక కాకూడదని కోరుకుంటోందని తెలిపారు. ఆ దిశగా ప్రజాభిప్రాయం మార్చేందుకు చైనా ట్రంప్పై విమర్శల పదును పెంచిందని వివరించారు. -
దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!...
సాక్షి, అమరావతి: ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో పేర్కొన్నారు. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
మెదడు పనితీరును మెరుగుపరిచే నిద్ర
ఎంతటి మేధావులయినా తమ మేధోతత్వాన్ని ఇనుమడింప చేసుకోవాలంటే కంటినిండా నిద్రపోవాలని, లేదంటే క్రమంగా వారి తెలివితేటలు మసకబారడమే కాకుండా, ఆయుష్షు కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్దాయానికి, మనిషి సగటున రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నాడనే దానికి సంబంధం ఉందని, కంటినిండా నిద్రపోయేవారు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని ప్రొఫెసర్ జేమ్స్ రోలండ్ చెబుతున్నారు. మనిషి ఎంత పట్టుదలతో ఉన్నా, మహా అయితే 48 గంటలు మాత్రమే నిద్ర పోకుండా ఉండగలడని, ఆ తర్వాత కూడా నిద్ర ఆపుకోవాలని చూసినా, అది ఫలించదని, నిద్ర ముంచుకు రావడమే కాకుండా అప్పటికే శరీరంలో మితిమీరిన రీతిలో అవలక్షణాలు తొంగి చూస్తాయంటున్నారు పరిశోధకులు. అసలు అలా కావాలని నిద్రను నిలుపుకొంటే పూర్తిగా చావును కొనితెచ్చుకున్నట్టే అవుతుందనీ, ప్రఖ్యాత ప్రజావైద్యుడు ద్వారకానాథ్ కొట్నిస్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనా– జపాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులకు ఏకబిగిన నిద్రను లెక్క చేయకుండా దాదాపు మూడురోజులపాటు శస్త్ర చికిత్స చేయడం వల్ల అతని శరీరంలో ఎన్నో విపత్కర పరిణామాలు తలెత్తాయనీ, దాంతో 32 సంవత్సరాల వయస్సులోనే మూర్ఛవ్యాధి సోకడం వల్ల మరణించాడని గుర్తు చేస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన ప్రఖ్యాత ప్రజావైద్యుడు, ప్రపంచంలోనే వైద్యవృత్తిలో ధర్మాత్ముడిగా, ఆ వృత్తికి అత్యంత హుందాతనాన్ని, యశస్సును తీసుకొచ్చిన నార్మన్ బెతూన్. 49 ఏళ్లకే చనిపోయాడనీ, అందుకు కారణం కేవలం నిద్ర సరిగాపోకుండా విపరీతమైన సేవా కార్యక్రమాల్లోను, కొత్త శస్త్ర చికిత్స పరికరాల రూపకల్పనలోను తలమునకలు కావడమేననీ, ఈ విషయాలు ఎంత పాతవైనప్పటికీ, నిద్రపోకుండా ప్రయోగాలు, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసి తీరాలంటున్నారాయన.దీనిని బట్టి చూస్తుంటే పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో రేయింబవళ్లు విద్యార్థుల్ని బట్టీలు పట్టించి చదివిస్తే ర్యాంకులు వస్తాయి గానీ మేధో పరిణితి, విచక్షణ, సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నూతనత్వం, ఉత్తేజం, ఉత్సాహం, తాజాదనం నేటి విద్యార్థుల్లో రాకపోవడానికి, లేకపోవడానికి గల కారణాలలో నిద్ర సరిగా లేకపోవడం కూడా ఒకటని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నిద్ర పోవాలి. ఏదో ఒక గమ్యం మీద కలలు కనాలన్నా, ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నా నిద్ర తప్పనిసరి అన్నమాట. -
ఏపీ ఎన్నికలపై బోగస్ సర్వే; ఒకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ పెట్టిన కేసులో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పాండురంగారావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చేసినట్టుగా చెబుతూ బోగస్ సర్వేను యూట్యూబ్లో పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు పాండురంగారావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశముంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే భవన్లో టీఎఫ్సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకుందని సమాచారం. (చదవండి: బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్సీ’ కార్యాలయం!) -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
-
పక్కనే ఉన్నా పసిగట్టలేకపోయారు..
న్యూయార్క్ : తాలిబన్ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ అలియాస్ ముల్లా ఒమర్ అమెరికా సైనిక శిబిరాలకు అత్యంత చేరువలోని రహస్య గదిలో ఉన్నా అమెరికన్ దళాలు గుర్తించలేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్లోని అమెరికా శిబిరాలకు నడక దూరంలోనే ముల్లా ఒమర్ ఏళ్ల తరబడి నివసిస్తున్నారని ఈ పుస్తకం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపింది. గతంలో ముల్లా తలదాచుకున్న ఈ ఇంటిపై అమెరికా దళాలు సోదాలు చేపట్టినా ఇందులో ఆయన కోసం నిర్మించిన రహస్య గదిని అవి పసిగట్టలేకపోయాయని పుస్తకంలోని అంశాలను ప్రచురించిన గార్డియన్, వాల్స్ర్టీట్ జర్నల్ కథనాలు వెల్లడించాయి. అమెరికా ట్విన్ టవర్స్పై దాడి అనంతరం ఒమర్ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది. కాగా అల్ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ మాదిరిగానే ఒమర్ సైతం పాకిస్తాన్లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. 2006 నుంచి ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా వార్తలు అందిస్తున్న డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ ప్రచురించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు దుమారం రేపుతున్నాయి. -
‘పుల్వామా’ను రాజకీయం చేయడం కాదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్ లోయలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం స్వేచ్ఛగా సంచరించిందంటే ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే’ అని 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే, శుక్రవారం నాడు జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య ఇది. అదే రోజు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయంలో ఏ నిర్ణయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటామని యావత్ ప్రతిపక్షం ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం గమనార్హం. (‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్) పుల్వామా దాడి సంఘటనను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నామని బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం ఒడిశా, చత్తీస్గఢ్లలో జరగాల్సిన తన సభలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇటార్సిలో జరగాల్సిన తన సభను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఝాన్సీలో జరగాల్సిన బహిరంగ సభను మాత్రం మోదీ రద్దు చేసుకోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించండంటూ ఆ సమావేశంలో మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. మోదీ శనివారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడంతోపాటు పల్వామా సంఘటన గురించి ప్రస్తావించి ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు. అదివారం అస్సాం ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ‘ కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కనుక జవానుల ప్రాణ త్యాగాన్ని వృధా పోనీయం’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ నాయకుడు భరత్ పాండ్యా సోమవారం నాడు వడోదరలో మాట్లాడుతూ కేంద్రంలో ఇంతకుముందున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోక పోవడం వల్ల నేడు జవాన్ల ప్రాణాలు పోయాయని అన్నారు. ‘నేడు జాతీయవాదాన్ని నింపుకున్న హృదయాలతో యావత్ జాతి ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఓట్లుగా మలుచుకోవడం మన బాధ్యత’ అని పాండ్య పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడే ఆదేశించింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నిరసన సభల్లో పార్టీ జెండాలకు బదులుగా పార్టీ ఎన్నికల గుర్తయిన కమలాన్ని ఎక్కువ ప్రదర్శించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. శవం పక్కన చిద్విలాసంగా బీజేపీ ఎంపీ ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో శనివారం నాడు సీఆర్పీఎఫ్ జవాను అజిత్ కుమార్ అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పాల్గొన్నారు. తాను అంతిమ యాత్రలో పాల్గొంటున్నానని, పైగా సైనికుడి భౌతికకాయం పక్కనున్నననే విషయాన్ని కూడా విస్మరించిన బీజేపీ ఎంపీ, పార్టీ ర్యాలీలో పాల్గొన్నట్లుగా చిద్విలాసంగా నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ, చేతులూపుతూ వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి అనేక వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించగా, బీజేపీకి ప్రచార బలగాలు ఎక్కువున్నాయని, ఈ సమయంలో తాము ఏం మాట్లాడినా ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేసే ప్రమాదం ఉందని వారన్నారు. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు. -
పుల్వామా దాడిలో అన్ని వైఫల్యాలే!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఓ టెర్రరిస్టు దాడిలో 44 మంది సైనికులు మరణించడం ఎవరు ఎప్పటికీ పూడ్చలేని లోటు. ఎదను తన్నుకుంటూ పెల్లుబికి వచ్చిన కన్నీళ్లను భారత జాతి కొద్ది కాలానికి మరచిపోవచ్చు. కానీ వారి కుటుంబాలు ఎప్పటికీ మరచి పోలేవు. ఇంతటి విషాధాన్ని మిగిల్చిన దారుణ సంఘటనకు ప్రత్యక్షంగా టెర్రరిస్టులు, పాకిస్థాన్ కారణం కావచ్చు. పరోక్షంగా మనం అంటే, మన వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం, అధికార యంత్రాంగం, విధాన నిర్ణేతలు కారణం కాదా? మన వ్యవస్థలు పటిష్టంగా ఉండి ఉంటే ఇంతటి దారుణాన్ని నిలువరించి ఉండేవాళ్లం కాదా?! మొదటి వైఫల్యం 80 వాహనాలను, 2,500 మంది సైనికులను ఒకేసారి గణతంత్ర దినోత్సవం పరేడ్లాగా ఎక్కడైనా పంపిస్తారా ? అందుకు అనుమతిస్తారా ? సైన్యం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లాలంటే విడతలుగా, జట్టు జట్టుగా వెళ్లాలని సైనిక నిబంధనావళే తెలియజేస్తోంది. ఉగ్రవాదుల అలజడి ఎక్కువగా ఉన్న దక్షణ కశ్మీర్ రోడ్డులో అంత మంది సైనికులు ఒక్కసారి ఎందుకు వెళ్లారు ? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక జాతీయ రహదారి మూసుకుపోయినందున రెండు రోజుల పాటు జమ్మూలో సైనికులు నిలిచి పోవాల్సి వచ్చిందని సైనిక అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు వాతావరణం అనుకూలించగానే కొంత మందిని విమానాల ద్వారా, మరి కొంద మందిని వాహనాల ద్వారా పంపించ వచ్చుగదా? అలా ఎందుకు చేయలేదు ? విమానాలకు ఖర్చు ఎక్కువవుతుందనా? రెండో వైఫల్యం సైనిక వాహనాలకు మధ్య పౌర వాహనాలను చొచ్చుకొని రావడం వల్ల ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రావడాన్ని సకాలంలో గుర్తించలేక పోయామని సైనిక అధికారులు చెబుతున్నారు. పౌర వాహనాలను ఎందుకు అనుమతించారు ? రాజకీయ నాయకుల కాన్వాయ్ పోతుంటే పౌర వాహనాలను నిలిపివేస్తారుగానీ, దేశాన్ని రక్షించే సైన్యం పోతుంటే నిలిపివేయరా ? వారి ప్రాణం పోయాక సాల్యూట్ కొడితే ఏం లాభం? (నా గుండె కూడా మండుతోంది) ఇంటెలిజెన్స్ వైఫల్యం త్వరలో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందంటూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సీఆర్పీఎఫ్కు ఇంటెలిజెన్స్ వర్గాలు సాధారణ హెచ్చరిక జారీ చేసిందట. ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎవరు జరుపుతారో? మాత్రం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పలేక పోయాయి, కనుక్కోలేక పోయాయి. ఆత్మాహుతి దాడి గురించి ఎక్కడ ఉప్పందిందో అక్కడి నుంచి అనువనువు శోధించుకుంటూ వస్తే ఎక్కడో ఓ చోట దాడికి కుట్ర జరగుతోందన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని ఉండేవారు. బాంబర్ 350 కిలోల పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరిస్తున్నప్పుడు కనుక్కునే అవకాశం ఉండింది. వాహనంతో సైనిక వాహన శ్రేణిని ఢీకొన్న ఆత్మాహుతి బాంబర్కు, కుట్ర దారులకు మధ్య చివరి వరకు సమాచార మార్పిడి జరిగి ఉంటుంది. మధ్యలో సమాచారాన్ని ట్రేస్ చేసి పట్టుకోక పోవడమూ వైఫల్యమే. ఆర్వోపీ వైఫల్యం సైన్యం ఓ చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు ‘రోడ్ ఓపెనింగ్ పార్టీ’ లేదా ‘ఆర్వోపీ’ క్లియరెన్స్ తప్పనిసరి. ఎక్కడైన మందు పాతరలు ఉన్నాయా, ఎక్కడయినా శత్రువులు పొంచి ఉన్నారా? ఎక్కడైన అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అన్న అంశాలను తేల్చుకోవడానికి ఆరోవోపీ సిబ్బంది ముందుగా వెళుతుంది. ఆ సిబ్బందికి బాధ్యత వహిస్తున్న అధికారి అనుమతి ఇస్తేనే సైన్యం కదలాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్వోపీ తనిఖీ చేసిందా ? లేదా ? తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చిందా? తేల్చాలి. పేలుడు పదార్థాలతోపాటు కాల్పులు కూడా వినిపించాయని సీఆర్పీఎఫ్ ఐజీ తెలిపారు. అదే నిజమయితే ఆర్వోపీ తన విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయినట్లే (ఉగ్ర మారణహోమం) సైన్యానికి పూర్తి స్వేచ్ఛ పుల్వామా మారణ హోమంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇప్పటి నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిందని, సైనికులపై దాడులు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయన అధికారంలోకి రాగానే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉండాల్సింది. కశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆ రాష్ట్రం నడుస్తోంది. అలాంటప్పుడు విధానపర లోపం కేంద్రానిదే అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే పాకిస్థాన్ పీచమణచడమే కాదు, ఈ వైఫల్యాలన్నింటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత కన్నీరు కారిస్తే ఏం లాభం?!? -
వైఎస్ జగన్ ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్ హడావుడి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హడావుడి చేస్తున్నారు. వైఎస్ జగన్ నివాసానికి వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం బుధవారం వైఎస్ జగన్తో సమావేశం కానున్న నేపథ్యంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలను వారు ఎప్పటికప్పుడూ విజయవాడకు చేరవేస్తున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు కోసం పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రతిపక్ష నేత ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు సమాచార సేకరణ కోసం ఇలా హడావుడి చేయడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. -
పిడుగుల దినోత్సవం
అల్లరి చేసే చిన్నారులను చిచ్చర పిడుగులతో పోలుస్తారు. కొందరు పిల్లలు సాధించిన విజయాలను చూస్తే కొంతమంది పిల్లలు పుట్టుకతో పిడుగులు. అనుకోక తప్పదు. కొందరు చిన్నారులు వయసులో మాత్రమే చిన్నవాళ్లు. పెద్దలు సైతం సాధించలేని విజయాలను సొంతం చేసుకున్న ఘనత వారిది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించిన చిన్నారులు కొందరు, మేధాశక్తితో మేధావులనే మెప్పించిన వాళ్లు కొందరు, కాల్పనిక శక్తిని చాటిన వారు కొందరు, కళా సేవా రంగాల్లో కొందరు... ఆటలాడుకునే వయసులో ఆడుతూ పాడుతూనే అద్భుతాలను సాధించిన కొందరు చిన్నారుల విజయగాథలు బాలల దినోత్సవం సందర్భంగా... శ్రవణ్–సంజయ్ కుమరన్ శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్ అన్నదమ్ములు. చెన్నైలో ఉంటారు వీళ్లు. శ్రవణ్ వయసు పదహారేళ్లు, సంజయ్ వయసు పదిహేనేళ్లు. సాధారణంగా ఈ వయసులోని పిల్లల చేతికి మొబైల్ఫోన్ చిక్కితే వీడియోగేమ్స్ ఆడటం లేదా చాటింగ్ చేయడంతో కాలక్షేపం చేస్తారు. ఈ గడుగ్గాయిలు అలాంటిలాంటి వాళ్లు కాదు. బడికి వెళ్లే వయసులోనే మొబైల్ ఫోన్లతో ఆటలాడుకున్నారు. అంతటితో ఆగలేదు. మొబైల్ ఫోన్లలోని రకరకాల యాప్స్ వాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి యాప్స్ స్వయంగా రూపొందించాలని బలంగా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రకరకాల మొబైల్ఫోన్స్పై ప్రయోగాలు ప్రారంభించారు. సొంతంగా యాప్స్ రూపొందించారు. వాటిని బంధు మిత్రులకు పరిచయం చేశారు. యాప్స్ అద్భుతంగా పనిచేస్తుండటంతో ఈ గడుగ్గాయిలకు బంధు మిత్రుల నుంచి ప్రోత్సాహం దొరికింది. తల్లి దండ్రుల సహకారం కూడా తోడైంది. దాదాపు డజను వరకు యాప్స్ రూపొందించారు. తాము రూపొందించిన యాప్స్ను స్వయంగా తామే మార్కెట్లోకి విడుదల చేయడానికి వీలుగా 2012లో ‘గో డైమెన్షన్స్’ పేరిట కంపెనీని ప్రారంభించారు. దానికి ఈ అన్నదమ్ములే సీఈవోలు. దేశంలోని అతి పిన్నవయస్కులైన సీఈవోలుగా రికార్డులకెక్కారు. శ్రవణ్ ఇప్పుడు పన్నెండో తరగతి, సంజయ్ పదో తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరి విజయగాథ ఫోర్బ్స్ మ్యాగజీన్కెక్కిందంటే వీళ్లు సాధించిన ఘనత ఏ స్థాయికి చెందినదో ఊహించుకోవాల్సిందే. వీళ్లు రూపొందించిన యాప్స్ అన్నింటిలోకీ ఆహార వృథాను అరికట్టడానికి వీళ్లు రూపొందించిన ‘గో డొనేట్’ యాప్ విశేషంగా ప్రశంసలు పొందింది. మెలిటా టెస్సీ పదిహేనేళ్ల వయసులో ఉండే చాలామంది పిల్లలు వ్యాసరచన రాయడానికే తంటాలు పడతారు. చెన్నైకి చెందిన చిన్నారి మెలిటా టెస్సీ మాత్రం ఆ వయసులో ఏకంగా నవల రాసేసింది. చిన్నారుల కాల్పనిక శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె నవల ‘బ్యాటిల్ ఆఫ్ ది స్ఫియర్స్ ప్రతులు దేశవ్యాప్తంగా పలు పుస్తక ప్రదర్శనల్లోను, బుక్స్టోర్స్లోను, ఆన్లైన్లోను ఇప్పటికీ హాట్కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మెలిటాకు ఇష్టమైన వ్యాపకం చదవడం. తొమ్మిదేళ్ల వయసులోనే ‘డెయిరీ ఆఫ్ వింపీ కిడ్’ నవల చదివింది. ఆ తర్వాత ఇక ఆగలేదు. దొరికిన నవలలను, కథల పుస్తకాలను వదలకుండా చదవసాగింది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కోరిన పుస్తకాన్నల్లా ఆమెకు సమకూర్చారు. చదవడంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఏదైనా రాస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో పదమూడేళ్ల వయసులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టింది. పదిహేనేళ్ల వయసుకే పర్యావరణ పరిరక్షణ ముఖ్యాంశంగా తొలి కాల్పనిక నవలను విజయవంతంగా రాసేసింది. నోషన్ ప్రెస్ ప్రచురణకర్తలకు ఈ నవల నచ్చడంతో వారు దీనిని ప్రచురించారు. కాల్పనిక సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమని, ‘హ్యారీ పాటర్’ రాసిన జేకే రౌలింగ్ తన అభిమాన రచయిత్రి అని చెబుతుంది మెలిటా. కౌటిల్య పండిట్ ‘గూగుల్ బోయ్’గా ప్రసిద్ధి పొందిన కౌటిల్య పండిట్ సాధించిన సంచలన విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. హరియాణాకు చెందిన కౌటిల్య పండిట్ వయసు పదకొండేళ్లు. కొన్నాళ్లు కోహండ్ గ్రామంలో తన తండ్రి సతీశ్ శర్మ నడుపుతున్న ఎస్డీ మోడర్న్ స్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం చండీగఢ్లోని భవన్ విద్యాలయలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అసాధారణమైన జ్ఞాపక శక్తితో బాలమేధావిగా గుర్తింపు పొందాడు. తన ఐదేళ్ల వయసు నుంచే వివిధ ప్రదర్శనల్లో ఈ చిచ్చర పిడుగు చూపిన ప్రతిభా పాటవాలు టీవీ చానెళ్లకు పాకాయి. ఇంత చిన్న వయసులోనే గొప్ప జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న కౌటిల్య పండిట్ మేధా సామర్థ్యాన్ని కురుక్షేత్ర వర్సిటీ సైకాలజీ విభాగం నిపుణులు స్వయంగా పరిశీలించారు. కౌటిల్య ఐక్యూ 130గా వారు తేల్చారు. పదేళ్ల వయసు పిల్లల్లో ఈ స్థాయి ఐక్యూ అత్యంత అరుదని చెప్పారు. సోనీ టీవీ ‘ఎంటర్టైన్మెంట్ కేలియే కుbŒ∙భీ కరేగా’ కార్యక్రమానికి కౌటిల్యను ఆహ్వానించింది. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ కార్యక్రమంలో క్షణమైనా ఆలోచించకుండానే అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతూ అమితాబ్ బచ్చన్నే నోరెళ్లబెట్టేలా చేశాడు ఈ చిచ్చరపిడుగు. కౌటిల్య ప్రతిభకు ముచ్చటపడిన గణితవేత్త ఆనంద్కుమార్ తాను నడుపుతున్న ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్కి ఆహ్వానించారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ‘సూపర్ 30’ విద్యార్థులను కౌటిల్య ప్రతిభా పాటవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం జ్ఞాపకశక్తి మాత్రమే కాదు, కౌటిల్యకు రాజకీయ పరిజ్ఞానం, సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. ఆ చైతన్యంతోనే గుర్గావ్లో ‘క్లీన్ ఎయిర్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా వీళ్లిద్దరూ బాల్య మిత్రులు. ఢిల్లీలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో క్లాస్మేట్స్. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు సాధారణంగా స్కూలు, ట్యూషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అరుదుగా దొరికే తీరిక వేళల్లో సినిమాలు, ఆటలు వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా నాలుగేళ్ల కిందట పదో తరగతిలో ఉండేవారు. అప్పుడు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనుషులు నడిచేటప్పుడు కూడా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఏదో రీతిలో సద్వినియోగం చేయవచ్చు కదా అని ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రయోగాలు ప్రారంభించారు. పోర్టబుల్ మొబైల్ చార్జర్ రూపొందించారు. వీరు రూపొందించిన చార్జర్ను షూస్కు అనుసంధానించారు. నడుస్తూనే ఈ చార్జర్ ద్వారా మొబైల్ ఫోన్ల చార్జింగ్ చేసుకోవచ్చు. మామూలు చార్జర్లతో పోలిస్తే ఈ చార్జర్ రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జ్ కావడానికి ఇంట్లో గంటసేపు చార్జింగ్ పెట్టాల్సి వస్తే, వీరు తయారు చేసిన చార్జర్లో పెట్టి, అరగంట నడక సాగిస్తే చాలు. ఆనంద్, మోహక్లు రూపొందించిన ‘వాకీ మొబి చార్జర్’ వార్తలకెక్కి మేధావులను ఆకట్టుకుంది. హృదయ్ పటేల్ యుద్ధ క్రీడల్లో ఘనత సాధించాలంటే ఎంతో ఓపిక, అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి సాధన కావాలని అంతా నమ్ముతారు. పసితనం వీడని హృదయ్ పటేల్ తైక్వాండో తరగతిలో శిక్షణ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అంతర్జాతీయ పోటీలో పాల్గొని ఏకంగా బంగారు పతకాన్ని సాధించి ఆరితేరిన చాంపియన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెంగళూరులో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఈ చిచ్చర పిడుగు అల్లరి రోజు రోజుకీ పెరుగుతుండటంతో కొంతైనా అల్లరి తగ్గించుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతడిని 2016 నవంబర్లో తైక్వాండో కోచింగ్ సెంటర్లో చేర్చారు. అప్పటికి అతడి వయసు మూడేళ్ల లోపే. కోచింగ్లో చేరిన మరుసటి సంవత్సరమే, అంటే 2017 జూలైలో దక్షిణ కొరియాలో జరిగిన చున్చియాన్ కొరియా ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్న వారందరిలోనూ హృదయ్ పటేల్ అతి పిన్న వయస్కుడు కావడంతో అక్కడి మీడియాను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులందరూ అతడినే ఆసక్తిగా గమనించసాగారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అరవై మంది చాంపియన్లను అవలీలగా ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకోవడంతో హృదయ్ పటేల్ రికార్డులకెక్కాడు. ఆ ఘనవిజయంతో అంతర్జాతీయ మీడియాలో అతడి పేరు మార్మోగింది. నిజానికి కొరియా వెళ్లడానికి అతడికి స్పాన్సర్షిప్ దొరకలేదు. కనీసం ఆరేళ్లయినా నిండితే గానీ అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి స్పాన్సర్షిప్ ఇవ్వలేమని ఒక యువజన సంస్థ చేతులెత్తేసిందని హృదయ్ తల్లి పింకాల్ చెప్పారు. అయితే, హృదయ్ ప్రతిభపై నమ్మకం ఉంచిన తన భర్త నవీన్భాయ్ పటేల్ అప్పు చేసి మరీ అతడిని కొరియా తీసుకువెళ్లాడని తెలిపారు. తైక్వాండోలో చేరినా అతడి అల్లరి ఏమాత్రం తగ్గలేదని మురిపెంగా చెబుతారామె. హృదయ్ పటేల్ ప్రస్తుతం బెంగళూరులోని జైన్ హెరిటేజ్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటున్నాడు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ గడుగ్గాయి ‘నా దగ్గర ఒకే బెల్టుంది. అది గ్రీన్ బెల్ట్’ అని బదులిస్తాడు. అది తైక్వాండోలో సాధించినదే. అనీష్ భాన్వాలా గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడం ఏమంత తేలికైన విషయం కాదు. హరియాణా కుర్రాడు అనీష్ భాన్వాలాకు మాత్రం అదో సాదాసీదా ఆట. పట్టుమని పదిహేనేళ్ల వయసులోనే ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. గత ఏడాది నుంచే అనీష్ భారత షూటింగ్ టీమ్లో కొనసాగుతున్నాడు. కర్నాల్లోని సెయింట్ థెరిసా కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకుంటున్న అనీష్ గత ఏడాది జరిగిన కామన్వెల్త్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జర్మనీలో గత ఏడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో రెండు రజత పతకాలను, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో వ్యక్తిగతంగా బంగారు పతకాన్ని, టీమ్ తరఫున రజత పతకాన్ని సాధించాడు. అనీష్ చిన్నప్పటి నుంచే షూటింగ్పై ఆసక్తి చూపేవాడు. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి తెలిసినవారి వద్ద నుంచి పిస్టల్ను ఎరువు తెచ్చి, స్కూలు మైదానంలో షూటింగ్ రేంజ్ వద్ద సాధన చేయించేవాడు. ç శ్రుతి పాండే రెండేళ్ల వయసులో చిన్నారులు బుడి బుడి అడుగులు వేస్తుంటారు. మెల్లగా పరుగులు తీయడానికి ఉత్సాహం చూపుతారు. అలాంటి బుడి బుడి అడుగుల వయసులో శ్రుతి పాండే మాత్రం యోగాసనాలు వేయడం ప్రారంభించింది. అలహాబాద్లో ఆమె నర్సరీలో ఉన్నప్పుడే స్కూల్లో ఆమె ప్రదర్శనకు టీచర్లు ముగ్ధులయ్యారు. ఆమెకు నాలుగేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆమెను గురు హరిచేతన్ యోగా శిక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె ప్రదర్శించిన యోగాసనాలకు గురువు సైతం అబ్బురపడ్డారు. వెంటనే ఆమెను తన కేంద్రంలో చేర్చుకుని శిక్షణ ప్రారంభించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత క్లిష్టమైన యోగాసనాలను అవలీలగా వేయగలగడం సాధించింది. ఇక ఆమెకు నేర్పాల్సిందేమీ లేదని గురువు నిర్ధారించి, ఆమెనే శిక్షకురాలిగా తయారు చేశారు. తన ఆరేళ్ల వయసులోనే, 2011లో బ్రహ్మ సరస్వతి ధామ్లో దాదాపు ముప్పయి మందికి యోగా శిక్షణ ప్రారంభించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన యోగా శిక్షకురాలిగా రికార్డులకెక్కింది. ఆమె వద్ద శిక్షణ పొందిన తొలి బృందంలో అన్ని రకాల వయసుల వారు, అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. వాళ్లలో వ్యాపారవేత్తలు, గృహిణులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుంచే యోగా ప్రారంభించడం మంచిదని, దేశంలోని ప్రతి పాఠశాలలోనూ యోగా శిక్షణను తప్పనిసరి చేయాలని కూడా ఆమె అంటుంది. శుభేందుకుమార్ సాహు సాధారణంగా హైస్కూల్ పిల్లలు సైన్స్ పాఠాలను చదువుకోవడంతోనే సరిపెడతారు. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికి చెందిన శుభేందుకుమార్ సాహు మాత్రం అక్కడితో సరిపెట్టుకోలేదు. సైన్స్ పాఠాల్లో చదువుకున్న ఆవిష్కరణలు, వాటి వెనుకనున్న శాస్త్రవేత్తల గాథలు అతడిని ఆకట్టుకున్నాయి. తాను కూడా నలుగురికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి ఆవిష్కరించాలనుకున్నాడు. ఆ తపనతోనే రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరానికి రూపకల్పన చేశాడు. కోల్కతాలో జరిగిన సైన్స్ ప్రదర్శనలో తాను రూపొందించిన పరికరాన్ని ‘గిఫ్ట్ ఫర్ ఫార్మర్స్’ పేరిట ప్రదర్శించాడు. సులువుగా విత్తనాలు నాటడానికి, నేల దున్నడానికి, పురుగుమందులు చల్లడానికి పనికొచ్చే ఈ యంత్రం పనితీరు శాస్త్రవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీనికి గుర్తింపుగా 2016లో శుభేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్మెంట్స్’ సత్కారం లభించింది. రాష్ట్రపతి అవార్డు రావడంతో శుభేందు జాతీయ మీడియాలో మెరిశాడు. శుభేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. జయకుమార్ పేదరికంలో మగ్గుతూ చదువుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటూనే ఆవిష్కరణలు చేయడమంటే అద్భుతమనే చెప్పాలి. శివకాశికి చెందిన జయకుమార్ అలాంటి అద్భుతాన్నే సాధించాడు. రెండేళ్ల కిందట తక్కువ ఖర్చుతో మంటలను ఆర్పే పరికరాన్ని రూపొందించాడు. అప్పడు అతడు తొమ్మిదో తరగతి విద్యార్థి. జయకుమార్ తల్లి బాణసంచా కర్మాగారంలో దినసరి కూలి. కొన్నేళ్ల కిందట బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె గాయపడింది. తన తల్లిలాగ మరెవరూ అగ్నిప్రమాదాల్లో గాయపడరాదని తలచిన శివకుమార్ తన స్కూల్ టీచర్ సహాయంతో తక్కువ ఖర్చుతోనే అగ్నిమాపక యంత్రాన్ని రూపొందించాడు. ఈ పరికరం రూపొందించినందుకు శివకుమార్కు 2016లో నేషనల్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. సైరి రహాంగ్డాలే అక్కడక్కడా బాల కళాకారులు ఉండటం అరుదే గాని, వారు తమ తమ కళా ప్రదర్శనలకు, వాటి ద్వారా వచ్చే విజయాలకు మాత్రమే పరిమితమైపోతుంటారు. పదిహేనేళ్ల సైరి రహాంగ్డాలే ధోరణి ఇందుకు పూర్తిగా భిన్నం. భరతనాట్యంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ఘన విజయాలు సాధించిన సైరి, తన నాట్యప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తోంది. నాట్య ప్రదర్శనల ద్వారా డబ్బు రావడం మొదలయ్యాక, తాను ఆ డబ్బును చుట్టు పక్కల పేద పిల్లల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పిందని, ఆమె సంకల్పానికి తాము వీలైనంతగా చేయూతనిస్తున్నామని సైరి తల్లిదండ్రులు మీతా, ప్రకాశ్ రహాంగ్డాలే చెప్పారు. తమిళనాడులోని సేలంలో చదువుకుంటున్న సైరి పంచరత్న అవార్డు, నిత్యశ్రీ అవార్డు వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంది. -
చిన్న సమస్య కూడా రానివ్వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలకు ఏ చిన్న సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో భద్రతకు చేయాల్సిన ఏర్పా ట్లు, బందోబస్తు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తదితరాలపై సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ సమీక్షించారు. సమీక్షలో నార్త్జోన్ (వరంగల్) కింద ఉన్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్కుమార్ పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సున్నిత ప్రాంతా ల్లో జరిగిన అల్లర్లు, గొడవలు, ఇతరత్రా అంశాలపై ఆయా జిల్లాల ఎస్పీలు డీజీపీకి వివరించారు. బూత్స్థాయి వరకు భద్రతను పటిష్టం చేయడంతో పాటు ముందుస్తుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లు, రౌడీషీటర్లను బైండోవర్ చేయడం, వారిపై నిఘా పెట్టాలని సూచించినట్లు సమాచారం. మావో ప్రభావిత జిల్లాల్లో అలర్ట్.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మావోలు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు సూచిం చినట్లు తెలిసింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుం డా చూసుకోవాలని, ఇందుకు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ఎన్నికల కమిషన్ సీఈవో రజత్కుమార్తో సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జితేందర్ తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది ఈ నెల 12 నుంచి శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. -
తిరుమల ఆలన... పాలన
శ్రీవారి దర్శనం కోసం నిత్యం తరలివచ్చే లక్షలాది మంది భక్త జనులకు సేవలు అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. కొండంత పాలన జరిగేది తిరుపతిలోని కార్యాలయం నుంచే. ఒక్కమాటలో చెప్పాలంటే కొండను నడిపేది కింది కార్యాలయ ఉద్యోగులే. వేలాది మంది ఉద్యోగులు స్వామి సన్నిధి(టీటీడీ)లో ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నప్పటికీ సేవాభావంగానే విధులు నిర్వహిస్తున్నామన్న భావనతో జీవితాలు కొనసాగిస్తున్నారు. 22వేలకు పైగా ఉద్యోగులు టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా 30కి పైగా విభాగాలు, దాదాపు 52 అనుబంధ శాఖలు ఉన్నాయి. వాటిలో 22వేలకు పైగా పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా వేకువ జామున 3 గంటలకే నిద్రలేచి తిరుమలలోనూ, తిరుపతిలోనూ రాత్రివేళ 11 వరకు వంతులవారీగా దేవస్థానానికి, తద్వారా భక్తులకు సేవగా భావించి పనిచేస్తున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం వీరందరికీ జీతభత్యాల కోసం ఏటా సుమారు రూ.490 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. ఆలయం నుంచి భక్తుల సౌకర్యాల వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తిరుమల శ్రీవారి ఆలయంలో నుంచి తిరుపతిలోని పరిపాలనా విధానాలు రూపొందించే పాలనా భవనం, భక్తులకు సౌకర్యాలు కల్పించే విభాగాల్లోనూ సేవగానే విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా జీయంగార్ల వ్యవస్థ పరిధిలోకే వస్తారు. ∙స్వామివారి ఆలయంలో జీయర్ల ఆధ్వర్యం, పర్యవేక్షణలో అర్చకులు దేవదేవునికి నిత్య పూజలు, కైంకర్యాలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ∙స్వామివారికి వేదమంత్రాలతో అర్చనాది సేవలు అందించేందుకు వేదపండితులు తమ నిత్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ∙ వీరితో పాటు ఆలయంలో భక్తులకు దర్శనం, ఇతర పూజాది కైంకర్యాలు క్రమబద్ధంగా, నిర్ణీత సమయానికి నిర్వహింపచేసేందుకు ఏఈవోలు, సూపరిం టెండెంట్లు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తి తన్మయత్వంతో విధులు నిర్వహిస్తున్నారు. ∙ఆలయం వెలుపల నిత్యం స్వామివారి ఉత్సవవర్లకు వాహన బేరర్లు, మంగళ వాయిద్యాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు మాత్రం స్వామివారి ఉత్సవవర్లను మోయడం వల్ల నేరుగా స్వామికే సేవ చేసినంత భావనతో విధులు నిర్వహించి పులకించిపోతుంటారు. ∙మిగిలిన సేవల్లో తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు, అన్నప్రసాదాల పంపిణీ, ఇందుకోసం అవసరమైన సరుకుల కొనుగోళ్లు, దాతల నుంచి విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను తిరుపతిలోని పరిపాలనా భవనం పరిధిలో కొనసాగుతున్నాయి. ఇవి నిరంతరం కొనసాగితేనే స్వామివారి పూజలు, అందుకు విచ్చేసే లక్షలాది భక్తులకు అన్ని సేవలు నిరాటంకంగా సాగుతాయి. ∙భక్తుల సదుపాయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలను అమలుపరచేందుకు కూడా జీయంగార్ల సూచనలు, సలహాలను పాటించి పనులు చేపడుతుంటారు. ∙స్వామివారి మూలమూర్తితో పాటు అనుబంధ దేవతలకు, టీటీడీ అనుబంధ ఆలయాలకు పుష్పాలంకరణ, సరఫరా చేపట్టేందుకు కొనసాగుతున్న ఉద్యానవన విభాగంలోనూ వందలాది మంది ఉద్యోగులు, చిరుద్యోగులు సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారు. ∙అభివృద్ధి పనులు, భక్తుల క్యూలైన్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు పనిచేసే ఇంజనీరింగ్ విభాగానిది టీటీడీలో ప్రధాన పాత్రనే చెప్పాలి. దీని పరిధిలోకే వచ్చే ఎలక్ట్రికల్ విభాగంలో అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు, వందల సంఖ్యలో ఉద్యోగులు, వేల సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ∙టీటీడీకి సంబంధించి భక్తులకు కావాల్సిన సమస్త సమాచారం తెలిపేందుకు పౌర సంబంధాల శాఖ పరిధిలో పనిచేస్తున్న కాల్సెంటర్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. నిఘా, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం తిరుమల పుణ్యక్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడితో పాటు అత్యున్నత నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అటు తిరుమల ఆలయానికి, ఇటు భక్తులకు ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా నిరంతరం టీటీడీ కోసం ప్రత్యేక నిఘా, ¿¶ ద్రత వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే మార్గంలోని టోల్గేట్ నుంచి తిరుమల టోల్గేట్లు, ఆలయం, తిరుమలలో అణువణువూ జల్లెడ పట్టేలా అత్యాధునిక పరిజ్ఞానంతో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. క్షణం కూడా రెప్పవాల్చకుండా పటిష్టమైన నిఘా పహారా సాగుతోంది. ఈ విభాగంలోనూ పదుల సంఖ్యలో అధికారులు, వందల్లో ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం దేశంలోని అనేక ప్రభుత్వ శాఖల్లోకెల్లా టీటీడీకి చెందిన పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగాల సమన్వయం తో పనిచేసే పారిశు«ధ్ధ్య కార్మికుల నిరంతర కృషి ఫలితంగా తిరుమలకు స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం దక్కింది. భక్తులకు క్షణక్షణం సేవలు అందించడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మాత్రం వెలకట్టలేనివి. సుమారు 9 వేల మంది కార్మికులు నిత్యం షిప్టుల వారీగా పనిచేస్తూ తిరుమల పుణ్యక్షేత్రం, స్వామివారి ఆలయం లోపల ప్రాంతాలు, ఘాట్రోడ్డు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. టీటీడీ అన్నదాన భవనం, ఇతర క్యాంటీన్లు, హోటళ్ల ప్రాంతాల్లో సైతం పారిశుద్ధ్యాన్ని నిర్వహించడంలో పారిశుద్ధ్య విభాగం కార్మికులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు.వీటన్నిటితో పాటు స్వామివారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాపితం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వివిధ ప్రాజెక్టుల ఉద్యోగులు, కళాకారులు, ప్రచురణల విభాగం, ధర్మప్రచార సంస్థలు, భక్తుల సేవలో తరించే కళ్యాణకట్ట ఉద్యోగులు, తిరుమలలో ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ట్రాన్స్పోర్టు విభాగంలోని ఉద్యోగుల సేవలు స్వామివారికే అన్నట్లు నిత్యం కొనసాగుతూ భక్తుల మన్ననలు పొందుతున్నాయి. – పి.గురుమూర్తి తిరుపతి అర్బన్ -
‘నిఘా’పై జగడం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగాల మధ్య కోల్డ్వార్కు దారి తీసింది. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ సమాంతరంగా పనిచేయడం తెలంగాణ అధికారులకు కోపం తెప్పిస్తోంది. ఎన్నికల సర్వేలు నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు, ఈడీ కేసుల నమోదు నేపథ్యం గురించి, ఓటుకు నోట్లు కేసులో ఏసీబీ చర్యల గురించి ఏపీ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఏపీ సీఎం చంద్రబాబుకు అప్డేట్ చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు మింగుడుపడటం లేదు. వరంగల్లో మొదలైన రగడ... రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు వల్ల కలిగే లాభనష్టాలు, గెలిచే అవకాశమున్న సీట్ల సంఖ్య, ఎక్కడెక్కడ ఎవరి బలాబలాలు ఏమిటన్న అంశాలపై ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది 20 రోజుల క్రితం తెలంగాణలో మకాం వేశారు. ఇందులో భాగంగా వరంగల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఓ డీఎస్పీ నేతృత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ బృందం సర్వే చేయడం సంచలనం రేపింది. ములుగు, వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లిలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అవే నియోజకవర్గాల్లో సర్వే చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు రుచించలేదు. అలాగే వైరా, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సర్వే చేస్తున్నప్పుడే ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన అదనపు ఎస్పీ నేతృత్వంలో 18 మంది సిబ్బంది తారసపడటం కూడా మింగుడు పడలేదు. తాము ఏయే నియోజకవర్గాల్లో సర్వే చేపడతామనే విషయం ఏపీ అధికారులకు ఎలా లీౖకై ందన్న అంశంపై తెలంగాణ ఉన్నతాధికారులు సమాలోచనలు చేశారు. మొత్తం 84 మంది ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది, అధికారులు తెలంగాణలో సర్వే చేస్తున్నట్లు గుర్తించారు. రెండూ ఒకే భవనంలో... రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు తర్వాత ఏపీ అ«ధికారిక కార్యకలాపాలన్నీ అమరావతి తరలివెళ్లగా ఏపీ ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ 90 శాతం విజయవాడ, అమరావతికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పెద్దగా ఏపీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు సాగించలేదు. కేవలం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందే భద్రత పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాల కోసం ఏపీ అధికారులు భాగ్యనగరానికి వచ్చేవారు. కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బాబు ఆదేశంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో దిగడం, అమరావతి నుంచి సిబ్బందిని రప్పించడం.. ఉమ్మడి జిల్లాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికి సర్వే బాధ్యతలు, నిఘా కార్యకలాపాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కొనసాగడం వల్లే ఈ సమాచారం లీకై ఉంటుందా అనే కోణంలో ఇక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. సర్వే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇక్కడ అధికార పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ అసంతృప్త అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు? వారి వెనుకున్న కారణాలు ఏమిటి? నేతలెవరన్న సమాచారం ఏపీకి చేరడంతో లీక్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూపీ లాగుతున్నారు. రెండు విభాగాలు ఒకే చోట కార్యకలాపాలు సాగించడం వల్లే సమాచార మార్పిడి జరుగుతోందా లేక కోవర్టులు ఎవరైనా లీక్ చేస్తున్నారన్న అంశాలపై తెలంగాణ పోలీసుశాఖ దృష్టి సారించింది. మరోవైపు ఐటీ దాడులపై తాము సేకరించిన, ఏపీకి పంపించిన కీలక నివేదికలు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల చేతుల్లోకి ఎలా వెళ్లాయన్న అంశాలపై ఏపీ నిఘా ఉన్నతాధికారులు సైతం ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 74 స్థానాల్లో (హైదరాబాద్ మినహా) చేసిన సర్వే నివేదిక ఇప్పుడు తెలంగాణ నిఘా అధికారుల వద్ద ఉండటం కూడా ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ను ఆందోళనలో పడేసినట్లు తెలుస్తోంది. అగ్గి రగిల్చిన ఐటీ సోదాలు సర్వేలతోనే పర్వాలేదు అనుకొని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలోని ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు చేసేందుకు ప్రత్యేక బృం దాలు ఏర్పడటం, ఎక్కడెక్కడ చేయబోతున్నాయన్న విషయాలు ముందే గ్రహించి ప్రముఖులను అప్రమత్తం చేయడంతో రాష్ట్ర నిఘా అధికారులు కంగుతిన్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించకపోవడం, పైగా ప్రముఖుల ఇళ్ల వద్ద రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది కంటే ముందే ఏపీ అధికారులు ఉండి సమాచారం సేకరించడం ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. -
మన్యంలో మళ్లీ అలజడి
కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో మళ్లీ తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, అదే స్థానం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆదివారం నక్సలైట్ల తుపాకి గుళ్లకు బలయ్యారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగే గ్రామదర్శిని సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ ఇద్దరినీ దాదాపు 65మందికిపైగా నక్సలైట్లు అడ్డగించి అతి సమీపం నుంచి కాల్చిచంపారు. 2016 అక్టోబర్లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండర్ ఒకరు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుండేవి. హత్యలు, ఎన్కౌంటర్లు, మందుపాతర పేలుళ్లతో అది అట్టుడికేది. కానీ విభజన తర్వాత 2016 నాటి ఎన్కౌంటర్ ఉదంతం మినహా చెప్పుకోదగిన ఘటన చోటుచేసుకోలేదు. అయితే అలాగని ఆ ప్రాంతం నక్సలైట్ల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు. అడపా దడపా వారి కార్యకలాపాల జాడ కనబడుతూనే ఉంది. పైగా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి విలీన వారో త్సవాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేగాక కిడారి నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారంపైనా, ఆయన నడుపుతున్న క్వారీపైనా మావో యిస్టులు హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే తాను గ్రామదర్శిని సభకు వెళ్లలేనని కిడారి చెప్పినా చంద్రబాబు వెళ్లితీరాలని ఆదేశించారని, చివరకు ఈ దారుణం చోటుచేసుకున్నదని అంటున్నారు. కనీసం ఏజెన్సీలో పోలీసు నిఘా సక్రమంగా ఉన్నా వారిద్దరూ క్షేమంగా తిరిగి రాగ లిగేవారు. ఇది లేదు సరిగదా... వారు పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లారని హోం మంత్రి చిన రాజప్ప అంటున్నారు. కానీ తాము బందోబస్తు కల్పించాలని స్థానిక పోలీసులను కోరా మని, కానీ వారు పట్టించుకోలేదని కిడారి వ్యక్తిగత సహాయకుడు చెబుతున్నారు. ఇలాంటి సమ యాల్లో హోంమంత్రి స్థాయి నాయకుడు అన్నివైపుల నుంచీ సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఆయన పోలీసులిచ్చిన ప్రకటన చదివి చేతులు దులుపుకున్నారని అర్ధమవుతోంది. వీరిద్దరి హత్య తర్వాత స్థానికంగా ఏ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయో ఆయనకు తెలియనిది కాదు. నక్సలైట్ల ఘాతుకం గురించి ఫోన్లో సమాచారం ఇస్తే, అక్కడి నుంచి మృతదేహాలను మీరే తీసు కురండని ఒక ఎస్ఐ సలహా ఇచ్చారని కిడారి అనుచరుడొకరు చెబుతున్నారు. నాలుగు గంటల పాటు వారి మృతదేహాలు ఘటనాస్థలి వద్దే ఉండిపోయాయి. చివరకు అనుచరులే వాటిని తీసు కెళ్లాల్సివచ్చింది. పోలీసులు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి కిడారి, సోమ అభిమానులు రెచ్చిపోయి అరకు, డుంబ్రిగూడ పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. భారీ విధ్వంసం సృష్టించారు. రికా ర్డులు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఏడాదిక్రితం తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అధికార పార్టీలో చేరి, ఆ పార్టీ ఆదేశాలతో ఒక సభ నిర్వహించడానికెళ్తున్న ఎమ్మెల్యే మాటకే అక్కడ దిక్కులేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు పాలన ఎంత అస్తవ్యస్థంగా సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. నక్సలైట్లు చీకటి మాటున ఈ దాడి చేయలేదు. మిట్ట మధ్యాహ్నం ప్రధాన రహదారి పక్కనే కాపుగాశారు. అది మరీ మారుమూల ప్రాంతమేమీ కాదు. సెల్ఫోన్ టవర్లకు సమీపంలోనే ఘటనా స్థలి ఉంది. ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో బయటి ప్రపంచానికి చేరేయటం చాలా సులభం. కానీ నక్సలైట్ల దాడి తర్వాత అరగంటకుగానీ పోలీసులకు ఆ సంగతి తెలియలేదు. ఇంకా విచిత్రమేమంటే దాడికి పాల్పడినవారు నలుగురైదుగురు కాదు... వారు భారీ సంఖ్యలో ఉన్నారు. పైగా వారంక్రితమే వారంతా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతమంది ఏజెన్సీలో ప్రవేశించినా నిఘా వర్గాలకు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా నక్సలైట్లు ఏదైనా వారోత్సవాలకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడతారు. కానీ ఈసారి అలా జరగలేదు సరిగదా నిఘా సైతం లేదు. కనీసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు గనుక, అటువైపు వెళ్లొద్దని ప్రజా ప్రతినిధులకైనా సూచనలివ్వలేదు. ఇటీవలికాలంలో అధికారంలో ఉంటున్నవారు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలపై నిఘా ఉంచేం దుకు వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు దీన్ని మరింతగా దిగజా ర్చారు. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయో ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అక్కడికి తరలించారు. కొన్నేళ్లక్రితం తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన భంగ పడ్డారు. ఆయన సన్నిహితుడు రేవంత్రెడ్డి డబ్బు సంచులతో పోలీసులకు దొరికిపోయారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేతో బాబు సంభాషణల ఆడియో బయటికొచ్చింది. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తే మీరేం చేస్తున్నారని అప్పట్లో బాబు ఇంటెలిజెన్స్ విభాగంపై విరుచుకుపడ్డా రని కథనాలు వెలువడ్డాయి. బహుశా ఆ కారణం వల్ల ఈసారి ఇంటెలిజెన్స్ సిబ్బంది మొత్తం తెలం గాణలో మోహరించినట్టు కనబడుతోంది. ఇలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? నక్సలైట్ల దాడి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. అయితే ఇదంతా జాగ్రత్తగా సాగాలి. అమాయకు లైన గిరిజనులను వేధించకుండా దాడికి కారకులైనవారిని పట్టుకోవటంపైనే దృష్టి సారించాలి. అలాగే గిరిజనుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్న మైనింగ్ కార్యకలాపాలు మూతబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలను నివారించటం సాధ్యం. -
మంత్రి జగదీశ్రెడ్డిపై రెక్కీ?
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా డ్రోన్ కెమెరాలతో గ్రామం మొత్తాన్ని చిత్రీకరించారని, ఇందులో మంత్రి ఇంటి పరిసరాలను కూడా తీశారని సమాచారం. ఈనెల 2న పోలీసు బలగాలు ప్రగతి నివేదన సభకు వెళ్లడంతో నిఘా లేదని భావించిన సదరు వ్యక్తులు దూర ప్రాంతంనుంచి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి ఇటీవల తన స్వగ్రామంలో పాత ఇంటి పక్కనే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. నెల రోజుల క్రితం కూడా ఆయన నాగారం వెళ్లారు. స్వగ్రామం కావడంతో ఆయన వచ్చినప్పుడల్లా గ్రామంలో తనతో సన్నిహితంగా ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లి పలకరిస్తారు. మంత్రి ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ పోలీసు బందోబస్తు ఉంటుంది. గ్రామమంతా చిత్రీకరణ.. ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు అలాగే తుంగతుర్తి రోడ్డు, హెల్త్ సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులు, గ్రామం నుంచి బయటకు వెళ్లే డొంక రోడ్లను చిత్రీకరించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంత్రిపై దాడి చేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా తప్పించుకునేందుకు డ్రోన్తో నాగారం పరిసరాలను చిత్రీకరించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా విభాగాలు కూడా వారం రోజులుగా ఈ విషయమై గ్రామస్తులు ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మా దృష్టికి వచ్చింది: వెంకటేశ్వర్లు, ఎస్పీ ‘నాగారంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విషయం మా దృష్టికి కూడా వచ్చింది. రోడ్లు, ఇళ్లు, మంత్రి ఇంటిని కూడా చిత్రీకరించారని తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. రెండు, మూడు రోజుల్లో దీన్ని ఎవరు తీశారో తేలుస్తాం’. -
చంద్రబాబు దొంగల ముఠాను తెలంగాణకు పంపారు
-
చంద్రబాబుపై బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. శనివారం ఆయన సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలిసి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజేంట్లు కొంత మంది కాంగ్రెస్లో ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసుపెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని ఎందుకు అడగాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బాల్కసుమన్ హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలని సూచించారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పనిచేయాలన్నారు. చదవండి: తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్! -
తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ను పరుగులు పెట్టిస్తోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని టీటీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో టీడీపీ పట్టున్న ప్రాంతాలు.. గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఓటు బ్యాంకు.. నేతల వలసలు.. తదితర అంశాలన్నింటిపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏపీ ఇంటలిజెన్స్ పొలిటికల్ విభాగంలో పని చేస్తున్న 60 మంది హైదరాబాద్లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చి క్యాంపు ఏర్పాటు చేశారు. 4 రోజల క్రితం వచ్చిన వీరిని ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పాటు చేసి సర్వే విధులు అప్పగించినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఏయే స్థానాలను గెలవచ్చు.. పొత్తుపై టీడీపీ ఓటర్ల స్పందన అంశాలపై కూడా త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ 20పైనే నజర్... ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ బృందాలు 20 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు టీటీడీపీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, ఉప్పల్, సనత్నగర్లో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే రూరల్ ప్రాంతాలైనా నిజామాబాద్లో ఓ అసెంబ్లీ, మెదక్లో నారాయణ్ఖేడ్, వరంగల్లో నర్సంపేట్, కరీంనగర్లో కోరుట్ల, ఖమ్మంలో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, నల్గొండలో కోదాడ, మహబూబ్నగర్లో మక్తల్, వనపర్తి, దేవరకద్ర, ఆదిలాబాద్లో ఖానాపూర్ లేదా ఆసిఫాబాద్లో బృందాలు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా ఇదే స్థానాలను టీటీడీపీ కోరే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో వాళ్లెలా చేస్తారు? ఒక రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ పరమైన అంశాలపై పక్క రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేయడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అంశంగా మారుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థతో సర్వే చేయించుకుంటే అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రానికి చెందిన పోలీసులు సర్వే చేయడం నిబంధనలకు విరుద్ధమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తెలివి ఎక్కువైతే అసలుకే మోసం!
తెలివైన వారిని, అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ(ఈజీ గోయింగ్) సరదాగా ఉండే వారిని అందరూ ఇష్ట పడతారని,అలాంటి వారినే ప్రేమికులుగా ఎన్నుకుంటారని అంతా భావిస్తుంటారు.అయితే, ఆ భావన సరికాదని తాజా అధ్యయనంలో తేలింది. మరీ ఎక్కువ తెలివితేటలు, టేకిట్ఈజీ మెంటాలిటీ గల వారిని భాగస్వాములుగా చేసుకోవడానికి ప్రేమికులెవరూ ఇష్టపడరని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.తెలివితేటలయినా, దయాగుణమైనా, అందం అయినా ఓ స్థాయి వరకే బాగుంటుందని తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన గిలిస్ గిగ్నాక్ తెలిపారు. సాధారణంగా తెలివితేటలు, సరదాతత్వం, దయాగుణం, అందం కలవాడు భాగస్వామిగా రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటారని పరిశోధన తేల్చిన ఫలితం. వర్సిటీ పరిశోధకులు ఈ నాలుగు అంశాలపై వందల మంది యువతీ యువకుల అభిప్రాయాలను అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. తెలివితేటలు మరీ ఎక్కువగా ఉన్న వారు భాగస్వామిగా ఉంటే తమకు అభద్రతా భావం కలుగుతుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు. ఈజీ గోయింగ్ మెంటాలిటీ ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుందని, వారికెలాంటి ఆశయాలు ఉండవని కూడా అభిప్రాయపడినట్టు గిలిస్ చెప్పారు.తమతో సమానమైన తెలివితేటలున్న వారినే భాగస్వాములుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమయ్యాయి. -
ఎలా మభ్యపెడదాం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంతో టీడీపీ సర్కారు తాత్కాలిక చర్యలతో మరోసారి మభ్యపెట్టేందుకు ఉపక్రమించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోవడంతో ఇప్పటికే తమపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఏమి చేస్తే ప్రజలను మరోసారి మభ్య పెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో నిఘా వర్గాలు ప్రజల నుంచి ఈమేరకు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేలో కూడా టీడీపీ సర్కారు వైఫల్యాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడి కావడంతో ఎక్కువ ఖర్చు కాని తాత్కాలిక పనులు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. నమ్మటం లేదనే నిర్ణయానికి వచ్చిన అధినేత టీడీపీ గత ఎన్నికలకు ముందు చెప్పిన రైతు, డ్వాక్రా రుణాల మాఫీ హామీని నెరవేర్చకపోవడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పడకపోవడం, నిరుద్యోగ భృతి అదిగో.. ఇదిగో అంటూ నాలుగేళ్లుగా కాలయాపన చేయడం లాంటి అనేక వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఇక ఏ మాత్రమూ నమ్మకం లేదన్న అభిప్రాయానికి స్వయంగా ప్రభుత్వాధినేతలే వచ్చా రు. దీంతో గత ఎన్నికలకు ముందు ప్రకటించిన దీర్ఘకాలిక హామీలను నెరవేర్చకుండా ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు తాత్కాలిక ఉపశమ నం కల్పించడం ద్వారా దృష్టి మళ్లించి ఏదో ఒకటి చేశామనే అభిప్రాయం ఏర్పడేలా సర్కారు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ సమస్యలను తీరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై కొద్దిగైనా నమ్మకం కలుగుతుందనే కోణంలో మండలాలవారీగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయిస్తోంది. గత సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు ‘మీ మండలంలో ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి? చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా కట్టాల్సి ఉందా? ఏ పనులు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది?’ తదితర వివరాలను ప్రజల నుంచి ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇంటెలిజెన్స్ జరిపిన సర్వేలో ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో తాజా సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. సమస్యలు పరిష్కరించాలంటూ 1100 టోల్ ఫ్రీ నెంబరుకు కుప్పలు తెప్పలుగా ఫోన్లు రావడం, వాటిని పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే వర్గాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. టీడీపీపై ప్రజలకు నమ్మకం లేదు అధికార టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఏ ఒక్క పనీ కావడం లేదని, కొద్దిపాటి సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినవారికే దక్కుతున్నాయని ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పెద్దగా భారం పడని సమస్యలను గుర్తించి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రజలు చెబుతున్న సమస్యలు ఏమిటి? వాటి ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత? అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తద్వారా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రాజధాని నిర్మాణం లాంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చి తాత్కాలిక చర్యలతో వ్యతిరేకత తగ్గించుకోవాలనే దిశగా టీడీపీ సర్కారు పావులు కదుపుతోంది. రాజకీయాల కోసం అధికార యంత్రాంగం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గతంలో కూడా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. పింఛను వస్తోందా? రేషన్కార్డు ఉందా? బూత్ స్థాయిలో బలమైన నాయకులు ఎవరు? వారిని ప్రభావితం చేసే వారు ఎవరు? లాంటి అంశాలతో సర్వే చేపట్టింది. దీనికోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా రెండు నెలల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇప్పుడు మరోసారి 66 ప్రశ్నలతో రాజకీయ కోణంలో సర్వే చేయడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించడం చర్చనీయాంశమవుతోంది. సర్వేలో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత ‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకూ స్పష్టంగా తెలుసు. తమకు న్యాయం జరగడం లేదని అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో అసంతృప్తి నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చడం, వాల్మీకులకు ఎస్టీ హోదా లాంటి సామాజిక వర్గాల సమస్యలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాజధాని నిర్మాణం తదితర అంశాల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్లే నమ్మకం పెరిగేందుకు ఏం చేయాలన్న దానిపై సర్వే చేస్తున్నాం. ప్రభుత్వంపై వ్యతిరేకత మా సర్వేలో స్పష్టంగా కనపడుతోంది. ఇదే అంశాన్ని నివేదికలో పొందుపరుస్తాం’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇంటెలిజెన్స్ సీఐ వెల్లడించారు. సర్వేలో కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సర్వేను ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహిస్తున్నాయి. మండలానికి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే వివరాలను నియోజకవర్గ స్థాయిలో ఒక ఎస్ఐ ర్యాంకు అధికారి క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్లవారీగా సీఐ స్థాయి అధికారి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం డీఎస్పీ స్థాయి అధికారికి ఈ వివరాలను అందచేస్తున్నారు. జిల్లా నివేదికను ఎస్పీ స్థాయి అధికారి ఇంటెలిజెన్స్ డీఐజీకి సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లోని అధికారి ద్వారా సీఎంకు చేరుతున్నట్లు సమాచారం. -
కశ్మీర్పై ‘కమల’వ్యూహం
జమ్మూకశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఉన్నట్టుండి బీజేపీ ఎందుకు బయటకు వచ్చింది..? కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా కాషాయదళం సాధించేదేమిటి..? వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ‘భవిష్యత్ రాజకీయ నష్టాల’ నివారణలో భాగంగానే జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క కశ్మీర్కే పరిమితం కాకుండా విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకుందని అంచనా వేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలకు జమ్మూకశ్మీర్ అనేది ఓ భావోద్వేగాన్ని రగిలించే అంశంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఈ వర్గాలను కాపాడుకునే చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ అడుగు వేసిందని భావిస్తున్నారు. గవర్నర్ పాలన రూపంలో అంతర్గత భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్లో, పాకిస్తాన్ సరిహద్దువ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మూడేళ్ల పీడీపీ–బీజేపీ పాలనలో కశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు, వాటికి మద్దతు తెలిపే సానుభూతిపరుల పట్ల అనుసరించిన వ్యూహాలకు పూర్తి భిన్నమైన కార్యాచరణను ఇప్పుడు కేంద్రం చేపట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలోనే జమ్మూకశ్మీర్ ఉంటే బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందనేది ఆ పార్టీ అభిప్రాయం. పాలనపై పూర్తి నియంత్రణ.. కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా బీజేపీ ఆ రాష్ట్రంపై పూర్తిపట్టు సాధించింది. అక్కడి పరిస్థితులను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మిలిటెంట్ల కార్యకలాపాలు అణచివేసేందుకు భద్రతాపరంగా కఠిన చర్యలకు గవర్నర్ పాలనను ఉపయోగించుకోనుంది. చొరబాట్లను అడ్డుకునేందుకు సైనిక చర్యలతో పాటు సానుభూతిపరులపై నిఘా పెరుగుతుంది. సైన్యం, ఇతర భద్రతా దళాలు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు గవర్నర్ పాలన ఉపయోగపడుతుంది. వీటికి రాజకీయపరమైన పరిమితులు అడ్డుగా నిలిచే అవకాశముండదు. తీవ్రవాదులు, వారి సానుభూతిపరుల కార్యకలాపాల నియంత్రణకు సైనిక చర్యలకు దిగడం ద్వారా కశ్మీర్లో వేర్పాటువాద శక్తులపై పైచేయి సాధించిన సంకేతాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, జాతీయ భావజాల నినాదాలు ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా రాజకీయ ఫలాలు పొందాలని భావిస్తోంది. ‘కశ్మీర్లో శాంతిస్థాపన’నినాదాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా బీజేపీ మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు భావిస్తున్నారు. పెరగనున్న సైనిక చర్యలు.. నిఘా వర్గాల సమాచారాన్ని ఉపయోగించడంతో పాటు, కశ్మీర్ పోలీసులతో మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా భారత సైన్యం కచ్చితమైన లక్ష్యాలతో కార్యాచరణకు దిగే అవకాశాలున్నాయి. గత మహబూబా ముఫ్తి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నిఘా వర్గాలు తమకు పూర్తి సహకారం అందించలేదన్న అభిప్రాయం సైన్యానికి ఉంది. ఇప్పుడు సైన్యం ఉగ్రవాద అణచివేత కార్యక్రమాలను ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సైనిక చర్యలకు ప్రతిగా హింసాత్మక ఘటనలు కూడా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థలు మిలిటెంట్ రిక్రూట్మెంట్ను విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్లలోనే అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగిన సంవత్సరంగా 2018 మిగలొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లోనే 95 మంది తీవ్రవాదులు హతమయ్యారు. హింసాత్మక ఘటనల కారణంగా 40 మంది భద్రతా సిబ్బంది, 38 మంది పౌరులు మరణించారు. -
కష్టం.. మెదడుకి ఇష్టం
లండన్: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్ బ్రెయిన్ హైపోథిసిస్ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది. -
తెలివిని కొనలేం
డబ్బుతో కొనలేని థింగ్స్ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. ‘ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు’ అన్న ఓ నెటిజన్ కామెంట్కు ఆమె బదులిస్తూ.. ‘‘ఇంటెలిజెన్స్ని డబ్బుతో కొనలేమని ష్యూర్గా చెప్పగలను’’ అన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా టీఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు లావణ్య. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీఎస్. -
టీజేఎస్ ప్రభావమెంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. టీజేఎస్, కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, టీజేఏసీ నుంచి ఉద్యమించిన టీజేఎస్ రాజకీయంగా నిల దొక్కుకుంటుందా, అధికార టీఆర్ఎస్కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించాయి. ఆ సభ నుంచే ప్రారంభం... తెలంగాణ జన సమితి గత నెల 29న హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు పొలిటికల్ అనాలసిస్ జాబితాలో టీజేఎస్ను చేర్చాయి. అన్ని రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం, సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో రూపొందించే ఇంటెలిజెన్స్ వర్గాలు... అందులో భాగంగానే గత నెల చివరి నుంచి నాలుగు రోజుల క్రితం వరకు టీజేఎస్పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ, వివిధ కులాలు, వర్గాల నుంచి అభిప్రాయం సేకరించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఐదు ప్రశ్నలకు అవును, కాదు, ఇప్పుడే చెప్పలేం అన్న సమాధానాల ద్వారా అభిప్రాయాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో భారీ చర్చ...: తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ప్రభావం... సర్వేలో టీజేఎస్కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్ఎస్పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు చర్చ జరుగుతోంది. అయితే పూర్తిస్థాయి పార్టీకి ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్ మేనేజ్మెంట్లో పార్టీ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్ఆర్ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ తన నివేదికలో పొందుపరిచింది. అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీల నుంచి ప్రస్తుతానికి టీజేఎస్లోకి వలసలకు అవకాశం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు అడిగిన ప్రశ్నలివే... టీజేఎస్ పార్టీ గురించి మీకు తెలుసా? కోదండరాం, ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారా? టీజేఎస్ ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనుకుంటున్నారా? టీజేఎస్ పార్టీ చెప్తున్నట్టు సామాజిక న్యాయం ఆపార్టీ ప్రజలకు అందిస్తుందని భావిస్తున్నారా? టీజేఎస్ పార్టీకి రాజకీయ పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కల్గి ఉందని భావిస్తున్నారా? -
‘బొండాగిరి’పై ఇంటెలిజెన్స్ ఆరా..!
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి బొప్పికట్టించిన ‘బొండాగిరి’ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు బొండా వ్యవహారాల చిట్టాను సేకరించినట్టు సమాచారం. నగరంలో సాధారణ వ్యక్తిగా మొదలైన ప్రస్థానం, చిత్తూరు జిల్లాలో అజ్ఞాతవాసం, ఆపై రాజకీయంగా సాగిస్తున్న దందాల వరకు అన్ని వివరాలనూ సేకరించారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ఆయన తనయుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్ రేస్, యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరుల ప్రమేయమున్న పలు వ్యవహరాలపై కూడా ఆరా తీశారు. బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఉన్న సత్యనారాయణపురం సీతారామ కళ్యాణమండపానికి తాళం వేయడం నుంచి మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ప్లాట్ను ఆక్రమించుకోవడం (వైద్యం అందక ఆమె 13 ఏళ్ల కుమార్తె సాయిశ్రీ మృత్యువాత పడడం), విజయవాడ శివారు కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా సోదరుడు పెన్సింగ్ వేసి ఆక్రమించడం, సింగ్నగర్, పాయకాపురం బర్మాకాలనీల్లో ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు, ప్లాట్లు ఆక్రమించడం ఇలా అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే సతీమణి సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి రాంబాబు మరో ఆరుగురు ఉండటం సంచలనం రేపింది. ఈ అన్ని సంఘటనల వివరాలతో ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. బొండా ఉమాపై అనర్హత వేటువేయండి విజయవాడ సిటీ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూకబ్జాలు, దందాలపై చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బొండా అనుచరులు గతంలో సుమశ్రీ అపార్ట్మెంట్ను ఆక్రమించుకోవడం, సెటిల్మెంట్లతో నిస్సహాయులను బెదిరించడం ఇలా ఎన్నో దారుణాలు వెలుగుచూసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. -
టార్గెట్ మేడారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం ‘సమ్మక్క సారక్క’జాతరకు వచ్చే నేతలను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ల్యాండ్మైన్లు బయటపడటంతో అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది, మావోయిస్టులు ఎవరి కోసం ల్యాండ్మైన్లు అమర్చారో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించాయి. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు జరిగే మేడారం జాతర భద్రతను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీలు, అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవల జరిగిన చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల ఎన్కౌంటర్ వ్యవహారంపైనా ఆరా తీసినట్లు సమాచారం. కీలక ప్రాజెక్టులు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించినా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని ఎస్పీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను స్థానిక దళ సభ్యులు బెదిరిస్తున్నారన్న అంశాలపైనా డీజీపీ చర్చించినట్లు సమాచారం. వారికి అదనపు భద్రత: భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. కీలక పదవుల్లో ఉన్న వారితోపాటు స్థానిక అధికార పార్టీ నేతలకూ మరింత భద్రత కల్పించాల్సిన అవసరముందని ఉన్నతాధికారులకు ఎస్పీలు వివరించినట్లు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేతలు పర్యటించడం ఇబ్బంది తెచ్చేలా ఉందని ఎస్పీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. గ్రేహౌండ్స్తో జల్లెడ..! భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి, పసర, ఏటూరునాగారం, ములుగు, వాజేడు, వెంకటాపురం, మహదేవపూర్, కాటారం, మహాముత్తరం ప్రాంతాలపై పోలీస్ శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. 100–150 కి.మీ. దూరంలోని ప్రాంతాలను జల్లెడ పట్టేందుకు గ్రేహౌండ్స్ ప్రత్యేక బృందాలను రంగం లోకి దించనున్నట్లు తెలిసింది. జాతరకు ఎన్ని బలగాలు కావాలి, గతంలో ఎంత మందితో బందోబస్తు నిర్వహించారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది అవసరం తదితరాలను డీజీపీ చర్చించినట్లు సమాచారం. -
మావోల కట్టడికి ఆపరేషన్–2018
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులను నియంత్రించేందుకు ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లు సమష్టిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి. ఈ మేరకు నాలుగు రాష్ట్రాల డీజీపీలతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మంగళవారం కీలక భేటీ నిర్వహించింది. ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల డీజీపీలతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కీలకం రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా.. ఏపీ–ఒడిశాలతో సరిహద్దు, ఛత్తీస్గఢ్లలో విస్తృతంగా ప్రభావం ఉంది. తెలంగాణ, ఏపీల పోలీస్ శాఖలో ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)వ్యూహాత్మక చర్యలు, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్తో మావోయిస్టులను ప్రభావవంతంగా నియం త్రించగలిగారు. అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసు శాఖలు మావోయిస్టులను నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. కేంద్రం భారీ స్థాయిలో సీఆర్పీఎఫ్ బలగాలను దింపుతున్నా.. ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కార్యాచరణ తెరపైకి వచ్చింది. యాక్షన్ ప్లాన్–2018 పేరిట తీసుకునే ఈ చర్యలు, మావోయిస్టు కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని సీఆర్పీఎఫ్ తాజా భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సంయుక్త కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ డీజీపీలను కోరినట్లు తెలిసింది. తెలంగాణ ఎస్ఐబీ ఇచ్చే సమాచారాన్ని ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసు శాఖలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ఆపరేషన్స్లో సూచనలు, సలహాలను పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అగ్ర నేతలు తెలుగువారే కావడంతో.. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం.. ఈ నాలుగు రాష్ట్రాల కమిటీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కూడా ఇక్కడి నాయకులే కావడంతో సమాచారం అందించాలని తెలంగాణ పోలీస్శాఖను సీఆర్పీఎఫ్ కోరింది. ఇక తెలంగాణ ఆవిర్భావం నుంచి స్తబ్దుగా ఉన్న మావోయిస్టు తెలంగాణ కమిటీని పునరుత్తేజితం చేసే కార్యాచరణ రచించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జూలైలో జరిగిన ప్లీనరీలో తెలంగాణ కమిటీని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ.. విస్తృతంగా రిక్రూట్మెంట్ చేపట్టాలని కేంద్ర కమిటీ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎల్డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) నిధులను ఉపయోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సారి నుంచి మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (ఎంఓపీఎఫ్) నిధుల్లో 60 శాతానికిపైగా గోదావరి పరీవాహక జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
జాధవ్ ఆ ‘కీలక’ సమాచారాన్ని చెప్పాడు: పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాధవ్తో తమతో పంచుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘ పాకిస్థాన్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని జాధవ్ మాతో పంచుకుంటున్నాడు’ అని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, జాధవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలుపలేదు. గూఢచర్యం ఆరోపణలపై జాధవ్కు పాక్ ఆర్మీ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. -
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
-
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిం చాయి. కశ్మీర్ లోయలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న బృందాలుగా రైల్లో ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి యత్నించే అవకాశముందన్నాయి. ఈ వివరాలను ప్రధాని భద్రత బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు, యోగి భద్రతా అధికారులకు అందించారు. కాగా, మోదీ, యోగి భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ముంబై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలిపింది. వీరిద్దరిపై దాడుల గురించి మాట్లాడుకుంటుండగా రాయ్గఢ్లో కొందరు విన్నారని, దాడుల కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంది. మోదీపై దాడి చేయడానికి తాను, మరో మిలిటెంట్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఉకాషా అనే లష్కరే ఉగ్రవాది ఓ వ్యక్తితో జరిపిన సంభాషణలో చెప్పినట్లు గతేడాది నిఘా అధికారులు గుర్తించారు. పంచాయతీలది కీలక పాత్ర భారత గ్రామీణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పంచాయతీలు శక్తిమంత మైన మార్గాలని, దేశ పరివర్తనలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ట్వీట్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. -
ఆ ఇద్దరికీ సంబంధం ఉందా..!
- నల్లగొండ జిల్లాకు చెందిన సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసు - ఉద్యోగాలిప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపణ - బాధితుడిని విచారించిన ఇంటెలిజెన్స్ సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తనతో పాటు ఎనిమిది మందికి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ గత గురువారం సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సీఎం పేషీలో ఉండే అజిత్రెడ్డి, గంగాధర్తోపాటు హాలియా మండలానికి చెందిన కృష్ణారెడ్డిలు తనను మోసం చేసినందునే ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగిందన్న దానిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ముఖ్యమంత్రి పేషీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం రాత్రి బాధితుడు సతీశ్రెడ్డిని అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అరగంటకు పైగా విచారించారు. ఈ కేసులో సీఎం పేషీకి చెందిన అజిత్రెడ్డి, గంగాధర్ల ప్రమేయం ఉందా? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అనే కోణాల్లో బాధితుడు సతీశ్రెడ్డిని ప్రశ్నించారు. జరిగిన విషయాన్నంతటినీ వివరించిన అనంతరం కొన్ని ఫొటోలను చూపించి అజిత్రెడ్డి, గంగాధర్ను గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగారని, తాను ఇద్దరినీ గుర్తుపట్టి చూపించానని సతీశ్రెడ్డి చెబుతుండట గమనార్హం. ఈ కేసులో అజిత్రెడ్డి, గంగాధర్ను తప్పించేందుకు పోలీసు లపై ఒత్తిడి తెస్తున్నారని సతీశ్రెడ్డి ఆరోపిస్తున్నాడు. మంగళవారం అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కేసులో కృష్ణారెడ్డిని మాత్రమే బాధ్యులను చేసే దిశలో పోలీసులు వెళుతున్నట్లు తనకు అనుమానం వస్తోందన్నారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పోలీసుల అదుపులో కృష్ణారెడ్డి? ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలియా మండలానికి చెందిన పల్రెడ్డి కృష్ణారెడ్డిని సోమవారం రాత్రి నల్లగొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసేందుకు ముందు రోజు డబ్బులు తీసుకున్న కృష్ణారెడ్డిని బాధితుడు సతీశ్రెడ్డి కలిశాడని, అప్పుడు కృష్ణారెడ్డి కూడా సతీశ్రెడ్డితో తన గోడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. తనను గంగాధర్ మోసం చేశాడని, ఈ విషయాన్ని అజిత్ దృష్టికి తీసుకెళితే అలా చేయడానికి వీల్లేదు.. కూర్చోబెట్టి మాట్లాడుదాం.. విషయాన్ని పెద్దది చేయకండి అని సర్ది చెప్పాడని కృష్ణారెడ్డి సతీశ్రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. కాగా, నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయ ఉద్యోగితో పాటు హైదరాబాద్కు చెందిన ప్రసాద్రెడ్డి, హైదరాబాద్కే చెందిన మరో భార్యాభర్తల నుంచి.. ఇలా చాలా మంది వద్ద నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడని కృష్ణారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. -
ఐసిస్.. అన్నంత పనీ చేస్తోందా?
తాజ్మహల్ను టార్గెట్గా చేసుకుని భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్.. (ఐసిస్) అన్నంత పని చేసేందుకు సిద్ధమవుతోందా? ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సంభవించిన జంటపేలుళ్లను చూస్తే అలాగే అనిపిస్తోంది. తాజ్మహల్కు దగ్గరలోనే ఉన్న ఈ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక చెత్తకుండీ దగ్గర మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో ఇంటి వద్ద ఇంకో బాంబు పేలింది. రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. అయితే.. అదృష్టవశాత్తు బాంబులు అంత శక్తిమంతమైనవి కాకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమీ సంభవించలేదు. అయితే.. తమ ఉనికిని చాటుకోడానికి, లేదా తాజ్మహల్ సమీపంలోనికి కూడా తాము ప్రవేశించగలమని చెప్పడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు పోలీసు వర్గాలకు వస్తున్నాయి. భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి ఇటీవలే హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్మహల్ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్ను టెలిగ్రాం యాప్లో పోస్ట్ చేశారు. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్లో ఉంది. అలాగే దీనికి ఇన్సెట్లో వాడిన మరో బొమ్మలో తాజ్మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. దానికి తగ్గట్లుగానే ఆగ్రా నగరంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో ఇప్పుడు అంతా అప్రమత్తం అవుతున్నారు. నిఘా వర్గాలు ఐసిస్ హెచ్చరికలను మధ్యలోనే ట్రాక్ చేసి, వాటి విషయాన్ని బయటపెట్టినా కూడా నగరంలో భద్రత అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఆగ్రా లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల ఏమైనా జరగరానిది జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో పాటు విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.