junior ntr
-
దేవర విలన్ కు ఎన్టీఆర్ పరామర్శ
-
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. .. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు. -
జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు.. లోకేష్ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.‘‘పెద్ద ఎన్టీఆర్ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
-
‘వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్ను ఏం చేయలేరు’
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. -
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. 👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు) -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్! -
నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం
చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై సినీ పరిశ్రమలో TDP నేతలు మినహా మిగతా ఎవరూ స్పందించకపోవడం పట్ల బావయ్య బాలకృష్ణకు చాలా కోపంగా ఉంది. ఎవరినో అనుకుని ఏం లాభం తమ కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీయార్ కూడా బాబు అరెస్ట్ ను ఖండించకపోవడం బాలయ్యక జీర్ణం కావడం లేదు. లోప కుత కుత లాడిపోతున్నారు. కానీ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఐ డోంట్ కేర్ అంటున్నారు. బాబును అరెస్ట్ చేస్తే మొత్తం సినీ పరిశ్రమలోని కళాకారులంతా షూటింగులు ఆపేసి వీధుల్లోకి వచ్చేసి జనజీవనాన్ని స్తంభింపజేస్తారని బాలయ్య అనుకున్నట్లు ఉంది. అలా జరక్క పోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రూ.371 కోట్లు లూటీ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేసి ఎనభైలలో ఎన్టీయార్ ను గద్దె దింపినపుడు ప్రజాఉద్యమం చేసిన తరహాలో ఉద్యమాలు చేస్తారని టీడీపీ నేతలు అనుకున్నారు. అయితే జనం మాట దేవుడెరుగు టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబు అరెస్ట్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే బట్టబయలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. ✍️ఇక సామాన్య ప్రజలతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అయితే బాబు అరెస్ట్ ప్రకంపనలు సృష్టించేస్తుందని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. నందమూరి బాలయ్య కూడా అదే ఆశించారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా సినీ పరిశ్రమలో టిడిపి కార్యకర్తలయిన ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. బాబు అరెస్ట్ ను ఖండించలేదు. టీడీపీ నేత అశ్వనీ దత్, మురళీ మోహన్, టీడీపీ హయాంలో ప్రభుత్వ పదవి అనుభవించిన కె.రాఘవేంద్రరావు, నిర్మాత కె.ఎస్.రామారావు తప్ప ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోలేదు. ✍️ఇక నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ వరుస షాక్ లు నందమూరి బాలకృష్ణకు బాగా కోపాన్ని తెప్పించినట్లున్నాయి. అందుకే సినీ పరిశ్రమలో ఎవ్వరూ బాబు అరెస్ట్ కు స్పందించకపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య. అదే విధంగా జూనియర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావిస్తూ ఆయన స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అనేశారు. ✍️టాలీవుడ్ లో ఎవరూ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఎందుకు ఖండించలేదు? అని నందమూరి నారా కుటుంబ సభ్యులు చిర్రు బుర్రు లాడుతున్నారు. అయితే చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే మేమెందుకు స్పందించాలి? అని మెజారిటీ సినీ ప్రముఖులు చాలా క్లారిటీతో ప్రశ్నిస్తున్నారు. ✍️ఇక చంద్రబాబు జైలుకెళ్లిన మర్నాడే టిడిపి ఆఫీసులో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారు బాలయ్య. అది చంద్రబాబు నాయుడికి తెలిసి కోప్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత బాలయ్యకు అచ్చెంనాయుడి కుర్చీ పక్కన కుర్చీ వేయించారట. అంటే నీ స్థానం అక్కడే తప్ప అధ్యక్ష స్థానంలో కాదని చెప్పకనే చెప్పారని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ✍️చంద్రబాబు జైల్లో ఉంటే నారా లోకేష్ 20రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇపుడాయన సిఐడీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏపీలో పార్టీ వ్యవహారాల్లో తలదూరిస్తే పార్టీకి నష్టం అనుకున్నారో ఏమో కానీ ఆయన్ను తెలంగాణా వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్య మాట్లాడుతూ తెలంగాణాలో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోరాడతామని అన్నారు. బహుశా తెలంగాణాలో పార్టీ ఎలాగూ లేదు కాబట్టి బాలయ్య ఎలాంటి వేషాలు వేసినా పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కాబట్టి బాలయ్యను తెలంగాణా చూసుకోమని చంద్రబాబే సంకేతాలు ఇచ్చారేమో అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన బావయ్య అరెస్ట్ అయితే ఎవరూ పట్టించుకోరా? అని అగ్గిమీద ఫైర్ అయిపోతున్నారు. :::CNS యాజులు సీనియర్ జర్నలిస్టు -
పాదయాత్రలో లోకేష్కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం.. జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్నైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదవండి: బేల ‘గళం’.. అభ్యర్థులు లేక హైవే రూటు! -
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన జూ.ఎన్టీఆర్
-
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్ వెళ్లారు. ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!) అయితే ఫ్యామిలీతో దుబాయ్ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తారని తెలుస్తోంది. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!) -
ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్ వీడియో వైరల్
-
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ నివాళి
-
చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయపడ్డా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి అయితే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు. -
శతజయంతి వేడుకలకు దూరం అసలు కారణం..!
-
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
-
ఎన్టీఆర్,సమంతను తిడుతు ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్లు
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది. చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్ -
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
జూ.ఎన్టీఆర్కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
'జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?'
సాక్షి, విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్కు అప్పగించాలన్నారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలని చురకలు అంటించారు. 'ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా? హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ఈనాడులో ప్రచారం చేయించాడు. హరికృష్ణకి పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని రమ్మంటున్నాడు’’ అని కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించడం ఏంటి?. టీడీపీలో మహానాడు పెట్టి ఎన్టీఆర్, లోకేష్లకు వారసుడు కోసం ఓటింగ్ పెట్టండి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది.' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చదవండి: చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..!
2002లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా మీకు గుర్తుందా? రాయమసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నునుగు మీసాలతో చిన్నపిల్లాడిలా కనిపించాడు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ కీర్తి చావ్లా మీకు గుర్తుందా? ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన కీర్తి అ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఆది సినిమాతో ఆరంగేట్రం చేసిన కీర్తి చావ్లా మన్మధుడు, కాశీ, శ్రావణమాసం, సాధ్యం, బ్రోకర్ చిత్రాల్లో కనిపించింది. కీర్తి చావ్లా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కీర్తి చావ్లాకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చివరి సారిగా 2016లో నమిత లీడ్ రోల్లో నటించిన ఇలమై ఊంజల్ అనే తమిళ్ సినిమా తర్వాత కీర్తి చావ్లా మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. -
చాలా మంది అలా చేసేవారు.. కానీ నేను మాత్రం: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది భామ. అంతకుముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. ఆ తర్వాత చిరంజీవి సరసన జై చిరంజీవ, ఎన్టీఆర్తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమీర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది సమీరా రెడ్డి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం శస్త్రచికిత్సలు చేసుకునేవారని తెలిపింది. కానీ నేను మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్లలేదని అన్నారు. నేను ఇండస్ట్రీలో ప్రవేశించాక దాదాపు 10 ఏళ్ల క్రితం ముక్కుతో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారని పేర్కొంది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయమని.. వారికి ఇష్టంతోనే చేసేవారని వెల్లడించింది. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది భామ. -
ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి క్లారిటీ ఇదే..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్లోనూ విడుదలైంది. జపాన్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
న్యూ లుక్లో యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా ఆ క్రేజే వేరు. తాజాగా న్యూ లుక్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు యంగ్ టైగర్. తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ కొత్త స్టైల్ అంతా తదుపరి చిత్రం 'ఎన్టీఆర్30' కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇన్స్టాలో స్టోరీలో పోస్ట్ చేస్తూ..' ఏ న్యూ డే.. ఏ న్యూ వైబ్' అలీమ్హకీంతో మరోసారి అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్తో పాటు హెయిల్ స్టైలిస్ట్ అలీమ్ హకీం కూడా వెనకవైపు ఉన్నారు. దీనిపై జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాలో లుక్ ఇదేనంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) కాగా.. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన పోస్టర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించి మేకర్స్ ట్వీట్ చేశారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ కలిసి చర్చిస్తున్నట్లుగా ఫోటోలు ట్విటర్లో షేర్ చేశారు. ఈ నెలలోనే సినిమాను లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించలేదు. తాజాగా ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. కొరటాల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ సైతం మార్చుకున్నారు. అయితే గతంలో కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వైరలైంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు టాక్. #NTR30 pre production in full swing 💥 Director #KoratalaSiva, @RathnaveluDop and @sabucyril putting in their best to create a spectacular cinematic experience ❤️🔥@tarak9999 @anirudhofficial @sreekar_prasad @NANDAMURIKALYAN @YuvasudhaArts pic.twitter.com/ysBe45WEiK — NTR Arts (@NTRArtsOfficial) November 6, 2022 -
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్లోనూ విడుదలైంది. అక్టోబర్లో జపనీస్ భాషలోనూ రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమా ప్రమోషన్లు కూడా భారీస్థాయిలో నిర్వహించారు. తాజాగా ఈ చిత్ర జపాన్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్లలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబాలతో కలిసి సందడి చేశారు. (చదవండి: ఎయిర్పోర్ట్లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు వైరల్) అక్టోబర్ 21న జపాన్లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మొదటి వారంలో జపాన్ కరెన్సీలో 73 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం జపాన్లోని 44 నగరాల్లోని 209 స్క్రీన్లతో పాటు 31 ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేశారు. ఇది జపాన్లో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించిన సినిమాగా నిలిచింది. ఓ నివేదిక ప్రకారం విదేశీ చిత్రాల్లో జపనీస్ బాక్సాఫీస్ వద్ద ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్, డొమినియన్ వంటి చిత్రాల కంటే ఆర్ఆర్ఆర్ ముందు వరుసలో నిలిచింది. జపాన్లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు.. జపాన్ బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్లతో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో నిలిచింది. 300 మిలియన్ల కలెక్షన్లతో రాజమౌళి చిత్రం బాహుబలి- 2 రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మూవీ 3 ఇడియట్స్ 170 మిలియన్ల వసూళ్లతో మూడవ స్థానంలో సాధించింది. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిదిపోయే గుడ్ న్యూస్. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్తో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన ఈ పోస్టర్లో జూనియర్ సముద్రంలో నిలబడి ఆయుధాలు పట్టుకుని కనిపించగా అది నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్) ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 12న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
Viral Video: జూనియర్ ఎన్టీఆర్ను చూసి వెక్కివెక్కి ఏడ్చిన మహిళా అభిమాని
జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్, బాలీవుడ్లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఎన్టీఆర్కు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లగా జపానీయులు ఎన్టీఆర్తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ అడగ్గా.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ను చూసిన ఓ మహిళ అభిమాని భావోద్వేగానికి గురైంది. జూనియర్ను చూసిన ఆనందంలో చిన్న పిల్లలా బోరున ఏడ్చేసింది. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. (చదవండి:జపాన్లో తారక్కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీస్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను జపాన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. అందుకోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్లు సైతం ప్రారంభించింది. ఇందుకోసం కుటుంబ సమేతంగా జపాన్కు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి. ఇవాళ జపాన్ రాజధాని టోక్యోలో 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో ప్రదర్శించనున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బాబుకు నిరసన సెగ
-
చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం..
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న జెండాలు ప్రదర్శించారు. అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలోకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రలోనూ మా నాయకుడిని ఎందుకు విమర్శిస్తున్నారనే నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ అభిమానుల వ్యవహారం చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూర్తి అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. -
జపాన్ వెళ్లనున్న రాజమౌళి.. వారిద్దరూ కూడా.. ఎందుకంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాందించింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న జపాన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజమౌళి వెల్లడించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జపాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: RRR Box Office Collections: ఆగని 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?) గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా జపనీస్ ప్రజలను ఆర్ఆర్ఆర్ అలరించబోతోంది. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది. ㊗️みなさま、お待たせしましたーーっ‼️‼️ ━━✨映画『RRR』来日決定✨━━ ラージャマウリ監督 NTR Jr. &ラーム・チャラン 🌊🌊━━━━━━━━━━━━🔥🔥 ラージャマウリ監督は4年ぶり、 主演2人にとっては初の来日が決定致しました🎉 監督からのメッセージも到着🙌 pic.twitter.com/J2MaKXVh45 — 映画『RRR』公式 (@RRR_twinmovie) September 28, 2022 -
పవన్, ఎన్టీఆర్ లకు సమానమైన గౌరవం ఇస్తాం - విష్ణువర్థన్ రెడ్డి
-
అమిత్ షాతో భేటీకానున్న జానియర్ ఎన్టీఆర్
-
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గోల్డెన్ టెంపుల్లో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ప్రత్యేక పూజలు
Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో గ్రాండ్గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్లోని అమృత్సర్లో పర్యటించింది ఈ చిత్రబృందం. అమృత్సర్లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM — RRR Movie (@RRRMovie) March 21, 2022 -
ఆర్ఆర్ఆర్ రిలీజ్.. వసూళ్ల జాతరకు టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డెరెక్షన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. ఇంకా, మరో విషయం ఏమిటంటే మీరు పేటీఎమ్ జెనీకి పంపిన ₹1ని కూడా తిరిగి మీ ఖాతాలో రీఫండ్ చేయనున్నట్లు తెలిపింది. అంటే, ఉచితంగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Send ₹1 to 9711656565 and get a chance to win free #RRRMovie vouchers!🎬🍿#FreePaytmRRRMovieVouchers@ssrajamouli @ajaydevgn @aliaa08 @tarak9999 @OliviaMorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/HxiuEZMgcu — Paytm (@Paytm) March 16, 2022 (చదవండి: దిగొస్తున్న బంగారం ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే?) -
'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ సాంగ్.. పూర్తి పాట వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. సినిమా విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్ను పెంచేసింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎత్తర జెండా' అనే సెలబ్రేషన్ యాంథమ్ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది. పూర్తి పాటను సోమవారం (మార్చి 14) విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ను తొలుత వాయిదా వేస్తున్నట్లు చెప్పి సోమవారమే విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ 'పరాయి పాలనపై.. కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ' అంటూ జక్కన్న చెప్పే డైలాగ్తో ప్రారంభం అవుతుంది. తర్వాత 'నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా' అంటూ తారక్, చెర్రీ, ఆలియా కలర్ఫుల్గా కనిపించారు. ఈ మూవీ నుంచి ఇదివరకూ రిలీజైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, టీజర్, ట్రైలర్, పాటలు రికార్డ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సాంగ్తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రౌద్రం.. రణం.. రుధిరం' సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
అమెరికాలో తారక్ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్ కొనేశాడు
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ ఇప్పుడు థియేరట్స్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో భాగంగా మోస్ట్ అవైటెడ్ సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్ విడుదల అవుతుండగా, మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఒకే నెలలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఊహించినట్లుగానే గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా అమెరికా డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్లోఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏకంగా 75టికెట్లను కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్గా మారింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్లు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. USA🇺🇸 premier show tickets in Dallas Galaxy spaces theatre 12:30 show on 24th Ntr fan bought 75 tickets#ManOfMassesNTR #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/GWCY7Rw8EJ — Filmy Tweets (@praveen_5654) March 5, 2022 -
'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల
RRR Movie Will Showing In London Biggest Imax Screen: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ల కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్ను భారీగానే ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా బ్రిటన్లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే లండన్లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్'లోనూ విడుదల కానుంది. అయితే లండన్లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. లండన్ వాటర్లూలో ఈ ఐమ్యాక్స్ను నిర్మించారు. థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ థియేటర్లో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ హాలీవుడ్ పెద్ద చిత్రాలైన 'బ్యాట్ మ్యాన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి సినిమాలను ప్రదర్శించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ఈ గౌరవం దక్కించున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కింది. -
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. రోలింగ్ లేనప్పుడు స్క్రోలింగ్
RRR Movie Latest Photo NTR Ram Charan Released By Makers: ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ పెంచేసింది జక్కన్న టీం. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఆర్ఆర్ఆర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ లేనప్పుడు రామ్-భీమ్లు ఇద్దరూ ఎలా ఉంటారనేది చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పచ్చటి గడ్డిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మ్యాట్లు వేసుకుని పడుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు తమ మొబైల్స్ చేతిలో పట్టుకొని ఏదో స్క్రోలింగ్ చేస్తూ దర్శనిమిచ్చారు. ఈ పోస్టర్కు 'కెమెరా రోలింగ్లో లేనప్పుడు స్క్రోలింగ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే సినిమాల్లో నవరసాలు పండించే ఈ హీరోలు షూటింగ్ లేనప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ కాగా ఫ్యాన్స్ వారి హీరోలను చూస్తూ మురిసిపోతున్నారు. Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL — RRR Movie (@RRRMovie) March 1, 2022 -
ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్ మేనియా.. ఖాతాలో మరో రికార్డు
Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్, మేకింగ్ వీడియోస్, పోస్టర్లతో అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్లోకి చేరుకుంది. ఈ వ్యూస్తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. -
అరబిక్ కుత్తు ఎన్టీఆర్ వర్షన్
-
ఆర్ఆర్ఆర్ నుంచి సూపర్ అప్డేట్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
RRR Movie Racing Towards New Poster Goes Viral: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)'. అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అనేక వాయిదాల తర్వాత ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అంటూ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే వాయిదాలతో అభిమానులు, ప్రేక్షకులను నిరాశ పరిచిన జక్కన్న టీమ్, పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, సాంగ్స్, ట్రైలర్స్తో ఉత్సాహపరిచింది. ఫిబ్రవరి 3న ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో గుఱ్ఱపు స్వారీ చేస్తూ రామరాజు, బుల్లెట్పై కొమురం భీమ్ ఆకట్టుకోనున్నారు. అలాగే 'ఇంకో 50 రోజుల్లో ఈ చిత్రం రానుందని' క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వారిని చూసి మురిసిపోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Racing towards Cinemas... Coming in 50 Days!! #RRRMovie 🔥🌊 March 25th, we will see you. 🐎 🏍 🤘🏻#RRRonMarch25th pic.twitter.com/aumWWnCh45 — RRR Movie (@RRRMovie) February 3, 2022 -
ఇదే ఫైనల్ రిలీజ్ డేట్.. క్లారిటీ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
RRR Movie Officially Final Release Date Out By Makers: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్గా వస్తున్న చిత్రం చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్, కాదు కాదు ఏప్రిల్ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. ప్రకటించిన రిలీజ్ డేట్స్ జూలై 30. 2020 జనవరి 8 2021 అక్టోబర్ 13 2021 జనవరి 7, 2022 #RRRonMarch25th, 2022... FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS — RRR Movie (@RRRMovie) January 31, 2022 -
గుడ్ న్యూస్.. ఎట్టి పరిస్థితుల్లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అప్పుడే!
దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్పోన్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులను ఇంకా వీడలేదు. ఎప్పుడూ రిలీజ్ చేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ) ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్ 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇన్నేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడినట్లు ఉంది. ఈ ప్రకటనతో ఆర్ఆర్ఆర్ సుమారు 14 భాషల్లో విడుదలకానుంది. ఈ ఒక్క న్యూస్తో అభిమానులు పండుగ చేసుకోనున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ స్పూఫ్.. అదరగొట్టేశారుగా..!) Breaking : #RRRMovie on March 18th 2022 or April 28th 2022. @tarak9999 @AlwaysRamCharan @ssrajamoulipic.twitter.com/clTcqxAVfD — Suresh Kondi (@SureshKondi_) January 21, 2022 -
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్కు స్పెషల్ సర్ప్రైజ్.. సంక్రాంతి కానుకగా
RRR Movie Special Poster On The Sankranti Eve: దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్పోన్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సమర్ధించారు. సినిమా విడుదల సంగతి దర్శకనిర్మాతలు చూసుకుంటారు అని తేల్చి చెప్పాడు. సినిమా వాయిదా పడింది అని అసహనంతో ఉన్న ప్రేక్షకులను మెప్పించేందుకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజాలపై కర్ర పట్టుకుని, రామ్ చరణ్ స్టైలిష్గా నడుస్తూ కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్తోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు. Wishing everyone a very #HappyPongal, #Bhogi, #Lohri, #MakarSankranti ❤️🔥🔥 See you soon in cinemas. pic.twitter.com/Gwt1INGbir — DVV Entertainment (@DVVMovies) January 14, 2022 Pose like our RAM & BHEEM with your dearest ones :) #RRRMovie pic.twitter.com/N2Hw7RVkMp — RRR Movie (@RRRMovie) January 14, 2022 ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ -
ఫ్రిజ్లో ఈగలు దాచిన రాజమౌళి.. ఎందుకంటే..?
Interesting Facts About Eega Movie Directed By Rajamouli: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్ఆర్ఆర్) విడుదల వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షక జనం తీవ్ర నిరాశకు గురైంది. అయితే మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పెద్ద హీరోలను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రాజమౌళి ఏ సినిమా చేసిన ఎంతో పరిశోధన చేసి, తాను అనుకున్నట్లుగా ఔట్పుట్ వచ్చేవరకు నిద్రపోడు. తాను సంతృప్తి చెందేవరకూ సన్నివేశాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకే అతన్ని 'జక్కన్న' అని ముద్దుగా పిలుస్తారు. తాను అనుకున్నట్లుగా సన్నివేశం వస్తుందో లేదో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటానని రాజమౌళి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తీసే ప్రతి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తారు. అందుకు ఎంత పరిశోధన అయినా చేస్తారు అని చెప్పేందుకు 'ఈగ' సినిమానే ఒక ఉదాహరణ. ఈగ సినిమా కోసం రాజమౌళి ఏం చేశారో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఇటీవల బయటపెట్టారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్లో భాగంగా 'ఈగ' సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఈగ చిత్రం కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్లో ఉంచాడట. ఆ ఫ్రిజ్లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని తారక్ చెప్పినట్లు సమాచారం. ఈగల సుప్తావస్థ (హైబర్నేషన్) గురించి తెలుసుకునేందుకే జక్కన్న అలా చేశారని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో వాటి మనుగడ ఎలా ఉంటుందో పరిశీలించేవారని చరణ్ పేర్కొన్నాడట. చిత్రబృందంతో కలిసి ఈగల ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేవారట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక సినిమా కోసం జక్కన్న ఎంత కష్టపడతారో అని. 2012లో విడుదలైన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత, నేచురల్ స్టార్ నాని జంటగా నటించారు. కన్నడ హీరో సుదీప్ విలనిజం ఎంతగానో ఆకట్టుకోగా 'ఈగ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2 నేషనల్, 3 సైమా, 5 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులను వరించింది. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ -
ఎన్టీఆర్ ఈవెంట్కు 10 ప్రత్యేక రైళ్లు.. అభిమానుల కోసం
Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK — NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022 ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియోలు
RRR Movie Making Videos: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమురమ్ భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రం (RRR Movie) సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై బడ్జెట్కు మించి హైప్ను క్రియేట్ చేశాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలాయి. సినిమా రిలీజ్కు ముందు చిత్ర ప్రమోషన్స్ను కూడా భారీగా చెస్తున్నారు. ఇటీవల ముంబైలో గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. అంతకుముందు అలియా భట్ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం తాజాగా కొమురమ్ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల చిత్రీకరణను సోషల్మీడియా వేదికగా పంచుకుంది. కొమురం భీం, అల్లూరి సీతరామరాజులు చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్స్టా గ్రామ్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతరామరాజు మేకింగ్ వీడియోలో చెర్రీ ఓ వైపు నవ్వుతూ మరోవైపు పాత్రలోకి పరాకయ ప్రవేశం చేశాడు. క్యాజువల్ జీన్స్, షర్ట్తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే పోలీసు యూనిఫామ్ వేసుకొని నిలుచున్న విజువల్స్తో ప్రారంభమవుతుంది వీడియో. అందులో చరణ్ రిహాసల్స్, సీన్లో ఎమోషన్స్, బాక్సింగ్ ప్రాక్టీస్ అబ్బురపరిచాయి. అలియా భట్తో సీన్ గురించి నవ్వకుంటూ చర్చించుకోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియోలో ఎన్టీఆర్ను భీంగా తయారు చేయడం చూపించారు. యాక్షన్ సన్నివేశాలు, బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం కనులవిందుగా ఉంది వీడియో. అక్కడక్కడ తారక్ నవ్వడం, మైక్లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్లు ప్రాక్టీస్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు. ఈ వీడియోలను 'వీ ఆర్ ఇన్ ది మేకింగ్' అంటూ ఎండ్ చేశారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
ఆర్ఆర్ఆర్ అభిమానులకు చేదువార్త.. అక్కడ నో టెలికాస్ట్
RRR Movie Pre Release Event Has No Telecast In Mumbai: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషనల్లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 భాషల్లో తెరకెక్కుతున్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం' (RRR). పాటలు, వీడియోలతో ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్, ముంబై, బెంగళూరులో సందడి చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఈ నెల 19న ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం (డిసెంబర్ 19) ముంబైలో జరిగే ఈ 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయట్లేదని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ను మరో రోజు టెలికాస్ట్ చేస్తామని తెలిపింది. అలాగే మరికొన్ని నగరాల్లో #RoarofRRR ఈవెంట్స్ ఉన్నాయని, వాటిని లైవ్ ఇస్తామని పేర్కొంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ట్విటర్లో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 1920 బ్యాక్డ్రాప్లో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్లో విడుదల కానుంది. ఇదీ చదవండి: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్ NO LIVE TELECAST Of #RoarOfRRRInMumbai Event today. It will be telecasted on a later date. We have a few more #RoarofRRR events in other cities which will be telecasted live. Details soon. https://t.co/Z8xMQ4VPD2 — RRR Movie (@RRRMovie) December 19, 2021 💥💥 #RoarOfRRRInMumbai pic.twitter.com/YfdAVSUiHV — RRR Movie (@RRRMovie) December 19, 2021 ఇదీ చదవండి: పెళ్లిళ్లు అయ్యాయి.. అయినా అదేపని.. తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్, గట్టిగా గిల్లిన ఎన్టీఆర్ -
అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్
Alia Bhatt To Seetha Making Video From RRR Movie: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్కు (సుమారు రూ. 450 కోట్లు) మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. రేపు (డిసెంబర్ 9) ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు, వీడియోలు, పాటలు విడుదల చేశారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను రీలీజ్ చేసింది చిత్రబృందం. ఈ తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్ను చూపించారు. వీడియోలోని బిహైండ్ సీన్స్లో అలియా భట్ క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు, భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
అదిరిపోయిన ఎన్టీఆర్, రామ్ పోస్టర్లు.. అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు !
Ntr And Ram Charan New Look Posters Out From RRR: దర్శకధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే. ఆ సినిమాకు అంచనాలు అంతకుమించి అన్నట్లుగా ఉంటాయి. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్కు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. ఈ నెల 9న ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ సినిమా విడుదల కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క అమెరికాలోనే వెయ్యికిపైగా మల్టీ ప్లెక్సులు బ్లాక్ చేశారని సమాచారం. అగ్రరాజ్యంలో ఓ భారతీయ సినిమా ఈ స్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆ రకంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం రికార్డు క్రియేట్ చేయబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అభిమానుల్లో జోష్ నిపండానికి సోమవారం (డిసెంబర్ 6) రెండు సర్ప్రైజ్లు ఉందించింది చిత్రబృందం. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్ఫుల్ లుక్లో కనిపించి అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ సినిమా సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. That’s BHEEM for you… #RRRTrailerin3Days #RRRMovie #RRRTrailer pic.twitter.com/bs9DI5gR5F — Jr NTR (@tarak9999) December 6, 2021 That’s RAM for you… #RRRTrailer #RRRMovie #RRRTrailerin3Days pic.twitter.com/qlf1OsG8wc — Ram Charan (@AlwaysRamCharan) December 6, 2021 ఇదీ చదవండి: చెల్లెలితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన రామ్చరణ్ -
ఇంత బతుకూ బతికి...
అవును మరి! ఎక్కడి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ! ఎక్కడి నందమూరి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్!! తొమ్మిదినెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత ఎన్టీరామారావు. 1994లో రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్పై చెప్పులు విసిరేలా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసగొల్పి ఆయన సీఎం పోస్టుకే ఎసరు పెట్టిన చంద్రబాబు చరిత్ర జగద్విదితమే. ఆ తర్వాత చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు 2004 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. వైఎస్సార్ అయిదేళ్ల పాలనతో సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరిగెత్తించడంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది బాబుకు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హిట్ మీద హిట్ తో అగ్రహీరోగా రాణిస్తున్నారు. చంద్రబాబు మరోసారి గతాన్ని పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ కరిష్మాను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. తన తండ్రికి, తమ కుటుంబానికి చంద్రబాబు చేసిన నమ్మకద్రోహాన్ని విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీకి అధికారం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ హీరో ముందు తన కొడుకు లోకేశ్ నాయుడు వెలవెలబోతాడని అతి స్వల్పకాలంలోనే గ్రహించిన చంద్రబాబు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టసాగారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పొత్తు ప్రభావంతో వైసిపి కన్నా కేవలం ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అమరావతి అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి రాజధాని నిర్మాణం పేరుతో రాబోయే పాతికేళ్లు తనదే అధికారం అనే ఊహా లోకంలో తేలియాడారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు కనీవినీ ఎరుగని విధంగా కుదేలైంది తెలుగుదేశం. అటు లోకేశ్ను చూస్తే మూడేళ్లు మంత్రిగా పనిచేసి, తన కలల రాజధాని ప్రాంతంలోనే ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవమే. (చదవండి: అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!) చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని కిందిస్థాయి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుముందే జూనియర్ రావాలి అంటూ నినాదాలు చెయ్యడమే కాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చెయ్యడంతో ఆయన కంగుతిన్నారు. ఆ తరువాత కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా ఊడిపోయింది. బాబును 7 సార్లు అసెంబ్లీకి పంపిన కుప్పంలో మొదటిసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది. చంద్రబాబుకు డెబ్బై ఏళ్ళు దాటాయి. లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపకపోవడంతో పార్టీలో చాలామందికి ఆయన నాయకత్వంమీద నమ్మకం పోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు చేబట్టాలని స్వరాలు వినిపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యలాంటి సీనియర్ నాయకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ గొంతులు విప్పుతున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. (చదవండి: తెలుగుదేశం విలాపం) తన సతీమణికి అవమానం జరిగిందన్న చంద్రబాబు రోదన ఆయన మనసెరిగినవారికి కలిసొచ్చింది. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫలితమే జూనియర్ మీద విమర్శలు ప్రారంభించారు. మేనత్తకు అవమానం జరిగితే జూనియర్లో ఫైర్ ఎక్కడ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాతగారు పెట్టిన పార్టీ పట్ల జూనియర్కు బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు! ఆ ఘట్టం ముగిసిన మూడు రోజులదాకా లోకేశ్ అసలు పెదవి విప్పిన దాఖాలానే లేదు. లోకేశ్లోనే లేని ఫైర్ జూనియర్కు ఎలా వస్తుందో అర్థం కాదు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చెరపట్టడంలో చంద్రబాబుకు సహకరించిన ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు.. ఆ తరువాత చంద్రబాబు పాల్పడిన నమ్మకద్రోహానికి ఎలా బలయ్యారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు సహకరించిన తన తండ్రి హరికృష్ణకు, ఆ తర్వాత తన మామ చంద్రబాబు స్వయానా పొడిచిన వెన్నుపోటును జూనియర్ మర్చిపోవడం సాధ్యమేనా? - ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా.. ఎందుకో తెలుసా ?
RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్కు 'ఆర్ఆర్ఆర్' టీం రిప్లై.. -
Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు. చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. -
'టక్కరి దొంగ' మహేశ్ బాబు గెలుచుకుంది ఎంత ?
Mahesh Babu In Evaru Meelo Koteeshwarudu: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు (EMK)'. ఈ రియాలిటీ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. తనదైన జోష్తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్కు తోడుగా ప్రొగ్రామ్కు తన రాకతో మరింత గ్లామర్ యాడ్ చేశారు మహేశ్. ఇటీవల రిలీజైన ప్రొమో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. ఆ ప్రోమోలు ఎన్టీఆర్, మహేశ్ ఇద్దరూ కలిసి ఎలా సందడి చేశారో చూశాం. ఇక మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్లో 'టక్కరి దొంగ' ఎంత గెలుచుకున్నాడో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి, నవ్వులు పంచి, తనదైనా డైలాగ్లతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించి తన మంచి మనసు చాటుకున్నాడట ఈ శ్రీమంతుడు. అయితే మహేశ్ బాబు ఎంత గెలుచుకున్నాడు ? ఎన్టీఆర్ అడిగినా ప్రశ్నలేంటి ? వాటికి 'పోకిరి' ఎలా సమాధానమిచ్చాడు ? అనేది ఈ గ్లామరస్ ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ చెప్పలేం. ఇదీ చదవండి: మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్గా.. -
RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది..
Janani Song Out From RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన 'నాటు నాటు', 'దోస్తీ' పాటలు సినీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతాగానో అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జనని సాంగ్ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. దేశభక్తిని చాటేవిధంగా రూపొందింది ఈ పాట. 'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు. -
మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్గా.. 'ఎవరు మీలో కోటీశ్వరులు'
Mahesh Babu In Evaru Meelo Koteeshwarulu: బిగ్బాస్తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాలిటీ షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఒకటి. దీనికి హోస్ట్గా చేస్తున్న యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. తాజాగా వీరిద్దరూ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు. మహేశ్ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోను షో మేకర్స్ విడుదల చేశారు. ఈ ఇద్దరు హీరోలను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో 'వెల్కమ్ మహేశ్ అన్న' అంటూ తారక్ ఇన్వైట్ చేస్తే.. 'అదిరిపోయింది' అని సూపర్ స్టార్ బదులిచ్చాడు. తర్వాత 'నా రాజా..' అంటూ ఎన్టీఆర్ తనదైన మ్యానరిజంతో జోష్ నింపారు. 'కరెక్ట్ ఆన్సర్నే అటూ, ఇటూ ఎందుకు తిప్పుతారు' అని మహేశ్ అడిగినా ప్రశ్నకు 'సరదా కోసం' అని ఎన్టీఆర్ సమాధానమిస్తారు. దీంతో కంప్యూటర్ను 'దీనికన్నా గురువు గారే బెటర్గా ఉన్నారు' అన్న మహేశ్ మాటకు షోలో నవ్వులు విరబూసాయి. ఇంతకుముందు ఈ షోకు రామ్ చరణ్, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత అలరించనున్నారు. -
నాటు నాటు.. సోషల్ మీడియాలో అదిరిపోయేట్టు..
Natu Natu Song Gose Viral With Covers And Editing Songs: జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్ఆర్ఆర్'. ఇంతకుముందు ఈ సినిమాలోని అల్లూరి సీతరామరాజు, కుమురం భీం పాత్రలపై విడుదల చేసిన టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల వచ్చిన నాటు 'నాటు పాట' ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి అందించిన మ్యూజిక్కు ఎన్టీఆర్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో ఏ విధంగా డ్యాన్స్ చేశారో చూసి ఆనందించాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న యువత కవర్ సాంగ్స్తో, ఎడిటర్స్ తమ అభిమాన హీరోల ఓల్డ్ సాంగ్స్తో 'నాటు' పాటను రీక్రియేట్ చేశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకసారి ఆ కవర్ సాంగ్స్, ఎడిటింగ్ పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా. Jai NTR ✊🏻✊🏻✊🏻@tarak9999 #21MagicalYearsOfNTR #NaatuNaatu pic.twitter.com/WInHjqR2h9 — Vivace Ajay (@TarakSpace) November 16, 2021 #NaatuNaatu tRRRance 🥳@RRRMovie @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/Xipu0DkNRs — . 🌊 (@venkydaya09) November 9, 2021 Two Types of NTR fans#NaatuNaatu @tarak9999 pic.twitter.com/UzGILQX394 — . 🌊 (@venkydaya09) November 9, 2021 Here is the Mutual Edit of @tarak9999 & @AlwaysRamCharan from #NaatuNaatu Song Hope You all Like it @RRRMovie pic.twitter.com/oRzKx44G0m — UPENDRA TARAK ISM 🌊 💥 (@upendratarak99) November 9, 2021 The baap of all versions 🔥#NaatuNaatu pic.twitter.com/0eveAyFvvP — Troll Mega comedians (@TMCOffl) November 9, 2021 #NaatuNaatu Hope u like ❤️#SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/ibvXjh2MFZ — Uday 🔔 (@theMBfan) November 10, 2021 Nepali Dance for #NachoNacho #NaatuNaatu Reaching bigger and wider @RRRMovie pic.twitter.com/pGgZ0IJRly — aRRRavind (@KadapaKing9999) November 14, 2021 This is What We Want. We Want this Beats @RRRMovie 🥁🕺#NaatuNaatu #RRRSecondSinglePromo @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/lYIahwOf6A — RRRamcharan ERA™ (@RamCharanERA) November 9, 2021 Going with the Trend 😅🌊🔥🥁 Response mamuluga ledu ga 🔥#NaatuNaatu @RRRMovie pic.twitter.com/8DiynGIjpC — V.Lithin 👑🏇 (@NTRLithin7) November 9, 2021 Ground Level Reach of #RRRMassAnthem Across Nation👌👌#NaatuNaatu #NaachoNaacho @RRRMovie @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/yAOkZ7Wndf — RRRamcharan ERA™ (@RamCharanERA) November 13, 2021 #NaatuNaatu mania 💃@RRRMovie pic.twitter.com/sQbm3wpldS — Rohini tarak (@rohini4tarak) November 12, 2021 single take lo chesina step adi malli @alluarjun 🙏#NaatuNaatu pic.twitter.com/iq8jphBbXl — StoneR..💥 (@StonerSuryAA) November 11, 2021 Me From Last 1hr🕺🕺🕺@tarak9999 @RRRMovie @AlwaysRamCharan #NaatuNaatu pic.twitter.com/a6WfRHvohb — KICK Tollywood 🌊🔥 (@KickTwood) November 9, 2021 Even Haters got #Naatufied 🥁🕺@tarak9999 @AlwaysRamCharan @RRRMovie #NaatuNaatu pic.twitter.com/yCVoHZ4TqO — KICK Tollywood 🌊🔥 (@KickTwood) November 9, 2021 From Germany #NaatuNaatu Mom & Daughter 👌@RRRMovie pic.twitter.com/VyAeuumOfe — aRRRavind (@KadapaKing9999) November 12, 2021 Trending Now #NaatuNaatu 🔥🌊@RRRMovie 😍 #NaatuNaatuPromo pic.twitter.com/zR4aPQSWcu — Milagro Movies (@MilagroMovies) November 9, 2021 చదవండి: బామ్మ స్టెప్పులకు ఆర్ఆర్ఆర్ టీం ఫిదా చదవండి: నాటు సాంగ్ దెబ్బ...అప్పుడే ఆల్ టైం రికార్డ్ -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ కలకలం
సాక్షి,తిరుపతి: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయవద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సామాజిక మాథ్యమాల్లో లేఖ పోస్ట్ చేశారన్న విషయం పట్టణంలో కలకలం రేపింది. ఎక్కడ చూసినా ఈ లేఖపైనే విస్తృత చర్చలు జరిగాయి. ‘కుప్పం గడ్డపై అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా రెండుసార్లు మనపై దాడి చేయించాడు. ఇప్పుడు గాయపడిన ప్రతి జూనియర్ అభిమానికి సమయం వచ్చింది. చదవండి: టీడీపీకి ఓటు వేయనన్నందుకు దళితుడిపై దాడి మన దెబ్బకు లోకేష్ పర్యటించిన అన్ని వార్డుల్లోనూ టీడీపీని ఓడించి మన ప్రతీకారం రుచి చూపిద్దాం. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు దెబ్బతినడమే కాదు, తన సమయం వస్తే కోలుకోలేని దెబ్బ కొట్టగలడు. అని చూపిద్దాం.’ అంటూ లేఖలో పేర్కొన్న విషయంపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు టీడీపీకి ఓటు వేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ విడుదల చేశారన్న సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో దుమారం రేపింది. పరిస్థితి తమ కొంప ముంచే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఏ మాథ్యమాల్లో అయితే లేఖ వైరల్ అవుతోందని ప్రచారం జరుగుతోందో అక్కడే అందులోని సమాచారం అవాస్తవమని సమర్థించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేఖ వాస్తవమా.. అవాస్తవమా అనే విషయం పక్కన పెడితే ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. -
చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు యాంకర్స్గా మారిన స్టార్ హీరోలు
ఇంత కాలం కేవలం సినిమా హీరోలుగానే ఉన్న మన స్టార్స్ ఈ మధ్య కాలంలో టీవీ చానల్ యాంకర్స్గా మారిపోయి తమ సత్తా చూపిస్తున్నారు. టెలివిజన్లో కూడా తమ అభిమానులను అలరిస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న సినిమా హీరోల వరకు అందరూ ఇప్పుడు హోస్ట్ అవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పైగా సినిమాలకు ఏ స్థాయి రెమ్యునిరేషన్ తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకుని యాంకరింగ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే చాలా మంది హీరోలు టీవీ చానల్ హోస్టులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా నటరత్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్స్టాపబుల్ NBK అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. అయితే మరి ఈయన కంటే ముందు హోస్టులుగా మారిన హీరోలెవరో ఓ సారి చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్కు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సాయికుమార్ వావ్, మనం (ఈటీవీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. -
జూనియర్ ఎన్టీఆర్కు 9 సెంటిమెంట్ నిజమేనా?
సాధారణంగా మన సినిమా తారలు కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. అందులోనూ స్టార్ హీరోలు ఈ వరుసలో ముందుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కార్లపై ఇంట్రస్ట్ అందరికంటే ఎక్కువగా ఉన్న హీరో చిరంజీవి. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్లోకి తెచ్చుకుంటారు మన మెగాస్టార్. ఇక ఈ జనరేషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లిస్ట్లో ఒకరు. ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్లో పదికి పైగా కార్లు ఉండగా.. ఇటీవల అత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారును మొన్నటికి మొన్న రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే తారక్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అదేంటి అన్ని కార్లకి ఒకే నంబర్ అనుకుంటున్నారా? దీనికి సమాధానంగా తన సన్నిహితులు కొందరు తారక్కి ఆ నంబర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ నిజానికి ఎన్టీఆర్కు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవట. మరెందుకు ఒకే నంబర్ను తన అన్ని కార్లకు వాడుతున్నాడనేగా మీ సందేహం..? దానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్కు 9 అనే అంకె అంటే ఇష్టమట. అలాగే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కారు నెంబర్ 9999 అనీ.. ఆ తర్వాత తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నంబర్ను వాడారని అందుకే తనకు ఆ నంబర్ అంటే ఇష్టమని ఇటీవల ఓ సందర్బంలో ఎన్టీఆర్ చెప్పాడు. అందువల్ల మరో ఆలోచన లేకుండా తన ప్రతి కారుకు అదే నంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు తారక్. తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాని అది సెంటిమెంట్ కాదని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్తో పాటు ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. ఇక తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. -
లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jr NTR Comments On Wife Laxmi Pranathi జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్లో తన పెళ్లి నాటి ముచ్చట్లను తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. కంటెస్టెంట్ పెళ్లి చూపులు సమయంలో కనీసం మీరు బాగా మాట్లాడారమ్మా కానీ మా పెళ్లి చూపుల్లో అయితే మా ఆవిడ అసలు మాట్లాడలేదు అంటూ సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూడగానే ఎన్టీఆర్ ఓకే అని చెప్పి వెళ్లిపోయాడట. అయతే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎన్టీఆర్కు ఎస్ చెప్పలేదు. అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిని అడిగారట అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక పెళ్లికి నిశ్చితార్థానికి మధ్య దాదాపు 8 నెలల గ్యాప్ వచ్చింది. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఎన్టీఆర్కు ఎస్ అని చెప్పలేదు. ఇక దీనితో ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో అపుడే తనకు అర్ధమైందన్నారు ఎన్టీఆర్. ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం తనకు ఆ తర్వాత బోధ పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహాం జరిగి పది సంవత్సరాలు పూర్తైయింది. వీరికి అభయ్రామ్, బార్గవ రామ్ ఇద్దరు కుమారులు. కాగ ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. -
మళ్లీ సన్నగా, స్టయిలిష్గా కనిపించబోతున్న ఎన్టీఆర్!
Jr NTR: బరువు పెరగడం... తగ్గడం... ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మేకోవర్ కావడానికి రెడీ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగారు. తర్వాత చేయనున్న చిత్రం కోసం బరువు తగ్గనున్నారని సమాచారం. అయితే రెగ్యులర్గా కన్నా కూడా కాస్త సన్నబడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే ఈ మేకోవర్ అని భోగట్టా. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లారు. ఆ పాటతో సినిమా పూర్తవుతుందట. దాంతో ఇండియా చేరుకున్న వెంటనే ప్రత్యేక డైట్, స్పెషల్ వర్కవుట్స్తో తగ్గే పని మీద ఉంటారని తెలిసింది. కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ స్టయిలిష్గా కనిపించారు. తాజా చిత్రంలోనూ అలా స్టయిలిష్గా కనిపించనున్నారని టాక్. -
టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా!
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను ఆదివారం అభిమానులు ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది. ఇక్కడ నుంచి జూనియర్ పోటీ చేయాలంటూ పోస్టర్లు, ఫెక్సీలు వెలుస్తుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ను బరిలో దించాలని శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించింది. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి అభిమానులు వినూత్నంగా తమ డిమాండ్ను జెండా రూపంలో ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్ -
కుప్పంలో జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
-
RRR Movie: ఫైట్ సీన్కి కన్నీళ్లొస్తాయి!
‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని పోరాట సన్నివేశా లను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు ఈ చిత్రరచయిత కె.వి.విజయేంద్రప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రవిశేషాల గురించి ఇటీవల ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్ను చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్లో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్సెస్కి ఎమోషన్ అవుతారు ప్రేక్షకులు’’ అన్నారు. -
మహేష్బాబు భావోద్వేగం
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హాఠాన్మరణం యావత్ టాలీవుడ్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్స్టార్ మహేష్బాబుతో ఆయన స్పెషల్ బాండింగ్ కొనసాగించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మహేష్బాబు సోషల్ మీడియాలో ఎమోషన్ అయ్యాడు. ‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్మ్యాన్. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మహేష్బాబు పోస్ట్ చేశాడు. ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్కి గురయ్యానంటూ జూనియర్ ఎన్జీఆర్ ట్వీట్ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దర్శకులు సంపత్ నంది, మెహర్ రమేష్లు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రైటర్ గోపీ మోహన్, దర్శకనిర్మాత మధురా శ్రీధర్ తదితరులు సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Not able to process the sudden demise of BA Raju garu. I've known him since my childhood. We travelled together for many years and I worked with him very closely. pic.twitter.com/N6gbW8DPxv — Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021 The sudden demise of BA Raju Garu has left me in shock. As one of the most senior film journalists & PRO,he has contributed greatly to the Film Industry. I've known him since my earliest days in TFI. It is a huge loss.Praying for strength to his family. Rest in Peace Raju Garu 🙏🏻 pic.twitter.com/B5lytChlqW — Jr NTR (@tarak9999) May 22, 2021 -
కొమురం భీమ్.. నాకో సవాల్!
చేతిలో బల్లెం పట్టుకుని మహోగ్రరూపం దాల్చిన కొమురం భీమ్గా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్ కొత్త పోస్టర్ విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. గురువారం (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘‘మంచి మనసు ఉన్న తిరుగుబాటుదారుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నందుకు, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నా కొత్త పోస్టర్ను మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర పోషించడం నాకో సవాల్లా అనిపిస్తోంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎన్టీఆర్. ‘‘మా భీమ్ది బంగారంలాంటి మనసు. కానీ తిరగబడితే దేనికైనా బలంగా, ధైర్యంగా నిలబడతాడు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. ఇదిలా ఉంటే.. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ పుట్టినరోజు వేడుకలకు ఇది సమయం కాదని, దేశం కరోనాను జయించిన రోజున అందరం వేడుక చేసుకుందామని, తన బర్త్ డే వేడుకలను నిర్వహించవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్తో... ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకతంలో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘‘ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా చేస్తారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమా సెట్స్పైకి వెళుతుంది. -
నారా లోకేష్పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ సోషల్ మీడియాలో ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిల్లుస్తుంటారు. రాజకీయ నాయకులైన, సినీ ప్రముఖలపై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతారు. కాగా ఈసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్పై ట్విటర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైరస్ పట్టిందన్నారు. ఈ వైరస్కు విరుగుడిగా జూనీయర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా జూనీయర్ ఎన్టీఆర్ వ్యాక్సిన్ను వెంటనే పార్టీకి వేయించాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. లేకపోతే మీ పని అంతే! అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. Telugu Desham party is fatally infected with the dangerous micro organism called @naralokesh virus, and one and only vaccine avilable for its cure is @tarak9999 ..My advise to all TDP cadres ..Get smart and Get vaccinated super fast with @tarak9999 or U WILL DIE — Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2021 చదవండి: ఎన్టీఆర్, అఖిల్ల వీడియోపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్ -
జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా?
తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. తమ హీరోలకు సంబందించిన ప్రతి అప్ డేట్స్ గురుంచి అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ ఏమి చేసినా కూడా అభిమానుల ప్రతి క్షణం అనుసరిస్తూ ఉంటారు. గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు రూ.25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. అలాగే, దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి మరి అది యుఏ స్పోర్ట్స్ మాస్క్ అని అభిమానులు తెలిపారు. దాని ధర సుమారు రూ.2,340. ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ కు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్పై ఫ్యాన్స్ కన్ను పడింది. జెమిని టీవీలో వచ్చే "ఎవరో మీలో కోటీశ్వరులు" కార్యక్రమం కోసం ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురుంచి చర్చ జరుగుతుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో