Justice
-
మాకొద్దంటున్నా... అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ!
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనంకాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.సుప్రీంకోర్టులో పిల్..యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు. -
అప్పుడు కూడా జడ్జి యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టల కుప్ప!
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.2015లో అసలు విషయం వెలుగులోకి..అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు. -
‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’
న్యూఢిల్లీ: భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.రూ. 15 కోట్లు పైమాటే..?అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ.. బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదుజస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. -
జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు.. సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.తొలగింపు ఎలాగంటే..అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్కు ఉంది. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్కుమార్కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది. ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది. ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి. వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.అందులో సజ్జన్కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి. పంజాబ్ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు. అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది. -
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్చుప్గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
93 ఏళ్ల బామ్మ.. 34 ఏళ్లుగా జైల్లోనే
రాయచూరు రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలికి ఉపశమనం కలిగింది. ఉప లోకాయుక్త ఆదేశాలతో ఆమెకు విముక్తి లభించింది.శిక్ష మూడేళ్లు మాత్రమేవివరాలు.. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకావాసి నాగమ్మ 1995 లో వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా జిల్లా కేంద్ర జైలుకు వచ్చారు. ఆనాటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 93 ఏళ్లు. ఆమెకు విధించిన శిక్ష 3 ఏళ్లు మాత్రమే. కానీ పట్టించుకుని బెయిలు ఇప్పించేవారు లేకపోవడంతో కటకటాలే పుట్టినిల్లయింది. ఇటీవల ఉప లోకాయుక్త బి.వీరప్ప జైలును సందర్శించి ఆమె కథను విని చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టితో ఫోన్లో మాట్లాడారు. నాగమ్మకు పూర్తిగా అశక్తురాలని, ఆమెను వదిలివేయాలని ఉప లోకాయుక్త సూచించారు. జైలు సూపర్నెంటు అనిత పెరోల్ ఇవ్వడంతో బంధువులు ఆమెను తీసుకెళ్లారు.34 ఏళ్లుగా జైల్లో.. పాపం నాగమ్మ! -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం
న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్కు న్యాయమూర్తి సూచించారు. -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్గా లీ హ్యూన్ -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
సీజేఐ ఇంట గణేష్ పూజలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్లను, 22,000 కోర్టు రూమ్లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
ప్రవళిక కుటుంబానికి భరోసా ఏదీ?
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్లోని అశోక్నగర్లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.ప్రియాంక గాంధీ దూత వచ్చినా..అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.కూలీ పనులకు వెళ్తున్నా..నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రినిందమోపిండ్లు.. రుజువు చేయలే.. నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.– మర్రి విజయ, ప్రవళిక తల్లి -
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
జస్టిస్ రామలింగేశ్వర్రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్టైమ్ లెక్చరర్గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు. 2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా నియమించింది. -
తల్లి త్యాగాలను వెలకట్టలేం
సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్ న్యాయవాదులు కేఎన్ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం జస్టిస్ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్ తదితర సంఘాలు కూడా జస్టిస్ భట్టీని సన్మానించాయి. మదనపల్లి మాణిక్యం.. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్గా మారిందన్నారు. మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు. సమర్థత వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర ఈ సందర్భంగా జస్టిస్ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు. ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
గీతాంజలి చివరి వీడియో
-
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
సకాలంలో నివేదికలిస్తే బాధితులకు సత్వర న్యాయం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజి్రస్టార్(లా) సురాజిత్ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రూ.80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దుర్గమ్మ సేవలో జస్టిస్ అరుణ్ మిశ్రా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్మిశ్రా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్ అరుణ్మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్కుమార్కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్లోని రాజ్కోట్లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
రాజ్ భవన్ లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జి.నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్షిప్కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్ సీఐ శ్రీధర్ మంగళవారం హస్తాల్పూర్ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్కుమార్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్లు, ఆభరణాలు) -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్పై వినియోగదారుల ఫోరమ్లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
రెజ్లర్లకు న్యాయం జరిగేనా? అమిత్ షాతో భేటీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. తొందరగా విచారణ చేయించండి... కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు. దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు. -
రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!
ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. రెజ్లర్ల ప్రతి డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ.. -
భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు. పెరుగుతోన్న వ్యతిరేకత... భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే చేరిపోయారు. విచారణ జరుగుతున్న తీరు విచారకరం... ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది. వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
పతకాలు ‘గంగ’పాలు కాలేదు!
హరిద్వార్: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్షి ప్లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు. రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
మోదీ జీ "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!"
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సుప్రీం కోర్టు జోక్యంతోనే బీజేపీ నేత శరణ్సింగ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ భారత రెజ్లర్లు జంతర్మంతర్ వద్ద తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ..న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ.. శరణ్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్ సింగ్ చెప్పారు. కాబట్టి మోదీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్ గాంధీ అన్నారు. మీరు అందుకు అంగీకారం తెలిపండి అని ప్రియాంక్ గాంధీ మోదీని కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ జంతర్మంతర్ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు. 90% మంది అథ్లెట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందినవారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి(హర్యానాకి) చెందని వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు. అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్ ఫోగట్ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్ సింగ్ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్సింగ్పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం) -
1998లో డీఎస్సీ రాశారు.. ఎన్నో ట్విస్ట్ ల తర్వాత .. కథ శుభం
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్పీ– 1998 అభ్యర్థుల కల ఫలిచింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాసి, అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో, మంచి మనసున్న ఏ ముఖ్యమంత్రి తమ గోడు ఆలకించకపోతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా జిల్లాల వారీగా క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు సేకరించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈనెలలోనే దానిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈనెల 13లోపు పోస్టింగ్స్ కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. కాగా ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన 25 ఏళ్ల తరువాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై అభ్యర్థులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యాశాఖాధికారులు గతేడాది అక్టోబర్లో గుంటూరు నగరంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 229 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన దృష్ట్యా, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మినిమం టైం స్కేల్పై ఉపాధ్యాయులుగా నియమితులైన అభ్యర్థులను అవసరమైన పాఠశాలల్లో నియమిస్తామని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను htts://doefnt.bofrpot.com సైట్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, ఐదు పాస్పోర్ట్ ఫోటోలు, డీఎస్సీ–1998 హాల్ టిక్కెట్ను తీసుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
క్యాపిటల్ దాడులకు సపోర్ట్ చేస్తూ..'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ ట్రంప్ పాట
అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోని మార్-ఎ-లాగో రిసార్ట్లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి. (చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..) -
ఎన్.ఆర్.ఐ భర్తల మోసం చెల్లదు
పంజాబ్లో‘హనీమూన్బ్రైడ్స్’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.అంటే పెళ్లి చేసుకున్న ఎన్.ఆర్.ఐలుకాపురానికి తీసుకెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగాకాపురం చేసి ఆ తర్వాత పెళ్లికూతుళ్లను పుట్టింటికి తరిమేస్తారు.సత్వీందర్ కౌర్ కూడా అలాంటి బాధితురాలే.కాని ఆమె ఊరికే ఉండలేదు.లూధియానాలో ఒక సంస్థ స్థాపించిఎన్ఆర్ఐ బాధితమహిళలకు న్యాయం జరిగేలా చూసింది.న్యాయం జరగాలంటే ఏం చేయాలో కూడా చెబుతోంది. పంజాబ్, హరియాణాలలో ఎన్.ఆర్.ఐ భర్తలు మోసం చేసిన భార్యల సంఖ్య ప్రస్తుతం ఎంత ఉంటుందో ఊహించండి. 32,000. పెళ్లి చేసుకుని ఉద్యోగాలు విదేశాలలో తెచ్చుకుని మాయమైన ఎన్.ఆర్.ఐలు కొందరైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఉడాయించిన వాళ్లు కొందరు. వీరి గురించి ఆరా తీస్తూ, ఎదురు చూస్తూ, వారిని శిక్షించాలని ప్రయత్నిస్తూ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాహితులను అక్కడ ‘హనీమూన్ బ్రైడ్స్’ అంటూ ఉంటారు. విషాదం ఏమంటే వీరి సగటు వయసు 22 నుంచి 65 వరకూ ఉండటం. ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విదేశాలకు పా రిపోయిన భర్తల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఇంకా అక్కడ ఉన్నారు. వారందరికీ ఒక ఓదార్పు లూధియానాలో ‘అబ్ నహీ’ సంస్థను నడుపుతున్న 41 ఏళ్ల సత్వీందర్ సింగ్. స్వయంగా బాధితురాలు లూధియానాకు చెందిన సత్వీందర్ సింగ్ టీచర్గా పని చేసేది. టీచర్ సంబంధమే వస్తే 2009లో వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్త విదేశాలలో ఉద్యోగం వచ్చిందని జార్జియా వెళ్లాడు. అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లాడు. సత్వీందర్ అత్తారింటిలోనే ఉండిపోయింది. ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి వచ్చిన భర్త ఆమెను అత్తారింటి నుంచి ఒక అద్దె ఇంటికి మార్చి ఒక నెల ఉండి మళ్లీ ఉక్రెయిన్కు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతాను అనే దొంగ హామీ మీద. కాని ఎయిర్పోర్ట్కు చేరుకోవడంతోటే ‘ఇక నీకూ నాకూ సంబంధం లేదు’ అని ఫోన్ చేసి చెప్పేశాడు. సత్వీందర్ వెంటనే అత్తామామల దగ్గరకు వెళితే వాళ్లు ముఖాన తలుపులు వేసేశారు. ఒక సంవత్సరం పా టు చేష్టలుడిగి ఉండిపోయిన సత్వీందర్ ఆ నిద్ర నుంచి మేల్కొని న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టింది. భర్త మీద, అత్త మామల మీద సెక్షన్ 406, 498ల కింద కేసు పెట్టింది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే నెలకు 10 వేలు మంజూరయ్యాయి. 2018లో భర్త పా స్పోర్ట్ సీజ్ అయ్యేలా చూసింది. ఇవన్నీ చిన్న విజయాలు కావు. తనలాంటి వారి కోసం ఆ సమయంలో కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర తన లాంటి వివాహితలు మరికొంత మంది కనిపించేవారు సత్వీందర్కు. ‘ఇంతమంది ఉన్నారా... వీరందరి కోసం ఏదైనా చేయాలి’ అని ‘అబ్ నహీ’ సంస్థ స్ధాపించింది. చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఇలాంటి బాధిత మహిళలను సమీకరించడం మొదలెట్టింది. ఈమె చేస్తున్న పని ఆ నోటా ఈ నోటా తెలిసి బాధితులు రావడం మొదలెట్టారు. అయితే ఇది అంత సులభం కాదు. పా రిపోయిన కుర్రాళ్ల కుటుంబాలు ఈమె చేసే నిరసన కార్యక్రమాలకు, పెడుతున్న కేసులకు ఆగ్రహించేవి. శాపనార్థాలు పెట్టేవి. తన్నబోయేవి. అయినా సత్వీందర్ జంకకుండా తన పోరాటాన్ని కొనసాగించింది. ఎన్.ఆర్.ఐ సెల్స్ ద్వారా మహిళా కమిషన్ ద్వారా బాధితులకు మద్దతు దొరికేలా చేసేది. అంతేకాదు, జాతీయ గురుద్వారా కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న గురుద్వారాలకు ఇలా పా రిపోయిన వరుల వివరాలు తెలుపుతూ తాకీదులు అందేలా చేసింది. అంటే అక్కడ ఉన్న వారి గురించి కనీసం అక్కడ ఉన్న పంజాబీలకు తెలిసేలా చేయగలిగింది. కొందరు భర్తలు ఏ దేశాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడి లీగల్ సెల్స్కు అదే పనిగా ఈ మెయిల్స్ పంపి ఫిర్యాదు చేస్తుంది. విదేశాంగ శాఖకు పదే పదే వినతి చేయడం వల్ల ఆ శాఖ కూడా రంగంలో దిగి ఇలాంటి కేసులు నమోదైన భర్తల పా స్పోర్ట్ల వివరాలను సేకరించి అవసరమైతే సీజ్ చేసే చర్యలు చేస్తోంది. ఇప్పటికి 700 మంది సత్వీందర్ సింగ్ ఇప్పటికి 700 మంది వివాహితలకు ఏదో ఒక మేర న్యాయం అందేలా చేసింది. అలాగే భర్తలను విడిచిపెట్టి ఉడాయించిన భార్యల బాధితులైన 40 మంది భర్తలకు కూడా న్యాయం అందడానికి పోరాడుతూ ఉంది. ‘భార్యను విడిచి వెళ్లిపోయిన భర్తల కేసుల్లో ఇరుపక్షాలను కూచోబెట్టి సమస్య కనుక్కుంటే చాలా కేసులు విడిపోయే దాకా వెళ్లకుండా ఆపొచ్చు. కొన్నింటిలో మాత్రం మోసగాళ్లు ఉంటారు. వారికి శిక్ష పడేలా చేయాలి.’ అంటుంది సత్వీందర్. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా బాధితులను గుర్తించి వారికి సహాయం అందేలా చేయడానికి ప్రయత్నిస్తోందామె. ‘మన పోలీసులు దేశంలో లేకుండా పోయిన వారంటే ఏమీ చేయలేము అన్నట్టు చూస్తుంటారు. కాని అలా విదేశాలకు పారిపోయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విధంగా చర్యలు ఉంటే ఎన్.ఆర్.ఐల ఆగడాలు ఆగుతాయి’ అంటుంది సత్వీందర్. పంజాబ్, హరియాణాలలో అయితే సత్వీందర్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఎందరు ఉన్నారో తెలియాల్సి ఉంది. వారి కోసం సత్వీందర్లాంటి వాళ్ల అవసరం తప్పక ఉంటుందని వేరే చెప్పాలా? -
పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో సమర దీక్ష నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. -
గట్టివాళ్లే చట్టానికి గౌరవం
నాటి పాలకులు దేశంలో ‘ఎమర్జెన్సీ విధించి, న్యాయవ్యవస్థకే సవాలుగా పరిణమించినప్పుడు... జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు యావత్తూ అచేతనంగా ఉండిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అలాంటి రోజులు ‘మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఎ.పి. షా తన తాజా వ్యాసంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పాలకులు ఇందిరాగాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని ఆ వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఇటీవల కొందరు గట్టివాళ్ళ హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగలగడం న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆర్థిక నేరాలను, దొంగచాటు ద్రవ్య లావాదేవీలను, సంబంధిత నేరాలను పసిగట్టి సాధికారికంగా బహిర్గతం చేసి.. దేశాలను, ప్రభుత్వాలను హెచ్చరించడానికి ప్రసిద్ధ న్యాయ నిపుణు లతో ప్యారిస్ కేంద్రంగా ఏర్పడి పనిచేస్తున్న ఫ్రెంచి ఎన్జీవో సంస్థ ‘షెర్పా’! యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని పౌర సమాజాల సాంఘిక సంస్కరణోద్యమాలకు ఈ సంస్థ బాసటగా నిలుస్తోంది. ఇదే నిపుణుల సంస్థ రాఫెల్ కొనుగోలు వ్యవహారంలోని చీకటి కోణాలను కూడా వెలికి తెచ్చింది. 2015 నుంచీ పనిచేస్తున్న ‘రిలయెన్స్ డిఫెన్స్ లిమిటెడ్’ కంపెనీ.. ‘దస్సాల్ట్’ అనే ఫ్రెంచి విమాన కంపెనీతో అనుసంధానమై 36 రాఫెల్ జెట్ విమానాలను భారత ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసింది. రిలయెన్స్ కంపెనీ అధిపతి అనిల్ అంబానీ 2019లో ప్రకటించిన లెక్కల ప్రకారం అప్ప టికి అతనికున్న అప్పులు రూ. 93,000 కోట్లు. కాగా, 2020లో ఒక కేసు సందర్భంగా లండన్ కోర్టులో ఆయన వెల్లడించిన తన ఆస్తి విలువ ‘సున్న’ (జీరో)! అలాంటి ‘జీరో’ ఆస్తిపరుడి కంపెనీ ద్వారా ఫ్రెంచి దస్సాల్ట్ విమాన కంపెనీ 36 రాఫెల్ జెట్ విమానాలను ఎలా అమ్మగలిగిందన్న అంశం బట్టబయలు కావడంతో, రిలయెన్స్ కంపెనీ లావాదేవీలతో ముడిపెట్టుకున్న భారతపాలకుల మెడకు చుట్టుకొంది. ప్రభుత్వం ఈ క్షణం దాకా రాఫెల్ కుంభకోణం నుంచి బయట పడకపోగా భారతదేశ ప్రయోజనాలకు హానికరమైన అంతర్జాతీయ లావాదేవీలలో కూరుకుపోయిందని ‘షెర్పా’ బహిర్గతం చేసింది. ‘షెర్పా’ సంస్థ విఖ్యాతికి రెండే రెండు ఉదాహరణలు ఒకటి: సిరియా మాజీ వైస్–ప్రెసి డెంట్ రిఫాత్ అల్ అసాద్ ‘మనీ లాండరింగ్’ కుంభకోణాలను ‘షెర్పా’ బట్టబయలు చేయడంతో అసాద్కు ప్యారిస్ కోర్టు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష వేసింది. రెండు: ఫ్రాన్స్లో టెర్రరిస్టు లకు భారీగా చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న పెద్ద కంపెనీ లఫార్గే కార్య కలాపాల్ని 2018లో బహిర్గతం చేసి కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల్ని షెర్పా రక్షించగల్గింది. రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీలకు బదులుగా.. అప్పటికే దేశీయంగా అత్యుత్తమ నాణ్యతా సేవలందిస్తున్న భారీ ప్రభుత్వరంగ విమాన సంస్థ ‘భారత హిందు స్థాన్ లిమిటెడ్’ సేవలను పాలకులు ఎందుకు వినియోగించుకో లేదన్నది ప్రధాన ప్రశ్న. దీంతోనే షెర్పా ఈ రిలయెన్స్ ఒప్పందం వెనుక ఏం జరిగిందన్నదానిపై దృష్టి సారించింది. ఈ కాంట్రాక్టులో ఎలాంటి అనుమానానికి తావులేని అవినీతి జరిగిందని, కాంట్రాక్టుపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాల్సిందేనని రాహుల్ గాంధీ కోరిన విషయమూ తెలిసిందే. కానీ, ప్రభుత్వం విచారణకు నిరాకరించడంతో, రిలయెన్స్ కంపెనీ ద్వారా కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగింది. తద్వారా అనుమానాలు ధ్రువపడ్డాయి. అందుకే ‘షెర్పా’ సంస్థ స్వతంత్రమైన న్యాయమూర్తి ద్వారానే బీజేపీ– రిలయెన్స్ సంబంధాల లోతుపాతుల్ని పరిశీలించడం దేశ ప్రయోజ నాల దృష్ట్యా అవసరమని చాలాకాలంగా కోరుతోంది. అంతేగాదు, రిలయెన్స్ ద్వారా ప్రస్తుత పాలకులు కుదుర్చుకున్న ‘రాఫెల్’ ఒప్పం దంలో అవినీతిని కనిపెట్టే ఏ క్లాజుకూ అవకాశం లేకుండా జాగ్రత్త పడటం జరిగిందని ‘హిందూ’ పత్రిక కూడా రాసిందని ‘షెర్పా’ పేర్కొంది. ఒక్క ముక్కలో ‘భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంతర్జాతీయ అవినీతి శక్తులకు ప్రతిబింబమే రాఫెల్ ఒప్పందమ’ని షెర్పా ప్రకటించింది. షెర్పాకు ఇంత బలాన్ని చేకూర్చింది ఆ సంస్థ లోని న్యాయ నిపుణులేనన్నది ఇక్కడ గమనించాలి. ఈ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, భారత లా కమిషన్ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అజిత్ ప్రకాష్ షా తాజా హెచ్చరికను కూడా భారత రాజ్యాంగ మౌలిక నిబంధనలను, సత్యాలను రక్షించుకోగోరే వారంతా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల నూతనంగా దేశ ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చిన జగదీప్ ధంకర్, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ భారత సుప్రీం కోర్టుపైన, కొలీజియం వ్యవస్థ పైన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి భారత మౌలిక రాజ్యాంగ వ్యవస్థ రక్షణకు దోహదం చేసిన సూత్రాలను కూడా విస్మరించి దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే ప్రశ్నించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని జస్టిస్ షా ఖండించాల్సి వచ్చింది. ‘‘ఈ ధోరణి 2014 నుంచీ సాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగ పరిరక్షకురాలు, చట్టాన్ని శాసించే శక్తి అని మరువరాదు’’ అని జస్టిస్ షా పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ విధించి, దేశ న్యాయ వ్యవస్థకే సవాలు విసరడానికి పూనుకున్నప్పుడు, పౌర హక్కులు తుడిచిపెట్టుకు పోతున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు అలా చూస్తూ ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి రోజులు మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’’ అని జస్టిస్ షా గుర్తు చేయవలసి వచ్చింది. ప్రస్తుత పాలకులు ఇందిరా గాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని జస్టిస్ షా తాజా వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘2014 తర్వాత దేశంలో ‘లోక్పాల్’ వ్యవస్థ కనుమరుగు అయి పోయింది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ నేడు కనపడదు. ఉన్న విచారణ సంస్థలు పేరుకే! పైగా వాటిని ఇప్పుడు ప్రభుత్వ చర్యలను విమర్శించి లేదా నిరసన తెలిపే ప్రజా కార్య కర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగి స్తున్నారు’’ అని జస్టిస్ షా పేర్కొన్నారు. రానురాను కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజీపడే దుఃస్థితికి చేరిందని, ఇక సమాచార కమిషన్ కూడా జీవచ్ఛవం అయిందనీ, ఇలా బాధ్యతలు చాలించుకున్న సంస్థల జాబితా పెరిగిపోతోందని, చివరికి పత్రికలు, పౌర సంస్థల కార్యకలాపాల్ని కూడా బలహీన పరిచి విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడం జరుగుతోందనీ జస్టిస్ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దేశ పాలక వర్గ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జస్టిస్ ఎ.పి. షా ఘాటుగా విమర్శించారు. ఎటుతిరిగీ ఇటీవల ప్రధాన న్యాయమూర్తులుగా పదవులు స్వీకరించిన జస్టిస్ ఎన్.వి. రమణ, లలిత్, డి.వై. చంద్రచూడ్ల హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగల్గుతోందని జస్టిస్ షా చెబుతూ తన నమ్మకాన్ని ఇలా ప్రకటించారు: ‘‘నేడు సుప్రీంకోర్టు మంచి న్యాయ మూర్తుల చేతులలో ఉంది. పాలకుల ఒత్తిళ్లకు లొంగకుండా వారు పనిచేస్తున్నారు. అప్పటికీ పాలకులు దారికి రాకపోతే, దేశ చట్టాన్ని గౌరవించి తీరాలని వారికి తెలియచెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికీ ఇదే మార్గం’’ అని జస్టిస్ షా దిశానిర్దేశం చేశారు. ఈ సదవగాహన దృష్ట్యా చూస్తే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన మరుక్షణం నుంచీ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, ఆయన సోదర న్యాయమూర్తులు.. ‘దేశంలో పౌరుల స్వేచ్ఛ, తదితర హక్కులకు న్యాయ స్థానాలే రక్ష అని పురుద్ఘాటించారని భావించాలి. ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ వచ్చి భారత ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న సమాచార హక్కు చట్టాన్ని గత ఎనిమిదేళ్లుగా పాలకులు చాపచుట్టి పక్కన పడేశారన్న విమర్శ ఉంది. ఆ చట్టాన్ని తు.చ. తప్పక సద్వినియోగం చేసిన పర్యవ సానంగా పాలకుల ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఒక జాతీయ కమిషనర్.. ‘సమాచార హక్కు కోసం’ ప్రజలు జరిపిన పోరాటాలు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా తన బాధ్యతను కాపాడుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భంలో.. యాభై ఏళ్ల క్రితం ఒక సన్మాన సభలో మహాకవి కృష్ణశాస్త్రి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘మనిషితో ఎడతెగని సావాసమూ, ప్రేమిస్తే ఆనందం, దూరమైతే బాధతో కొట్టుకు పోవడం – ఇవే నాకు తెలుసు. ఇది నా మతం, నాకిక వేరే మతం లేదు, కులం అసలే లేదు. నేను మనిషిని’’ అని ఈ లోకంలో ఎంతమంది చాటుకోగలరు?! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు
పుణె: 43 ఏళ్ల వ్యక్తి ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్క్వార్టర్స్లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు. అతని గర్లఫ్రెండ్ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఐతే క్యాబినేట్ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #Maharashtra: प्रेमिका को न्याय दिलाने के लिए प्रेमी ने लगाई छठी मंजिल से छलांग, नेट पर गिरने से बची जान#Mantralaya #Mumbai #WATCH #viralvideos2022 pic.twitter.com/c8dsn5Aufd — VDTV Bharat (@vdtv_bharat) November 18, 2022 (చదవండి: కాలేజీ ర్యాగింగ్లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!) -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి
శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ (ఐఎస్బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్ రాక్’ వంటి కమర్షియల్ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, వాటివల్ల భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు. మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్– మ్యాట్రిసెస్నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం. శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్–19 బెయిల్ అవుట్ ఫండ్’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్ ప్లాంట్’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు. ‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్ఎఫ్ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) - డా. ఎమ్. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా.. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిర్ ఆంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. షా అస్వస్థత వార్త తెలియగానే.. సుప్రీంకోర్టు అధికార వర్గాలు హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్ఆంబులెన్స్లో హుటాహుటిన తరలించాయి. అయితే తాను బాగానే ఉన్నానని, రేపో ఎల్లుండో పూర్తిగా కోలుకుంటానని ఆయన చెప్తుండగా.. ఓ షార్ట్ వీడియో బయటకు వచ్చింది. జస్టిస్ షా గతంలో గుజరాత్ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు. ఆపై పాట్నా హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. 2018లో ఆయన్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేశారు. మే 15, 2023న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. I am stable. There is nothing to worry. I will be reaching Delhi soon. By day after tomorrow, I will be better: Justice MR Shah (Source: Justice Shah's office) pic.twitter.com/zpH6xTInhc — ANI (@ANI) June 16, 2022 -
చెల్లెని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు పయనం
-
చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు..
సాక్షి, ఖమ్మం: చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానానికి బయలుదేరాడు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం బోనకల్కు చేరుకోగా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు. అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరగా, బోనకల్లో పలువురు సంఘీభావం ప్రకటించారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
పెరరివాళన్.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో
చెన్నై: సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన పెరరివాళన్ను తాను కలవాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ చెప్పారు. అతడు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 1999లో ఏజీ పెరరివాళన్కు మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ కేటీ థామస్ నేతృత్వం వహించారు. ‘పెరరివాళన్ను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే, దయచేసి నన్ను కలవండి’ అంటూ కేరళలోని కొట్టాయంలో ఉన్న తన నివాసం నుంచి ఆయన ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’తో మాట్లాడారు. ‘సుదీర్ఘ కారాగారవాసం తర్వాత 50 సంవత్సరాల వయస్సులో జైలు నుంచి విడుదలైన అతడితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమను మాత్రమే పొందాడు. వైవాహిక జీవితాన్ని అతడు గడపలేదు. తన ప్రియమైన వారితో అతడు సంతోషంగా జీవించాలి. పెరరివాళన్ను జైలు నుంచి బయటకు తీసువచ్చిన ఘనత అతడి తల్లి (అర్పుతం అమ్మాల్)కి దక్కుతుంది. ఈ ఘనతకు ఆమె సంపూర్ణంగా అర్హురాల’ని జస్టిస్ కేటీ థామస్ పేర్కొన్నారు. (చదవండి: ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం) రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు 23 ఏళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2013లో జస్టిస్ కేటీ థామస్ వ్యతిరేకించారు. దీంతో 2014లో ముగ్గురు దోషుల మరణశిక్షలను మారుస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిని ఉరితీయడం అంటే ఒక నేరానికి రెండు శిక్షలు అమలు చేసినట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాదు దోషుల పట్ల ఉదారత చూపాలని అప్పట్లో సోనియా గాంధీని వేడుకున్నారు. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు మంత్రివర్గ ప్రతిపాదనను గవర్నర్ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. యావజ్జీవ కారాగార శిక్ష మొత్తం జీవితకాలానికి సంబంధించిదైనప్పటికీ.. భారత రాజ్యాంగం ఉపశమనాన్ని అనుమతిస్తుంది అని జస్టిస్ థామస్ అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సేకు 14 సంవత్సరాల తర్వాత ఉపశమనం లభించిందని.. అతనితో పాటు జీవిత ఖైదులో ఉన్న ఇతర దోషులందరినీ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ‘జైలు నుంచి విడుదలైన తర్వాత గోపాల్ గాడ్సే జీవితాన్ని చూడండి. అతడు పూర్తిగా మారిపోయాడు. పుస్తకాలు కూడా రాశాడు. మహాత్మా గాంధీ హంతకులను విడుదల చేసి.. వారిలో పరివర్తన తేవడానికి అనుమతించారు. మరి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఎందుకు సంస్కరించకూడద’ని థామస్ ప్రశ్నించారు. పెరరివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. (చదవండి: పెరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ) -
నిందితులు చిక్కినా న్యాయం జరగట్లే!
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’... ఇన్సూరెన్స్ ఫాడ్స్ర్ చేసిన త్రయం విషయంలో ఈ ఆంగ్ల నానుడి సరిగ్గా సరిపోతుంది. నగరానికి చెందిన ఇద్దరు వృద్ధులను టార్గెట్గా చేసుకున్న ముగ్గురు నిందితులు రూ.6.74 కోట్లు కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తొలి కేసు నమోదైన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులనూ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు మోసం సొత్తుతో స్థిర, చరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తోంది. ఈ రెండు కేసులూ మోసాన్ని సూచించే ఐపీసీలోని 420 తదితర సెక్షన్లతో నమోదు కావడంతో ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. పక్కాగా స్కెచ్ వేసి స్వాహా... కుత్భుల్లాపూర్లో నివసిస్తున్న పుల్లేటి సుబ్రహ్మణ్యం, బీరంగూడ వాసి ఉడుత మనోజ్కుమార్, గుర్రంగూడకు చెందిన బండారి మహేష్ గౌడ్లతో కూడిన ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పథకం వేసింది. వివిధ కంపెనీలకు చెందిన పాలసీ హోల్డర్ల ఫోన్ నంబర్లు సేకరించి ప్రధానంగా వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారికి నమ్మకం కలిగించి నిండా ముంచింది. నగరానికి చెందిన ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.6.74 కోట్లు నగదు రూపంలో తీసుకుని నకిలీ బాండ్లు అంటగట్టి మోసం చేసింది. తన కుమారుడు విదేశాల నుంచి వచ్చి గుర్తించే వరకు ఒక బాధితుడు, వీరి అరెస్టు విషయం పత్రికల్లో చూసే వరకు మరో బాధితుడు తాము మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి... మొదటి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆపై న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే మోసం సొమ్మును ముగ్గురూ పంచుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యం తన స్వస్థలమైన గుడివాడలోని ఎస్ఎన్ పురంలో రూ.60 లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించాడని, కుత్భుల్లాపూర్లో రూ.కోటితో ప్లాట్ కొన్నాడని, తన కుమార్తె పేరుతో రూ.1.5 లక్షలు పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడని తెలుసుకున్నారు. మనోజ్కుమార్ బీరంగూడలో రూ.70 లక్షలతో ఫ్లాట్ ఖరీదు చేయగా, మహేష్ తన వివాహానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు భార్యకు పది తులాల బంగారం, తమ కోసం ఓ కారు ఖరీదు చేసుకున్నట్లు గుర్తించారు. స్వాధీనానికి ఆస్కారం లేకపోవడంతో... విలాసాలకు అలవాటుపడిన వీరు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. వృద్ధుల నుంచి కొట్టేసిన సొమ్ముతోనే ఇవన్నీ చేశామంటూ వారు అంగీకరించినా... పోలీసులకు ఆధారాలు లభించినా వాటి జోలికి వెళ్లే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు ఐపీసీలోని 420 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. కేవలం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద నమోదైన వాటిలోనే ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం వర్తించాలంటూ నిందితులు బాధితుల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుని ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ నేరం ఆ తరహాకు చెందినది కాకపోవడంతో అలా చేసే వీలులేదు. దీంతో ఈ వివరాలతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు న్యాయస్థానానికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండో కేసులో వీరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. అనివార్యంగా మారిన చట్ట సవరణ... కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు అనేక మోసాల కేసుల్లో బాధితుల పరిస్థితి ఇలానే ఉంటోంది. నిందితులు అరెస్టు అయినా వారికి న్యాయం అందడం లేదు. ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలతో ముడిపడి ఉన్న మోసాల కేసుల ‘విలువ’ ఇప్పుడు రూ.కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. కేవలం పోలీసు విభాగంలోనే కాకుండా ఆయన డిప్యుటేషన్పై పని చేసిన ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల్లోనూ అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన మార్కు చూపించారు. ఈ విషయంలోనే ఆయన స్పందించి భారీ మొత్తాలతో ముడిపడి ఉన్న మోసం కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకునేలా సవరణకు ప్రతిపాదించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మోసగాళ్లకు కళ్లెం పడటంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. (చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్) -
వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ పుష్ప రాజీనామా
ముంబై: బాలలపై లైంగిక దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకెక్కిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా గురువారం రాజీనామా చేశారు. దానికి వెంటనే ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం లైంగిక దాడి కావంటూ 2021 ఫిబ్రవరిలో పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని తాకితే మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణనలోకి వస్తుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సులను అప్పట్లో సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. అది శుక్రవారంతో ముగియనున్నా పొడిగింపు గానీ, పదోన్నతి గానీ ఇవ్వలేదు. ఆమె పదవిలో కొనసాగితే శుక్రవారం నుంచి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పని చేయాల్సి వచ్చేది. -
Yogita Bhayana: కింగ్ఫిషర్ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’
ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా)’ అనే ఎన్జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది. చిన్నప్పటి నుంచి యాక్టివ్ యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం మీద ఏర్పడిన క్రేజ్తో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె. కట్టిపడేసిన సంఘటన ‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్ చారిటబుల్ ఫౌండేషన్ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. సేవామార్గంలో మలుపు నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది. పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్ కీపింగ్ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత. छात्रों की समस्या का समाधान किया जाए. पिछले एक साल से सिर्फ एक मौके की मांग कर रहे छात्रों के साथ न्याय जरूरी है. #UPSCExtraAttempt EXTRA ATTEMPT FOR ALL pic.twitter.com/C9Umb146jp — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 1, 2021 -
యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్గా ఉందో ఈ ఏనుగు!!) అయితే శ్రవణ్ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
పంజాబ్ యువతికి న్యాయం చేయించండి.. పవన్కల్యాణ్కు గుడి కడతా
హైదరాబాద్: పంజాబ్కు చెందిన ఓ యువతి తెలుగు సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆ ప్రముఖ వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించి, ఎవరికి చెప్పవద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారట.. అని తెలిపారు. సినీనటుడు పవన్కల్యాణ్ ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన పంజాబ్ అమ్మాయి పేరు పవన్కల్యాణ్ చెవిలో చెబుతానన్నారు. ఆ అమ్మాయి పేరు మీడియాకు చెప్పి, ఆ ప్రముఖ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే ఆయనకు గుడి కడతానని చెప్పారు. ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తే పవన్ ముందు జగన్ కుడా పనికిరారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి అండదండలు అందించకపోతే పవన్కల్యాణ్కు ఎవరినీ ప్రశ్నించే అర్హతలేదని చెప్పారు. పోసాని ఇంకా ఏమన్నారంటే.. జగన్తో పోల్చుకోవద్దు పవన్ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు. పవన్.. మీరు జగన్తో పోల్చుకోవద్దు. జగన్ రాకముందు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి. పవన్ ఏ పార్టీతో సరిగ్గా ఉన్నావు. ఏ పార్టీని మిగిల్చావు. చిరంజీవి సంస్కారవంతుడు, గొప్ప మానవతావాది. ఆయన నోట ఎప్పుడైనా బ్యాడ్ మాట విన్నారా? చిరంజీవిగారి ఇంట్లో ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు? నీకు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలియదు. పవన్ తనే ప్రశ్నిస్తాడు, తానే జవాబు చెబుతాడు. జగన్ని, మంత్రుల్ని తిట్టాల్సిన అవసరమేంటి? రిపబ్లిక్ ఫంక్షన్కు వచ్చి సీఎం జగన్ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయని జగన్ను తిడుతున్నావు? ఆన్లైన్లో టికెట్ల అమ్మకంతో నీకేంటి సంబంధం. జగన్కు మత, కుల పిచ్చి ఉందని నిరూపించగలవా? ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లకపోయినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడి గెలిచారా. బాధ్యతతో మెలుగు చంద్రబాబు పరిపాలనలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా? ఎస్సీలుగా ఎవరూ పుట్టాలనుకోరు.. నాయీబ్రాహ్మణుల తోకలు కట్చేస్తా.. అని అన్న చంద్రబాబును నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు పవన్కల్యాణ్. ఎమ్మార్వో వనజాక్షిని అవమానించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు..’అని పోసాని కృష్ణమురళి నిలదీశారు. చంద్రబాబు మంచి చేస్తే చేశాడని, చెడుచేస్తే చెడు అని తాను చెప్పానన్నారు. మోదీని కూడా మిమిక్రీ చేసిన పవన్కల్యాణ్ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ బీజేపీతో కలిశాడని చెప్పారు. హిందూ నాయకులను తిడతారన్నారు. ఒక కులం గురించి రాజకీయాలకు రాలేదన్న పవన్ మొన్న కాపుల గురించి ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. పవన్కల్యాణ్ నువ్వు మారవని తెలుసు.. బాధ్యతతో మెలుగు.. అని పేర్కొన్నారు. -
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
పోలీసుల నుంచి ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్/మక్తల్: ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2019, డిసెంబర్ 6న జరిగిన ఎన్కౌంటర్ ముందు, తర్వాతి సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారిని కమిషన్ వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ దర్యాప్తు అధికారి సురేందర్రెడ్డిని త్రిసభ్య కమిటీ లోతుగా ప్రశ్నించారు. ‘దిశ’సోదరిని కూడా విచారణ కమిషన్ చైర్మన్, సభ్యులు విచారించారు. ‘దిశ’ఫోన్ సంభాషణ, ఇతరత్రా వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. అలాగే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణుక.. శుక్రవారం త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో వారిని హైకోర్టు ఆవరణలోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్.. వారి నుంచి సమాచారాన్ని, సాక్ష్యాలను సేకరించింది. ఊర్లో ఉన్నా.. హైదరాబాద్లో ఉన్నా.. తమకు పోలీసుల నుంచి ప్రాణహాని, బెదిరింపులు వస్తున్నాయని నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. లాడ్జ్ నుంచి బలవంతంగా.. వాస్తవానికి కమిషన్ విచారణ ఈనెల 26 (గురువారం)న ఉండటంతో నిందితుల కుటుంబసభ్యులు బుధవారం రోజునే హైదరాబాద్కు చేరుకొని కాచిగూడలోని ఓ లాడ్జ్లో దిగారు. ‘దిశ’కేసు నిందితుల తల్లిదండ్రులు లాడ్జ్లో ఉన్నా రని తెలుసుకుని కొందరు పలుమార్లు అక్కడికి వచ్చారని శివ తండ్రి రాజప్ప విలేకర్లకు తెలిపారు. హోటల్ యజ మాని తనకు తెలియదని పలుమార్లు చెప్పినా వినకుండా రాత్రి సమయంలో ఫోన్ చేసి బెదిరించారన్నారు. భయాం దోళనకు గురైన హోటల్ యజమాని గురువారం రాత్రి తమను బలవంతంగా ఖాళీ చేయించారని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఓ న్యాయవాది ఇంట్లో తలదాచుకున్నామని చెప్పారు. కాగా, విచారణ అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను బందోబస్తు మధ్య నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు తీసుకెళ్లి వారి వారి ఇళ్లలో పోలీసులు విడిచిపెట్టారు. -
దిశ ఎన్కౌంటర్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్/మక్తల్: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నేడు విచారించనుంది. గురువారమే విచారణ జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. ఇదిలాఉండగా..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని నిందితుల కుటుంబసభ్యులు బుధవారం కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అద్దె ఇంట్లో.. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్కుమార్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రా జప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణు కలు బుధవారమే ఇళ్ల నుంచి వెళ్లిపోయారని.. రెం డురోజుల నుంచి హైదరాబాద్లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే వీరిని విచారణకు హాజరుకావొద్దని పోలీసులు బెదిరిస్తున్నారని జొళ్లు రాజప్ప ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 21న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు దేవరకద్ర రోడ్ వద్ద బస్సుకోసం నిలబడగా..నంబరుప్లేటు లేని ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించగా..రోడ్డు కిందికి దిగిపోవటంతో దగ్గరకొచ్చి బెదిరించారని తెలిపారు. కేసువాపసు తీసుకోకపోతే చింతకుంట కుర్మప్ప (చెన్నకేశవులు తండ్రి)కు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారని ఆరోపించారు. -
జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు యుగేందర్ గౌడ్, క్రాంతికుమార్, శ్రీనివాస్, విక్రమ్గౌడ్, శ్యామ్, నరేశ్, శ్రీనివాస్గౌడ్, రంగనాథ్, విజయ్, సాయితేజ తదితరులున్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు. -
ఇది ఘోరం, దారుణం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన సెక్షన్ ప్రకారం.. కేసులు నమోదు కావడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నెటిజన్ల స్వేచ్ఛను హరించేదిగా ఉన్న ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఏను అప్పట్లో కోర్టు తప్పుబట్టింది. అలాంటి సెక్షన్ మీదే ఇప్పుడు వెయ్యి దాకా కేసులు నమోదు కావడం పట్ల కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే మార్చి 10, 2021నాటికి ఈ సెక్షన్కు సంబంధించి 745 కేసులు నమోదు అయ్యాయని, కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి నిందితులు శిక్షలు అనుభవిస్తున్నారని ఓ ఎన్జీవో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ సెక్షన్కు సంబంధించి దేశంలోని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించింది కూడా. ‘‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. అది దాదాపుగా రద్దు చేయబడిన సెక్షన్. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తాం’’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక జస్టిస్ నారీమణ్ ఈ వ్యవహారాన్ని ‘ఘోరం.. దారుణం’ అని పేర్కొన్నారు. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో ఈ మేరకు పిటిషన్ దాఖలుచేయగా.. పరిశీలించిన ధర్మాసనం తప్పకుండా నోటీసులు జారీ చేస్తాం అని పేర్కొంది. సెక్షన్.. దుమారం సోషల్ మీడియాలో నెటిజన్స్ను నియంత్రించే పేరుతో 2008లో చట్టాన్ని సవరించి 66ఎ సెక్షన్ చేర్చారు. ఐటీయాక్ట్లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే 2012లో ముంబైలో ఇద్దరు యువతుల అరెస్ట్ ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది. 2012లో శివసేన చీఫ్ బాల్థాక్రే మరణం తర్వాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పుబడుతూ.. పాల్గఢ్కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మార్చి 24, 2015 నాడు పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. -
ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్గా జస్టిస్ వి.కనగరాజన్
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్గా జస్టిస్ వి.కనగరాజన్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. చదవండి: గుట్టురట్టు: కవర్ను లాగితే నకిలీ తేలింది.. స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. -
కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న వ్యక్తి నామినేట్
టొరంటో: కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న న్యాయమూర్తి జస్టిస్ మొహ్మద్ జమాల్ను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నామినేట్ చేశారు. కెనడా సుప్రీం కోర్టుకు నామినేట్ అయిన మొదటి శ్వేతేతర వ్యక్తి జమాల్ కావడం విశేషం. ప్రస్తుతం పదవీ విర మణ చేయనున్న రోసాలీ సిలబెర్ మాన్ అబెల్లా స్థానంలో జమాల్ తన విధులు నిర్వర్తి స్తారని ట్రూడో స్పష్టం చేశారు. దేశ ఉన్నత న్యాయస్థానంలో జమాల్ తన విధు లను చక్కగా నిర్వర్తిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆయన్ను నామినే ట్ చేయడం కూడా సంతోషంగా ఉందని చెప్పారు. జమాల్ 1981లో కెన్యాలో పుట్టినప్పటికీ, ఆయన మూలాలు భారత్లో ఉన్నాయి. చదవండి: ఇరాన్లో ఎలక్షన్.. హైదరాబాద్లో ఓటింగ్ -
'లాడ్జికి తీసుకెళ్లి..వీడియోలు తీసి'.. ఎస్పీని కలిసిన కరాటే కల్యాణి
సాక్షి, నగరంపాలెం: హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ సినీ సహాయ నటి కరాటే కల్యాణి, బాధితురాలు బుధవారం గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలి కథనం మేరకు.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత యువతి వయోలిన్ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా, అక్కడకు తషీఫ్ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకు కర్నూల్ జిల్లాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. యువతికి ఇష్టం లేకుండానే ముస్లిం సంప్రదాయంలో మళ్లీ వివాహం చేశారు. అత్తింటివారు బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చదవండి : (వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!) (రాసలీలల కేసు: ఎవరి ఖాతాలో ఎంత ఉంది?!) -
సుప్రీంకోర్టు: నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు..
న్యూఢిల్లీ: జస్టిస్ ఇందు మల్హోత్రా తాజాగా పదవీ విరమణ పొందడంతో సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఒకే ఒక మహిళా జడ్జి మిగిలారు! మూడేళ్ల క్రితం ఇందిరా బెనర్జీ చేరికతో సుప్రీం కోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు (అప్పటికే ఉన్న జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కలిపి) ఉండటం పెద్ద విశేషం అయింది. గత ఏడాది జూలైలో జస్టిస్ భానుమతి రిటైర్ అయ్యారు. ఇప్పుడు జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జస్టిస్ ఇందిర ఒక్కరే ఉన్నారు! నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు. అరుదైన ఖగోళ అద్భుతంగా మూడేళ్ల క్రితం ఒక విశేషం వార్తల్లోకి వచ్చింది. ‘జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అడుగు పెట్టడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లయింది’ అన్నది ఆ విశేషం. 2018 ఆగస్టున సుప్రీం కోర్టుకు వచ్చారు జస్టిస్ ఇందిర. మిగతా ఇద్దరు జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా. గత జూలైలో భానుమతి, మొన్న శనివారం ఇందూ మల్హోత్రా రిటైర్ అయ్యారు. ఇక మిగిలింది ఇందిరా బెనర్జీ ఒక్కరే. జస్టిస్ మల్హోత్రా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘యంగ్ లాయర్స్ ఫోరమ్’ ఆమెకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య పెరగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాజాగా పదవీ విరమణ పొందిన జస్టిస్ ఇందూ మల్హోత్రా బార్ కౌన్సిల్ నుంచి నేరుగా జడ్జి అయిన తొలి మహిళా జస్టిస్. సుప్రీంకోర్టులో ఆమె 30 ఏళ్లు పాక్టీస్ చేశారు. ప్రస్తుతం మిగిలిన ఏకైక మహిళా జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టులో చరిత్రలో 8 వ మహిళా న్యాయమూర్తి. వచ్చే సెప్టెంబరులో జస్టిస్ ఇందిర పదవీ విరమణ పొందేలోపు కొత్త మహిళా న్యాయమూర్తి రాకపోతే ఆమె తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులే కనిపించని పరిస్థితి ఉంటుంది. భారత సుప్రీంకోర్టు ఏర్పాటైన (1950) నలభై ఏళ్లకు 1989 అక్టోబరులో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టుకు తొలి మహిళా జడ్జిగా వచ్చారు. 1992 ఏప్రిల్ వరకు ఉన్నారు. జస్టిస్ ఫాతిమా తర్వాత జస్టిస్ సుజాత మనోహర్ (1994–1999), జస్టిస్ రుమాపాల్ (2000–2006), జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా (2010–2014), జస్టిస్ రంజనా దేశాయ్ (2011–2014), జస్టిస్ భానుమతి (2014–2020), జస్టిస్ ఇందూ మల్హోత్రా (2018–2021) సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులుగా సేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో పనిచేశారు. -
కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!
కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్పూర్కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్పూర్కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్పూర్కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది. -
చట్ట పరిమితులు దాటిన ‘న్యాయం’
తనపై సంవత్సరాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చిన వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అత్యంత అసహ్యకరమైనదిగానే భావించాల్సి ఉంటుంది. సాక్షాత్తూ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనమే అత్యాచార నేర చర్యను చట్టవిరుద్ధంగా మాఫీ చేయవచ్చని, రాజీ కుదుర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, తాము అత్యాచారం చేసిన మహిళలను పెళ్లి చేసుకుంటే చాలు తమకు క్షమాభిక్ష లభిస్తుందనే ప్రమాదకర సంకేతాలు లైంగిక నేరస్తులకు అందటం ఖాయం. మైనారిటీ తీరని బాలికపై అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టుకు ఆమెను పెళ్లాడతావా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రతిపాదించిన క్షణంలో మన దేశంలో కొనసాగుతున్న పితృస్వామిక దురభిప్రాయాలు, స్త్రీ ద్వేషం పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యాయనే చెప్పాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించింది ఎవరినో కాదు.. లైంగిక దాడుల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం 2012, భారతీయ శిక్షా స్మృతిలోని 376, 417, 506 సెక్షన్ల కింద అత్యాచారం, నేరపూరితంగా బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులున్న నిందితుడికి సుప్రీం చీఫ్ జస్టిస్ ఈ విధమైన ప్రతిపాదన చేశారు. తన సమీప బంధువైన బాధితురాలి ఇంట్లోకి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించిన నేరస్థుడు ఆమె కాళ్లు చేతులను కట్టివేసి తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది. ఆమె 12వ తరగతిలోకి వచ్చేంతవరకు ఆమెను అతగాడు పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగిస్తానని బెది రించి మరీ ఈ పనికి పాల్పడ్డాడు. పైగా ఈ ముష్కరుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని మరీ ఆమెను అనుసరిస్తూ సజీవ దహనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ భయానక నేరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు గానీ ఆమె తల్లిదండ్రులకు తెలీలేదు. చదువులేని ఆ బాధితురాలి తల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని వెళితే, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా ఆమె కుమార్తెకు, నిందితుడికి మధ్య పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్టాంప్ పేపర్పై కన్నతల్లి చేత సంతకం పెట్టించుకున్నారు. పైగా ఆ అమ్మాయికి మైనారిటీ తీరాక తన కొడుకు ఆమెను పెళ్లాడతాడని నిందితుడి తల్లి హామీ ఇచ్చింది. కానీ హామీని నింది తుడు భంగపరిచిన తర్వాతే పోక్సో చట్టం కింద అతగాడిపై ఫిర్యాదు నమోదు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ని బాంబే హైకోర్టు కొట్టివేశాక నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెషన్స్ జడ్జి అహేతుకంగా, యథేచ్ఛగా, చంచలత్వంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాంబే హైకోర్టు పేర్కొనడమే కాకుండా, న్యాయవ్యవస్థ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించారంటూ సెషన్స్ జడ్జిని అభిశంసించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో నిందితుడితో చీఫ్ జస్టిస్ చేసిన సంభాషణను పరిశీలించవలసి ఉంటుంది. ఈ కేసులో నిందితుడి తరపు లాయర్తో మాట్లాడిన చీఫ్ జస్టిస్ ‘బాధితురాలిని పెళ్లాడాలనుకుంటే మేము నీకు సాయం చేస్తాం. అలా కాకుంటే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆ అమ్మాయిని వేధించావు, అత్యాచారం చేశావు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు నీవొక ప్రభుత్వ ఉద్యోగివి అనే విషయం ఆలోచించాల్సి ఉండిందని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దానికి నిందితుడు స్పందిస్తూ, ప్రారంభంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె వ్యతిరేకించిందని, ఇప్పుడు తనకు పెళ్లయింది కాబట్టి ఆమెను పెళ్లాడలేనని సమాధానమిచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు నిందితుడు తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అతడిపై విధించిన అరెస్టు ఆదేశంపై నాలుగువారాల పాటు స్టే విధించింది. పెళ్లి-సాంత్వన, శిక్ష, మినహాయింపు తనపై సంవత్సరాలుగా అత్యాచారం సల్పిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చడమే కాకుండా, ఆ వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా రాజ్యాంగంపై, లైంగిక సమానత్వం అనే మానవ విలువపై విశ్వాసం ఉంచుకున్న ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అసహ్యకరమైనది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలు అంతకాలం అనుభవించిన బాధ, మానసిక అఘాతం, అవమానం, ఆగ్రహం వంటివన్ని మంత్రించినట్లుగా మాయమైపోతాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భావిస్తున్నారా? నిందితుడి తల్లి తన కుమారుడితో పెళ్లికి ఒప్పుకోవాలని బాధితురాలి తల్లికి చేసిన ప్రతిపాదనను ఆమె ఆమోదించాల్సి వచ్చింది అంటేనే దాన్ని మహిళను నియంత్రిం చడానికి పితృస్వామిక ఆధిపత్యపు విషాద వ్యక్తీకరణగానే చూడాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మహిళను లొంగదీయడానికి పరువు, అవమానాలను మన సమాజం నేటికీ ఆయుధాలుగా ఉపయోగి స్తోంది. ఈ కేసులో బాధితురాలు ఆనాటికి మైనర్గా ఉంటున్నందున ఆమె సమ్మతి తీసుకోవడం అనేది సమస్యే కాదు. కన్నకూతురిని బలాత్కరించిన వ్యక్తితో పెళ్లికి కన్నతల్లి ఆమోదం తెలపడం మన దేశ అమ్మాయిలపై తల్లిదండ్రులకు ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. మహిళ శరీరంపై అధికారం ఎవరిది? తనపై అత్యాచారం చేసిన నిందితుడిని పెళ్లాడాల్సిందిగా బాధితురాలిని తాను బలవంతపెట్టలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి మానసిక స్థితిని అంచనా వేయడానికి ముందే నిందితుడికి ఇలాంటి ప్రతిపాదన చేయడమే వింత. ఒకవేళ నిందితుడు బాధితురాలిని పెళ్లాడటానికి అంగీకరించి ఉంటే, తర్వాతైనా బాధితురాలి అభిప్రాయాలను, సమ్మతిని న్యాయస్థానం తెలుసుకుని ఉండేదా? తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తితో సంబంధంలోకి వెళ్లడం అనే భావననే బాధితురాలు సహించలేదని, తిరగబడుతుందని న్యాయమూర్తులకు తెలీదా? అందులోనూ శారీరకంగా, భావోద్వేగపరంగా తనపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించిన విషయం ఇది. బాధితురాలికి రేపిస్టుతోనే పెళ్లి చేయడం ద్వారా ఆమెకు కనీస ప్రమాణాలతో కూడిన పవిత్రతను కలిపించడం అంటే తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో జీవితకాల సంబంధాన్ని వ్యవస్థాగతంగా ఏర్పర్చడంలోని భయానకమైన స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదా? దెబ్బతిన్న మహిళలకు ఉత్తమ ప్రయోజనాలు కలిగించడానికే తాను పనిచేస్తున్నానని ఉన్నత న్యాయస్థానం నిజంగా నమ్ముతోందా? దీన్ని మరోలా చూద్దాం. నీ శరీరంపై నీ హక్కును ఉల్లంఘించారు. కానీ నీ సొంత ప్రయోజనం కోసమే నీ శరీరాన్ని నీ సమ్మతి లేకుండా పాశవికంగా, బలవంతంగా తాకి బలాత్కరించిన వ్యక్తే నీ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నేను హామీ ఇవ్వగలను, నిన్ను తన భార్యగా స్వీకరించి దయదల్చడం ద్వారా నిందితుడు నీకు కలిగిన నష్టాన్ని పూడ్చగలడు అనే అంశాన్ని న్యాయస్థానం ఈ కేసులో సూచిస్తోందా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం ప్రకటించిన వేలాదిమంది లైంగిక సమానత్వ ఉద్యమకారులు చీఫ్ జస్టిస్ బాబ్డేకి బహిరంగ లేఖ రాస్తూ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయన వెంటనే తన పదవినుంచి దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో జడ్జీలు స్వేచ్ఛగా ఇలాంటి అసంబద్ధ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు, లైంగిక న్యాయం, సమానత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైన విలువలను పాటించే, అమలు చేసే శక్తి మన న్యాయమూర్తులకు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్. దేవిక, న్యాయవాది, చెన్నై (ది వైర్ సౌజన్యంతో) -
కులాంతర వివాహం..మనస్తాపంతో ఆత్మహత్య!
జమ్మికుంట(హుజూరాబాద్): భర్త ఆత్మహత్య చేసుకోగా కూతురికి న్యాయం చేయాలని ఓ వివాహిత తన అత్తింటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణ కాలనీకి చెందిన దాస్యపు సాయిచైతన్య, మునిగంటి మమత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. సాయిచైతన్య కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ అతన్ని వదిలేసి కరీంనగర్లో ఉన్నారు. ఈ క్రమంలో చిన్నచిన్న గొడవలు జరిగి, మమత కూడా సాయిచైతన్యను వదిలేసి, కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఒంటరైన అతను గత డిసెంబర్లో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి మృతుడి తల్లిదండ్రులు కృష్ణ కాలనీలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా తాను భర్త ఇంట్లోనే ఉంటానని, తన కూతురికి న్యాయం చేయాలంటూ మమత కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వారి ఇంటి ఎదుట బైఠాయించింది. సాయిచైతన్య తల్లిదండ్రులు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ప్రవీణ్రాజ్ తన సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని సూచించినా ఆమె వినలేదు. దీంతో సాయిచైతన్య తండ్రిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. సాయిచైతన్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసు నమోదు చేశామని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విచారణ చేపట్టి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. -
వివాదాస్పద తీర్పులు: ప్రమోషన్కు ఎసరు
న్యూఢిల్లీ: బాలికలపై లైంగికదాడి కేసులో వివాదాస్పద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేదివాలా. ఆ తీర్పులే ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పదోన్నతి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప మరో ఏడాదిపాటు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఈ మేరకు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లు. ఈ లెక్కన జస్టిస్ పుష్ప అదనపు న్యాయమూర్తి పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా ఆమెకు పదోన్నతి కల్పించాలి. కానీ పదోన్నతి కల్పించకుండా కేంద్ర న్యాయశాఖ ఆమెకు షాకిచ్చింది. జస్టిస్ పుష్పకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించకుండా.. మరో ఏడాది కాలం పాటు ఆమె అదనపు న్యాయమూర్తిగానే కొనసాగుతారని కేంద్రం తెలిపింది. దీనికి గల కారణాలు ఆమె గతనెలలో ఇచ్చిన తీర్పులేనని బహిరంగ రహాస్యం. ఆమె వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతోనే సుప్రీంకోర్టు వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. ఆమె గతనెలలో ఇచ్చిన వివాదాస్పద తీర్పులు ఇవే.. ‘నేరుగా బాలిక శరీరాన్ని తాకనప్పుడు ఆ కేసు పోక్సో కిందకు రాదు’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ‘బాలిక చేతిని పట్టుకుని, అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం’ మరో కేసులో జస్టిస్ పుష్ప తెలిపారు. ఈ రెండు తీర్పులను గత నెలలో జస్టిస్ పుష్ప ఇచ్చారు. గతంలో జస్టిస్ పుష్ప బ్యాంకులు, బీమా కంపెనీలకు న్యాయవాదిగా పని చేసేవారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఆమె నియమితులు కాగా ఫిబ్రవరి 13, 2019లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతి వచ్చి ఉంటే శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యే వారు. -
ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. ‘జస్టిస్ఫర్ఖుషి’
కోల్కతా: నాలుగు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల చిన్నారిని పాడుబడిన బిల్డింగ్లోకి తీసుకెళ్లి అత్యంత పాశవీకంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు దుండగులు. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక గత బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో చిన్నారి బంధువులు తన కోసం వేతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలిక బంధువుల ఇంటికి సమీపంలోని ఓ పాడుపడిన బిల్డింగ్లో చిన్నారిని గుర్తించారు. బాలికకు ఒంటి మీద బట్టలు సరిగా లేవు.. గొంతు కోశారు.. చిన్నారి పళ్లు ఉడిపోయాయి. బాధితురాలిని ఈ స్థితిలో గమనించిన పోలీసులు.. చిన్నారి మృగాళ్ల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎంతో పెనుగులాడి ఉంటుందన్నారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టిన వారు బాధితురాలికి తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక తమను గుర్తుపడుతుందనే ఉద్దేశంతోనే నిందితులు చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక దారుణంపై నెటిజనులు విపరీతంగా మండిపడుతున్నారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్లో ‘‘జస్టిస్ఫర్ఖుషి’’ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందించకపోవడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మమత రాజ్యంలో ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది’’.. ‘‘సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకునే రోజులు పోవాలని కోరుకుంటున్నాం’’.. ‘‘మనం ఎటువైపు వెళ్తున్నాం.. హింసకు ముగింపు లేదా’’.. ‘‘ఈ దేశంలో మహిళలకు భద్రత లభించాలంటే ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి.. ఎంత మంది ఆడకూతుళ్లు బలవ్వాలి’’ అంటూ నెటిజనులు విరుచుకుపడుతున్నారు. చదవండి: అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
అమెరికాలో సుశాంత్ బిల్ బోర్డులు తొలగింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్కు తెలిపింది. ఈ మెయిల్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX — shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020 దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్బోర్డు సంస్థ సుశాంత్ బిల్బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది. View this post on Instagram Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 1, 2020 at 12:38pm PDT చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
ఏఆర్ లక్ష్మణన్ ఇక లేరు!
సాక్షి, చెన్నై: భార్య మీనాక్షి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్న జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ (78) గుండెపోటుతో గురువారం మృతిచెందారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. తమిళనాడు, కేరళ, రాజస్తాన్, ఆంధ్రా హైకోర్టులలోనే కాదు సుప్రీంకోర్టులోనూ అనేక కీలక కేసులకు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి ఏఆర్ లక్ష్మణన్. పదవీ విరమణ అనంతరం చెన్నైలో భార్య మీనాక్షితో కలిసి ఉంటున్నారు. గతవారం మనుమడి వివాహం నిమిత్తం చెన్నై నుంచి శివగంగై వెళ్లారు. ఈ వేడుక అనంతరం హఠాత్తుగా ఆయన సతీమణి మీనాక్షి అనారోగ్యం బారినపడి మంగళవారం మృతిచెందారు. భార్య మరణంతో ఏఆర్ లక్ష్మణన్ తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. తొలుత శివగంగై జిల్లా కారైక్కుడి, ఆ తర్వాత తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ లక్షణన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబీకులు తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, డీఎంకే అధ్యక్షుడు , ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. దేవకోట్టై నుంచి ఢిల్లీ వరకు.. శివగంగై జిల్లా దేవకోట్టైకు చెందిన ఏఆర్ లక్ష్మణన్ చిన్నతనం నుంచి న్యాయశాస్త్రం అభ్యషించాలని ఆశించారు. పట్టుదలతో ముందుకు సాగారు. శివగంగైలో ప్రాథమిక, తిరుచ్చిలో ఉన్నత విద్యను అభ్యసించారు. చెన్నై న్యాయ కళాశాలలో లా చదివారు. చెన్నైకు చెందిన న్యాయవాది జీవానందం వద్ద జూనియర్గా చేరి ముందుకు సాగారు. 1988లో మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా అవతరించారు. 1990లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1997లో కేరళ హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సమయంలో అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇందులో పబ్లిక్ స్థలాల్లో ధూమపానం నిషేధం అన్నది కీలకం. పదవీ విరమణ అనంతరం న్యాయ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత ముల్లై పెరియార్ జలవివాదం వ్యవహారంలో తమిళనాడు ప్రతినిధిగా కీలక పాత్రను పోషించారు. -
జస్టిస్ ఫర్ సుశాంత్.. నిజాలు బయటపెట్టాలి
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో న్యాయం చేయాలని కోరుతూ సుశాంత్ సోదరి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నిజాలు బయటపడవు. జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు) సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టించింది. నెపోటిజంపై బాహాటంగానే విమర్శలు చేసిన నటి కంగనా రనౌత్ బీటౌన్లో పెద్ద చర్చను లేవనెత్తారు. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్ను బెదిరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ నిర్మాణ సంస్థ సుశాంత్తో మూడు సినిమాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నా రెండు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్ పై కూడా కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒకవేళ అవసరమైతే కరణ్ జోహార్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని మహారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనౌను కూడా విచారణకు పిలవగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తాను ముంబై రాలేనని, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అధికారుల బృందాన్ని మనాలికి పంపాలని, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పేర్కొంది. కాగా సుశాంత్ ఆత్మహత్య కేసుసు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు 42 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. (‘కంగనపై ఈర్ష్య, అసూయతోనే విమర్శలు’) View this post on Instagram If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 28, 2020 at 12:51pm PDT -
ముచ్చటైన బండి.. సరదా తీర్చేనండి !
నాగపూర్: అత్యంత ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే ముచ్చటపడని వారు ఉంటారా? ఒక్కసారైనా దానిపై కూర్చోవాలని ఆశ పడుతుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే్డ సైతం ఆ ముచ్చట తీర్చుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా గడిపే ఆయన తన సొంత ఊరు మహారాష్ట్రలోని నాగపూర్లో హార్లీ డేవిడ్సన్ బైక్పై కాసేపు కూర్చొని సరదా పడ్డారు. సీవీఓ 2020 అనే ఈ లిమిటెడ్ ఎడిషన్ బండి భారతీయ జనతా పార్టీ నాయకుడు సోన్బా ముసాలే కుమారుడికి చెందినది. అయితే, యజమాని ఎవరనే విషయం జస్టిస్ బాబ్డేకు తెలియదు. నాగపూర్లోని ఓ వాహన డీలర్ ఈ బైక్ను జస్టిస్ బాబ్డేకు చూపేందుకు తీసుకొచ్చారు. తన పదవీ విరమణ తర్వాత ఇలాంటి బైక్ను కొనుక్కోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే చెప్పారు. మోటార్ సైకిళ్లంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. -
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం. ప్రియాంక చోప్రా శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి. కరీనా కపూర్ ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి. ఖష్బూ జయరాజ్ బెనిక్స్ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాజల్ అగర్వాల్ నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. తాప్సీ పన్ను తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది. హన్సిక వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్మెంట్కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి. జెనీలియా నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రకుల్ ప్రీత్సింగ్ గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. ‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు. యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్ముఖ్, రాజ్దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్లో, ఇంగ్లిష్లో వివరించారు. ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు. -
వారి మరణం ఆమోదయోగ్యం కాదు: సునీల్ ఛెత్రి
న్యూఢిల్లీ: తమిళనాడులో పోలీసుల కస్టడీలో మరణించిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లకు న్యాయం జరగాలని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి మరణానికి న్యాయం జరగాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా సునీల్ ఛెత్రి ట్వీట్ చేస్తూ.. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. తిరిగి వారి ప్రాణాలను ఏదీ తిరిగి ఇవ్వలేదు. కనీసం వారి మరణానికైనా న్యాయం జరగాలి. అది ఒక బలమైన ఉదాహరణగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ ‘‘రక్షకులే అణచివేతదారులుగా మారినప్పుడు’’ అంటూ ట్వీట్ చేశారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లు సెల్ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో విధించిన లాక్డౌన్లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు అడిగిన సెల్ఫోన్ ఇవ్వలేదనే జయరాజ్, బెనిక్స్లను అరెస్టు చేశారని, ఆ కక్ష్యతోనే లాఠితో అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని దుకాణదారులంతా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
పిల్ల బంట్లు.. న్యాయపోరాటం
‘దిస్ ఈజ్ యాన్ ఆర్డర్’ అని పై అధికారి చెప్పినప్పుడు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు. చెప్పింది చేసేయడమే. కానీ బ్రైస్ కసావెంట్ ‘ఐకాంట్’ అనేశాడు గన్ తీసి లోపల పెట్టేసుకుంటూ! బ్రైస్ కెనడాలో అటవీ సంరక్షణ అధికారి. అప్పటికీ ఒకసారి తన పైఅధికారి ఆర్డర్ మీద తల్లి ఎలుగుబంటిని షూట్ చేసేశాడు. తల్లిని అంటి పెట్టుకుని ఉన్న ఆ రెండు ఎలుగు పిల్లల్ని కూడా షూట్ చేసేయమన్నాడు పై ఆఫీసర్. ‘పాపం పోనివ్వండి’ అన్నాడు బ్రైస్. మాంసం, చేపలు ఉన్న ఫ్రీజర్ డోర్లను బద్దలు కొట్టేసి లోపలంతా చెల్లాచెదురు చేసింది తల్లే గానీ పిల్లలు కాదు. పైగా వాటి ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కూడా ఏవో ఉన్నాయి. ఆ పిల్లబంట్లను పశువైద్యశాలకు తరలించాడు బ్రైస్. పై అధికారికి ఇదంతా కోపం తెప్పించింది. ముఖ్యంగా తన ఆర్డర్ని లెక్కచెయ్యకపోవడం! వెంటనే బ్రైస్ని ఉద్యోగంలోంచి ఫైర్ చేసేశాడు. ఐదేళ్ల క్రితం మాట ఇది. ఐదేళ్లుగా బ్రైస్ తన ఉద్యోగం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరికి కోర్టు బ్రైస్కి అనుకూలంగా శుక్రవారం తీర్పు ఇచ్చింది. ‘ఆదేశాలను, విధానాలను ఎవరైనా శిరసావహించవలసిందే. కానీ జీవకారుణ్య దృష్టితో చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అంతరాత్మ ఇచ్చిన ఆర్డర్ని పాటించక పోవడమే నేరం అవుతుంది’ అని జడ్జి తీర్పు చెప్పారు. -
జస్టిస్ ఫర్ చుట్కీ
పిల్లలు కనెక్ట్ అయితే ప్లగ్ తీసేయడం కష్టం. టీవీ చానెల్ అయినా.. సీరియల్ క్యారెక్టర్ అయినా. కనెక్ట్ అయ్యారని ఎప్పుడు తెలుస్తుంది? టీవీ ఆఫ్ చేస్తేనో.. చానల్ మారిస్తేనో.. అరిచి గీ పెడతారు. కాళ్లూ చేతులు తన్నేసుకుంటారు. ఇప్పుడు వాళ్లకో విషయం తెలిసింది. చోటా భీమ్.. చుట్కీని మోసం చేశాడని! తట్టుకోలేకపోయారు. జస్టిస్ ఫర్ చుట్కీ అని ఉద్యమించారు! వాళ్లతో కలిసి కొందరు పెద్దవాళ్లూ!! ఛోటా భీమ్ తన బెస్ట్ ఫ్రెండ్ చుట్కీని వదిలేసి రాజకుమారి ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడట!! ట్విట్టర్లో బ్రేకింగ్ న్యూస్. ప్రసారం కాబోయే ఎపిసోడ్లో జరగబోయే పెళ్లిని ఊహించిందెవరు? ఎవరైతే ఏంటి.. నిప్పు లేకుండా పొగ వస్తుందా?! ట్విట్టర్ బ్రేక్ అయింది. ‘జస్టిస్ ఫర్ చుట్కీ’ ఉద్యమం మొదలైంది. అవునా! ఆశ్చర్యం. భీమ్ అలా చేశాడా! ఆగ్రహం. అయ్యో చుట్కీ! ఆవేదన. పాపం కదా.. చుట్కీ.. భీమ్కి ఎంత హెల్ప్ చేసింది! ఎన్ని లడ్డూలు పెట్టింది! ఎన్ని సాహసాలలో తోడుగా ఉంది! ఎన్ని అపాయాలలో ఉపాయాలు చెప్పింది. ఈ హెల్పులు, లడ్డూలు, ఉపాయాలు కాదు.. అసలు తనని ఎంతగా ప్రేమించింది! ఎప్పుడూ భీమ్ వెంటే ఉండేది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండేవారు. అలాంటి చుట్కీని వదిలేసి డబ్బు కోసం, బంగారం కోసం, రాజభవంతి కోసం ఇందుమతితో వెళ్లిపోయాడా భీమ్! భీమ్ తన చేతిని వదిలి, రాజకుమారి చేతిని పట్టుకుంటే చుట్కీ హార్ట్ బ్రేక్ అవుతుందో లేదో కానీ.. చోటా భీమ్ సీరియల్ను ఫాలో అవుతున్న ప్రతి చిన్నారి మనసు చుట్కీ కోసం తల్లడిల్లిపోతోంది. పెద్దవాళ్లు కూడా అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. నిజంగా భీమ్ అంత పని చేశాడా!! చుట్కీ కష్టాల్లో పడ్డాక ఇక టీవీలో చూడ్డానికి ఏముంటుంది? చుట్కీని వదిలాక భీమ్ ఎన్ని కష్టాలు పడ్డాడో చూడ్డానికైనా టీవీ చూడాలి. వ్యూయర్స్ రెండుగా విడిపోయారు. ఆ ఇద్దరికీ ఒకటే నినాదం.. జస్టిస్ ఫర్ చుట్కీ. చుట్కీకి న్యాయం చెయ్యాల్సింది ఎవరు? గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వాళ్లు. ‘చోటా భీమ్’ పిల్లల సీరియల్ సృష్టికర్తలు వాళ్లే. ఆ సీరియల్లోని పాత్రలే చోటా భీమ్, చుట్కీ, రాకుమారి ఇందుమతి. సృష్టికర్తల చేతుల్లో ఏదైనా ఉంటుంది. తలచుకుంటే భీమ్ని మళ్లీ చుట్కీ దగ్గరికి రప్పించగలరు. భీమ్, చుట్కీ చెట్టపట్టాలు చోటా భీమ్ సీరియల్ ‘పోగో’ టీవీలో 2008 నుంచి ప్రసారం అవుతోంది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. చోటా భీమ్, చుట్కీ, రాజు, జగ్గు, కాలియా, ధోలు, భోలు, రాజకుమారి ఇందుమతి, కిచక్, చోటా మను, రాజా ఇంద్రవర్మ, ఢాకూ మంగళ్సింగ్, ధూనీ బాబా, టున్టున్ మౌసీ, ప్రొఫెసర్ శాస్త్రి ధూమకేతు.. అందులోని ప్రతి క్యారెక్టర్ పిల్లలకు ఇష్టమైనదే. ముఖ్యంగా చోటా భీమ్, చుట్కీలు! కామెడీ, డ్రామా, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ వీళ్లిద్దరి చుట్టూ తిరుగుతుంటాయి. ఢోలక్పూర్ అనే ఒక కల్పిత రాజ్యంలోని తొమ్మిదేళ్ల బాలుడు చోటా భీమ్. ఏడేళ్ల బాలిక చుట్కీ. ‘‘ఈ వయసులో వీళ్లిద్దరికీ పెళ్లెందుకు జరుగుతుంది?! మీరు విన్నది తప్పు. ఎవరూ కలత చెందనవసరం లేదు’’ అని జస్టిస్ ఫర్ చుట్కీ ఆందోళనకారులకు సీరియల్ నిర్మాతలు వివరణ లాంటి అభయం ఇచ్చారు. ఏమైనా పిల్లల మనసు సున్నితమైనది. మనసులో ఒకటి అల్లుకున్నారంటే అది కళ్ల ముందు చెదిరిపోతుంటే చూసి తట్టుకోలేరు. పెద్దల్లో కూడా కొన్ని పసి హృదయాలు ఉంటాయి. వాళ్లందరి మనసు తెలుసుకుని వాళ్లకెలాగైతే నచ్చుతుందో అలాగే పాత్రల్ని మలుచుకోక తప్పదేమో. పిల్లల కోసం తీసే సీరియళ్ల ప్రత్యేకత ఇదే. తీసేది ఎవరైనా.. తీయించేది చిన్నారులే. చిన్నారులకు నచ్చితే బాగా తీసినట్లే. ఐ స్టాండ్ విత్ చుట్కీ: ట్విట్టర్లో చుట్కీకి మద్దతుగా ఓ పోస్ట్ -
న్యాయ ప్రక్రియకు గండి
భావోద్వేగాలు చిక్కబడినప్పుడు విచక్షణ నీరుగారటం సహజం. తమకో, తమ వారికో అన్యాయం జరిగిందనుకున్నవారు తక్షణ న్యాయం కావాలని ఆశించడం తప్పు కాదు. కానీ ఆ న్యాయం ఫలానా విధంగానే ఉండాలనడం, అది ఫలానా సమయానికల్లా దక్కాలనడం వల్ల ఆ పనిలో ఉండే వ్యవస్థలు సమస్యలెదుర్కొంటాయి. అన్యాయానికి గురైన సాధారణ వ్యక్తులు భావోద్వేగాలకు లోనై ఎలా స్పందించినా వారిని సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు. ఆ స్పందన చట్ట పరిమితులకు లోబడి వున్నంతవరకూ చట్టాలు సైతం మౌనంగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నతంగా ఆలోచించాల్సిన, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన సంఘాలు సైతం అదే మాదిరి ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కశ్మీర్కు స్వేచ్ఛనివ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించిన కేసులో కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థినిని రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా అక్కడి బార్ అసోసియేషన్ ఆమె తరఫున న్యాయవాదులెవరూ వాదించకూడదని తీర్మానం చేసింది. నళిని దేశద్రోహి కనుక, జాతి వ్యతిరేకి గనుక వాదించొద్దని ఆ తీర్మానం సారాంశం. అదే రాష్ట్రంలోని హుబ్లీలోనూ ఈ మాదిరి పరిణామమే చోటుచేసుకుంది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కేసులో ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను ఇలాంటి నేరారోపణలపైనే అరెస్టు చేయగా, అక్కడి బార్ అసోసియేషన్ కూడా వారికి న్యాయ సహాయం చేయరాదంటూ తీర్మానించింది. ఇతరులతో పోలిస్తే న్యాయం గురించి, చట్టాల గురించి న్యాయవాదులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అలా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ రెండుచోట్లా బార్ అసోసియేషన్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. మైసూర్లో నళిని తరఫున వాదించడానికి వేర్వేరు జిల్లాలకు చెందిన 170 మంది న్యాయవాదులు వెళ్లారు. హుబ్లీలో నిందితుల తరఫున వాదించడానికెళ్లిన ముగ్గురు న్యాయవాదులను దూషించడం, చంపేస్తామని బెదిరించడం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. ఈ తీరు సరికాదని కర్ణాటక హైకోర్టు హితవు చెప్పడంతో హుబ్లీ బార్ అసోసియేషన్ తన తీర్మానాన్ని సవరించుకుని నిందితుల తరఫున వాదిం చడం న్యాయవాదుల వ్యక్తిగత ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపింది. కానీ ఇది కూడా తప్పేనని హైకోర్టు చెప్పడంతో తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. ‘రాజు తలచిందేను ధర్మం...రాజు చెప్పిందేను శాస్త్రం’ అన్నట్టు ఎలాంటి చట్టం, న్యాయం లేని మధ్యయుగాల నాటి పరిస్థితులనుంచి మానవ సమూహాలు ప్రజాస్వామ్య సమాజాలకు ఎలా పరివర్తన చెందాయో, ఏ పరిణామాలు అందుకు దోహదపడ్డాయో తెలిసున్నవారు ఇలాంటి అపరిపక్వ ఆలోచనలకు తావీయరు. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజ్యాంగాలు, చట్టాలు అక్కడి సమాజాల సమష్టి వివేకానికి దర్పణాలు. అన్యాయానికి లోనైనవారికి న్యాయాన్ని అందించటం, సమాజానికి హానికరంగా పరిణమించినవారిని ఆ సమాజం నుంచి దూరంగా వుంచి, వారిని సంస్కరించటం చట్టాల మౌలిక ఉద్దేశం. రాజ్యాంగం రచించిననాటికి ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కావొచ్చు, చట్టాలు రూపకల్పన చేసినప్పటి ఆలోచనల పర్యవసానంగా కావొచ్చు...ఆచరణలో సమస్యలెదురవుతుంటాయి. మారిన పరిస్థితులు, ఆలోచనల ఆధారంగా వాటికి సవరణలు చేసుకోవటం ఎక్కడైనా ఉండేదే. ఒక సమాజం న్యాయాన్ని మరింత చురుగ్గా, మరింత మెరుగ్గా అందించదల్చుకుని ఈ సవరణలు చేసిందా లేక తిరోగమన దృక్పథంతో వ్యవహరించిందా అన్నది ఆ సవరణల సారాంశం తేటతెల్లం చేస్తుంది. మన దేశంలో చట్టాలు ఏమేరకు ఆసరాగా నిలు స్తున్నాయో సాధారణ ప్రజానీకానికి నిత్యానుభవం. ఎడాపెడా దుర్వినియోగమవుతున్న చట్టాల జాబితాను రూపొందిస్తే మాత్రం అందులో రాజద్రోహ చట్టం మొట్టమొదట ఉంటుంది. 1962లో కేదార్నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం దీన్ని గుర్తించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధమేనని చెబుతూనే, దాని దుర్వినియోగం మాత్రం అధికంగానే వున్నదని అభిప్రాయపడింది. చిత్రమేమంటే ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంటే ఏళ్లు గడుస్తున్నా మన సమాజం తీరు తెన్నులు పెద్దగా మారలేదన్నమాట. ఇలా దుర్వినియోగమవుతున్న చట్టంలో చిక్కుకున్నవారికి కనీసం న్యాయస్థానాల్లో కూడా ఉపశమనం దక్కనీయకుండా నివారించే ప్రయత్నం చేయడం ధర్మం కాదని మైసూరు, హుబ్లీ బార్ అసోసియేషన్లకు తట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని సంగతలావుంచి వృత్తిపరంగా ఎలా వ్యవహరించాలో, ఎలాంటి సంప్రదాయాన్ని పాటించాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిబంధనలు చెబుతున్నాయి. తీవ్రమైన నేరం చేశాడని మొత్తం సమాజం భావించిన వ్యక్తి సైతం తన తరఫున వాదించమని ఆశ్రయించినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఏ న్యాయవాదీ అందుకు నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటు చేసే చట్టాలు మాత్రమే కాదు...వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చే ఆదేశాలు కూడా చట్టాలతో సమానమే. ఏ పౌరుడైనా తెలియక తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. చట్టానికి సంబం ధించినంతవరకూ తాను అజ్ఞానినని మొత్తుకున్నా అంగీకరించదు. నిత్యం ఆ చట్టాలకు సంబంధిం చిన పనిలోనే నిమగ్నమై వుండేవారికి ఇది తెలియదనుకోగలమా? తెలియక చేశారనుకున్నా అది కోర్టు ధిక్కారం కాదా? దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించేవారిపట్ల కోపావేశాలుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అలాంటివారిని సైతం చట్టబద్ధంగా విచారించి శిక్షించాలని కోరుకోవాలి తప్ప అన్నిటినీ బేఖాతరు చేసి, వారికి అన్ని దారులూ మూసేయాలన్న వితండవాదనకు దిగ కూడదు. ఇలా కోరుకోవడం ద్వారా తాము నాగరిక సమాజం మౌలిక పునాదులనే ప్రశ్నార్థకం చేస్తు న్నామని, న్యాయపరమైన ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకోవడంతోపాటు అసలు ఆ ప్రక్రి యనే సందేహాస్పదంగా మారుస్తున్నామని వారు గ్రహించాలి. -
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం అందింది. -
లోకయుక్తగా జస్టిస్ సివి రాములు ప్రమాణ స్వీకారం
-
జస్టిస్ ఫర్ సమత
-
‘దిశ’ తిరిగిన న్యాయం
న్యాయం అనేది ఎప్పుడూ వివాదాస్పదమే. ఎందుకంటే, అది కొందరికి మాత్రమే తీపి, వేరెందరికో చేదు. అందుకే అంతిమ న్యాయం ఎలా ఉన్నా, కనీసం అది అమలు జరిగిన తీరైనా ‘న్యాయం’గా ఉండాలని చాలామంది భావిస్తారు. అమలు జరిగే తీరులోని న్యాయాన్యాయాలు కూడా సాపేక్షమే. ఎందుకంటే, అమలు తీరుపైనే అంతిమ న్యాయం ఆధారపడి ఉంటుంది కాబట్టి. షాద్నగర్ ఎన్కౌంటర్తో న్యాయం–నడిరోడ్డుకు కాకపోయినా–నాలుగు రోడ్ల కూడలిలోకి మరో సారి వచ్చింది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసు కున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక అత్యాచారాలన్నీ ఆగిపోతాయా అని ప్రశ్నిస్తు న్నారు. దిశ అత్యాచార ఘటన ఎంతగా కలిచివేసిందో, ఈ ఎన్కౌంటర్ కూడా అంతే కలవరపరిచిందని వాపోతున్నారు. ఇలా అయితే, దేశంలో చట్టానికి, న్యాయానికీ, రాజ్యాంగానికి ఇక విలువేముంటుందని వారు నిలదీస్తున్నారు. షాద్నగర్ ఘటనపట్ల హర్షం వ్యక్తం చేసేవారి వాదన మరోలా ఉంది. నిందితులను గుర్తించి, పట్టుకుని, సాక్ష్యాలు సేకరించి, వాటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి, నిరూపించి.. చివరాఖరికి ఎప్పుడో శిక్ష పడేలా చేయడమనేది సుదీర్ఘ ప్రక్రియ. ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘమనే మాట కూడా చాలా చిన్నది. దశాబ్దాల తరబడి సాగుతున్న కేసులు ఎన్నో. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించి, చట్టాల్లో మార్పులకు సైతం దారి తీసిన నిర్భయ అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష ఖరారు కావడానికి పట్టిన సమయం, అమలు జరగడంలో జరుగుతున్న జాప్యం అంద రికీ తెలిసిందే. అలాగే, ఉన్నావ్ అత్యాచార ఘట నలో ఏం జరిగిందో తెలుసు. చట్టం కల్పించిన వెసులుబాటుల్లోంచి నిందితులు ఎన్నెన్ని దారుణాలకు తెగించారో, ఎంతమంది మరణాలకు కారణమ య్యారో.. చివరకు బాధితురాలిని కూడా అత్యంత దారుణంగా నడిరోడ్డుపైనే తగులబెట్టేసిన విషయం ఎందరినో కలిచి వేసింది. అందుకే ఇప్పుడు సత్వరం న్యాయం కావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాలంతోపాటు మన చట్టాలు, విచారణా పద్ధతులు, న్యాయం అందించే తీరు మారలేదు. కానీ, హింసా రూపాలు తీవ్రాతి తీవ్రంగా మారిపోయాయి. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టే స్థాయిలో హింస చెలరేగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చట్టం, న్యాయం అంటూ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చేతకానితనమవుతుందని వీరి అభిప్రాయం. కులం, ధనం, రాజకీయ అండ దండలు ఉన్నవారికి కూడా ఇలాంటి న్యాయాన్ని అమలు చేయగలరా అని ప్రశ్నిస్తున్నవారికి– మీరు మాత్రం అత్యాచారానికి గురైన అందరిపట్లా ఒకేలా స్పందిస్తున్నారా; టేకు లక్ష్మిలాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన బాధితుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీస్తున్నారు. ఎన్కౌంటర్ చేసేస్తే ఇక అత్యాచారాలు ఆగిపోతాయా అంటున్నవారితో.. చట్టప్రకారం విచారించి, శిక్షిస్తే మాత్రం ఆగిపోతాయా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పిల్లల పెంపకం, వ్యవస్థలో రావాల్సిన మార్పులను కాదనటంలేదనీ.. అయితే, అంతవరకూ నేరాలకు అడ్డుకట్ట వేయడం ఎలాగో సెలవీయమంటున్నారు. అధికార బలం, ధన బలం ఉన్నవారికి కొమ్ముకాస్తూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశంలో కొత్తేమీ కాదనీ, అది ఇప్పుడు ప్రజలపక్షం అయినందుకు సంతోషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఏ కారణాల వల్లనో సమాజంలో కొన్ని సంఘటనలు అందరినీ కదిలిస్తాయి, కలచివేస్తాయి. అటువంటి సంఘటనల విషయంలో సత్వరం న్యాయం జరగాలని చాలామంది కోరు కుంటారు. అప్పుడు వారికి కావాల్సింది అంతిమ పరిష్కారమేగానీ.. న్యాయాన్ని ఎలా అమలు చేస్తున్నారనేది ముఖ్యం కాదు. ప్రజల్లో పెల్లుబికే ఆ ఉద్వేగాన్ని అందిపుచ్చుకుని వారు కోరుకున్నదాన్ని– తమకు ఎటువంటి నష్టం లేదు కాబట్టి– అందివ్వడం పాలకులకు పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, తీవ్ర భయోద్విగ్నతతో వాడిపోయిన సమాజం మోమును కాస్తంతైనా వికసింపజేయా ల్సిన బాధ్యత పాలకులదే. అందుకే షాద్నగర్ ఎన్కౌంటర్ అందరిలో విశేష ఆనందానికి హేతువయ్యింది. అందరూ బాణాసంచా కాల్చుకుని, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల ముఖాల్లో పట్టలేనంత ఆనందం తొణికిసలాడింది. తమను ఏ సందు చివరో కామెంట్ చేసినవాడిని వేలు చూపి బెదిరించినట్టు, ఎడంకాలి చెప్పుతో చెంపలు వాయించినట్టు.. తమంతట తామే ఏదో సాధించినట్టు చేసి నట్టు వాళ్ల కళ్లు ధైర్యంతో వెలిగిపోయాయి. దిశ అత్యాచార ఘటన అనంతరం కారుమబ్బుల్లా కమ్ముకున్న భయాన్ని ఇవాళ్టి సంఘటన మెరుపులా చీల్చి వారి ముఖాలపై చిరునవ్వులు పెల్లుబికేలాæ చేసింది. పోలీస్ న్యాయం.. న్యాయం కాకపోవచ్చు. కానీ, కొంత ఉపశమనాన్ని ఇచ్చిందనేది కాదనలేని వాస్తవం. – దేశరాజు -
‘తక్షణ’ న్యాయం
‘దిశ’పై గత నెల 27 రాత్రి సామూహిక అత్యాచారం చేసి, సజీవదహనం చేసిన నరరూప రాక్షసులు నలుగురూ శుక్రవారం వేకువజామున పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. సహజంగానే జాతీయ మానవహక్కుల సంఘం వెనువెంటనే స్పందించి దీనిపై విచారణకు తమ సభ్యుల్నిపంపుతోంది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ నెల 9న విచారిస్తామంటోంది. ఎన్కౌంటర్ గురించి తెలిశాక తెలంగాణలో, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ నగరాల్లో వారిని అభినందిస్తూ ర్యాలీలు జరిపారు. ‘దిశ’ ఉదంతం సమాజం మొత్తాన్ని కదిలించింది. ఆమెకు సరైన న్యాయం దక్కాలంటే ఆ నలుగురినీ వెంటనే ఎన్కౌంటర్ చేయాలని తొమ్మిదిరోజులుగా జనం డిమాండ్ చేస్తున్నారు. నిందితుల్ని షాద్నగర్ పోలీస్స్టేషన్లో బంధించినప్పుడు వందలాదిమంది చుట్టుముట్టి వారిని తక్షణం తమకప్పగించాలని డిమాండ్ చేశారు. రిమాండ్ కోసం వారిని తర లించడం సాధ్యం కాక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ను పోలీస్ స్టేషన్కే రప్పించవలసివచ్చింది. చివరకు లాఠీచార్జి చేసి చెదరగొడితే తప్ప నేరగాళ్లను జైలుకు పంపడం సాధ్యపడలేదు. అత్యాచారమైనా, మరే ఇతర నేరమైనా జరిగినప్పుడు అందరిలో ఆందోళన కలుగుతుంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.ఎన్నాళ్లిలా అనే ప్రశ్న మొలకెత్తుతుంది. ‘దిశ’ ఉదంతం అంతకుమించిన స్పందన తీసు కొచ్చింది. స్థానికంగానే కాదు... దేశవ్యాప్తంగా కూడా అందరినీ కదిలించింది. ఎందుకంటే ఈ నేరగాళ్లు ప్రదర్శించిన క్రౌర్యం తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఆమెను నమ్మించి, ఒక పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేలా చేసి అదును చూసి కాటేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టా డుతుండగా ఆమెపై మృగాల్లా ఒకరి తర్వాత ఒకరు దాడి చేశారు. తమ రాక్షసత్వం కప్పిపుచ్చు కోవడానికి కొన ఊపిరితో ఉన్న ఆమెను సజీవ దహనం చేశారు. ఈ కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. చానెళ్లలో సామాన్య మహిళలు, బాలికలు సైతం వారి పనితీరును ప్రశ్నించారు. ఆ నేరగాళ్లలో లారీ నడుపుతున్న వ్యక్తికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా భారీ వాహనాన్ని నడిపాడు. టోల్గేటు దగ్గరలో వాహనం నిలిపి ఉంచినప్పుడు అక్క డికొచ్చిన పోలీసులు దాన్ని వేరేచోట పెట్టుకోవాలని చెప్పారు తప్ప అందులో తరలిస్తున్నదేమిటో, వారి వివరాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సర్వీస్ రోడ్డులో ఓ పక్కకు వాహనం నిలిపివుంచినా అటుగా పోయిన గస్తీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ‘దిశ’ ఉదంతం తర్వా తైనా వారిలో అప్రమత్తత ఏర్పడ్డ సూచనలు కనబడలేదని ఒకటి రెండు చానెళ్లు ప్రసారం చేసిన కథనాలు వెల్లడించాయి. ఘటన గురించి తెలిశాక బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారిని సరిగా పట్టించుకోలేదు. పైగా బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. మూడు పోలీస్స్టేషన్లు తిరిగాకగానీ వారి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అది జరిగాక కూడా సీసీ టీవీ ఫుటేజ్లు చూడటానికే బోలెడు సమయం పట్టింది. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉండొచ్చు. కానీ వ్యవస్థను పట్టిపీడిస్తున్న మౌలిక సమస్యను ఇవి మరుగుపరచకూడదు. ఒక కుటుంబం ‘దిశ’ను కోల్పోవడానికి కారణమైన ఈ వైఫల్యాలన్నిటినీ సమూలంగా పెకిలించాలి. లేనట్టయితే ఇవే పరి స్థితులు పునరావృతం అవుతాయి. ఇక్కడ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఉదా సీనతే రాజ్యమేలుతోంది. కనుక అన్ని రాష్ట్రాలకూ ఇది గుణపాఠం కావాలి. ఈ విషయంలో ఇప్ప టికే చాలా మార్పొచ్చింది. తెలంగాణతోపాటు అనేకచోట్ల పోలీసు విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మహిళల రక్షణపై దృష్టి పెట్టాయి. తెలంగాణ పోలీసు విభాగం ఇంటర్నెట్ లేని సందర్భాల్లో సైతం తమ హాక్–ఐ యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. ఆపత్సమయాల్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే నేరుగా 100కు ఫోన్ వెళ్లేలా సవరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా నేరం ఎక్కడ జరిగినా బాధితులొచ్చినప్పుడు కేసు నమోదు చేసుకుని పని ప్రారంభించడం మొదలుపెట్టారు. వెనువెంటనే దాని ఫలితాలు కూడా కనబడటం ప్రారంభించాయి. అయితే న్యాయవ్యవస్థలో అంతూ దరీ లేకుండా ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు కూడా నేరగాళ్లలో ఒక రకమైన భరోసా కలిగిస్తున్నాయి. తమకేమీ కాదన్న ధైర్యాన్నిస్తున్నాయి. నిరుడు మార్చి నాటికి దేశవ్యాప్తంగా అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించి 1,66,882 కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. దర్యాప్తులో జాప్యం, సాక్ష్యాధారాల సేకరణలో లోటుపాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. ఆఖరికి డీఎన్ఏ సాక్ష్యాలు కూడా న్యాయ స్థానాల్లో నిలబడని దుస్థితి ఉంది. కనుకనే స్వల్ప కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడు తున్నాయి. దేశంలో కఠిన శిక్షలు లేకపోవడం వల్లే నేరాలు జరుగుతున్నాయని భావించి నిర్భయ వంటి చట్టం తీసుకొచ్చారు. పోక్సో చట్టాన్ని కూడా కఠినం చేశారు. కానీ నేరం జరిగిందని సమాచారం వచ్చిన దగ్గర్నుంచి న్యాయస్థానాల్లో నిందితులపై చార్జిషీట్లు నమోదు చేసి విచారణ పూర్తయ్యే వరకూ జరిగే క్రమమంతా ఎంతో లోపభూయిష్టంగా ఉంటోంది. దీన్నంతటినీ పట్టిం చుకుని సరిచేసేందుకు ఎవరూ చిత్తశుద్ధితో పూనుకోవడం లేదు. నిందితులు నిర్దోషులుగా విడుదలైనప్పుడు దర్యాప్తు చేసిన అధికారులను అందుకు బాధ్యుల్ని చేసి చర్య తీసుకోవాలని నాలు గేళ్లక్రితం సుప్రీంకోర్టు సూచించింది. అది ఆచరణలో పెడితే ఎంతోకొంత ఫలితం ఉండొచ్చు. బాధి తురాలి తండ్రి ఎన్కౌంటర్పై స్పందిస్తూ ఇది ఉపశమనం మాత్రమేనని చెప్పిన మాట విలువైనది. ఇలాంటి నేరాలను శాశ్వతంగా రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయడమే ‘దిశ’కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది. -
జస్టిస్ ఫర్ 'దిశ'.. ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. సీఎం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్రెడ్డి ఈనెల 2వ తేదీన హైకోర్టుకు లేఖ రాశారు. ఈ మేరకు ఆ తర్వాతి రోజే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆమోదముద్ర వేశారు. హైకోర్టు అనుమతితో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 639) జారీ చేసింది. -
‘ఆ కుటుంబానికి ఏం హామీ ఇవ్వగలం మోదీ గారు..’
సాక్షి, హైదరాబాద్ : మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం ఆలస్యం అయితే అన్యాయం జరిగినట్టేనని అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ నరేంద్ర మోదీ గారు.. నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లు అయింది.. కానీ దోషులకు ఇప్పటికీ ఊరి శిక్ష విధించలేకపోయాం. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది.. ఈ కేసులో దోషులకు దిగువ కోర్టు ఊరి శిక్ష విధించింది. కానీ హైకోర్టు దానికి జీవిత ఖైదుగా మార్చింది. తాజాగా హైదరాబాద్లో యువ పశు వైద్యురాలిని అనాగరికంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కానీ న్యాయం కోసం దుఃఖిస్తున్న బాధితురాలి కుటుంబానికి ఏం హామీ ఇవ్వగలం. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్టే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే.. ఇలాంటి ఘటనలపై ఒక రోజంతా చర్చ చేపట్టాలి. ఐపీసీ, సీఆర్పీసీలకు సవరణలు చేయాలి. మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తెలినవారికి వెంటనే ఊరి శిక్ష విధించాలి. దీనిపై సమీక్షకు ఆస్కారం లేకుండా చూడాలి. మన పురాతన చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చింది. చట్టాలకు భయపడకుండా దారుణాలకు పాల్పడే జంతువుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి వేగంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. చట్టాలను సవరించి.. వీలైనంత వేగంగా న్యాయం జరగాలని కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాన’ని కేటీఆర్ తెలిపారు. -
పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం
సాక్షి, ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. ముంబైలోని నారిమన్ పాయింట్లోని బీజేపీ కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. కేవలం రూ.25 వేలతో తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ వందలాంది మంది బాధిత ఖాతాదారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతోఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా కృష్ణ అనే డిపాజిటర్ మాట్లాడుతూ అసలు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదనీ, తనకు డబ్బు తిరిగి కావాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఈ సొమ్మును తిరిగి సంపాదించుకోలేనంటూ ఆవేదన చెందారు. దీంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రికి రాత్రే తమ ఖాతాలను స్తంభింప చేస్తు పరిస్థితి ఏంటని ఆగ్రహంతో ప్రశ్నించారు. తామేమీ నేరం చేయకపోయినా తమ కష్టార్జితంకోసం భిక్షగాళ్లలా ప్రభుత్వాన్ని అర్థించాల్సి వస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. Mumbai: Depositors of Punjab & Maharashtra Cooperative (PMC) Bank protest outside BJP office, Nariman Point. Krishna, a depositor says, "I don't know what they're doing,don't care what they're doing,I want my money back.I won't be able to earn again whatever I've put in the bank" pic.twitter.com/n3tWtfr3mT — ANI (@ANI) October 10, 2019 -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో సంపూర్ణ అధికారాలను ఉపయోగించ జాలదు. రాజ్యాంగం మేరకు ఈ మార్గదర్శకాలను అనుమతించలేము. వీటి కారణంగా సంబంధిత కేసుల విచారణ జాప్యం అవుతుంది. అందుకే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసే ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని, అరెస్టుకు సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలంటూ గత ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నాం’అని తెలిపింది.‘ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విషయంలో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ప్రాథమిక విచారణ జరపాలనే నిబంధనలు లేవని తెలిపింది.ఆర్టికల్ 15 ద్వారా రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కలి్పంచిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వారు సామాజికంగా వేధింపులు, వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. కులరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అటువంటి పవిత్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాం’అని తెలిపింది. మనుషులతో మలమూత్రాల్ని ఎత్తివేయిస్తున్న పరిస్థితులు, ఈ సందర్భంగా సంభవిస్తున్న మరణాలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మనుషులను గ్యాస్ చాంబర్లలోకి పంపి చంపడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచి్చన 70 ఏళ్ల తర్వాత కూడా వివక్షకు, అంటరానితనానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం రక్షించలేక పోయిందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్నుద్దేశించి వ్యాఖ్యానించింది. గత ఏడాది మార్చిలో ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సెప్టెంబర్ 18వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టం దురి్వనియోగం అవుతున్నప్పుడు శాసనాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయగలమా? కులం ప్రాతిపదికన ఏ వ్యక్తినయినా అనుమానించగలమా? సాధారణ పౌరుడు కూడా తప్పుడు కేసు పెట్టొచ్చు కదా’అని పేర్కొంది. సమానత్వ సాధనకు సంబంధించిన ఈ అంశంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా ఆ సమయంలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులను సమీక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. -
ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు
సాక్షి, ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను వంశధార ట్రిబ్యునల్ సోమవారం తోసిపుచ్చింది. గతంలో నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆర్డర్లో మార్పలు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్ను సిద్ధం చేయాలని, సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకత్వంపై నివేధిక చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజ్కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించి తదుపరి విచారణను జనవరి 10వ తేదికి వాయిదా వేసింది. -
జస్టిస్ సంజయ్ బదిలీపై న్యాయవాదుల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులను బహిష్కరించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన తెలిపారు. శనివారం వరుకు రాష్ట్ర్రవాప్తంగా ఉన్న అన్ని కోర్టులను న్యాయవాదులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. సంజయ్ కుమార్ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మరొకవైపు హైకోర్టు బిల్డింగ్ను తరలించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ గేట్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. -
బడ్జెట్ రైలు ఆగేనా ?
సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రవేశపెట్టె బడ్జెట్లో రైల్వే పరంగా ఈసారైనా న్యాయం జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాజీపేట జంక్షన్కు న్యాయం జరగాలని జిల్లా ప్రజలు, రైల్వే కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. నిజాం రైల్వే కాలంలో 1094లో ఏర్పాటైన కాజీపేట దినాదినాభివృద్ధి చెంది కాజీపేట జంక్షన్గా ఏర్పడి ఇప్పుడు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గేట్వేగా విలసిల్లుతోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లు, ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్లకు సంబంధించి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా కాజీపేట జంక్షన్ పరిధిలో పెండింగ్లో ఉన్న యూనిట్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు. ఫిట్లైన్ నుండి కొత్త రైళ్లు కాజీపేటలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఫిట్లైన్ పనులను త్వరగా పూర్తి చేసి కాజీపేట కేంద్రంగా కొత్త రైళ్లు ప్రారంభించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే కాజీపేట జంక్షన్ నుంచి ముంబై, తిరుపతి, సికింద్రాబాద్ రూట్లలో కొత్త రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చు. తద్వారా కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా రైల్వే కార్యాలయాలు వస్తాయి. మూడో లేన్ కాజీపేట జంక్షన్ మీదుగా బల్లార్షా – విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న మూడో రైల్వే లైన్ను పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేన్ పూర్తయితే అయితే న్యూఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అలాగే, ఆలస్యాన్ని నివారించచ్చు. వడ్డేపల్లి చెరువు కట్లపై రైల్వే లైన్ కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్టపై 200 మీటర్ల మేర సర్వే అయిన రేల్ అండర్ రైల్ లైన్ నిర్మాణం, కాజీపేట – బల్లార్షా వరకు సర్వే అయిన నాలుగో లేన్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తయిన మణుగూరు – రామగుండం లేన్కు నిధులు, ఘన్పూర్ – సూర్యాపేట వరకు వయా పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సర్వే అయిన లేన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, భూపాలపల్లి రైల్వే లేన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు కాజీపేట జంక్షన్ మీదుగా ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్లు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతోంది. ఇంకా పద్మావతి ఎక్స్ప్రెస్, కరీంనగర్ – తిరుపతి ఎక్స్ప్రెస్, షిర్డీ ఎక్స్ప్రెస్లను డెయిలీగా మార్చాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డివిజన్ కల నెరవేరేనా? 1904 సంవత్సరంలో ఏర్పాటైన కాజీపేట రైల్వే స్టేషన్ 115 ఏళ్ల ప్రస్థానంలో డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాలనేది జిల్లా ప్రజలు, ఇక్కడ పని చేస్తున్న కార్మికుల చిరకాల కోరిక. ఇది ఈసారి బడ్జెట్లో నెరవేరుతుందని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ను డివిజన్గా అప్గ్రేడ్ చేసినా కాజీపేట జంక్షన్ను చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. డివిజన్ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్దితో పాటు కొత్త రైల్వే పరిశ్రమలు వస్తాయి. పాలన అందరి చెంతకు చేరుతుంది. కొత్త రైళ్లను ఇక్కడకు ప్రారంభించేందుకు వెసలుబాటు కలుగుతుంది. డివిజన్ స్థాయి రైల్వే భవనాలు, అధికారులు వస్తారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ కాజీపేట కేంద్రంగా పదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ.. ఆ తర్వాత దీని స్థానంలో మంజూరైన వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ షెడ్(పీఓహెచ్ షెడ్) నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈసారైనా ఇవి తొలగిపోయి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని, శంకుస్థాపన జరుగుతుం దని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ వస్తే కాజీపేట అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాధాన్యత పెరుగుతుంది. కొంత మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. దీనికి తోడు అనుబంధంగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయి. -
అమలు కాని చట్టమూ అఘాయిత్యమే
కలచివేసే ఘటనలుజరుగుతున్నాయి.కఠినమైన చట్టాలూ ఉన్నాయి!అయినా ఆడపిల్లలపైఅఘాయిత్యాలుపెరుగుతూనే ఉన్నాయి.నిన్న మొన్న.. వరంగల్లోపసికందుపై ‘హత్యాచారం’..ఒంగోలులో టీనేజ్పై గ్యాంగ్ రేప్..!వీటిని ఆపేదెలా?!‘గట్టి చట్టాలు ఉంటేసరిపోదు..ఆ చట్టాలను..గట్టిగా అమలుపరిచేవాళ్లుండాలి’’అంటున్నారుప్రముఖ సామాజికకార్యకర్త కల్యాణి. శ్రీహిత... తొమ్మిది నెలల పాపాయి. ఆమెకు పాలు తాగిస్తూ జో కొడుతోంది పాపాయి తల్లి. సగం పాలు తాగగానే నిద్రలోకి జారుకుంది శ్రీహిత. పాపాయిని ఒత్తిగిల తిప్పి పడుకోబెట్టింది. పాల సీసాను పక్కనే పెట్టి తనూ నిద్రలోకి జారిపోయింది. పాపాయి కదిలినప్పుడు మిగిలిన పాలు తాగిద్దామనుకుందా తల్లి. అమ్మపక్కన పడుకుని ఉన్నాననే భరోసాతో లోకాన్ని మరిచి నిద్రపోతోంది శ్రీహిత. అర్ధరాత్రి, దాదాపుగా ఒకటి ముప్పావు సమయంలో పాపాయికి ఆకలవుతుందేమోనని పాలు తాగిద్దామని తడిమి చూసుకుంది. పాపాయి లేదు. ఒంటిగంట సమయంలో టెర్రస్ మీద నిద్రపోతున్న పాపాయిని ఎత్తుకెళ్లిపోయాడు దుండగుడు! అమ్మానాన్న, బంధువులు, పోలీసులు అందరూ పాపాయి కోసం వెతకడం మొదలు పెట్టారు. దుండగుడు ఒక టవల్లో పాపాయిని చుట్టి పరుగులు తీస్తుండడాన్ని గమనించాడు శ్రీహిత మేనమామ. బంధువులు పరుగెత్తుకెళ్లి అతడిని పట్టుకున్నారు. దుండగుడిని పోలీసులకు పట్టించి పాపాయిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే... ఆ చంటిబిడ్డ ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. మానవమృగాల్లో దాగిన కర్కశత్వాన్ని భరించలేని ఆ పసిప్రాణం ఈ లోకంలో ఉండకూడదనుకుంది. వరంగల్, హన్మకొండలోని కుమ్మరపల్లిలో ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది. న్యాయపోరాటం పాలు తాగే చంటిబిడ్డ హత్యకు గురైంది. అంతకంటే ముందు మాటల్లో చెప్పలేని అఘాయిత్యానికి కూడా బలైంది. హంతకుడిని వెతికి పట్టుకునే శ్రమ కూడా పోలీసులకు లేకుండా బంధువులే పట్టిచ్చారు. పోలీసులు హంతకుడి మీద అపహరణ, హత్య, దొంగతనం (పాపాయి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను దొంగిలించాడు), సెక్షన్లతోపాటు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇంకా హంతకుడి పేరు ప్రవీణ్ అని, అతడు తమ చేతికి చిక్కేటప్పటికి మద్యం సేవించి ఉన్నాడని, శ్రీహిత ప్రైవేట్ పార్ట్స్లో గాయాలను తాము గుర్తించినట్లు, లైంగిక వేధింపుకు గురైనట్లు కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు హంతకుడిని ఎక్కడో దాచేశారని, ఎక్కడ దాచారో కూడా తెలియడం లేదని శ్రీహిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరే బిడ్డకూ జరగకూడదని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీహిత సంఘటనకు వరంగల్ నగరం ఒక్కటే కాదు తెలుగు రాష్ట్రాలు రెండూ ఉడికి పోయాయి. పౌర సమాజం ఆగ్రహజ్వాలలు అగ్నికీలల్లా ఎగిసిపడ్డాయి. ‘హంతకుడికి శిక్ష విధించండి, శిక్షను బహిరంగంగా అమలు చేయండి, ఉన్మాది మీద దయ చూపకండి, ఉన్మాదిని ఉరితీయండి’ అని ఆందోళనలు చేశారు. అయితే... ఆందోళన చేస్తున్న పౌరుల మీద దాడులు జరుగుతున్నాయి తప్ప హంతకుడి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చట్టాలను తిరగరాయండి ‘‘మన పీనల్ కోడ్ రాసుకున్నప్పటి సామాజిక పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సమాజంలో ఇంతటి తీవ్రమైన నేరాలు లేని రోజుల్లో రాసుకున్న చట్టాలవి. ఓ సారి నిపుణులందరూ కూర్చుని చట్టాలను, ప్రస్తుత సామాజిక పరిస్థితులను సమీక్షించండి. అవసరమైన కొత్త చట్టాలను తీసుకురండి. మేల్సొసైటీ సున్నితత్వాన్ని కోల్పోతోంది. మహిళలు, బాలికల మీద క్రైమ్ రేట్ ఏడాదికేడాదికీ పెరిగిపోతూనే ఉంది. శ్రీహిత విషయంలో.. కేసును విచారించకనే ‘మద్యం మత్తులో నేరానికి పాల్పడ్డాడ’నే తొలి పలుకులు వినిపిస్తున్నాయి. దీనర్థం నెపాన్ని మద్యం మీదకు తోసేసి హంతకుడిని శిక్ష నుంచి తప్పిస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు శ్వాస ఫౌండేషన్ నిర్వహకురాలు గొర్రె కల్యాణి. స్పందన కోసం ఎదురుచూపు ‘‘టీవీలో వార్త చూడగానే మనసు కలచివేసింది. టీవీ, పేపర్లతోపాటు సోషల్ మీడియాను కూడా ఫాలో అవుతూనే ఉన్నాను. కలెక్టర్ వచ్చిన పది నిమిషాలకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారని తెలిసింది. ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఎలక్షన్ ప్రచారంలో దోసెలు వేశారు, ఇస్త్రీ చేశారు, పిల్లలకు స్నానాలు కూడా చేయించారు. అలాంటిది ఒక చంటిబిడ్డకు జరగరాని ఘోరం జరిగితే ఒక్కరూ రాలేదేంటని నేనే రంగంలోకి దిగాను. ‘ప్రధాన మంత్రి మోదీకి, కేటీఆర్కి ‘స్పందించండి ప్లీజ్’ అని ట్వీట్ చేశాను. నా ఫ్రెండ్స్ చేత కూడా చేయించాను. అలాగే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ని.. ‘కంప్యూటర్ ముందు కూర్చుని సానుభూతి వచనాలు పోస్ట్ చేయడం కాదు, అందరూ కదిలి రోడ్డు మీదకు రావాలి. మౌనంగా అక్షరాల్లో అసహనాన్ని వ్యక్తం చేస్తే సరిపోదు, న్యాయపోరాటం కోసం గళం వినిపించాలి’ అని కూడా కోరాను. హన్మకొండ ఏకశిలా పార్క్లో 22వ తేదీన ధర్నాలో పాల్గొన్నాం. వారం రోజుల్లో 15 రేప్లు జరిగాయి. నిర్భయ చట్టం ఏమవుతుందో తెలియడం లేదు. పోక్సో చట్టం ఎందుకు అమలు కావడం లేదో అర్థం కావడం లేదు. ఉత్తర ప్రదేశ్లో ఆరేళ్ల బాలికను రేప్ చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పారిపోతుంటే కాళ్ల మీద కాల్చారు ఎస్పి. ప్రకాశం జిల్లాలో బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన వాళ్లను గంటల్లో వెతికి పట్టుకున్నారు. పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలనుకుంటే పరిరక్షించగలరు. శ్రీహిత విషయంలో అలా అనుకోవడం లేదు ఎందుకనేదే మా ఆవేదన. చట్టం అమలవక పోవడమూ అఘాయిత్యమే. జనాగ్రహం మేము ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు చెదరగొట్టేశారు. మూడు వందల మందిని ఒక చోట ఉండనివ్వకుండా ఐదారు చోట్లకు తరిమేశారు. ఆ ఘర్షణలో అక్కడ ఉన్న జనం నుంచి ‘మేము హంతకుడిని పోలీసులకు పట్టిచ్చి తప్పు చేశాం. ఒక్కొక్కరం ఒక్కొక్క దెబ్బ వేసినా చచ్చి ఊరుకునే వాడు. మరొకడు ఈ దుర్మార్గపు పనికి పూనుకోకుండా భయపడేవారు. వాడిని మాకివ్వండి నడిరోడ్డు మీద ఉరితీస్తాం. న్యాయం అడుక్కోవడం ఏమిటి, మేమే అమలు చేస్తాం’ అనే మాటలు వినిపించాయి. జనాగ్రహం ఇంత తీవ్రంగా ఉంటే ‘తొమ్మిది నెలల పాపాయిని రేప్ చేయడం జరిగే పనేనా’ అంటూ మరొక వాదన వినిపించింది. పాపాయి ప్రైవేట్ పార్ట్స్కు గాయాలయ్యాయని, ఎముకలు విరిగి బిడ్డ దేహం ఛిద్రమయ్యి కనిపిస్తుంటే ఆ మాటలు అనడానికి వాళ్లకు నోరెలా వచ్చిందో తెలియడం లేదు. ఇదంతా కేసును నిర్వీర్యం చేయడానికి చాప కింద నీరులా జరుగుతున్న కుట్ర ఏమో అనిపిస్తోంది’’ అన్నారు కల్యాణి. శ్రీహితకు జరిగిన అన్యాయానికి నిరసనగా లండన్లో ర్యాలీ జరిగింది. ఆ సంఘటన జరిగిన వరంగల్లో పౌరసమాజం నోరు నొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఆ బిడ్డ ఎందుకు ఇంతటి దారుణానికి బలి కావాలి? ఆడపిల్లగా పుట్టడమే శ్రీహిత చేసిన తప్పా?– వాకా మంజులారెడ్డి తక్షణం శిక్ష ఉండాలి చంటి బిడ్డల మీద అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను ఇరవై నాలుగ్గంటల లోపు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. నెల రోజుల్లో తీర్పు ఇచ్చి శిక్షను అమలు చేయాలి. ఆ శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. ఎంత కఠినంగా ఉండాలంటే.. మరొకరు ఎవరైనా ఇలాంటి దురాగతానికి పాల్పడేటప్పుడు ఈ శిక్షలు గుర్తుకు వచ్చి వెనక్కు తగ్గేటట్లు భయం కలిగించాలి. అదే శ్రీహిత చట్టం. అంతటి కచ్చితమైన శ్రీహిత చట్టం.. మహిళా సమాజానికి హితకారిణి కావాలి. మద్యం తాగినందువల్లే ఇలా చేశాడని నమ్ముతుంటే... మద్యాన్ని కూడా నిషేధించాలి. నా మట్టుకు నాకు ఎదురైన సంఘటన.. ఒకసారి టాక్సీలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఉద్దేశ పూర్వకంగా రూట్ డైవర్ట్ చేశాడు. నేనది గమనించి అతడిని గట్టిగా హెచ్చరించడంతో దారికొచ్చాడు. అప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్లో కత్తి పెట్టుకుని ప్రయాణిస్తున్నాను. ఆడపిల్లలు కత్తి దగ్గర పెట్టుకోగలరేమో కానీ ఎంతమంది ఆ కత్తిని ధైర్యంగా ఉపయోగించగలుగుతారు? చట్టాలే కత్తి వాదర అంత పదునుగా మారి ఆడపిల్లకు రక్షణగా ఉండాలి.– జి. కల్యాణి, శ్వాస ఫౌండేషన్ నిర్వహకురాలు -
కుమార్తె మోసం చేసిందని తల్లి ఫిర్యాదు
కురబలకోట : కన్న కూతురే మోసపూరితంగా ఇల్లు రాయించుకుందని, న్యాయం చేయాలంటూ అంగళ్లుకు చెందిన విమలమ్మ రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. అంగళ్లుకు చెందిన విమలమ్మకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు విమలమ్మ ఒక్కరే ఉంటున్నారు. చిన్న అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఫొటో స్టూడియో ఏర్పాటుకు లోన్(రుణం) తీసుకుంటున్నట్లు ఐదేళ్ల క్రితం కూతురు చెప్పింది. ఇందుకు తల్లి సంతకాన్ని ష్యూరిటీగా కోరారని నమ్మబలికింది. దీంతో తల్లి విమలమ్మ బిడ్డ బాగుపడుతుందని మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పేపర్లపై సంతకం చేసింది. ఆ తర్వాత నిజం తెలిసిన విమలమ్మ షాక్ తింది. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తను సంతకం చేసింది.. తనకున్న ఏకైక ఆధారమైన ఇంటిని కూతురి పేరిట దాన విక్రయమని తెలిసి కుమిలిపోయింది. అప్పటి నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కుమార్తెను బతిమలాడినా ఆమె ఖాతరు చేయలేదు. చివరకు పోలీసులు, అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వృద్ధురాలు వాపోతోంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే, తూతూ మంత్రంగా విచారణ జరిపి పోలీసులు కూడా చేతులెత్తేశారని వాపోతుంది. దీంతో మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మదనపల్లెలో దీక్షకు ఉపక్రమిస్తున్నట్లు ఆదివారం విలేకరులకు తెలిపింది. ఈమె పరిస్థితి చూసి స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. -
అతివకు భరోసా!
సాక్షి, మహబూబ్నగర్ క్రైం: నిర్భయ కేసులు నమోదు తర్వాత దేశంలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అత్యాచారానికి గురైన బాధితులకు సంబంధించి ప్రస్తుత విచారణ విధానాన్ని రీవిక్టిమైజేషన్ ఆఫ్ విక్టిమ్ అని అంటారు. అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే అత్యాచారానికి గురైనా అమ్మాయి మొదట పోలీసులకు తనకేం జరిగిందో చెప్పాలి. ఆ తర్వాత వైద్యులకు, న్యాయవాదులకు, ఆపై మేజిస్ట్రేట్కు జరిగిన ఘటన నేపథ్యం వివరించాల్సి వస్తుంది, ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఆమెలోని గాయాన్ని రేపడమే అవుతుందని అధికారులు భావించారు. దీని కారణంగా వారిలో మానసికమైన కుంగుబాటు వస్తుంది. ఈ విధానానికి స్వస్తి పలికి అందరిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఎవరూ అమర్యాదగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు. మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులు పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత భరోసా కేంద్రానికి వస్తాయి. మొత్తంగా పాత విధానానికి స్వస్తి పలికేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్లో మాత్రమే ఒక మహిళా ఠాణా ఉంది. ఇక్కడకే ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో కూడా సఖి–భరోసా కేంద్రాలు ఏర్పాటైతే మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కేంద్రలోకి భాధితులు వచ్చిన వెంటనే మనోవికాస నిపుణుడు బాధితురాలితో మాట్లాడి వారికి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ముగిసిన జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు
హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) అంత్యక్రియలు శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. నగరంలోని రామస్వామి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానం వరకు ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఆయన కుమారుడు శ్రీనివాస్ మహాప్రస్థానంలోని విద్యుత్ దహన వాటికలో తండ్రి భౌతిక కాయాన్ని దహనం చేశారు. అంతకుముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఆర్డీఓ చంద్రకళ, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ రామయ్య, జస్టిస్ రామస్వామి కూతుళ్లు జ్యోతి, డాక్టర్ జయ, బంధువులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
ఒక్క సంతకం
అత్యాచారానికి బలైన ఆడబిడ్డల పరిహారంలో జాప్యం జరగడం అంటే అది మళ్లీ ఇంకో అత్యాచారం జరిగినంత దారుణం! ప్రతిదీ హక్కుల కార్యకర్తలే చూసుకోలేరు. అత్యాచార బాధితులకు తక్షణం పరిహారం అందించేందుకు ఫైళ్లను త్వరత్వరగా క్లియర్ చేయడం కోసం ప్రభుత్వ అధికారులు కూడా హక్కుల కార్యకర్తల్లా వ్యవహరించాలి. అది వారి వృత్తిధర్మం మాత్రమే కాదు. నైతిక బాధ్యత కూడా. సంతకం చేతిలో పనే కదా. నాలుగేళ్ల క్రితం రజియా వయసు 13 ఏళ్లు. మానసికంగా ‘భిన్నమైన’ అమ్మాయి. ఉండడం ఉత్తరాఖండ్లోని ఒక కుగ్రామంలో. ‘నాలుగేళ్ల క్రితం’ అంటూ విషయాన్ని మొదలు పెట్టడానికి కారణం ఉంది. 2014లో రజియాపై అత్యాచారం జరిగింది. ఆమె తమ్ముడికి పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చే 17 ఏళ్ల యువకుడు ఆ దుశ్చర్యకు ఒడిగట్టాడు. రజియాకు మాటలు కూడా సరిగా రావు. ఆమె తల్లిదండ్రులకు మాటలు వచ్చుగానీ, న్యాయం కోసం పోరాడ్డం రాదు. వారి తరఫున ‘లతిక రాయ్ ఫౌండేషన్’.. కోర్టులో కేసువేసింది. బాలికలు, మహిళల సంక్షేమంగా కృషి చేస్తుండే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ.. లతిక రాయ్ ఫౌండేషన్. సంస్థ ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఉంది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు రజియాపై అత్యాచారం చేసిన యువకుడిని జైలు పంపించింది. రజియాకు రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది జరిగింది 2016లో. అయితే యువకుడి జైలు శిక్ష వెంటనే అమలైంది కానీ, బాధితురాలికి మరో రెండేళ్ల వరకు నష్టపరిహారం అందలేదు! లతిక తర్వాతి పోరాటం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మొదలైంది. రజియా కేవలం అత్యాచార బాధితురాలు మాత్రమే కాదు. అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలు కూడా. అయితే పరిహారాన్ని తక్షణం రాబట్టడం కోసం ‘వైకల్యం’ అనే కారణాన్ని అధికారులకు చూపలేదు లతిక. కోర్టులు న్యాయం చేసినప్పటికీ, అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల రజియా లాంటి ఎందరో బాలికలు, మహిళలు తమకు దక్కవలసిన పరిహారాన్ని పొందలేకపోతున్నారని ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అలాగే ఒక వీడియోను రూపొందించి బాధిత బాలికలు, మహిళలు ఎలాంటి దీనావస్థలో ఉన్నారో చూపించింది. ఫలితంగా 2018 ఏప్రిల్లో రజియాకు పరిహారం లభించింది. అమె ఒక్కరికే కాదు, మరో 22 మంది లైంగికహింస బాధితులకు పరిహారం అందజేసే ఫైళ్లు త్వరత్వరగా కదిలాయి. ఒకవిధంగా వీళ్లంతా అదృష్టవంతులు అనుకోవాలి. హక్కుల సంస్థ కల్పించుకోబట్టి పని జరిగింది. మరి అలాంటి సంస్థల దృష్టికి రానివారి మాట ఏమిటి? ‘‘అధికారులే హక్కుల సంస్థ కార్యకర్తలుగా పనిచేయాలి’’ అని లతికఫౌండేషన్ ఆకాంక్షిస్తోంది. పరిహారం వచ్చినందువల్ల కోల్పోయింది తిరిగి రాదు. కానీ గౌరవప్రదమైన జీవితానికి ఆ మాత్రపు ఆర్థిక సహాయమైనా ఉపయోగపడుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా లతిక కోఆర్డినేటర్ ఒకరు రజియా తరఫున జరిగిన ఈ న్యాయపోరాటం గురించి వెల్లడించారు. అయితే బాధితురాలి అసలు పేరును బయటపెట్టలేదు. రజియా అన్నది మారుపేరు. -
వీరి కుటుంబానికి కులం... మతం లేవు..!
తిరుపత్తూర్లో ప్రముఖ న్యాయవాది ఆమె. దేశంలో కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మహిళ. దీనిపై ఆమె పోరాటం దేశానికి మార్గదర్శకం చేసింది. ఆదేంటో చూడాలంటే తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూర్... ఆనంత కృష్ణన్, మణిమొళి దంపతులకు పెద్ద కుమార్తె ఆమె. పోలీసులచే చిత్రహింసలకు గురై, వారికి వ్యతిరేకంగా పోరాడి జైల్లోనే ప్రాణాలు విడిచిన స్నేహలతకు గుర్తుగా ఆమెకు స్నేహ అని పేరు పెట్టారు. ఆమె తన ఇంటిపేరుగా తల్లి పేరులోని మొదటి అక్షరం ఎం, తండ్రి పేరులోని మొదటి అక్షరం ఏ రెండు కలిపి ఎంఎ.స్నేహ అయ్యింది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పుడు మొదటిసారి నీది ఏ క్యాస్ట్? అని అడిగారు. నాకు కులం లేదని మా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పిందామె. పోనీ మతం అయినా చెప్పమన్నారు. ‘మాకు కులం, మతం లేవని చెప్పారు మా తల్లిదండ్రులు’ అని సమాధానం ఇచ్చిందామె. అలా మొదలైన స్నేహ జీవితంలో పాఠశాల, కళాశాల వరకు ఎక్కడా కులం, మతం అనే ఆప్షన్ లేదు. ఆమె సోదరీమణులు ముంతాజ్, జెన్నిఫర్ కూడా అలాగే కులం, మతం అనే ఆప్షన్ లేకుండా విద్యాభ్యాసం ముగించారు. కుల, మతభేదాలు లేకుండానే పార్తిపరాజాతో ఆమెకు వివాహం జరిగింది. ఆమె పిల్లలు నజ్రీన్, ఆతిల జరీన్, ఆరీఫా జోసిలకు కూడా కులమతాలు అంటకుండా పెంచుతున్నారు. కులం, మతం అంటూ కొట్టుకునే ఈ సమాజానికి స్నేహ దంపతులు మార్గదర్శకులుగా నిలిచారు. కులాలు, మతాలతో కొట్టుకునే ఈ సమాజానికి భిన్నంగా అవేవీ వారికి లేవని నిరూపించుకునే ప్రయత్నంలో వారు తమకు కులం, మతం లేవనే ప్రభుత్వ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధికారులు పలుమార్లు వారిని నిరాశపరిచారు. వారు ఫలానా మతం, ఫలానా కులం అంటూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రభుత్వాలు, అధికారులు, వారు ఏ కులానికీ, మతానికీ చెందిన వారు కాదనే సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరనే న్యాయపోరాటం ప్రారంభించారు స్నేహ దంపతులు. అలా అలుపెరగకుండా వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఆర్డీవో ఆదేశాల మేరకు తిరుపత్తూర్ తహసీల్దారు సత్యమూర్తి స్నేహ కుటుంబం ఏ కులానికీ, మతానికి చెందినవారు కాదంటూ సర్టిఫికెట్ అందచేయటం కొసమెరుపు. అలా స్నేహ దంపతులు తాము ఏ కులానికో, మతానికో చెందినవారం కాదని, తమది మానవజాతి అంటూ ప్రభుత్వ పత్రం పొందిన మొదటి కుటుంబంగా రికార్డులకెక్కారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
జస్టిస్ కె.పున్నయ్య జీవితం ఆదర్శప్రాయం
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి స్వర్గీయ డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గొప్ప మానవతామూర్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కొనియాడారు. పున్నయ్య తన జీవితాన్ని విలువలతో కూడిన ప్రజాసేవకే అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభ గురువారం నాంపల్లి పబ్లిక్గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభా నిర్వహణ కమిటీ– హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె.రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పున్నయ్య హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ప్రగతిశీల తీర్పులను వెలువరించారని పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ.. శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మేధావిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ హోదాల్లో పనిచేసి పున్నయ్య తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారని కొనియాడారు. పున్నయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పున్నయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బి.దానం, డాక్టర్ బి.ప్రసాదరావు, డాక్టర్ ఎ.విద్యాసాగర్, టి.వి.దేవదత్, సుంకపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
2018లో ఎక్కువగా వెతికిన పదాలివే
న్యూఢిల్లీ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్–యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి. ‘టాక్సిక్’ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు ఆక్స్ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. విషపూరితమైన అనే అర్థం వచ్చేలా టాక్సిక్ పదాన్ని వాడతారని పేర్కొంది. ఈ ఏడాదికి గానూ టాక్సిక్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిందని పేర్కొంది. ఇక ‘జస్టిస్’ పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్సైట్లో వెతికారని ‘మరియమ్ వెబ్స్టర్’ అనే సంస్థ వెల్లడించింది. ‘సింగిల్ యూజ్’ అనే పదాన్ని తమ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికినట్లు కొలీన్స్ సంస్థ ప్రకటించింది. 2013వ సంవత్సరం నుంచి ఈ పదం అర్థం కోసం వెతికిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు పేర్కొంది. ‘మిస్ఇన్ఫర్మేషన్’ అనే పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్సైట్ను సంప్రదించారని ‘డిక్షనరీస్.కామ్’ అనే సంస్థ ప్రకటించింది. సమాచారం సరైనదా? కాదా? అని సరిచూసుకోకుండా వేగంగా వ్యాప్తి చెంది, తప్పు దోవ పట్టించే విషయాన్ని మిస్ ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థంగా వివరించింది. ‘నోమోఫోబియా’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయపడటం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయని వెల్లడించింది. ఎక్కువ మంది వాడే పదాలను ట్రాక్ చేసే ‘గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్ఎమ్) ఈ ఏడాది రెండు పదాలను టాప్ వర్డ్స్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. -
జస్టిస్ పీసీ రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: న్యాయకోవిదుడు, పద్మభూషణ్ జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ పీసీ రావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.82లో నివాసముండేవారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో ఆయన 1936 ఏప్రిల్ 22న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎల్, ఎంఎల్, ఎల్ఎల్డీ (డాక్టర్ ఆఫ్ లాస్) పట్టాలు, హైదరాబాద్ నల్సార్ వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. రాజ్యాంగపరమైన అంశాల్లో బాగా లోతుగా అధ్యయనం చేసి ఆయన తనదైన ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్ లా (మధ్యవర్తిత్వ న్యాయ), అంతర్జాతీయ సముద్ర జలాల న్యాయ వివాదాలు తదితర చట్టాల్లో ఆరితేరిన వ్యక్తిగా పేరొందారు. దేశం తరఫున అంతర్జాతీయ జల చట్టాల పరిశోధనాధికారిగా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వ న్యాయశాఖ, డిప్యూటీ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్లో అదనపు కార్యదర్శి, కార్యదర్శితో సహా పలు ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు. 2017 వరకు ‘ట్రిబ్యునల్’ న్యాయమూర్తిగా.. హంబర్గ్లోని అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా (1999 నుంచి 2002 వరకు), న్యాయమూర్తిగా 2017 వరకు జస్టిస్ పీసీ రావు పనిచేశారు. ఇటలీ–చైనా సముద్ర జలాల వివాదాలపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరించారు. భారత ప్రధానులుగా చేసిన ఐదుగురితో కలసి పనిచేశారు. రాజ్యాంగ అంశాలపై సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థలు, మానవహక్కులు, న్యాయపరమైన పలు రాజ్యాంగ సవరణలు తీసుకురావడంలో జస్టిస్ పీసీ రావు సేవలున్నాయి. రాజ్యాంగ అంశాలపైనే కాకుండా మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ చట్టాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్తో సత్కరించింది. జస్టిస్ పీసీ రావు మరణ వార్త తెలియగానే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ జస్టిస్ పీసీ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమెరికా నుంచి కుమార్తెలు వచ్చాక ఆదివారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో జస్టిస్ పీసీ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి. -
న్యాయం చేయాలి
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీకి చెందిన వివాహిత తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డుపై సోమవారం ఉదయం బైఠాయించింది. ఈమెకు కొండివీధికి చెందిన మహిళలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ లాబాల స్వరమణి మద్దతుగా నిలిచి రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు పది నిమిషాల పాటు అంతరాయం ఏర్పడడంతో స్థానిక సీఐ భవాని ప్రసాద్, రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు కలుగజేసుకొని ఆందోళనకారులతో మాట్లాడి ట్రాఫిక్ను సరిదిద్దారు. బాధిత మహిళ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఈమెకు పదేళ్ల కిందట బెల్లుపడ కాలనీకి చెందిన వ్యక్తితో వివాహమయింది. భర్త, ఇద్దరు పిల్లలతో ఇక్కడ నివాసముంటుంది. అయితే ఈమెపై ఇంటిలోనే ఆరు నెలల కిందట కొండివీధికి చెందిన నందిక శంకర్ అనే యువకుడు లైగింకదాడికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు అడ్డుకున్నారు. ఈ విషయమై బాధిత మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా శంకర్పై కేసు నమోదు చేసి అరెస్టుచేశారు. అయితే ఈ ఘటనతో తన భర్త తనకు విడాకులు ఇస్తానని, తన తల్లిదండ్రులు కూడా చూడరని ఇంటినుంచి పంపివేశాడు. నాపై లైంగికదాడి యత్నం జరగడంవల్లే నా భర్త నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారని దీంతో నేను నా పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచడంలేదని బాధిత మహిళ తెలి పింది. అందుకే నాకు అన్యాయం చేసిన నిందితు డు వివాహం చేసుకోవాలని, లేనిచో నేను నా పిల్లలతో జీవించేందుకైనా పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఈ ఘటనపై గతంలో బాధిత మహిళ వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అతనిపై మేము ఎటువంటి చర్యలు తీసుకోలేం అని సీఐ మహిళలకు తెలిపారు. -
‘నా పెనుకేకే సాక్ష్యం’
పోలీసులు, పాలనా వ్యవస్థ నిరోధిస్తూనే ఉన్నా న్యాయం కోసం సంవత్సరం రోజులుగా తిరుగుతున్న ఆ విద్యార్థిని పోరాట పటిమ స్ఫూర్తివంతమైనది. ఇరవై ఆరేళ్ల రెన్ లిపింగ్ చూడటానికి సన్నగా పలుచగా కనిపిస్తుంది. ఒక పురుషుడు ఆమె మీద బలం ప్రదర్శిస్తే నిలువరించలేనంతా దుర్బలంగా ఉంటుంది. కాని ఈ దుర్బలత్వం భౌతికపరమైనది మాత్రమే. ఆమె మానసిక బలం చాలా ప్రచండమైనది. లొంగనిది. భయపడనిది. అలసిపోనిది. చైనా అంతటి విశాలదేశపు పాలనా వ్యవస్థనే గడగడలాడించగలిగినది.ఇంతకూ ఈమెకు ఏం కావాలి?తనపై జరిగిన రేప్ కేసులో న్యాయం.ఎందుకు జరగడం లేదు?సాక్ష్యం లేదు అని జరగడం లేదు.నాలుగు రోడ్ల కూడలిలో నిలుచుని నేను పెట్టే పెనుకేక మీకు సాక్ష్యంగా పనికి రాదా అని ఆమె ప్రశ్న.చైనా రాజధాని బీజింగ్కు నాలుగు గంటల రైలు ప్రయాణం దూరంలో ‘కింగ్డావ్’ అనే తీర ప్రాంత నగరం ఉంది. అందులోనే ‘చైనా యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం’ ఉంది. అందులో రెన్ లిపింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు స్థాయి నుంచి విద్యార్థి. ‘ఆ క్యాంపస్లోనే నా సహ విద్యార్థి లియాంగ్ పరిచయమయ్యాడు. మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. అప్పుడప్పుడు సెక్స్లో పాల్గొన్నాం. కాని రెండేళ్ల తర్వాత మేం బ్రేకప్ అయిపోయాం’ అంటుంది రెన్. ఇంతవరకూ చెప్పిన కథతో ఆమె బాయ్ ఫ్రెండ్ లియాంగ్కు విభేదం లేదు. కాని 2017 జూన్లో జరిగినట్టు రెన్ చెబుతున్న ఘటనతో మాత్రం అతను విభేదిస్తున్నాడు. రెన్ కథనం ఇలా ఉంది: ‘ఆ రోజు సాయంత్రం ల్యాబ్లో నా పని అయిపోయాక లియాంగ్ కలిశాడు. ఇద్దరం కలిసి క్యాంపస్లో ఉన్న మా డార్మెటరీల వైపు నడుస్తున్నాం. నీతో పాటు రానా అని అడిగాడు. నేను కుదరదన్నాను. అతడు సైకిల్ మీద వెంబడించి నన్ను ఆపాడు. నా కటి ప్రాంతం పై చేయి వేశాడు. ఛీ... నువ్వో వెధవ్వి అన్నాను. ఇంతకు మునుపు నాతో గడిపినప్పుడు నేను వెధవని కాకుండా పోయానా అని రెట్టించాడు. నేను వారిస్తున్నా వినకుండా నా షార్ట్స్ లాగి నన్ను రేప్ చేశాడు’. కాని లియాంగ్ ఏమంటాడంటే: ఆ రోజు మేము కలిసింది నిజమే. కొన్నాళ్లుగా నాకు వేరే గర్ల్ఫ్రెండ్ ఉందని రెన్ నన్ను నస పెడుతోంది. ఆ రోజున ఆ గర్ల్ఫ్రెండ్తో తెగదెంపులు చేసుకోమని నన్ను కన్విన్స్ చేసింది. ఆ తర్వాత మేము వెళ్లిపోయాం’ రెన్ దీనిని పూర్తిగా ఖండించింది. ‘లియాంగ్ నాపై చేసిన అత్యాచారాన్ని బయటకు చెప్తే ఏమవుతుందోనని నేను ముందు భయపడ్డాను. కాని అప్పుడే హాలీవుడ్లో అలాగే మరికొన్ని దేశాలలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమం నాకు బలాన్ని ఇచ్చింది. అప్పుడే ఈ అత్యాచారం ఉదంతాన్ని నేను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వాళ్లు నా నోరు మూయించడానికి చూశారు. స్థానిక పోలీసుల దగ్గరకు వెళ్లాను. వాళ్లూ అదే పని చేశారు. నాకు న్యాయం జరిగేంత వరకూ వదల కూడదని నేను బహిరంగ ప్రదేశాలలో ‘నా పై అత్యాచారం జరిగింది’ అని అరచి అరచి చెబుతున్నాను. అది సాక్ష్యంగా తీసుకోరా’ అని నిలదీస్తోంది. ‘మీటూ’ ఉద్యమం వల్ల చైనాలో కొంతమంది స్త్రీలు బయటకు వచ్చి తమ మీద టీవీ పర్సనాలిటీలు, అడ్వకేట్లు, ఒకరిద్దరు సన్యాసులు చేసిన అత్యాచారాలను చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారవచ్చని అక్కడి అధికారులు అన్ని తొక్కిపట్టే పని చేశారు. రెన్ కేసుకు కూడా అదే గతి పట్టిస్తున్నారనేది పరిశీలకుల అభిప్రాయం.రెన్ నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు గోధుమలు పండిస్తారు. ‘మాకే డబ్బుంటే కేసు మరోరకంగా ఉండేది’ అంటుంది రెన్ తల్లి. రెన్ స్థానిక పోలీసుల వైఖరితో విసిగిపోయి ఏకంగా బీజింగ్కు వచ్చి అక్కడి న్యాయస్థానాలలో పిటిషన్లు దఖలు పరుస్తోంది. కంప్లయింట్ల మీద కంప్లయింట్లు ఇస్తోంది. ఏ తెల్లవారుజామునో తన అంగీకారం లేకుండా సాగిన ఆ అత్యాచారాన్ని గుర్తు చేసుకొని క్యాంపస్ నడిమధ్యకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తపరుస్తుంది. క్యాంపస్ గార్డులు ఆమెను పట్టుకెళ్లి గదిలో పడేయడం తప్ప ఆమెకు అక్కడ న్యాయం జరగడం లేదు.కాని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి.న్యాయం జరగడం గురించి కంటే అసలు అన్యాయం జరిగిందని చెప్పడమే ఒక పెద్ద విజయం అవుతుంది. ధైర్యంగా పోరాడుతున్న రెన్ ఇప్పటికే విజేత అయ్యింది. ఇక ఆమెకు న్యాయం జరగడం కేవలం లాంఛనం. బీజింగ్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న రెన్ -
న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
మూసీ ఎన్నేళ్లిలా?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జీవనాడి అయిన...చారిత్రక మూసీ నదిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు మళ్లీ న్యాయపోరాటం మొదలైంది. నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలను తక్షణం తొలగించాలని...ప్రవహించే నదిలో వ్యర్థాల డంపింగ్ను నిరోధించాలని, ప్రక్షాళనకు వీలుగా మురుగు శుద్ధి కేంద్రాలను తక్షణం నిర్మించాలని కోరుతూ ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు న్యాయ విద్యార్థులు నయీం, అఫ్తాబ్, పవన్లు ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మూసీ కాలుష్యం, ఆక్రమణలు, ప్రస్తుత దుస్థితిపై 400 పేజీల సమగ్ర నివేదికను, 500 ఫొటోలను ధర్మాసనానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో నది ప్రక్షాళనకు ఇప్పటివరకు తీసుకున్న..తీసుకుంటున్న చర్యలపై తక్షణం ధర్మాసనానికి నివేదించాలని ఆదేశిస్తూ జలమండలి, మున్సిపల్ పరిపాలన శాఖ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 27న ధర్మాసనం తిరిగి విచారించనుంది. మూసీ కాలుష్యం ఇలా.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు (డీవో) పరిమాణం కనీసం 4 మిల్లీ గ్రాములుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదాకుంటలో జలచరాలు బతకవు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) విషయానికొస్తే లీటరు నీటిలో 3 ఎంజీలను మించకూడదు. డీవో తగ్గుతున్న కొద్దీ బీవోడీ పెరుగుతుంది. అలా జరుగుతుంటే ఆ జలవనరులో కాలుష్యం పెరుగుతుందని అర్థం. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) గండిపేట దగ్గర నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే ఉంది. లీటర్ నీటిలో 2 ఎంజీలుగా ఉంది. ఇక నగరంలోకి ప్రవేశించగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 25 నుంచి 37 ఎంజీల వరకు బీఓడీ నమోదైంది. కృష్ణా నదిలో కలిసే వాడపల్లి దగ్గర 4 ఎంజీలకు తగ్గింది. జూలైలో గండిపేట దగ్గర 2 ఎంజీలుండగా.. నాగోల్ దగ్గర 24, ప్రతాపసింగారం వద్ద 20 ఎంజీలుండగా వాడపలి కాసానిగూడ వద్ద 3 ఎంజీలకు తగ్గింది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్(డీవో) గండిపేట దగ్గర లీటరు నీటిలో 5.2 ఎంజీలుండగా.. నగరంలోకి రాగానే తగ్గింది. మూసారంబాగ్ నుంచి ప్రతాప సింగారం వరకు 0.2 ఎంజీల నుంచి 1 ఎంజీలకు తగ్గిపోయింది. ఇక పిల్లాయిపల్లి దాటగానే 1.9 ఎంజీలకు పెరిగింది. వాడపల్లిలో 4 ఎంజీల కంటే ఎక్కువగా ఉంది. ఇక గండిపేటలో 4.9 ఎంజీలుండగా.. నాగోలు, ప్రతాపసింగారం దగ్గర ’0’, కాసానిగూడ వద్ద 6.2 ఎంజీలకు పెరిగింది. ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే.. మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం..పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్(142ఎంఎల్డి), నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు(80ఎంఎల్డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్(30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్ హయత్నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్ టౌన్షిప్,నాగారం కాప్రా మూసీ ప్రస్థానం ఇదీ.. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. నగరంలో బాపూఘాట్–ప్రతాపసింగారం వరకు సుమారు 45 కి.మీ ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఈ నది నాలుగోస్థానం దక్కించుకుందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మూసీని పరిరక్షించాల్సిందే చారిత్రక మూసీనది గృహ, వాణిజ్య, పారిశ్రామిక, జీవ వ్యర్థాల చేరికతో తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఈ నదిని సమగ్ర పక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకురావాలి. నదీగర్భంలోనికి చొచ్చుకొచ్చిన అక్రమనిర్మాణాలను తక్షణం తొలగించాలి. నగరంలో మూసీ ప్రవాహిస్తోన్న మార్గం డంపింగ్ యార్డును తలపిస్తోంది. నదిలో చేరిన వ్యర్థాలను శుద్ధిచేయడంలో సంబంధిత విభాగాలు విఫలమవుతున్నాయి. – ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ వేత్త -
న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఫిర్యాదు
జంగారెడ్డిగూడెం రూరల్ : తమకు న్యాయం చేయాలంటూ మండలంలోని వేగవరం నోవా కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణకు విన్నవించుకున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, దీని వల్ల తాము ఏడాది చదువు నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్ధులు డీఎస్పీకి వివరించారు. డిగ్రీలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తాము ప్రాక్టీకల్స్లో ఫెయిల్ కావడం ఏమిటని కావాలనే తమను ఫెయిల్ చేశారంటూ డీఎస్పీ వద్ద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా పీజీ కోర్సులో చేర్చేలా చూస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీకి వివరించారు. దీంతో నెల రోజుల పాటు తాము కళాశాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో మిమ్మల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని డీఎస్పీ వద్ద వాపోయారు. విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారని తెలుసుకుని కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నచ్చజెప్పె ప్రయత్నాలు చేశారు. దీనిపై కళాశాల సిబ్బంది మాట్లాడుతూ ప్రాక్టికల్ మార్కులు యూనివర్సిటీ పరిధిలో ఇస్తారని, తమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, యూనివర్సిటీకి ఫిర్యాదు చేసి న్యాయం చేస్తామని చెబుతున్నారు. -
వెలి సంకెళ్లు
ఆ పాత దురాచార బంధాలు ఇంకా వీడలేదు. కట్టుబాట్ల సంకెళ్లుకు ఇంకా విముక్తి కలదు. చేయని పాపానికి 36 ఏళ్లుగా ‘వెలి’ శిక్ష నుంచి వారు బయటపడలేకున్నారు. ఆ నాటి దురాచా రాల చట్రంలో చిక్కుకున్న 10 కు టుంబాల కళ్లు ఇంకా శోకిస్తూనే ఉన్నాయి. ఊరంతా పండుగ చేసుకుంటుంటే ఆ కుటుంబాల్లో మాత్రం రోదనలు వినిపిస్తుంటాయి. మాతమ్మ ఆలయం వద్ద పూజలు జరుగుతుంటే, ఆ ఇళ్లలోని వారి గుండెలు క్షోభతో ఎగిసెగిసి పడుతుంటాయి. సమాజం నవనాగరికమైనా, సత్యేవేడు అరుందతివాడ వాసులు మాత్రం ఇంకా వివక్ష అనే శిక్షను అనుభవిస్తున్నారు. చిత్తూరు : కాలం మారింది. పరిస్థితులూ మారాయి. ఆధునిక యుగంలో ఆ కుటుంబాల్లోని వారు విద్యావంతులయ్యారు. చైతన్యంచిగురించింది. ఈ కాలంలోనూ వెలి అనే దురాచారం ఏమిటి? అని నిలదీశారు. అయినా, గ్రామ పెద్దలు స్పందించలేదు. పోలీసులను ఆశ్రయిస్తే, ఫలితం దక్కలేదు. సాంఘిక దురాచారాలపై గళమెత్తే సమాజ హితులు రంగంలోకి దిగితే కానీ, పరిస్థితి చక్కబడేలా కనిపించడం లేదు. సత్యవేడు:సత్యవేడు మండలం రాజగోపాలపురం పంచాయతీ ఆరుందతివాడలో 130 కుటుంబాలు ఉన్నాయి. వారిలో 10 కుటుంబాలను 36 ఏళ్ల నుంచి వెలి అనే దురాచారంలో బందీలు చేశారు. గ్రామ దేవత పూజలకు కూడా వారిని అనుమతిం చడం లేదు. నాటి పెద్దల అనాగరిక ఆచారాలకు నేటి తరం బలవుతోంది. ఇదీ కథ.. గ్రామంలో 36 ఏళ్లక్రితం ఆరిముల్ల, తలారి, ఈతముక్కుల కుటుంబాల వారు తప్పు చేశారని, అప్పటి పెద్దలు అనాగరిక ఆచారమైన వెలి శిక్ష వేశారు. ఆ కుటుంబాలను గ్రామంలోని దేవతకు పూజలు చేయనివ్వకుండా వెలివేశారు. ఆ మూడు కుటుంబాలు ప్రస్తుతం 10 కుటుంబాలకు పైగా పెరిగాయి. 36 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు వెలి అనే శిక్షకు గురైన వృద్ధులు మృతి చెందారు. ఆ నీడలు ఇంకా వారి మనుమలు, మని మనవళ్లను కూడా వెంటాడుతూనే ఉన్నాయి. చ దువుతో పెరిగిన చైతన్యంతో ఆంక్షలపై నిలదీశా రు. అయినా స్పందన లేదు. ఇప్పటికీ ఆరిముళ్ల, తలారి, ఈత ముక్కుల కుటంబాల వారితో సంబంధాలు పెట్టుకోకూడదని, ఏ కార్యాలకు వెళ్లరాదని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పూజలకు అనర్హం.. గ్రామంలో మాతమ్మ దేవాలయం ఉంది. తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో ఇంటింటా చందాలు వసూలు చేస్తారు. అయితే, ఆ పది కుటుంబాల నుంచి మాత్రం ఎలాంటి చందా తీసుకోవడంలేదు. తాము పూజలు చేస్తామని, చందా తీసుకోవాలని వారు కోరుతున్నా కట్టుబాట్ల పేరిట తీసుకోవడం లేదు. పూజలు చేయకూడదని, పొంగళ్లు పెట్టకూడదని, నైవేద్యం సమర్పించరాదని పెద్దలు అడ్డుకుంటున్నా రు. ఈ కట్టుబాట్లు అతిక్రమిస్తే, ఆపరాధం చెల్లించా లని హెచ్చరిస్తున్నారని వివక్ష శిక్ష అనుభవిస్తున్న కుటుంబాలు కన్నీటిపర్యంతం అవుతున్నాయి పోలీసులను ఆశ్రయించినా.. పూజలు చేయనివ్వకుండా.. అడ్డుకుంటున్నారని బాధితులు గత వారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. గ్రామపెద్దల చర్యల నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకున్నారు. తమ గ్రామంలో వివక్ష ఉందని, ఈ కట్టుబాట్ల నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు. సర్దుకుపోం డని పోలీసులు సమాధానం ఇవ్వడం మినహా, న్యాయం చేయలేదని వాపోతున్నారు. కట్టుబాట్లు వీడని పెద్దలు కాలం మారుతున్నా నేటికి రాజగోపాలపురం అరుందతివాడలో కులపెద్దలు ఆచారం , కట్టుబాట్ల పేరుతో స్థానికులను వివక్షతకు గురిచేస్తున్నారు. గ్రామంలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు, ఉద్యోగులు ఉన్నారు. స్వేచ్ఛ, హక్కుల కోసం ర్యాలీలు, పోరాటాలు చేసిన వారు గ్రామంలో ఉన్నారు. వివక్ష వీడాలని యువత కోరినా పెద్దలు పట్టువీడడం లేదు. పుట్టి పెరిగిన ఊరిని వదలలేక, రోజూ మానసికక్షోభ అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. 36 ఏళ్లుగా కన్నీళ్లే... ‘‘అందరూ గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. మనమేం తప్పు చేశామని పూజలు చేయనియ్య రు’’ అని పిల్లలు అడిగినప్పుడల్లా ఏడుపు వస్తోంది. నాకు వివాహం జరిగి 36 ఏళ్లయ్యిం ది. కొత్త కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి ఊర్లో ఉన్న గుడిలో మాతమ్మకు పూజ చేసే భాగ్యం లేదు. గ్రామంలో మాతమ్మ తిరునాళ్ల చేసినా, వినాయకచవితి జరిగినా గుడి వద్ద పొం గళ్లు పెట్టిందిలేదు. గ్రామదేవత ఊరేగింపు మా వీధిలోకి రాదు, వచ్చినా మాచేత అమ్మవారికి హారతులు పట్టించరు. ఊర్లో సంబరాలు జరుగుతుంటే, మా ఇంట్లో కన్నీళ్లు వస్తుంటాయి.–గుర్రమ్మ, అరుందతివాడ, రాజగోపాలపురం వేదన భరిస్తున్నాం.. ఊర్లో అమ్మవారిని కొలిచేందుకు పెద్దలు అ నుమతించరు. కట్టుబాట్ల పేరిట గుడి ఛాయలకే రానివ్వరు. వెళితే.. ఆపరాధం వేస్తామని హెచ్చరిస్తారు. గ్రామంలో పండుగ జరిగితే అందరూ బంధువులను పిలుచుకుంటారు. మాకు ఆ భాగ్యం లేదు. పంచాయతీ పెద్దల కు చెప్పుకున్నాం. అరుందతివాడలో వారందరూ ఒకే కులస్తులు. వివక్షత ఎందుకంటు న్నా, పెద్దలు వినిపించుకోవడం లేదు. గత్యం తరం లేక తోటికులం వారితోనే అవమానాలు భరిస్తూ, జీవనం సాగిస్తున్నాం.–జమునమ్మ, అరుందతివాడ సమాచారం తెలిసింది.. రాజగోపాలపురంలోని అరుందతివాడలో వి వక్షత విషయం కొద్ది రోజుల క్రితమే తెలిసిం ది. పోలీసులతో కలిసి గ్రామంలో వివక్షతను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. వి వక్షతపై గ్రామంలో సభలు, కౌన్సెలింగ్ ద్వా రా అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటాం. దేవాలయంలో పూజలు అడ్డుకోవ డం నేరం.– శ్రీనివాసులు, తహసీల్దార్ సత్యవేడు -
కనికరించండయ్యా..!!
అవనిగడ్డ: ఈ ఫొటోలో నిలబడటానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పేరు పంచకర్ల నాంచారమ్మ. వయసు 85ఏళ్లు పైనే. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేతికర్ర సాయంతో నడుచుకుంటూ అతి కష్టం మీద వచ్చింది. కనిపించిన వారినల్లా పలుకరిస్తూ అయ్యా! నాకు న్యాయం చేయండని వేడుకొంది. సరిగా వినబడని ఈ వృద్ధురాలిని ప్రశ్నించగా.. కన్నీరు మున్నీరవుతూ తన గోడు వెళ్లబోసుకుంది. ‘చల్లపల్లి మండలం మాజేరు గ్రామం. నా చిన్నకొడుకు చంద్రశేఖర్ ఏడేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కొడుకు వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం లోకం విడచి వెళ్లిపోయాడు. మాజేరులో మాకు మూడు కుంటలు పొలం ఉండేది. అంతా అమ్మేసి నన్ను రోడ్డున పడేశారు. మనుమడు, మనుమరాలు ఉన్నా చూడరు. రాత్రి వర్షానికి గోనెసంచి దొరికితే తలపై పెట్టుకుని చల్లపల్లిలో ఓ షాపు ముందు తలదాచుకున్నాను. కట్టుకున్న చీర తడచి పోవడంతో చలికి వణకిపోయాను. అవనిగడ్డ వెళ్లు అక్కడ అధికారులకు చెప్పుకుంటే నీ బాధలు తీరతాయి అంటే ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎక్కడుంటారో, ఎవరిని కలవాలో తెలియదయ్యా? నాకు న్యాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా అంటూ కనబడిన వారినల్లా ఆ బామ్మ చేతులు పట్టుకుని వేడుకుంటున్న దృశ్యం చూపరులను కలచి వేసింది. ఆ వృద్ధురాలికి స్థానికులు భోజనం పెట్టించి కూర్చోబెట్టారు. స్పందించిన డీఎస్పీ.. ఈ విషయాన్ని స్ధానిక విలేకరులు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయగా స్పందించిన డీఎస్పీ వి.పోతురాజు సిబ్బందిని పంపించి స్థానిక కార్యాలయానికి తీసుకొచ్చారు. మాజేరు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు డీఎస్పీ తెలిపారు. -
ధర్మాసనంపై చెరగని ముద్ర
న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విషయంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజాస్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెందరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక పద్ధతిలో పారదర్శకత లేదని గళమెత్తడంతోపాటు, సుప్రీంకోర్టులో అమల వుతున్న ఏకపక్ష విధానాలపై ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించి సంచలనం సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేడు (శుక్రవారం) పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన తన పదవీ కాలంలో ఇచ్చిన వివిధ తీర్పులు శిఖరాయమానమై నవి. ముఖ్యంగా కొలీజియం పనితీరు విషయంలో జస్టిస్ చలమేశ్వర్ అభ్యంతరాలు గమనించదగ్గవి. ఒకరిని న్యాయమూర్తిగా ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు చేయలేదో కారణాలు నమోదు చేయ కుండా నియామక ప్రక్రియ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పష్టత రాని కారణంగా ఆయన కొంత కాలంపాటు కొలీజియం సమావేశా లకు కూడా హాజరుకాలేదు. జాతీయ న్యాయమూ ర్తుల నియామక కమిషన్ని కొట్టివేసిన తీర్పులో చలమేశ్వర్ తన అస మ్మతి తీర్పుని వెలువరించారు. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని వ్యాఖ్యా నించారు. న్యాయ మూర్తుల ఎంపిక విధానంలో న్యాయమూర్తుల మాటకే ప్రాధాన్యం ఉండటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పాల నలో పారదర్శక తకి అధిక ప్రాధాన్యత ఉండాలని కూడా సూచించారు. హైకోర్టు కొలీజియమ్ ఎంపిక చేసిన న్యాయమూర్తుల పేర్లను తిరస్కరించి మళ్లీ తిరిగి సుప్రీంకోర్టు పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల అనవసర ఊహాగానాలకి అవ కాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో జవాబుదారీ తనం లేదు. ఆ రికార్డులు ఎవరికీ అందుబాటులో ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కూడా. అవి చూడాలని అనుకున్న వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తప్ప చూడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితివల్ల సుప్రీంకోర్టు విశ్వసనీయత పెరగదు. అది ఈ దేశ ప్రజలకి మంచి చేయదు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా దూరం పెట్టడం సరైంది కాదని ఆయన భావించారు. అయితే మెజారిటీ నిర్ణయం మరోలా ఉన్నందువల్ల చట్టాన్ని ఇంకా పరిశీలించదల్చు కోలేదని చలమేశ్వర్ తన అసమ్మతి తీర్పులో ప్రక టించారు. ఆయన 19 సంవత్సరాలు న్యాయవాదిగా, ఆ తరువాత సీనియర్ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తరువాత న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతీ, కేరళ హైకో ర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం వేసవి సెలవులకి ముందు చివరి రోజైన గత నెల 18న చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మరో న్యాయమూర్తి జి.వై. చంద్రచూడ్లతో కలసి ధర్మాసనంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయ వాదుల సంఘం ఏర్పాటు చేయదల్చిన వీడ్కోలు సమావేశాన్ని ఆయన తిరస్కరించారు. మొన్న జన వరి 12న ముగ్గురు సహచర సుప్రీంకోర్టు న్యాయ మూర్తులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలని ఎత్తిచూపారు. ఈ కారణంవల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తితోబాటు ధర్మాసనంలో ఉంటారా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. కానీ ఆయన సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సాంప్రదా యాన్ని గౌరవించారు. తన తీర్పుల ద్వారా, తన ఉత్తరాల ద్వారా, తన చర్యల ద్వారా చలమేశ్వర్ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఆయన నేతృత్వం వహించిన మీడియా సమావేశం దేశ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఎత్తిచూపిన సమా వేశం అది. ఆయన రాసిన ఉత్తరాల ప్రభావంగానీ, మీడియా సమావేశ ఫలితాలుగానీ వెనువెంటనే కన్పించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అవి సత్ఫలి తాలని ఇస్తాయి. తన ముందుకొచ్చిన భారత వైద్య మండలి(ఎంసీఐ) కేసును జస్టిస్ చలమేశ్వర్ ఒక బెంచ్కు పంపడం, ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్ తానేనని చెబుతూ ఆ ఉత్తర్వులు నిలిపే యడం సంచలనం కలిగించింది. తన కేసుకి తానే న్యాయమూర్తి కాకూడదన్న ప్రాథమిక న్యాయసూ త్రానికి సుప్రీంకోర్టు తిలోదకాలు ఇచ్చింది. ఐటీ చట్టంపై సంచలనాత్మక తీర్పు జస్టిస్ చలమేశ్వర్ మరో న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్తో కలిసి భావ ప్రకటనా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66ఏ రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడు తుంది. అలాగే ఆధార్ కార్డు లేని కారణంగా సబ్సి డీలు ఏ పౌరునికి నిరాకరించడానికి వీల్లేదన్న బెంచ్లో ఆయన భాగస్వామి. ఇక లేఖల విషయానికి వస్తే– ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుచిత సామీప్యత ఉందని ఆరోపిస్తూ ఆయన రాసిన లేఖ శిఖరాయమానమైనది. మన హైకోర్టు న్యాయమూ ర్తుల నియామకాలలో ఆ ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉండటం బయటి రాష్ట్రాలలోని వ్యక్తులని ఆశ్చర్యానికి గురి చేసింది. గళం విప్పిన న్యాయమూర్తులు న్యాయ పరిపాలనలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతు న్నప్పుడు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చల మేశ్వర్ నేతృత్వంలో గొంతెత్తడం దేశ చరిత్రలో అరు దైన సంఘటన. చరిత్రాత్మక సన్నివేశం. న్యాయవ్యవ స్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఆ సమా వేశంలో బహిర్గతం చేశారు చలమేశ్వర్. న్యాయమూ ర్తులు మీడియాతో మాట్లాడకూడదన్న విమర్శలు చెలరేగాయిగానీ వారు తమ తీర్పుల గురించి మాత్రమే మాట్లాడకూడదు. న్యాయ పరిపాలన గురించి అభిప్రాయాలు వెల్లడించడంలో తప్పేం లేదు. అది న్యాయమూర్తుల నడవడికకు విరుద్ధం కాదు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి కొలీజియమ్ సిఫారస్ చేసిన ఓ సీనియర్ జిల్లా జడ్జి మీద దర్యాప్తు చేయడం న్యాయ పరిపాలనలో ప్రభుత్వ జోక్యమని చలమేశ్వర్ స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా పని చేస్తున్న పి.క్రిష్ణ భట్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపి వేసింది. కానీ ఆయనతోపాటు పంపిన ఇతరుల పేర్లను ఆమోదించింది. ఓ మహిళా న్యాయమూర్తి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు కారణాన్ని కేంద్ర ప్రభుత్వం చూపింది. ఈ విష యమై అంతకుముందే ప్రధాన న్యాయమూర్తి విచా రణ జరిపి అందులో నిజం లేదని తేల్చారు. జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖతో క్రిష్ణభట్పై విచారణ నిలిచి పోయింది. జస్టిస్ జోసెఫ్ నియామకం వ్యవహారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరుని, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందూ మల్హోత్రా పేరుని ఆమోదించి కేఎమ్ జోసఫ్ పేరుని కొన్ని బలహీ నమైన కారణాలు పేర్కొంటూ తిరిగి పంపించింది. ఈ విషయమై చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాంతో కొలీజియం సమావేశమై తిరిగి జస్టిస్ జోసెఫ్ పేరును సిఫార్సు చేయాలని సూత్ర ప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంతవరకూ ఆ పేరును తిరిగి పంపలేదు. చలమేశ్వర్ పదవీ విర మణ చేసే వరకు కొలీజియం సమావేశం జరుగ లేదు. ఆయన పేరుని పరిశీలనకు పంపిస్తారో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. చలమేశ్వర్ మాదిరిగా కొత్తగా కొలీజియంలో చేరిన న్యాయ మూర్తి సిక్రీ మాట్లాడుతారా అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆయన వీడ్కోలుని తీసుకోలేదు కానీ ఆయన పనిచేసిన చివరి రెండు రోజులు సీనియర్ న్యాయవాదులు ఆయనకు సేవలను ఎంతగానో కొనియాడి ఆయ నను జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాతో పోల్చారు. ఖన్నా చిత్రçపటం చలమేశ్వర్ నిర్వహించిన రెండవ కోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టు హాల్స్లో వ్రేలాడదీసిన చిత్ర పటం అదొక్కటే. భవిష్యత్తులో చలమేశ్వర్ చిత్రపటా నికి కూడా అక్కడ స్థానం లభించవచ్చు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియ మించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విష యంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజా స్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. దాని నేపథ్యం బోధపడదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెం దరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చల మేశ్వర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయంత్రం ఓ అభినందన సమావేశం జరిగింది. అప్పుడు నేను మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నాను. నేను న్యాయవ్యవస్థ మీద రాసిన ‘హాజిర్హై’ కవితా సంపుటిని ఇచ్చాను. దాన్ని మెచ్చుకుంటూ ఆయన నాకు ఉత్తరం రాశారు. అందులో ‘మూడు తలల రాజసింహం’ అన్న ఓ కవిత ఉంటుంది. ఈ చరణాలు అందులో ఉన్నాయి. ‘... మూడు తలల్తో రాజసింహం కుర్చీమీద నిఘా వేసుక్కూర్చుంటుంది’ ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు దుర్భ రంగా తయారవుతోంది. వ్యాసకర్త కవి, రచయిత మంగారి రాజేందర్ 94404 83001 -
పారదర్శకత కోసమే టీజేఎస్
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్లో చేరగా, టీచర్స్ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై కేసీఆర్ సవతి ప్రేమ మక్తల్ : సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్ కన్వీనర్ రాజేందర్రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్ పాల్గొన్నారు. భూములు లేకుండా చేయడమేనా? మాగనూర్ (మక్తల్) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్ ఉన్నారు. -
న్యాయమా.. నీవెక్కడా!
నెల్లూరు మెక్లిన్స్రోడ్డుకు చెందిన సయ్యద్ జకావుల్లా 2016 సెప్టెంబర్లో దారుణ హత్యకు గురైయ్యాడు. ఆయన్ని అధికార పార్టీ నేతల అనుచరులు హత్యచేశారని, అలాగే నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారుస్తున్నారని హతుడి తండ్రి సయ్యద్ మహబూబ్బాషా పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. తన కుమారుడి హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా గ్రీవెన్స్డేలో పోలీసు ఉన్నతాధికారులకు అర్జీలిచ్చారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగలేదు. నెల్లూరు(క్రైమ్): ‘‘పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగడం లేదు.. కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. మీరైనా న్యాయం చేయండి సారూ’’ అంటూ ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో బాధితులు గ్రీవెన్స్డేలో పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమగోడును వినిపిస్తున్నారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉన్నతాధికారులు సంబం ధింత సిబ్బందిని ఆదేశించి ‘‘న్యాయం జరుగుతుంది, ఇక వెళ్లండి’’ అని పంపివేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం మిధ్యగానే మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో గడచిన ఐదు నెలల్లో పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 1461 ఫిర్యాదులు అందగా అందులో 1131 ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదు. కానరాని న్యాయం జిల్లాలో సుమారు 35 లక్షల మంది జనాభా ఉండగా వారి రక్షణ కొరకు ఐదు సబ్డివిజన్ల పరిధిలో 22 సర్కిళ్లు, 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 2500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని గ్రహించి 2001లో అప్పటి ఎస్పీ కె.శ్రీనివాసులరెడ్డి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్డేకి పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగని బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వారి సమస్యలను విన్న పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారించి, సత్వరమే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం, వారు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరిగేది. అలాగే సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేవి. దీంతో పెద్ద ఎత్తున బాధితులు గ్రీవెన్స్డేకి వచ్చేవారు. అయితే తర్వాత కొంతకాలం ఈ పక్రియకు బ్రేక్ పడింది. 2011 జూలైలో అప్పటి ఎస్పీ బి.వి.రమణకుమార్ గ్రీవెన్స్డేను కొనసాగించారు. అనంతరం సెంథిల్కుమార్ హయాంలోనూ గ్రీవెన్స్డేలో సమస్యలు చకచకా పరిష్కారమయ్యేవి. అయితే అనంతరం వచ్చిన ఎస్పీల ఉదాసీన వైఖరి కారణంగా సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్లో ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆయన గ్రీవెన్స్డేని సోమవారమే కాకుండా గురువారం నిర్వహించడం ప్రారంభించారు. దీంతో బాధితుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పిస్తున్నారు. తొలిరోజుల్లో ఎస్పీపై ఉన్న భయంతో సిబ్బంది బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేవారు. అయితే రానురాను పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 1131 ఫిర్యాదులు పెండింగ్ ఈ ఏడాది మే వరకు జిల్లా వ్యాప్తంగా 1461 ఫిర్యాదులు అందాయి. వాటిలో కేవలం 330 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 1131 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా భార్య, భర్తల గొడవలు, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అదృశ్యం కేసులు, చీటింగ్ కేసులు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ రామకృష్ణ కేసును పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. అయితే ఎస్పీ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఆ ఆదేశాలను లెక్కచేయకుండా బాధితులను స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొందరు సిబ్బంది మరో అడుగు ముందుకేసి ఎస్పీ చెప్పినా ఏం చేసేది లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు స్టేషన్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. అర్థ, అంగబలం ఉన్నవారికే న్యాయం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. 2018లో 1461 ఫిర్యాదులు అందగా 1131 ఫిర్యాదులు నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. కేసులన్నీ పరిష్కారమవుతున్నాయి గ్రీవెన్స్డేకి వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికంగా సివిల్ వివాదాలు, దొంగతనం కేసుల్లో రికవరీకి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. దొంగతనాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నేరస్థులను పట్టుకుని, సాధ్యమైనంత మేర సొత్తును రికవరీ చేస్తున్నాం. ఇక సివిల్ వివాదాల విషయంలో చట్టపరిధిలో ఉన్న అంశాలన్నింటినీ పరిశీలించి, అవసరమైన మేరకే చర్యలు తీసుకుంటున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, ఎస్పీ -
అర్ధాంతరంగా ముగిసిన అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష
సాక్షి, గుంటూరు: నెల రోజుల్లోగా అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు గుంటూరు విజ్ఞాన మందిరంలో కొనసాగుతున్న దీక్ష అర్ధాంతరంగా ముగిసింది. దీక్షతో పాటు బాధితులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర కూడా విరమించుకున్నట్లు నేతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుండా అర్ధాంతరంగా ఆందోళన విరమించడాన్ని బాధితులు తప్పుబట్టారు. నిర్దిష్ట హామీ లేకుండా పాదయాత్ర ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటో చెప్పాలని, రాష్ట్రం నలుమూలల నుంచి వస్తే మాకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. మంత్రి నక్కా ఆనందబాబు ఏం హామీ ఇచ్చి దీక్షను విరమింపచేశారని నేతలను బాధితులు ప్రశ్నించారు. దీక్షా శిబిరానికి ఓ మంత్రి వచ్చి హామి ఇవ్వటం గొప్పేకదా నేతలు చెప్పటం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా జరుగుతున్నదే మళ్లీ జరిగిందని, ఇందులో వింతేముందంటూ బాధితులు వాపోతున్నారు. అయితే నేతలు వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన విరమించండి: మంత్రి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో మంత్రి నక్కా ఆనందబాబు విజ్ఞాన మందిరంలో గురువారం ఉదయం సమావేశం అయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈరోజు జరిగే మంత్రివర్డ సమావేశంలో చర్చిస్తామని, ఆందోళన విరమించండని కోరారు. దీంతో మంత్రి ప్రసంగానికి బాధితులు అడ్డుపడ్డారు. డబ్బు ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితమై కాలయాపన చేస్తున్నారని నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి కొంత సమయం ఇవ్వమని బాధితులని కోరారు. అయితే తమకు డబ్బులు ఇచ్చేందుకు కచ్చితమైన సమయం చెప్పాలంటూ నినాదాలు చేయగా మంత్రి మాట దాటేశారు. ఈ రోజు సాయంత్రం ఐదుగురికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పిస్తానని మంత్రి అన్నారు. ఆందోళన చేసిన ప్రతిసారి ప్రభుత్వం మోసపూరిత హామీలిస్తోందంటూ బాధితులు ఆగ్రహం చెందారు. -
గర్భస్రావంపై నిషేదం ఎత్తివేస్తారా..? కొనసాగిస్తారా..?
-
ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
తణుకు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా అనుభవించి ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జవ్వాది మాధురినాగనవ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన లంకదాసు శివగణేష్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తణుకులోని ఒక సెల్ దుకాణంలో వీరిద్దరూ పనిచేస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనే నెపంతో ఫిబ్రవరిలో శివగణేష్పై తణుకు రూరల్ పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల బెయిల్పై వచ్చిన గణేష్ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి తనను శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. గణేష్ తండ్రి బాబూరావు సైతం పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని చెబుతోంది. మరోవైపు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సైతం తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తోంది. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి, రూరల్ ఎస్సై సీహెచ్వీ రమేష్లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గణేష్ కుటుంబసభ్యులు అందుబాటులో లేరు. -
వేకువజామున మూడింటిదాకా కేసుల విచారణ
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు. ‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి. -
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి
పట్నంబజారు (గుంటూరు): అన్యాయం జరిగినా ఆలకించలేదు.. బాలికపై అఘాయిత్యం జరిగినా మూడు రోజులు పాటు ప్రభుత్వ పెద్దలు బాధ్యతను విస్మరించారు.. చిన్నారికి జరిగిన అన్యాయానికి...ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గర్జించాయి. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డెక్కాయి. దాచేపల్లిలో మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురైన చిన్నారిని చూసేందుకు వైఎస్సార్ సీపీ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, లీగల్ విభాగం గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ నేతల పాదర్తి రమేష్గాంధీతో కలసి బాలికను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు, ఆర్ఎంవో యనమల రమేష్ను చిన్నారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందజేసి, త్వరితగతిన కోలుకునేలా చూడాలని జీజీహెచ్ అధికారులును కోరారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చిన్నారిని పరామర్శించిన తరువాత జీజీహెచ్ నుంచి బయటకు వచ్చి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి చినరాజప్ప జీజీహెచ్కు వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బలవంతంగా పార్టీ నేతలు, కార్యకర్తలను అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టారు. కార్యకర్తలు మంచినీరు అందజేసి పక్కకు తీసుకునివచ్చారు. పోలీసుల ఓవర్యాక్షన్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాతో పార్టీ నేతలు జీజీహెచ్కు వస్తున్నారని తెలిసిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాన్పుల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారిని చూసేందుకు వెళుతున్న నేతలను ఆ వార్డు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ.. నెట్టుకుని లోపలికి వెళ్లారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, దేవళ్ల రేవతి, అంగడి శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గనిక ఝాన్సీ రాణి, మేరువ నర్సిరెడ్డి, పరసా కృష్ణారావు, పసుపులేటి రమణ, ఆరుబండ్ల కొండారెడ్డి, సోమి కమల్, నిమ్మరాజు శారదలక్ష్మి, పానుగంటి చైతన్య, షేక్ గౌస్, షేక్ రబ్బాని, ఏటుకూరి విజయసారథి, మేరిగ విజయలక్ష్మి, జ్యోతి, స్వర్ణ, వడ్లమూడి రత్న, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలి
హత్నూర(సంగారెడ్డి): జమ్ముకాశ్మీర్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.నరేష్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూరలో మాట్లాడుతూ... సభ్య సమాజం సిగ్గుపడేలా ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతుండటం దారుణమన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దుండగులకు ఉరిశిక్ష వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు రాజు, అనిల్, ప్రకాశ్, నవీన్, శంకర్ తదితరులు ఉన్నారు. -
పోలీసులు..ప్రజలకు చేరువకావాలి
మైలార్దేవ్పల్లి: పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ నేరాలు అరికట్టడంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ముందుకు సాగాలని సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు. సెన్సిటేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ యూనిఫాం సర్వీస్ డెలివరీ కార్యక్రమం శంషాబాద్ జోన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మైలార్దేవ్పల్లి డివిజన్ బాబుల్రెడ్డినగర్లోని తలాడియం లగ్జరీ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులకు సకాలంలో న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ పోలీసులను గౌరవిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పోలీసు వ్యవస్థ ముందుకు వెళ్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఇతర రాష్ట్ర పోలీసులు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత హోదాల ఆధారంగా అధికారులు స్పందించకూడదని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలి సమాజంపై పడుతుందన్నారు. శాంతిభద్రతలు పరిరక్షణ, నేరరహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాలలో ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇటీవల సీసీ కెమెరాల సహాయంతో నగరంలో పలు ముఖ్యమైన కేసులను ఛేదించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ప్రజలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో పోలీసులంటే భయం లేకుండా దైర్యంగా పోలీస్స్టేషన్లకు వచ్చే విధంగా పోలీసు వ్యవహారశైలి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్కుమార్, శంషాబాద్ ఏసీపీ అశోక్కుమార్, ఏసీపీ సురేందర్రావు, మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది
న్యూఢిల్లీ: కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు శుక్రవారం పెదవి విప్పారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్న ఆయన.. నేరస్తులనెవ్వరినీ వదిలిపెట్టబోమనీ, బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. ఈ రెండు ఘటనలు దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై మోదీ మాట్లాడుతూ ‘గత రెండు రోజులుగా దేశం మొత్తాన్నీ కుదిపేస్తున్న ఘటనలు అసలు ఓ నాగరిక సమాజంలో జరగాల్సినవే కావు. ఇంతటి ఘోరం జరిగినందుకు ఈ దేశంలో, ఈ సమాజంలో భాగమైన మనమంతా సిగ్గుపడాలి. తమ జీవితాలను ధారపోసి మన స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులకు ఇది అవమానం. దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరని నేను దేశానికి భరోసా ఇవ్వదలచుకున్నా. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. మన బిడ్డలకు తప్పక న్యాయం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శుక్రవారం మోదీ ఢిల్లీలో అంబేడ్కర్ స్మారకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘మహిళలపై లైంగిక హింస, అత్యాచారం తదితర దురాగతాలు జరగకుండా చూసేందుకు ప్రజలంతా కలసి పనిచేయాలి. అందుకోసం కుటుంబ సభ్యులే పిల్లలకు సామాజిక విలువలను అలవర్చాలి. మన కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను మనం పటిష్టపరచుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారిపోనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది తమ ప్రభుత్వమేనని మోదీ పేర్కొన్నారు. ఈ చట్టం కింద జాబితాలో ఉన్న నేరాల సంఖ్యను 22 నుంచి తమ ప్రభుత్వం 47కు పెంచిందన్నారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ ఆయన బతికున్నప్పుడు, చనిపోయాక కూడా అవమానించిం దనీ, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటోందని మోదీ ఆరోపించారు. -
మరో జడ్జీపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జీలపై ఏసీబీ దూకుడు పెంచింది. గడిచిన నెల రోజుల్లో ఇద్దరు జడ్జీలపై కేసులు నమోదు చేసిన ఏసీబీ.. శుక్రవారం మరో సెషన్స్ జడ్జీపై కేసు నమోదు చేసింది. నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తిపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అల్వాల్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ విలువైన ఆస్తుల పత్రాలు లభించాయని, వాటి వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన దత్తు అనే విద్యార్థి బెయిల్ కోసం రూ.7.5 లక్షల లంచం తీసుకున్నట్టు హైకోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో అంతర్గతంగా న్యాయశాఖ విచారణ జరిపి, వాస్తవం అని తేలడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగగా విషయం మొత్తం బయటపడింది. ఎక్సైజ్ కేసు (ఎన్డీపీఎస్యాక్ట్)లో పట్టుబడ్డ ఎంటెక్ విద్యార్థి దత్తు నుంచి అడ్వొకేట్లు కె. శ్రీనివాస్రావు, జి. సతీశ్కుమార్ ద్వారా జడ్జి రాధాకృష్ణమూర్తి రూ.7.5 లక్షలు లంచం తీసుకున్నట్టు తేలిందని ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు తెలిపారు. రెండు వాయిదాల ద్వారా ఈ లంచాన్ని దత్తు తల్లి తన బంగారం తాకట్టు పెట్టి ఇచ్చినట్టు దర్యాప్తులో వివరించారు. జడ్జితో పాటు ఇద్దరు అడ్వొకేట్లను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అడ్వొకేట్ శ్రీరంగారావు ఫిర్యాదుతో... నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణమూర్తి వ్యవహారంపై గతేడాది నవంబర్లో అడ్వొకేట్ శ్రీరంగారావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దత్తు కేసులో జడ్జి రూ.10 లక్షల లంచాన్ని న్యాయవాదుల ద్వారా డిమాండ్ చేసి, రూ.7.5 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో న్యాయశాఖపై నమ్మకం పోతోందని, దీనికి అడ్డుకట్ట వేసి న్యాయదేవతను రక్షించాలంటూ ఆయన న్యాయమూర్తిని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు అంతర్గత విచారణ జరిపి ఏసీబీకి ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. జడ్జి వ్యవహారం వెలుగులోకి రావడంతో న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. -
న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన
మక్కువ: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ముందు రహదారిపై న్యాయం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించడంతో డీఎస్పీ సౌమ్యలత వచ్చి వారిని శాంతింపజేశారు. చివరకు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు ఈ నెల 5న గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ కాలువ నుంచి తమ పంట పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. తరువాత కనిపించని సన్యాసినాయుడు ఈ నెల 9న విగతజీవుడై కనిపించిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ వెలమల ప్రసాదు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మంగళవారం సాలూరు సీహెచ్సీకి పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత సాలూరు నుంచి సరాయివలస తీసుకువచ్చారు. అనుమానంతోనే... అంతా జరిగిన తరువాత సన్యాసినాయుడు మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. కాలువలో మృతదేహం బొర్లా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు హత్యకు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో పోస్టుమార్టం నివేదికలో గాయాల్లేవని, కేసు మూసి వేస్తారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించి పోలీస్స్టేషన్ వద్దకు మృతదేహంతో తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మృతదేహాన్ని పోలీస్స్టేషన్ వద్దే ఆటోలో ఉంచి మిగతా వారంతా పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాదులాట చోటు చేసుకొంది. ఎస్ఐ న్యాయం చేస్తామని చెప్పినా వినకపోవడంతో బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ సయ్యద్ మహ్మద్ మక్కువ పోలీస్స్టేషన్కు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి వెనుదిరిగారు. పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడుతున్న సీఐ మహమ్మద్ -
న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మధు ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ రమణకుమార్, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్, మెదక్ ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, మరో ఎనిమిది సీఐలతో పాటు మరి కొంతమంది పాల్గొన్నారు. న్యాయమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. న్యాయమూర్తి పలు కేసులను కావాలని పక్కదోవ పట్టించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, ఏకంగా జగిత్యాలలోని న్యాయవాదులు అంతా కూడా ఇటీవలే ధర్నా కూడా చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యాయం కోసం.. భార్య ఆందోళన
ముషీరాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట బైటాయించిన సంఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు, ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ అలియాబాద్కు చెందిన శంకర్, యమున దంపతుల కుమార్తె స్వప్న (హాస్య)కు రాంనగర్ ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన వెంకటేష్, అనసూయల కుమారుడు విజయ్కుమార్తో 2015 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 5లక్షలు కట్నం ఇచ్చారు. రెండు నెలల్లోనే విజయకుమార్ తరచూ భార్యను వేధించేవాడు. అయినా ఏడాది పాటు అక్కడే ఉన్నట్లు స్వప్న తెలిపింది. పద్మారావునగర్లో వేరు కాపురం పెట్టించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని చెప్పి తనను పుట్టింటికి పంపించాడన్నారు. అయితే ఉద్యోగం చేయకపోగా తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లలేదని, దీంతో ఝాన్సీ బజార్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. అయితే తనకు తెలియకుండానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో లీగల్ అథారిటీ వాలంటీర్ పద్మ, గీతలతో కలిసి సోమవారం రాత్రి అత్తగారింటికి రాగా, ఆమె రాకను గమనించి అత్తామామ, బావ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటిముందే బైటాయించింది. ముషీరాబాద్ ఎస్ఐ సాయికుమార్ బాధితురాలితో పాటు, ఆమె భర్తను పోలీస్స్టేషన్కు పిలిపించి చర్చించారు. తనకు భర్తే కావాలని స్వప్న కోరుతుండగా, తనకు వద్దని విజయ్కుమార్ చెప్పినట్లు సమాచారం. -
ఏపీ: జస్టిస్ మంజునాథ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ కేఎల్ మంజునాథ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మెయిల్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్లకు పంపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కమిషన్కు చైర్మన్గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
‘అనుమానపు భర్తతో వేగలేను’
ఆదోని టౌన్: అనుమానపు భర్తతో కాపురం చేయలేనని, తనకు న్యాయం చేయాలని పెద్ద కడబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన వివాహిత ఈడిగ లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. భర్త చేతిలో గాయపడి ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేకడోన గ్రామానికి చెందిన లక్ష్మిని తొమ్మిది నెలల క్రితం దొడ్డమేకల గ్రామానికి చెందిన వెంకటేష్కు ఇచ్చి వివాహం చేశారు. నెల వ్యవధిలోనే భార్యపై వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో, బయట ఎవరితోనైనా మాట్లాడినా అనుమానిస్తూ వేధించేవాడు. భర్తకు తోడుగా మామ ఉరుకుందప్ప, అత్త లక్ష్మమ్మ, ఆడపడుచు ఈరమ్మ చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ సూటిపోటి మాటలతో హింసించారు. మూడు రోజుల క్రితం భార్యను చావబాదాడు. దాడిలో ఆమె చేయి విరిగింది. ఉగాది పండుగ కోసం కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లేందుకు తల్లి ముత్తమ్మ ఆదివారం ఉదయం మేకడోణకు వచ్చింది. గాయపడిన కుమార్తెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పెద్దకడబూరు పోలీసులకు సమాచారం అందించామని ఆదోని ఆసుపత్రి అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ చింతలయ్య తెలిపారు. -
శిక్షలు తెలిస్తే నేరాలు చేయరు
మాడ్గుల: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేరాలపై అవగాహన పెంచుకుంటే తప్పులు చేయడానికి వెనకాడతారని కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్ వై.వెంకటేశ్వర్లుగౌడ్ అధ్యక్షతన న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సులో జడ్జి అర్పితమారంరెడ్డి, అదనపు జడ్జి భవాని, పలువురు న్యాయవాదులు చట్టం, న్యాయం, ధర్మం, బాల్య వివాహాల నిõషేధం, ప్రమాదాల నివారణ, ఇన్సూరెన్స్, రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఆస్తి తగాదాలు, రిజిస్ట్రేషన్లు, చెక్కులు, ప్రామిసరీ నోటు, జనన, మరణాలపై ప్రజలకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. ఏ నేరం చేస్తే ఏ శిక్ష పడుతుంది..శిక్షల వల్ల కుటుంబాల జీవన పరిస్థితి ఎలా మారుతుంది..అనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు వెంకట్నారాయణగౌడ్, న్యాయవాదులు ఏర్పుల రామకృష్ణ, భాస్కర్రెడ్డి, జానకిరాములు, వెంకట్రెడ్డి, యాదిలాల్, మహేశ్,మల్లేష్, జయంత్, వెంకట్రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ధర్మజుని తొందరపాటు
అది మహాభారత సంగ్రామం... కురు పాండవుల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. పాండు మధ్యముడైన అర్జునుడిపైనే కర్ణుని గురి. తాను ఇంద్రుని నుంచి వరంగా పొందిన శక్త్యాయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించాలని వేచి ఉన్నాడు. ఇంతలో ఘటోత్కచుడు రణరంగాన ప్రవేశించాడు. అసలే రాక్షసుడు... ఆపై వీరుడు. మాయలు మంత్రాలు తెలిసిన మహా బలశాలి. దాంతో అందరూ కలిసి కర్ణుని శరణుజొచ్చారు. ఘటోత్కచుని రాక్షస మాయల ముందు కర్ణుని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. దాంతో విధిలేని పరిస్థితులలో అర్జున సంహారం కోసం దాచి ఉంచిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. ఘటోత్కచుడు హతమయ్యాడు. ఘటోత్కచుడి మరణంతో ధర్మరాజు రథం మీద కూలబడి తీవ్రంగా రోదిస్తున్నాడు. కృష్ణుడు ధర్మజుని దగ్గరకు వెళ్ళి ‘ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధంలో వీరులు మరణించరా! అన్నీ తెలిసిన నీవే ఇలా చింతిస్తే సైన్యాన్ని నడుపగల వాడెవడు? నీ సోదరులను ఓదార్చగల వారెవరు? లేచి వారిని ఓదార్చి యుద్ధ సన్నద్ధులను చేయి‘ అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న ధర్మరాజు ‘‘కృష్ణా! దీనికంతటికి కారణం కర్ణుడు. నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణమయ్యాడు. నేడు ఘటోత్కచుడిని మట్టుపెట్టాడు. నేను కర్ణుడిని చంపుతాను, భీముడు ద్రోణుడిని చంపుతాడు’’ అంటూ తన రథాన్ని వేగంగా ముందుకు నడిపాడు. ముందు వెనకలు ఆలోచించకుండా సాగిపోతున్న ధర్మరాజు వ్యాసమహర్షి తన ఎదురుగా వచ్చి నిలవడంతో రథం దిగి, వినయంగా నమస్కరించాడు. వ్యాసుడు ‘‘ధర్మనందనా! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. లేకుంటే, దానితో అర్జునుడిని చంపి ఉండేవాడు. అదే జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది దుఃఖంతో బయటపడ్డావు. కనుక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు’’ అని ఊరడించాడు. నీతి: మనం దేవుణ్ణి ఎంతగా పూజించినప్పటికీ, ఏదో ఒక ప్రమాదమో, ఆపదో కలగకమానదు. అప్పుడు మనం నిర్వేదంలో కూరుకుపోతాం. జరగవలసింది జరగకమానదు. అయితే, భగవంతుని పూజించినందువల్ల దాని తీవ్రత తగ్గుతుంది. దుఃఖోపశమనం కలుగుతుంది. అది తెలుసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
న్యాయం ఇంకెంత దూరం!
‘యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రా వైదేవాః’ అని మనుసూక్తి. ఎక్కడైతే స్త్రీలను పూజి స్తారో, గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని అర్థం. ఏ దేశం స్త్రీల హక్కులను కాపాడలేదో అది నాగరికతలో ముందుకు పోలేదని అంటారు గాంధీజీ. మహిళ అంటేనే మహితమైనది అని అర్థం. కానీ వాస్తవంలో అలా లేదు. ఇందుకు నిత్యం చూస్తున్న దుర్ఘటనలే తార్కాణం. ప్రతి ఐదు నిమిషాలకు ఒక అత్యాచారం. ప్రతి ఇరవై నిమిషాలకు ఒక గృహహింస ఉదంతం. గంటకొకటి వంతున హత్యాయత్నం. ఇదీ మహిళల దుస్థితి. ఇందులో చిన్నారులు, వృద్ధులు అన్న తేడా లేదు. ఇలాంటి అఘాయిత్యపు సమాజంలోని ఎందరు కీచకులకు శిక్షలు పడుతున్నాయి? ఇదీ సమాధానం దొరకని ప్రశ్నే. ‘ప్రాచీనకాలం నుంచి ఆధునిక కాలం వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో మాత్రం మార్పులేదు’ అని తేల్చింది రామచంద్ర గుహ కమిటీ. ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీలు చేసిన ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితమే. 15,000 మంది శ్రామికవర్గ మహిళలు ఓటు హక్కు కోసం, వేతనాల పెంపు కోసం నినదిస్తూ మార్చి 8, 1908న న్యూయార్క్ నగరంలో కదం తొక్కారు. హక్కుల సాధనలో మైలురాయిగా కనిపించే ఆరోజునే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. మార్చి 25, 1911న న్యూయార్క్ నగరంలోనే మరో దుర్ఘటన జరిగింది. ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగి 145 మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. దీనితో అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయం మరింత బలపడింది. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక రంగాలలో స్త్రీలు నిర్వహిస్తున్న పాత్రకు ఈ విధమైన గుర్తింపు సముచితమేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం చైర్మన్ రూజ్వెల్ట్ (అమెరికా అధ్యక్షుడు కాదు) వ్యాఖ్యానించారు. ఇక లింగభేదం లేకుండా అన్ని రంగాలలో సమాన హక్కులు ఉండాలని మానవహక్కుల అంతర్జాతీయ ప్రకటన పేర్కొంటున్నది. అయినా స్త్రీలకు ఏదీ సునాయాసంగా రాలేదు. పోరాటాలతోనే హక్కులు దక్కాయి. ఉదాహరణకు ఓటుహక్కు. స్వీడన్లో 1771–81 మధ్య పన్ను చెల్లించే సంపన్న వర్గాల స్త్రీలకే ఓటు హక్కు ఉండేది. కానీ పోటీ చేసే హక్కు మాత్రం లేదు. ఫ్రాన్స్లో మొదటిసారిగా మహిళలకు 1871లో హక్కులు లభించాయి. 1944 వరకు ఓటు హక్కు లేదు. ఎంత వివక్ష! ఆ హక్కు కోసం వారు చేసిన పోరాటం చరిత్రాత్మకం. న్యూజిలాండ్లో 1893లో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చారు. దాని పొరుగునే ఉన్న బ్రిటిష్ వలసదేశం ఆస్ట్రేలియాలో 1902 వరకు ఆ హక్కు లేదు. అమెరికా (1902), నార్వే (1913), డెన్మార్క్ (1915), ఆస్ట్రియా (1919), అర్మేనియా (1921), భారతదేశం (1930–1947), బ్రెజిల్ (1931), చిలీ (1935), జపాన్ (1945), ఇటలీ (1946), అల్జీరియా (1947), చైనా (1947), ఇజ్రాయెల్ (1948), బహమాస్ (1960), అఫ్గానిస్తాన్ (1963), ఇరాక్ (1980) దేశాల మహిళలు ఎన్నో మార్పుల తరువాత ఓటు హక్కు సాధించుకున్నారు. ఇక మిగిలిన హక్కుల విషయంలో చెప్పుకోలేని దుస్థితి. కానీ ఇలాంటి వాతావరణంలో కూడా ఆశాజనకమైన పరిణామాలు లేకపోలేదు. ఉదాహరణకు రువాండా. ఆ దేశాన్ని మహిళా రాజ్యమని చెప్పవచ్చు. అక్కడి పార్లమెంట్లో స్త్రీలకు 56.3 శాతం ప్రాధాన్యం దక్కింది (భారత పార్లమెంట్లో అది 9 శాతమే). అక్కడ ప్రధానమంత్రి, స్పీకర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, పోలీసు విభాగం అధిపతి–అంతా మహిళలే. రువాండా 1962లోనే స్వాతంత్య్రం తెచ్చుకుంది. అయినా మహిళలకు అగ్రస్థానం ఇచ్చి, ఈ విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మన దేశంలో మహిళల కోసం ఎన్నో చట్టాలు చేశారు. వాటి అమలులో మాత్రం కనీస శ్రద్ధ కనిపించదు. మహిళలకు పార్లమెంట్లో 33 శాతం స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికీ పురుషాహంకారం అడ్డుపడుతూనే ఉంది. ఈ బిల్లు కోసం 108వ రాజ్యాంగ సవరణ జరగాలని మా పార్టీ అభిప్రాయం. ప్రస్తుత లోక్సభలో బీజేపీకి తగినంత ఆధిక్యం ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం తలుచుకుంటే వస్తుసేవల బిల్లును ఆమోదింపజేసినట్టే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా సభ చేత ఆమోదముద్ర వేయించగలదు. మహిళల మీద పెరిగిపోతున్న దాడులను నివారించేందుకు చట్టాలను మరింత పదును పెట్టాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చట్ట ప్రకారం నేరాలకు పాల్పడ్డ వారి మీద చర్యలు తీసుకోవడానికి సంస్థకు హక్కు ఉంది. కానీ కొందరు నేతల ప్రమేయం, పోలీసు శాఖ సరిగా స్పందించలేకపోవడం వంటి కారణాలతో ఆ హక్కు ఆచరణలో కనిపించడం లేదు. అందుకే స్వతంత్ర బహుళ సభ్య దర్యాప్తు సంఘం, ప్రాసిక్యూషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం–1983 ప్రకారం లోకాయుక్త పదవికి కల్పించిన భద్రతను మహిళా కమిషన్కు కూడా కల్పించాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలే కాకుండా, హత్య కేసులను కూడా ఈ కమిషన్ పరిధిలోకి తీసుకువస్తే నిర్వహణా భారం తగ్గించవచ్చు. ఇది ఎంత సత్వరం జరిగితే అంత సత్వరం మహిళలకు న్యాయం అందుతుంది. అలాగే ఫాస్ట్ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలకు పెనుముప్పుగా ఉన్న మద్యపానాన్ని అదుపు చేయడానికి సమగ్ర ఎక్సైజ్ విధానం రావాలి. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మద్యం పాలసీ అమలులోకి వస్తే చాలా నేరాలకు స్వస్తి చెప్పవచ్చు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
పోలీసుల తీరుపై న్యాయమూర్తి సీరియస్
లీగల్ (కడప అర్బన్) : ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై జి ల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సే వాధికార సంస్థ చైర్మన్ గోకవరపు శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సోమవారం తమ చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ∙ప్రొద్దుటూరు పట్టణం త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో పసుపులేటి శ్రీను అనే పదవ తరగతి విద్యార్థిపై నాగరాజు అనే కానిస్టేబుల్ దాడి చేశాడని మూడు రోజులుగా మీడియాలో కూడా వస్తోందని, ఎవరికైనా ఫిర్యాదుచేస్తే ఎన్కౌంటర్ చేస్తానని లేదా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని బాలుని తల్లి పద్మావతి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. డీఎల్ఎస్ఏ పరిధిలో ఫిర్యాదును స్వీకరించి ప్రొద్దుటూరు త్రీటౌన్ ఎస్ఐ, బాధ్యులైన సిబ్బందికి నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘన, జువైనల్ జస్టిస్ యాక్టును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ∙కడపలో ఎస్పీ డ్రైవర్గా పనిచేస్తూ పదవీ విరమణ పొంది మృతి చెందిన సుబ్బన్న భార్య రాజమ్మ (75) అనే వృద్ధురాలికి సంబంధించిన డబ్బును దాదాపు రూ. 10 లక్షలు కుటుంబ సభ్యులే తీసుకుని ఆమెను నిర్మల వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈ క్రమంలో వృద్ధురాలి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారి మధ్య రాజీ కుదిర్చి లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించామన్నారు. ఆమెకు సంబంధించిన డబ్బును రూ. 10 లక్షలు జిల్లా కోర్టులోని ఎస్బీఐలో డిపాజిట్ చేయించి ఆమె తదనంతరం ఆమె వారసులకు చెందేలా చేశామన్నారు.∙జమ్మలమడుగుకు చెందిన ఓ వృద్ధురాలిని ఇద్దరు కుమారులు పట్టించుకోలేదని, పక్కింటి వారు తమకు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును స్వీకరించి ఆమెను రిమ్స్లో చేర్పించేందుకు ప్రయత్నించామన్నారు. అంతలోనే ఆమె కుమారులు వచ్చి తాము చూసుకుంటామని చెప్పారన్నారు. తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. నేడు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛ భారత్ లెవెన్త్ బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో వంద మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో జిల్లా కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
ఆరు నెలలైనా అందని పరిహారం..
ఆ చూపులు ఆమెను ఎందుకు వెంటాడుతున్నాయో గుర్తించలేకపోయింది. ఎందుకు పలకరిస్తున్నాయో పసిగట్టలేకపోయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న బాల్యం... ‘తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు’ అని నమ్మే అమాయకత్వం.మనుషులంతా మంచివాళ్లేననే నమ్మకం. కానీ ఆ చూపులు పాప నమ్మకాన్నివమ్ము చేశాయి. ఆ 13ఏళ్ల బాలిక అకస్మాత్తుగా అపహరణకు గురైంది. గుల్బర్గాకు తీసుకెళ్లిన మృగాడు ఆమెను కాటేశాడు. రెండ్రోజులు ఆమెపై పశువాంఛతీర్చుకున్నాడు. ఆరు నెలల కిత్రం బాలాపూర్ పరిధిలో జరిగిన సంఘటన ఇది. దీనిపై కేసు నమోదైంది. నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కానీ బెయిల్పై బయటకొచ్చి ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నాడు. పాపం ఆ బాధితురాలు జీవచ్ఛవంలా బతుకుతోంది. ఇలాంటి బాధితులెందరో ఉన్నారు. బాలబాలికల రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్–2012) చట్టం వీరికిఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతోంది. ఆరు నెలలైనా అందని పరిహారం.. బాలాపూర్ సమీపంలోని ఓ చిన్న బస్తీ. 13 ఏళ్ల ఫరీదా (పేరు మార్చాం) దగ్గర్లోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి టైలర్. నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఫరీదా రెండో అమ్మాయి. కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. తాను ఎయిర్హోస్టెస్ కావాలని, ప్రతిరోజు విమానాల్లో తిరగాలని కలలు కంటోంది ఫరీదా. ఆ కలలను సాకారం చేసుకునేందుకు బాగా చదువుకుంటోంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ 6 నెలల క్రితం అదే కాలనీకి చెందిన పాతికేళ్ల యువకుడు ఆ అమ్మాయిపై వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్కు వెళ్లే దారిలో నిత్యం వెంబడించేవాడు. చివరకు కత్తితో బెదిరింపులకు దిగాడు. చెప్పిట్లు వినకపోతే ఆమె కుటుంబాన్ని అంతమొందిస్తానని హెచ్చరించాడు. ఓ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసొచ్చి ఆటోలో ఆమెను అపహరించుకొని వెళ్లాడు. అప్పటికే చాలా రోజులుగా అతని వేధింపుల గురించి తెలిసి.. ఒకట్రెండు సార్లు హెచ్చరించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులు ఆ అమ్మాయితో తన పశువాంఛను తీర్చుకొని తిరిగొచ్చిన నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ బెయిల్పై బయటకొచ్చిన ఆ మృగాడు ఇప్పుడు దర్జాగా సమాజంలో తిరుగుతున్నాడు. పాపం.. ఆ బాధితురాలు తన కలలు చెదిరిపోయాయనే బాధతో కుమిలిపోతోంది. ఎయిర్హోస్టెస్ కావాలనే కల చెదిరిపోయి నిరాశ, నిస్పృహలతో జీవిచ్ఛవంలా బతుకుతోంది. ఈ సంఘటన జరిగి ఆరు నెలలైనా ఆమెకు ఎలాంటి మానసిక ఓదార్పు లభించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఏదీ భరోసా.? ఇది ఒక్క ఫరీదా బాధనే కాదు. నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట మైనర్లపై లెంగిక దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో చిన్నారులు లైంగిక హింసను అనుభవిస్తున్నారు. ఇలాంటి హింస, వేధింపుల నుంచి అతి కష్టంగా బయటపడిన పిల్లలకు ఎలాంటి రక్షణ లభించడం లేదు. సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష ఓవైపు... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు, ఓదార్పు లభించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. లైంగిక వేధింపుల ఊబి నుంచి బయటపడినా ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లభించడం లేదు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఒక్క కేసులోనూ... స్వచ్ఛంద సంస్థల అంచనాల మేరకు 2017లో ‘పోక్సో’ చట్టం కింద సుమారు 520 కేసులు నమోదవగా, వీటిలో ఒక్క కేసులోనూ పరిహారం అందలేదు. ‘చివరకు దాడికి గురైన చిన్నారుల మానసిక స్వస్థత కోసం కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మనస్తత్వ నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ కూడా ఇప్పించలేద’ని విస్మయం వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు. బాల్యవివాహాలు, అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల సహకారంతో పోలీసులను ఆశయిస్తున్న పిల్లలు పరిమితంగానే ఉన్నారని, అవమాన భారంతో బయటకు రాని వాళ్లు ఇంకా వందల సంఖ్యలోనే ఉన్నారని చెప్పారాయన. ‘నా కూతురు ఏం పాపం చేసింది. అందరిలా బడికెళ్లి చదువుకుంటున్న చిన్నపిల్లని ఆ కామాంధుడు ఇలా చేశాడు. ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. చాలా బలహీనంగా ఉంది. వాడు బెయిల్పై బయటకు వచ్చాడు. తిరిగి ఏ క్షణంలో మాపై దాడి చేస్తాడోనని భయంతో బతుకుతున్నాం.ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఇరుగుపొరుగు, బంధువులు అందరూ దూరమయ్యారు. మా కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారు.’ – ఫరీదా తల్లి ఆవేదన ఇది. ‘పోక్సో’ అమలు ఇలా.. ♦ పోక్సో చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. దీని కింద నమోదైన కేసుల ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ప్రభుత్వం వెంటనే అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలి. ♦ కేసుల గురించి సంబంధిత స్టేషన్ హౌస్ అధికారిపైఅధికారులకు సమాచారం అందజేయడంతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలి. ♦ ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కలెక్టర్ సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ స్వచ్ఛంద సంస్థల అంచనాల మేరకు పోలీస్ స్టేషన్లలో ‘‘పోక్సో’ కింద నమోదైన కేసుల్లో చాలా వరకు కలెక్టర్ వరకు చేరడం లేదు. ఒకవేళ చేరినా ఎలాంటి సహాయక చర్యలుతీసుకోవడం లేదు. ♦ పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు కలెక్టర్ అత్యవర నిధి నుంచి కేసు నమోదైన 48 గంటల్లో రూ.50 వేల పరిహారాన్ని బాధిత పిల్లలకుఅందజేయాలి. ♦ మానసిక వైద్య నిపుణులతో పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కోర్టులో కేసు వాదించేందుకు పబ్లిక్ప్రాసిక్యూటర్ను నియమించాలి. ♦ కేసు కొనసాగుతున్న మధ్య కాలంలో మరో రూ.25 వేల పరిహారాన్ని అందజేయాలి. పిల్లలు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు, తిరిగి సాధారణజీవితాన్ని గడిపేందుకు అనువైన పర్యటనల కోసం తగిన సహాయాన్ని అందజేయాలి. ♦ కేసు గెలుపోటములతో నిమిత్తం లేకుండా కేసు తుది దశలో మరో రూ.25 వేల సహాయం అందజేయాలి. ♦ ఈ ఆర్థికపరిహారం కోసం బాధితులు అధికారుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. అధికారులే స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి ఇవ్వాలి. ♦ పిల్లలు తిరిగి స్కూల్కు వెళ్లేందుకు, తమ దైనందిన జీవితాన్ని యథావిధిగా కొనసాగించేందుకు అనువైన వాతావరణం ఏర్పడేలా చూడాలి. ♦ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ‘పోస్కో’ బాధిత పిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డబుల్బెడ్ రూమ్ ఇళ్ల లాంటి పథకాలను వర్తింపజేయాలి. ♦ పిల్లలు భవిష్యత్తులో సొంతంగా బతికేందుకుకావాల్సిన స్థిరాస్తి సదుపాయం కల్పించాలి. ♦ వీటిలో ఏ ఒక్కటీ ప్రస్తుతం అమలుకు నోచుకోవడం లేదు. అవగాహన లేనివాళ్ల పరిస్థితి... ఓవైపు హింసను ఎదుర్కొంటున్న పిల్లలు, వారి కుటుంబాలు... మరోవైపు పరిహారం కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదీ ‘పోక్సో’ అనే చట్టం ఒకటి ఉందనే అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే. కానీ ఈ చట్టంపై అవగాహన లేనివాళ్లు.. కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేయలేక మౌనంగా ఉండిపోతున్నారు. చాలామంది అవమాన భారంతో కుమిలిపోతున్నారు. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వమే సత్వరం స్పందించి చర్యలకు ఉపక్రమించాలి. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
బోఫోర్స్ బెంచ్ నుంచి తప్పుకున్నారు
న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసును విచారిస్తోన్న సుప్రీం కోర్టు బెంచ్ నుంచి జడ్జి జస్టిస్ ఖన్వీల్కర్ తప్పుకున్నారు. సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనంలో భాగంగా ఉన్న ఆయన తన నిర్ణయానికి సంబంధించి ఎలాంటి కారణాల్ని పేర్కొనలేదు. రూ. 64 కోట్ల బోఫోర్స్ కుంభకోణం కేసులో అన్ని ఆరోపణల్ని కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా దానిని సవాలు చేస్తూ బీజేపీ నేత అగర్వాల్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసేందుకున్న అర్హతేంటో చెప్పాలని అగర్వాల్ను కోర్టు ఆదేశించింది. ఆ అంశంపై ధర్మాసనం మంగళవారం విచారించాల్సి ఉంది. -
ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి
-
ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : ప్రేమించి, పెళ్ళి చేసుకుని ఐదేళ్లు కాపురం చేసిన వ్యక్తి ఇపుడు తనను కాదని కట్నంకోసం వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దపడుతున్నాడని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరులో బండి ఉమామహేశ్వరి అనే యువతి నిరాహారదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఎనిమిదిరోజులుగా భర్త ఇంటి ఎదుటే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. నిరసన దీక్ష చేపట్టిన బండి ఉమామహేశ్వరికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె బంధువులు, మద్దతుదారులు కొవ్వూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గోదావరిపై నాలుగో వంతెన సమీపంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కొవ్వూరు, రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు మండలాలకు చెందిన ఉమామహేశ్వరి బంధువులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కన్వీనర్లు తానేటి వనిత, గిరిజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని కాపు సంఘం నేత మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దాదాపుగా పది కిలోమీటర్ల మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు హోరెత్తాయి. మంత్రి కేఎస్ జవహర్, కలెక్టర్, ఎస్పీలు రావాలంటూ నినాదాలు చేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో కొనసాగింది. డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఘటనాస్థలానికి చేరుకుని ఉమామహేశ్వరి భర్త దుబాయ్ వెళ్లినట్టు చెప్పారు. అతడిని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోమవారంలోపు దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భార్యభర్తల వివాదాల్లో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నందున్న కొంత ఇబ్బందులున్నాయన్నారు. దోషులను సత్వరం అరెస్ట్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి రూరల్ కన్వీనర్ గిరిజాల బాబు, కడియం మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు పాలపర్తి కుమారి రోజా ప్రకాష్, కడియపు లంక సర్పంచ్ వారా పాపా రాము, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెలుగుబంటి నాని, తాడాల వీరన్న, ఆలిండియా నర్సరీ ప్రెసిడెంట్ పల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, యాళ్ల నరిసింహ రావు, కొయ్యల భాస్కరరావు, అడ్డూరి సుబ్బారావు,కొవ్వూరు, తాళ్లపూడి మండల కాపు అధ్యక్షులు ఉప్పులూరి రాజేంద్రప్రసాద్, నామా ప్రకాశం పాల్గొన్నారు. న్యాయం చేసేంత వరకూ పోరాటం బాధితురాలికి సోమవారంలోపు న్యాయం చేయకపోతే తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. న్యాయం చేయాలని ఒక ఆడ బిడ్డ తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నా స్థానిక మంత్రి కేఎస్ జవహర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధితురాలికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు. -
‘ఛస్.. ఇది సుప్రీం కోర్టా? చేపల మార్కెటా?’
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతి కేసులో వాదిస్తున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఒక దశలో పరుష పదజాలంతో ఇద్దరు దూషించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వీవై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు మర్యాదను కాపాడండి. మీ వాగ్వాదంతో న్యాయస్థానాన్ని చేపల మార్కెట్గా మార్చకండి. మీరు వాదించేది చాలా సున్నితమైన అంశం. ఒక న్యాయమూర్తి మృతికి సంబంధించిన కేసు. ఇక్కడ మాజీ న్యాయమూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. కనీసం వారికైనా గౌరవం ఇచ్చి కోర్టు హాలులో కాస్త పద్ధతిగా మెలగండి’’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ కార్వాన్ మాగ్జైన్(లోయా సోదరి అనురాధా బియానీ ఇచ్చిన ఇంటర్వ్యూ), ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాల ఆధారంగా ‘బీహెచ్ లోనే’ అనే జర్నలిస్ట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోనే తరపున అడ్వొకేట్ పల్లవ్ సిసోడియా.. ముంబై లాయర్స్ అసోషియన్ తరపున దుష్యంత్ దవే వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయమూర్తులు దూషించుకున్నారు. లోయా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే స్వతంత్ర్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిసోడియా వాదించారు. దీనికి స్పందిన దవే.. గతంలో ఇదే అంశంపై బాంబే హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సిసోడియా ‘నువ్వు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు’’ అంటూ దవేను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. దవే కూడా మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించాల్సి వచ్చింది. అయినప్పటికీ దవే వెనక్కి తగ్గకపోవటంతో సున్నితంగా వారించిన న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
ఆడపిల్లంటే ఆటవస్తువా..!
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: కాపురానికి తీసుకువెళ్లాలని, తనకు న్యాయం కావాలని కోరుతూ కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో వివాహిత బండి ఉమామహేశ్వరి చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి బాధిత మహిళను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా బాధితురాలితో రాజ్యలక్ష్మి గంటకుపైగా మాట్లాడారు. ఉమామహేశ్వరికి అండగా నిలుస్తామని, ఆమె కాపురం నిలబెట్టడానికి కృషి చేస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు. భర్త పూర్ణ సుబ్బారావుతో పాటు అతని కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఆడపిల్ల అంటే ఆటబొమ్మలా ఉందని, ఉమామహేశ్వరి భర్త ప్రవర్తనను బట్టి ఉద్దేశపూర్వకంగానే ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. సంఘటన వివరాలను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకువెళతానని, బాధితురాలికి అండగా ఉంటామన్నారు. కొవ్వూరు రూరల్ సీఐ శరత్ రాజ్కుమార్, ఎస్సై జానా సతీష్, తహసీల్దార్ కె.విజయకుమార్, ఐసీడీఎస్ సీడీసీఓ వైబీటీ సుందరి, ఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న మద్దతు ఉమామహేశ్వరి నిరసన దీక్షకు మహిళా సంఘాల మద్దతు కొనసాగుతుంది. నిరసన శిబిరంలో జిల్లా దళిత హక్కుల పోరాట సమితి మహిళా కన్వీనర్ ఎండీ సలీమ, జిల్లా సామాజిక సమస్యల కమిటీ సభ్యురాలు బొరుసు సీతామహాలక్ష్మి, డ్వాక్రా సీఏలు బళ్ల లక్ష్మీమంగతా యారుతో పాటు పలువురు మహిళలు ఆమెకు మద్దతుగా నిరసన దీక్షలో కూర్చున్నారు. -
ప్రేమించానన్నాడు.. నాలుగేళ్లకు పైగా కలిసి జీవించాడు...
కొవ్వూరు రూరల్ : ప్రేమించానన్నాడు.. నాలుగేళ్లకు పైగా కలిసి జీవించాడు... ఇప్పుడు నువ్వు నాకొద్దు అంటున్నాడంటూ ఓ యువతి భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగింది. భర్త తనను కాపురానికి తీసుకువెళ్లాలని వేడుకుంటోంది. ఈ సంఘటన కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత మహిళ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన ఈలి నెహ్రూకు నలుగురు కుమార్తెలు. మూడో కుమార్తె ఉమామహేశ్వరిని కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఉన్న తోడల్లుడు పోలిశెట్టి వెంకట్రావుకు పెంపకానికి ఇచ్చారు. అదే విధంగా చాగల్లు మండలం చంద్రవరానికి చెందిన బండి చంద్రరావు తన కుమారుడు పూర్ణ సుబ్బారావును మద్దూరు గ్రామంలోని తన తోడల్లుడు కుసులూరి చంద్రరావుకు పెంపకానికి ఇచ్చారు. ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న ఉమా మహేశ్వరి, పూర్ణ సుబ్బారావులకు పరిచయం ఏర్పడింది. అనంతరం పరిచయం ప్రేమగా మారడం, యువకుడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గొడవ కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్కు చేరింది. పోలీసుల సాక్షిగా వివాహం ఇరువర్గాల పెద్దలతో చర్చించిన అనంతరం ఉమామహేశ్వరి, పూర్ణ సుబ్బారావులు ఒకరికొకరు ఇష్టపడడంతో స్థానిక పోలీసు స్టేషన్లోనే ఇరువురికి పోలీసుల సాక్షిగా దండలు మార్పించారు. అనంతరం కొవ్వూరులోని ఓ దేవాలయంలో వివాహం జరిపించారు. వీరి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయించారు. అనంతరం భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగం నిమిత్తం ఢిల్లీలో కాపురం పెట్టారు. పూర్ణ సుబ్బారావు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఉమా మహేశ్వరి ఇంటి వద్దనే ఉంటోంది. వీరి సంసారం 2017 మార్చి వరకు సజావుగానే సాగింది. అదే నెలలో దుబాయ్లో తనకు ఉద్యోగం వచ్చిందని, ఓ నాలుగు నెలల్లో వీసా చూసి నిన్ను తీసుకువెళతానని నమ్మించి ఉమా మహేశ్వరిని ఓ హాస్టల్లో ఉంచి పూర్ణ సుబ్బారావు వెళ్లిపోయాడు. అయితే నాలుగు నెలల్లో తీసుకు వెళతానన్న వ్యక్తి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉమా మహేశ్వరి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి గత ఏడాది జులైలో ఢిల్లీ నుంచి కడియపులంక చేరుకుంది. ఈ క్రమంలో మధ్యవర్తుల ద్వారా భర్తతో చర్చలు జరపగా తాను వస్తున్నానని, నువ్వు మద్దూరులోని తమ ఇంటికి రావాలని భర్త చెప్పడంతో ఆగస్టులో ఉమామహేశ్వరి మద్దూరులో భర్త ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మద్దూరు వచ్చిన పూర్ణ సుబ్బారావు నిన్ను దుబాయ్ తీసుకువెళ్లాలంటే ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ కావాల్సి ఉందని, అది తనకు ఇవ్వాలని తీసుకుని, తన పెంపుడు తండ్రి అయిన చంద్రరావు ఇంటిలో ఉండాలని చెప్పి దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే అత్త వారి ఇంట్లో వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో పెద్దల సమక్షంలో భర్త వచ్చే వరకూ తల్లిదండ్రుల వద్ద ఉండాలని తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఏడాది నవంబర్లో ఇండియా వచ్చిన పూర్ణ సుబ్బారావు తనను భార్య విడాకులు ఇమ్మంటోందని, రూ.25 లక్షలు డిమాండు చేస్తోందని, తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ డిసెంబర్ నెలాఖరున లాయర్ నోటీస్ పంపడంతో విస్మయానికి గురైన ఉమామహేశ్వరి తల్లి దండ్రులు తమ కూతురు కాపురం సరిదిద్దాలని కోరుతూ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఆమెను కాపురానికి తీసుకు వెళ్లడానికి భర్త పూర్ణ సుబ్బారావు, అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో న్యాయాన్ని కోరుతూ భర్త ఇంటి ముందు నిరసన దీక్షతో పోరాటానికి సిద్ధం అయ్యింది. ఆమెకు మద్దతుగా స్థానికులు, బంధువులు భర్త ఇంటి ముందు భైఠాయించారు. అందుబాటులో లేని పూర్ణ సుబ్బారావు కుటుంబ సభ్యులు మద్దూరులో పూర్ణ సుబ్బారావు కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేరు. తాను ఇంటికి వస్తున్నానని తెలియడంతో ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారని బాధితురాలు ఉమా మహేశ్వరి ఆరోపిస్తోంది. పూర్ణ సుబ్బారావును ఫోన్లో వివరణ కోరడానికి సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. -
మంధర పర్వతమంత పాత్ర
మనకెవరైనా దుర్బోధలు చేయాలని చూస్తే, వారిని మంధరతో పోలుస్తాం. ఎందుకంటే దుర్బోధ చేయడానికి రామాయణంలో మంధర పాత్ర పెట్టింది పేరు. అయితే, ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి, రామాయణంలో మంధర పాత్రను ప్రవేశపెట్టాడు. వాల్మీకి శ్రీ రామావతార లక్ష్యమే రావణ వధ. రావణ వధ జరగాలంటే సీతను రావణుడు అపహరించాలి. సీతను రావణుడు అపహరించాలంటే, రాముడు అడవులకు వెళ్లాలి. రాముడు అడవులకు వెళ్లాలంటే, ఒక వంక దొరకాలి. ఆ వంకే కైకేయికి దశరథుడిచ్చిన వరం. ఆ వరాలను కైకేయి సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అందుకు మంధర బోధ చేయాలి. అదే చేసింది మంధర. తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించి, తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇక్కడ ఆమె కర్తవ్యం ఏమిటి? కైకేయి మనస్సును వికలం చేసి, దశరథుని ఒప్పించి భరతునికి పట్టాభిషేకం చేయించడం, శ్రీరామునికి పద్నాలుగేళ్లు అరణ్యవాసం విధించడం. నిజానికి ఇందులో మంధర స్వార్థం ఏమయినా ఉందా? దుర్బోధ చేసింది కానీ, దానివల్ల తనకేదో లబ్ధి పొందాలన్న తాపత్రయం కనపడిందా అసలు? స్వభావసిద్ధంగా మిక్కిలి చాకచక్యంగా మాట్లాడగల శక్తి ఆమెది. భరతుని పట్టాభిషేకం కోరి కైకతో అయోధ్యకు రాలేదు. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, ఆమెకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. రామునికి పద్నాలుగేళ్లపాటు అవరణ్యవాసానికి పంపడం మంధర మనోవాంఛితం ఏమీ కాదు. తలచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ, అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే, త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పద్నాలుగు సంవత్సరాలు, ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలూ అని చెబుతారు. అంటే నియమిత కాలం పాటు అస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే, ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశ ఈ కారణం చేతనే మంధర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మంధర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది. అందువల్ల అమె పాత్ర చిత్రణమంతా దైవఘటన. ఆమె మాట దైవ ప్రేరణ. ఏది ఏమైనా, మంధర దుర్బోధ కైకేయిని అపమార్గం పట్టించిన మాట వాస్తవం. దానివల్ల లోకకల్యాణం జరిగినప్పటికీ కైక మీద నింద పడింది. విపరీత పరిణామాలెన్నో సంభవించాయి. అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే, దుష్టసాంగత్యం వల్ల దుర్మార్గమైన పరిణామాలు సంభవించి, జీవితం అపఖ్యాతి పాలవుతుంది. ఆ తర్వాత అస్తవ్యస్తం అవుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
గుండె సమస్యతోనే జస్టిస్ లోయా మృతి
నాగ్పూర్: గుండె ధమనుల పనితీరు దెబ్బతినడంతోనే జస్టిస్ బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి చెందారని పోస్ట్మార్టం నివేదికను ఉటంకిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నాగ్పూర్ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి అందించిన ఈ నివేదికతోనే సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఈ కేసు విచారణ ముగిసిందన్నారు. వైద్యుల హిస్టోపాథాలజీ నివేదికలో లోయా భౌతికకాయంలో విషపూరితమైన పదార్థాలేవీ లేవని తేలిందన్నారు. 2014లో డిసెంబర్ 1న నాగ్పూర్లో ఓ వేడుకకు హాజరైన లోయా అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును జస్టిస్ లోయా విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు, మిగతా నలుగురు సుప్రీం న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న తాజా సంక్షోభానికి జస్టిస్ లోయా మృతి కేసు విచారణ కూడా కారణం కావడం గమనార్హం. -
జస్టిస్ లోయా మృతి తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక జడ్జి లోయా 2014 డిసెంబరు 1న తన సహచరుడి కూతురి వివాహా వేడుకకు హాజరవ్వడానికి నాగ్పూర్ వెళ్లినప్పుడు మరణించారు. లోయా మృతిపై ఆయన సోదరి గతేడాది నవంబరులో అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీ యాంశమైంది. మృతి కేసులో సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది. లోయా పోస్టుమార్టమ్ నివేదికను సమర్పించాలనీ, కేసు విచారణపై తన స్పందనను ఈ నెల 15లోపు తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద విచారణలో ఉందనీ, దీనిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే విచారిస్తే హైకోర్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా బాంబే న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే కోరారు. అయితే విచారణ సమయంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జీలు పేర్కొన్నారు.