kannada actress
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది.కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్ను శివరాజ్కుమార్ లాంటి స్టార్ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్గా నిర్వహించింది జయమాల. -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్ -
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నటి శోభిత సూసైడ్ నోట్ లభ్యం..
-
బుల్లితెర నటి శోభిత సూసైడ్.. కేజీఎఫ్ మూవీలో నటించిందా?
-
విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్)కన్నడ సీరియల్స్లో నటిస్తోన్న శోభిత తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్కు శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రహ్మగంతు సీరియల్తో గుర్తింపు శాండల్వుడ్లో బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.కర్ణాటకలోని సకలేష్పూర్కి చెందిన శోభిత మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్లో కూడా కనిపించింది. బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్కు గురయ్యారు. -
స్టన్నింగ్ లుక్స్తో చంపేస్తున్న ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్ (ఫొటోలు)
-
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. -
సీరియల్ నటి నేహా ‘మెటర్నిటీ ఫోటోషూట్’ ఫోటోలు వైరల్
-
స్టార్ హీరోయిన్కి కూతురు పుట్టింది.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్వుడ్లోనూ పలు సీరియల్స్లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.(ఇది చదవండి: బాయ్ఫ్రెండ్తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్వుడ్ బ్యూటీ వర్ష హెచ్కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
రెండు సంప్రదాయాల్లో డైరెక్టర్,హీరోయిన్ల పెళ్లి
కన్నడ ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్, నటి సోనల్ రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఆగష్టు 11న బెంగళూరు పూర్ణిమ ప్యాలెస్లో హిందూ సంప్రదాయంలో వారు పెళ్లి చేసుకున్నారు. సిని ప్రముఖలతో పాటు ఇరువైపుల కుటుంబసభ్యుల సమీక్షంలో జంట ఒక్కటయ్యారు. మంత్ర ఘోషణల మధ్య తరుణ్ సోనల్కు తాళి కట్టాడు. హీరో దర్శన్తో కాటేరా సినిమాను తెరకెక్కించి తెలుగు వారికి కూడా ఆయన పరిచయం అయ్యారు.తరుణ్ సుధీర్ సతీమణి నటి సోనల్ సూచన మేరకు మంగళూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 2న మరోసారి వివాహం చేసుకున్నారు. మంగళూరు చర్చిలో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారి వివాహాన్ని సంబరంగా చేసుకున్నారు. నూతన జంటకు సినీ, టీవీ రంగాల నటీనటులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. -
పుట్టబోయే బిడ్డకోసం ఆశగా..హీరోయిన్ మిలనా నాగరాజ్ ప్రెగ్నెన్సీ గ్లో (ఫొటోలు)
-
41 ఏళ్ల డైరెక్టర్తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయిన విషయమే. కలిసి పెరిగిన వాళ్లు కావొచ్చు, కలిసి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లు కావొచ్చు ప్రేమలో పడుతుంటారు. అలా ఇప్పుడు ఓ కన్నడ డైరెక్టర్.. తన సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి వరకు వచ్చేశాడు. తాజాగా తన బంధాన్ని అఫీషియల్ చేస్తూ వివాహ తేదీని ప్రకటించాడు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య)తరుణ్ సుధీర్.. చైల్డ్ ఆర్టిస్టుగా 1990లోనే కన్నడ ఇండస్ట్రీకి వచ్చేశాడు. 2019 వరకు అప్పుడప్పుడు నటిస్తూ వచ్చాడు. మరోవైపు రైటర్గానూ స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. 2017లో 'చౌక' అనే మూవీ తీశాడు. దీని తర్వాత 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు చేశాడు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో అందులో నటించిన సోనాలి మొంటిరోతో ప్రేమలో పడ్డాడు. కాకపోతే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు.తాజాగా తామిద్దరం ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టిన తరుణ్, సోనాలి.. ఆగస్టు 11న బెంగళూరులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే డైరెక్టర్, హీరోయిన్గా తాము ఎలా ప్రేమలో పడ్డాం అనేది సింబాలిక్గా చూపిస్తూ వెడ్డింగ్ వీడియో రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Sonal Monteiro Official (@sonal_monteiro_official) -
Ragini Dwivedi: స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు దడ పుట్టిస్తున్న రాగిణి ద్వివేది.. పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం
ప్రముఖ లేడీ యాంకర్ అపర్ణ వస్తారే కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడిన ఈమె.. గురువారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త చెప్పుకొచ్చారు. కన్నడలో గత 40 ఏళ్లుగా నటిగా, యాంకర్, న్యూస్ యాంకర్గా చేసిన ఈమె ఇప్పుడు ఇలా మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన సంతాపాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)1984లోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. డీడీ చందన ఛానెల్లో న్యూస్ రీడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించారు. 1998లో దీపావళి ప్రోగ్రాంకి దాదాపు ఎనిమిది గంటల పాటు యాంకరింగ్ చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్మెంట్కి వాయిస్ ఇచ్చింది ఈమెనే కావడం విశేషం.ఇక బిగ్ బాస్ కన్నడ షోలోనూ పాల్గొన్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే కన్నడలో అద్భుతమైన డిక్షన్తో యాంకర్గా ఈమెని కొట్టేవాళ్లు లేరని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఈమె మృతి పట్ట సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సాయం.. ట్రాన్స్ జెండర్ కంటతడి)ನಟಿ, ಖ್ಯಾತ ನಿರೂಪಕಿ ಅಪರ್ಣಾ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ತಿಳಿದು ನೋವಾಯಿತು. ಸರ್ಕಾರಿ ಸಮಾರಂಭಗಳು ಸೇರಿದಂತೆ ಕನ್ನಡದ ಪ್ರಮುಖ ವಾಹಿನಿಗಳ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ನಿರೂಪಣೆ ಮಾಡುತ್ತಾ ನಾಡಿನ ಮನೆಮಾತಾಗಿದ್ದ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆಯೊಂದು ಬಹುಬೇಗ ನಮ್ಮನ್ನು ಅಗಲಿರುವುದು ದುಃಖದ ಸಂಗತಿ.ಮೃತ ಅಪರ್ಣಾಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ… pic.twitter.com/fZs9L6m42Q— Siddaramaiah (@siddaramaiah) July 11, 2024 -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్మార్టమ్లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్స్టా్రగామ్లో పోస్ట్ చేసి డిలీట్చేసిన మెసేజ్లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్వుడ్లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్టాపిక్గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) -
ఆస్పత్రిలో చేరిన బిగ్బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 10 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కన్నడ నటి నమ్రత గౌడ. తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.నమ్రత గౌడ తన ఇన్స్టాలో రాస్తూ.. " ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు" అని రాసింది. కాగా.. నమ్రత ఆసుపత్రి బెడ్పై ఉండగా.. తన తల్లి ఆహారం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది. కన్నడ టీవీ సీరియల్ షో నాగినిలో శివాని పాత్ర పోషించినందుకు నమ్రత గౌడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ టెలివిజన్ పరిశ్రమలో 2011లో 'కృష్ణ రుక్మిణి' అనే సీరియల్తో ఆమె కెరీర్ ప్రారంభించారు. -
తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకోసం వచ్చేసేయ్'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా కోసం తిరిగి వచ్చేయ్రా..' అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కాగా పవిత్ర జయరామ్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య. మొదట్లో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా పని చేసిన ఈమె తర్వాత కన్నడ సీరియల్స్లో అడుగుపెట్టింది. అక్కడి నుంచి నిన్నే పెళ్లాడతా సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సీరియల్తో ఫేమస్'త్రినయని' సీరియల్ ద్వారా బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అంతకుముందు కన్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist) -
హీరోయిన్కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!
ప్రముఖ హీరోయిన్ చేదు అనుభవం ఎదురైంది. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా బూతులు తిట్టారు. మెడలోని బంగారు గొలుసు కూడా లాగేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల ముందు జరిగిన ఈ సంఘటన గురించి సదరు హీరోయిన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో అనేది విడమరిచి మరీ చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. కర్ణాటకకు చెందిన నటి హర్షిక పునాచ.. 2008 నుంచి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కొంకణి, భోజ్పురి, కొడవ భాషా చిత్రాల్లో నటించింది. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) నటుడు భువన్ పొన్నానని గతేడాది పెళ్లి చేసుకున్న హర్షిక.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని ఆస్వాదిస్తోంది. తాజాగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్కి వెళ్లి తిరిగొస్తుండగా ఊహించని సంఘటన ఎదురైందని, కొందరు వ్యక్తులు తమ కారుని అడ్డగించి దాడి చేశారని.. తన భర్త మెడలో బంగారు గొలుసు లాగేయబోయరని చెప్పుకొచ్చింది. 'ఇద్దరు వ్యక్తులు సడన్ గా డ్రైవర్ సీటు దగ్గరకొచ్చి కారు చాలా పెద్దగా ఉందని, స్టార్ట్ చేస్తే తమకు తగులుద్ది అని గొడవ మొదలుపెట్టారు. నా భర్త కన్నడలో సరేలే జరగమని వాళ్లతో అన్నాడు. అయితే ఈ కన్నడ వాళ్లకు బుద్ది చెప్పాలని, అవసరమైతే ముఖంపై గుద్ది చెప్పాలని వాళ్లు హిందీలో అన్నారు. పదే పది నిమిషాల్లో 20-30 మంది మా కారు చుట్టుముట్టారు. వీళ్లలో ముగ్గురు నా భర్త మెడలోని బంగారు గొలుసు లాగేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నా భర్త.. గొలుసు నాకు ఇచ్చేశారు. వాళ్లతో మేం కన్నడలో మాట్లాడమే తప్పైపోయింది. దీని గురించి కంప్లైంట్ చేయాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఓ ఏఎస్ఐ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు' అని హర్షిక చెప్పుకొచ్చింది. ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న స్వాతిష్ట కృష్ణన్ (ఫొటోలు)
-
ఇంట్లోవాళ్లే అలాంటి మాటలన్నారు, ఎవరూ సపోర్ట్ చేయలేదు
సీరియల్ నటి నుంచి హీరోయిన్గా మారింది భూమి శెట్టి. ఈ కన్నడ అందం 'షరతులు వర్తిస్తాయి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మాది కర్ణాటక ప్రాంతం. మా ఇంట్లో ఇంజనీరింగ్ చేస్తానంటే ఒప్పుకోలేదు. నీకు ఇంజనీరింగ్ ఎందుకు? పెళ్లి చేసేస్తాం.. అన్నారు. లేదు, చదువు కొనసాగిస్తానంటే నాతో మాట్లాడటం మానేస్తామని బెదిరించారు. ఆరేళ్లు మాట్లాడలేదు అయినా సరే ఇంజనీరింగ్ చేస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఆరేళ్లపాటు ఇంట్లోవాళ్లు నాతో మాట్లాడలేదు. ఓసారి నాకు సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయం నేను వాట్సాప్ గ్రూపులో పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత నేను కన్నడ బిగ్బాస్కు వెళ్లాను. నన్నెలాగో మార్చలేమని అర్థమయ్యాక చివరికి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. బాల్యంలో నా కలర్ గురించి చాలా మాటలన్నారు. బ్లాకీ అని, నల్లగా ఉన్నానని కామెంట్లు చేశారు. ఏదైనా ఫంక్షన్కు వెళ్లాలన్నా భయమేసేది. ఎన్నో మాటలు పడ్డా నువ్వు ఇంత నల్లగా ఉన్నావ్.. పెద్దయ్యాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ముఖానికి క్రీముల్లాంటివి పూసుకోమని.. తెల్లగా కనిపించాలని చెప్పేవారు. నేను యక్షగానం చేసే ఆర్టిస్టును. యక్షగానం చేసేటప్పుడు నాలుగు లేయర్ల మేకప్ వేస్తారు. పది లేయర్ల డ్రెస్సు వేసుకుంటాం. అంత కష్టపడితే మా ప్రతిభను గుర్తించి పొగిడేవారు కాదు. పైగా ముఖానికి అలా రంగు పూసుకోవడం వల్ల ఇంకా నల్లగా అవుతున్నానని ఎగతాళి చేసేవారు. అలా ఎన్నో మాటలు పడ్డాను. వాటన్నింటికీ అధిగమించాను' అని చెప్పుకొచ్చింది భూమి శెట్టి. చదవండి: ఈ నటికి ఇంటిపేరు లేదు, ఇండస్ట్రీలో అది భరించలేక సినిమాలకు బ్రేక్ -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్
'కల్కి' హీరోయిన్ దీపికా పదుకొణె.. తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ మరో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈమె ప్రముఖ హీరోకి భార్య కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వనుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కన్నడలో స్టార్ హీరోయిన్ మిలానా నాగరాజ్. అప్పట్లో పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే చెందిన డార్లింగ్ కృష్ణ అనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్ల వివాహం జరిగింది. 2013 నుంచి నటిస్తున్న ఈమె.. పెళ్లి తర్వాత కూడా ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది. మిలానా నాగరాజ్ లేటెస్ట్ మూవీ 'ఫర్ రెన్'... రెండు వారాల క్రితమే అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'అరామ్ అరవింద స్వామి' అనే సినిమా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. సెప్టెంబరులో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ రియల్ లైఫ్ హీరోహీరోయిన్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Milana Nagaraj (@milananagaraj) -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
హీరోయిన్గా సీరియల్ నటి.. త్వరలోనే అక్కడ ఎంట్రీ!
శాండల్వుడ్ బ్యూటీలు ఇప్పుడు దక్షిణాదిని దున్నేస్తున్నారనే చెప్పవచ్చు. ఉదాహరణకు రష్మిక మందన్ననే చూస్తే నాలుగేళ్లలోనే దక్షిణాదిని దాటి బాలీవుడ్కు ఎగబాకారు. ఇప్పుడు మరో కన్నడ భామ మేఘా శెట్టి కోలీవుడ్పై కన్నేశారు. ఈమె విషయానికి వస్తే.. బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగారు. అందంతో పాటు ప్రతిభ సొంతమైన మేఘా శెట్టి కన్నడ చిత్రాల్లో సత్తా చాటుతున్నారు. నటనంటే తనకు చెప్పలేనంత ఇష్టం అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని పేర్కొన్నారు. నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అన్న ఈ కన్నడ భామ ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం మరీ ఇష్టం అంటున్నారు. ఇకపోతే తమిళ చిత్రాలంటే తనకు చాలా మక్కువ అని పేర్కొన్నారు. తమిళ చిత్రాలను ఎక్కువగా చూస్తానని చెప్పారు. ఇక్కడ కథానాయికలకు మంచి పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. తాను ఇక్కడ నటించడంతో పాటు ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడానికి చిత్ర నిర్మాణం చేపడతానని చెప్పారు. ఇది తన తండ్రి వ్యాపారమే కాకుండా తన ఆసక్తి అని నటి మేఘా శెట్టి పేర్కొన్నారు. మరి కోలీవుడ్ ఈ బ్యూటీని ఏ మాత్రం ఆదరిస్తుందో చూడాలి. చదవండి: అమానుషం.. నటుడి భార్య కిడ్నాప్.. రెండు నెలలుగా గదిలో బంధించి! ‘ఊరు పేరు భైరవకోన ’ టాక్ ఎలా ఉందంటే.. ? -
'ఆ విషయంలో కాస్త ఓపిక పట్టండి'.. ఫ్యాన్స్కు సీరియల్ బ్యూటీ రిక్వెస్ట్!
'గుప్పెడంత మనసు' సీరియల్తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన భామ జ్యోతిరాజ్. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ 'బందె బరాటవ కాలా' సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ బుల్లితెరపై మెరిసింది. అయితే భర్తతో విడాకులు తీసుకున్న ముద్దుగుమ్మ యంగ్ డైరెక్టర్ పూర్వజ్తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అంతే కాదు జ్యోతిరాయ్ పేరును కాస్తా జ్యోతి పూర్వాజ్గా మార్చేసింది. కాగా.. జ్యోతిరాయ్ ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్న భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను తన ఇన్స్టాలో పంచుకుంది. ఈ పోస్టర్లో మరింత బోల్డ్ లుక్తో కనిపించింది. ఇప్పటికే హాట్ పెంచేసిన సీరియల్ బ్యూటీ కాస్తా ఇప్పుడు మరింత బోల్డ్గా కనిపించడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జ్యోతి తన ఇన్స్టాలో రాస్తూ..'అతి త్వరలో భయంకరమైన, విచిత్రమైన, కఠినమైన, గ్లామర్ డోస్ బ్లడ్ బాత్ థ్రిల్లర్తో వస్తున్నా. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. త్వరలోనే ఈ సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. దయచేసి ఆ విషయంలో ఓపిక పట్టండి. ఈ అద్భుతమైన మల్టీ క్యారెక్టరైజేషన్ ఇచ్చిన నా టీమ్కి ధన్యవాదాలు. నన్ను నేను డిఫరెంట్గా చూపించుకోవడాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా. మీరు త్వరలోనే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
Aditi Prabhudeva Baby Bump Photos: గతేడాది పెళ్లి.. తల్లి కాబోతున్న కన్నడ బ్యూటీ (ఫోటోలు)
-
న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్!
న్యూ ఇయర్ వేళ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది శాండల్వుడ్ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్తో ఫోటోలను పంచుకుంది. అదితి తన ఇన్స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
Leelavathi: ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సుమలత పోస్ట్ వైరల్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్హౌస్లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమలత తన ఇన్స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
నువ్వు లేని జీవితం చాలా మార్పు తెచ్చింది.. సుమలత ఎమోషనల్!
ప్రముఖ సీనియర్ నటి సుమలత పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన సుమలత టాలీవుడ్లోనూ స్టార్ హీరోలతో నటించారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె.. తన భర్త, దివంగత నటుడు అంబరీశ్ను తలుచుకుని ఎమోషనలైంది. ఆయన మరణించి ఇప్పటికీ ఐదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో తన భర్త ఫోటోను పంచుకుంది. సుమలత ఇన్స్టాలో రాస్తూ..' నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా మార్పు తెచ్చిపెట్టింది! మన ఆనందం , దుఃఖం , నవ్వు , కన్నీళ్లు ప్రతి ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుంటాయి . మీరు లేని లోటు నా జీవితాంత తీర్చలేనిది. కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నిన్ను ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితంలో నువ్వే నాకున్న ఓకే ప్రపంచం. ఈరోజు నువ్వు గర్వంగా నవ్వుతూ పైనుంచి మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ సార్, కన్నడ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఇవాళ సుమలత తనయుడు అభిషేక్ నటించిన చిత్రం బ్యాడ్ మ్యానర్స్ కర్ణాటక వ్యాప్తంగా రిలీజైంది. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్.. అవివా బిడపాను పెళ్లాడారు. జూన్లో వీరి విహహం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్బాబు సహా పలువురు సినీతారలు హాజరయ్యారు. అంబరీశ్- సుమలత లవ్ స్టోరీ 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
రష్మిక, శ్రీలీలకు పోటీగా మరో కన్నడ బ్యూటీ?
ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ వారం మాత్రం తెలుగు చిత్రాలు ఏం లేవు. 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. కన్నడలో బ్లాక్బస్టర్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మిగతా విషయాలు సంగతి కాస్త అలా పక్కనబెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్తో తన మార్క్ చూపించింది. మూవీ చూసిన ప్రతిఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఎవరు ఈమె? ఆమె ఫుల్ డీటైల్స్ 'సప్త సాగరాలు దాటి' సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి పేరు రుక్మిణి వసంత్. బెంగళూరులోనే పుట్టి పెరిగింది. లండన్లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. అశోక చక్ర సొంతం చేసుకున్నారు. ఇకపోతే రుక్మిణి.. 2019లో 'బీర్బల్' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ మూడేళ్ల ఎక్కడా కనిపించలేదు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఎందుకంత స్పెషల్? ఈ ఏడాది మాత్రం 'భగీర', 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలో 'బాణదారియల్లీ' అనే కన్నడ చిత్రంతో థియేటర్లలోకి రాబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈమెకు ఉన్నదల్లా మూడు సినిమాల అనుభవం. కానీ 'సప్త సాగరాలు దాటి' మూవీలో హీరో రక్షిత్ శెట్టిని కొన్ని సీన్స్లో డామినేట్ చేసిందంటేనే ఈమె యాక్టింగ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఈమెకి క్లోజప్ షాట్స్ చాలా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో జస్ట్ కళ్లు, నవ్వుతో అందరినీ మాయ చేసినంత పనిచేసింది. వాళ్లిద్దరికీ పోటీ? ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ల పేరు చెప్పమంటే.. రష్మిక, శ్రీలీల అని అంటారు. వీళ్లిద్దరూ కన్నడలోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. 'సప్త సాగరాలు దాటి'తో రుక్మిణి వసంత్.. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఒకవేళ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి, హిట్ కొడితే మాత్రం రష్మిక, శ్రీలీలకు పోటీ తప్పకపోవచ్చు! ఇదంతా జరగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి
కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) మృతి చెందారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. నేడు ఉదయం రమ్య గుండెపోటుతో కన్నుమూశారంటూ ఓ ట్వీట్ ప్రత్యక్షం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వెంటనే సదరు వ్యక్తి నాలుక్కరుచుకుని తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఆమె మరణించారంటూ వార్తలు వైరలయ్యాయి. అయితే రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జెనీవాలో ప్రస్తుతం తన వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువరు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిస్తున్నారు. 'జెనీవాలో ఆమె హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఈ ఫేక్ న్యూస్ బయటకు రావడంతో ఆమె సన్నిహితులు తనకు వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నారు. అసలు బతికున్న మనిషి చనిపోయిందంటూ ప్రకటించిన వ్యక్తికి, అది నిజమని ప్రచారం చేస్తున్నవారికి కాస్తైనా బుద్ధి లేదు' అని మండిపడుతున్నారు. మొదట ఈ వార్త విని ఆందోళనకు లోనైన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ సైతం దివ్య స్పందనకు కాల్ చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో వెల్లడించింది. 'దివ్య స్పందనకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. మొదట తను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడ్డాను. చివరగా నా ఫోన్ ఎత్తడంతో హమ్మయ్య, నీకేం కాలేదు.. నువ్వు బతికే ఉన్నావన్నాను. తనేమో కాస్త కోపంగా అసలు నేను చనిపోయానని ఎవరు చెప్పారు?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది అని రాసుకొచ్చింది. 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య. ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె ప్రస్తుతం పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana — Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ మధ్య పెళ్లిళ్లు బాగానే జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కూడా కొత్త జీవితం ప్రారంభించింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. నటి హర్షిక పునాచ స్వతహాగా కన్నడ అమ్మాయి. 15 ఏళ్ల వయసులోనే 'PUC' అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటికీ అంటే దాదాపు 15 ఏళ్లుగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, భోజ్పురి సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. (ఇదీ చదవండి: పబ్లిక్లో హీరోయిన్కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) హీరోయిన్గా కాస్త బిజీగా ఉన్న హర్షికకు 'గ్లామ్గాడ్ ఫ్యాషన్' అనే కంపెనీ కూడా ఉంది. ఫ్యాషన్ షోలు లాంటివి ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో హర్షికకు పార్ట్నర్గా నటుడు భువన్ ఉన్నాడు. గత కొన్నాళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్లిద్దరూ.. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఆగస్టు 26న కొడగు సంప్రదాయ విధానంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇకపోతే హీరోయిన్ హర్షిక పెళ్లికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు యడుయూరప్ప, బసవరాజు బొమ్మైతో పాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులని ఆశీర్వదించారు. మరి హర్షిక పెళ్లి ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) -
శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి
సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది. (ఇది చదవండి: ఆగస్ట్లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!) మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) View this post on Instagram A post shared by Priyanka Kamath (@kamath.priyanka) -
ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి.. రెండో పెళ్లి చేసుకుందా?
జ్యోతి రాయ్ అంటే గుర్తుపడతారో లేదో కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఈ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేసింది. సీరియల్లో సాంప్రదాయ కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇకపోతే ఈ మధ్య జ్యోతి రాయ్ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. అందుకు కారణం.. యువ దర్శకుడితో ఎఫైర్ పెట్టుకోవడమే! జ్యోతిరాయ్కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈ నటి తన భర్తను వదిలేసి ఓ యువదర్శకుడితో ప్రేమలో ఉందని పుకారు షికారు చేస్తోంది. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్ సుకు పుర్వాజ్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పుంజుకున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వెలువడ్డాయి. తాజాగా మరోసారి ఈ అనుమానాలకు ఊతమిచ్చే పని చేసింది జ్యోతి రాయ్. ఈమె కొత్తగా ట్విటర్ ఖాతా తెరిచింది. ప్రియుడు పేరు సుకుపుర్వాజ్ను తన పేరులో జోడిస్తూ జ్యోతి పుర్వాజ్ అని తన ఖాతాకు కొత్త పేరు పెట్టుకుంది. నిజానికి పెళ్లయ్యాక పేరు చివరన భర్త పేరు పెట్టుకుంటారు. ఈ లెక్కన జ్యోతి-సుకుపుర్వాజ్ పెళ్లయిపోయినట్లే కనిపిస్తోంది. మరి నిజంగానే జ్యోతిరాయ్ రెండో పెళ్లి చేసుకుందా? లేదంటే ప్రియుడి ప్రేమలో మునిగి తేలుతున్న క్రమంలోనే తన పేరు చివరన అతడి పేరును జోడించిందా అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలో పుట్టిపెరిగిన జ్యోతిరాయ్ మంగళూరులో చదువుకుంది. 'బందె బరాటవ కాలా' సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 20కి పైగా సీరియల్స్లో నటించిన జ్యోతిరాయ్.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. సీరియల్స్తో పాటు 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' సినిమాల్లో నటించింది. ఈ మధ్య వెబ్సిరీస్లు కూడా చేస్తోంది. View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా? జనాలను పిచ్చోళ్లు చేస్తున్నారు: కంగనా -
మేమిద్దరం విడిపోయాం.. ఎవరూ ద్వేషించకండి: నటి విజ్ఞప్తి
కన్నడ యాంకర్, నటి, బిగ్బాస్ బ్యూటీ చైత్ర వాసుదేవన్ కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ప్రియమైన అందరికీ.. ఎన్నో నెలలు ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పేందుకు సిద్ధమయ్యాను. సత్య, నేను ఇద్దరం విడిపోయాం. మా విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దు. ఎవరిపైనా ద్వేషం చూపించకండి. మమ్మల్ని జడ్జ్ చేయకండి. దీని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పడుతోంది. జీవితంలో ముందుకు కొనసాగాలంటే ముందు నేను నా వృత్తిలో తలమునకలయ్యేంత బిజీగా మారాలి. నేను బుల్లితెర ఇండస్ట్రీలో చాలాకాలం పని చేశాను. ఇప్పుడు కూడా అదే పరిశ్రమలో కొనసాగాలనుకుంంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. దీనికి ప్రేమ కోసం చూస్తున్నా (#lookingforlove during), కష్ట సమయం (#hardtimes), అనునిత్యం నాలో నేనే సతమతమవుతున్నాను (#strugglinginsideeveryday) అంటూ క్యాప్షన్లు జోడించింది. కాగా చైత్ర వ్యాపారవేత్త 2017లో సత్య నాయుడును పెళ్లాడింది. వీరిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగానే కనిపించేవారు. సడన్గా వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇకపోతే చైత్ర సినీ ఇండస్ట్రీలో యాంకర్గా రాణిస్తుండగా తనకు సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఉంది. అలాగే ఒక నిర్మాణ సంస్థ సైతం ఉంది. View this post on Instagram A post shared by Chaitra Vasudevan (@chaitra_vasudevan_official_) చదవండి: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ బ్యూటీ... ప్రేమ, పెళ్లికో దండమంటూ -
డైరెక్టర్తో బుల్లితెర నటి రిలేషన్?.. భర్త ఉండగానే!
గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్వుడ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. ప్రస్తుతం సీరియల్స్తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా శాండల్వుడ్ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. బుల్లితెర భామ జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఇటీవల ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే వీరి బంధం నిజమేనని తెలుస్తోంది. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్తో రిలేషన్లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాలు రెండూ ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని సుకు తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!) వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేయడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు సీరియల్ నటి సుజాత పెట్టిన కామెంట్ చూస్తే తెలిసిపోతుంది. సుజాత 'లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్' అంటూ కామెంట్ పెట్టగా.. ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా రిప్లై ఇచ్చింది. కాగా.. జ్యోతిరాయ్కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. దీంతో జ్యోతిరాయ్.. దర్శకుడు సుకు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్తో రిలేషన్లో ఉండటం హాట్ టాపిక్గా మారింది. సీరియల్స్తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్లలో కనిపించింది జ్యోతి రాయ్. (ఇది చదవండి: మద్యానికి బానిసైన సన్నీ లియోన్ తల్లి.. ఆ వీడియోల వల్లే!) కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్.. మంగళూరులో చదివుకుంది. జ్యోతి రాయ్ కన్నడలో విను బలాంజ సీరియల్ 'బందె బరాటవ కాలా' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లో నటించింది. జ్యోతి 'జోగుల', 'జో జో లల్లీ', 'గెజ్జేపూజే', 'శుభమంగళ', 'లవలవికే', 'ప్రేరణ', 'కిన్నెరి', 'సిల్లీ లల్లీ', 'సవలిగే సై', 'మురు గంటు', 'శాంతల', 'కన్యాశుల్కం' వంటి సినిమాల్లోనూ కనిపించింది. 20కి పైగా సీరియల్స్లో నటించిన జ్యోతిరాయ్.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించారు. వీటితో పాటు 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్ల వైపు మళ్లింది. View this post on Instagram A post shared by Suku Purvaj (Suresh Kumar) (@sukupurvaj) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) -
బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్!
శాండల్వుడ్లో బుల్లితెరపై ఫేమ్ తెచ్చుకున్న నటి భూమి శెట్టి. కిన్నెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా బిగ్బాస్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా హాట్ గ్లామర్ పిక్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇటీవల భూమి తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్స్లో కనిపించింది. (ఇది చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!) ఇటీవల భూమి మరింత బోల్డ్ లుక్స్తో ఫోటోలు షేర్ చేస్తోంది. భూమి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. అయితే కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో భూమి శెట్టి టాప్ లెస్గా కనిపించింది. కేవలం లో దుస్తులు ధరించి కనిపించింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకునేదానివి.. ఇప్పుడు సగమే ధరిస్తున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మీకు సరిపోయే డ్రెస్లు ఏ దుకాణంలో దొరకలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో కాదు.. ఇటీవల భూమి శెట్టి షేర్ చేసిన వీడియోపై కూడా కామెంట్ చేస్తున్నారు భూమి శెట్టి 'కిన్నెరి' సీరియల్ తర్వాత.. తెలుగులో 'నిన్నే పెళ్లాడతా', 'అక్క చెల్లెలు' సీరియల్స్లో ప్రధాన పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత 'ఇక్కత్' సినిమాతో శాండల్వుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో భూమికి జోడీగా నాగభూషణ్ నటించారు. ప్రస్తుతం భూమి కన్నడలో 'కెందాడ సెరగు' సినిమాలో నటిస్తోంది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by ಭೂMee (@bhoomi_shettyofficial) View this post on Instagram A post shared by kannada actress ❤️ (@sandalwood_actress_fans) -
నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార) నిత్యా ఇన్స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది. కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్
కన్నడ హీరోయిన్ తపస్విని పూనచ పెళ్లి పీటలెక్కింది. ప్రియుడు రక్షత్ ముత్తన్నతో ఏడడుగులు వేసింది. ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంట గురువారం తమ పెళ్లి విషయాన్ని అభిమానులకు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది తపస్విని. 'మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సుమధుర క్షణాలు ఈ చిన్ని వీడియోలో.. గత మూడేళ్లుగా కొనసాగుతున్న మన ప్రయాణం ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదంతో మరింత అర్థవంతంగా మారింది. ఇది జరిగి నెల రోజులే అవుతుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ వివాహ వేడుకకు వచ్చి దీన్ని మరింత అందంగా మార్చిన స్నేహితులు, బంధువులకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. కాగా తపస్విని, రక్షత్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. హరికథ అల్ల గిరకథ అనే కామెడీ చిత్రంతో తపస్విని పూనచ హీరోయిన్గా పరిచయమైంది. గజరామ అనే రెండో సినిమాకు కూడా ఆమె సంతకం చేసింది. పెళ్లి సందడి పూర్తవగానే తిరిగి సెట్స్లో అడుగుపెట్టనుంది. View this post on Instagram A post shared by Thapaswini Poonacha (@thapaswini__poonacha) చదవండి: ఫోటోలో ఉన్న పిల్లవాడిప్పుడు స్టార్ హీరో, అతడి వెనకాల ఉన్న పాప అతడి భార్యే! ఎక్కువమంది చూసిన ఇండియన్ సినిమా ఏదో తెలుసా? మీరనుకునేది కాదు! -
అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్రామ్ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకున్నారు. (ఇదీ చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్లో) కన్నడలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా.. ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్తో పంచుకున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Raone Pavan (@raone_pavan) -
కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి
దివంగత దర్శకుడు సిద్దలింగయ్య సతీమణి, కన్నడ నటి శ్యామలా దేవి(68) పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, తరచూ అసభ్యంగా తిడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొంది. కుమారుడు నితిన్ మొదట్లో బాగానే ఉండేవాడని, ఎప్పుడైతే అతడికి పెళ్లయిందో అప్పటినుంచి భార్య స్మితతో కలిసి తనను టార్చర్ పెడుతున్నాడని వాపోయింది. బెంగళూరులో ఓ ఇల్లు కొన్నానని, అందులోనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నామని చెప్పింది. అయితే ఆ ఇల్లు కొడుకు, కోడలు తమ పేరు మీద రాయాలని నిత్యం వేధిస్తున్నారంది. కాగా శ్యామలా దేవి కొడుకు, కోడలు పెట్టే వేధింపులు తట్టుకోలేక గతంలో సీనియర్ సిటిజన్ ఫోరమ్ను ఆశ్రయించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా తన ప్రమేయం లేకుండానే తన ఖాతాలో నుంచి డబ్బులు తీస్తున్నారని ఆరోపించింది. తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న వాళ్లిద్దరినీ ఇల్లు ఖాళీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. కానీ అంతలోనే కోడలు గర్భం దాల్చడంతో కొడుకు క్షమించమని కాళ్లు పట్టుకున్నాడు. తల్లి మనసు కరిగిపోయి ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. మారుతారేమో అని ఎదురుచూసింది కానీ అది జరగలేదు. మళ్లీ వాళ్లు వక్రబుద్ధి చూపించారు. శ్యామలాదేవిని వంటగదితో పాటు ఇతరత్రా గదుల్లోకి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇంటిని తమ పేరు మీద రాయమంటూ నిత్యం వేధించారు. లేదంటే త్వరలోనే చస్తావంటూ శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేశానంటోంది శ్యామలా దేవి. చదవండి: అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి.. హత్యా? ఆత్మహత్యా? -
స్విమ్ షూట్లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!
ఈ తరం కథానాయకులు కొందరు సినిమా ఆకాశాల కోసమో, లేక వార్తల్లో ఉండడం కోసమో పడరాని పాట్లు పడుతున్నారు. అదేవిధంగా ఇన్స్ట్రాగామ్లో ఫాలోవర్స్ కోసం గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి వెనుకాడడం లేదు. నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. (ఇది చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్ చరణ్, ఐపీఎల్లోనా?) కన్నడలో కథానాయకిగా చిత్రాలు చేస్తున్న సంయుక్త హెగ్డే తమిళంలోనూ జి వీ.ప్రకాష్ కుమార్ సరసన వాచ్మెన్, జయం రవి తో కోమాలి, అశోక్ సెల్వన్ కు జంటగా మన్మధ లీలై, వరుణ్కు జతగా పప్పీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో చాలావరకు సక్సెస్ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా క్రేజ్ తెచ్చి పెట్టలేదు. దీంతో ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం కూడా లేదు. దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది తాజాగా ఈత దుస్తుల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్) అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు మాత్రం సంయుక్త హెగ్డేపై రకరకాల ట్రోలింగ్ చేస్తున్నారు. తను కోరుకున్నదీ ఇదే కాబట్టి ఈ అమ్మడు వాటిపై నోరు మెదపడం లేదని సమాచారం. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్ ఎంతవరకు ఫలితానిస్తాయో కాలమో నిర్ణయించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్వుడ్లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. -
కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందమైన ఫోటోలు
-
నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి: రష్మిక
రష్మిక మందన్నా ఈ పేరు వింటే చాలు సౌత్, బాలీవుడ్తో ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆమె నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇవాళ రష్మిక 28వ ఏట అడుగుపెడుతోంది. ఏప్రిల్ 5న ఈ అమ్మడు బర్త్ డే కావడంతో పుష్ప-2 టీమ్ కూడా క్రేజీ అప్ డేట్తో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చివరిసారిగా వారసుడు మూవీతో అభిమానులను పలకరించింది అమ్మడు. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. అయితే తన సినీరంగంలో ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందాల పోటీలో గెలుపొందిన తర్వాత తనకు సినిమాలో ఆఫర్ చేశారని తెలిపింది. అయితే అది ప్రాంక్ కాల్గా భావించి 'నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి' అని ఆ నంబర్ను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలు స్నేహితుల ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వారు నా క్లాస్ టీచర్ ద్వారా నన్ను కలిశారు. చిత్రనిర్మాతని కలిశాక.. తనకు ఎలా నటించాలో తెలియదని చెప్పినట్లు రష్మిక తెలిపింది. అయితే తనతో కొన్ని డైలాగ్లను రికార్డ్ చేసిన తర్వాత ఎంపిక చేశారని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ మూవీ పుష్ప సీక్వెల్ పుష్ప-2 అలరించేందుకు సిద్ధమైంది. రష్మిక సినీ కెరీర్ రష్మికా మందన్నా 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్పేట్లో జన్మించింది. 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించిన రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె పాత్రకు ఉత్తమ తొలి ప్రదర్శనగా సైమా అవార్డును కూడా గెలుచుకుంది. 2017లో రష్మిక రెండు కన్నడ చిత్రాలలో అంజనీ పుత్ర, చమక్లో కనిపించింది. టాలీవుడ్లో ఛలో చిత్రం ద్వారా అడుగు పెట్టింది. 2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం కాగా.. అదే సంవత్సరంలో గుడ్ బై సినిమా ద్వారా ఆమె బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2017లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కాగా.. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది. Team #PushpaTheRule wishes the gorgeous 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday ❤️ May you continue to RULE our hearts ❤️🔥 Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/wNbsDxOUys — Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023 -
అడల్ట్ సినిమాలో న్యూడ్గా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు నటి ఏమందంటే?
అందాలు ఆరబోయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి! గ్లామర్ షో చేస్తేనే కానీ దర్శకనిర్మాతల కంట పడరు అన్నట్లు తయారైంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఒక్క సినీఇండస్ట్రీ మాత్రమే కాదు బుల్లితెరది కూడా ఇంచుమించు అదే పరిస్థితి! సీరియల్స్ నుంచి సినిమాకు ప్రమోషన్ రావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే! మంగళ గౌరి మధువె అనే కన్నడ సీరియల్తో పాపులర్ అయిన నటి తనీశా కుప్పంద తన అందంతో 2012లోనే పారిజాత అనే సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు కూడా అందుకుంటోంది. ఇటీవల ఆమె పెంటగాన్ మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది నటి. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ బ్యూటీకి ఓ యూట్యూబర్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది. 'మీరు అడల్ట్ సినిమా చేస్తారా?' అని అడిగేసరికి నటి ఒక్కసారిగా అవాక్కైంది. 'నేనేమీ బ్లూ ఫిలిం స్టార్ కాదు. మీరిలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు న్యూడ్ మూవీస్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మండిపడింది. అసలు ఆ యూట్యూబర్కు ఇతరులను గౌరవించడం ఏమాత్రం తెలియనట్లుంది అని కామెంట్ చేసింది. -
చీరకట్టుతో కనికట్టు చేస్తున్న రాగిణి ద్వివేది అందమైన ఫోటోలు
-
అమ్మానాన్న తర్వాత నాకు రాహుల్ గాంధీయే..: కన్నడ నటి
దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. 'నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు' అని చెప్పుకొచ్చారు. కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
సీనియర్ నటి అభినయపై లుకౌట్ నోటీసులు జారీ
కన్నడ నటి అభినయనను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె తల్లితో పాటు సోదరుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వరకట్న వేధింపుల కేసులో ఈ ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు శాండల్వుడ్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా గత నెల రోజులుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. దీంతో దోషులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా నటి అభినయ సోదరుడు శ్రీనివాస్కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఎన్నో మలుపుల అనంతరం 2012లో వీరిని దోషులుగా తీర్పునిచ్చిన న్యాయస్థానం అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడికి రెండేళ్లు, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
క్యాన్సర్తో పోరాటం.. మందులకు కూడా డబ్బుల్లేని దీనస్థితిలో నటి..!
కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన నటి శైలా శ్రీ. కన్నడలో పలు సినిమాల్లో నటించింది. 1960-70 రోజుల్లో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. సినిమాల్లో ఆమె చేసిన కృషికి 2019లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు కూడా లభించింది. తెలుగులో కొన్ని సినిమాల్లోనూ నటించింది. సంధ్యారాగ అనే చిత్రంలో చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసింది శైలా శ్రీ. 1971లో నేషనల్ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం నాగువా హూవులో ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆమె తెలుగులో భలే అబ్బాయిలు సినిమాలో కనిపించింది. ఆమె కన్నడ నటుడు ఆర్.ఎన్. సుదర్శన్ను వివాహం చేసుకుంది. ఆమె అతనితో నాగువ హూవు, కదీనా రహస్య, కల్లారా కల్లా, మాలతి మాధవ, వంటి చిత్రాల్లో నటించింది. అది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడామె పరిస్థితి దయనీయంగా మారింది. శైలా శ్రీ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమెకు చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరు ఆర్ఆర్ నగర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె మందుల ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె పరిస్థితి తెలిసిన దంపతులు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు చెక్ను అందజేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సాయం అందించినందుకు శైలా శ్రీ సంతోషం వ్యక్తం చేశారు -
లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ నటికి షాకిచ్చిన హైకోర్టు
ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు. -
నటి సుమలత కొడుకు నిశ్చితార్థం ఫోటోలు
-
ఘనంగా నటి సుమలత కొడుకు నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
సీనియర్ నటి, లోక్సభ ఎంపీ సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్ నిశ్చితార్థం బెంగళూరులో ఓ హోటల్లో ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కుమార్తె అవివాతో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో అభి–అవివా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అంబరీష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాకింగ్ స్టార్ యష్, తన భార్య రాధికతో కలిసి వచ్చారు. సుమలత మాండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు కూడా అభిషేక్ – అవివా నిశ్చితార్థానికి వచ్చి వారిని ఆశీర్వదించారు. కాగా అభిషేక్, అవివాల మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సుమలత కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్ను డిసెంబర్ 8న 1991 వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒకే కుమారుడు అభిషేక్ గౌడ. 2018 నవంబర్లో అంబరీష్ గుండెపోటుతో మరణించారు. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్ను తలుచుకుంటూ సుమలత ఓ ఎమోహనల్ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భర్త అంబరీష్తో సుమలత(ఫైల్) ನಿಶ್ಚಿತಾರ್ಥವನ್ನು ಮಾಡಿಕೊಂಡ ಅಭಿಷೇಕ್ ಅಂಬರೀಶ್ ಹಾಗೂ ಅವಿವ ಜೋಡಿಗೆ ಶುಭಾಶಯಗಳು💐#AbishekAmbareesh #AvivaBidapa #Engagement #Marraige #Cinema #Sandalwood #Entertainment #aviva #abhishekambarish #Sumalatha @dasadarshan @sumalathaA #darshan #dboss #dbossfans #Kaali #AA04 #AvivaBidappa pic.twitter.com/Kn4SxeXrLo — OTTRelease (@ott_release) December 11, 2022 -
నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు.. నాలోనే ఉన్నావు.. సుమలత ఎమోషనల్ నోట్
కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్లో అభిమానుల మనసులు గెలుచుకున్న సీనియర్ నటి సుమలత. తెలుగులో అగ్రహీరోలతో పలు సినిమాల్లో ఆమె నటించింది. దివంగత సూపర్స్టార్ కృష్ణతోనూ పలుచిత్రాల్లో ఆమె జంటగా కనిపించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్ను తలుచుకుంటూ ఓ నోట్ను విడుదల చేసింది. (ఇది చదవండి: ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి) నోట్లో సుమలత రాస్తూ.. 'ఈ రోజు గాలిలో మీ గొంతు విని నేను మీ ముఖం వైపు తిరిగా. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నప్పుడు గాలి వెచ్చదనం నన్ను తాకింది. నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నా. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశా. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించింది.ఈరోజు నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నా. అది నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించింది. నువ్వు చనిపోయి ఉండొచ్చు.. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు. ఎప్పుడూ నాలో భాగమై ఉంటావు. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుంది. వర్షం కురుస్తుంది. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివసిస్తావు. అది నా హృదయానికి తెలుసు.' అంటూ ఎమోషనల్ అయ్యారు. సుమలత, అంబరీష్ ప్రేమకథ: సుమలత డిసెంబర్ 8న 1991న కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు అభిషేక్ గౌడ జన్మించారు. అంబరీష్ 1984లో కన్నడ చిత్రం ఆహుతి సెట్స్లో మొదటిసారిగా కలిసిన తర్వాత నటి సుమలతతో స్నేహాన్ని పెంచుకుని మరింత దగ్గరయ్యారు. కాగా.. 24 నవంబర్ 2018న అంబరీష్ గుండెపోటుతో మరణించారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు నివాళులర్పించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించారు. (ఇది చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట) అనే నా జీవితానికి గొప్ప బహుమతి: సుమలత తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఆ రోజు నీతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్ పార్టనర్గా నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాలో ఏదో కొత్త ఉత్సాహం. ఆ రోజుని పదే పదే గుర్తు చేస్తూ పెళ్లినాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రోజుని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటా. మన 31 ఏళ్ల వివాహబంధంలో జీవితకాల జ్ఞాపకాలను నాటారు. మీరు అందించిన ప్రేమ, ఆప్యాయతలు నా జీవితానికి బహుమతులు' అంటూ ఎమోషనల్ అయ్యారు సీనియర్ నటి సుమలత. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
డేటింగ్లో ప్రముఖ నటి.. సోషల్ మీడియాలో వైరల్
కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని శాండల్వుడ్లో టాక్ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు. సోమవారం బెంగళూరు ఎయిర్పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్స్టాగ్రామ్లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్వుడ్లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
షూటింగ్లో గాయపడ్డ ప్రముఖ హీరోయిన్
ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది షూటింగ్లో గాయపడింది. వివరాల ప్రకారం.. రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన మూవీ టీం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఆమె షూటింగ్లో పాల్గొననుంది. ఇక తన గాయానికి సంబంధించిన ఫోటోను రాగిణి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు. మీరు ఒప్పించాల్సింది మీ మనస్సు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ రాసుకొచ్చింది. కాగా 2009లో వచ్చిన ‘వీర మడక్కరి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాగిణి‘‘జెండాపై కపిరాజు’’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. యశోద నటి ఎమోషనల్ పోస్ట్
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజాగా యశోద మూవీలో నటించింది. ఆమె సినీ ప్రయాణం మొదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్మీడియాలో ఏమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. (చదవండి: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) వరలక్ష్మీ శరత్ కుమార్ లేఖలో ప్రస్తావిస్తూ.. 'సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ దశాబ్ద కాలంలో నా సినీ ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగలేదనే చెప్పాలి. పదేళ్లలో ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వాటినుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. దశాబ్ద కాలంగా ఎంతో కృషి చేశా. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకున్నా. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా కెరీర్ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు వరలక్ష్మీ శరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. Thank you ❤️#10years #blessed #grateful pic.twitter.com/AJ6x57MLRg — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) November 13, 2022 -
ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ.. దీపావళికి ఊరికెళ్లి వచ్చేలోపే..!
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన వినయ ప్రసాద్ అందరికీ సుపరిచితమే. పలు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు. కన్నడ పరిశ్రమకు చెందిన వినయ ప్రసాద్ అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది. టాలీవుడ్లో ఇంద్ర, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఆంజనేయులు వంటి పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్లో నటిస్తున్నారు. (చదవండి: ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం) అయితే తాజాగా వినయ ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దీపావళి సందర్భంగా ఆమె భర్తతో కలిసి ఉడిపి వెళ్లగా.. తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంట్లోని లాకర్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లినట్లు పీఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే నగదు మొత్తం ఎంత అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Actress Ashita: అందుకు ఒప్పుకోలేదు.. శాండిల్వుడ్కు దూరమయ్యా
బెంగళూరు: కన్నడ చిత్ర సీమను మీటూ వేధిస్తోందని నటి అశిత ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. తాను శాండిల్వుడ్కు దూరం కావటానికి కారణాలను పేర్కొంది. కన్నడ చిత్రాలలో నటించాలంటే పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలి, అందుకు తాను సహకరించలేదు. సహకరించి ఉంటే నటించే అవకాశం వచ్చేది. దీంతో తాను శాండిల్ వుడ్కు దూరం అయ్యాయని ఆ చానల్లో పేర్కొంది. అయితే ఆమె ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటూ ఆరోపణలు చేశారు. చదవండి: (Arohita: ఆమ్ ఆద్మీలో చేరిన సినీ నటి) -
Arohita: ఆమ్ ఆద్మీలో చేరిన సినీ నటి
సాక్షి, బెంగళూరు: కన్నడ సినీ నటి ఆరోహిత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. గురువారం ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పృథ్వీరెడ్డి ఆరోహితకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పృథ్వీరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ మార్పుల కోసం తపించే ఆరోహితలాంటి ప్రతిభాన్వితులు ఆప్లో చేరటం అభినందనీయమన్నారు. చదవండి: (Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట) -
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్లు -
‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి
Actress Chaitra Hallikeri Lodges FIR On Her Husband: తన భర్త వల్ల ప్రాణ హాని ఉందని ప్రముఖ నటి చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన భర్త, మామ కలిసి తన బ్యాంక్ అకౌంట్ను మిస్ యూస్ చేశారని ఆమె మైసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చైత్ర భర్త బాలాజీ పోత్రాజ్, మామపై(చైత్ర భర్త తండ్రి) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైత్ర హల్లీకెరీ పలు కన్నడ సినిమాల్లో నటించింది. ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంతో మంగళవారం(మే 24న)భర్త బాలజీ పోత్రాజ్, మామ కలిసి తన బ్యాంక్ ఖాతాను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆరోపించింది. చదవండి: Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. తనకు తెలియకుండానే ఆమె పేరుతో బ్యాంక్ నుంచి గోల్డ్ తీసుకున్నారని చైత్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు వీరికి సౌత్ ఇండియా బ్యాంక్ మేనేజర్ సహకరించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి వారిని నిలదీసినందుకు భర్త బాలజీ తనని హింసించినట్లు ఆమె పేర్కొంది. అంతేకాదు తన భర్త, మామ వల్ల ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని చైత్ర కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇక చైత్ర ఫిర్యాదు మేరకు ఆమె భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 468,406, 409, 420, 506 కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బయటకు రాగానే యాంకర్ శివ రచ్చ, క్లాస్ పీకిన మహిళ పోలీస్ -
శ్రీదేవి నుంచి సమంత దాకా ఎవరెవరు సర్జరీ చేసుకున్నారంటే?
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి. దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు. అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్’ అధునాతనంగా మారి, ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది. లబ్ధి పొందినవారు ఉన్నారు కాస్మెటిక్ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి. ఇక అమితాబ్ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్’ చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్ మార్పులను గమనించవచ్చు. షారూక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. వికటించిన వైనాలు కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్ జాక్సన్ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి. ఊహించని మరణాలు తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్ షౌక్ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్ ఫాట్లాస్ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం లేదు. నా రూపమే నా సౌందర్యం తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్ వంటి నటీమణులు, నవాజుద్దీన్ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్ సాధించవచ్చు అని నిరూపించారు. ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్లతో, ఫ్యాషన్ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి. సహజమే... సౌందర్యం... నిజానికి బ్యూటీ కాంటెస్ట్లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు. – అభిమానిక తవి, ఫిట్నెస్ ట్రైనర్, బ్యూటీ పేజెంట్ గ్రూమింగ్ పోల్చుకోవడమే పెద్ద సమస్య... అందంగా కనిపించాలని ముందు మేకప్ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. వీరిలో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్లా అంటుకుపోతుంది. సూసైడల్ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి. – గీతా చల్ల, సైకాలజిస్ట్ చదవండి: సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
పునీత్కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత
Namratha Inked Puneeth Rajkumar Name: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించి దాదాపు 6 నెలల కావోస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని తలుచుకుని కన్నడిగులు కుమిలిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీశాండల్ వుడ్ సీని ప్రముఖులే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు నివాళులు అర్పించారు. ఇక కన్నడ ప్రజలు, ఫ్యాన్స్ అయితే పునీత్ లేడనే వార్త విని గుండెలు విలపించేలా రోధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరి గుండెలు ఆగిపోయాయి. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. అంతలా ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచిన పునీత్ రాజ్కుమార్ హీరోగానే కాదు ఓ మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ.. చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసిన ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో యావత్ దేశం ఆయనకు సెల్యూట్ కొట్టింది. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో సైతం ఉన్నారడానికి ఈ తాజ సంఘటనే ఉదాహరణ. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 పునీత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ నటి ఏకంగా ఆయన పేరునుఏ టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్ రాజ్కుమార్ను వీరాభిమాని. దీంతో ఆయన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్ను రీసెంట్గా నమ్రత షేర్ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా నమ్రత పునీత్ మిలనా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. 2007లో వచ్చిన ఈ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న రోల్ పోషించింది. నాగిని(కన్నడ) సీరియల్తో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది. View this post on Instagram A post shared by namratha (@namratha__gowdaofficial) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర స్టార్ రష్మీ
కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రియుడు నిఖిల్ భార్గవ్ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులో ఏప్రిల్ 25న వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఇటీవల రష్మి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ముందుగానే వివరించింది. 'నిఖిల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ ఈవెంట్లో మేమిద్దరం కలిశాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్గా మారాము. అలా ఒకరినొకరం ఇష్టపడ్డాం. ముందు నిఖిల్ ప్రపోజ్ చేశాడు, నేనూ ఓకే చెప్పాను. ఒక నెల క్రితమే ఇంట్లో మా ప్రేమ విషయాన్ని చెప్పగా వాళ్లు సర్ప్రైజ్ అయ్యారు, పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. లాక్డౌన్లో మేమిద్దం కలిసి ఆహారపొట్లాలు కూడా పంచాము. ఒక నటిగా పెళ్లయ్యాక నా కెరీర్ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిఖిల్కు ఎలాంటి అభ్యంతరం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా రష్మి కన్నడ బుల్లితెరపై మనసెల్ల నేనే అనే సీరియల్లో కథానాయికగా నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ధారావాహిక నుంచి తప్పుకుంది. View this post on Instagram A post shared by Rashmi Prabhakar (@rashmiprabhakar_official) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) చదవండి: KGF Director: ప్రశాంత్ నీల్.. మన బంగారమే ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ -
కేజీఎఫ్ 2లో రాఖీభాయ్ తల్లిగా నటించిన అర్చనకు ఘన సన్మానం
సాక్షి, కోలారు (కర్ణాటక): కేజీఎఫ్ సినిమాలో నటించిన కోలారుకు చెందిన నటి అర్చనా జోయిస్ను బుధవారం నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఘనంగా సన్మానించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ మాట్లాడుతూ అర్చనా జోయిస్ తన నటన ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఖీభాయ్ యశ్ కథానాయకుడిగా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. చదవండి: 'కేజీఎఫ్ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్' డైలాగ్ రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
రోడ్డు ప్రమాదంలో కూతురిని కోల్పోయిన నటి
కన్నడ నటి అమృతా నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల కూతురు సమన్విని కోల్పోయింది. అమృతానాయుడు, రూపేశ్నాయుడు దంపతులు కనకపురరోడ్డులోని లిబర్టీ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సమన్వి(6) రియాలిటీ షోలో పోటీదారుగా ఉంది. గురువారం సాయంత్రం తల్లి అమృతనాయుడు, సమన్విలు వాజరహళ్లిలో షాపింగ్కు స్కూటీలో వెళ్లి వస్తుండగా వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది. కిందపడిన సమన్విపై లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి దింది. అమృతానాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమృత నాలుగు నెలల గర్భిణీ. బనశంకరి స్మశానవాటికలో శుక్రవారం సమన్వి అంత్యక్రియలు జరిగాయి. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మంచేగౌడను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ విభాగ ట్రాఫిక్ డీఎస్పీ కుల్దీప్ కుమార్ జైన్ తెలిపారు. ఇదిలా ఉంటే అమృతా నాయుడు, సమన్వి ఇద్దరూ 'నన్నమ్మ సూపర్ స్టార్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. కానీ అమృత రెండోసారి గర్భం దాల్చిన తర్వాత ఫిజికల్ టాస్కులు ఆడటం కొంత కష్టమవుతుండటంతో ఆ షో నుంచి తప్పుకున్నారు. సమన్వి ఆడుకోవడానికి త్వరలోనే ఓ బుజ్జి పాపాయి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో తన కూతురు చనిపోవడంతో పుట్టెడు శోకంలో మునిగింది అమృత. లిటిల్ స్టార్ సమన్వి మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. 'ఇంత చిన్నపాపను తీసుకెళ్లడానికి ఆ దేవుడికి మనసెలా వచ్చింది? అసలు భగవంతుడున్నాడా? చిన్నారి సమన్విని నేను చాలా మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక' అంటూ కన్నడ యాంకర్ సృజన్ నివాళులు అర్పించాడు. -
ఆ హీరో నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు : ప్రముఖ నటి
Kannada TV Actress Files Complaint: ప్రముఖ కన్నడ సీరియల్ నటి( పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఓ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. 'కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నాం. అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఇంటికి వచ్చి బలవంతంగా నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పెళ్లికి ముందు పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వివాహం గురించి మాట్లాడితే ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. స్నేహితులు కూడా ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు గుడిలో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అత్తిరింట్లో భర్త తరపు బంధువులు నరకం చూపించారు. కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ నా కులం పేరుతో దూషించేవారు' అని నటి బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను భర్త, అత్తమామల చిత్రహింసలు భరించలేక ఇటీవలె వాళ్ల నుంచి విడిగా ఉంటున్నట్లు తెలిపింది. ఇటీవలె ఈమె ఓ రియాలిటీ షోలో సైతం పాల్గొంది. ప్రస్తుతం ఆమె భర్త సీరియల్స్లో హీరోగా చేస్తున్నాడు. అయితే వివరాలు మీడియాకు వెల్లడించడానికి ఆమె నిరాకరించింది. -
నటి సౌజన్యది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Kannada Tv Actress Soujanya Death By Suicide: నటి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యుల నివేదికలో వెల్లడైంది. గతనెల 30న ఆమె అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్ను విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. చదవండి: కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం