Parthasarathy
-
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
మంత్రి వర్సెస్ ఎంపీ
పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. పట్టు కోసం బీకే ప్రయత్నాలు అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సామాజిక వర్గాలపై కన్ను హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నోరు మెదపని పార్టీ పెద్దలు పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి గారి అబద్దాలు
-
మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ !
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిందనే విషయం మీనాక్షినాయుడుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపైనా గెలుపొందారు. టీడీపీ మినహా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్నతికి తోడ్పడ్డారు. చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా తన తనయుడిని బరిలో నిలపాలని ఆయన అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. -
టీడీపీలో తిరుగుబావుటా
డోన్/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్లో పోటాపోటీ బలప్రదర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు. బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు. బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు. దిలీప్చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పారు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చర్చించానని, ఈసారి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్ కళ్యాణ్ జెండా సభలో వివరించారని, పవన్ తన పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మద్యం, డబ్బులు ఎరగా వేశారు. ఈ క్రమంలోనే గాజులపల్లికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కానీ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే అతను గుండె ఆగి చనిపోయినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. వారం రోజుల క్రితం పెనుకొండలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఆరంభం నుంచి టీడీపీ వెంట నడిచిన వారేనని తేలింది. అయితే కొంతకాలంగా సవితమ్మ వర్గంలో ఉన్న వారంతా ఇప్పుడు బీకే పార్థసారథి వైపు వచ్చారని తెలిసింది. అలాగే నాలుగు కుటుంబాలు మాత్రమే టీడీపీలో చేరగా.. 40 కుటుంబాలు చేరినట్లు ప్రచారం చేశారు. ఫొటోల్లో జనం భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యాలయంలోని వారందరికీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం. సాక్షి, పుట్టపర్తి: అధినేత అవినీతి కేసులో జైలు పాలయ్యాడు.. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చినా కార్యకర్తలు కన్నెత్తి చూడటం లేదు. ఏం చేయాలో తెలియని పచ్చ తమ్ముళ్లు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి టీడీపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలోనూ అవే వార్తలు కనిపిస్తుండటంతో జనం నవ్వుకుంటున్నారు. వాపును బలుపుగా ప్రచారం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో చాలా మంది టీడీపీ నేతలూ లబ్ధి పొందుతున్నారు. దీంతో వారంతా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. దీంతో ‘తమ్ముళ్ల’కు వణుకు పట్టుకుంది. అవినీతి కేసులో చంద్రబాబు జైలు వెళ్లడం...టీడీపీ ముఖ్య నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన కార్యకర్తల్లోకి వెళ్లిపోయింది. అందువల్లే మండల స్థాయి నేతలంతా వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘తెలుగు తమ్ముళ్ల’కే మళ్లీ కండువాలు కప్పుతూ కొత్తగా టీడీపీలో చేరారంటూ గొప్పలు పోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం తెలిసిన జనం మాత్రం వీరి చర్యలు చూసి నవ్వుకుంటున్నారు. ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే.. కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. కోర్టు సైతం ఆయనకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీన్ని చూపి సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కారణంతో ఎవరు మరణించినా.. వెంటనే ‘చంద్రబాబు అరెస్టు’ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జిల్లాలో నాలుగైదు వెలుగు చూశాయి. ఓట్ల వేటలో టీడీపీ నేతల కక్కుర్తి వ్యవహారాలు నచ్చక చాలా మంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఉనికి కోసమే చంద్రబాబు జైలుకెళ్లాడు.. లోకేష్ పారిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం జగనన్న ప్రభుత్వంలో కుదరదు. ఇక ఆ అవినీతి పరుడు జైల్లో ఉండాల్సిందే. టీడీపీ జీరో అయింది. అందువల్లే ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. కానీ విజ్ఞులైన జనం అంతా గమనిస్తున్నారు. – గోరంట్ల మాధవ్, ఎంపీ, హిందూపురం నలుగురు కూడా చేరలేదు మా గ్రామం నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారందరూ టీడీపీలో ఉన్నవాళ్లే. అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో వారికి కండువాలు కప్పి కొత్తగా టీడీపీలో చేరినట్లు బీకే పార్థసారథి ప్రచారం చేశారు. కనీసం నలుగురు కూడా టీడీపీలో చేరలేదు. – రామాంజనేయులు, కురుబవాండ్లపల్లి -
టీడీపీ బస్సుయాత్రలో బాహాబాహీ
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారస్థాయికి చేరింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్టీ నాయకురాలు సవితమ్మ వర్గీయులు పెనుకొండ పట్టణంలో బాహాబాహీకి దిగారు. నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. బస్సుయాత్ర ఆదివారం శెట్టిపల్లి నుంచి వివిధ గ్రామాల మీదుగా పెనుకొండకు చేరుకుంది. స్థానిక మడకశిర సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద సవితమ్మ వర్గీయులు బాణాసంచా కాలుస్తూ కేకలు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బీకే పార్థసారథి.. సవితమ్మ వర్గీయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘పోటు పొడిచారు.. మీ కథ చూస్తా..’ అంటూ హెచ్చరించారు. బస్సుయాత్రలో వెనుకనే ఉండి డ్రామాలాడుతోందంటూ సవితమ్మపై పరోక్షంగా మండిపడ్డారు. అనంతరం పార్టీ జిల్లా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి పైకి వెళ్లగానే.. బస్సు ముందు నిలబడి ఉన్న ఇరువర్గాలు కేకలు వేస్తూ బాహాబాహీకి దిగారు. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థంగాక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి బస్సుయాత్ర అంబేడ్కర్ సర్కిల్కు వెళ్లగా సవితమ్మ వర్గీయులు మాత్రం కార్యాలయం వద్దే ఉండిపోయారు. -
కేఎస్బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్బీఎల్కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్బీఎల్కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
శివ ధ్యానం జన్మజన్మల పుణ్యఫలం
-
స్వరార్చన
-
రూ.110 కోట్ల కార్వీ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ పార్థసారథికి చెందిన రూ.110 కోట్ల విలువైన భూములు, బంగారు ఆభరణాలు, విదేశీ నగదు, షేర్లను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్థసారథితోపాటు సీఎఫ్వో జి.హరికృష్ణను గతంలో అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్ నగర కమిషనరేట్లోని సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కార్వీ సంస్థతోపాటు చైర్మన్, ఎండీ, తదితరులకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. తాజాగా చేసిన రూ.110 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తంగా రూ.2,095 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు స్పష్టం చేసింది. కార్వీ సంస్థలో షేర్ హోల్డర్లను మోసం చేసి వారి షేర్ల మీద రూ.2,800 కోట్ల మేర రుణం పొంది ఎగొట్టిన కేసుల్లో పార్థసారథిపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద సైతం రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. షేర్ హోల్డర్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసి రుణం పొందడంతోపాటు కేడీఎంఎస్ఎల్, కేఆర్ఐఎల్ కంపెనీలకు మళ్లించి వాటిని లాభాల్లో చూపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించింది. రుణాల్లో కొంత భాగాన్ని కుమారులు రజత్ పార్థసారథి, అధిరాజ్ పార్థసారథికి జీతభత్యాలు, రీయింబర్స్మెంట్ పేరుతో దోచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. కార్వీ అనుబంధ సంస్థగా ఉన్న కేడీఎంఎస్ఎల్ ఎండీ వి.మహేశ్తోపాటు మరికొంత మంది కలిసి పార్థసారథి డైరెక్షన్లో మనీలాండరింగ్లో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వెల్లడించింది. -
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
నష్టాలు చూపించి.. కోట్లు కొల్లగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల పేరిట ఉన్న షేర్లను తనఖా పెట్టి మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి వ్యవహారంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. నాలుగు రోజుల క్రితం అరెస్ట్చేసిన పార్థసారథితోపాటు కంపెనీ సీఎఫ్ఓ కృష్ణ హరిని విచారిస్తోంది. గురువారం కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఈడీ మొదటి రోజు.. షేర్ల పేరిట రుణాలు తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. షెల్ కంపెనీలపై వేల కోట్ల రుణం కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లు కొనుగోలు చేసిన క్లయింట్ షేర్లను పవర్ ఆఫ్ అటార్నీతో బదలాయించుకున్న పార్థసార«థి.. కృష్ణ హరితో కలిసి కార్వీ రియల్టీతోపాటు 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ విచారణలో బయటపడింది. కస్టమర్ల షేర్లను సైతం షెల్ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా మళ్లించిన షేర్లను 5 షెల్ కంపెనీల పేరిట తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.400 కోట్ల రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు ఉపయోగించినట్టు పార్థసారథి, కృష్ణ హరి విచారణలో చెప్పిననట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. కార్వీ రియల్టీతోపాటు మరో 9 కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు యత్నించారని, ఆ తర్వాత రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా రూ.రెండువేల కోట్లకు పైగా రుణం పొందినట్టు గుర్తించారు. ఆ డబ్బు సంగతేంటి? స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి మళ్లించిన షేర్లను తన వ్యక్తిగత ఖాతాతోపాటు కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలకు తరలించినట్టు గుర్తించిన ఈడీ.. అక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై లోతుగా విచారిస్తోంది. కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలోకి దాదాపు రూ.2వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించింది. తర్వాత ఈ డబ్బును ఎక్కడికి మళ్లించారు, షేర్ల బదలాయింపునకు ముందే కంపెనీని భారీ నష్టాల్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న దానిపై పార్థసారథిని ప్రశ్నిస్తోంది. ఇద్దరూ కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కుంభకోణంలో పాలుపంచుకునేలా చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై కస్టడీలో పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. -
రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్డ్రైవ్లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు.. హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే.. షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది. సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. -
కార్వీ పార్థసారథిపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు. -
పంజాబ్కు ‘కార్వీ’ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్జీత్ సింగ్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్ బండారీ ఇటీవల హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. లలిత్ బండారీకి డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తామని, ట్రేడింగ్ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కార్వి ఎండి పార్థసారధికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా అతన్ని పలు అంశాల్లో సీసీఎస్ పోలీసులు విచారించారు. అందులో భాగంగా.. కార్వి సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్ల పై కూపీ కూడా లాగారు. కాగా ఆడిట్ రిపోర్ట్ అతని మందుంది విచారించినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ముందు పార్థసారథిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై కార్వీ ఎండీ పార్ధసారథి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసుల విచారణలో పార్ధసారథి 6 బ్యాంక్ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. చదవండి: బంగారాన్ని పేస్ట్గా మార్చి ప్యాంట్లో దాచాడు! -
రెండోరోజు ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
-
ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి పోలీసుల కస్టడీ ముగిసింది. రెండు రోజులు పాటు పార్థసారథిని విచారించిన సీసీఎస్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా విచారించిన పోలీసులు.. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వీటి ద్వారా 6 బ్యాంక్ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. కార్వీకి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే కార్వీ కుంభకోణంలో ఇతరుల పాత్రపై పార్ధసారథిని పోలీసులు ప్రశ్నించారు. ఇతర నిందితులపై త్వరలో చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. కాగా రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన పార్ధసారథిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించిన సీసీఎస్ పోలీసులు నేడు కోర్టులో హజరుపర్చనున్నారు. -
వందల మంది షేర్లు మాయం!
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) సంస్థలో డీమ్యాట్ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. దీంతోపాటు డీమ్యాట్ ఖాతాలకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లోని నగదు కూడా మాయమైంది. కేఎస్బీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులు గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు. సోమవారం నాటికి 25 మంది వచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఈ ఠాణా అధికారులు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరాల కేసుల్నే నమోదు చేయాలి. అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై సీసీఎస్లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. రూ.137 కోట్లకు సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయంతెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సంస్థలోకి మళ్లించుకుని రుణాలు.. కేఎస్బీఎల్ సంస్థ ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో వినియోగదారులకు సంబంధించిన షేర్లతో పాటు దానికి లింకైన బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అనువుగా మార్చుకున్న పార్థసారథి మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి రుణాలు తీసుకున్నారు. మరికొందరి షేర్లను విక్రయించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదునూ స్వాహా చేశాడు. ఇలా కేఎస్బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దాదాపు 2 లక్షల మంది మదుపరుల ఖాతాల్లోని షేర్లు, నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఫిర్యాదుతో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నామని, అంగీకరించిన మదుపరులను ఈ కేసుల్లో సాక్షులుగా చేరుస్తామని సీసీఎస్కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
పోలీసుల అదుపులో కార్వీ పార్ధ సారధి
-
దేశమంతా మనవైపే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలను ఇప్పుడు దేశం మొత్తం అనుసరించే పరిస్థితి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ ప్రధానితో సహా దేశంలో అందరి ప్రశంసలు పొందిందని చెప్పారు. సోమవారం పోరంకిలో జరిగిన వలంటీర్ల సత్కారాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు వారి ఎమ్మెల్యే పేరు తెలుసో లేదో కానీ వలంటీరు పేరు, ఫోను నంబరు మాత్రం కచ్చితంగా తెలిసేలా ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పారు. సీఎం జగన్ కొత్త వ్యవస్థలను సృష్టించి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేరువ చేశారని ఎమ్మెల్యే కె.పార్థ్ధసారథి పేర్కొన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా మీ వెంటే.. నా 50 కుటుంబాల పరిధిలో 89 ఏళ్ల అవ్వ ఉంది. గతంలో ప్రతి నెలా ఇంటి నుంచి ఆటోలో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి పింఛన్కు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. వలంటీర్ల వ్యవస్థ వచ్చాక ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయం కంటే ముందే ఇంటికి వెళ్లి చేతికి పింఛను డబ్బులు అందచేస్తున్నప్పుడు నా మనవడివి అంటూ చూపే ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేనిది. అలాంటి ఆనందాన్ని ఇచ్చిన సీఎం గారికి ధన్యవాదాలు. మీరే మరో 40 ఏళ్లు సీఎం. మీరు ఏ బాధ్యత ఇచ్చినా మీతోనే నడుస్తాం. –బి.వరసతీష్, వలంటీరు, యనమలకుదురు కన్నబిడ్డలా చూసుకుంటున్నారు ఉదయం పింఛను డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండగా ముందు రోజు రాత్రి 12 గంటలకు నాకు ఓ ఫోను కాల్ వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నానని లబ్ధిదారుడు చెప్పడంతో మా అన్నయ్యతో కలిసి అక్కడకు వెళ్లి పింఛను డబ్బులిచ్చినప్పుడు ఆ కుటుంబం చూపిన ఆప్యాయతను మరువలేను. గతంలో రేషన్కార్డు కోసం ఐదేళ్ల పాటు తిరిగి వేసారిన ఓ కుటుంబానికి ఇప్పుడు 2 గంటల్లోనే కార్డు అందించడంతో ఎంతో సంతోషించింది. మా ద్వారా సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పాలని ఆ కుటుంబం కోరింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తుంటే చాలా కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. నా క్లస్టర్లో ప్రతి కుటుంబం నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తోంది. పండుగకు నాకు దుస్తులు కూడా బహూకరించారు. దీనికి కారణమైన సీఎం జగన్కు ధన్యవాదాలు. –కె.సుష్మ, వలంటీరు. -
నేరానికి కులాలు మతాలు ఉండవు: పార్థసారథి
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు. తమ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. సోమవారం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కామ్లో 150 కోట్ల అవినీతికి పాల్పడినందుకే టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, నేరానికి కులాలు, మతాలు ఉండవని అన్నారు. మహిళ అధికారిని దుర్భాషలాడటంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని తెలిపారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బీసీ నేతను హత్యచేసిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. చట్టం అందరికి ఒకటేనని ఓసీ, బీసీలకు ప్రత్యేకంగా ఉండదని పేర్కొన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేశారని, అచ్చన్న, అయ్యన్న, కొల్లు స్థానంలో నారా లోకేష్ చౌదరి ఉన్నా అరెస్ట్ చేసేవాళ్లమని స్పష్టం చేశారు. కాగా, అధికారంలో ఉండగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన అధికారంలో ఉండగా, న్యాయం కోసం వెళితే తోలుతీస్తా, తోకలు కత్తిరిస్తా అని బెదిరించే వారని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీలను అన్నివిధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని తెలిపారు. బీసీలను ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని పార్థసారథి పేర్కొన్నారు. (చదవండి: మండలిని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు) -
దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: పార్ఠసారథి
-
టీడీపీ నేతలు మాచర్లకు ఎందుకు వెళ్లారు
-
‘గ్రీన్జోన్ పేరుతో చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, కృష్ణా: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ‘ అమ్మఒడి’తో విధ్యాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. గురువారం ఆయన పెనమలూరులో నిర్వహించిన ‘జగనన్న అమ్మఒడి’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. విద్య లేకపోవడం వల్లే ఆర్థిక తారతమ్యాలు ఏర్పడుతున్నాయని, ‘అమ్మఒడి’తో ఈ అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. (చదవండి : ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) ఆంగ్ల మాధ్యమంపై టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ కుటుంబం రైతు పక్షపాతి అని, ప్రతి రైతుకు సీఎం జగన్ రైతు భరోసా అందించారని ప్రశంసించారు. గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని విమర్శించారు. ఇప్పుడు కృష్ణా జిల్లా రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్షకోట్లు రూపాయలు అమరావతిలో పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానిపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి అందరూ అండగా నిలవాలని పార్థసారధి కోరారు. -
చంద్రబాబుకు పార్థసారధి సవాల్
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి ఎద్దేవా చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని, లేకుంటే రేపు (గురువారం) చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. పార్థసారధి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా. ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలి. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. లేదంటే రేపు చంద్రబాబు చేసే దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? టీడీపీ విడుదల చేసిన ఛార్జ్షీట్ అబద్ధాల పుట్ట. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుది. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే బాబు దీక్ష. నదుల్లో వరద ఉధృతంగా ఉండటం వల్లే కొంత ఇసుక కొరత ఉంది. వరద తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో ఇసుక లభిస్తుంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. వ్యవస్థలను నాశనం చేసి నాడు చంద్రబాబు అవినీతికి పట్టం కట్టారు. ఇప్పుడు తన తాబేదారు పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. టీడీపీ, జనసేన ఒకే తానులో ముక్కలు’ అని మండిపడ్డారు. మరోవైపు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రేపు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్థసారధి ...నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. -
మీలా.. హామీలు వదిలేయమంటావా బాబూ..
-
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనైతికంగా దిగజారి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ఏ నాయకుడైనా ఓటమికి గల తప్పులను అన్వేషిస్తారని.. చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు పోలీసుల అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పత్రికల్లో రాయలేని భాషను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని సీఎం జగన్పై విమర్శలు చేసేందుకే ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలా.. ఇచ్చిన హామీలు వదిలేయమంటావా బాబూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్ సైకోలా కనిపిస్తున్నారా..అంటూ చంద్రబాబుపై పార్థసారధి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయడం ముఖ్యమంత్రి చేసిన తప్పా అని ప్రశ్నించారు. మీలా..ఇచ్చిన హామీలను గాలికి వదిలేయమంటారా అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వైఎస్ జగన్ తప్పా అని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీని లోకేష్ భూస్థాపితం చేస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ దోపిడీని.. వైఎస్ జగన్ అరికట్టారనే కారణంతో అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికలతో వార్తలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసింది చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు. -
అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: జూన్ 2వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం పరిశీలించారు. పబ్లిక్ గార్డెన్లోని సెంట్రల్ పార్కులో జరుగుతున్న పచ్చిక పనులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు ప్రతిరోజూ సుమారు 15వేల నుంచి 20వేల మంది మార్నింగ్ వాక్కు వస్తున్నారని, మరో 6వేల మంది సందర్శకులు వస్తున్నట్లు అధికారులు వివరించారు. పబ్లిక్ గార్డెన్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచేందుకు ఉద్యానవన శాఖ చేస్తున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిజాం హయాంలో నిర్మించిన ముఖద్వారం సుందరీకరణ, పోకిరీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు తదితరాలను పరిశీలించారు. పార్కు సందర్శకులపై నియంత్రణ, ఇతర పనుల కోసం నిధులు తదితరాల కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను పార్థసారథి ఆదేశించారు. ఉద్యానవన శాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి, ఇతర అధికారులు అవతరణ దినోత్సవ వేడుకలను పరిశీలించారు. -
రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో అధిక ఉష్ణోగ్రతలతో పాటు చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో నేడు పలు చోట్ల 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఘన్పూర్ (జనగాం) 3 సెం.మీ, చౌటుప్పల్(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, నర్మెట్ట(జనగాం) 2 సెం.మీ, యాచారం(రంగారెడ్డి) 2 సెం.మీ, పాలకుర్తి(జనగాం) 2 సెం.మీ, యాదగిరి గుట్ట(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, మర్రిగూడ(నల్గొండ) 2 సెం.మీ, బెజ్జంకి(సిద్దిపేట) 2 సెం.మీ, ధర్మసాగర్(వరంగల్ అర్భన్) 2 సెం.మీ, కాగజ్నగర్(కుమరం భీం) 2 సెం.మీ, మహబూబాబాద్ 2 సెం.మీ, జఫర్గఢ్(జనగాం) 2 సెం.మీ, వర్గల్(సిద్దిపేట) 1 సెం.మీ 30 వేల ఎకరాల్లో పంట నష్టం అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఈ నెల 3 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లోనే 14,848 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో 95% అత్యధికంగా కోతదశకు వచ్చిన వరి పంటే ఉండటంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటల బీమా చేసుకున్న రైతులకు పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ, ఉద్యానాధికారులను ఆదేశిస్తూ లేఖ రాశారు. రైతులకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని, వాటికి ఫోన్ చేసి కంపెనీలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. బీమా కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు 18005992594, 18002095959 లకు ఫోన్లు చేయాలని కోరారు. -
వైఎస్ జగన్ ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు
-
‘చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టాలి’
విజయవాడ సిటీ: తన స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రత్యేక యాప్లు ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వివరాలతో వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలో ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడతాడు. వైఎస్ జగన్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగిస్తే ఆయనకు భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాలతో ఓట్లు తొలిగిస్తున్నారని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేస్తే బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక మింగిన గొంతుకతో: వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిని అమరావతిని కాదని ఇడుపులపాయకు తీసుకెళ్లతాడని ఇసుక మింగిన గొంతుకతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను వెళ్లిపోవడం ఖాయం అని తెలిసి హైదరాబాద్లో రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటే... ప్రజలకు అందుబాటులో ఉండి మేళ్లు చేయాలనే తలంపుతో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకోవడం దేవినేని ఉమా కళ్లకు కన్పించడం లేదా అని నిలదీశారు. -
ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
‘నేను పార్టీ మారడం లేదు’
సాక్షి, కృష్ణా జిల్లా : పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కావాలనే పచ్చ మీడియా తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తుందన్నారు. తాను ఏ పార్టీ మారబోనని, వైఎస్సార్సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకోసారి ఇలాంటి వార్తలు రాస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శనివారం ఆయన ఉయ్యూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సర్కార్ రైతులకు వెన్నపోటు పొడిచిందని విమర్శించారు. పసుపు, కందకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫెథాయ్ తుపాను బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘనవిజయం అందించాలని ప్రజలను కోరారు. -
చంద్రబాబుది మోసపూరిత ప్రభుత్వం
-
ఐటీ చెల్లింపుదారుల వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను కట్టే వారందరి వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బిస్వనాథ్ ఝాను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకానికి విధించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఐదెకరాలకు కుటుంబం యూనిట్గా తీసుకుంటుండటంతో పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డుల జాబితా ఆధారంగా లబ్ధిదారులను వడపోస్తుండగా, ఆదాయపు పన్ను కట్టే వారి వివరాలను కూడా సేకరించే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. రూ.10 వేల పింఛన్ తీసుకునే వారి వివరాలను కూడా తీసుకుంది. రాష్ట్రంలో 5 ఎకరాలలోపు 47.28 లక్షల మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. అయితే కేంద్రం విధించిన నిబంధనల కారణంగా ఇందులో సగం మంది మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఐటీ చెల్లించే వారిని, రూ.10 వేలు పింఛన్ తీసుకునే వారిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. కుటుంబం యూనిట్గా తీసుకుంటున్న కారణంగా ఐదెకరాలలోపు ఉన్నవారిలో 30 శాతం అనర్హులు అవుతారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వడపోతల అనంతరం వచ్చిన వివరాలను ఈనెల 25 నాటికి పీఎం–కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. ఒకవేళ ఈనెల 25 నాటికి అర్హులైన రైతులందరి జాబితాను అప్లోడ్ చేయకపోయినా, వివరాలు పంపించిన ఏడాదిలోపు ఎప్పుడైనా సొమ్ము రైతుల ఖాతాలో వేస్తారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు సంబంధించి కసరత్తుపై కేంద్ర వ్యవసాయశాఖ మంగళవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను రూపొందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇదిలావుండగా పీఎం కిసాన్ పథకం అమలుకు అన్ని రాష్ట్రాలలో నోడల్ శాఖను, అధికారిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది. ‘రైతుబంధు’పై విషప్రచారం: పార్థసారథి తెలంగాణలో రైతుబంధు తాత్కాలికం అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేసినట్లుగా కొన్ని సంస్థలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మొద టి ప్రాధాన్యం రైతులను ఆదుకోవడమేనన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రైతు లకు అండగా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రైతుబంధు దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, ఇలాంటి పథకం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు తెలంగాణని రోల్ మోడల్గా చూస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. -
‘చంద్రబాబు కుట్రలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఎన్నికల కుట్రలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి తెలిపారు. సోమవారం ఏపీ రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి, బీజేపీ నేత జూపూడి రంగరాజు, సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత తాంతియా కుమారి, టీడీపీ నేత పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికల అక్రమాల గురించి ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేసి, రిగ్గింగ్ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 59 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం ఆ ఓటర్లను తొలగించకుండా అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సర్వేల పేరుతో ట్యాబ్లు ఇచ్చి, ప్రత్యేకమైన యాప్ సృష్టించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. ట్యాబ్లలో ఓటర్ల జాబితాలను పెట్టి.. ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని స్వయంగా ఆధారాలతో వివరించామన్నారు. కానూరు బూత్ నెంబర్ 1లో ఆదినారాయణ అనే వ్యక్తికి ఏడు ఓట్లున్నాయని వెల్లడించారు. ఇలాంటి ఉదాహరణలతో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బూత్లను స్వాధీనపరుచుకోవడానికి నచ్చిన పోలీసు అధికారులను నియమించుకుంటున్నారని తెలిపారు. నాన్ క్యాడర్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమిస్తున్నారన్నారు. చంద్రబాబు బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు: జూపూడి రంగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ నేత జూపూడి రంగరాజు తెలిపారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో శాంతి, భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా వుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయట్లేదంటూ వాపోయారు. ఎన్నికలకు ముందు అధికారులను బదిలీలు చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదు చేసామని తెలిపారు. డీజీపీ ఠాకూర్కి తాము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టే చర్య కాబట్టి.. దీనిపై ఫిర్యాదు చేశామని, ఈ చెక్కుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. -
ఉత్పత్తి సంస్థలతో రెట్టింపు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం పిలుపునకు అనుగుణంగా రైతు ఉత్పత్తి సంస్థలు ప్రోత్సహించేందుకు ఎస్ఎఫ్ఏసీ, ఫిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతు సమస్యల పరిష్కారానికి రైతు ఉత్పత్తి కేంద్రాలు(ఎఫ్పీవో)లు ఉపయోగపడతాయన్నారు. ఫ్యాప్సీ భవన్లో శుక్రవారం ఫిక్కీ , ఏపీఈడీఏ సహకారంతో నిర్వహించిన ‘రెట్టింపు ఆదా యం కోసం రైతు ఉత్పత్తుల సంస్థలు’అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18లో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషించిందని, దేశ జనాభాలో 55% ప్రజలకు వ్యవసాయం ఉపాధి అవకాశం కల్పిస్తోందన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంస్థలు ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం వలన ఆర్థికంగా మరింత లబ్ధి పొందుతారన్నారు. 2019 ఆగస్టు 31 నాటికి 8.82 లక్షల మంది రైతులను రైతు ఉత్పత్తి సంస్థల్లో సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 7.56 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను గుర్తించి 44,467 ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ (ఎఫ్ఐసీ)లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామతాన్ ఫార్క్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, సీఈవో ప్రవేశ్ శర్మ, ఎస్ఎఫ్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ నీల్కమల్ దర్బారి, ఎస్ఎఫ్ఏసీ టీం లీడర్ రాకేశ్ శుక్లా, రైతు ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జీపీఎస్ టెక్నాలజీతో విత్తనోత్పత్తి
సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తికి సాంకేతికతను విరివిగా వియోగించుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. జీపీఎస్, డ్రోన్, జియో ట్యాగింగ్, బార్ కోడెడ్ సాంకేతికతను ఉపయోగించి విత్తనోత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు లాభపడాలంటే విత్తనాల ఎంపిక కీలకమన్నారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ఇండో–జర్మన్ ప్రాజెక్టు ప్లానింగ్’ వర్క్ షాపులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణలో తెలంగాణ మోడల్గా నిలిచిందని, దేశానికి కావాల్సిన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నా యని తెలిపారు. 400 విత్తన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండటంతో విత్తన ప్రాసెసింగ్, నిల్వ పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. దేశాల మధ్య విత్తన ఎగుమతి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రమోషన్ కౌన్సిల్ను ఏర్పా టు చేయాలని వివరించారు. యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోత్సహించవచ్చన్నారు. మార్కెట్లో కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నవారిపై విత్తన చట్టం ప్రకారం తక్కు వ జరిమానా, శిక్షలు పడుతున్నాయని, విత్తన చట్టం లో మార్పులు చేయాలని అభి ప్రాయపడ్డారు. రాజేం ద్రనగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇస్టా విత్తనపరీక్ష ల్యాబ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్ రావు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సౌమిని సుంకర, జర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బీమా కింద రూ.338 కోట్లు అందజేత.. రైతు బీమా కింద ఇప్పటివరకు రూ.338.75 కోట్లు జమ చేసినట్లు పార్థసారథి పేర్కొన్నారు. రైతుల నామినీల బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లోపే పరిహారం జమ చేస్తున్న ఎల్ఐసీ అధికారులను ఆయన అభినందించారు. బుధవారం సచివాలయంలో ఎల్ఐసీ అధికారులతో రైతు బీమా పథకంపై పార్థసారథి సమీక్షించారు. ఇప్పటివరకు 6,775 మంది రైతులు మృతి చెందగా, వారి నామినీలకు డబ్బు జమ చేసినట్లు పేర్కొన్నారు. -
కృష్ణా: ఉయ్యూరు జన్మభూమి రసాభాస
-
‘చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షకు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీక్షలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హోదా తేలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ ఓ బోగస్ అని తెలిపారు. విభజన నష్టాలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలను అవమానించింది చంద్రబబాబేనని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. మైనార్టీల, అర్చకుల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తారని విమర్శించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే కేవలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తోనే సాధ్యమని అన్నారు. -
విత్తనరంగంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: విత్తనరంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బుకార్ టిజాని ప్రశంసించారు. రోమ్ పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుకార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ఎఫ్ఏవో నిబంధనల్లో ఒక కీలకమైన అంశమని చెప్పారు. భారత్ ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనాభివృద్ధి కోసం ఎఫ్ఏవోకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయవన్నారు. అంతర్జాతీయ విత్తనోద్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విత్తనోత్పత్తి, విత్తనాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. గ్లోబల్ సీడ్ హబ్గా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని ఎఫ్ఏవో ప్రకటించినట్లు కేశవులు తెలిపారు. అందులో భాగంగా ఎఫ్ఏవో బృందం వచ్చే జూన్, జూలైల్లో రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు. -
‘చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ పొత్తులు, పదువుల కోసమే ఆరాటమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బద్ద శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్లు కలయికని రాష్ట్రమంతా విడ్డూరంగా చూస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నాయకుడు అంటే జగనే అంటున్నారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే నాయకుడు జగన్ అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. చంద్రబాబు లక్ష్యం కుర్చీ, అధికారమే అని ఆరోపించారు. చంద్రబాబు వేసే పిచ్చి వేషాలకు ఓ వర్గం మీడియా మద్దతుగా నిలవడం దారుణమని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్పై చెప్పులు వేయించి అధికారం లాక్కున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఏ సిద్ధాంతం కోసం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవని అన్నారు. కేంద్రం చేసిన ప్రతి విషయంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అన్యాయం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు వెంటనే బయటకు రావాలని పిలుపునిచ్చారు. డెమోక్రసీ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదని అన్నారు. -
‘విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత’
సాక్షి, హైదరాబాద్: బలమైన విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత ఆధారపడి ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన్ పట్నాయక్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, ఇండో జర్మన్ విత్తన కోఆపరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘మేలైన విత్తన నాణ్యతకు.. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం’అనే అంశంపై మంగళవారం వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో విత్తన కేంద్రంగా తెలంగాణ ఇప్పటికే నిలబడిందన్నారు. ప్రపంచ విత్తనరంగంలో అభివృద్ధి ఐదు శాతముంటే, దేశంలో 12–15 శాతం ఉందన్నారు. మళ్లీ హరిత విప్లవం సాధించడంలో మేలైన విత్తనానిదే ప్రధాన పాత్రన్నారు. దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనోత్పత్తి తెలంగాణలోనే సాధ్యమని, అందుకే విత్తన భాండాగారంగా వెలుగొందుతుందన్నారు. దేశంలో మరో 150 విత్తన హబ్లను ఏర్పాటు చేస్తామని పట్నాయక్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు బలంగా ఉంటే, ధ్రువీకరణ బలహీనంగా ఉందన్నారు. రెండు వ్యవస్థలు బలంగా ఉంటేనే విత్తన వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, మేనేజ్ డీజీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా వార్తలను ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం కేంద్రకార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి, అంబటిరాంబాబు, పార్ధసారథిలు మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తమ అధినేత వైఎస్ జగన్పై హత్యాయత్నం చేశారని ఈ సందర్భంగా భూమన వ్యాఖ్యానించారు. ఈ దాడి పట్ల డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర విచారణ సంస్థతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, గవర్నర్లు కలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని, తమ పార్టీపై బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్దంగా ఉన్నప్పటికీ గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరామని భూమన పేర్కొన్నారు. ఆ వార్తలు అవాస్తవం: పార్థసారథి ఏపీ పోలీసులను వైఎస్ జగన్ అవమానించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పార్థసారథి స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తున్నామన్నారు. తాము తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదన్నారు. ఇక అధికారులను తామెక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు మాటలు అభ్యంతరకరమన్నారు. దేన్నైనా చంద్రబాబు మసిపూసి మారేడు చేస్తారని, అందుకే తాము స్థానిక దర్యాప్తును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముద్దాయిలను కాపాడటానికే చంద్రబాబు, డీజీపీలు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. -
‘ఆయనకు పేదలు కనిపించరు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడాబాబులకే అండగా ఉంటారని, ఆయనకు పేదలు కనిపించరని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని గురువారం ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీలో ఉన్న వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని మండిపడ్డారు. నమ్మినవారికి అన్యాయం చేయటమే చంద్రబాబు పని అని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం పనిచేసే నాయకుడు కాదని, పేదలు, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు. -
చంద్రబాబుకు పేదలు కనిపించరు
-
బాబు అబద్దాల స్టాయి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది
-
అక్టోబర్ తొలివారంలోనే చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్కు సంబంధించిన రైతుబంధు చెక్కులను అక్టోబర్ మొదటి వారం లో రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం లేఖ రాశారు. రబీ సాగు అక్టోబర్ తొలి వారం నుం చి ప్రారంభమవుతున్నందున చెక్కుల పంపిణీ కూడా అప్పట్నుంచే ప్రారంభించాలని నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇంతకుముందు నుంచీ కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లను కేటా యించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి క్రిషి కల్యాణ్ అభియాన్ పథకాన్ని కూడా అమలు చేస్తామని మరో లేఖలో తెలిపారు. -
‘కొత్త ఉత్సాహంతో చంద్రబాబు పచ్చి అబద్దాలు’
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు సర్కార్ తమపై బురద జల్లుతోందని వైఎస్సార్సీసీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశాలకు వెళ్లి వచ్చి కొత్త ఉత్సాహంతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా అని నిలదీశారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. తవ్వకాల కోసం జీవో 97 తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. వైఎస్ జగన్ మన్యంలో సభపెట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాక్సైట్ మైనింగ్ జీవోని నిలిపివేశారని పార్థసారధి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం అంటే ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. -
ఉయ్యూరులో పార్ధసారధి సంఘీభావ యాత్ర
-
‘మోసం చేయడంలో ఆయన దిట్ట’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య దేశం మొత్తం మీదట 32 లక్షలకు పైగా ఉండగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంఖ్య 20 లక్షలకు పైగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కార విషయంలో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు . నాలుగున్నరేళ్లుగా మాయ మాటలు చెప్పి 200 మందికి పైగా ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నా కుట్రతో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 1180 కోట్లు ఇస్తే 14 లక్షల కుటుంబాల సమస్య తీరుతుందని తెలిసినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై సీబీఐ విచారణకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఇష్యూపై బీజేపీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. అందరినీ మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్కి ఏపీ సీఎంకు అర్థం తెలుసా అని ఎద్దేవ చేశారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు మొత్తం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుంటే ఇప్పుడు కొత్తగా కమిటి వేస్తాననడం హాస్యాస్పదమన్నారు. -
పంట నష్టం అంచనాకు బృందాలు: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లకు లేఖ రాసినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సర్వే నిర్వహించి గ్రామాల వారీగా, పంటల వారీగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టం జరిగిన చోట్ల ఏయే పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారో కూడా తెలుసుకోవాలన్నారు. -
‘మొక్కజొన్నపై ఫాల్ ఆర్మీ దాడి!’
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేసిన ఫాల్ ఆర్మీ వామ్–స్పొడోప్తెరా ఫ్రూగిపెర్దా అనే పురుగు ఇప్పుడు మన దేశంలోని పంటలపై దాడి చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పురుగు ఇటీవల కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్న పంటలో గుర్తించారు. పంటను అమాంతం నాశనం చేసే ఈ పురుగు విషయంలో అప్రమత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, జిల్లా వ్యవసాయాధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఇతర దేశాలకు ఇది విస్తరిస్తుందని ఆయన వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కర్ణాటక పక్కనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండటంతో ఈ పురుగు ప్రభావం ఎలా ఉంటుందనే భయం అందరినీ కలవరపరుస్తోంది. ఈ పురుగు సోకితే పంటపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. రాష్ట్రంలో 10.78 లక్షల ఎకరాల్లో సాగు... రాష్ట్రంలో ఖరీఫ్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.78 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్ర ఆహారధాన్యాల పంటల్లో వరి తర్వాత అత్యంత కీలకమైన పంట మొక్కజొన్న కావడంతో రైతులు దీనిపై అధికంగా ఆశలు పెంచుకుంటారు. ఆసియాలోనే తొలిసారిగా గత నెలలో కర్ణాటకలో ఈ పురుగును గుర్తించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. -
‘ ఆ రెండు పార్టీలూ ఏపీని మోసం చేశాయి’
సాక్షి, గుంటూరు : రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు కేబినేట్లో ఒక్క ముస్లింకు కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. మొన్నటివరకూ హోదా వస్తే పారిశ్రామిక రాయతీలు రావన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు రెండు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. హోదా వద్దని ప్యాకేజీయే కావాలని చంద్రబాబు కోరడం వల్లే హోదా రాలేక పోయిందన్నారు. చంద్రబాబు నయవంచకుడని, ప్రజలు అతన్ని నమ్మే ప్రసక్తి లేదన్నారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను చంద్రబాబు అవహేళన చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
పోలవరం వైఎస్ పుణ్యమే
విజయవాడ సిటీ : పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మహానేత తనయుడిగా పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్ జగన్కే ఉందని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2017నాటికల్లా ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందన్నారు. అనంతరం మాటమార్చి 2018లోగా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని మరిచిపోయారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 2019లోగానైనా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని.. ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రకటించిన గడువు లోపు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే మంత్రి దేవినేని ఉమా తప్పుకోవాలని ఆయన సవాల్ విసిరారు. గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంటే మహానేత స్పందించి పోలవరానికి శ్రీకా రం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా గురించి ముసలి కన్నీరు కార్చే టీడీపీ నాయకులు పులిచింతల ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలువలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉమా తాను చేసే బ్రోకరిజాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ మంత్రులు నోటికివచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత జాతికి అంకితం చేస్తారని, కానీ డయా ఫ్రంవాల్ కట్టి పోలవరాన్ని జాతికి అంకితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనుమానాన్ని ఉమా నివృత్తి చేయాలి మంత్రి దేవినేని ఉమా ‘మగ–ఆడో’ తెలియడం లేదని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చిన అనుమానాన్ని ఇప్పడైనా నివృత్తి చేయాలని పార్థసారథి సూచించారు. కేసీఆర్ విజయవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా వంగి వంగి దండాలు పెడుతూ తిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రధానిపై ఆరోపణలు
-
ఆగస్టు 15న రైతు బీమా సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. రైతుబీమా, బిందు సేద్యం, భూ రికార్డుల ప్రక్షాళన, కంటి వెలుగు, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. - రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరినీ సంప్రదించి అర్హులైన రైతులను బీమా పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు. 48.26 లక్షల మంది రైతు బంధు చెక్కులు పొందా రని, ఇప్పటివరకు 40.64 లక్షల మందిని సం ప్రదించామని, అర్హుల ను సంప్రదించి ఆగస్టు 1 నాటికి వీరి వివరాలను ఎల్ఐసీ వారికి సమర్పిస్తే గుర్తింపు సంఖ్య, సర్టిఫికెట్లు ముద్రిస్తారని అన్నారు. రైతు బీమాలో చేరేందుకు ఆసక్తి చూపని వారి వివరాలు నమోదు చేయాలన్నా రు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో రైతులకు బీమా సర్టిఫికెట్లు అందించాలన్నారు. - భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆరు లక్షల డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన∙కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షలు, మండల స్థాయిలో 1.5 లక్షల పాసుపుస్తకాలను ముద్రించాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. మిగతా పాసుపుస్తకాల డిజిటల్ సంతకాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. - కంటివెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ ఆగస్టు 15న గజ్వేల్లో ప్రారంభిస్తారని.. అన్ని జిల్లా ల్లో అమలుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి అన్నారు. జిల్లా స్థాయిలో మెడికల్ అధికారులు, ఆప్టిమెట్రీషియన్లతో బృం దాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు మండల, ఆర్డీవో స్థాయిలో పెండింగ్లో ఉం టున్నాయని, వీటిపై కలెక్టర్లు సమీక్షించాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందించాలనే సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు నిధుల కొరత లేదని, మంజూరు పత్రాలను వేగంగా అందజేయాలని సూచించారు. -
చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా?
-
‘తీవ్ర భయాందోళనలో చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన టీడీపీ నేతలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హోదా కంటే ప్యాకేజీ కోసం పాకులాడింది వాస్తవం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అబద్దాలు చెప్పారో నిరూపించగలరా? చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా దొరికితే కుట్రలు, కుతంత్రాలు అంటారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందా అన్నారు. చంద్రబాబు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్ధసారథి డిమాండ్ చేశారు. -
రైతు బీమాకు టోల్ఫ్రీ నంబర్
సాక్షి, హైదరాబాద్: రైతు బీమాపై అనుమానాల నివృత్తికి ఎల్ఐసీ టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కోరారు. ముంబై నుంచి ఎల్ఐసీ అధిపతి రఘుపాల్సింగ్ నేతృత్వంలోని బృందం సోమవారం నగరానికి వచ్చింది. ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ, రైతు నామినీ మైనరైతే మరెవరినైనా నియమించుకోవాల్సి ఉం టుందన్నారు. ఆగస్టు 15 తర్వాత జారీ అయ్యే కొత్త పాసు పుస్తకాలు పొందే రైతుల బీమాను నమోదు చేసేటప్పుడు వయసుకు సంబంధించి ఆ నెల ఒకటోతేదీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పథకం సక్రమ అమలుకు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. -
అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు పట్టించుకోవడం లేదు
-
‘ఏపీ మంత్రులు కూడా ఒప్పుకున్నారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సర్కార్ దుర్మార్గపు ఆలోచనల కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం.. వెంటనే ఆ రోజు మంత్రులు స్పందిస్తారని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వారి పని స్పందించడం వరకేనని, న్యాయం మాత్రం చేయరంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశమైంది. అనంతరం కమిటీ కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవుల్లో ఉన్న వాళ్లు, మంత్రులు కూడా అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తుల విలువ అనేక రెట్లు ఉందని చెప్పిన విషయాన్ని అప్పిరెడ్డి గుర్తుచేశారు. ‘అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు ఏ కోశాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంది. ఢిల్లీలో చంద్రబాబును అమర్సింగ్ కలిసిన తర్వాతే ఎస్ఎల్ గ్రూపు అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయమని చెప్పింది. కొందరు సంస్థ ఆస్తులను చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలిసొచ్చిన పార్టీలతో వైఎస్సార్సీపీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుందని’ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వినర్ తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఐదు రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఇక్కడ జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కార మార్గం కోసం వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రజల ఆస్తుల్ని ఎలా కాజేయాలన్న ఆలోచన తప్పా.. వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రాలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే 1100 కోట్లు ఖర్చు చేస్తే 16 లక్షల మంది బాధితులు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారని వైఎస్సార్సీపీ సూచించినట్లు తెలిపారు. పుష్కరాలకు వేలకోట్లు, సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్హౌస్లకు, విదేశీ పర్యటనల ఖర్చులతో పోల్చితే ఇదేమంత పెద్ద ఖర్చు కాదని చంద్రబాబుకు పార్థసారథి సూచించారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో ఏ పని అయినా చేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అగ్రిగోల్డ్ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భాదితులకు చెల్లింపులు చేయడం కష్టసాధ్యమేం కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులని చవకగా కొట్టేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు చంద్రబాబు మీకు వినిపించడం లేదా అని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. బాధ్యత గల సీఎంగా వ్యవహరించి.. చంద్రబాబు ఇప్పటికైనా బాధితులకు న్యాయం చెయ్యాలని సూచించారు. టీడీపీ సర్కార్ చేస్తున్న భిన్న ప్రకటనలతో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ తగ్గించి చెప్పడం సరికాదన్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు మాత్రం పరిష్కార మార్గం కాదని హితవు పలికారు. -
మహానాడు బుర్రకథను తలపిస్తోంది : పార్థసారధి
సాక్షి, చిత్తూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సమావేశాలు బుర్రకథను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకే మహానాడు సమావేశాలు ఏర్పాటుచేశారని అన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తెలుగు ప్రజలకు ఏమి చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లేదని దూషించారు. మహానాడు వేదికపై ప్రజలను కించపరిచే విధంగా మట్లాడుతుంటే బాబు ముసిముసి నవ్వులు నవ్వుతారా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ మహానాడులో వంటల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీతో కలిసి హోదాను భూస్థాపితం ప్రత్యేక హోదాపై చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్థసారధి దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి ప్రత్యేక హోదాను భూస్థాపితం చేశారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన తప్పిదాలను ప్రజల నుంచి దృష్టి మరల్చడంలో బాబు దిట్టని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. -
చంద్రబాబును పొగిడేందుకే మహానాడు సమావేశాలు
-
వంచనపై వైఎస్సార్సీపీ గర్జన
-
నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీనైనా అమలు చేశారా?
-
ఓటుకు కోట్లు కేసు సీబీఐకి అప్పగించాలి
-
‘ప్రధానులనూ విచారించి.. చంద్రబాబును వదిలేస్తారా’
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకు కోట్లు కేసులో సీబీఐ లేదా ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్కు మోకరిల్లి హైదరాబాద్ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమం ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు. కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి వివరించారు. -
‘చంద్రబాబు చేతకానితనంతో ప్రజలకు కష్టాలు’
సాక్షి, పెడన: రైతులకు రెండు పంటలకు నీరిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిదే అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. బలహీన వర్గాల వారిని జడ్జీలు కాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ఏ సమయంలోనూ బలహీన వర్గాలకు సాయం చేయలేదని గుర్తుచేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతకానితనం కారణంగా రైతులు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని విమర్శించారు. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఒక పంటకు నీరు ఇవ్వని చంద్రబాబు.. ప్రస్తుతం ఈ నాలుగేళ్లలో కూడా అదే తీరు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా భూములు, ఇతరత్రా ఆస్తులు కట్టబెడదామన్నదే టీడీపీ నేతల విధానమంటూ ఎద్దేవా చేశారు. దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో రైతులకు రెండు పంటలకు నీరు ఇచ్చారని కొనియాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో.. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పంటలు అమ్ముకోవాలంటే పాస్బుక్లు, ఈ– పాస్ అంటూ చంద్రబాబు దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. నాడు వైఎస్సార్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేవని చెప్పారు. అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్కార్డులు వైఎస్సార్ అందించారు, కానీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రైతులు, సామాన్యులు, అన్ని వర్గాలవారు మోసపోయారని పార్ధసారధి అన్నారు. -
బెదిరింపులకు భయపడం:పార్ధసారధి
-
23 జిల్లాల్లో వరికి పంట బీమా
సాక్షి, హైదరాబాద్: జిల్లాకో ప్రధాన పంటను పరిగణనలోకి తీసుకుని గ్రామం యూనిట్గా బీమా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం 23 జిల్లాల్లో వరికి గ్రామం యూనిట్గా పంటల బీమా అమలు చేస్తారు. రెండు జిల్లాల్లో సోయాబీన్, 5 జిల్లాల్లో మొక్కజొన్న పంటలకు గ్రామం యూనిట్గా బీమా అమలుచేస్తారు. ఆయా జిల్లాల్లో మిగిలిన పంటలకు మండలం యూనిట్గా బీమా అమలు చేస్తారు. వచ్చే ఖరీఫ్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం(యూపీఐఎస్)ల అమలు మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5శాతం ప్రీమియం చెల్లించాలి. పంటల నష్టాన్ని పది రోజుల్లోగా అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరికి ప్రీమియం చెల్లించే గడువును ఆగస్టు 31గా నిర్ధారించారు. జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31 గడువుగా ప్రకటించారు. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. ఎండు మిర్చిని 15 జిల్లాల్లో అమలుచేస్తారు. ప్రమాద మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం.. యూనిఫైడ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో వ్యక్తిగత ప్రమాద బీమా, జీవిత బీమా, విద్యార్థి భద్రత బీమా, గృహ బీమా, వ్యవసాయ పంపుసెట్ల బీమా, ట్రాక్టర్ బీమాలను అమలుచేస్తారు. వీటిలో ఏ రెండింటినైనా రైతులు ఎంపిక చేసుకోవాలి. వీటికి రైతు రూ.12 బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుంది. -
రైతుబంధుకు రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. చెక్కులిస్తే నగదెట్లా? చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు. కందుల సొమ్ములోనూ.. ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. -
‘నీకు డ్యాన్స్ నేర్పిస్తే మాత్రం ఎకరాలిస్తావా’
సాక్షి, హైదరాబాద్: రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా నలుగురు విదేశీయులు వచ్చి పొగిడితే చాలని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. సీఎం దగ్గర సీఎస్గా పనిచేసిన వారే అమరావతి ఎవరి రాజధాని అని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇపుడు బాబు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో బలహీన వర్గాలకు అవకాశమివ్వడం లేదని.. దళితులు, షెడ్యూల్ కులాలకు సంబందించిన రాజధాని కాదని తేలిపోయిందన్నారు. పేదవారు రాజధానిలో మాకేముందని భావిస్తున్నారన్నారు. భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం పాటించడం లేదని తెలిపారు. కేవలం చంద్రబాబు వర్గీయుల కోసమే రాజధాని అని విమర్శించారు. బాబు, లోకేశ్, మంత్రులు కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారంగా రాజధానిని మార్చారన్నారు. స్థలాలిచ్చిన వాళ్లకు ఏ ఒక్క సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తెల్లకాగితాలతో సరిపెట్టి.. చంద్రబాబుకు డ్యాన్స్ నేర్పించిన బాబాకు మాత్రం ఎకరాలకెకరాల భూములు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. కొన్ని వేల రైతుల జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారని పార్థసారధి విరుచుకుపడ్డారు. పేదలు, రైతులకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. నాలుగేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా కట్టకుండా... హ్యాపీ అమరావతి అంటారా అని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. హోదా ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తుంటే.. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. కనీసం పంటను అమ్ముకునే పరిస్థితి లేదు.. అగ్రిగోల్డ్ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేదు.. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలన్న విధానం తప్పితే, బాధితులకు పరిష్కారం చేయాలనే ఉద్దేశం కనిపించలేదని ఆయన మండిపడ్డారు. -
ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ
సాక్షి సెంట్రల్ డెస్క్, విజయవాడ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలకు టాప్ – 100లో చోటు లభించింది. దేశంలోని టాప్ ఉన్నత విద్యాసంస్థల్లో (ఓవరాల్గా) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 36వ ర్యాంక్ సాధించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 74 వ స్థానంలో నిలిచింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) 83వ స్థానంలో నిలువగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె 89వ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాలకు సంబంధించి టాప్ 100లో చోటు సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో.. తెలంగాణకు సంబంధించి గతేడాది ఓవరాల్ కేటగిరీలో ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ దేశంంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్ఐఆర్ఎఫ్కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. యూనివర్సిటీల విభాగంలో - ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం – 22 - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) – 49 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 56 - శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)– 62 - గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం)– విశాఖ– 85 - శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపురం)– 92 ఇంజినీరింగ్ విభాగంలో... - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)– 49 - ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ (విశాఖపట్నం) – 65 - శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) – 71 - సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్ కాలేజ్ (భీమవరం) – 85 - యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కాకినాడ) – 97 కళాశాల విభాగంలో.. - సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజ్ (కర్నూలు) – 35 - ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ)– 56 మేనేజ్మెంట్ విభాగంలో.. - ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (సత్యవేడు)– 34 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 46 ఫార్మసీ విభాగంలో.. - ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ (ఆంధ్రాయూనివర్సిటీ) – 28 - రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (అనంతపురం) – 39 లా విభాగంలో..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా (విశాఖపట్నం) – 10 ఎస్ఆర్కేఆర్కు జాతీయస్థాయి ర్యాంకింగ్ భీమవరం: జాతీయస్థాయి విద్యాసంస్థల ర్యాంకింగ్లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు 85వ ర్యాంకు వచ్చిందని ప్రిన్సిపాల్ జి.పార్థసారథి వర్మ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిం చారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ ర్యాంకులకు ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 4,500 యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా పలు సంస్థలకు జాతీయ ర్యాంక్లు వచ్చాయని తెలిపారు.