Parthasarathy
-
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
మంత్రి వర్సెస్ ఎంపీ
పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. పట్టు కోసం బీకే ప్రయత్నాలు అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సామాజిక వర్గాలపై కన్ను హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నోరు మెదపని పార్టీ పెద్దలు పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి గారి అబద్దాలు
-
మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ !
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిందనే విషయం మీనాక్షినాయుడుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపైనా గెలుపొందారు. టీడీపీ మినహా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్నతికి తోడ్పడ్డారు. చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా తన తనయుడిని బరిలో నిలపాలని ఆయన అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. -
టీడీపీలో తిరుగుబావుటా
డోన్/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్లో పోటాపోటీ బలప్రదర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు. బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు. బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు. దిలీప్చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పారు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చర్చించానని, ఈసారి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్ కళ్యాణ్ జెండా సభలో వివరించారని, పవన్ తన పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మద్యం, డబ్బులు ఎరగా వేశారు. ఈ క్రమంలోనే గాజులపల్లికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కానీ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే అతను గుండె ఆగి చనిపోయినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. వారం రోజుల క్రితం పెనుకొండలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఆరంభం నుంచి టీడీపీ వెంట నడిచిన వారేనని తేలింది. అయితే కొంతకాలంగా సవితమ్మ వర్గంలో ఉన్న వారంతా ఇప్పుడు బీకే పార్థసారథి వైపు వచ్చారని తెలిసింది. అలాగే నాలుగు కుటుంబాలు మాత్రమే టీడీపీలో చేరగా.. 40 కుటుంబాలు చేరినట్లు ప్రచారం చేశారు. ఫొటోల్లో జనం భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యాలయంలోని వారందరికీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం. సాక్షి, పుట్టపర్తి: అధినేత అవినీతి కేసులో జైలు పాలయ్యాడు.. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చినా కార్యకర్తలు కన్నెత్తి చూడటం లేదు. ఏం చేయాలో తెలియని పచ్చ తమ్ముళ్లు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి టీడీపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలోనూ అవే వార్తలు కనిపిస్తుండటంతో జనం నవ్వుకుంటున్నారు. వాపును బలుపుగా ప్రచారం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో చాలా మంది టీడీపీ నేతలూ లబ్ధి పొందుతున్నారు. దీంతో వారంతా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. దీంతో ‘తమ్ముళ్ల’కు వణుకు పట్టుకుంది. అవినీతి కేసులో చంద్రబాబు జైలు వెళ్లడం...టీడీపీ ముఖ్య నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన కార్యకర్తల్లోకి వెళ్లిపోయింది. అందువల్లే మండల స్థాయి నేతలంతా వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘తెలుగు తమ్ముళ్ల’కే మళ్లీ కండువాలు కప్పుతూ కొత్తగా టీడీపీలో చేరారంటూ గొప్పలు పోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం తెలిసిన జనం మాత్రం వీరి చర్యలు చూసి నవ్వుకుంటున్నారు. ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే.. కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. కోర్టు సైతం ఆయనకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీన్ని చూపి సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కారణంతో ఎవరు మరణించినా.. వెంటనే ‘చంద్రబాబు అరెస్టు’ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జిల్లాలో నాలుగైదు వెలుగు చూశాయి. ఓట్ల వేటలో టీడీపీ నేతల కక్కుర్తి వ్యవహారాలు నచ్చక చాలా మంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఉనికి కోసమే చంద్రబాబు జైలుకెళ్లాడు.. లోకేష్ పారిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం జగనన్న ప్రభుత్వంలో కుదరదు. ఇక ఆ అవినీతి పరుడు జైల్లో ఉండాల్సిందే. టీడీపీ జీరో అయింది. అందువల్లే ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. కానీ విజ్ఞులైన జనం అంతా గమనిస్తున్నారు. – గోరంట్ల మాధవ్, ఎంపీ, హిందూపురం నలుగురు కూడా చేరలేదు మా గ్రామం నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారందరూ టీడీపీలో ఉన్నవాళ్లే. అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో వారికి కండువాలు కప్పి కొత్తగా టీడీపీలో చేరినట్లు బీకే పార్థసారథి ప్రచారం చేశారు. కనీసం నలుగురు కూడా టీడీపీలో చేరలేదు. – రామాంజనేయులు, కురుబవాండ్లపల్లి -
టీడీపీ బస్సుయాత్రలో బాహాబాహీ
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారస్థాయికి చేరింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్టీ నాయకురాలు సవితమ్మ వర్గీయులు పెనుకొండ పట్టణంలో బాహాబాహీకి దిగారు. నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. బస్సుయాత్ర ఆదివారం శెట్టిపల్లి నుంచి వివిధ గ్రామాల మీదుగా పెనుకొండకు చేరుకుంది. స్థానిక మడకశిర సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద సవితమ్మ వర్గీయులు బాణాసంచా కాలుస్తూ కేకలు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బీకే పార్థసారథి.. సవితమ్మ వర్గీయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘పోటు పొడిచారు.. మీ కథ చూస్తా..’ అంటూ హెచ్చరించారు. బస్సుయాత్రలో వెనుకనే ఉండి డ్రామాలాడుతోందంటూ సవితమ్మపై పరోక్షంగా మండిపడ్డారు. అనంతరం పార్టీ జిల్లా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి పైకి వెళ్లగానే.. బస్సు ముందు నిలబడి ఉన్న ఇరువర్గాలు కేకలు వేస్తూ బాహాబాహీకి దిగారు. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థంగాక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి బస్సుయాత్ర అంబేడ్కర్ సర్కిల్కు వెళ్లగా సవితమ్మ వర్గీయులు మాత్రం కార్యాలయం వద్దే ఉండిపోయారు. -
కేఎస్బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్బీఎల్కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్బీఎల్కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
శివ ధ్యానం జన్మజన్మల పుణ్యఫలం
-
స్వరార్చన
-
రూ.110 కోట్ల కార్వీ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ పార్థసారథికి చెందిన రూ.110 కోట్ల విలువైన భూములు, బంగారు ఆభరణాలు, విదేశీ నగదు, షేర్లను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్థసారథితోపాటు సీఎఫ్వో జి.హరికృష్ణను గతంలో అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్ నగర కమిషనరేట్లోని సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కార్వీ సంస్థతోపాటు చైర్మన్, ఎండీ, తదితరులకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. తాజాగా చేసిన రూ.110 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తంగా రూ.2,095 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు స్పష్టం చేసింది. కార్వీ సంస్థలో షేర్ హోల్డర్లను మోసం చేసి వారి షేర్ల మీద రూ.2,800 కోట్ల మేర రుణం పొంది ఎగొట్టిన కేసుల్లో పార్థసారథిపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద సైతం రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. షేర్ హోల్డర్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసి రుణం పొందడంతోపాటు కేడీఎంఎస్ఎల్, కేఆర్ఐఎల్ కంపెనీలకు మళ్లించి వాటిని లాభాల్లో చూపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించింది. రుణాల్లో కొంత భాగాన్ని కుమారులు రజత్ పార్థసారథి, అధిరాజ్ పార్థసారథికి జీతభత్యాలు, రీయింబర్స్మెంట్ పేరుతో దోచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. కార్వీ అనుబంధ సంస్థగా ఉన్న కేడీఎంఎస్ఎల్ ఎండీ వి.మహేశ్తోపాటు మరికొంత మంది కలిసి పార్థసారథి డైరెక్షన్లో మనీలాండరింగ్లో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వెల్లడించింది. -
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
నష్టాలు చూపించి.. కోట్లు కొల్లగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల పేరిట ఉన్న షేర్లను తనఖా పెట్టి మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి వ్యవహారంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. నాలుగు రోజుల క్రితం అరెస్ట్చేసిన పార్థసారథితోపాటు కంపెనీ సీఎఫ్ఓ కృష్ణ హరిని విచారిస్తోంది. గురువారం కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఈడీ మొదటి రోజు.. షేర్ల పేరిట రుణాలు తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. షెల్ కంపెనీలపై వేల కోట్ల రుణం కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లు కొనుగోలు చేసిన క్లయింట్ షేర్లను పవర్ ఆఫ్ అటార్నీతో బదలాయించుకున్న పార్థసార«థి.. కృష్ణ హరితో కలిసి కార్వీ రియల్టీతోపాటు 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ విచారణలో బయటపడింది. కస్టమర్ల షేర్లను సైతం షెల్ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా మళ్లించిన షేర్లను 5 షెల్ కంపెనీల పేరిట తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.400 కోట్ల రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు ఉపయోగించినట్టు పార్థసారథి, కృష్ణ హరి విచారణలో చెప్పిననట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. కార్వీ రియల్టీతోపాటు మరో 9 కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు యత్నించారని, ఆ తర్వాత రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా రూ.రెండువేల కోట్లకు పైగా రుణం పొందినట్టు గుర్తించారు. ఆ డబ్బు సంగతేంటి? స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి మళ్లించిన షేర్లను తన వ్యక్తిగత ఖాతాతోపాటు కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలకు తరలించినట్టు గుర్తించిన ఈడీ.. అక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై లోతుగా విచారిస్తోంది. కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలోకి దాదాపు రూ.2వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించింది. తర్వాత ఈ డబ్బును ఎక్కడికి మళ్లించారు, షేర్ల బదలాయింపునకు ముందే కంపెనీని భారీ నష్టాల్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న దానిపై పార్థసారథిని ప్రశ్నిస్తోంది. ఇద్దరూ కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కుంభకోణంలో పాలుపంచుకునేలా చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై కస్టడీలో పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. -
రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్డ్రైవ్లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు.. హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే.. షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది. సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. -
కార్వీ పార్థసారథిపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు. -
పంజాబ్కు ‘కార్వీ’ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్జీత్ సింగ్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్ బండారీ ఇటీవల హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. లలిత్ బండారీకి డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తామని, ట్రేడింగ్ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కార్వి ఎండి పార్థసారధికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా అతన్ని పలు అంశాల్లో సీసీఎస్ పోలీసులు విచారించారు. అందులో భాగంగా.. కార్వి సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్ల పై కూపీ కూడా లాగారు. కాగా ఆడిట్ రిపోర్ట్ అతని మందుంది విచారించినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ముందు పార్థసారథిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై కార్వీ ఎండీ పార్ధసారథి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసుల విచారణలో పార్ధసారథి 6 బ్యాంక్ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. చదవండి: బంగారాన్ని పేస్ట్గా మార్చి ప్యాంట్లో దాచాడు! -
రెండోరోజు ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
-
ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి పోలీసుల కస్టడీ ముగిసింది. రెండు రోజులు పాటు పార్థసారథిని విచారించిన సీసీఎస్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా విచారించిన పోలీసులు.. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వీటి ద్వారా 6 బ్యాంక్ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. కార్వీకి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే కార్వీ కుంభకోణంలో ఇతరుల పాత్రపై పార్ధసారథిని పోలీసులు ప్రశ్నించారు. ఇతర నిందితులపై త్వరలో చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. కాగా రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన పార్ధసారథిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించిన సీసీఎస్ పోలీసులు నేడు కోర్టులో హజరుపర్చనున్నారు. -
వందల మంది షేర్లు మాయం!
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) సంస్థలో డీమ్యాట్ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. దీంతోపాటు డీమ్యాట్ ఖాతాలకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లోని నగదు కూడా మాయమైంది. కేఎస్బీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులు గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు. సోమవారం నాటికి 25 మంది వచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఈ ఠాణా అధికారులు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరాల కేసుల్నే నమోదు చేయాలి. అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై సీసీఎస్లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. రూ.137 కోట్లకు సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయంతెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సంస్థలోకి మళ్లించుకుని రుణాలు.. కేఎస్బీఎల్ సంస్థ ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో వినియోగదారులకు సంబంధించిన షేర్లతో పాటు దానికి లింకైన బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అనువుగా మార్చుకున్న పార్థసారథి మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి రుణాలు తీసుకున్నారు. మరికొందరి షేర్లను విక్రయించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదునూ స్వాహా చేశాడు. ఇలా కేఎస్బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దాదాపు 2 లక్షల మంది మదుపరుల ఖాతాల్లోని షేర్లు, నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఫిర్యాదుతో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నామని, అంగీకరించిన మదుపరులను ఈ కేసుల్లో సాక్షులుగా చేరుస్తామని సీసీఎస్కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
పోలీసుల అదుపులో కార్వీ పార్ధ సారధి
-
దేశమంతా మనవైపే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలను ఇప్పుడు దేశం మొత్తం అనుసరించే పరిస్థితి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ ప్రధానితో సహా దేశంలో అందరి ప్రశంసలు పొందిందని చెప్పారు. సోమవారం పోరంకిలో జరిగిన వలంటీర్ల సత్కారాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు వారి ఎమ్మెల్యే పేరు తెలుసో లేదో కానీ వలంటీరు పేరు, ఫోను నంబరు మాత్రం కచ్చితంగా తెలిసేలా ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పారు. సీఎం జగన్ కొత్త వ్యవస్థలను సృష్టించి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేరువ చేశారని ఎమ్మెల్యే కె.పార్థ్ధసారథి పేర్కొన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా మీ వెంటే.. నా 50 కుటుంబాల పరిధిలో 89 ఏళ్ల అవ్వ ఉంది. గతంలో ప్రతి నెలా ఇంటి నుంచి ఆటోలో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి పింఛన్కు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. వలంటీర్ల వ్యవస్థ వచ్చాక ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయం కంటే ముందే ఇంటికి వెళ్లి చేతికి పింఛను డబ్బులు అందచేస్తున్నప్పుడు నా మనవడివి అంటూ చూపే ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేనిది. అలాంటి ఆనందాన్ని ఇచ్చిన సీఎం గారికి ధన్యవాదాలు. మీరే మరో 40 ఏళ్లు సీఎం. మీరు ఏ బాధ్యత ఇచ్చినా మీతోనే నడుస్తాం. –బి.వరసతీష్, వలంటీరు, యనమలకుదురు కన్నబిడ్డలా చూసుకుంటున్నారు ఉదయం పింఛను డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండగా ముందు రోజు రాత్రి 12 గంటలకు నాకు ఓ ఫోను కాల్ వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నానని లబ్ధిదారుడు చెప్పడంతో మా అన్నయ్యతో కలిసి అక్కడకు వెళ్లి పింఛను డబ్బులిచ్చినప్పుడు ఆ కుటుంబం చూపిన ఆప్యాయతను మరువలేను. గతంలో రేషన్కార్డు కోసం ఐదేళ్ల పాటు తిరిగి వేసారిన ఓ కుటుంబానికి ఇప్పుడు 2 గంటల్లోనే కార్డు అందించడంతో ఎంతో సంతోషించింది. మా ద్వారా సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పాలని ఆ కుటుంబం కోరింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తుంటే చాలా కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. నా క్లస్టర్లో ప్రతి కుటుంబం నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తోంది. పండుగకు నాకు దుస్తులు కూడా బహూకరించారు. దీనికి కారణమైన సీఎం జగన్కు ధన్యవాదాలు. –కె.సుష్మ, వలంటీరు. -
నేరానికి కులాలు మతాలు ఉండవు: పార్థసారథి
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు. తమ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. సోమవారం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కామ్లో 150 కోట్ల అవినీతికి పాల్పడినందుకే టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, నేరానికి కులాలు, మతాలు ఉండవని అన్నారు. మహిళ అధికారిని దుర్భాషలాడటంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని తెలిపారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బీసీ నేతను హత్యచేసిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. చట్టం అందరికి ఒకటేనని ఓసీ, బీసీలకు ప్రత్యేకంగా ఉండదని పేర్కొన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేశారని, అచ్చన్న, అయ్యన్న, కొల్లు స్థానంలో నారా లోకేష్ చౌదరి ఉన్నా అరెస్ట్ చేసేవాళ్లమని స్పష్టం చేశారు. కాగా, అధికారంలో ఉండగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన అధికారంలో ఉండగా, న్యాయం కోసం వెళితే తోలుతీస్తా, తోకలు కత్తిరిస్తా అని బెదిరించే వారని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీలను అన్నివిధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని తెలిపారు. బీసీలను ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని పార్థసారథి పేర్కొన్నారు. (చదవండి: మండలిని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు) -
దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: పార్ఠసారథి
-
టీడీపీ నేతలు మాచర్లకు ఎందుకు వెళ్లారు
-
‘గ్రీన్జోన్ పేరుతో చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, కృష్ణా: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ‘ అమ్మఒడి’తో విధ్యాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. గురువారం ఆయన పెనమలూరులో నిర్వహించిన ‘జగనన్న అమ్మఒడి’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. విద్య లేకపోవడం వల్లే ఆర్థిక తారతమ్యాలు ఏర్పడుతున్నాయని, ‘అమ్మఒడి’తో ఈ అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. (చదవండి : ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) ఆంగ్ల మాధ్యమంపై టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ కుటుంబం రైతు పక్షపాతి అని, ప్రతి రైతుకు సీఎం జగన్ రైతు భరోసా అందించారని ప్రశంసించారు. గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని విమర్శించారు. ఇప్పుడు కృష్ణా జిల్లా రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్షకోట్లు రూపాయలు అమరావతిలో పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానిపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి అందరూ అండగా నిలవాలని పార్థసారధి కోరారు. -
చంద్రబాబుకు పార్థసారధి సవాల్
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి ఎద్దేవా చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని, లేకుంటే రేపు (గురువారం) చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. పార్థసారధి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా. ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలి. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. లేదంటే రేపు చంద్రబాబు చేసే దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? టీడీపీ విడుదల చేసిన ఛార్జ్షీట్ అబద్ధాల పుట్ట. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుది. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే బాబు దీక్ష. నదుల్లో వరద ఉధృతంగా ఉండటం వల్లే కొంత ఇసుక కొరత ఉంది. వరద తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో ఇసుక లభిస్తుంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. వ్యవస్థలను నాశనం చేసి నాడు చంద్రబాబు అవినీతికి పట్టం కట్టారు. ఇప్పుడు తన తాబేదారు పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. టీడీపీ, జనసేన ఒకే తానులో ముక్కలు’ అని మండిపడ్డారు. మరోవైపు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రేపు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్థసారధి ...నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. -
మీలా.. హామీలు వదిలేయమంటావా బాబూ..
-
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనైతికంగా దిగజారి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ఏ నాయకుడైనా ఓటమికి గల తప్పులను అన్వేషిస్తారని.. చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు పోలీసుల అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పత్రికల్లో రాయలేని భాషను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని సీఎం జగన్పై విమర్శలు చేసేందుకే ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలా.. ఇచ్చిన హామీలు వదిలేయమంటావా బాబూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్ సైకోలా కనిపిస్తున్నారా..అంటూ చంద్రబాబుపై పార్థసారధి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయడం ముఖ్యమంత్రి చేసిన తప్పా అని ప్రశ్నించారు. మీలా..ఇచ్చిన హామీలను గాలికి వదిలేయమంటారా అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వైఎస్ జగన్ తప్పా అని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీని లోకేష్ భూస్థాపితం చేస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ దోపిడీని.. వైఎస్ జగన్ అరికట్టారనే కారణంతో అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికలతో వార్తలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసింది చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు. -
అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: జూన్ 2వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం పరిశీలించారు. పబ్లిక్ గార్డెన్లోని సెంట్రల్ పార్కులో జరుగుతున్న పచ్చిక పనులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు ప్రతిరోజూ సుమారు 15వేల నుంచి 20వేల మంది మార్నింగ్ వాక్కు వస్తున్నారని, మరో 6వేల మంది సందర్శకులు వస్తున్నట్లు అధికారులు వివరించారు. పబ్లిక్ గార్డెన్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచేందుకు ఉద్యానవన శాఖ చేస్తున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిజాం హయాంలో నిర్మించిన ముఖద్వారం సుందరీకరణ, పోకిరీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు తదితరాలను పరిశీలించారు. పార్కు సందర్శకులపై నియంత్రణ, ఇతర పనుల కోసం నిధులు తదితరాల కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను పార్థసారథి ఆదేశించారు. ఉద్యానవన శాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి, ఇతర అధికారులు అవతరణ దినోత్సవ వేడుకలను పరిశీలించారు. -
రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో అధిక ఉష్ణోగ్రతలతో పాటు చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో నేడు పలు చోట్ల 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఘన్పూర్ (జనగాం) 3 సెం.మీ, చౌటుప్పల్(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, నర్మెట్ట(జనగాం) 2 సెం.మీ, యాచారం(రంగారెడ్డి) 2 సెం.మీ, పాలకుర్తి(జనగాం) 2 సెం.మీ, యాదగిరి గుట్ట(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, మర్రిగూడ(నల్గొండ) 2 సెం.మీ, బెజ్జంకి(సిద్దిపేట) 2 సెం.మీ, ధర్మసాగర్(వరంగల్ అర్భన్) 2 సెం.మీ, కాగజ్నగర్(కుమరం భీం) 2 సెం.మీ, మహబూబాబాద్ 2 సెం.మీ, జఫర్గఢ్(జనగాం) 2 సెం.మీ, వర్గల్(సిద్దిపేట) 1 సెం.మీ 30 వేల ఎకరాల్లో పంట నష్టం అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఈ నెల 3 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లోనే 14,848 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో 95% అత్యధికంగా కోతదశకు వచ్చిన వరి పంటే ఉండటంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటల బీమా చేసుకున్న రైతులకు పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ, ఉద్యానాధికారులను ఆదేశిస్తూ లేఖ రాశారు. రైతులకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని, వాటికి ఫోన్ చేసి కంపెనీలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. బీమా కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు 18005992594, 18002095959 లకు ఫోన్లు చేయాలని కోరారు. -
వైఎస్ జగన్ ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు
-
‘చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టాలి’
విజయవాడ సిటీ: తన స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రత్యేక యాప్లు ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వివరాలతో వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలో ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడతాడు. వైఎస్ జగన్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగిస్తే ఆయనకు భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాలతో ఓట్లు తొలిగిస్తున్నారని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేస్తే బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక మింగిన గొంతుకతో: వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిని అమరావతిని కాదని ఇడుపులపాయకు తీసుకెళ్లతాడని ఇసుక మింగిన గొంతుకతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను వెళ్లిపోవడం ఖాయం అని తెలిసి హైదరాబాద్లో రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటే... ప్రజలకు అందుబాటులో ఉండి మేళ్లు చేయాలనే తలంపుతో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకోవడం దేవినేని ఉమా కళ్లకు కన్పించడం లేదా అని నిలదీశారు. -
ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
‘నేను పార్టీ మారడం లేదు’
సాక్షి, కృష్ణా జిల్లా : పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కావాలనే పచ్చ మీడియా తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తుందన్నారు. తాను ఏ పార్టీ మారబోనని, వైఎస్సార్సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకోసారి ఇలాంటి వార్తలు రాస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శనివారం ఆయన ఉయ్యూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సర్కార్ రైతులకు వెన్నపోటు పొడిచిందని విమర్శించారు. పసుపు, కందకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫెథాయ్ తుపాను బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘనవిజయం అందించాలని ప్రజలను కోరారు. -
చంద్రబాబుది మోసపూరిత ప్రభుత్వం
-
ఐటీ చెల్లింపుదారుల వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను కట్టే వారందరి వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బిస్వనాథ్ ఝాను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకానికి విధించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఐదెకరాలకు కుటుంబం యూనిట్గా తీసుకుంటుండటంతో పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డుల జాబితా ఆధారంగా లబ్ధిదారులను వడపోస్తుండగా, ఆదాయపు పన్ను కట్టే వారి వివరాలను కూడా సేకరించే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. రూ.10 వేల పింఛన్ తీసుకునే వారి వివరాలను కూడా తీసుకుంది. రాష్ట్రంలో 5 ఎకరాలలోపు 47.28 లక్షల మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. అయితే కేంద్రం విధించిన నిబంధనల కారణంగా ఇందులో సగం మంది మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఐటీ చెల్లించే వారిని, రూ.10 వేలు పింఛన్ తీసుకునే వారిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. కుటుంబం యూనిట్గా తీసుకుంటున్న కారణంగా ఐదెకరాలలోపు ఉన్నవారిలో 30 శాతం అనర్హులు అవుతారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వడపోతల అనంతరం వచ్చిన వివరాలను ఈనెల 25 నాటికి పీఎం–కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. ఒకవేళ ఈనెల 25 నాటికి అర్హులైన రైతులందరి జాబితాను అప్లోడ్ చేయకపోయినా, వివరాలు పంపించిన ఏడాదిలోపు ఎప్పుడైనా సొమ్ము రైతుల ఖాతాలో వేస్తారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు సంబంధించి కసరత్తుపై కేంద్ర వ్యవసాయశాఖ మంగళవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను రూపొందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇదిలావుండగా పీఎం కిసాన్ పథకం అమలుకు అన్ని రాష్ట్రాలలో నోడల్ శాఖను, అధికారిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది. ‘రైతుబంధు’పై విషప్రచారం: పార్థసారథి తెలంగాణలో రైతుబంధు తాత్కాలికం అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేసినట్లుగా కొన్ని సంస్థలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మొద టి ప్రాధాన్యం రైతులను ఆదుకోవడమేనన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రైతు లకు అండగా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రైతుబంధు దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, ఇలాంటి పథకం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు తెలంగాణని రోల్ మోడల్గా చూస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. -
‘చంద్రబాబు కుట్రలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఎన్నికల కుట్రలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి తెలిపారు. సోమవారం ఏపీ రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి, బీజేపీ నేత జూపూడి రంగరాజు, సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత తాంతియా కుమారి, టీడీపీ నేత పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికల అక్రమాల గురించి ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేసి, రిగ్గింగ్ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 59 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం ఆ ఓటర్లను తొలగించకుండా అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సర్వేల పేరుతో ట్యాబ్లు ఇచ్చి, ప్రత్యేకమైన యాప్ సృష్టించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. ట్యాబ్లలో ఓటర్ల జాబితాలను పెట్టి.. ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని స్వయంగా ఆధారాలతో వివరించామన్నారు. కానూరు బూత్ నెంబర్ 1లో ఆదినారాయణ అనే వ్యక్తికి ఏడు ఓట్లున్నాయని వెల్లడించారు. ఇలాంటి ఉదాహరణలతో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బూత్లను స్వాధీనపరుచుకోవడానికి నచ్చిన పోలీసు అధికారులను నియమించుకుంటున్నారని తెలిపారు. నాన్ క్యాడర్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమిస్తున్నారన్నారు. చంద్రబాబు బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు: జూపూడి రంగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ నేత జూపూడి రంగరాజు తెలిపారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో శాంతి, భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా వుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయట్లేదంటూ వాపోయారు. ఎన్నికలకు ముందు అధికారులను బదిలీలు చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదు చేసామని తెలిపారు. డీజీపీ ఠాకూర్కి తాము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టే చర్య కాబట్టి.. దీనిపై ఫిర్యాదు చేశామని, ఈ చెక్కుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. -
ఉత్పత్తి సంస్థలతో రెట్టింపు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం పిలుపునకు అనుగుణంగా రైతు ఉత్పత్తి సంస్థలు ప్రోత్సహించేందుకు ఎస్ఎఫ్ఏసీ, ఫిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతు సమస్యల పరిష్కారానికి రైతు ఉత్పత్తి కేంద్రాలు(ఎఫ్పీవో)లు ఉపయోగపడతాయన్నారు. ఫ్యాప్సీ భవన్లో శుక్రవారం ఫిక్కీ , ఏపీఈడీఏ సహకారంతో నిర్వహించిన ‘రెట్టింపు ఆదా యం కోసం రైతు ఉత్పత్తుల సంస్థలు’అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18లో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషించిందని, దేశ జనాభాలో 55% ప్రజలకు వ్యవసాయం ఉపాధి అవకాశం కల్పిస్తోందన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంస్థలు ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం వలన ఆర్థికంగా మరింత లబ్ధి పొందుతారన్నారు. 2019 ఆగస్టు 31 నాటికి 8.82 లక్షల మంది రైతులను రైతు ఉత్పత్తి సంస్థల్లో సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 7.56 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను గుర్తించి 44,467 ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ (ఎఫ్ఐసీ)లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామతాన్ ఫార్క్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, సీఈవో ప్రవేశ్ శర్మ, ఎస్ఎఫ్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ నీల్కమల్ దర్బారి, ఎస్ఎఫ్ఏసీ టీం లీడర్ రాకేశ్ శుక్లా, రైతు ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జీపీఎస్ టెక్నాలజీతో విత్తనోత్పత్తి
సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తికి సాంకేతికతను విరివిగా వియోగించుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. జీపీఎస్, డ్రోన్, జియో ట్యాగింగ్, బార్ కోడెడ్ సాంకేతికతను ఉపయోగించి విత్తనోత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు లాభపడాలంటే విత్తనాల ఎంపిక కీలకమన్నారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ఇండో–జర్మన్ ప్రాజెక్టు ప్లానింగ్’ వర్క్ షాపులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణలో తెలంగాణ మోడల్గా నిలిచిందని, దేశానికి కావాల్సిన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నా యని తెలిపారు. 400 విత్తన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండటంతో విత్తన ప్రాసెసింగ్, నిల్వ పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. దేశాల మధ్య విత్తన ఎగుమతి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రమోషన్ కౌన్సిల్ను ఏర్పా టు చేయాలని వివరించారు. యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోత్సహించవచ్చన్నారు. మార్కెట్లో కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నవారిపై విత్తన చట్టం ప్రకారం తక్కు వ జరిమానా, శిక్షలు పడుతున్నాయని, విత్తన చట్టం లో మార్పులు చేయాలని అభి ప్రాయపడ్డారు. రాజేం ద్రనగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇస్టా విత్తనపరీక్ష ల్యాబ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్ రావు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సౌమిని సుంకర, జర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బీమా కింద రూ.338 కోట్లు అందజేత.. రైతు బీమా కింద ఇప్పటివరకు రూ.338.75 కోట్లు జమ చేసినట్లు పార్థసారథి పేర్కొన్నారు. రైతుల నామినీల బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లోపే పరిహారం జమ చేస్తున్న ఎల్ఐసీ అధికారులను ఆయన అభినందించారు. బుధవారం సచివాలయంలో ఎల్ఐసీ అధికారులతో రైతు బీమా పథకంపై పార్థసారథి సమీక్షించారు. ఇప్పటివరకు 6,775 మంది రైతులు మృతి చెందగా, వారి నామినీలకు డబ్బు జమ చేసినట్లు పేర్కొన్నారు. -
కృష్ణా: ఉయ్యూరు జన్మభూమి రసాభాస
-
‘చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షకు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీక్షలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హోదా తేలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ ఓ బోగస్ అని తెలిపారు. విభజన నష్టాలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలను అవమానించింది చంద్రబబాబేనని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. మైనార్టీల, అర్చకుల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తారని విమర్శించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే కేవలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తోనే సాధ్యమని అన్నారు. -
విత్తనరంగంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: విత్తనరంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బుకార్ టిజాని ప్రశంసించారు. రోమ్ పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుకార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ఎఫ్ఏవో నిబంధనల్లో ఒక కీలకమైన అంశమని చెప్పారు. భారత్ ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనాభివృద్ధి కోసం ఎఫ్ఏవోకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయవన్నారు. అంతర్జాతీయ విత్తనోద్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విత్తనోత్పత్తి, విత్తనాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. గ్లోబల్ సీడ్ హబ్గా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని ఎఫ్ఏవో ప్రకటించినట్లు కేశవులు తెలిపారు. అందులో భాగంగా ఎఫ్ఏవో బృందం వచ్చే జూన్, జూలైల్లో రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు. -
‘చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ పొత్తులు, పదువుల కోసమే ఆరాటమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బద్ద శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్లు కలయికని రాష్ట్రమంతా విడ్డూరంగా చూస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నాయకుడు అంటే జగనే అంటున్నారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే నాయకుడు జగన్ అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. చంద్రబాబు లక్ష్యం కుర్చీ, అధికారమే అని ఆరోపించారు. చంద్రబాబు వేసే పిచ్చి వేషాలకు ఓ వర్గం మీడియా మద్దతుగా నిలవడం దారుణమని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్పై చెప్పులు వేయించి అధికారం లాక్కున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఏ సిద్ధాంతం కోసం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవని అన్నారు. కేంద్రం చేసిన ప్రతి విషయంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అన్యాయం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు వెంటనే బయటకు రావాలని పిలుపునిచ్చారు. డెమోక్రసీ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదని అన్నారు. -
‘విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత’
సాక్షి, హైదరాబాద్: బలమైన విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత ఆధారపడి ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన్ పట్నాయక్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, ఇండో జర్మన్ విత్తన కోఆపరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘మేలైన విత్తన నాణ్యతకు.. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం’అనే అంశంపై మంగళవారం వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో విత్తన కేంద్రంగా తెలంగాణ ఇప్పటికే నిలబడిందన్నారు. ప్రపంచ విత్తనరంగంలో అభివృద్ధి ఐదు శాతముంటే, దేశంలో 12–15 శాతం ఉందన్నారు. మళ్లీ హరిత విప్లవం సాధించడంలో మేలైన విత్తనానిదే ప్రధాన పాత్రన్నారు. దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనోత్పత్తి తెలంగాణలోనే సాధ్యమని, అందుకే విత్తన భాండాగారంగా వెలుగొందుతుందన్నారు. దేశంలో మరో 150 విత్తన హబ్లను ఏర్పాటు చేస్తామని పట్నాయక్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు బలంగా ఉంటే, ధ్రువీకరణ బలహీనంగా ఉందన్నారు. రెండు వ్యవస్థలు బలంగా ఉంటేనే విత్తన వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, మేనేజ్ డీజీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా వార్తలను ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం కేంద్రకార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి, అంబటిరాంబాబు, పార్ధసారథిలు మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తమ అధినేత వైఎస్ జగన్పై హత్యాయత్నం చేశారని ఈ సందర్భంగా భూమన వ్యాఖ్యానించారు. ఈ దాడి పట్ల డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర విచారణ సంస్థతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, గవర్నర్లు కలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని, తమ పార్టీపై బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్దంగా ఉన్నప్పటికీ గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరామని భూమన పేర్కొన్నారు. ఆ వార్తలు అవాస్తవం: పార్థసారథి ఏపీ పోలీసులను వైఎస్ జగన్ అవమానించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పార్థసారథి స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తున్నామన్నారు. తాము తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదన్నారు. ఇక అధికారులను తామెక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు మాటలు అభ్యంతరకరమన్నారు. దేన్నైనా చంద్రబాబు మసిపూసి మారేడు చేస్తారని, అందుకే తాము స్థానిక దర్యాప్తును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముద్దాయిలను కాపాడటానికే చంద్రబాబు, డీజీపీలు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. -
‘ఆయనకు పేదలు కనిపించరు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడాబాబులకే అండగా ఉంటారని, ఆయనకు పేదలు కనిపించరని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని గురువారం ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీలో ఉన్న వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని మండిపడ్డారు. నమ్మినవారికి అన్యాయం చేయటమే చంద్రబాబు పని అని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం పనిచేసే నాయకుడు కాదని, పేదలు, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు. -
చంద్రబాబుకు పేదలు కనిపించరు
-
బాబు అబద్దాల స్టాయి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది
-
అక్టోబర్ తొలివారంలోనే చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్కు సంబంధించిన రైతుబంధు చెక్కులను అక్టోబర్ మొదటి వారం లో రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం లేఖ రాశారు. రబీ సాగు అక్టోబర్ తొలి వారం నుం చి ప్రారంభమవుతున్నందున చెక్కుల పంపిణీ కూడా అప్పట్నుంచే ప్రారంభించాలని నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇంతకుముందు నుంచీ కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లను కేటా యించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి క్రిషి కల్యాణ్ అభియాన్ పథకాన్ని కూడా అమలు చేస్తామని మరో లేఖలో తెలిపారు. -
‘కొత్త ఉత్సాహంతో చంద్రబాబు పచ్చి అబద్దాలు’
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు సర్కార్ తమపై బురద జల్లుతోందని వైఎస్సార్సీసీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశాలకు వెళ్లి వచ్చి కొత్త ఉత్సాహంతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా అని నిలదీశారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. తవ్వకాల కోసం జీవో 97 తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. వైఎస్ జగన్ మన్యంలో సభపెట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాక్సైట్ మైనింగ్ జీవోని నిలిపివేశారని పార్థసారధి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం అంటే ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. -
ఉయ్యూరులో పార్ధసారధి సంఘీభావ యాత్ర
-
‘మోసం చేయడంలో ఆయన దిట్ట’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య దేశం మొత్తం మీదట 32 లక్షలకు పైగా ఉండగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంఖ్య 20 లక్షలకు పైగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కార విషయంలో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు . నాలుగున్నరేళ్లుగా మాయ మాటలు చెప్పి 200 మందికి పైగా ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నా కుట్రతో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 1180 కోట్లు ఇస్తే 14 లక్షల కుటుంబాల సమస్య తీరుతుందని తెలిసినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై సీబీఐ విచారణకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఇష్యూపై బీజేపీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. అందరినీ మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్కి ఏపీ సీఎంకు అర్థం తెలుసా అని ఎద్దేవ చేశారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు మొత్తం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుంటే ఇప్పుడు కొత్తగా కమిటి వేస్తాననడం హాస్యాస్పదమన్నారు. -
పంట నష్టం అంచనాకు బృందాలు: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లకు లేఖ రాసినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సర్వే నిర్వహించి గ్రామాల వారీగా, పంటల వారీగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టం జరిగిన చోట్ల ఏయే పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారో కూడా తెలుసుకోవాలన్నారు. -
‘మొక్కజొన్నపై ఫాల్ ఆర్మీ దాడి!’
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేసిన ఫాల్ ఆర్మీ వామ్–స్పొడోప్తెరా ఫ్రూగిపెర్దా అనే పురుగు ఇప్పుడు మన దేశంలోని పంటలపై దాడి చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పురుగు ఇటీవల కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్న పంటలో గుర్తించారు. పంటను అమాంతం నాశనం చేసే ఈ పురుగు విషయంలో అప్రమత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, జిల్లా వ్యవసాయాధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఇతర దేశాలకు ఇది విస్తరిస్తుందని ఆయన వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కర్ణాటక పక్కనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండటంతో ఈ పురుగు ప్రభావం ఎలా ఉంటుందనే భయం అందరినీ కలవరపరుస్తోంది. ఈ పురుగు సోకితే పంటపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. రాష్ట్రంలో 10.78 లక్షల ఎకరాల్లో సాగు... రాష్ట్రంలో ఖరీఫ్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.78 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్ర ఆహారధాన్యాల పంటల్లో వరి తర్వాత అత్యంత కీలకమైన పంట మొక్కజొన్న కావడంతో రైతులు దీనిపై అధికంగా ఆశలు పెంచుకుంటారు. ఆసియాలోనే తొలిసారిగా గత నెలలో కర్ణాటకలో ఈ పురుగును గుర్తించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. -
‘ ఆ రెండు పార్టీలూ ఏపీని మోసం చేశాయి’
సాక్షి, గుంటూరు : రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు కేబినేట్లో ఒక్క ముస్లింకు కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. మొన్నటివరకూ హోదా వస్తే పారిశ్రామిక రాయతీలు రావన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు రెండు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. హోదా వద్దని ప్యాకేజీయే కావాలని చంద్రబాబు కోరడం వల్లే హోదా రాలేక పోయిందన్నారు. చంద్రబాబు నయవంచకుడని, ప్రజలు అతన్ని నమ్మే ప్రసక్తి లేదన్నారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను చంద్రబాబు అవహేళన చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
పోలవరం వైఎస్ పుణ్యమే
విజయవాడ సిటీ : పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మహానేత తనయుడిగా పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్ జగన్కే ఉందని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2017నాటికల్లా ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందన్నారు. అనంతరం మాటమార్చి 2018లోగా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని మరిచిపోయారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 2019లోగానైనా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని.. ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రకటించిన గడువు లోపు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే మంత్రి దేవినేని ఉమా తప్పుకోవాలని ఆయన సవాల్ విసిరారు. గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంటే మహానేత స్పందించి పోలవరానికి శ్రీకా రం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా గురించి ముసలి కన్నీరు కార్చే టీడీపీ నాయకులు పులిచింతల ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలువలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉమా తాను చేసే బ్రోకరిజాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ మంత్రులు నోటికివచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత జాతికి అంకితం చేస్తారని, కానీ డయా ఫ్రంవాల్ కట్టి పోలవరాన్ని జాతికి అంకితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనుమానాన్ని ఉమా నివృత్తి చేయాలి మంత్రి దేవినేని ఉమా ‘మగ–ఆడో’ తెలియడం లేదని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చిన అనుమానాన్ని ఇప్పడైనా నివృత్తి చేయాలని పార్థసారథి సూచించారు. కేసీఆర్ విజయవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా వంగి వంగి దండాలు పెడుతూ తిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రధానిపై ఆరోపణలు
-
ఆగస్టు 15న రైతు బీమా సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. రైతుబీమా, బిందు సేద్యం, భూ రికార్డుల ప్రక్షాళన, కంటి వెలుగు, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. - రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరినీ సంప్రదించి అర్హులైన రైతులను బీమా పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు. 48.26 లక్షల మంది రైతు బంధు చెక్కులు పొందా రని, ఇప్పటివరకు 40.64 లక్షల మందిని సం ప్రదించామని, అర్హుల ను సంప్రదించి ఆగస్టు 1 నాటికి వీరి వివరాలను ఎల్ఐసీ వారికి సమర్పిస్తే గుర్తింపు సంఖ్య, సర్టిఫికెట్లు ముద్రిస్తారని అన్నారు. రైతు బీమాలో చేరేందుకు ఆసక్తి చూపని వారి వివరాలు నమోదు చేయాలన్నా రు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో రైతులకు బీమా సర్టిఫికెట్లు అందించాలన్నారు. - భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆరు లక్షల డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన∙కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షలు, మండల స్థాయిలో 1.5 లక్షల పాసుపుస్తకాలను ముద్రించాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. మిగతా పాసుపుస్తకాల డిజిటల్ సంతకాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. - కంటివెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ ఆగస్టు 15న గజ్వేల్లో ప్రారంభిస్తారని.. అన్ని జిల్లా ల్లో అమలుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి అన్నారు. జిల్లా స్థాయిలో మెడికల్ అధికారులు, ఆప్టిమెట్రీషియన్లతో బృం దాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు మండల, ఆర్డీవో స్థాయిలో పెండింగ్లో ఉం టున్నాయని, వీటిపై కలెక్టర్లు సమీక్షించాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందించాలనే సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు నిధుల కొరత లేదని, మంజూరు పత్రాలను వేగంగా అందజేయాలని సూచించారు. -
చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా?
-
‘తీవ్ర భయాందోళనలో చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన టీడీపీ నేతలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హోదా కంటే ప్యాకేజీ కోసం పాకులాడింది వాస్తవం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అబద్దాలు చెప్పారో నిరూపించగలరా? చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా దొరికితే కుట్రలు, కుతంత్రాలు అంటారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందా అన్నారు. చంద్రబాబు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్ధసారథి డిమాండ్ చేశారు. -
రైతు బీమాకు టోల్ఫ్రీ నంబర్
సాక్షి, హైదరాబాద్: రైతు బీమాపై అనుమానాల నివృత్తికి ఎల్ఐసీ టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కోరారు. ముంబై నుంచి ఎల్ఐసీ అధిపతి రఘుపాల్సింగ్ నేతృత్వంలోని బృందం సోమవారం నగరానికి వచ్చింది. ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ, రైతు నామినీ మైనరైతే మరెవరినైనా నియమించుకోవాల్సి ఉం టుందన్నారు. ఆగస్టు 15 తర్వాత జారీ అయ్యే కొత్త పాసు పుస్తకాలు పొందే రైతుల బీమాను నమోదు చేసేటప్పుడు వయసుకు సంబంధించి ఆ నెల ఒకటోతేదీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పథకం సక్రమ అమలుకు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. -
అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు పట్టించుకోవడం లేదు
-
‘ఏపీ మంత్రులు కూడా ఒప్పుకున్నారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సర్కార్ దుర్మార్గపు ఆలోచనల కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం.. వెంటనే ఆ రోజు మంత్రులు స్పందిస్తారని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వారి పని స్పందించడం వరకేనని, న్యాయం మాత్రం చేయరంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశమైంది. అనంతరం కమిటీ కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవుల్లో ఉన్న వాళ్లు, మంత్రులు కూడా అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తుల విలువ అనేక రెట్లు ఉందని చెప్పిన విషయాన్ని అప్పిరెడ్డి గుర్తుచేశారు. ‘అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు ఏ కోశాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంది. ఢిల్లీలో చంద్రబాబును అమర్సింగ్ కలిసిన తర్వాతే ఎస్ఎల్ గ్రూపు అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయమని చెప్పింది. కొందరు సంస్థ ఆస్తులను చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలిసొచ్చిన పార్టీలతో వైఎస్సార్సీపీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుందని’ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వినర్ తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఐదు రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఇక్కడ జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కార మార్గం కోసం వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రజల ఆస్తుల్ని ఎలా కాజేయాలన్న ఆలోచన తప్పా.. వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రాలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే 1100 కోట్లు ఖర్చు చేస్తే 16 లక్షల మంది బాధితులు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారని వైఎస్సార్సీపీ సూచించినట్లు తెలిపారు. పుష్కరాలకు వేలకోట్లు, సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్హౌస్లకు, విదేశీ పర్యటనల ఖర్చులతో పోల్చితే ఇదేమంత పెద్ద ఖర్చు కాదని చంద్రబాబుకు పార్థసారథి సూచించారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో ఏ పని అయినా చేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అగ్రిగోల్డ్ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భాదితులకు చెల్లింపులు చేయడం కష్టసాధ్యమేం కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులని చవకగా కొట్టేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు చంద్రబాబు మీకు వినిపించడం లేదా అని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. బాధ్యత గల సీఎంగా వ్యవహరించి.. చంద్రబాబు ఇప్పటికైనా బాధితులకు న్యాయం చెయ్యాలని సూచించారు. టీడీపీ సర్కార్ చేస్తున్న భిన్న ప్రకటనలతో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ తగ్గించి చెప్పడం సరికాదన్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు మాత్రం పరిష్కార మార్గం కాదని హితవు పలికారు. -
మహానాడు బుర్రకథను తలపిస్తోంది : పార్థసారధి
సాక్షి, చిత్తూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సమావేశాలు బుర్రకథను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకే మహానాడు సమావేశాలు ఏర్పాటుచేశారని అన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తెలుగు ప్రజలకు ఏమి చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లేదని దూషించారు. మహానాడు వేదికపై ప్రజలను కించపరిచే విధంగా మట్లాడుతుంటే బాబు ముసిముసి నవ్వులు నవ్వుతారా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ మహానాడులో వంటల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీతో కలిసి హోదాను భూస్థాపితం ప్రత్యేక హోదాపై చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్థసారధి దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి ప్రత్యేక హోదాను భూస్థాపితం చేశారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన తప్పిదాలను ప్రజల నుంచి దృష్టి మరల్చడంలో బాబు దిట్టని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. -
చంద్రబాబును పొగిడేందుకే మహానాడు సమావేశాలు
-
వంచనపై వైఎస్సార్సీపీ గర్జన
-
నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీనైనా అమలు చేశారా?
-
ఓటుకు కోట్లు కేసు సీబీఐకి అప్పగించాలి
-
‘ప్రధానులనూ విచారించి.. చంద్రబాబును వదిలేస్తారా’
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకు కోట్లు కేసులో సీబీఐ లేదా ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్కు మోకరిల్లి హైదరాబాద్ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమం ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు. కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి వివరించారు. -
‘చంద్రబాబు చేతకానితనంతో ప్రజలకు కష్టాలు’
సాక్షి, పెడన: రైతులకు రెండు పంటలకు నీరిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిదే అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. బలహీన వర్గాల వారిని జడ్జీలు కాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ఏ సమయంలోనూ బలహీన వర్గాలకు సాయం చేయలేదని గుర్తుచేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతకానితనం కారణంగా రైతులు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని విమర్శించారు. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఒక పంటకు నీరు ఇవ్వని చంద్రబాబు.. ప్రస్తుతం ఈ నాలుగేళ్లలో కూడా అదే తీరు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా భూములు, ఇతరత్రా ఆస్తులు కట్టబెడదామన్నదే టీడీపీ నేతల విధానమంటూ ఎద్దేవా చేశారు. దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో రైతులకు రెండు పంటలకు నీరు ఇచ్చారని కొనియాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో.. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పంటలు అమ్ముకోవాలంటే పాస్బుక్లు, ఈ– పాస్ అంటూ చంద్రబాబు దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. నాడు వైఎస్సార్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేవని చెప్పారు. అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్కార్డులు వైఎస్సార్ అందించారు, కానీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రైతులు, సామాన్యులు, అన్ని వర్గాలవారు మోసపోయారని పార్ధసారధి అన్నారు. -
బెదిరింపులకు భయపడం:పార్ధసారధి
-
23 జిల్లాల్లో వరికి పంట బీమా
సాక్షి, హైదరాబాద్: జిల్లాకో ప్రధాన పంటను పరిగణనలోకి తీసుకుని గ్రామం యూనిట్గా బీమా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం 23 జిల్లాల్లో వరికి గ్రామం యూనిట్గా పంటల బీమా అమలు చేస్తారు. రెండు జిల్లాల్లో సోయాబీన్, 5 జిల్లాల్లో మొక్కజొన్న పంటలకు గ్రామం యూనిట్గా బీమా అమలుచేస్తారు. ఆయా జిల్లాల్లో మిగిలిన పంటలకు మండలం యూనిట్గా బీమా అమలు చేస్తారు. వచ్చే ఖరీఫ్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం(యూపీఐఎస్)ల అమలు మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5శాతం ప్రీమియం చెల్లించాలి. పంటల నష్టాన్ని పది రోజుల్లోగా అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరికి ప్రీమియం చెల్లించే గడువును ఆగస్టు 31గా నిర్ధారించారు. జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31 గడువుగా ప్రకటించారు. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. ఎండు మిర్చిని 15 జిల్లాల్లో అమలుచేస్తారు. ప్రమాద మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం.. యూనిఫైడ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో వ్యక్తిగత ప్రమాద బీమా, జీవిత బీమా, విద్యార్థి భద్రత బీమా, గృహ బీమా, వ్యవసాయ పంపుసెట్ల బీమా, ట్రాక్టర్ బీమాలను అమలుచేస్తారు. వీటిలో ఏ రెండింటినైనా రైతులు ఎంపిక చేసుకోవాలి. వీటికి రైతు రూ.12 బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుంది. -
రైతుబంధుకు రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. చెక్కులిస్తే నగదెట్లా? చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు. కందుల సొమ్ములోనూ.. ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. -
‘నీకు డ్యాన్స్ నేర్పిస్తే మాత్రం ఎకరాలిస్తావా’
సాక్షి, హైదరాబాద్: రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా నలుగురు విదేశీయులు వచ్చి పొగిడితే చాలని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. సీఎం దగ్గర సీఎస్గా పనిచేసిన వారే అమరావతి ఎవరి రాజధాని అని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇపుడు బాబు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో బలహీన వర్గాలకు అవకాశమివ్వడం లేదని.. దళితులు, షెడ్యూల్ కులాలకు సంబందించిన రాజధాని కాదని తేలిపోయిందన్నారు. పేదవారు రాజధానిలో మాకేముందని భావిస్తున్నారన్నారు. భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం పాటించడం లేదని తెలిపారు. కేవలం చంద్రబాబు వర్గీయుల కోసమే రాజధాని అని విమర్శించారు. బాబు, లోకేశ్, మంత్రులు కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారంగా రాజధానిని మార్చారన్నారు. స్థలాలిచ్చిన వాళ్లకు ఏ ఒక్క సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తెల్లకాగితాలతో సరిపెట్టి.. చంద్రబాబుకు డ్యాన్స్ నేర్పించిన బాబాకు మాత్రం ఎకరాలకెకరాల భూములు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. కొన్ని వేల రైతుల జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారని పార్థసారధి విరుచుకుపడ్డారు. పేదలు, రైతులకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. నాలుగేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా కట్టకుండా... హ్యాపీ అమరావతి అంటారా అని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. హోదా ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తుంటే.. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. కనీసం పంటను అమ్ముకునే పరిస్థితి లేదు.. అగ్రిగోల్డ్ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేదు.. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలన్న విధానం తప్పితే, బాధితులకు పరిష్కారం చేయాలనే ఉద్దేశం కనిపించలేదని ఆయన మండిపడ్డారు. -
ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ
సాక్షి సెంట్రల్ డెస్క్, విజయవాడ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలకు టాప్ – 100లో చోటు లభించింది. దేశంలోని టాప్ ఉన్నత విద్యాసంస్థల్లో (ఓవరాల్గా) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 36వ ర్యాంక్ సాధించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 74 వ స్థానంలో నిలిచింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) 83వ స్థానంలో నిలువగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె 89వ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాలకు సంబంధించి టాప్ 100లో చోటు సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో.. తెలంగాణకు సంబంధించి గతేడాది ఓవరాల్ కేటగిరీలో ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ దేశంంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్ఐఆర్ఎఫ్కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. యూనివర్సిటీల విభాగంలో - ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం – 22 - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) – 49 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 56 - శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)– 62 - గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం)– విశాఖ– 85 - శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపురం)– 92 ఇంజినీరింగ్ విభాగంలో... - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)– 49 - ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ (విశాఖపట్నం) – 65 - శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) – 71 - సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్ కాలేజ్ (భీమవరం) – 85 - యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కాకినాడ) – 97 కళాశాల విభాగంలో.. - సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజ్ (కర్నూలు) – 35 - ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ)– 56 మేనేజ్మెంట్ విభాగంలో.. - ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (సత్యవేడు)– 34 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 46 ఫార్మసీ విభాగంలో.. - ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ (ఆంధ్రాయూనివర్సిటీ) – 28 - రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (అనంతపురం) – 39 లా విభాగంలో..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా (విశాఖపట్నం) – 10 ఎస్ఆర్కేఆర్కు జాతీయస్థాయి ర్యాంకింగ్ భీమవరం: జాతీయస్థాయి విద్యాసంస్థల ర్యాంకింగ్లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు 85వ ర్యాంకు వచ్చిందని ప్రిన్సిపాల్ జి.పార్థసారథి వర్మ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిం చారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ ర్యాంకులకు ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 4,500 యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా పలు సంస్థలకు జాతీయ ర్యాంక్లు వచ్చాయని తెలిపారు. -
ప్రథమ దోషి చంద్రబాబే: వైఎస్ఆర్సీపీ
సాక్షి, విజయవాడ: కేంద్రం ప్యాకేజీ ప్రకటించగానే స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తానేదో చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి విమర్శించారు. హోదా రాకపోవడంలో ప్రథమ దోషి చంద్రబాబేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞప్తులను బహిర్గతం చేయాలని చంద్రబాబును పార్థసారధి డిమాండ్ చేశారు. ఇప్పటికీ అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాత్రం కోరుకోవడం లేదన్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో ఏనాడు మాట్లాడని చంద్రబాబు.. కాంట్రాక్టర్లను మార్చేందుకు మాత్రం నాగ్పూర్కు 10 సార్లు వెళ్లారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చివరగా ఈ జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ప్యాకేజీ గురించే చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. గతంలో రాజీనామాలు చేసి చాలా మంది, చాలా ప్రాంతాల్లో డిమాండ్లు సాధించకున్నారని, మరి చంద్రబాబు రాజీనామాలపై ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. మోదీపై ఎంత పోరాటం చేయాలో అంతకంటే ఎక్కువ చంద్రబాబుపై చేయాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి నీచ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ రిలే దీక్షలు చేపట్టాలని, ప్రజలు మేధావులు, విద్యార్థులు, యువకులు మాతో కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని పార్థసారధి పిలుపునిచ్చారు. టీడీపీని ప్రజలు క్షమించరు: బొత్స సత్యనారాయణ సాక్షి, విజయవాడ: ఏపీకి హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, ఎంపీలతో రాజీనామాలు, ఆపై ఆమరణ నిరాహారదీక్షకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. హోదా అనేది మన బతుకు సమస్య అని, అదే మనకు సంజీవని అని బొత్స పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు మాతో కలిసి రావాలని, అందరూ రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హోదా విషయంలో చిత్తశుద్ధి ఉంటే తన ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని, లేకుంటే టీడీపీని ప్రజలు క్షమించరని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. నాలుగేళ్లుగా అహింసాయుతంగా పోరాడుతున్నామని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. హోదాతోనే విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, ఏపీలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో పెట్టిన కేసులన్నింటిని చంద్రబాబు సర్కార్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అందరం కలిసికట్టుగా పోరాడి హోదాను సాధించుకోవాలని, మా పోరాటానికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సహకరించాలని బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
అంకెలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం
కంకిపాడు(పెనమలూరు): జిల్లా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే జిల్లా అభివృద్ధి చెందుతోందంటూ జిల్లా యంత్రాంగం అంకెలగారడీతో ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేయటం దౌర్భగ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై అభూత కల్పనలు çకలెక్టరే సృష్టించటం శోచనీయమన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. అర్థం లేని నిబంధనలతో రైతుని రోడ్డుపైకి లాగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. జిల్లాలో ఎందరు కౌలుదారులున్నారో?, ఎంత సాగు జరుగుతుందో? కౌలురైతులకు ఎంత రుణం ఇచ్చారో జిల్లా అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కౌలుదారులకు సక్రమంగా రుణాలు, సబ్సిడీ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులది కాదా? అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మిన తరువాత నెల రోజులకూ డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. మినుము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కనీసం 10 శాతం కూడా కొనుగోళ్లు చేపట్టలేదని, బహిరంగ మార్కెట్లో రూ.3,800 నుంచి రూ.4300లకే క్వింటా మినుములు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి మద్దతు ధరకు మినుములు ఎలాంటి నిబంధనలు విధించకుండా కొనాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు కూడా ఏడాదిగా అందడం లేదని కలెక్టరు గుర్తించాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయిస్తే ఆ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని విమర్శించారు. సీఎం, మంత్రుల భవనాల ఆధునికీకరణలకు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. డెల్టా పనులు జాప్యం వల్ల తెలంగాణలో బీమా ప్రాజెక్టు పూర్తయ్యి అక్కడ 20 టీఎంసీల సాగునీరు నిల్వ అవుతుందని, సాగునీటి నష్టాన్ని, సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. మంత్రి ఉమా దద్దమ్మ.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతగాని తనం వలన జిల్లాలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఆయన, పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నాలుక చీరేందుకు కూడా వెనుకాడరని, సిగ్గుతెచ్చుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్కుమార్, మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామినేని రమాదేవి పాల్గొన్నారు. -
మార్కెట్ ఏజెంట్ల బ్యాంకు గ్యారెంటీల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్, ట్రేడర్స్ లైసెన్సు రెన్యువల్ తదితరాల బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించి డిపాజిట్ల సొమ్ములో సవరణలు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు, ట్రేడర్లకే సవరణ ఉత్తర్వులు అమలవుతాయి. టర్నోవర్ కోటి రూపాయల లోపున్న కూరగాయలు, పండ్ల కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్కు బ్యాంకు గ్యారంటీ రూ.3 లక్షలుండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటికి పైగా టర్నోవర్కు రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే, దాన్ని రూ.50 వేలకు తగ్గించారు. ఇక రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వారికి రూ.లక్ష గ్యారెంటీగా నిర్ణయించారు. ఇతర లైసెన్సుల రెన్యువల్కు... కూరగాయలు, పండ్లకు సంబంధించి కాకుండా ఇతర లైసెన్సుల రెన్యువల్కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండేది. దాన్ని రూ.50 వేలకు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.లక్ష, ఐదు కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారెంటీగా నిర్ధారించారు. ఇక పండ్లు, కూరగాయల ట్రేడ్ లైసెన్సు రెన్యువల్కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.50 వేలకు కుదించారు. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ట్రేడర్ల గ్యారెంటీని రూ.లక్ష చేశారు. పండ్లు, కూరగాయలు కాకుండా ఇతర వాటి ట్రేడ్ లైసెన్సు రెన్యువల్స్కు కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షలకు బదులు రూ.50 వేలు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.10 లక్షలున్న బ్యాంకు గ్యారెంటీని రూ.లక్షకు కుదించారు. రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ కోరారు. ప్రాసెసింగ్ లైసెన్స్కు... ఇక ప్రాసెసింగ్ లైసెన్సుకు రూ.కోటి నుంచి అంతకుమించి టర్నోవర్ ఉంటే రూ.3 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని ఎంత టర్నోవర్ ఉన్నా రూ.50 వేలకు కుదించారు. వేర్హౌసింగ్ లైసెన్సుకు రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే రూ.50 వేలకు తగ్గించారు. మార్కెట్ నోటిఫికేషన్కు రూ.20 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. డైరెక్ట్ పర్చేజ్ సెంటర్ (డీపీసీ)కు రూ.10 లక్షల బ్యాంకు గ్యారెంటీని రూ.2 లక్షలకు కుదించారు. జాతీయ పొదుపు సర్టిఫికెట్లను కూడా బ్యాంకు గ్యారెంటీగా చూపొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మోదీ పేరు ఎత్తడానికి బాబుకు భయం!
సాక్షి, విజయవాడ: కేంద్ర బడ్జెట్ వచ్చిన 17 రోజుల తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి మాట్లాడారని, కానీ ఆయన తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ పేరు ఎత్తడానికే భయపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేయలేదని, ఇప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారో ఆయన స్పష్టం చేయాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో చంద్రబాబు విఫలమై.. ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని పార్థసారథి సూచించారు. కేండ్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాదాపు 17 రోజుల తర్వాత చంద్రబాబు తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీకి నిధులు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్తూనే.. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తారో ఆయన ప్రకటించలేదు. -
బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉత్తర భారతదేశంలో హవా నడిపిస్తూ.. దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ అనంతలో ఉనికి కోల్పోతోంది. గతంలో బీజేపీ తరపున కదిరి ఎమ్మెల్యేగా పార్థసారధి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు ఆ ప్రాభవం కాస్తా చరిత్రలో కలిసిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తరచూ టీడీపీతో దోస్తీ కట్టడం.. ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. పొత్తులో భాగంగా అనంతలో టిక్కెట్లు దక్కించుకోలేకపోవడం పార్టీ పరిస్థితి దిగజారేందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోనూ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటని పరిశీలిస్తే.. టీడీపీతో దోస్తీ కారణంగా మరింత బలహీనపడిన విషయం ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తు కారణంగా ఆ విషయాన్ని బాహాటంగా వెల్లడించలేకపోతున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి పార్థసారధి కదిరి ఎమ్మెల్యేగా 1999లో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా కదిరి స్థానం బీజేపీకి దక్కింది. ఆ ఐదేళ్లు కదిరితో పాటు జిల్లాలోనూ ఆ పార్టీ కాస్త హడావుడి చేసింది. స్వతంత్రంగా గెలిచే శక్తి, ఆ స్థాయి అభ్యర్థులు పార్టీకి లేకపోయినప్పటికీ కొంత ఓటు బ్యాంకును పోగు చేసుకోగలిగింది. 2004లోనూ బీజేపీ–టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్థసారధి బరిలో నిలిచినప్పటికీ టీడీపీ రెబల్ అభ్యర్థి కారణంగా ఓటమిపాలయ్యారు. అయితే ఆ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాత్రం టీడీపీ విజయం కోసం కృషి చేశాయి. 2004లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత బీజేపీ–టీడీపీ మధ్య దూరం పెరిగింది. చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ‘అనంత’లో పాదయాత్ర సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని, భవిష్యత్లో మళ్లీ పునరావృతం కానివ్వబోమని కూడా పలు వేదికలపై స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తిరిగి మైత్రీబంధం కొనాసాగించి కలిసి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా గుంతకల్లు సీటు బీజేపీకి కేటాయించినా.. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ తమ అభ్యర్థి కూడా బరిలో నిలపడం గమనార్హం. అయినప్పటికీ బీజేపీ మిగతా స్థానాల్లో టీడీపీకే మద్దతివ్వడం గమనార్హం. అవినీతిపై కూడా పెగలని గొంతు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొందరు టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. హంద్రీనీవా పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ ఒక్క అవినీతి ఘటనపై బీజేపీ నేతలు నోరు మెదపలేదు. ‘అనంత’ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రశ్నించలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో అన్యాయం జరుగుతున్న క్రమంలో, హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లోనూ నిర్లిప్తత ప్రదర్శించారు. వీటన్నింటికీ కారణం పొత్తే. అయితే ‘అనంత’కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు స్పందించకపోవడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ లాభం కోసం నిమ్మకుండిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరినీ ఒకే తీరుగా భావించారు. ఇది బీజేపీకి మరింత నష్టం చేకూర్చింది. ఈ విషయం బీజేపీ నేతలకూ స్పష్టంగా తెలుసు. దీనిపై ‘సాక్షి’ ఆరా తీస్తే టీడీపీ తీరు దారుణంగా ఉందని, దీనిపై స్పందించాలంటే మాకు పొత్తు అడ్డొస్తుందని.. టీడీపీతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా విష్ణువర్దన్రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బలపడని పరిస్థితి. ఈ క్రమంలో కనీసం రానున్న ఎన్నికల్లోనైనా గెలుపోటములను పక్కనపెట్టి బరిలో నిలవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు.. ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి 4–5 శాతం తక్కువ లేకుండా ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చాలా చోట్ల వైఎస్సార్సీపీ నేతలు తక్కువ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఇలాంటి స్థానాల్లో కచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుందనేది రాజకీయపరిశీలకు వాదన. అయితే ఎన్నికల తర్వాత బీజేపీని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏవైనా పనులున్నా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోని పరిస్థితి. దీంతో బీజేపీ నేతలు టీడీపీ నేతల వైఖరిపై అంతర్గతంగా తీవ్రస్థాయిలో రగలిపోతున్నారు. ఈ సారి పోటీలో ఉంటాం.. 2009 ఎన్నికల్లో ఉరవకొండ మినహా అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీ చేశాం. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా గుంతకల్లు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించి, తక్కిన స్థానాల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశాం. కానీ టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి జితేంద్రగౌడ్కు బీఫారం ఇచ్చింది. దీంతో మా అభ్యర్థి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా రెండు పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం అడుగుతాం. పొత్తులో భాగంగా మూడున్నరేళ్లలో మేం నష్టపోయింది లేదు. మా వ్యూహం ప్రకారం బలపడ్డాం. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మేం ఎక్కడా రాజీపడలేదు. అంశాల వారీగా అవినీతిపై ప్రశ్నించాం. – విష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ యువజన విభాగం -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: కందికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కంది ధర ఢమాల్’కథనంపై ఆయన స్పందించారు. కందికి మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించారు. అలాగే ఈ మేరకు సోమవారం అత్యవసరంగా సమావేశమై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఓ ప్రకటనలో హరీశ్ వెల్లడించారు. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. -
చంద్రబాబు రైతు వ్యతిరేకి
విజయవాడ సిటీ: పోలీసులతో రైతుల్ని కాల్చి చంపించిన ఘనచరిత్ర ఉన్న చంద్రబాబుది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. నకిలీ మందుల కారణంగా నష్టపోయి పరిహారం కోసం ఉద్యమించిన రైతులను ఆత్మహత్యాయత్నం చేసుకునే విధంగా చేశారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. విజయవాడ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాల కారణంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తే పరిష్కారమవుతుందేమోనని ఆశించి అసెంబ్లీకి బయలు దేరిన రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా చంద్రబాబు చేశారని విమర్శించారు. నష్ట పరిహారం కోసం రైతులు వస్తే చంద్రబాబు ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డనని నోటి నుంచి చెప్పుకోవడం కాదు చంద్రబాబూ... ఆలోచనా విధానాలూ రైతులకు మేలు చేసేలా ఉండాలని సూచించారు. రైతులను చంపిన నువ్వు రైతు బిడ్డవు ఎలా అవుతావని ఎద్దేవా చేశారు. నష్టపోయిన రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారిపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. రైతులకు నిరసనలు తెలిపే హక్కులేదా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని, పోలీసులను వాడుకుంటూ రైతులను వేధిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నటనకు నంది అవార్డు... పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబుప్రహసనంగా మార్చేశారని పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నటించిన నటనకు నంది అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడేమో కేంద్రం సహకరిస్తేనే పోలవరం పూర్తి చేస్తానని కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. -
సాగుభూమి లేని ‘సమితి’ సభ్యులపై వేటు
సాక్షి, హైదరాబాద్: సాగుభూమి లేకున్నా రైతు సమన్వయ సమితి సభ్యులుగా ఎంపికైన వారిపై వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ‘రైతు సమన్వయ సమితుల ఏర్పా టుకు జారీచేసిన ఉత్తర్వుల్లో సాగు భూమి లేని రైతులను సభ్యులుగా తీసుకోకూ డదని నిబంధన పెట్టుకున్నాం. కానీ అనేక చోట్ల ఆ నిబంధనను ఉల్లంఘించినట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి గ్రామ, మండల సమన్వయ సమితుల జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించి సాగుభూమి లేని రైతు లెవరైనా ఉంటే వారిని తొలగించండి..’ అని ఆ లేఖలో సూచించారు. ఈ మేరకు అర్హత లేకున్నా ఎంపికైన వందలాది మంది రైతులను తొలగించేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. ‘కార్పొరేషన్’ యోచనతో డిమాండ్ రైతు సమన్వయ సమితులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం ప్రకటించ డంతో సమితుల్లో చేరేం దుకు డిమాండ్ మరింతగా పెరిగింది. గుత్తా సుఖేందర్రెడ్డిని చైర్మన్గా నియమి స్తారని భావిస్తుండగా.. డైరెక్టర్లుగా కొందరు టీఆర్ఎస్ సీనియర్లకు చోటు లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమితికి పోటీ పెరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో ఎంపికలు రైతులను సంఘటితపర్చి వారికి అవసరమైన సేవలు అందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది చొప్పున, రాష్ట్రస్థాయి సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష మందికి పైగా గ్రామ, మండల సమితులకు సభ్యు లను, సమన్వయకర్తలను నియమించారు. ఇక జిల్లా, రాష్ట్రస్థాయి సమితులను ఏర్పాటు చేయాలి. అయితే అధికార పార్టీ నేతల ప్రతిపాదనల మేరకే గ్రామ, మండల సమితి సభ్యులను మంత్రులు ఎంపిక చేశారు. కొందరికి సాగుభూమి లేకపోయినా రాజ కీయ అవసరాల రీత్యా జాబితాల్లో చేర్చారు. కానీ దీనివల్ల అసలుకే మోసం వస్తుందన్న భావనతో అర్హత లేనివారిపై వేటేయాలని నిర్ణయించారు. -
బోటు ప్రమాదం.. ప్రభుత్వ వైఫల్యంపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్ : ఘోర ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోతే... చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారథి మీడియా మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచంలోని అత్యంత అవినీతి ప్రపంచమన్న ఆయన.. మంత్రులతో సహా ప్రతీ నేత కూడా దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. నీరు-చెట్టు కింద సుమారు 100 కాంట్రాక్టులను కావాల్సిన వారికే కట్టబెట్టుకున్నారని.. ఇసుక నుంచి మట్టి వరకు అంతా దోచుకుంటున్నారన్నారు. పవిత్ర సంగమాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేస్తున్నారని.. మరి టూరిస్ట్ స్పాట్ గా ప్రకటన చేసుకుంటున్న చంద్రబాబు.. ప్రజల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని పార్థసారథి ప్రశ్నించారు. గతంలో హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించటంలో విఫలమవుతూ ప్రజల ప్రాణాలు పోయేందుకు బాధ్యుడవుతున్నారన్నారు. అనుమతులు లేని బోట్లు తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఘటన తర్వాత లైఫ్ జాకెట్లు, సాయం చేసేందుకు వచ్చిన వారిపై దాడికి యత్నించారని ఆయన అన్నారు. మృతుల బంధువులు రాకుండానే పోస్టు మార్టం పూర్తి చేయటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బోటు ప్రమాద ఘటనను పక్కదారి పట్టించేందుకే యజమాని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారని.. మరి ప్రభుత్వం తరపున వైఫల్యంపై విచారణకు ఆదేశించారా? అని అడిగారు. అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవటం కాదని... వెంటనే ఇరిగేషన్ మంత్రి, మంత్రి అనుచరులు, టూరిజంశాఖ అధికారులపై కూడా దర్యాప్తు చేయించాలని.. సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ముడుపులు దండుకోవటం కోసమే పోలవరం ప్రాజెక్ట్ హైపవర్ కమిటీని రద్దు చేశారని తెలిపారు. బోటు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పార్థసారథి డిమాండ్ చేశారు. -
అక్రమ ఆదాయ వనరుగా మార్చారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును అక్రమ ఆదాయ వనరుగా మార్చుకునేం దుకు సీఎం చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, దీనిని ఒక మాయా ప్రాజెక్టుగా మారుస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి దాని వ్యయం ఎంతకు చేరుతుందో కేంద్రానికిగానీ, రాష్ట్ర ప్రజలకుగానీ అర్థంకాని విధంగా ప్రభుత్వం మాయ చేస్తోందన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తిచేసి, అప్పగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే, రాష్ట్రప్రభుత్వం ఏం ఆశించి కేంద్రం నుంచి పోలవరాన్ని లాక్కుందో స్పష్టం చేయాలన్నారు. -
జగ్గయ్యపేటలో ధర్మం గెలిచింది
సాక్షి, హైదరాబాద్ : అధికారం అండతో టీడీపీ దౌర్జన్యం చేయాలని యత్నించినా చివరకు ధర్మమమే గెలిచిందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తెలిపారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విజయంపై వైఎస్సాఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అంతా వచ్చి భయానక వాతావరణం సృష్టించినా ప్రభుత్వం పాచికలు పారలేదని పార్థసారథి తెలిపారు. చివరకు అధికారులపై దాడికి కూడా ప్యూహరచన చేశారని.. మానసిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీ నేతృత్వంలో దాడి చేసేందుకు పోడియం చుట్టు చేరారని ఆయన అన్నారు. వారి దౌర్జన్యకాండ మొత్తం మీడియాలో ప్రజలంతా చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలతో పనులు చేయించుకోవటమే పనా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థి మీద అక్రమ కేసులు బనాయించారని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారన్నారు. చివరకు శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎలాగైనా సరే ఎన్నికలు ఆపేందుకు తీవ్రంగా యత్నించారని, ఒకవేళ అనుకూలంగా వ్యవహరించి ఉంటే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రచించారని చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ధర్మమే గెలిచిందని తెలిపారు. వచ్చే రోజుల్లో కూడా పార్టీ కార్యకర్తలు.. ప్రజా ప్రతినిధులు ఒకేతాటిపైకి వచ్చి పోరాడతామని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. -
రేపటి నుంచి విత్తన కార్పొరేషన్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న వివిధ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్ల సదస్సును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ ఎం.జగన్మోహన్తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ద్వారా విత్తనోత్పత్తి చేపట్టడంతో పాటు పరిశోధనలు, మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పరచుకోనున్నట్లు తెలిపారు. విత్తన సదస్సుకు మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్లతో పాటు జాతీయ విత్తన కార్పొరేషన్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులు రానున్నారని వెల్లడించారు. సదస్సులో ఆయా రాష్ట్రాలు రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. మార్కెటింగ్, విత్తనోత్పత్తికి పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ముగింపు సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొంటారన్నారు. పార్థసారధి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే విత్తనాలకు టెండర్ విధానం లేకుండా మన రాష్ట్రంలోనే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టే చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటిని వినియోగించుకుని విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నకిలీ విత్తన నిరోధానికి చట్టం తీసుకురావాలనుకున్నప్పటికీ, ఈ అంశం కేంద్రం పరిధిలో ఉండటం, జాతీయ స్థాయిలో నూతన విత్తన చట్టం తీసుకువచ్చే సూచనలు కనిపించడంతో ఆ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. -
పోలవరం జాప్యానికి చంద్రబాబుదే బాధ్యత
-
టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి
-
పోలవరంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది
-
త్వరలో కొత్త విత్తన చట్టం
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం వస్తుందని వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నా రు. నాణ్యమైన విత్తనాల ధరలు సైతం రైతు లకు భారం కాకూడదన్నారు. తెలంగాణను నాణ్యమైన విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిది ద్దేందుకు భారత–జర్మనీ దేశాల విత్తన రంగ అభివృద్ధి ప్రాజెక్టు ఆధ్వర్యంలో టెక్నికల్ వర్క్ షాప్ బుధవారం జరిగింది. వర్క్షాప్ కు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్స్మెన్ అసోసియేషన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సహా 60 మందికిపైగా విత్తన రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైవిధ్య వాతావర ణం, నేలల పరిస్థితుల మూలంగా నాణ్యమై న విత్తనాభివృద్ధికి అపార అవకాశాలున్నా యన్నారు. నకిలీల బెడద లేని నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన సరఫరా దిశగా తాము పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ విత్తన ధృవీకరణ, సరఫరాలో ఆన్లైన్ సేవలు తప్పనిసరని తెలంగాణ విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు వివరించారు. తమ దేశంలో పంట రకం రిజిస్ట్రేషన్, విత్తన ధృవీకరణ తప్పనిసరని జర్మనీ ఫెడరల్ ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెర్మన్ హుక్కెర్ట్ అన్నారు. -
753 ఏఈవో కొలువులు..
టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలకు సర్కారు అనుమతి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవలే 1,350 వ్యవసాయాధికారుల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. సోమవారం మరో 753 గ్రేడ్–2 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చింది. అందులో 526 ఏఈవో పోస్టులను కొత్తగా మంజూరు చేయగా.. మిగిలినవి ఖాళీగా ఉన్న పోస్టులు. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ప్రతిపాదనల మేరకు ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. గ్రేడ్–2 ఏఈవోల పేస్కేల్ రూ.22,460 నుంచి రూ.66,330 వరకు నిర్ధారించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ పోస్టులను మంజూరు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే వ్యవసాయశాఖలో తగినంత సిబ్బంది కావాలి. అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తంగా ప్రభుత్వం ఈ ఏడాది 1,526 ఏఈవో పోస్టులను సృష్టించిందని పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. తాజాగా ఆమోదించిన పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వేగంగా పదోన్నతులు వ్యవసాయ శాఖలో ఉన్నతస్థాయిలో ఏడీఏ, డీడీఏ, జేడీఏ, అడిషనల్ డైరెక్టర్ వంటి కేడర్లో కొత్తగా 150 పోస్టులను మంజూరు చేయాలని, ఆ మేరకు కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట వ్యవసాయశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ పోస్టులను కొత్తగా సృష్టించి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. దీంతో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు చాలామంది ఉద్యోగులకు వేగంగా పదోన్నతులు లభిస్తాయి. వ్యవసాయశాఖలో కొత్తగా ఉద్యోగాలు మంజూరు చేయడంపై తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె.రాములు ఒక ప్రకటనలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనా రంగంలోనూ కొన్ని పోస్టులను మంజూరు చేయాలని వ్యవసాయ కమిషనరేట్ ఉద్యోగుల సంఘం నేత నాగిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన పార్థసారథికి వినతిపత్రం సమర్పించారు. పోచారం కృతజ్ఞతలు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) నియామకానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 753 పోస్టుల్లో కొత్తగా 526 ఏఈవో కొలువులు మంజూరు చేయ డం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖలో 244 పోస్టుల భర్తీ బీసీ సంక్షేమ శాఖలో వివిధ కేటగిరీల్లో 244 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్–4, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్–9, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–229, జూనియర్ అసిస్టెంట్–2 పోస్టుల భర్తీకి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 229 హాస్ట ల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల్లో 166 ప్రీ మెట్రి క్, 63 పోస్ట్మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించినవిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. -
విజయమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలోని 12 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఒంగోలులోని సీతారామ ఫంక్షన్ హాలులో జరిగిన జిల్లా ప్లీనరీకి అధ్యక్షత వహించిన బాలినేని వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్లీనరీలో తీర్మానం చేసిన పలు ప్రధాన సమస్యలను ఆయన ప్రస్తావించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు వేల కోట్లు నిధులిచ్చి నిర్మాణం సాగిస్తే... చంద్రబాబు సర్కారు మొక్కుబడిగా కూడా నిధులివ్వక ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాట్ల పట్ల చంద్రబాబు సర్కారు విముఖతతో ఉందని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పా టు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని బాబు సర్వనాశనం చేశాడు: పార్థసారథి ఎన్టిఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి పార్థసారథి విమర్శించాడు. మహానాడు వేదికపై ఎన్టిఆర్ కుటుంబాలెవ్వరినీ లేకుండా చేశాడన్నారు. నారాయణ, గంటా వియ్యంకులైన మంత్రి పదవులిచ్చిన బాబు ఎన్టిఆర్ కుటుంబ సభ్యులకు పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: అంబటి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు పతనం ఆరంభమైందన్నారు. ఆయన సమావేశాలు పెట్టిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలనలో బాబు జనాన్ని మోసగించటం తప్ప ఏమి చేయలేదన్నారు. ఆయన కుమారుడికి మైక్ ఇస్తే ఎప్పుడు మేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఈ మధ్య కాలంలో జగన్ను పొగిడి టీడీపీని తిడుతున్నాడని అంబటి ఎద్దేవా చేశారు. విజయమే లక్ష్యంగా పని చేద్దాం: గోవిందరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశంలో పార్టీ ప్లీనరీకి వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కె రోజా, జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి పార్థసారధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, శివప్రసాద్రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, పిడ తల సాయికల్పనారెడ్డి, బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్త వరికూటి అమృతపాణి నియో జకవర్గ సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్, వరికూటి అశోక్బాబు, గొట్టిపాటి భరత్, తూమాటి మాధవరావు, ఐవీ రెడ్డి, సామాన్యకిరణ్, యడం బాలాజీ, ఒంగోలు నగరాధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు శింగరాజు వెంకట్రావు, చుండూరి రవి, కెవి రమణారెడ్డి, షేక్ సుభాని, సీనియర్ నాయకులు అక్కిరెడ్డి, వై.నాగరాజు, బడుగు కోటేశ్వరరావు, వరికూటి కొండారెడ్డి, పోకల అనురాధ, రమణమ్మ, వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, జిల్లా, నగర నాయకులు కెవి ప్రసాద్, గంటా రామానాయుడు, జజ్జర ఆనందరావు, ఓబుల్రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, గంగాడ సుజాత, బడుగు ఇందిర, చిన్నపురెడ్డి అశోక్రెడ్డి, జాజుల కృష్ణ, కాకుమాను సునీల్రాజ్, ధూళిపూడి ప్రసాద్, మీరావళి, వల్లెపు మురళి, గోవర్ధన్రెడ్డి, పటాపంజుల అశోక్, పామూరు రమణారెడ్డి, డేవిడ్, కాకుమాను రాజశేఖర్, గొర్రెపాటి శ్రీను, కోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజానాయకుడు కాదు.. : ఎంపీ మేకపాటి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాడన్నారు. ఆయన మరణంతో వెలిగొండ కుంటి నడక నడుస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రజానాయకుడిగా ఉండవలసిన నాయకుడు కాదని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బిడ్డనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మేకపాటి విమర్శించారు. జగన్ సీఎం అయితేనే వైఎస్ సువర్ణ పాలన..: ఎంపీ వైవీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే దివంగత వైఎస్ సువర్ణ పాలన తిరిగి వస్తుందని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. పాలన మొత్తం అవినీతిమయమైందని విమర్శించారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీని గంగలో కలిపాడన్నారు. మిరప రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఎంపీ చెప్పారు. జులై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీలో పార్టీ దశ, దిశ నిర్దేశించటం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టును వెంటనే ప్రకటించాలన్నారు. రూ.40 వేల కోట్లతో 14 వేల ఎకరాల్లో కనిగిరి నిమ్జ్ను ప్రకటించిన ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో 3,500 కోట్లు నిధులిచ్చారన్నారు. జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉన్న ఫ్లోరైడ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసినట్టు గుర్తుచేశారు. ఒంగోలు కార్యకర్తలు పవర్ఫుల్ : రోజా ఒంగోలు గిత్తలే కాదు... ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పవర్ఫుల్ అని నగరి ఎమ్మెల్యే పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కె రోజా కితాబిచ్చారు. కార్యకర్తలు అధికారం పోయిందన్న బాధను విడనాడాలన్నారు. వైఎస్, జగన్పై ఉన్న అభిమానాన్ని తట్టి లేపాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్ జిల్లాకు వెలిగొండ, రిమ్స్, మెడికల్ కాలేజీతో పాటు పలు అభివృద్ధి పనులు చేశాడన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు మేలు చేశాడన్నారు. రాజన్న రక్తం, రాయలసీమ పౌరుషం జగనన్న సీఎం కావాలన్నారు. జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు గంగలో కలిశాయని విమర్శించారు. సీఎంగా ఉన్న కొడుకును గెలిపించుకోలేక అడ్డదారిని మంత్రిని చేసుకున్నాడని విమర్శించారు. బాబు మూడేళ్ళ పాలనలో ఒక్క పరిశ్రమ లేదన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అంటూనే ఆంధ్రాకు చంద్రబాబు బ్యాండ్ వేశాడన్నారు. జనం బాబుకు బ్యాండ్ వాయించే రోజు దగ్గర పడిందన్నారు. రాష్ట్రాన్ని వైఎస్ వ్యవసాయం నెం.1 చేస్తే చంద్రబాబు ఆత్మహత్యల్లో నెం.1 చేశాడని విమర్శించారు. వైఎస్ హయాంలో 48 లక్షల గృహాలు కడితే, చంద్రబాబు ఒక్క ఇల్లు కట్టలేదని రోజా విమర్శించారు. -
ట్రినిటీ పార్థసారథి, సువిశాల్ శర్మకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణం కేసులో ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పార్థసారథికి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ నిరాకరించ డంతో నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ ఆర్కె అగర్వాల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిం చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, కేటీఎస్ తులసి వాదనలు వినిపిస్తూ.. సివిల్ లిటిగేషన్ కేసును క్రిమినల్ లిటిగేషన్ కేసుగా మార్చడం తగదని చెబుతూ.. గతంలో పలు కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. ఈ కేసులో ఫోర్జరీ జరగలేదని, ప్రభు త్వానికి నష్టం జరిగి ఉంటే సంబంధిత భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని వివరించారు. అయితే ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు వివరణ ఇచ్చా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా ఉల్లంఘనలు జరిగి ఉంటే పెనాల్టీ విధింపునకు రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నిబంధనలు ఉన్నాయని వివరించారు. తమ వాదనలతో ఏకీభవించిన ధర్మా సనం నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ కింది కోర్టు షరతులు వర్తిస్తాయని పేర్కొన్నట్లు రవిశంకర్ మీడియాకు తెలిపారు. -
భూ కుంభకోణం నిందితులకు హైకోర్టు షాక్
- పార్థసారథి, శర్మకు బెయిల్ నిరాకరణ - భూమి మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం - దానిని ఆక్రమణదారుల నుంచి కాపాడాలి - దర్యాప్తు కీలక దశలో ఉంది.. కాబట్టి బెయిల్ సాధ్యం కాదు - మియాపూర్ భూ కుంభకోణంపై తేల్చి చెప్పిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితులుగా ఉన్న ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల కుంభకోణంలో పిటిషనర్లకు పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు రూ.700 కోట్ల విలువైన భూములతో ముడిపడి ఉందన్నారు. భూమి మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరమని, దానిని దురాక్రమణదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. అంతేకాక పిటిషనర్లకు చెందిన కంపెనీలు నిజమైనవా? లేక డొల్ల కంపెనీలా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి, శర్మలకు కూకట్పల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో పిటిషనర్లకు బెయిలిస్తే వారు మరిన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇది పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్న పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసుతో రూ.700 కోట్ల విలువైన భూములు ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదంటూ వారి పిటిషన్లను కొట్టేశారు. -
విత్తనోత్పత్తితో రైతుకు మేలు
- దేశంలోనే తొలిసారి రాష్ట్రం నుంచి విత్తనాల ఎగుమతి - జొన్న విత్తనాల ఎగుమతిని ప్రారంభించిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పార్థసారథి మేడ్చల్ రూరల్: అంతర్జాతీయ ప్రమాణా లతో ఉత్పత్తి చేసిన విత్తనాలను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం గర్వించదగ్గ విషయమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పార్థసారథి అన్నారు. మేడ్చల్ మండలం ఎల్లంపేట్లోని హైటెక్ సీడ్స్ ఇండియా సంస్థ నుంచి సుడాన్కు తెలంగాణ విత్తన సంస్థ ధ్రువీకరించిన జొన్న విత్తనాలను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ..విత్తనోత్పత్తి వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చే దిశగా వ్యవసాయశాఖ, విత్తన సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. విత్తన ఎగుమతి వల్ల ఆహార పంటలకు వచ్చే ధర కంటే రెట్టింపు లాభాలు గడించవచ్చన్నారు. విత్తనోత్పత్తి వల్ల దేశానికి, రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్, అసోసి యేట్ డైరెక్టర్ కిషన్రావు, మండల వ్యవసా యాధికారి శైలజ, రాష్ట్ర సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శి నిరంజన్, హైటెక్ సీడ్స్ కంపెనీ ఎండీ మెహినుద్దిన్ హసన్ హరూన్, రీసెర్చ్ విభాగం డైరెక్టర్లు ఎస్కే గుప్తా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన విధానంపై జర్మనీతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విత్తన విధానం తయారు కోసం ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఒక నిర్ధిష్ట విధానం తప్పనిసరని భావించింది. దీనికోసం జర్మనీ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జర్మనీ, తెలంగాణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. హైదరాబాద్లో ఆదివారం ముగిసిన సేంద్రీయయ వ్యవసాయం జాతీయ సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, ఇండో–జర్మన్ కోఆపరేటివ్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ టీమ్ లీడర్ ఎక్కెహర్డ్ ష్రాడర్లు సంతకాలు చేశారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడున్న అవకాశాలు, బలాలు, బలహీనతలు వాటన్నింటిపైనా జర్మన్ బృందం అధ్యయనం చేస్తుందని పార్థసారధి వివరించారు. అనంతరం వారు నివేదిక ఇస్తారని, ఆ ప్రకారం విత్తన విధానాన్ని, కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తామన్నారు. ఇప్పటికే జర్మన్ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తున్నారన్నారు. అలాగే ఈ రెండ్రోజుల సదస్సులో జర్మనీలో సేంద్రీయ వ్యవసాయం, తనిఖీ, ధ్రువీకరణ , సేంద్రియ ఉత్పత్తుల సరఫరా, చైన్ యాజమాన్యం, జర్మనీలో సాంకేతిక ప్రమాణాలు, సేంద్రియ వ్యవసాయంలో పరాన్నజీవుల పాత్ర, జర్మనీలో సేంద్రీయ విత్తన ఉత్పత్తి, సహకార వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సేంద్రియ వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లు ఇలా అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. 13 రాష్ట్రాలకు చెందిన విత్తన ధ్రువీకరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, ఐదు రాష్ట్రాల వ్యవసాయ విద్యాలయాల ప్రతినిధులు, ఐకార్ శాస్త్రవేత్తలు ఐదుగురు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, రైతులు, సీడ్ మన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా రెండ్రోజులపాటు పీపుల్స్ప్లాజాలో సేంద్రియ ఉత్పత్తుల మేళా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చివరి రోజు సదస్సులో పార్థసారధి మాట్లాడుతూ వ్యవసాయరంగం సేంద్రియ వ్యవసాయం వైపు నడవాలన్నారు. గత పదిహేనేళ్లలో కేన్సర్ విపరీతమయిపోయిందన్నారు. జర్మనీలో ఎంతో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. -
సేంద్రియ వ్యవసాయమే మేలు
- రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి - ప్రకృతి వ్యవసాయం, సుస్థిర సాగు పద్ధతుల వైపు అడుగులు వేయాలి - రసాయనాలతో మానవాళికి ముప్పు - ప్రారంభమైన జాతీయ సేంద్రియ సదస్సు సాక్షి, హైదరాబాద్: రసాయనాలు వాడే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాతావరణం. ప్రజారోగ్యం, భూసారం దెబ్బతింటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ఉండే ఆధునిక సాగుపద్ధతుల పోకడ వల్ల మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందువల్ల సమగ్ర వ్యూహా లతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘పంటల సాగు–సేంద్రియ ధ్రువీకరణ’ అంశంపై శనివా రం ఇక్కడ జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం, సుస్థిర సాగు పద్ధతుల వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయానికి రాష్ట్రంలో విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తిని పరిమాణం వైపు నుంచి చూశామని, ఇప్పుడు నాణ్యతవైపు నుంచి చూడాల్సిన అవసరముందన్నారు. తక్కు వ వ్యయంతో ఎక్కువ ఫలితాలు సాధించాలన్నారు. ఉత్పాదకత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగేందుకు ‘ఐకార్’ ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిందన్నారు. కేంద్రం పరంపరాగత్ కృషి వికాస్ యోజన పేరుతో సేంద్రియ వ్యవసాయానికి ఊతమిస్తోందన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు శాస్త్రవేత్తల పరిశోధన తోడుకావాలన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవ మనుగడకు సేంద్రియ వ్యవసాయం ఒక ముందడుగు అవుతుందన్నారు. మనం సరైన ఆలోచనలు చేయకపోతే ఈ భూగోళం ఇంకో వందేళ్లు బతకడానికీ పనికిరాదన్న స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలపై ఆలోచన చేయాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు మాట్లాడుతూ, విద్యార్థుల పాఠాల్లో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మాట్లాడుతూ చిన్న రైతులకు మేలు కలిగేలా సేంద్రియ సాగు పద్ధతులు ఉండాలన్నారు. నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ఫ్లాజాలో ప్రారం భమైన ఆర్గానిక్ మేళాలో ఆది వారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 వరకు 2 ఫుడ్ కోర్టులు, 40 సేంద్రీయ స్టాళ్లు ప్రజల కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ల్యాప్టాప్ల కోసం వ్యవసాయశాఖ కసరత్తు
- ఐటీ అధికారులతో పార్థసారథి చర్చలు - 500 ఏఈవో ఉద్యోగాల భర్తీకి మొదలైన ప్రక్రియ సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయాధికారులందరికీ ల్యాప్టాప్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ తక్షణమే రంగంలోకి దిగింది. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో చర్చించారు. అధిక సామర్థ్యం గల 3,500 ల్యాప్టాప్లు తమకు అవసరమని, అందుకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో ప్రభుత్వం అధిక మొత్తంలో ల్యాప్టాప్లు తీసుకున్నందున అదే కంపెనీ ద్వారా తెప్పించాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. అయితే 3,500 ల్యాప్ట్యాప్లను ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చనీ, విడతల వారీగా వాటిని తెప్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. త్వరగా ల్యాప్టాప్లు ఇచ్చి రైతులు, భూముల సమగ్ర సమాచారాన్ని జూన్ 10వ తేదీ నాటికి అందజేయాలని, ఆ సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయాలని సీఎం సూచించినందున ఆగమేఘాల మీద తెప్పించాలని యోచిస్తున్నారు. కార్యాలయ అధికారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకే ఈ ల్యాప్టాప్లు ఇవ్వాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. మరోవైపు సీఎం ఆదేశంతో 500 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ఫైలును వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. ఆ ఫైలును సీఎం ఆమోదానికి పంపిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. మోటార్ సైకిళ్ల కోసం బ్యాంకు రుణం వడ్డీ లేని రుణాలతో ఏఈవోలు అందరికీ మోటార్ సైకిళ్లు ఇస్తానని సీఎం ప్రకటించడంతో ఆ కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ద్వారా ఇప్పించే ఆలోచన ఉన్నట్లు పార్థసారథి చెప్పారు. -
'బాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారు'
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదువలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలోని ధర్నా చౌక్లో శుక్రవారం వైఎస్సార్పీసీ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారధి అన్నారు. రాజ్యంగం పై గైరవం ఉంటే పార్టీ మారిన నేతలతో రాజీనామ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు వామపక్షాలు సైతం తమ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నాయి. -
‘అలక నేతలకు చంద్రబాబు చెబుతున్నదదే’
విజయవాడ: వైఎస్ జగన్ను, తమ పార్టీని బలహీనం చేయాలని ఏపీ కేబినెట్ విస్తరణ చేసినట్టుందని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేసేందుకు కాదు, జగన్ ను టార్గెట్ చేసేందుకే మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినట్టుగా ఉందని పేర్కొన్నారు. అలక వహించిన టీడీపీ నాయకులకు చంద్రబాబు అదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ జీర్ణించుకోలేక, ఏదోరకంగా దెబ్బ తీయాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా తమ అనుకూల మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం ప్రజాస్వామ్యబద్దమేనా అని పార్థసారధి ప్రశ్నించారు. గవర్నర్ ప్రమాణం చేయించింది టీడీపీ ఎమ్మెల్యేలతోనా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతోనా అని అడిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించే అవకాశం రాజ్యాంగంలో ఉందా అని నిలదీశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే అడ్డుపడాల్సిన గవర్నర్ ఈవిధంగా చేయడం భావ్యం కాదన్నారు. ఈ మూడేళ్లు ప్రతిపక్షాన్ని, జగన్ మోహన్ రెడ్డిని బలహీనం చేయాలని ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. -
'ఎల్లో మీడియాతో విషం చిమ్ముతున్న ప్రభుత్వం'
పామర్రు(కృష్ణా జిల్లా) : ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎల్లోమీడియాతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడం విధిగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక విష్ణాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. పార్థసారధి మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసే చర్యల్లో భాగంగా అనేక కంపెనీల్లో చేపడుతున్న పరిశీలనలను జగన్ కంపెనీల్లో భాగస్వామ్యం అనే అర్ధం వచ్చే విధంగా ఎల్లో పత్రికల్లో వార్తలు రావడం విచాకరంగా ఉందన్నారు. ఈడీ సంస్థ ఎక్కడా జగన్ సంస్థలకు సంబంధం ఉందని తెలుపలేదన్నారు. కానీ ఎల్లో మీడియాలో వైఎస్ జగన్కు చెందిన రాజేశ్వర్ సంస్థ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తోందని వచ్చిన వార్తలు పచ్చి అబద్ధాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీడియా వాస్తవాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాకే క్యాబినెట్లోకి అనుమతించాలని అన్నారు. -
ఆన్లైన్లో వ్యవసాయ ఉత్పత్తులు
వ్యవసాయ శాఖ కార్యదర్శి సాక్షి,హైదరాబాద్: వినియోగదారుల అవ సరాలు గుర్తించి వారికి అనుగుణంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సర సమైన ధరలకు అందుబాటులోకితెస్తే వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పారు. ప్రస్తుతం చాలామంది సేంద్రియ ఉత్పత్తులు కోరుకుంటున్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా అందిస్తే సేంద్రియ వ్యవసాయం పురోగమిస్తుందన్నారు. పీపుల్స్ప్లాజాలో ‘మేనేజ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఔత్సాహిక వ్యవసాయ పారిశ్రామికవేత్తల సదస్సు గురువారం ముగిసింది. వ్యవసాయంలో సాం కేతికత పెరగడం ద్వారా దిగుబడి 4 రెట్లు పెరిగిందని పార్థసారథి చెప్పారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన 125 అగ్రి స్టార్టప్స్ పాల్గొన్నాయన్నారు. వినూ త్నమైన ఆలోచనలతో ముందుకొచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సుజిత్ కుమార్, మేనేజ్ సంస్థ డైరెక్టర్లు శర్వానంద్, చంద్రశేఖర్, వీపీ శర్మ పాల్గొన్నారు. -
ఏపీలో రాక్షస పాలనకు నేడు నిరసనలు
-
ఏపీలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా నేడు నిరసనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు రాక్షస, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 2వ తేదీన మండల కేంద్రాలన్నింటి లోనూ నిరసనలు, ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, ఎం.అరుణ్కుమార్ బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. బాధితులను పరామర్శించడానికి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దుర్ఘటన స్థలానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు తెలుసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాల్సిన ప్రభుత్వం, జగన్పై కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపిందన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర అంతా జరిగిందని, అందుకు తాము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షంపై కొనసాగుతున్న ఈ దమననీతిని ప్రజలంతా ప్రశ్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని చోట్లా నిరసనలు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత పరామర్శకు వెళితే కేసులా? బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్పై అక్రమంగా కేసులు బనాయించడం ఏ తరహా ప్రజాస్వామ్యమని పార్థసారథి ప్రశ్నించారు. అసలు జగన్ మంగళవారం ఆసుపత్రిలో ఏం అడిగారో తెలియజేసేందుకు పార్థసారథి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. తొలినుంచి రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా జగన్ అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్న సంగతి గుర్తుచేశారు. -
చీర లాగేసి.. కిందపడేసి..
వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం పెనుగులాడి.. కేకలు వేసి తప్పించుకున్న మహిళ భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు పెనుకొండ : రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అధికారం అండ చూసుకుని తాము అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అయితే వీరి దౌర్జన్యకాండ మరీ మితిమీరింది. ఇటీవల కూడేరు మండలం జల్లిపల్లిలో తమ మాట వినలేదన్న చిన్న కారణంతో ఓ మహిళను నడి వీధిలో జుట్టు పట్టుకుని ఈడ్చేని చెప్పు కాళ్లతో తన్నిన వైనం మరచిపోక ముందే రొద్దం మండలంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఎమ్యెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం బొక్సంపల్లికి చెందిన వివాహిత ఈ నెల 2వ తేదీన ఎల్జీబీ నగర్ సమీపంలోని తన మామిడి తోటకు కాపలాగా వెళ్లింది. భర్త వెంట రావడం ఆలస్యమైంది. (చదవండి : ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం ) ఈ విషయాన్ని గమనించి అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ కార్యకర్త గొల్ల వెంకటేశులు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో చీరను లాగేసి, కిందపడేసి పట్టుకుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి ఆమె శతవిధాలా ప్రయత్నించింది. పెనుగులాడుతూ ‘అదో నా మొగుడు వస్తున్నాడు..’ అంటే ‘నీ మొగుడేమైనా పరిటాల రవి అనుకున్నావా..’ అంటూ బలవంతం చేశాడు. ‘త్వరగా రా..’అంటూ గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి ద్విచక్ర వాహనంలో పారిపోయాడు. ఈ విషయమై బాధితురాలు శనివారం భర్తతో కలిసి రొద్దం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంకటేశులుపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు దిశానిర్దేశం లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఇది బడ్జెట్లా గాక బిజినెస్ మోడల్లా ఉందని విమర్శించారు. గురువారం విజయవాడలో పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరుణ్ జైట్లీ తీవ్ర నిరాశ కలిగించారని అన్నారు. బడ్జెట్ బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ల ప్రస్తావన లేదని, అమరావతికి రైల్వే కనెక్షన్ ఏదని నిలదీశారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగకపోయినా చంద్రబాబు, టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారని విమర్శించారు. యువత జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు భ్రమలు కల్పించడం మానుకోవాలని పార్థసారథి హితవు పలికారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
-
ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఏదీ?
కేంద్ర బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ నేత కొలుసు పార్థసారథి మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2017–18 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థ సారథి విమర్శించారు. జార్ఖండ్, బిహార్ గురించి మాట్లాడిన జైట్లీ.. హోదా కోసం ఉద్యమించిన ఏపీ ప్రస్తావన తేకపోవడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. అమరావతికి రైల్వే లైన్ల విషయం కూడా లేదన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పావలా వడ్డీకే రుణా లు ఇస్తామని చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా, రాష్ట్రంలో ఈ పథకం దుర్వినియోగం అవుతోందన్నారు. అంకెల గారడీ..: మోదీ ప్రధాని అయ్యే నాటికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 183.5గా ఉంటే నవంబర్ 2016 నాటికి 181.2కు పడిపోయిందని పార్థసారథి వివరించారు. 2015–16లో రూ.35.41 లక్షల కోట్లు ఉన్న గ్రాస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ 2016–17లో రూ.35.30 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడీపీ 7.1 శాతం నమోదు అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది కేవలం అంకెల గారడీగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారన్నా రు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావ డం వల్ల 17 శాతం రెవెన్యూ పెరిగిందే తప్ప అది ప్రభుత్వ గొప్పదనం కాదని చెప్పారు. బడ్జెట్ బాగుందని బల్లలు చరిచిన టీడీపీ నేతలకు ఏం కనిపించిందో అర్థం కావడం లేదన్నారు. వీరి వల్లే ప్రత్యేక హాదాకు బ్రేక్ పడిందన్నారు. -
బాబూ.. పోలవరం కల ఎప్పుడు కన్నావ్?
- 2004, 2009లో టీడీపీ మేనిఫెస్టోలో దీన్ని ఎందుకు చేర్చలేదు? - నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరితే ప్రాజెక్టును అడ్డుకున్నట్టా? - వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం మానుకోండి - వైఎస్సార్సీపీ నేతలు కన్నబాబు, కొలుసు పార్థసారథి సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కల సాకారం తన జీవితాశయంగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు కు ఆ కల ఎప్పుడు వచ్చిందో చెప్పాలని తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. మంగళవారం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. తెలుగు ప్రజల వందేళ్ల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు టి.అంజయ్య హయాంలో బీజం పడితే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆచరణలోకి వచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వాటిని పక్కన పెట్టి పోలవరం తన కలగా చెప్పుకుంటున్న బాబు 2004, 2009లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కేవలం రూ.1,981 కోట్ల ‘నాబార్డు’ రుణం వస్తే దానిని అసాధారణ విజయంగా పేర్కొంటూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నబాబు తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆ విషయంలో విభజన చట్టంలోనే ఉంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్న విషయం రాష్ట్ర విభజన చట్టంలోనే స్పష్టంగా ఉందని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఏపీకి అప్పగించాక అంచనా వ్యయం రూ.16,010.45 కోట్ల నుంచి రూ.40,351.65 కోట్లకు పెరిగిందని.. ఈ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంటుందా? అనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతుంటే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడం.. వాస్తవాలను పక్కదోవ పట్టించడం.. బాబూ! ఇదీ నీ నైజం.ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టిన రీతిలోనే పోలవరం విషయంలోనూ మోసం చేస్తున్నావు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సాక్షి పత్రిక నీ మోసాలను.. ఎండగడుతుం డటాన్ని నీవు భరించలేకపో తున్నావు’’ అంటూ ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టు లు.. ప్రధానంగా బహుళార్థక సాధక ప్రాజెక్టు, రాష్ట్ర వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు, కమీషన్ల కోసం పాల్పడుతున్న కక్కుర్తి విధానాలపై వారు పలు ప్రశ్నాస్త్రాలను సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. -
ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు
-
పెద్ద నోట్ల రద్దుతో ఏం సాధించారు?
చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేత పార్థసారథి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తన సలహాతోనే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దాని వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎదురయ్యే పర్యవసానాలను అసలు ఆయన ముందుగా అంచనా వేశారా? అన్నది చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట చేతికొచ్చినా ఒక్క బస్తాను కూడా రైతులు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పు కోసం పాకులాడుతున్నారన్నారు. టీడీపీలో సీనియర్ నేతలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నారని, వచ్చే ఏడాదిలో వారు క్యూ కట్టే అవకాశం ఉందని ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు అన్నారు. నోట్ల రద్దుతో వ్యవసాయం కుదేలు: నాగిరెడ్డి పెద్ద నోట్ల రద్దుతో ముందుగా కుదేలైంది వ్యవసాయ రంగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన దయ్యబట్టారు. -
పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం
- వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజం - ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యానికి నిరసనగా 9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల9న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. పేదలకు వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్కు ధన్యవాదాలు.. పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందాలని వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పార్థసారథి మండిపడ్డారు. పేదల వైద్య పథకం ఆరోగ్యశ్రీలో కూడా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. రోగులకు చేసే దాదాపు 60 రకాల పరీక్షలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి అవసరం లేకపోయినా ఆ పరీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి దాదాపు రూ.వెయ్యి కోట్లు కేటారుుంచాల్సిన అవసరం ఉందని తీర్మానం చేసినా కేవలం రూ. 520 కోట్లు కేటారుుంచా రని, అయినా.. ఆ సొమ్ము విడుదల చేయకుండా ఆసుపత్రుల యాజమాన్యాన్ని, రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఈ నెల 3న వైఎస్ జగన్.. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖతో ప్రభుత్వం రూ. 575 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చిం దన్నారు. పేదల కోసం లేఖ రాసి ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి నిధులు విడుదల చేరుుంచినందుకు వైఎస్ జగన్కు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు చేతగాని తనం.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతగానితనంతో కృష్ణా జలాల మీద హక్కులు కోల్పోవడం వాస్తవం కాదా అని పార్థసారథి ప్రశ్నించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టా ఎదుర్కొంటున్న సమస్యలకు టీడీపీ కారణమన్నారు. వాస్తవాలు తప్పుదోవపట్టిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పిచ్చిగా మాట్లాడితే ప్రజలే దేవినేని ఉమను చెప్పు తీసుకొని కొడతారని హెచ్చరించారు. -
ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా!
మంత్రి దేవినేనికి వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించే దమ్ముందా! అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీకి సవాలు విసిరింది. పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీ నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాల్గొన్న సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక మంత్రి దేవినేని ఉమా పాచినోటితో నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజంగా అధికారపార్టీ నేతలకు దమ్ముంటే నిజారుుతీగల పోలీసు అధికారులతో ఇడుపులపాయలోని ప్రతి అంగుళం వెతుక్కోవచ్చని, అక్కడేమీ దొరక్కపోతే సీఎం చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల స్థాపనకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అరుుతే దివీస్ ఫార్మాకోసం అమాయక రైతులనుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవడాన్ని ప్రతిఘటిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో తలపెట్టిన మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తొలుత అడ్డుకున్నది టీడీపీ ఎమ్మెల్యేలేనన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నారు. ప్రజలంతా ఉద్యమిస్తుంటేనే వారికి మద్దతుగా జగన్ నిలిచారన్నారు. దివీస్ ఫార్మా బాధితులకు మద్దతివ్వడానికీ ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉండటమే కారణమన్నారు.సముద్రం సమీపంలో నిర్మించాల్సిన ఫ్యాక్టరీలను జనావాసాలమధ్య నిర్మిస్తే వారి బతుకులు ఏమైపోవాలన్నారు. ఫార్మాసిటీలో భూముల ధరలు అధికంగా ఉండటంతో భయపడి.. తొండంగి మండలం దానవారుుపేటలోనైతే కారుచౌకగా రైతుల భూములను కొట్టేయవచ్చనే ఉద్దేశంతోనే బాబు దివీస్ స్థాపనకు మద్దతుగా నిలిచారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి రైతులనుంచి రౌడీరుుజంతో భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారన్నారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటైతే 250 హేచరీస్ పరిస్థితి ఆగమ్యగోచరమవుతుందని, వాటిపై ఆధారపడి జీవిస్తున్న 33 వేలమంది రోడ్డున పడతారన్నారు. -
ఉల్లి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఈ నెల 24 వరకు బంద్ ప్రకటించడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, అనుబంధశాఖల కార్యదర్శి పార్థసారథి తెలి పారు. గురువారం మలక్పేట మార్కెట్ ఉల్లి కొనుగోలు ప్రక్రియను మార్కెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మీబారుుతో కలసి పరిశీలించి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో పార్థసారథి భేటీ అయ్యారు. రైతుల నుంచి రూ.8 సహేతుకమైన ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రరుుస్తుందని ఆయన తెలిపారు. రైతులకు చెక్కులు, ఆన్లైన్, ఆర్జీటీఎస్ ద్వారా చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని మార్కెట్ యార్డులు తెరిచే ఉంచటంతోపాటు స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సంప్రదించి క్రయవిక్రయాలు జరిగేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, మార్కెట్యార్డు కార్యదర్శి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
అడ్డంగా దొరికి నీతులా?
చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వీడియో, ఆడియోల సాక్ష్యంగా అడ్డంగా దొరికిపోయినా పదవికి రాజీనామా చేయని ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. నల్లడబ్బుతో అడ్డంగా దొరికిపోయి ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు, పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. బొగ్గు నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు, రాజధాని భూముల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల వరకు.. ప్రతీ అంశంలోనూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్లో ఉంటానని, తెలంగాణలో టీడీపీని గెలిపించాకే విజయవాడ వెళతానని చెప్పిన కొద్దిరోజులకే... ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక సంబంధమైన అంశాల్లో పోలీసుల విచారణకు గురికావాల్సి వస్తుందన్న భయంతోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. దేవుని సొమ్ముపైన కూడా కన్నేసి సదావర్తి సత్రం భూములను తనవారికి కట్టబెట్టారని చెప్పారు. స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి వేలకోట్ల కమీషన్ దండుకోనున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అతి ధనవంతుడైన సీఎం, అతి ధనవంతుడైన మంత్రిని కలిగింది ఏపీ అని ప్రజాప్రతినిధుల గురించి సర్వే చేసే ఓ సంస్థ చెప్పిన విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే రూ.లక్షన్నర కోట్లు అవినీతి చేశారని పుస్తకం వేసి ప్రధాని, రాష్ట్రపతులతోపాటు అందరికీ సాక్ష్యాలతోసహా సమాచారమిచ్చామని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎలా దోచుకుంటున్నారో.. ఇటీవల ఈనాడు పత్రిక కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రతీ అంశంలోనూ సొమ్ము చేసుకోవడంపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెబుతుంటే దేశ ప్రజలంతా విస్తుపోతున్నారని చెప్పారు. బాబు జీవితమంతా.. అబద్ధాలు, అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. పట్టిసీమ నీటిని రాయలసీమకు అందించానని, రెయిన్గన్స్తో సీమ కరువును పారదోలానని, 2018లో అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తానని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చారేమో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే నిరూపించు... నల్లధనం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న దొంగ ప్రచారాన్ని కట్టిపెట్టాలని, దమ్ము,ధైర్యముంటే నిరూపించాలని చంద్రబాబుకు పార్ధసారధి సవాల్ విసిరారు. నీతి నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే తమ సవాలును స్వీకరించాలన్నారు. హైదరాబాద్లో రూ.పదివేల కోట్ల నల్లధనాన్ని ఎవరు వెల్లడించారో ఆధారాలతోసహా బయటపెట్టాలన్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని చెప్పబోమన్న కేంద్రం ప్రకటనకు విరుద్ధంగా సీఎం దొంగ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకపథకం ప్రకారం జగన్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ తప్పుల్ని, లోపాల్ని ఎవరూ పట్టించుకోకూడదని, ఇతరులవైపు దృష్టి మళ్లించాలనే దురుద్దేశంతోనే ప్రతిపక్ష నేతపై దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఏవోలు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను మినహాయించి మిగిలిన కొత్త జిల్లాల్లో జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)ను వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నియమించారు. వారంతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారని ఆ శాఖ వర్గా లు తెలిపాయి. పాత కొత్త జిల్లాల డీఏవోలుగా సీహెచ్ తేజోవతి (కరీంనగర్), జె.భాగ్యలక్ష్మి (జగిత్యాల), ఆర్.తిరుమల ప్రసాద్ (పెద్దపల్లి), జయదేవి (సిరిసిల్ల), కె.ఎన్.జగదీష్ (రంగారెడ్డి), గోపాల్ (వికారాబాద్), విజయ్కుమార్ (కామారెడ్డి), విజయగౌరి (నిజామాబాద్), సుచరిత (మహబూబ్నగర్), బి.సింగారెడ్డి (నాగర్కర్నూల్), జె.సి.నాగేంద్రయ్య (వనపర్తి), కె.గోవింద్ నాయక్ (గద్వాల), ఝాన్సీలక్ష్మీకుమారి (ఖమ్మం), పి.ప్రతాప్ (కొత్తగూడెం), బి.నర్సింహారావు (నల్లగొండ), యు.జ్యోతిర్మయి (సూర్యాపేట), పి.హరి నాథ్బాబు (యాదాద్రి), ఆశాకుమారి (ఆదిలాబాద్), జె.దాదారావు (మంచిర్యాల), కె.గంగారాం (నిర్మల్), అలీముద్దీన్ (ఆసిఫాబాద్), జి.రాములు (మెదక్), ఏఎం.శ్రీలత (సంగారెడ్డి), ఎం.గోవిందు (సిద్దిపేట), డి.ఉషా (వరంగల్ రూరల్), కె.అనురాధ (జయశంకర్), ఎన్.వీరునాయక్ (జనగాం), బి.చత్రు (మహబూబాబాద్)లను నియమించారు. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఉన్నందున ఆ జిల్లాలకు ఏడీఏ స్థాయి అధికారిని నియమిస్తారు. ఇదిలావుండగా ఉద్యాన, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారులు కూడా జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు. -
'హోదాపై బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి'
-
బంద్ను పక్కదారి పట్టించేందుకే..
అర్ధరాత్రి వైఎస్ విగ్రహం తొలగింపుపై వైఎస్సార్సీపీ నేతపార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై ఆగస్టు 2న రాష్ట్ర బంద్కు వైఎస్సార్సీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. బంద్ను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం విజయవాడలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహ తొలగింపు కార్యక్రమానికి పూనుకుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధానికొచ్చే వారికి రాజశేఖర్రెడ్డి విగ్రహం చూడగానే ఆ రాజన్న పాలన ఎక్కడ గుర్తుకొస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు విగ్రహాన్ని తొలగించారన్నారు. రాజశేఖర్రెడ్డి విగ్రహం నిజంగా ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ఉంటే.. అందరితో మాట్లాడి దానిని తొలగించి ఉండాల్సిందన్నారు. చంద్రబాబుకు నచ్చనివారి విగ్రహమైనా, మనుషులనైనా నిర్మూలించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తొలగించిన విగ్రహాన్ని అదేస్థానంలో పునఃనిర్మించాలని జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అధికారులు అక్కడే పునఃప్రతిష్ట చేయని పక్షంలో ప్రజలే వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పుకుంటారన్నారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్త నిరసన:వైఎస్సార్టీఎఫ్ సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జాలిరెడ్డి, ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
హోదాపై టీడీపీది ద్వంద్వ వైఖరే
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపాటు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో అధికార టీడీపీ తొలి నుంచీ ద్వంద్వ వైఖరినే ప్రదర్శిస్తోందని, ఈ అంశంపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నాటకాలు ఆడకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లు ఇప్పటికే ఉండగా టీడీపీ బుధవారం మరో బిల్లును ఇచ్చి చర్చ కావాలని కోరడం దారుణమని విమర్శించారు. ఇప్పటికే ఉన్న బిల్లుపై ఓటింగ్ జరగాలని పట్టుపట్టాల్సింది పోయి సాంకేతిక కారణాలు చూపుతూ మరో బిల్లును ఇవ్వడం సరికాదన్నారు. అసలు రాష్ట్రానికి అన్యాయం చేయడానికే టీడీపీ అధికారంలోకి వచ్చిందా? అని ధ్వజమెత్తారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వ్యక్తిగత అవసరాల కోసం కేంద్రంతో రాజీపడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, బీజేపీలకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేనే లేదని పార్థసారథి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రధాని వద్దకు తీసుకెళ్లి అడగాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. జీవో 40ని పున:సమీక్షించాలి ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని పున:సమీక్షించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ఓపెన్ కేటగిరీ లో అర్హత సాధించిన మహిళలనూ 33 శాతం రిజర్వేషన్ల కేటగిరీలో చేరుస్తూ జీవో ఇవ్వడం దారుణమన్నారు. మహిళలకు అన్యాయం జరిగేలా జీవో ఇచ్చారని విమర్శించారు. -
ఆలయాలను కూల్చి తెలియదంటారా!
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్ : విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆలయాలు, మసీదులను ఇష్టానుసారం కూల్చేసి ఇపుడు తనకేమీ తెలియకుండా జరిగి పోయిందని చంద్రబాబు మాట్లాడ్డం చూస్తూంటే ఆయన పరిపాలన ఎంత బాధ్యతారహితంగా ఉందో తేటతెల్లమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆలయాలు, మసీదులను పద్ధతి లేకుండా కూల్చి వేశారని చంద్రబాబు ఓవైపు అంగీకరిస్తూనే.. మరో వైపు ఇదేదో టీడీపీ, బీజేపీకి సంబంధించిన వివాదంగా చూపించే ప్రయత్నం చేయటం శోచనీయమన్నారు. ఇది కచ్చితంగా మతపరమైన మనోభావాలపై దాడేనన్నారు. బాబు ఈ విషయం గుర్తించకుండా రోడ్లమీద గుళ్లు అడ్డంగా కట్టవద్దని తానెప్పుడో చెప్పానని అనటాన్ని చూస్తూంటే... కొన్ని దశాబ్దాల కాలం ముందు నుంచీ ఉన్న గుళ్లను, రోడ్లకు అడ్డంగా ఉన్నట్లు ఏ లెక్కన చెబుతారని ప్రశ్నించారు. ఇపుడు దేవాలయాల ధ్వంసంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డెయిరీని మూయించే పనిలో చంద్రబాబు: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ డెయిరీని మూయించే పనిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ డెయిరీని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
అవినీతి కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్
- ఏపీని కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి - వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి మయం చేశారని, ఆయన చేసే ప్రతి పనిలోనూ అవినీతి కంపు కొడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని, పట్టిసీమ, రేషన్ మొదలు నీరు చెట్టు, ఆఖరికి వడదెబ్బతో పడిపోయే వాళ్లకు సహాయం చేసే దాంట్లో కూడా టీడీపీ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా అవినీతి లేకుండా జరగడం లేదన్నారు. చంద్రబాబు 2019 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు స్విస్ చాలెంజ్ పేరుతో దోపిడీకి తెర తీశారని మండిపడ్డారు. నిజాయితీగా రాజధాని నిర్మిస్తున్నామని భావిస్తే.. నిజంగా ధైర్యం ఉంటే రెండేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సీబీఐ ఎంక్వైరీ జరిగితే దాన్ని ఎదుర్కోలేక స్టే తెచ్చుకున్న ఘనుడు బాబు అని దుయ్యబట్టారు. ఎదుర్కొనే దమ్ము లేక అపనిందలు : ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక.. ఆయనపై అపనిందలు వేసి రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని చంద్రబాబుపై పార్ధసారధి నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. -
బాబు గుళ్లనూ వదలడం లేదు
- వైఎస్సార్సీపీ నేత పార్థసారథి - విచక్షణారహితంగా గుడులు, మసీదుల్ని కూల్చేస్తున్నారు సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతోపాటుగా దేవుళ్లకూ స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణారహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాల్ని, మసీదుల్ని కూల్చివేస్తోందని మండిపడ్డారు. గుళ్లనూ చంద్రబాబు వదలడం లేదని, దేవుడంటే ఆయనకు భయం లేదని విమర్శించారు. దేవాలయాలేగాక మసీదులనూ విచక్షణారహితంగా పడగొడుతున్నారన్నారు. ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకు దేవాలయాల్ని, కొన్ని మసీదుల్ని పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకించినా, బంద్ పాటించినా, కలెక్టర్కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలు, మసీదుల్ని కూల్చేసుకుంటూ పోవడాన్ని తమపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం వంటివాటన్నింటితోపాటు రామవరప్పాడు మసీదును పడగొట్టడం దారుణమన్నారు. ఆ ప్రాంతంలోఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చివేశారన్నారు.గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కేంద్రం.. మతసంస్థలు స్పందించాలి దేవాలయాల్ని, మసీదుల్ని పడగొట్టడాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని పార్థసారథి కోరారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీవారు దేవాలయాల కూల్చివేతపైన వెంటనే స్పందించాలన్నారు. మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని కోరారు. అభివృద్ధి వద్దని తామనట్లేదని, అయితే అదేసమయంలో మతభావాల్ని గౌరవించాలని ఆయన అన్నారు. -
జేబు సంస్థల కోసమే స్విస్ చాలెంజ్..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి విజయవాడ (గాంధీనగర్): తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నారని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశంగా చంద్రబాబు భావించడం లేదు. కేవలం లక్షల కోట్లు దోచుకోవడం కోసం, తన మునిమనవడి వరకు కావల్సిన డబ్బు సమకూర్చుకోవడం, తన పార్టీ నేతలఅక్రమ సంపాదనే లక్ష్యంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు కనబడుతోంది’ అని పార్థసారథి విమర్శించారు. ఈ విధానంలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ తేల్చిచెప్పిందన్నారు, అయినా ఎందుకు అనుసరిస్తున్నారో చెప్పాలన్నారు. -
ఏరువాక రోజైనా నమ్మకం కలిగించండి
చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సూచన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమే దండగని మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈరోజు ఏరువాక చేయడం సంతోషించదగ్గ విషయమే గానీ ఇది ప్రచార ఆర్భాటంగా ముగించకుండా రైతులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వ చర్యలు కొనసాగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆకాంక్షించారు. ఆయన సోమవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఏరువాక కేవలం ఏదో టీవీల్లో ప్రచారం కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో రెండెద్దులను చక్కగా అలకరించి నాగలి పట్టుకోవడం కాదు. రైతు నాగలి కర్రు పొలంలో దించిన రోజు నుంచి పంట ఇంటికి వచ్చేదాకా అండగా ఉంటామని ప్రభుత్వం నమ్మకం కలిగించాలి. అంతే తప్ప ఏరువాక అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదు.షో కోసమో, పత్రికలకు, టీవీలకు ఫోజులిస్తే రైతులకు ఏమి ఉపయోగం?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ వ్యవసాయ విధానం ఒక దిక్చూచి లేకుండా సాగుతోందని విమర్శించారు. ‘‘ఎన్నికలప్పుడు గొప్పగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు. ఆ మాట నమ్మి ఓట్లేసినందుకు రెండేళ్ల నుంచి సరైన పెట్టుబడులు లభించక రైతులు అధిక వడ్డీల బారిన పడ్డారు. ఏరువాక ప్రారంభించే సమయంలోనైనా రుణాలన్నీ మాఫీ చేశామని శుభవార్త చెబితే అదే పదివేలు’’ అని అన్నారు. కృష్ణాకాల్వలకు ఎప్పుడు నీళ్లు వదిలేదీ, ఏఏ ప్రాంతాలకు నీరిచ్చేది ప్రభుత్వం ముందుగానే ప్రకటించడం పరిపాటని పార్థసారధి చెప్పారు. ఈ ఏడాది ఆ దాఖాలాలు లేవన్నారు. పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, సబ్సిడీలు విడుదల చేయడంలో చూపుతున్న శ్రద్ధ, ఉత్సాహం రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ చెల్లించడంలో చూపడం లేదని పార్థసారధి అన్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేసి, కొత్తగా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. -
జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్
- చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలందరి దృష్టికి... - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం - రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళ్లాలని పార్టీశ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు - 13న విజయవాడలో పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం - చంద్రబాబు మోసాలపై నేడు పోలీస్ స్టేషన్లలో కేసులు: పార్థసారథి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిరోజైన జూలై 8 నుంచి ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు, అవి అమలు జరగని తీరును ఈ సందర్భంగా పార్టీశ్రేణులు ప్రజలకు వివరించనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశమై ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రతి ఇంటికీ పార్టీ శ్రేణులు వెళ్లాలని, రెండేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అవి అమలు జరగని తీరును ప్రజలకు తెలపాలన్నారు. అదే సమయంలో వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలు అమలైన తీరును వివరిస్తూ... నిరుపేద ప్రజలంతా విద్య, వైద్యం వంటి అవసరాలకు సంబంధించి అప్పట్లో ఎంత నిశ్చింతగా ఉండేవారో గుర్తు చేయాలని కోరారు. జూలై 8న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఆయా శాసనసభా నియోజకవర్గంలోని ఇళ్లన్నింటినీ పూర్తిగా సందర్శించేవరకూ కొనసాగాలని ఆయన సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతున్నది. గడప గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లినపుడు ప్రజల సమస్యలు, స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకునేలా చేయాలని జగన్ నిర్దేశించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని బాధ్యతగల సీనియర్ నేతలు పర్యవేక్షించాలని, జిల్లా నేతలు, స్థానిక నేతలందర్నీ కలుపుకుని సమన్వయంతో ముందుకుపోవాలని సూచించారు. 13న విజయవాడలో సమావేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 13న విజయవాడలో జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యనేతల సమావేశానంతరం నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడిస్తూ... విజయవాడ భేటీలో భవిష్యత్తులో పార్టీ చేయబోయే కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు రాష్ట్రప్రజలకు చేసిన మోసాలు, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తామని వివరించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బాబు మోసాలపై నేడు కేసులు.. బేషరతుగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగమివ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందుకుగాను సీఎం చంద్రబాబుపైన, టీడీపీ ప్రభుత్వం పైనా ఈ నెల 8న అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు పెడతామని పార్థసారథి వివరించారు. ప్రజల్ని మోసం చేసినందుకుగాను ఏఏ సెక్షన్లు వర్తిస్తాయో వాటికిందనే కేసులు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘హోదా’పై చంద్రబాబుది మోసం
వైఎస్సార్సీపీ నేత పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు చేస్తున్న వాదన మోసపూరితమైందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజలూ భావిస్తుంటే.. ‘గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు’గా చంద్రబాబు ఈ వాదన తీసుకురావడం శోచనీయమన్నారు. ఎన్నికలకుముందు రాష్ట్రానికి కనీసం పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అప్పుడెందుకు కావాలని కోరినట్లు, ఇప్పుడు ఏమీ ఒరగదని ఎందుకంటున్నట్లో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాకు 14వ ఆర్థికసంఘం అడ్డుపడుతోందని, నీతిఆయోగ్ అంగీకరించట్లేదని చెప్పడం దారుణమన్నారు. ఇది తెలుగు ప్రజల్ని నిలువునా మోసం చేయడమేనన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పోలికా? ప్రత్యేకహోదా పొందిన 11 రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయనే కొత్త వాదనను చంద్రబాబు చేస్తున్నారంటూ.. అసలు ఈశాన్యరాష్ట్రాలతో ఏపీని ఏరకంగా పోలుస్తారని పార్థసారథి ప్రశ్నించారు. అక్కడి ప్రత్యేక పరిస్థితుల్ని, భౌగోళిక స్థితిని పట్టించుకోకుండా చంద్రబాబు వాటితో ఏపీని పోల్చడమేమిటన్నారు. అవును, మబ్బులు పారిపోతాయ్... తనను చూసి తుపాను పారిపోయిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పార్థసారథి స్పందిస్తూ... నిజమే ఆయన్ను చూసి మబ్బులు పారిపోతాయి.. కరువు, ఎండలు మాత్రమే దగ్గరకు వస్తాయని ఎద్దేవా చేశారు. -
వారం రోజులుగా కరెంట్ లేదు.. తాగునీరు లేదు
బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని 24వ వార్డులో వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మునిసిపాలిటీ చైర్మన్గా ఉన్న టీడీపీ నేత పార్థసారధి 24వ వార్డు నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా తమ ఇబ్బందులను కనీసం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఉంటేనే మోటార్లు పనిచేసి వార్డులోని ప్రజలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుంది. విద్యుత్ లేకపోవడంతో వార్డులో ఉన్న ఒకటి, రెండు బోర్ల దగ్గర మహిళలు బిందెడు నీటి కోసం ఘర్షణ పడాల్సిన పరిస్థితి నెలకొంది. 11కేవీ లైనుపై నుంచి 33కేవీ విద్యుత్ లైను వెళ్లడంతో షార్ట్ అయ్యి విద్యుత్ సరఫరా నిలవడం లేదని అంటున్న ఆ శాఖ అధికారులు సమస్య నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి వార్డు వైపు చూడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కరువు పట్టని సర్కారుపై సమరం
♦ 2న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ధర్నాలు ♦ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి ♦ మాచర్లలో ధర్నాకు హాజరుకానున్న వైఎస్ జగన్ ♦ చంద్రబాబుకు మరొక రకమైన కరువొచ్చింది ♦ బాబొస్తే జాబులు రాలేదు గానీ రాష్ట్రంలో కరువు నెలకొంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రకటించారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కరువుతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబుకు వేరే రకమైన కరువు వచ్చింది. రోజూ ఎంతమంది ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చారో లెక్క చూసుకుని సంతోషపడుతున్నారే గానీ, కరువు దెబ్బకు ఎన్ని ప్రాణాలు పోతున్నాయో పట్టడం లేదు. పశుగ్రాసం, నీటి కొరతతో రోజూ ఎన్ని పశువులు చనిపోతున్నాయనే అంశాన్ని కూడా విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సమస్యలను పక్కదారి పట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు..’ అని పార్థసారథి దుయ్యబట్టారు. కార్యాచరణ ప్రణాళిక ఏదీ? వేసవిలో వచ్చే కరువును ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మార్చి నెలలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతని, కానీ, చంద్రబాబు సర్కారు ఏప్రిల్ ఆఖరులోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రజలను కలలో విహరింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది గానీ, వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్కారు వద్ద ఒక విధానం అంటూ లేదని విమర్శించారు. ‘నిన్న అధికార పార్టీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తారని అన్నారు. కానీ ఈ రోజు కరువును ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు అనంతపురం జిల్లాలో తాగునీరు లేక ప్రజలు, పశువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారో మాత్రం ఆయన చెప్పలేదు..’ అని పార్థసారథి ఎద్దేవా చేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి కరువు ప్రాంతాల్లో పంపిణీ చేసిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి , ఫిరాయింపులను ప్రోత్సహించడానికే పరిమితమైంది తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేదని ధ్వజమెత్తారు. ‘బాబొస్తే జాబులు వస్తాయన్నారు. జాబులు రాలేదుగానీ.. కరువు, వర్షాలు లేని వాతావరణం మాత్రం చూస్తున్నాం’ అని అన్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతిని ఎండగట్టాం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతిని, రాజ్యాంగ ఉల్లంఘనలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న తీరును, అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలసి వివరించడం తప్పు ఎలా అవుతుందన్నారు. అధినేత వైఖరి నచ్చక పార్టీ మారుతున్నామని చెప్పే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేయడం నచ్చడం లేదా? అని ప్రశ్నించారు. -
'విమర్శలు చేసినవారికే ఉత్తమ ర్యాంకులు'
విజయవాడ : టీడీపీ ఫిరాయింపు రాజకీయాలను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి శుక్రవారం తెలిపారు. టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా శనివారం 'సేవ్ డెమోక్రసీ' అనే నినాదంతో కొవ్వొత్తులతో నగరంలో ర్యాలీ చేయనున్నట్లు ఆయన వివరించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసినవారికే చంద్రబాబు ఉత్తమ ర్యాంకులు కట్టబెట్టారని అన్నారు. ఆర్థికమంత్రి యనమల తన స్థాయి మించి విమర్శలు చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెట్టుబడులకు నెదర్లాండ్స్ కంపెనీల ఆసక్తి
నెదర్లాండ్స్ రాయబారితో రాష్ట్ర అధికారులు భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్కు చెందిన పలు కంపెనీలు ఆసక్తి చూపడంతో పాటు పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్అండ్బీ కార్యదర్శి సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం.. భారత్లో నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగాతో సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటీలో కాబా ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రాయల్ హస్కొనింగ్, వుమెన్ ఆన్ వింగ్స్, ఎకోరిస్ తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంతో పాటు ముచ్చర్ల ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర అధికారుల బృందం ఆయా కంపెనీలకు వివరించింది. నీటి యాజమాన్యం, పట్టు పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి, విత్తనాభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, జలమార్గాలు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి ఆయా విభాగాల అధికారులతో సమావేశం కావాల్సిందిగా రాష్ట్ర అధికారుల బృందం ఆహ్వానించింది. -
సర్కారు చూపు.. సేంద్రియం వైపు
♦ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు వ్యవసాయశాఖ నిర్ణయం ♦ కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలని నిర్ణయం ♦ ప్రతీ జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేసే యోచన ♦ కార్యాచరణకు త్వరలో మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్ తర్వాత అధిక ఎరువులు, పురుగు మందులు వాడుతున్న రాష్ట్రంగా ఉండటం.. ఫలితంగా ప్రజల్లో కేన్సర్ వంటి ప్రాణాపాయ సమస్యలు పెరుగుతుండటం.. కేంద్రం కూడా సేంద్రియ సాగు వైపు వెళ్లాలని సూచిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవల సిక్కింలో వ్యవసాయ మంత్రులు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సిక్కింను సేంద్రి య వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించారు. అందువల్ల తెలంగాణనూ సేంద్రీయం వైపు మళ్లించాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. అనుభవమున్న సంస్థకు కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియ సాగు బాధ్యతను అప్పగించే అవకాశముంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్టు: రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సేంద్రియం వైపు రైతులను మళ్లించడం ఆషామాషీ కాదు. అందువల్ల తొలుత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో రెండు మూడు ఎకరాల్లో సేంద్రియ సాగు చేపడతారు. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. ఏకకాలంలో ప్రతీ జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేసి కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియానికి శ్రీకారం చుట్టాలని శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పైలట్ ప్రాజెక్టు ప్రాంతాలను నిత్యం పర్యవేక్షించి అవసరమైన సలహాలిస్తుంది. రైతులకు ప్రోత్సాహకం పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించాక రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా సేంద్రియ సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. అయితే దీనికి పలు అడ్డంకులను అధిగమించాలి. ఇప్పటివరకు రసాయనాలు, పురుగు మందులతో భూమి కలుషితమైంది. వెంటనే సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల వరుసగా మూడేళ్లపాటు దిగుబడులు తగ్గుతాయి. ఇది రైతుకు నష్టంగా పరిణమించనుంది. అందువల్ల ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించి రైతుకు ఆ మూడేళ్లపాటు ప్రోత్సాహకాన్ని ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే రైతులు ముందుకొచ్చి సేంద్రియంపై మక్కువ చూపుతారని అంటున్నారు. దాంతోపాటు సేంద్రియ ధాన్యం, కూరగాయలకు మార్కెట్ వసతి కల్పించకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ వసతికీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఎరువుల వాడకం నిషేధిస్తే... సిక్కింలో మాదిరి తెలంగాణలోనూ భవిష్యత్తులో ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నిషేధించే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకోసం పటిష్టమైన కార్యాచరణ అవసరమని పార్థసారథి చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు రూపొందించే యోచన ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
‘జీవ భద్రత’ పరిష్కరించాకే జన్యుమార్పిడి
♦ దేశ విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం ♦ ఆసియా విత్తన సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: పర్యావరణ, జీవ, ఆరోగ్య భద్రత అంశాలను పరిష్కరించిన తర్వాతే జన్యుమార్పిడి పంటల వాణిజ్యం గురించి ఆలోచించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. విత్తనాన్ని కేవలం వాణిజ్య అంశంగానే కాకుండా దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా చూడాలన్నారు. గోవాలో సోమవారం ప్రారంభమైన ఆసియా విత్తన సదస్సు-2015లో ‘తెలంగాణను భారత విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ విత్తన వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు రైతులకు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విత్తనరంగం అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్కు నిరంతర విద్యుత్ సరఫరా, గ్రామాలను విత్తన కేంద్రాలుగా మార్చేందుకు ప్రాసెసింగ్, రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ప్రపంచానికి హైదరాబాద్ అనుసంధానమైందన్నారు. 400 పైగా విత్తన కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. భారత విత్తన హబ్గా హైదరాబాద్ ఉంటుందన్నారు. దేశ విత్తన భాండాగారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమన్నారు. దేశ విత్తన అవసరాల్లో 60 శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతుందని... 90 శాతం హైబ్రీడ్ విత్తనోత్పత్తి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచే జరుగుతోందని వివరించారు. వ్యవసాయ వర్సిటీలో ప్రత్యేక విత్తన కేంద్రంతోపాటు విత్తన ఎగుమతులు పెంచడానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన విత్తన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో విత్తనోత్పత్తి సాధించడానికి మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, సాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. పాలీహౌస్ల్లో పూలు, కూరగాయల విత్తనోత్పత్తి, ప్రత్యేకించి తెలంగాణ విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. రైతుకు మేలైన జీవనోపాధిగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దేందుకు, లాభసాటి వ్యాపకంగా మార్చేం దుకు కృషిచేస్తున్నట్లు, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. -
కాంట్రాక్టు సేద్యంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవసాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పాల్గొన్నారు. సదస్సులో ప్రస్తావించిన అంశాలను ఆయన శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నాయని... ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడంవల్ల రైతులకు మరింత ప్ర యోజనం కలుగుతుందని పార్థసారథి చెప్పారు. సంబంధిత కంపెనీయే రైతులకు విత్తనాలు అందించడంతోపాటు సాంకేతిక సహకారం, అడ్వాన్సు సొమ్ము చెల్లిస్తుందన్నారు. అందులో పండిన పంటను బైబ్యాక్ ఒప్పం దం ప్రకారం కంపెనీయే రైతులకు సొమ్ము చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే ఐటీసీ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్న విషయాన్ని ఆయన సదస్సులో ప్రస్తావించారు. నిజామాబాద్లో స్పైస్ పార్కు ఏర్పాటు చేస్తున్నందున పసుపునకు సంబంధించి ఆహార, చర్మ సౌందర్య పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కలుగుతుందని పార్థసారథి వివరించారు. అలాగే వరంగల్ జిల్లాలో పండిస్తున్న ఒక ప్రత్యేకమైన మిరప పంట ద్వారా రకరకాల రసాయనాలు ఉత్పత్తి చేయవచ్చని...వాటిని ఔషధాలు, ప్లేవర్స్లలోనూ వాడొచ్చన్నారు. అందులోనూ పెట్టుబడులు పెట్టవచ్చని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు జరుగుతున్నందున అక్కడ పల్ప్ జ్యూస్ పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. గ్రీన్హౌస్పై ప్రభుత్వం కంపెనీలకు తలుపులు తెరిచి ఉంచినా స్పందన కరువైందని పార్థసారథి పేర్కొన్నారు. రాయితీ కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నా కంపెనీలు ముందుకు రాలేదని...దీనిపై కంపెనీలు దృష్టిసారించాలన్నారు. తృణధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని వ్యవసాయ వర్సిటీ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని... ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హోంసైన్స్ కాలేజీలో సహజ రంగులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉందన్నారు. రాష్ట్రంలో అగ్రి బిజినెస్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండదని స్పష్టం చేసిన ఆయన... మూడు, నాలుగేళ్ల తర్వాత సాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందన్నారు. -
‘జన్యుమార్పిడి’ ప్రయోగాలకు పచ్చజెండా!
♦ అనుమతుల కోసం నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో ♦ ఇక బహుళజాతి కంపెనీల ప్రయోగాలకూ రంగం సిద్ధం ♦ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేయడానికి అనుమతులిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థకు జన్యుమార్పిడి పంటలు ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ఇక్కడి నేలల్లో సాగు చేసే వీలుంటుంది. అందుకోసం ఈ కమిటీని ఏర్పాటుచేశారు. వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్గా, డెరైక్టర్ సభ్య కన్వీనర్గా మరో నలుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో ఇక బహుళజాతి కంపెనీలకు కూడా జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు పచ్చజెండా ఊపినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది తిరస్కరణ: జన్యుమార్పిడి ఆహార పంట ప్రయోగాల కోసం బహుళ జాతి కంపెనీల (ఎంఎన్సీ)కు అనుమతి విషయంలో ప్రభుత్వం గత ఏడాది ఆసక్తి చూపలేదు. ఆహార పంటల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని ఆయా కంపెనీలు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే వ్యవసాయశాఖ అప్పట్లో ప్రయోగాలు ఎందుకు? ఏ పంటలపై చేస్తా రు? రైతుకు లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ దేశంలో ఏ లేబరేటరీలో ఏ వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. కానీ ఆ వివరాలను ఆయా కంపెనీలు ఇవ్వలేదు. ఎందుకంటే సాంకేతికంగా చూస్తే అవి ఇక్కడ ప్రయోగించడమే దుష్ర్పరిణామాలకు దారి తీస్తుందనేది అందరికీ తెలిసిందే. కాగా ఎంఎన్సీలు ప్రభుత్వంతో భారీగా లాబీయింగ్ చేసినట్లు తెలిసింది. అందువల్లే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంఎన్సీల వల్లో పడటమే అనుమతి ఇచ్చే విషయంపై కమిటీని ఏర్పాటు చేయడమంటే జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు పచ్చజెండా ఊపడమే. ప్రభుత్వం ఎంఎన్సీలకు అమ్ముడుపోయింది. సేంద్రియ వ్యవసాయంపై ఉపన్యాసాలిస్తూ ఇలా జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వడం పరాకాష్ట. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లినట్లే. సారంపల్లి మల్లారెడ్డి, రైతు నాయకుడు కేవలం కమిటీ వేశామంతే ఉమ్మడి రాష్ట్రంలో కమిటీ ఉండేది. తెలంగాణ వచ్చాక నూతనంగా కమిటీని ఏర్పాటు చేశాం. అంతే తప్ప ఆషామాషీగా అనుమతులివ్వడం కోసం కాదు. జన్యు మార్పిడి ప్రయోగాలకు అనుమతి రాజకీయపర నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
విత్తన భాండాగారంగా రాష్ట్రం
♦ ఆ దిశగా సర్కారు కసరత్తు ♦ రేపటి నుంచి హైదరాబాద్లో జాతీయ విత్తన కాంగ్రెస్ ♦ ప్రారంభ కార్యక్రమానికి సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు మొ దలుపెట్టింది. ఇప్పటికే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అయినా విత్తన ఉత్పత్తి, ఎగుమతి మరింత విస్తృతం చేసి రైతులకు లాభసాటిగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీలు, ఈ రంగంలోని దేశ విదేశీ ప్రముఖులను ఒకచోట చేర్చి ప్రణాళిక రూపొందించనుంది. ఈ మేరకు మంగళ వారం నుంచి ఈ నెల 29 వరకు హైదరాబాద్లో జరిగే జాతీయ విత్తన కాంగ్రెస్లో చర్చలు జరుపనుంది. ఈ సదస్సు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి పది రోజులుగా ఈ పని లో నిమగ్నమయ్యారు. సదస్సుకు దేశవిదేశాల నుంచి 500 మంది శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి కూడా పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. విత్తనరంగంలో వస్తున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞా నం, విత్తన నాణ్యత, రైతుకు లాభసాటిగా తయారుచేయడానికి అనుసరించాల్సిన పద్ధ తులపై సదస్సులో చర్చిస్తారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తయారుచేయాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సదస్సును ఉపయోగించుకోవాలన్నది సర్కారు యోచన. 70 శాతం తెలంగాణలోనే.. ప్రస్తుతం ప్రైవేటు, బహుళజాతి కంపెనీలతో కలుపుకొని దేశంలో ఉత్పత్తయ్యే విత్తనాల్లో 70 శాతం తెలంగాణలోనే తయారవుతాయి. అందులో 62 శాతం ఎగుమతి అవుతాయి. 11 దేశాలకు సరఫరా అవుతున్నాయి. మొత్తం విత్తన ఉత్పత్తిలో ప్రైవేటు వాటా 88 శాతం. ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాటా 12 శాతం. ఏటా హైబ్రీడ్ రకాలకు చెందిన వరి విత్తనం 75 వేల ఎకరాల్లో సాగవుతోంది. కూరగాయలు, సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదు. తెలంగాణలో ఉన్న నేలలు, వాతావరణ పరిస్థితి విత్తన తయారీకి అనుకూలం కాబట్టి ఈ పరిస్థితిని రైతుకు అనుగుణంగా మలచాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడుల వంటి వాటితో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే విత్తనోత్పత్తి కీలకమని వ్యవసాయశాఖ చెబుతోంది. సాధారణ పంటలతో పోలిస్తే దీనివల్ల రెండు మూడు రెట్లు ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. -
దీక్షావేదికపై గళమెత్తిన నేతలు..
గుంటూరు నుంచి సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఆ పార్టీ ముఖ్యనేతలు పాలుపంచుకున్నారు. తమ ప్రసంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటులో తీర్మానం చేశాయి. దేశ ప్రజలు మోదీ నాయకత్వ లక్షణాలు చూసి గెలిపించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలి’ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన ‘బాహుబలి’ సినిమాలో బళ్లాల దేవుడి పాలనను తలపిస్తోందని.. చంద్రబాబు కట్టప్పలా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ప్రజలకు సైతం వెన్నుపోటు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కాలకేయుడులా రాక్షస మూకతో రాష్ట్రంపై దండ యాత్ర చేస్తున్నారని.. వీరి ఆట కట్టించేందుకు జగన్ బాహుబలిలా వస్తున్నారని చెప్పారు. జగన్ దీక్షతో తెలుగుదేశం నేతల వెన్నుల్లో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న దీక్షకు ప్రతిపక్షాలు, వామపక్షాలు, వాణిజ్య సంఘాలు, విద్యార్థుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోందని చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులేనని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. హోదా అనేది ఎవరో వేసే భిక్ష కాదని.. అది మన హక్కని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం చెప్పారు. చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని.. వెంకయ్యనాయుడికి సిగ్గూశరం ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావాలని మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. ప్యాకేజీలు మనకొద్దని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదాతోనే సాధ్యమని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. పార్టీలకతీతంగా మహోద్యమాన్ని సృష్టిద్దామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
భూసేకరణకు వ్యతిరేకంగా 26న జగన్ ధర్నా
-
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 26న జగన్ ధర్నా
విషజ్వరాల బాధితుల్ని ఆదుకోనందుకు నిరసనగా 25న మచిలీపట్నంలో ధర్నా వెల్లడించిన వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. లేకుంటే ఆందోళన తప్పదు హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు కీలకమైన ప్రజాసమస్యలపై వరుసగా రెండు రోజులపాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు చేయనున్నారు. పేద రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధానికోసం వారినుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ ప్రాంతంలో ఈ నెల 26న ఆయన ఒకరోజు ధర్నాకు పూనుకుంటున్నారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరులో విషజ్వరాల బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఈ నెల 25న మచిలీపట్నంలో ఒకరోజు ధర్నా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. భూసేకరణపై రైతుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకెళ్లడంపై జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ ఆందోళన కార్యక్రమాన్ని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 26న భూసేకరణ వ్యతిరేక ధర్నా వేదిక ఎక్కడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బాబు పైశాచికత్వానికి నిదర్శనం.. రాజధాని నిర్మాణంకోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని రైతులనుంచి సమీకరించినట్లుగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మళ్లీ మూడువేల ఎకరాల్ని బలవంతంగా సేకరించాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనమని పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, రైతుసంఘాలు, ప్రజలంతా బలవంతపు భూసేకరణ చేయొద్దని చెబుతున్నా చంద్రబాబు రైతుల్ని ఇబ్బందులకు గురిచేయాలని చేస్తున్నారంటే, అది ఆయన ప్రజా వ్యతిరేక, స్వార్థపూరిత, రాక్షస మనస్తత్వాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. మధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేంటీ? రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ఆహ్వానించిన సింగపూర్, జపాన్ కన్సల్టెంట్లు నిర్దేశిం చిన విధంగా సీడ్క్యాపిటల్లో అసెంబ్లీ, సచి వాలయం ప్రధానంగా ఉంటాయని, వాటి మ ధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేమిటి? అని పార్థసారథి ప్రశ్నించారు. హైదరాబాద్ సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బోలెడన్ని ప్రైవే టు ఆస్తులున్నాయి కదా! అని గుర్తుచేశారు. కాలం చెల్లనున్న ఆర్డినెన్స్ను అడ్డం పెట్టుకుని లాక్కుంటారా? 2013 భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్కు మరో పదిహేను రోజుల్లో కాలం చెల్లనున్న తరుణంలో చంద్రబాబు కత్తిగట్టి దానినే అడ్డం పెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుంటున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే రైతులకు తమ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ప్రకటించారు. కొత్తమాజేరులో విషజ్వరాలు సంభవించినా వాటిని అంగీకరించడానికే ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే మచిలీపట్నంలో ధర్నా చేస్తున్నామని ఆయన తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరుగుతుందన్నారు. -
'బహిరంగ చర్చకు మీరు సిద్దమా?'
-
ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచండి
అధికారులకు పార్థసారధి ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేం దుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం వ్యవసాయశాఖలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్నందున రైతుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు రైతులకు అందజేయాలని కోరారు. బ్లాక్మార్కెట్కు వెళ్లకుండా వాటిని ముందస్తుగా అవసరమైన స్టాకును జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో ఆ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని, ఎరువుల విభాగం డిప్యూటీ డెరైక్టర్ రాములు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం.. వైఎస్ జగన్ విజయం
-
రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ పర్యటన
-
రెండో పంట వేసుకుంటే.. అండగా ఉంటాం
రాజధాని ప్రాంత రైతులకు వైఎస్సార్సీపీ భరోసా సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో కొత్తగా రెండో పంట వేసుకోదలిచే రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి కే పార్థసారధి భరోసా ఇచ్చారు. ఆ ప్రాంతంలో కొత్తగా పంట వేసుకోవడానికి అనుమతి లేదన్న ప్రభుత్వ ప్రకటనతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారికి మద్దతుగా ఈ నెల 13న ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకుల బృందం పర్యటిస్తుందని ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి రెండో రోజు పర్యటన ఉంటుందన్నారు. రాజధాని ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ నియమించిన కమిటీ సభ్యులు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, సజ్జల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్టీ నేతలతో కలిసి పార్థసారధి మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతులను పంట వేసుకోవద్దని ప్రభుత్వం ప్రకటించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్టీ నేతల కమిటీ అక్కడ పర్యటించి రైతుల్లో ధైర్యం నింపుతామన్నారు. -
ఊతమై...
జీవితాంతం తోడూనీడగా ఉండేందుకు అతడు ఆమెతో ఏడడుగులు నడిచాడు. అయితే జీవితాంతం వేధించే ఆరోగ్య సమస్య అతడిని మంచం పట్టేలా చేసింది. కోరి కట్టుకున్న భర్త, చేజారి పోవడానికి సిద్ధంగా ఉన్న తమ కలల సౌధం.. రెంటినీ కాపాడుకోవడానికి ఆమె నేటికీ విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. ‘వరల్డ్ మేరేజ్ డే’ సందర్భంగా ఆ ఆలూమగల అనురాగబంధంపై ఫ్యామిలీస్పెషల్ రిపోర్ట్. : నిర్మలారెడ్డి మృదుల, పార్థసారథి పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరికీ ఇంటర్మీడియెట్ నుంచే పరిచయం. డిగ్రీలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారితే ఇరువైపు పెద్దలు కాదన్నారు. ఇంట్లో నుంచి వచ్చేసి, పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో కాపురం పెట్టారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు పార్థసారథి. మృదుల చేత బి.టెక్, ఎమ్టెక్ పూర్తి చేయించాడు. ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే నిలదొక్కుకోగలం అనే ఆలోచనతో మృదుల ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లు గడిచాయి. కొడుకు పుట్టాడు. పైసా పైసా కూడబెట్టి బ్యాంక్లో లోను తీసుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఆనందంగా గృహప్రవేశం చేశారు. ఊహించని విషాదం అయితే ఈ దంపతుల జీవితంలోకి ఊహించని విషాదం ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్థ సారథి కాళ్లు చచ్చుబడిపోయాయి. డాక్టర్లు గులియన్ బ్యారే సిండ్రోమ్ అన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. ఎప్పటికి నయమవుతుందో తెలియదన్నారు. మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చని అన్నారు. అదే సమయంలో ఉన్నదంతా ఊడ్చి కొనుక్కున్న ఇల్లు వాయిదా కట్టక బకాయి పడి ఉంది. కట్టుకున్న భర్తను, కొనుక్కున్న ఇంటిని, కన్న బిడ్డను.. ఎలా కాచుకోవాలో మృదులకు అర్థం కాలేదు. అన్నీ తానై నడిపించింది అందినచోటల్లా తెచ్చిన అప్పులు, ఆదుకున్న ఆప్తులు.. అంతా పది లక్షల వరకు ఖర్చయింది. అయినా ఫలితమేమీ కనిపించలేదు. ‘ఇంటికి తీసుకెళ్లడమే మేలు’ అన్నారు డాక్టర్లు. భర్త ఉద్యోగం చేసే స్థితిలో లేడు. అతన్ని చూసుకోవడానికి తనూ ఉద్యోగం మానేసే పరిస్థితి. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి, బ్యాంక్ వాళ్లను కలిసి తన పరిస్థితిని వివరించి, జప్తులో ఉన్న ఇంటికి గడువు కోరింది మృదుల. ఆపన్న హస్తం అందించే స్వచ్ఛంద సంస్థలను కలిసి తన పరిస్థితిని వివరించింది. మరోవైపు తనకు ఏమౌతుందో అని మంచంలోనే ఆందోళన పడుతున్న భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తూ ‘ఇంకెంత కొన్ని రోజుల్లోనే లేచి జాబ్కి వెళతారు చూడండి..’ అంటూ రోజూ ధైర్యం చెబుతూ వచ్చింది. ఫిజియోథెరపీ చేయించింది సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితమైన పార్థసారధి మెల్లగా కూర్చోవడం, తర్వాత ఒక్కో అడుగు వేయడం.. మొదలుపెట్టాడు. ఆ అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ- ‘‘మా సాత్విక్ (కుమారుడు) మొదటిసారి నడిచినప్పుడు కూడా నేను అంత ఆనందం పొందలేదు. రోజూ ఫిజియోథెరపీ చేస్తూ, తన ప్రయత్నంతో ఇప్పుడు కర్ర పట్టుకొని నడిచే స్థాయికి వచ్చాడు. పార్థులో ఆ కాస్త మార్పు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మరో అసిస్టెంట్ సాయం తీసుకున్నాను. కాలేజీకి వెళ్లడం, అయిపోగానే ఉరుకులు పరుగుల మీద ఇల్లు చేరడం.. ఐదేళ్లు గా నాకు అలవాటై పోయింది. ‘నా కోసం చాలా కష్టపడుతున్నావురా!’ అంటుంటాడు పార్థు. ‘నాకే ఇలా అయితే..’ అంటాను. నవ్వుతూ చూస్తాడు’’ అంటూ భర్తను కాపాడుకున్న విధం, ఇల్లు చేజారకుండా చేసిన ప్రయత్నాలు, కొడుకు చదువు, తన పై భర్తకు ఉన్న ప్రేమానురాగాల గురించి వివరించింది మృదుల. ‘‘నా ఇంటి దేవత. నా కోసమే తను పుట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే కష్టపెడతానో..’ అంటూ అర్ధాంగి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు పార్థసారథి. కష్టాలెన్ని వచ్చినా తమ బంధాన్ని కాపాడుకోవడానికి తపస్సు చేసే మృదుల లాంటివారిని చూసినప్పుడు వివాహబంధమంత బలమైనది ఇంకోటి ఉండదని అనిపిస్తుంది.