Power generation
-
దగా యాష్..నిఘా ట్రాష్
సాక్షి, పెద్దపల్లి: భారతావనికి ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు పంచుతుంటే, విద్యుదుత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద (యాష్) రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. బూడిదతో ఎన్నిరకాలుగా దందా చేయవచ్చో, అన్నిరకాలుగా అక్రమమార్గాల్లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం కేంద్రంగా యాష్ పాండ్లో జరుగుతున్న అక్రమాలపై ఇంటలిజెన్స్ రిపోర్టు సీఎంవో కార్యాలయానికి చేరుకున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట పడలేదు. దీంతో బూడిద సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. చివరకు గోదావరిఖని పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేస్థాయికి చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నేషనల్ హైవేకి తరలింపు పేరుతో..ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద.. చెరువులో నిర్ణీత స్థాయికి మించితే కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఎనీ్టపీసీ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందులో బూడిదను ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ జాతీయ అవసరాల దృష్ట్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు.. రామగుండంలోని కుందనపల్లిలోని బూడిద చెరువు నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు లోడింగ్, రవాణా ఖర్చులు సైతం ఎన్టీపీసీయే భరిస్తుంది. రవాణా చార్జీలుగా టన్నుకు రూ.1,250 చొప్పున చెల్లిస్తుంది. అంటే ఒక లారీకి రూ.50 వేల వరకు బూడిద రవాణాకు చెల్లిస్తుంది. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్త దందాకు తెర తీశారు. నేషనల్ హైవే పేరిట తరలించే లారీల్లో సగం లారీలను నేషనల్ హైవేల నిర్మాణానికి చేరుస్తూ, మిగిలిన సగం లారీల బూడిదను బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.పాండ్ నుంచి లోడింగ్ అయి బయటకు వచ్చాక వాటికి నంబర్ ప్లేట్లు మార్చి జీపీఎస్ను మరో లారీలో పెట్టడం తదితర జిమ్మిక్కులతో నేషనల్ హైవేకు తరలించాల్సిన బూడిదను.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. దీంతో పక్కదారి పట్టించిన ఒక్కొక్క లారీకి ఎన్టీపీసీ నుంచి రవాణా చార్జీల పేరిట రూ.50 వేలు, ఇటుక బట్టీలకు లారీ బూడిదను రూ.50 వేలకు అమ్మి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బూడిదతో పాటు నిర్వహణ ఖర్చుల పేరిట అక్రమార్కులు డబుల్ ధమాకా పొందుతున్నారు. లోడింగ్ పేరుతో..పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తిలో భాగంగా వెలువడే నీటితో కలిసిన బూడిదను.. బూడిద చెరువులో నింపుతారు. ఆ బూడిదను డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు టన్నుకు రూ.130 చొప్పున 38 ఏజెన్సీలు 15 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద తరలించేలా టెండర్లు ఖరారు చేశారు. కాగా, ఎన్టీపీసీ ఈ టెండర్లను రద్దు చేసి రూ.1కే టన్ను ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. దీంతో 114 మంది ఈ టెండర్లను దక్కించుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారిలో ఐదుగురు.. రాజకీయ బలంతో లోడింగ్ పేరుతో దందాకు తెర తీశారు. లారీల సామర్థ్యాన్ని బట్టి రూ.4,600 నుంచి రూ.9,600 వరకు అక్రమంగా వసూలు చేస్తూ ఇటుకబట్టీలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు వెయ్యి వాహనాల్లో బూడిద తరలిస్తూ రూ.లక్షల్లో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో..బూడిద చెరువులోకి వచ్చి చేరే బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతో పాటు ఇతరత్రా నిర్మాణాలకు ఉచితంగా ఎన్టీపీసీ అందిస్తుంది. కానీ, ఈ బూడిద తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యంతో అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వెయ్యి లారీల చొప్పున సరఫరా అవుతుండటంతో.. అంతే మొత్తంలో బూడిద దందాలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా జిల్లాలో బూడిద పంచాయితీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కారి్మక సంఘం అధ్యక్షుడు కౌశిక్హరి తడిబట్టలతో గోదావరిఖని పోచమ్మ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
100 రోజులుగా.. నిరంతరాయంగా..
సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని యూనిట్–3 తన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) అయిన 2024 నవంబరు 18 నుంచి నిరంతరాయంగా 100 రోజులపాటు విద్యుత్ను ఉత్పత్తిని చేసి సరికొత్త రికార్డును నమోదు చేసిందని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు గురువారం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏపీ జెన్కో నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని ఆయన కొనియాడారు. వాస్తవానికి.. ఏపీ జెన్కో ఈ ఏడాది జనవరి నుంచి రోజుకి 110 మిలియన్ యూనిట్లకు పైగా స్థిర విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ, ఫిబ్రవరి 22న 123 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తితో సరికొత్త రికార్డు నెలకొల్పిందని ఎండీ వివరించారు. ఇప్పటివరకూ 1,596.30 మిలియన్ యూనిట్ల మేర విద్యుదుత్పత్తి చేయగా, సగటున 83 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ఈనెల 18న ఇదే యూనిట్లో 95 శాతం పీఎల్ఎఫ్తో 18,234 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ సాధించి రికార్డు సృష్టించిందని చక్రధర్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఎస్డీఎస్టీపీఎస్లోని మూడు యూనిట్లు కలిపి మొత్తం రోజుకు 45 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. అంటే.. ఏపీ జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల మొత్తం ఉత్పత్తిలో కృష్ణపట్నం వాటా 40 శాతంగా ఉంది. వైఎస్ జగన్ విజన్కు నిదర్శనం.. ఇది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్కు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేయడంతో పాటు భవిష్యత్తులోనూ కొరత రాకుండా చేయాలనే సంకల్పంతో రెండు 800 మెగావాట్ల యూనిట్లతో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గత ప్రభుత్వంలో ఆయన అదనంగా సమకూర్చారు. అందులో ఎస్డీఎస్టీపీఎస్లోని యూనిట్–3 కూడా ఒకటి. 2023లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎనీ్టటీపీఎస్ (నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టిసారించారు. అదే ఏడాది డిసెంబరులో దానినీ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఏపీ జెన్కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం సమకూర్చే స్థాయికి చేరింది. జగన్ హయాంలో పెరిగిన విద్యుదుత్పత్తి.. ఇక చంద్రబాబు గత హయాం 2018–19తో పోలిస్తే వైఎస్ జగన్ హయాం 2023–24 నాటికి ఏపీ జెన్కో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,213 మెగావాట్లు ఉంటే.. అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. ఇందులో కృష్ణపట్నంలోని ఎస్డీఎస్టీపీఎస్లోని 800 మెగావాట్ల యూనిట్, ఎన్టీపీఎస్లోని 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి. చంద్రబాబు హయాంలో మొత్తం విద్యుదుత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే.. జగన్ హయాంలో 2023–24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే.. 6,984 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గింది. ప్రజలకు ఇంధన సర్దుబాటు చార్జీల భారం కూడా తప్పింది. -
సోలార్ విద్యుత్ @100 గిగావాట్లు
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక. కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్డౌన్లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్లు, రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు. పదేళ్లలో చేరిక 2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్మిల్పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్మిల్పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్మిల్పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్మిల్పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
హైడల్.. పవర్ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది. దిగివచ్చిన జలవిద్యుత్ ధరలుతెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్కోకు ఈ మేరకు ఫిక్స్డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్డ్ ధర 2022–23లో యూనిట్కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం. ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్కు ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది. మరమ్మతులు జరగక..459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది. ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది. యూనిట్కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది. -
బయటపడ్డ నాగార్జునసాగర్ జెన్ కో అధికారుల నిర్లక్ష్యం
-
నాగార్జునసాగర్లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
సాక్షి, నల్లగొండ జిల్లా: జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్లో ప్రతి రోజూ 100 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగా వాట్ల చొప్పున 750 మెగా వాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
‘విద్యుత్’కు రోల్మోడల్గా రాష్ట్రం
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్మోడల్గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘యాదాద్రి’లో డిసెంబర్లోగా విద్యుదుత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు.. మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. -
వరద కాలువలోనూ ‘విద్యుదుత్పత్తి’ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్మానేరుకు విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. -
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
సౌర విద్యుత్లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
‘మాచ్ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్లో 69.54, అక్టోబర్లో 86.58, నవంబర్లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
గృహాలపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్సెల్ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోశాట్ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్పోశాట్ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్పీఈ శాటిలైట్ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్స్టవ్లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్తో ఆరోగ్యం.. ‘ఎన్ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్షాపు జరిగింది. వర్క్షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
‘థర్మల్’ ధగధగలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్ యూనిట్లు తమ సత్తా చాటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 18 అర్ధరాత్రి వరకూ ఏపీ జెన్కో థర్మల్ యూనిట్లు 10,108.196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 12,994.987 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం నాలుగన్నర నెలల స్వల్ప వ్యవధిలోనే 2,886.791 మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న ఏపీ జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి 60.616 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదేరోజు ఉత్పత్తి 84.537 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. పెరిగిన పీఎల్ఎఫ్.. ఏపీ జెన్కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 18 వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటున 51.84 పీఎల్ఎఫ్ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్ఎఫ్ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది. అలాగే, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్) పీఎల్ఎఫ్ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం పీఎల్ఎఫ్ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది. సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి.. నిజానికి.. వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు.. బొగ్గు తడిసి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. ఆర్టీపీపీ మూడో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. గత మే 8న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేసింది. ఆర్టీపీపీ ఒకటో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. అదే మే 25న 219 మెగావాట్లు ఉత్పత్తి నమోదైంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ 6వ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 15న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి జరిగింది. ఇక్కడే ఐదో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 24న 217 మెగావాట్లు ఉత్పత్తి సాధించింది. ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని.. థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడం ద్వారా ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలవల్లే ఏపీ జెన్కో ప్రగతిబాటలో పయనిస్తోంది. రాష్ట్ర అవసరాలను 45–50 శాతం వరకూ సమకూరుస్తోంది. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా సీఎం, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. అందువల్లే అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ రికార్డులు సాధిస్తున్నాం. – కేవీఎన్ చక్రధర్బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
Fact Check: ఆరుబయట ఉంటే తడవదా!?
సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు.. ‘కోత’ లేకుండా సరఫరా.. ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్కు అదనంగా బహిరంగ మార్కెట్లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది. వర్షాకాలంలో సర్వసాధారణం వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. -
నెలాఖరులోగా గ్రిడ్కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్ను ఈ నెలాఖరులో గా గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను 27 నుంచి గ్రిడ్కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్లో రెండో యూనిట్కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
పవన విద్యుత్కు యూనిట్కు రూ.2.64
సాక్షి, అమరావతి: పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ ఈ టారిఫ్ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్సీ పరిగణించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్ ధరను ఖరారు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మీరు అడిగినంత ఇవ్వలేం మొదటి పది సంవత్సరాలకు యూనిట్కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్కు రూ.3.50 టారిఫ్ సెట్ చేయాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. వృద్ధికి అనుగుణంగా.. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది. వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. -
‘జల విద్యుత్’కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా ?
అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీని జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సోమవారం సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు మ్యాప్ ద్వారా బ్యారేజీ నిర్మాణ వివరాలను ఆయనకు తెలియజేశారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బ్యారేజీకి అనుబంధంగా 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యారేజీ పనులు పిల్లర్ల వరకు పూర్తయినా జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జెన్కో సీఎండీ సీతమ్మ సాగర్ బ్యారేజీని సందర్శించారని సమాచారం. రాష్ట్రంలోనే కీలకం.. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద నిర్మించనున్న 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. సీతమ్మ సాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఏడు బల్బ్ టర్బైన్ల యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 1016.88 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జల విద్యుత్ కేంద్రాలన్నీ కృష్ణా నదిపైనే ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,369 మెగావాట్లు. గోదావరిపై పోచంపాడు వద్ద 36 మెగావాట్లు, నిజాంసాగర్ వద్ద 10 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నదిపై 280 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఇదే కీలకం కానుంది. బీటీపీఎస్ను సందర్శించిన సీఎండీ మణుగూరు రూరల్ : జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సోమవారం మణుగూరులోని బీటీపీఎస్ను సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీపీఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం బీటీపీఎస్ రైల్వేలైన్ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు టీఆర్కే.రావు, ఎం.సచ్చిదానందం, వెంకటరాజం, అజయ్, లక్ష్మయ్య, విద్యుత్ సౌధ సీఈ రత్నాకర్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, జలవనరులశాఖ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాంబాబు, ఏఈ నవీన్, విజిలెన్స్ అధికారులు వినోద్కుమార్, ముత్యంరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు రాంప్రసాద్, పార్వతి, రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పత్తిలో జెన్కో పరుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఏటా 8% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు అంచనాలకు మించి జెన్కో 45.38% విద్యుత్ను గ్రిడ్కు అందిస్తోంది. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతోంది. తత్ఫలితంగా ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న సామర్థ్యం.. నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో ఇటీవల 800 మెగావాట్ల 8వ యూనిట్లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి, గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరగనుంది. మరోవైపు మాచ్ఖండ్లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇతర చిన్న జలవిద్యుత్ కేంద్రాల మాదిరి ఇది సీజన్లో పనిచేసేది కాదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి జెన్కో అనుమతి తీసుకుంది. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనుంది. సరికొత్త రికార్డులు.. రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండ్ గతేడాది మే నెలలో 5,947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1,989.37 మిలియన్ యూనిట్లు (33.45 శాతం) సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2,917.99 మిలియన్ యూనిట్ల (45.38 శాతం)ను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్కు అందించింది. గతేడాది కంటే 989.37 మిలియన్ యూనిట్లు (12 శాతం) అధికంగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన భారం నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు చార్జీల పెంపు భారం తప్పుతోంది. ప్రభుత్వ సహకారం.. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో అత్యధిక భాగం ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్దేశించారు. వారి మార్గదర్శకం మేరకు, ప్రభుత్వ సహకారంతో తక్షణమే 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. అదే విధంగా థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి జూలైలో శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో థర్మల్, హైడల్, సోలార్ కలిపి ఏపీ జెన్కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,789.026 మెగావాట్లకు చేరుతుంది. – కేవీఎన్ చక్రధర్ బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
విద్యుత్ వెలుగులు.. ఉత్పత్తిలో ఏపీ జెన్కో రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేస్తోంది. మే నెలలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏపీ జెన్కో 12 శాతం అధికంగా విద్యుత్ సరఫరా చేసింది. రాష్ట్ర విద్యుత్ డిమాండులో ఏపీ జెన్కో గత ఏడాది మే నెల 33.45 శాతం సమకూర్చగా ఈ ఏడాది అదే నెలలో అంచనాలకు మించి 45.38 శాతం గ్రిడ్కు అందించడం గమనార్హం. గత ఏడాది మేనెలలో రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండు 5947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1989.37 మిలియన్ యూనిట్లు సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2917.99 మిలియన్ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్కు అందించిది. ఏపీ జెన్కో రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర గ్రిడ్కు గత సంవత్సరం మేనెలలో సరఫరా చేసిన విద్యుత్ కంటే ఈ సంవత్సరం మేనెలలో 989.37 మిలియన్ యూనిట్లు అధికంగా సరఫరా చేయడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా విద్యుత్ వినియోగం పెరిగిన సమయంలో సైతం ఏపీ జెన్కో సగటున 45 శాతం పైగా సమకూర్చుతుండటం విశేషం. జెన్కో విద్యుత్ ఉత్పత్తి పెంచడంవల్ల ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన భారం తగ్గినట్లే. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పెంపు భారం తప్పింది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశం. గత వేసవి సీజన్లలో లాగే ఈ ఏడాది మేలో కూడా డిమాండు సాధారణంగా ఉండి ఉంటే ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా వాటా 50 శాతం దాటి ఉండేదని గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది. ‘సాగర్’ రికార్డు నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నలబై ఏళ్లలో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టు నలబై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్లాంట్లలో ఉద్యోగులు అంకిత భావంతో కృషి చేయడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చక్కటి మార్గదర్శకంతో ప్రోత్సహించడంవల్లే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి పెరిగిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) పెరగడానికి పాటుపడినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో ఛైర్మన్ కె. విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఉద్యోగులను అభినందించారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్) లో ఇటీవల ౖప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేసిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి వచ్చే నెల శ్రీకారం చుడతామని ఎండీ ఉద్యోగులకు తెలిపారు. దీంతో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థం 5810 మెగావాట్ల నుంచి 6610 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్కో (థర్మల్, హైడల్, సోలార్ కలిపి) మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8789.026 మెగావాట్లకు పెరగనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక : ఎండీ చక్రధర్ బాబు విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మార్గదర్శకత్వంలో ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ సహాయ, సహకారాలతో ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింతగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండు పెరుగుతోంది. ఏ రంగం ప్రగతికైనా విద్యుత్ కీలకం. ప్రతి యేటా విద్యుత్ డిమాండు 8 శాతం పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండులో అత్యధిక భాగం సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం చేశారు. చదవండి: ప్రగతి పథంలో ఆర్టీసీ వారి మార్గదర్శకం మేరకు 5000 మెగావాట్ల సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ల (పీఎస్పీ) ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పీక్ డిమాండు సమయంలో ఉత్పత్తి పెంచడానికి, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి హఠాత్తుగా పడిపోయినప్పుడు గ్రిడ్కు సరఫరా చేసేందుకు పీఎస్పీలు చాలా ఉపయోగపడతాయి. పీక్ డిమాండు సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం కూడా వీటివల్ల తప్పుతుంది. ఈ ఆలోచనతోనే అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల పీఎస్పీ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకున్నాం. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ. 11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. -
విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్ను ఆదివారం విజయవంతంగా గ్రిడ్కు అనుసంధానం చేసింది. ఈ యూనిట్ బాయిలర్ సూపర్ క్రిటికల్ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్తో 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్ను పూర్తి లోడ్తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో కూడా 800 మెగావాట్ల యూనిట్–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్టీటీపీఎస్లో కొత్త యూనిట్ ట్రయల్ ఆపరేషన్తో ఏపీ జెన్కో థర్మల్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్కు ఏపీ జెన్కో రోజూ 102 నుంచి 105 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్కో, బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
‘సింహాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
పరవాడ(అనకాపల్లి జిల్లా): సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ సరఫరాకు తగినంత డిమాండ్ లేని కారణంగా (రిజర్వు షట్డౌన్) రెండో యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్కు తగినంత డిమాండ్ లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం సంస్థలో 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి యూనిట్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అవసరాలను బట్టి 2, 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేని కారణంగా మొదటి యూనిట్ను కూడా త్వరలో తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
అవసరమైనంత విద్యుత్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడం కోసం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారీగా పెరుగుతున్న డిమాండ్ ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతూ వస్తున్నదని, గతేడాది గరిష్ట డిమాండ్తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27.51 శాతం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉదాహరణకు, 2020 మార్చి నెలలో ఇంధన డిమాండ్ 5,853.39 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చిలో నెలవారీ ఇంధన డిమాండ్ దాదాపు 16 శాతం పెరుగుదలతో 6,781.54 మిలియన్ యూనిట్లకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా, 2020 మే నెలలో సగటు రోజు డిమాండ్ 180.69 మిలియన్ యూనిట్లుకాగా, ఈ ఏడాది మే 17 వరకు సగటు రోజు డిమాండ్ 16.33 శాతం పెరుగుదలతో 210.20 మిలియన్ యూనిట్లు ఉందని ఆయన వివరించారు. ఒక్క వైజాగ్ నగరంలోనే 2018–19లో 6,696 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ 2021–22లో 8,164 మిలియన్ యూనిట్లకు, అంటే 22 శాతం పెరిగిందన్నారు. ఈ విధంగా ఇంధన వినియోగం పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా ఉచిత విద్యుత్ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ సన్నద్ధం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి ప్రయతి్నస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా డిస్కంలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని, సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన వివరించారు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు, పవర్ నెట్వర్క్ మొదలైన వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మే 18న నమోదైన 251మిలియన్ యూనిట్ల డిమాండ్లో దాదాపు 103.294 మిలియన్ యూనిట్ల డిమాండ్ను ఏపీజెన్కో ప్లాంట్లు తీర్చాయని సంస్థ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథీ్వతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆవు పేడతో కరెంట్! వేములవాడలో బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో రాష్ట్రంలోనే తొలిసారిగా బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు. ఈ విద్యుత్ ప్లాంట్ను జూన్ ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వేములవాడ మున్సిపల్ అధికారులు ప్లాంటు నిర్మాణ పనులను కోడెల సంరక్షణ కేంద్రం ఆవరణలో చేపట్టారు. సమీపంలోనే ఉన్న ప్రాంతీయ ఆస్పత్రికి ఇక్కడ ఉత్పత్తి అయ్యేవిద్యుత్ను అనుసంధానం చేయనున్నారు. నిత్యం 2.5 టన్నుల పేడతో.. తిప్పాపూర్లోని కోడెల సంరక్షణ కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండే 2.5 టన్నుల పశువుల పేడను బయోగ్యాస్ ప్లాంటుకు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే 30 కేవీఏ బయోగ్యాస్తో విద్యుత్ తయారు అవుతుంది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణహిత విద్యుత్ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, వేములవాడ రాజన్న ఆలయానికి వినియోగించనున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.. తిప్పాపూర్లో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంటు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. మరో పక్షం రోజుల్లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. – నర్మద, మున్సిపల్ ఏఈ, వేములవాడ -
కృష్ణపట్నానికి ‘మహానది’ బొగ్గు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది. ఫలించిన నిరంతర ప్రయత్నం.. ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్ అంగీకరించింది. మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. – కేవీఎన్ చక్రధర్బాబు, ఎండీ, ఏపీజెన్కో -
‘సీలేరు’లో మరో రెండు విద్యుదుత్పత్తి యూనిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్మెంట్ విభాగం నుండి ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయి. ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. కాంట్రాక్టర్ సిద్ధం దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయనంద్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్బాబు తెలిపారు. సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు. -
భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే
కర్నూలు(రాజ్విహార్): భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గుమ్మితంతండా వద్ద ఏర్పాటుచేస్తున్న 5,230 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఆయన సోమవారం పరిశీలించారు. సజ్జల మాట్లాడుతూ ఒకే యూనిట్ నుంచి సోలార్(సూర్యరశ్మి), విండ్(గాలి మరల ద్వారా), హైడల్(నీటి) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగా వాట్లు, విండ్ పవర్ 550 మెగా వాట్లు, హైడల్ పవర్ 1,680 మెగా వాట్లు, మొత్తం 5,230 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేసి, నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 23వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని గ్రీన్కో ప్రతినిధులతో అన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, బీవై రామయ్య పాల్గొన్నారు. -
అలల ఒడి నుంచి విద్యుత్!
సాక్షి, అమరావతి: సముద్ర అలల నుంచి విద్యుత్ పుట్టించవచ్చా.. సముద్ర కెరటాలతో వెలుగులు పంచవచ్చా.. ఆటుపోట్ల నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చా.. అనే అలోచనలతో శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమై ఆచరణలోకి వస్తున్నాయి. ప్రపంచానికి భవిష్యత్లో కరెంటు కష్టాలు ఉండవనే ఆశలు కల్పిస్తున్నాయి. సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సవాళ్లు, గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో గ్రిడ్లు చిన్నవిగా, అస్థిరంగానూ ఉంటాయి. అయినప్పటికీ సాంకేతికంగా.. ఆర్థిక పరంగా కష్టం, ఖర్చుతో కూడుకున్న ఓషన్ థర్మల్ ఎనర్జీ, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు ప్రస్తుతం 31 దేశాల్లో విస్తరిస్తున్నాయి. మెరైన్ టెక్నాలజీల నుంచి విద్యుత్ ఉత్పత్తి రెండేళ్ల క్రితంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. మన రాష్ట్రంలోనూ అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనపై అధ్యయనం జరిగిందంటే.. ఈ సాంకేతికత ఎంతగా విశ్వవ్యాప్తమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐరోపాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర శక్తి సామర్థ్యంలో 98 శాతం వాటా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, కెనడా దేశాలదే. పెట్రోలియం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండటంతో అనేక దేశాలు సముద్రం, ఉష్ణ, హైడ్రోజన్, ఆఫ్ షోర్ విండ్, సోలార్ వంటి టెక్నాలజీలలో పెట్టుబడి పెడుతున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ విద్యుత్ ఆగ్నేయాసియాలో అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను నిపుణులు పరిశీలించారు. అక్క డి తీర ప్రాంతాలకు టైడల్ శక్తిని ఉత్పత్తి చేసే సా మర్థ్యం ఉందని గుర్తించారు. భారత్, పసిఫిక్ మ హాసముద్రంలోని మారిటైమ్ ఆగ్నేయాసియా అ ని పిలిచే ద్వీపాలు, సముద్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి సాంకేతికతలను అక్కడ నివసిస్తున్న 660 మిలియన్లకు పైగా ప్రజలకు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వాటిలో భాగంగా ఓషన్ థర్మల్ ఎనర్జీ, లవణ సాంకేతికతలు, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐరెనా) చెబుతున్న దాని ప్రకారం.. సముద్రాలకు పునరుత్పాదక శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. సముద్ర విద్యుత్ చిన్న ద్వీపం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్యుత్ అందించగలదని, సముద్రపు నీటి డీశాలినేషన్ ద్వారా తాగునీటి సరఫరాను పెంచుతుందని ‘ఇన్నోవేషన్ ఔట్లుక్–ఓషన్ ఎనర్జీ టెక్నాలజీస్’ నివేదిక నిర్ధారించింది. దీనివల్ల అదనంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్థానికుల జీవనోపాధి మెరుగుపడుతుంది. సామాజిక–ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సవాళ్లను అధిగమించి, సముద్ర శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అధ్యయనం రాష్ట్రంలోనూ సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు పడ్డాయి. విశాఖ–కాకినాడ మధ్య తీరంలో 100 కేవీ అలల విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (నెడ్కాప్) ఆధ్వర్యంలో అలల విద్యుత్పై ఓ అధ్యయనానికి శ్రీకారం జరిగింది. అలల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తాన్నీ జెన్కో కొనుగోలు చేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం 12 తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నం అత్యంత ఖర్చుతోనూ, సాంకేతికంగా కష్టంగానూ కూడుకున్న వ్యవహారం కావడంతో మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి ఉండటం మంచిదని భావించి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం లేదు. భవిష్యత్లో పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా మన రాష్ట్రంలోనూ అలల నుంచి కరెంట్ పుట్టే అవకాశాలు ఉన్నాయని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
సింగరేణికి మరో వందేళ్ల ఉజ్వల భవిష్యత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకుంటున్న సింగరేణికి మరో వందేళ్లకుపైగా ఉజ్వల భవిష్యత్ ఉందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. మరో ఐదేళ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్.. సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందని, టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఇదే ఒరవడితో తదుపరి రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతంపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలవడం సింగరేణి కార్మికుల పనితీరుకు, అంకితభావానికి నిదర్శనని పేర్కొన్నారు. సింగరేణి పనితీరుకు మెచ్చి సీఎం కేసీఆర్.. మరో 800 మెగావాట్ల ప్లాంట్ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందని, అలాగే ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. పలువురికి సన్మానాలు ఈ సందర్భంగా సింగరేణి భవన్ నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు.. డీజీఎం(ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్ఓఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, సీఎంవోఏఐ సాధారణ కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు, అడ్వైజర్(లా) లక్ష్మణ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ పాల్గొన్నారు. -
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్’.. ఎండుగడ్డితోనూ ఇంధనం
భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి. సాక్షి, అమరావతి: జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. హైడ్రోజన్ విద్యుత్.. అణు విద్యుత్.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ విద్యుత్ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు. అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్ పవర్ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్ ఉండదు. బొగ్గు లేకపోతే థర్మల్ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు. ట్రాఫిక్ నుంచీ విద్యుత్ ఉత్పత్తి టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ట్రాఫిక్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్ పవర్ ప్లేట్ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్ ప్లేట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్ పెడుతున్నారు. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట. వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తో పంజాబ్లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. -
24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం ఈ నెల 24న హైదరాబాద్లో జరగనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించడమే అజెండాగా ఈ సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఎంసీ నాలుగుసార్లు సమావేశమై శ్రీశైలం, సాగర్ నిర్వహణపై సమగ్రంగా చర్చించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఏ కాలువకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ఎలా చేయాలి, మళ్లించిన వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా... వద్దా... అనే అంశాలపై ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను 24న జరిగే భేటీలో చర్చించి, ఆమోదించనుంది. ఆ తర్వాత కృష్ణా బోర్డుకు ముసాయిదా నివేదిక సమర్పించనుంది. కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ ముసాయిదాను చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు దానిలో మార్పులు, చేర్పులు చేసి నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తారు. ఈ నియమావళి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడాలనేది బోర్డు లక్ష్యం. -
విద్యుత్ వస్త్రాలు.. కరెంట్ రోడ్లు..!
సాక్షి, అమరావతి: మనం ధరించే వస్త్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దానితో మన జేబులోనే సెల్ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. నడిచే రోడ్లపై కూడా కరెంట్ను సృష్టించవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు నిశ్చింతగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా... దీనిని ఆచరణలో సాధ్యం చేసి చూపించారు ఇంగ్లండ్, చైనా, స్విట్జర్లాండ్ వంటి దేశాల శాస్త్రవేత్తలు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గ్రీసు దేశానికి చెందిన థేల్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారి విద్యుత్ ఉనికిని గుర్తించారు. నాటి నుంచి విద్యుత్ రంగంలో సాంకేతికత రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ ఆవిష్కరణలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి. ఒంటిపైన విద్యుత్ ఉత్పత్తి ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సౌరశక్తితో విద్యుత్ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని తయారు చేశారు. దీంతో ఫ్యాంట్ జేబులోనే సెల్ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్ను అమర్చి ఈ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌరశక్తిని గ్రహించేలా చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇందుకోసం పరిశోధకులు 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని తయారు చేశారు. నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్ సెల్ను పాలిమర్ రెజిన్ కోటింగ్ చేసి వాటర్ ప్రూఫ్గా మార్చారు. ఒక్కో సోలార్ సెల్ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్ సెల్ తీగను అమర్చుకుంటూ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాలు 400 మిల్లీవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్ సెల్ఫోన్ చార్జింగ్కు సరిపోతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకవచ్చని వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపైనే కరెంట్ ఉత్పత్తి విద్యుత్, ఆటోమొబైల్ రంగాలకు మధ్య సంబంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సోలార్ వంటి సా«ధనాల ద్వారా బ్యాటరీలకు చార్జింగ్ పెట్టడం జరుగుతోంది. ఇటీవల విద్యుత్ వాహనాలు పెరుగుతుండటంతో టైర్ల తయారీ కంపెనీలు చార్జింగ్ విభాగంలో కూడా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. విద్యుత్ను ఉత్పత్తి చేసే టైర్లను తయారు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన గుడ్ ఇయర్ అనే అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ ‘గుడ్ ఇయర్ బీహెచ్03’ అనే పేరుతో తయారు చేసిన కొత్త రకం టైర్లు, రోడ్డుతో రాపిడి (ఫ్రిక్షన్) వలన కలిగే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి సహకరిస్తాయి. ఇలా మారిన విద్యుచ్ఛక్తి కారులోని బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చైనా, స్విట్జర్లాండ్, మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు సైకిల్, బైక్లు, కార్లు వంటి వాహనాలు నడిచే రోడ్లపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసి ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నాన్–స్లిప్ ఉపరితలం ఉన్న రోడ్లపై 50 చదరపు సెంటీ మీటర్ల పరిమాణం, రెండు సెంటీ మీటర్ల మందంతో ఉన్న సౌర పలకలను అమర్చుతున్నారు. ఇవి కాంక్రీట్ రహదారులకంటే గట్టిగా, వాహనాల బరువును తట్టుకునేలా రూపొందిస్తున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గృహ, వ్యాపార సముదాయాల అవసరాలకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ సర్కార్ ముందడుగు
-
65 శాతం పర్యావరణ అనుకూల విద్యుత్
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు. 15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు. ‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. -
ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందుబాటు ధరలో విద్యుత్ పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లు ఉన్న డిమాండ్ 2021–22లో 60,943 మిలియన్ యూనిట్లకు (21.6 శాతం) పెరిగిందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) స్టేజ్–2 (1్ఠ800 మెగావాట్లు) ఈ నెలాఖరుకు, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో స్టేజి–5 (1్ఠ800 మెగావాట్లు) వచ్చే మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్కు పెద్దపీట డిమాండ్ను అందుకోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, నెడ్క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ రైతు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5 — Awanish Sharan (@AwanishSharan) September 23, 2022 -
శ్రీశైలం డ్యామ్ @ 884
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల, సుంకేసుల నుంచి 1,32,829 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 10 అడుగుల మేరకు తెరచిన 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.769, ఎడమగట్టు కేంద్రంలో 17.008 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 66,703 క్యూసెక్కుల నీటిని, స్పిల్ వే ద్వారా 1,03,623 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,208 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని వదిలారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 1 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు, నాగార్జున సాగర్ జలాశయానికి వరదనీటి రాక తగ్గుముఖం పట్టింది. దీంతో రేడియల్ క్రస్ట్ గేట్లను తగ్గించారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 2 రేడియల్ క్రస్ట్గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 1,25,577 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుండి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 8 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా 64,128 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి మొత్తం 97,014 క్యూసెక్కులు వదులుతున్నారు. కుడి, ఎడమకాల్వలు, వరదకాలవకు కలిపి 15,563 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 589.20 అడుగులు 309.6546 టీఎంసీలు ఉంది. ఎగువనుండి వచ్చే వరదను బట్టి గేట్లను పెంచడం, తగ్గించడం గేట్లను మూసివేయడం చేస్తున్నారు. కృష్ణా నదిపైగల జలాశయాలన్నీ జలకళతో ఉన్నాయి. -
పవర్ ఎవర్ 'గ్రీన్'
సాక్షి, అమరావతి: విద్యుత్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి స్మార్ట్గా ఆలోచించారు. సోలార్.. సో బెటర్ అని భావించారు. గ్రీన్ పవర్.. ఎవర్ గ్రీన్... అని విశ్వసించి తన ఐదు అంతస్తుల భవనం గోడలకు సౌర ఫలకాలను అమర్చారు. భవనాన్ని సోలార్ ప్యానల్ ఎలివేషన్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరూ భవనాలపై రూఫ్టాప్ సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఆయన దానికి భిన్నంగా గోడలకు నిలువుగా ప్యానల్స్ను అమర్చారు. ఫుల్ ఎకో గ్రీన్ హోటల్గా రికార్డు సృష్టించారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలోని గురుద్వార జంక్షన్ వద్ద ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో అన్నె నారాయణరావు (బాబ్జి) అనే వ్యాపారి నిర్మించిన ఈ భవనం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయంగా.. ఆదర్శవంతంగా... ఐదు అంతస్తుల భవనానికి సోలార్ ప్యానళ్లను నిలువుగా అమర్చడంతో అద్భుత డిజైన్లా కనిపిస్తుంది. ఈ భవనం ఆకర్షణీయంగా, అందరికీ ఆదర్శంగా కూడా ఉంది. భవనం ఎలివేషన్ కోసం నలుపు రంగు అద్దాలకు బదులుగా దాదాపు 200 సోలార్ ప్యానళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్స్ రోజుకు దాదాపు 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. నెట్ మీటరింగ్ ద్వారా భవనానికి అవసరమైన 40శాతం విద్యుత్ వినియోగించుకుంటారు. మిగిలిన విద్యుత్ను యూనిట్ను రూ.6 చొప్పున ఏపీఈపీడీసీఎల్ ద్వారా గ్రిడ్కు విక్రయిస్తారు. రాత్రి వేళ భవన అవసరాలకు గ్రిడ్ నుంచి కరెంటు తీసుకుంటారు. ఈ భవనానికి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ.45 లక్షలు ఖర్చయినట్లు యజమాని బాబ్జి ‘సాక్షి’కి తెలిపారు. తాము వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఎనిమిదేళ్లలో పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. భవనం పైన మరో 70 సోలార్ పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా... దేశం మొత్తం విద్యుత్ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువగా భవనాల్లోనే ఉంటుంది. ముంబైలోని ఓ డేటా సెంటర్లో దాదాపు ఒక మెగావాట్ సామర్థ్యం గల దేశంలోనే అతిపెద్ద బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ వర్టికల్ సోలార్ సిస్టంను 2019లో ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంలోనే తొలిసారిగా ఈ తరహాలో ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో ఒక హోటల్ నిర్మించారు. ఇక్కడ 15 రోజుల కిందట విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని యజమాని బాబ్జి తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు సంప్రదాయ గాజు అద్దాల స్థానంలో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు సూర్య కిరణాలను నిరోధించి థర్మల్ ఇన్సులేషన్ తరహాలో పనిచేస్తాయి. దీనివల్ల ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. గాజు వినియోగం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించవచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మాదే తొలి గ్రీన్ బిల్డింగ్ ‘పర్యావరణాన్ని కాపాడటంతోపాటు విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం కోసం ఎంతో శ్రమించి భవనం మొత్తం సోలార్ పలకలతో నిర్మించాం. భవనం రూఫ్టాప్ మీద కూడా సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలోనే మాది తొలి గ్రీన్ బిల్డింగ్ అని భావిస్తున్నాం. ఈ మేరకు సర్టిఫికెట్ పొందడం కోసం విశాఖ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేశాం.’ –బాబ్జి, భవన యజమాని, విశాఖపట్నం -
ఇతర రాష్ట్రాలకూ విద్యుత్ ఎగుమతి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను భారీ స్థాయిలో నెలకొల్పడం ద్వారా భవిష్యత్లో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేసే స్థాయికి ఏపీ చేరనుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం వర్చువల్ విధానంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం ద్వారా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్(ఎస్డీఎస్టీపీఎస్) కృష్ణపట్నం రెండో దశలో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి ఈ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(డాక్టర్ ఎన్టీటీపీఎస్) ఐదో దశలో మరో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకొస్తుందని మంత్రి వివరించారు. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక(పవన, సౌర, జల) ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దేశంలోనే ఇది వినూత్న ప్రయోగమన్నారు. ఇంత భారీ స్థాయిలో విద్యుదుత్పత్తి వల్ల మన రాష్ట్రం నుంచి విద్యుత్ను వాణిజ్య పరంగానూ ఎగుమతి చేయవచ్చని మంత్రి వివరించారు. అప్పులు, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చటం, ట్రూ అప్, ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్లోనూ పెద్ద ఎత్తున పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటిరోలోజీ ఇచ్చిన నివేదికను మంత్రి స్వాగతించారు. -
దేశంలో రికార్డ్ స్థాయిలో సౌర వెలుగులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్ ఇండియా రిసర్చ్ తెలిపింది. భారత సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్–జూన్లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది. 2022 జనవరి–జూన్లో, అలాగే జూన్ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. ఏప్రిల్–జూన్లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్ 1 నుంచి సోలార్ మాడ్యూల్స్పై 40, సోలార్ సెల్స్పై 25 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. చదవండి: మా రేంజ్ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన -
సహజ వెలుగులు ప్రసరించాల్సిందే!
సాక్షి, అమరావతి: సహజ వెలుగుల వినియోగాన్ని పెంచడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్లో దాదాపు 25 శాతం విద్యుత్ను సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి నుంచే తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 2022–23కి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్పీవో)ను తాజాగా ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించలేకపోతే జరిమానా.. గతేడాది 21 శాతంగా ఉన్న ఆర్పీవో అంతకుముందు రెండేళ్లలో వరుసగా 17 శాతం, 19 శాతంగా ఉంది. ఈ లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ వంద శాతం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. లక్ష్యానికి తగ్గట్టుగా పునరుత్పాదక విద్యుత్ను వినియోగించలేకపోయిన రాష్ట్రాల్లో యూనిట్కు 25 పైసల నుంచి 30 పైసల వరకూ తొలి ఏడాది జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని యూనిట్కు 35 పైసల నుంచి 50 పైసలకు పెంచాలనుకుంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ఈఆర్సీదే.. 2030 చివరి నాటికి ఆర్పీవోను 43 శాతానికి పెంచుతామని కేంద్రం వెల్లడించింది. 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకు ఆర్పీవోను పెంచుకుంటూ వెళ్లనుంది. దీనిలో పవన విద్యుత్ ఆర్పీవో లక్ష్యం.. 0.81–6.94 శాతం. కాగా జల విద్యుత్ 0.35–2.82 శాతం, సౌర విద్యుత్ 23.44–33.57 శాతంగా ఉంటుంది. రాష్ట్రాలు దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. పునరుత్పాదక విదుŠయ్త్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్ణయించనుంది. ఏపీలో ఆర్ఈ సామర్థ్యం 10,826 మెగావాట్లు.. దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) స్థాపిత సామర్థ్యం దాదాపు 10,826 మెగావాట్లకు చేరింది. దీనిలో 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 3,490.48 మెగావాట్లు సౌర విద్యుత్, 1,610 మెగావాట్లు జల విద్యుత్, 566.04 మెగావాట్లు జీవ(బయో) విద్యుత్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, ఇతర పునరుత్పాదక విద్యుత్ 900.72 మెగావాట్లు ఉన్నాయి. -
వికసించిన ‘సౌర’ పుష్పం
సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్ మోడల్గా వ్యవహరిస్తోంది. తన పరిధిలోని అన్ని వ్యవస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తోంది. వినూత్నంగా ఆలోచిస్తూ విద్యుత్ బిల్లులు ఆదా చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముడసర్లోవలో రిజర్వాయర్లో దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్.. తాజాగా మేహాద్రిగెడ్డపై మరో ప్లాంట్ను పూర్తి చేసింది. రూ.14.04 కోట్లతో 3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ నుంచి విద్యుదుత్పత్తి గత నెల 30 నుంచి ప్రారంభమైంది. సాక్షి, విశాఖపట్నం : సోలార్ విద్యుత్పై నగర ప్రజలకు అవగాహన కల్పించి.. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఏకంగా 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యేలా వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. తమ పరిధిలో ఉన్న జీవీఎంసీ భవనాలపై విద్యుత్ ‘సౌర’భాలు పూయిస్తోంది. నీటిపై సౌర ఫలకలు తేలియాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసేలా దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ముడసర్లోవలో రిజర్వాయర్లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మించింది. దేశంలో తొలి అతి పెద్ద ప్రాజెక్టుకు బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాజెక్టును మేహాద్రి గెడ్డపై ఏర్పాటు చేసి.. ఔరా అనేలా చేసింది. రూ.14.04 కోట్లు.. 3 మెగావాట్లు 2019 డిసెంబర్లో పనులు ప్రారంభించి, ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు సిద్ధమైంది. తడిచినా తుప్పుపట్టని, జర్మన్ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుర్గావ్కు చెందిన రెన్యూ సోలార్ సిస్టమ్ ప్రై. లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ ట్రస్ట్ ఫండ్(యూసీసీఆర్టీఎఫ్) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది. 12 ఎకరాలు.. 40 శాతం నీరు ఆదా సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుంది. కానీ మేహాద్రి రిజర్వాయర్లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.మీ విస్తీర్ణంలో సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది. మరో మైలురాయి అధిగమించాం.. ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్పై దృష్టిసారించాం. విద్యుత్ ఆదా చేస్తే ప్రజలతో పాటు నగరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో నగరవాసులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా జీవీఎంసీ నుంచే సోలార్ విద్యుత్ వినియోగం ప్రారంభిస్తున్నాం. మేహాద్రిగెడ్డపై రెండో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మంచి ఫలితాలందిస్తోంది. – గొలగాని హరి వెంకటకుమారి, నగర మేయర్ ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కమిషనర్ సూచనల మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాం. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల పాటు అప్పగించాం. 20 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఆధునిక సాంకేతికతతో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులతో దాదాపు 20 వేల టన్నులకు పైగా కర్బన ఉద్గారాల్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాం. – రవికృష్ణరాజు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ -
దేశంలో డిస్కంల బకాయిలు రూ.1,32,432 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,32,432 కోట్లకు చేరాయి. గతేడాది జూన్లో రూ.1,27,306 కోట్ల బ కాయిలు ఉండగా ఈ ఏడాది నాలుగు శాతం పెరిగాయి. ఉత్పత్తిదారులు, డిస్కంల మధ్య విద్యుత్ కొనుగోలు లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడానికి 2018 మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాప్తి పోర్టల్ ఈ వివరాలను వెల్లడించింది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిదారులు డిస్కంలకు 45 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు తర్వా త కూడా చెల్లించని మొత్తం రూ.1,15,128 కోట్లుగా ఉంది. ఇది ఏడాది కిందట ఇదే నెలలో రూ.1,04,095 కోట్లుగా ప్రాప్తి పోర్టల్ పేర్కొంది. దీన్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్లలోని డిస్కంలదే ఎక్కువ. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.6,627.28 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసి ఇప్పించాల్సిందిగా తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జెన్కోల కోసం డిస్కంలకు రుణాలు గడువు ముగిసిన తరువాత డిస్కంలు బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు జెన్కోలు జరిమానా వడ్డీని వసూలు చేస్తుంటాయి. కానీ కేంద్రం ఈ జరి మానా సర్చార్జీలను మాఫీచేసింది. దీర్ఘకాలిక రుణాల గడువును పదేళ్ల వరకు పెంచుతూ గత మే నె లలో ప్రభుత్వం రూ.90 వేల కోట్ల లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ స్కీమ్ (ఎల్ఐఎస్)ను ప్రకటించింది. తద్వారా డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల నుంచి రుణాలు పొందాయి. ఆ తరువాత ఎల్ఐ ఎస్ ప్యాకేజీని రూ.1.35 లక్షల కోట్లకు పెంచారు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీ (జెన్కో)లకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జెన్కోలకు కట్టాల్సిన బకాయిలు చెల్లిస్తారని ప్రభుత్వం భావించింది. -
వ్యర్థానికి అర్థం.. ఏపీ ప్రభుత్వ కృషి ఫలితం
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లోని ఘన వ్యర్థాలను సేకరించి వీలైనంత మేర పునర్ వినియోగానికి అనువుగా మానవాళికి ఉపయోగపడేలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న సంకల్పంతో గుంటూరు, విశాఖపట్నం నగరాల సమీపంలో ఏర్పాటు చేసిన రెండు జిందాల్ ఎకోపోలిస్ పవర్ ప్లాంట్లలో ఒక దానిని మంగళవారం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలోని ప్లాంట్ వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ప్లాంట్లో కొన్ని నెలలుగా భారీ స్థాయిలో చెత్తను మండించి సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 1,600 టన్నుల చెత్త అవసరం కాగా, ప్రస్తుతం సమీపంలోని పట్టణాల నుంచి 830 టన్నులు మాత్రమే వస్తోంది. గతంలో ఈ ప్లాంట్ గరిష్టంగా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంది. అయితే, ప్లాంట్ అవసరాలు తీర్చేందుకు మరికొన్ని పట్టణాల నుంచి కూడా చెత్తను ఇక్కడకు తరలించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు యోచిస్తున్నారు. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి ప్రతిరోజు సుమారు 6,900 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్టు క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. ఆ చెత్తను వీలైనంత మేర పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రాసెస్ చేసి అర్థవంతంగా మార్చేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రూ.640 కోట్లతో ప్లాంట్లు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారాయని, జీవజాలం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఘన వ్యర్థాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ పద్ధతుల్లో అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు జిందాల్ ఎకోపోలిస్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు, వాటికి అవసరమైన చెత్తను సమీపంలోని మునిసిపాలిటీల నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు రెండు ప్రాంతాల్లో మొత్తం 30 మెగావాట్ల (15+15) సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆయా సంస్థలకు అవసరమైన చెత్తను సమీప మునిసిపాలిటీల నుంచి అందిస్తున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని కలగని రీతిలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్లాంట్ల డిమాండ్ మేరకు మరింత చెత్తను గ్రామాల నుంచి కూడా సేకరించి అందించాలని యోచిస్తున్నారు. కాగా, త్వరలో రాజమండ్రి వద్ద మరో 7.5 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మరో 400 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. -
ఏపీజెన్కో ప్రాజెక్టులో పగిలిపోయిన ఈఎస్పీ హాపర్స్
ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో శుక్రవారం 2వ యూనిట్కి సంబంధించిన (ఈఎస్పీ) యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ హాపర్స్ పగిలిపోయాయి. 30 టన్నుల బూడిద సామర్థ్యం కలిగిన 2 హాపర్స్ హటాత్తుగా పగిలిపోవడంతో ప్రాజెక్టు అంతా ఫ్లైయాస్(బూడిద) వ్యాపించి, దట్టంగా పైకిలేచింది. ఇప్పటికే 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిపివేయగా, ఈ ఘటనతో 2వ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. బూడిదతో నిండిపోయే ఈ ఇనుప రేకులతో తయారు చేసిన హాపర్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, బూడిదను తొలగించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టు సంస్థ నిర్వహిస్తోంది. అయితే, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, యాష్ ప్లాంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఈ హాపర్స్ నుంచి బూడిద సక్రమంగా వెలుపలకు రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, పగిలిపోయి ఉంటాయని మరో వాదన వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో నిత్యం వేల టన్నుల ఫ్లైయాస్ వెలుపలకు చేరుతుంది. ఈ క్రమంలో 2 హాపర్స్ నిండిపోయి, పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతమంతా బూడిద అలుముకొంది. పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. దీంతో కిందపడే బూడిదను ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. మండుటెండల్లో విద్యుచ్ఛక్తికి విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదు. -
జల విద్యుదుత్పత్తి ఈ ఏడాదీ 100 శాతం
సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి విషయంలో తగ్గేదే లేదన్న ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జలాశయాల్లో నిల్వలు, సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా 100 శాతం సామర్థ్యంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్టు తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు వెల్లడించాయి. రానున్న వర్షా కాలంలో ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభమైన వెంటనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ అలా.. రాష్ట్రం ఇలా శ్రీశైలం, నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ రాష్ట్రం వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది. దుర్వినియోగం కాదు.. 2500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన తెలంగాణలోని జలవిద్యుత్ కేంద్రాల్లో 100 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశిస్తూ గతేడాది జూన్ 28న తెలంగాణ ఇంధన శాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం వేసవికి ముందే ఖాళీ అయింది. కృష్ణా నదికి గతేడాది 1,100 టీఎంసీలు రాగా, ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్ మ్యానేజ్మెంట్) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది. -
సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ
పరవాడ (పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో మంగళవారం ఉదయం నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తిని బుధవారం పునరుద్ధరించారు. వర్షం కారణంగా మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింహద్రి ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బుధవారం ఉదయానికల్లా 1, 3, 4 యూనిట్ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12 గంటలకు రెండో యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోందని పీఆర్వో టి.మల్లయ్య వివరించారు. -
సింహాద్రిలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. హిందూజా, సీలేరులోనూ అంతరాయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి గ్రిడ్కు వెళ్లాల్సిన లైన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో యూనిట్లు ట్రిప్ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్స్టేషన్లో హై ఇన్సులేషన్ ఫీడర్ ఆగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
గాలిపటాలతో విద్యుత్ ఉత్పతి..!
ఆధునిక యుగంలో మనిషి జీవితానికి, విద్యుత్కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. క్షణం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. భరించలేని పరిస్థితి. పదుల సంఖ్యలో విద్యుత్ ఉపకరణాలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యుత్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడుతోంది. బొగ్గు సంక్షోభం గతేడాది పలు దేశాలను చీకట్లోకి నెట్టేసింది. జల, సౌర, పవన, అణు, గ్యాస్ తదితర మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా కూడా.. మనిషి అవసరాలకు సరిపోవడం లేదు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి స్కాట్లాండ్కు చెందిన రాడ్.. గాలిపటాలతో విద్యుత్ను పుట్టించే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. గాలిమరల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు.. గాలి పటాల ద్వారా ఎందుకు విద్యుత్ తయారు చేయకూడదని ప్రశ్నించుకున్న ఆయన.. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆవిష్కరించారు. గాలి పటాలు ఎగురుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్గా మారుస్తుంది. ఈ పద్ధతిలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. 10 కిలోమీటర్ల ఎత్తులోనూ గాలి పటాలు విద్యుత్ను జనరేట్ చేయగలవు. ఇవి నిరంతరం ఎగురుతూ ఉంటే ఒక ఇంటికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, చేపలు పట్టుకునే పడవలు, ఫ్యాక్టరీలు ఇలా అనేక చోట్ల ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. క్లబ్లో కాళ్లు కదిపితే చాలు.. బ్రిటన్లోని ఒక నైట్ క్లబ్ సంస్థ.. తమ వద్దకు వచ్చి డ్యాన్స్ చేసే వారి శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారు చేస్తోంది. ఈ విద్యుత్ను అవసరమైనప్పుడు వాడుకునేలా.. భద్రపరుచుకునే ఏర్పాటు కూడా చేసింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, వాతావరణ మార్పులను అరికట్టవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఏపీలో ఇప్పటికే చెత్త నుంచి కరెంటు తయారు చేసే విధానాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బొగ్గు కొరత నుంచి బయటపడటం కోసం బ్లూ హైడ్రోజన్ను జపాన్ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. జపాన్లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో వాహనాలు కూడా ప్రయోగాత్మకంగా నడిపారు. -
సోలార్ పవర్లో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ఈ రంగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి భారత్ చేరగా.. మన దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. మెర్కామ్ ఇండియా తాజా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2021లో మన దేశం రికార్డు స్థాయిలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించింది. దీన్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 2020లో దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెరుగుదల 3.2 గిగావాట్లు మాత్రమే ఉంది. అంటే 2020తో పోలిస్తే 2021లో పెరుగుదల 210 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్ 2021 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 49 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరిగాయి. ఇవి రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పునరుత్పాదక రంగంలో మొదటి మూడు రాష్ట్రాలుగా ఇవి నిలిచాయి. కోవిడ్–19 కారణంగా 2020లో నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు 2021లో స్థాపించడంతో ఇది సాధ్యమైంది. ఎదురవుతున్న సవాళ్లు మనదేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌరశక్తిలో ఐదో స్థానంలో, పవన విద్యుత్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మనదేశం ఈ ఏడాది 175 గిగావాట్ల ఇన్స్టలేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనుకుంటోంది. అయితే కస్టమ్స్ సుంకం, దిగుమతుల్లో ఎదురవుతున్న పరిమితులు, గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు, అధిక జీఎస్టీ.. తదితర అంశాల్లో పునరుత్పాదక విద్యుత్ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. -
పునరుత్పాదక రంగంలో ఉపాధి వెలుగులు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వీటి ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించవచ్చు. కేవలం పవన విద్యుత్ ద్వారా దేశంలో మిలియన్కు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్యూఈసీ ) తెలిపింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పవన శక్తి నుండి గ్రీన్ రికవరీ అవకాశాలను సంగ్రహించడం’ అనే అంశంతో విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ఐదు దేశాలూ కోవిడ్ –19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ గ్రీన్ రికవరీ చర్యల్లో ఆర్థిక వృద్ధిని సాధించగల పవన విద్యుత్ వనరులను కలిగి ఉన్నాయని వెల్లడించింది. పవన విద్యుత్తులో ఐదు దేశాలు కలిపి 25 ఏళ్లలో 2.23 మిలియన్ ఉద్యోగాలు, దాదాపు 20 గిగావాట్ల అదనపు విద్యుత్ సాధిస్తాయని చెప్పింది. దాదాపు 25 మిలియన్ల గృహాలకు విద్యుత్ అందించవచ్చని వెల్లడించింది. భారత దేశంలో 25 సంవత్సరాల్లో అదనంగా 229 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఏపీ సామర్ధ్యం 10,785.51 మెగావాట్లు దేశంలో నూతన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,56,347.45 మెగావాట్లు. ఏపీలో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 162.11 మెగావాట్లు చిన్న జలశక్తి వనరుల ద్వారా, 1,610 మెగావాట్లు పెద్ద జలశక్తి వనరుల ద్వారా, 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 536.04 మెగావాట్లు బయో విద్యుత్, 4,380.71 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీని ద్వారా పునరుత్పాదక వనరుల విద్యుత్ను ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఏపీ భాగమవుతోంది. ప్రభుత్వాల ఉమ్మడి చర్యలు శిలాజయేతర ఇంధన వనరుల నుండి 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్డీఐ)లను అనుమతిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి కేంద్రం 2025 జూన్ 30 వరకూ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీలు మినహాయింపు ఇచ్చింది. ఏపీ తీసుకునే సోలార్ విద్యుత్కు కూడా ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు వర్తించనుంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం బలపడి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు
సీలేరు: సీలేరు విద్యుత్ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్ కాంతులు..ఇప్పటికీ నంబర్ వన్..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. సీలేరు: 240 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్లో మాచ్ఖండ్ తర్వాత 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి: 25 మెగావాట్స్ సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది. ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది. గ్రిడ్కు విద్యుత్ అందించడంలో సీలేరుదే ఘనత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం. – బి.శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం. – రాంబాబు, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం అధికారుల ప్రశంసలు మర్చిపోలేను సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను. – రమేష్కుమార్, ఏడీ, జలవిద్యుత్ కేంద్రం, సీలేరు. -
దేశంలో.. సింగరేణి ఆ ఘనత సాధించి నెంబర్ వన్గా నిలిచింది
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021–22లో డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నంబర్వన్గా నిలిచింది. అత్యధిక సామర్థ్యం(పీఎల్ఎఫ్)తో విద్యుదుత్పత్తి జరపడం తో ఈ ఘనత సాధించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ర్యాంకింగ్లో సింగరేణి విద్యుత్ కేంద్రం 2021 ఏప్రిల్– డిసెంబరు మధ్యకాలంలో 87.18% పీఎల్ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) 73.98% తో రెండో, 70.29 % తో పశ్చిమ బెంగాల్ జెన్కో మూడో స్థానంలో నిలిచాయి. 29% వృద్ధి.. 2020–21లో డిసెంబర్ నా టికి సింగరేణి కేంద్రం 5,335 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, 2021–22 డిసెంబర్ నాటికి 29% వృద్ధి తో 6,904 ఎంయూల విద్యు దుత్పత్తి చేసింది. విద్యుత్ అమ్మకాలు రూ.2,386 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.2,879 కోట్లకు పెరి గాయి. మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించా రు. శ్రీరాంపూర్ రైల్వేలైన్ విద్యుదీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లోయర్ మానేర్ డ్యాంపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సర్వే పనులను నెలాఖరులోగా, డీపీఆర్ను ఫిబ్రవరిలోగా పూర్తి చేసి మార్చి లో టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిం ది. ఈ మేరకు బోర్డు సభ్యులు (విద్యుత్) ఎల్బీ ముంతంగ్ ఈ నెల 18న లేఖ రాశారు. విద్యుదుత్పత్తి ఆపకుంటే రిజర్వాయర్ పరిధిలో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్ 15న జలాశయంలో 885 అడుగుల నీటి మట్టం వద్ద 216.8 టీఎంసీల నిల్వ ఉండగా, నవంబర్ 18 నాటికి 856.10 అడుగుల వద్ద 94.91 టీఎంసీలకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో నిల్వలు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో, ఎగువ నుంచి వస్తున్న నీళ్లు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని తెలిపారు. -
మైనింగ్, విద్యుదుత్పత్తి జోరు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో దేశీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసినట్లు గణాంకాల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్తో భారీగా దెబ్బతిన్న మైనింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి (ఏప్రిల్ – జూలై) 37.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో 25.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక 2020–21 ఏప్రిల్ – జూలైతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రంలో 23.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 15.2 శాతానికే పరిమితమైంది. నాలుగు నెలల కాలానికి రాష్ట్ర తయారీ రంగంలో 20.7 శాతం వృద్ధి నమోదు కాగా దేశవ్యాప్తంగా 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తిలో 22.8 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ తెలిపింది. పెరుగుతున్న కొనుగోళ్ల శక్తి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో కొనుగోళ్ల శక్తిని పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో వివిధ రంగాల్లో ప్రజల వినియోగంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నిర్మాణ రంగంలో నాలుగు నెలల కాలంలో 41.7 శాతం క్షీణత నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 56 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో 57.8 శాతం, పేస్టులు, సౌందర్య సాధనాలు, ఇంటిని శుభ్రపరచే నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్ వినియోగంలో 156.4 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గతేడాది కోవిడ్తో దెబ్బతిన్న ప్రైమరీ, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ రంగాలు కూడా క్రమంగా వృద్ధి బాట పట్టాయి. -
వెంటాడుతున్న బొగ్గు భయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 14 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా విద్యుత్ సంక్షోభంపై సోమవారం సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బొగ్గు సంక్షోభంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మిగులు విద్యుదుత్పత్తి కలిగిన రాష్ట్రాలు కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంక్షోభాన్ని పట్టించుకోకుండా మిగులు కరెంట్ను పవర్ ఎక్స్చేంజ్ల్లో విక్రయిస్తే ఆ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 15 శాతం కోటా నుంచి విద్యుత్ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశమంతా కటకట.. దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకి 18,70,400 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఉన్న 73,16,600 మెట్రిక్ టన్నుల బొగ్గు సగటున నాలుగు రోజులకు సరిపోతుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 116 థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 15 కేంద్రాల్లో బొగ్గు అసలు లేదు. 27 కేంద్రాలలో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉంది. 20 కేంద్రాల్లో రెండు రోజులకు, 21 కేంద్రాల్లో మూడు రోజులకు, మరో 20 కేంద్రాల్లో నాలుగు రోజులకు, ఐదు కేంద్రాల్లో ఎనిమిది రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు మించి బొగ్గు చాలదు. దీంతో దేశవ్యాప్తంగా 1,42,054 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 48,600 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 26,900 మెట్రిక్ టన్నులు ఉండగా ఇది ఒక్క రోజుకే సరిపోతుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 69,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నందున నాలుగు రోజులు విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. సింహాద్రిలో 13,900 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక్క రోజుకే సరిపోనుంది. వీటన్నిటి ఉత్పత్తి సామర్థ్యం 9,370 మెగావాట్లు కాగా ప్రస్తుతం బొగ్గు కొరతతో సగం కూడా విద్యుదుత్పత్తి జరగడం లేదు. -
శ్రీశైలం డ్యాం రెండుగేట్ల ఎత్తివేత
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/ సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరద ప్రవాహం పెరగడం, డ్యాం నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకోవడంతో రాత్రి 8.30 గంటల సమయంలో రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు, హంద్రీనది నుంచి 2,02,265 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 56,684 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.693 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా హంద్రీ–నీవా సుజలస్రవంతికి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 211.4385 టీఎంసీల నీరునిల్వ ఉంది. సాగర్లో 311.1486 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి భారీగా నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం పెరుగుతోంది. సాగర్లో 589.70 అడుగుల మట్టంలో 311.1486 టీఎంసీల నీరు ఉంది. కుడికాలువకు 9,217 క్యూసెక్కులు, ఎడమకాలువకు 8,718 క్యూసెక్కులు, 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,138, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,379, ఎస్ఎల్బీసీకి 2,400, వరదకాలువకి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం ఔట్ఫ్లో 65,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు 44,030 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల నుంచి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 44,783 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
విద్యుత్ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి. -
విద్యుదుత్పత్తిలో బోర్డుల జోక్యం తగదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేస్తున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు తేల్చిచెప్పారు. బచావత్ ట్రిబ్యునల్లో పేర్కొన్న మేరకే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమను నిలువరించాలని చూడటం చట్టవిరుద్ధమే అవుతుందని వెల్లడించారు. ఏ ప్రాతిపదికన విద్యుదుత్పత్తి ఆపమంటున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సోమవారం షెకావత్తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. గంటపాటు కృష్ణా జలాల అంశాలనే చర్చించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, విద్యు దుత్పత్తి ద్వారా నీటిని దిగువ సాగర్ అవసరాలకు విడుదల చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి కేవలం 38 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ మళ్లించుకునే అవకాశం ఉందని, కానీ అందుకు భిన్నంగా ఏటా వందల టీఎంసీల నీటిని బేసిన్ అవతలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అదీగాక రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నడిచేందుకు విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయని, అందువల్ల శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయడం మినహా తమకు మరో దారిలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డుల జోక్యం తగదని, బచావత్ అవార్డు తీర్పు అమలయ్యేలా మాత్రమే బోర్డు చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తాము మరోమారు పరిశీలిస్తామని షెకావత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్లపై సీడబ్ల్యూసీ వద్దకు ఇంజనీర్లు ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు సమర్పించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను సమర్పించడంతోపాటు అందులోని కొన్ని అంశాలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అదనపు టీఎంసీలో అదనంగా నీటిని వినియోగించడం లేదని, తమకిచ్చిన 240 టీఎంసీల కేటాయింపుల్లోంచే వాడుకుంటామని స్పష్టం చేశారు. -
100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో (2030 నాటికి) పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిర్దేశించుకుంది. హైడ్రోజన్ కేజీ ధరను 1 డాలర్ కన్నా చౌకగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే పర్యావరణ హిత హైడ్రోజన్ను తిరిగి విద్యుత్గా మార్చవచ్చని, దీన్ని కార్లు, ఇళ్లు మొదలైన వాటిల్లో విద్యుత్ అవసరాల కోసం వినియోగించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రోలసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు వ్యయాలు భారీగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైడ్రోజన్ నిల్వ, రవాణా కోసం కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వీటితో పంపిణీ వ్యయాలు భారీగా తగ్గగలవు‘ అని అంబానీ చెప్పారు. ప్రస్తుతం పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేసే హరిత హైడ్రోజన్ ధర కేజీకి 3–6.54 డాలర్ల మధ్యలో ఉంటోందని వివరించారు. దీన్ని 2 డాలర్ల లోపునకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాము మరింత ముందుకెళ్లి రేటును 1 డాలర్ లోపునకు తగ్గించడంపై దృష్టి పెడుతున్నట్లు ముకేశ్ చెప్పారు. ఇందుకోసం 1–1–1 ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. 1 దశాబ్దంలో 1 కేజీ హైడ్రోజన్ను 1 డాలర్ లోపు ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. -
తెలంగాణ సర్కార్ను నియంత్రించండి..
సాక్షి, అమరావతి : తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచే.. అంటే జూన్ ఒకటో తేదీ నుంచే దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ అక్రమ నీటి వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు చేశామని బోర్డుకు గుర్తు చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ► శ్రీశైలంలో 884.90 అడుగుల మట్టంలో నీటి నిల్వ ఉండగా.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల బుధవారం నాటికి నీటి మట్టం 879.3 అడుగులకు తగ్గిపోయింది. ► నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు, పూర్తి నీటి నిల్వ 312.05 టీఎంసీలు. బుధవారం నాటికి సాగర్లో 589.5 అడుగుల్లో 310.55 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం తక్షణమే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటోంది. ► శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటిని, చెన్నైకి తాగు నీటిని సరఫరా చేయొచ్చు. కానీ, ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతుండటంతో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడంలో సమస్యలొస్తున్నాయి. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తుండటంతో ఆ నీరు సాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోంది. ► ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ను నియంత్రించి.. ఏపీ హక్కులను పరిరక్షించాలి. అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కింద లెక్కించాలి. -
నీటి పైపులైన్ల నుంచి విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: భారీ నీటి పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా విద్యుత్ రంగ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్కు కృష్ణా జలాలను తరలిస్తున్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఏ మేరకు ఉంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న దిశగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కోదండాపూర్ నుంచి సాహెబ్ నగర్ (గ్రేటర్ శివారు) మార్గంలో 130 కిలోమీటర్ల పొడవునా ఉన్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఎక్కువగా ఉన్నచోట టర్బైన్లను ఏర్పాటు చేయాలని.. వాటి నుంచి సుమారు 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, టర్బైన్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానించాలని హైదరాబాద్ జల మండలి (వాటర్ బోర్డు) నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేలా? జల మండలి ప్రస్తుతం హైదరాబాద్కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నగరం నలుమూలలా సరఫరా కోసం సుమారు 200 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.75కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు నీటి పైపులైన్లలో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికతను వినియోగి స్తున్నారు. సాగునీళ్లు, తాగునీళ్లతోపాటు పలుచోట్ల సీవరేజీ పైపులైన్లలో కూడా డైనమోలు అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ నీటి పైపులైన్లలో ఏర్పాటు చేయాలని జల మండలి భావిస్తోంది. తొలుత కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్ పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. అది సఫలమైతే గోదావరి పైపులైన్లలోనూ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. ఈ టర్బైన్ల వల్ల నీటి సరఫరా వేగం తగ్గడం, పంపులు నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయా, ఎలాంటి చోట్ల ఏర్పాటు చేయవచ్చు, ఇబ్బందులేమైనా వస్తే ఎలా అధిగమించాలన్న దానిపై అధ్యయనం జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉందని అంటున్నాయి. భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన తరహాలోనే.. పైపులైన్ల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టుల వద్ద చాలా ఎత్తులో ఉండే నీళ్లను పవర్ ప్లాంట్లోకి పంపుతారు. అలా దూసుకొచ్చే నీళ్లు భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతూ కిందికి వెళ్లిపోతాయి. ఈ క్రమంలో టర్బైన్లకు అమర్చిన భారీ డైనమోలలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో నీళ్లు వేగంగా దూసుకెళ్లే పైపులైన్లలో అమర్చే హైడ్రోడైనమిక్ టర్బైన్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. పైపులైన్లలో మాత్రమే కాకుండా నిరంతరం నీటి ప్రవాహం ఉండే కాల్వల వద్ద కూడా ఇలా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఏమిటీ డైనమో? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలే డైనమోలు. సింపుల్గా చెప్పాలంటే.. మనం ఉపయోగించే ఫ్యాన్లు, నీటి మోటార్ల వంటివే. విద్యుత్ సరఫరా చేసినప్పుడు మోటార్కు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్) తిరుగుతుంది. డైనమోలు దీనికి ప్రతిగా (రివర్సులో) పనిచేస్తాయి. డైనమోకు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్)ను తిప్పితే.. దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు వేగంగా ప్రవహిస్తున్న నీళ్లు టర్బైన్ను తిప్పుతాయి. దీంతో ఆ టర్బైన్కు అనుసంధానం చేసిన డైనమో షాఫ్ట్ కూడా తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డైనమోలో.. రెండు శక్తివంతమైన అయస్కాంతాలను రెండు వైపులా బిగిస్తారు.. మధ్యలో రాగి,అల్యూమినియం వంటి లోహపు తీగలను చుట్టలుగా చుట్టి ఒక కడ్డీ (షాఫ్ట్) ద్వారా వేలాడదీస్తారు. షాఫ్ట్ను తిప్పినప్పుడు లోహపు చుట్టలు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి లోహపు తీగల్లో విద్యుత్ను పుట్టిస్తుంది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/అచ్చంపేట/కర్నూలు సిటీ: ఎగువన గల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువ నారాయణపూర్కు విడుదల చేస్తుండగా.. అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలాశయంలోని నీటిమట్టం 41.11 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతుండగా.. నాగార్జున సాగర్లోకి 9వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సాగర్ నీటిమట్టం 169.71 టీఎంసీలకు చేరింది. 44.18 టీఎంసీలకు చేరిన పులిచింతల పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నాగార్జున సాగర్, కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నీటి నిల్వ 44.1813 టీఎంసీలకు చేరింది. జెన్కో పవర్ జనరేషన్కు 13,800 క్యూసెక్కులు వదలడం అనివార్యమైందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ తెలిపారు. ఒక రేడియల్ గేటును మూడు అడుగుల మేర ఎత్తి 11వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నామన్నారు. మరో 600 క్యూసెక్కులు రేడియల్ లీకేజీ వల్ల దిగువకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 175 అడుగుల సామర్థ్యానికి గాను 173 అడుగుల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ఇది 44.18 టీఎంసీలకు సమానమని చెప్పారు. తుంగభద్రకు పెరిగిన ఇన్ఫ్లో తుంగభద్ర డ్యామ్లోకి నీటి ప్రవాహం పెరిగింది. శనివారం 40 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం ఆదివారం నాటికి 58 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం డ్యామ్లో 50 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో సాగు నీటి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు జిల్లాలకు ఉపకరించే తుంగభద్ర ఎడమ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. -
శ్రీశైలం విద్యుదుత్పత్తి: తెలంగాణకు మళ్లీ లేఖ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని కృష్ణా బోర్డు మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఈ నెల 15న తెలంగాణను బోర్డు ఆదేశించినప్పుటికీ తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలంగాణ జెన్కో అధికారులు బోర్డుకు లేఖ రాశారు. ఈ సమయంలో బోర్డు ఆదేశించినా విద్యుదుత్పత్తి కొనసాగిస్తుందని తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేసింది. వీటిన్నింటి నేపథ్యంలో శుక్రవారం రాత్రి బోర్డు తెలంగాణకు మరో లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని, నీటి విడుదల ఉత్తర్వులను అమలు చేయాలని సూచించింది. జూరాల, శ్రీశైలంకు పెరిగిన ప్రవాహాలు కృష్ణా బేసిన్ పరీవాహకంలో కురుస్తోన్న వర్షాలతో ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్లకు 50వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. నీటిని దిగువకు వదిలేయడంతో జూరాలకు 61,700 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇక్కడి నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీశైలానికి 59,650 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ 36.04 టీఎంసీల నిల్వలున్నాయి. 6,357 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. ఇక దిగువన సాగర్కు 4,982 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీల నిల్వకుగానూ 169.13 టీఎంసీల నిల్వ ఉంది. -
Krishna River: 'కృష్ణా' తులాభారం
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా పారే కృష్ణమ్మ తనతో పాటే అనేక వివాదాలను మోసుకొస్తోంది. ఎడతెగని పంచాయతీలకు కారణమవుతోంది. వీటిని పరిష్కరించేలా ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చినా..అంతరాష్ట్ర ఒప్పందాలు జరిగినా.. కేంద్రం మధ్యవర్తిత్వం చేసినా.. వివాదాలు షరా మామూలవుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు తమ వాటాలకు మించి నీటి వినియోగం చేసేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే... ఉన్న వాటాల్లో నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలకు అవకాశం లేక పరీవాహకానికి, ఆయకట్టుకు తగ్గట్లుగా వాటాలు దక్కలేదని తెలంగాణ అంటుంటే.. తమకున్న నీటి వాటాల్లోంచే వినియోగిస్తున్నామని, అంతకుమించి ఒక్క చుక్క నీటిని అదనంగా వినియోగించబోమని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తోంది. విభజన తరువాతైనా నీటి వాటాలను సవరించి కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని తెలంగాణ కోరుతుంటే.. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ నీటి వాడకంతో తమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఏపీ అంటోంది. దీనిపై అటు కేంద్రానికి, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల విషయంలో ఇరు పక్షాల వాదనలు, వాస్తవాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ తెలిపే ప్రయత్నం చేస్తోంది. – సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఆలమూరు రామగోపాల్ రెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధులు శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి తెలంగాణ శ్రీశైలం పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదే. 1959లో శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా చేపట్టగా 1963లో ప్లానింగ్ కమిషన్ దానిని ఆమోదించింది. ► బచావత్ అవార్డు పేజీ నంబర్ 104 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ► విభజన చట్టం 12వ షెడ్యూల్, సెక్షన్ (1) ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను భౌగోళిక ప్రాంతం ఆధారంగా విభజించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను 50 శాతం చొప్పున పంచుకోవాలని విభజన చట్టంలో ఎక్కడా లేదు. ► 1990–91 నీటి సంవత్సరం నుంచి 2019 – 20 వరకు ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలం కనీస మట్టం 834 అడుగుల్లో ఏపీ నీటిని నిల్వ ఉంచడం లేదు. పెన్నా బేసిన్ ప్రాజెక్టులకు తరలించేందుకు 854 అడుగుల మట్టాన్ని నిర్వహించాలని ఏపీ కోరడం సమంజసం కాదు. ► 2015 జూన్లో నిర్వహించిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ, బోర్డు భేటీల్లో శ్రీశైలం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 50 శాతం చొప్పున తాత్కాలిక పద్ధతిలో పంచుకున్నది కేవలం ఆ వాటర్ ఇయర్కు మాత్రమే వర్తిస్తుంది. దీనిని క్లెయిమ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ► 2020–21 వాటర్ ఇయర్లో ఏపీ 629.06 టీఎంసీలను కృష్ణా బేసిన్లో వాడింది. ఇంత భారీ ఎత్తున నీటిని తరలిస్తూ తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేయడం ద్వారా తమ తాగునీటి అవసరాలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తుండటం అసంబధ్దం. ► తెలంగాణ సముద్ర మట్టానికి ఎగువన ఉంది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. లిఫ్టులతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రెండు పంటలకూ నీరందాలంటే జల విద్యుత్ ఉత్పత్తి కీలకం. అందుకే అన్ని ప్రాజెక్టుల్లోని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 100 శాతం సామర్థ్యంతో కరెంట్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ► కేంద్ర ప్రణాళిక సంఘం 1963లో శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగా అనుమతి ఇచ్చింది. కానీ ఆ తర్వాత బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా ప్రణాళిక సంఘమే గుర్తించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) ద్వారా 19 టీఎంసీలు వాడుకోవడానికి జూలై 4, 1994లో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణ సర్కార్ పేర్కొనడంలో అర్థం లేదు. ► జూలై 10, 2014న కృష్ణా బోర్డు మొదటి సమావేశంలోనే శ్రీశైలంలో 834 అడుగుల కంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టులో జూన్ 1న 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నప్పటికీ బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 26.05 టీఎంసీలను వదిలేసింది. ► కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకున్నా, బోర్డు æ కేటాయింపులు చేయకున్నా అక్రమంగా నీటిని వాడుకుంటూ నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 5.55 టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిశాయి. ► ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా 2015–16 సంవత్సరానికి మాత్రమే ఒప్పుకున్నాం. ఇకపై అంగీకరించం. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఇదే నిష్ఫత్తిలో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్లో వాటా ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే జలవిద్యుత్లో 66 శాతం వాటా మాకే దక్కుతుంది. జాతీయ జలవిధానం ప్రకారం తొలి ప్రాధాన్యం తాగునీటికే. తరువాత సాగునీటికి ప్రాధాన్యం. చివరి ప్రాధాన్యం జలవిద్యుదుత్పత్తికి అది కూడా సాగునీటి అవసరాలున్నప్పుడే చేపట్టాలి. కనీస నీటిమట్టం దాటకుండానే డెడ్స్టోరేజీలోనే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. పెరిగిన జల విద్యుత్తు థర్మల్ విద్యుదుత్పత్తి, సరఫరాను తెలంగాణ ఇటీవల గణనీయంగా తగ్గించింది. ప్రత్యామ్నాయంగా జలవిద్యుత్ ఉత్పత్తి, సరఫరాను భారీగా పెంచింది. తెలంగాణ 9357.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉండగా కేవలం 6274 మెగావాట్ల థర్మల్ విద్యుత్ మాత్రమే జూలై 6న రాష్ట్రానికి సరఫరా అయింది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల, పులిచింతల తదితర జల విద్యుత్ కేంద్రాలు కలిపి తెలంగాణ జెన్కో మొత్తం 2441.8 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా జూలై 9న 751.1 మెగావాట్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యంతో పోల్చితే 80 – 85 శాతం విద్యుత్ను రాష్ట్రాల డిస్కంలు కొనుగోలు చేయాలని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు పేర్కొంటాయి. అంతకు మించి తక్కువగా విద్యుత్ను కొనుగోలు చేస్తే విద్యుదుత్పత్తి కంపెనీలకు ఫిక్స్డ్ చార్జీలను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. వదులుకున్న విద్యుత్కు యూనిట్కు రూపాయి వరకు పెనాల్టీలు ఉంటాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఉండగా, కనీసం 80 శాతం అంటే 800 మెగావాట్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంది. గత మంగళవారం కేవలం 97 మెగావాట్లను కొనుగోలు చేసింది. వదులుకున్న 703 మెగావాట్ల(16.8 మిలియన్ యూనిట్లు) విద్యుత్కు పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్కు రూ.2.75 ఫిక్స్డ్ చార్జీ చొప్పున 16.8 మిలియన్ యూనిట్ల విద్యుత్కు పెనాల్టీలు చెల్లించాల్సి రానుంది. బచావత్ కేటాయింపులు కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేయడానికి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1 ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తుది తీర్పు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ‘ఫస్ట్ ఇన్ యూజ్.. ఫస్ట్ ఇన్ రైట్(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాల్లో 1969 నాటికి పూర్తయిన ప్రాజెక్టుల్లో అత్యంత పురాతనమైనది. దాంతో.. కృష్ణా డెల్టా నుంచే నీటి పంపిణీని ప్రారంభించిన కేడబ్ల్యూడీటీ–1 ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు చివరగా కేటాయింపులు చేసింది. ► కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు.. పునరుత్పత్తి కింద 70 టీఎంసీలు వెరసి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని లెక్కగట్టిన కేడబ్ల్యూడీటీ–1 మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1969 నాటికి పూర్తయిన, 1976 నాటికి నిర్మాణంలోనూ, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలను కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. పునఃపంపిణీ చేసిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో బీమా ఎత్తిపోతల పథకానికి 20, పులిచింతలకు 9 టీఎంసీలను కేటాయిస్తూ ఏప్రిల్ 16, 1996న ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేడబ్ల్యూడీటీ–1 పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణతో మిగిలిన ఎనిమిది టీఎంసీలను కలిపి మొత్తం 19 టీఎంసీలను ఎస్సార్బీసీకి కేటాయిస్తూ జూలై 4, 1994లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే కేడబ్ల్యూడీటీ–1 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం పునఃపంపిణీ ద్వారా రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కాయి. ఆ మేరకు మూడు ప్రాంతాలు కృష్ణా జలాలను వినియోగించుకున్నాయి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇలా... కృష్ణా జలాల పునఃపంపిణీకి ఏప్రిల్, 2004లో ఏర్పాటైన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ 2016 అక్టోబర్ 19న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 163 టీఎంసీల్లో మహారాష్ట్రకు 46, కర్ణాటకకు 68, ఆంధ్రప్రదేశ్కు 49 టీఎంసీలను కేటాయించింది. 65 శాతం లభ్యత ఎగువన 285 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 35, కర్ణాటకకు 105, ఆంధ్రపద్రేశ్కు 145 టీఎంసీలను కేటాయించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, ఆంధ్రప్రదేశ్కు 194 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 75 – 65 శాతం మధ్య లభ్యతగా ఉన్న జలాల్లో కేటాయించిన 49 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్లో క్యారీ ఓవర్ కింద 30 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు(కే–7) ప్రాంతంలో 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, సహజ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. 145 టీఎంసీల మిగులు జలాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్లో క్యారీ ఓవర్ కింద 120, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. అయితే ఈ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు నుంచి ఉపసంహరించుకుంది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారిస్తుండటంతో బ్రిజేశ్ తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బచావత్ తీర్పే అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించడంతో గత ఐదేళ్లుగా కసరత్తు చేస్తోంది. కేంద్రం తాత్కాలిక సర్దుబాటు.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయని నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా బచావత్ చేసిన కేటాయింపులను పరిగణలోకి తీసుకుని జూన్ 19, 2015న ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై కేంద్ర జలవనరుల శాఖ నాటి అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో ఏపీ జలవనరుల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంతకాలు చేశారు. తాత్కాలిక సర్దుబాటును కృష్ణా బోర్డు తీర్మానం మేరకు ఏటా పొడిగిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన జలాలు కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపులు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. ఇందులో తెలుగుగంగకు 25, జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు.. శ్రీశైలం, నాగార్జునసాగర్లో క్యారీ ఓవర్ స్టోరేజీ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం ప్రకటించిన ఆరు ప్రాజెక్టులకు అవసరమైన జలాలు టీఎంసీల్లో కృష్ణా జలాల్లో వాటా తెలంగాణ కృష్ణా జలాల్లో మాకున్న 299 టీఎంసీల వాటా మరింత పెరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సరిదిద్దాలి. ఇందులో భాగంగానే కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్ను త్వరితగతిన ఏర్పాటు చేసి తెలంగాణకు నీటి హక్కులు దక్కేలా చూడాలి. ►కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. ►పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలి. ►ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టి ఇకపై ఉమ్మడి రాష్ట్రానికి చేసిన వాటాల్లోంచి సగం వాటా నీటిని వినియోగించుకుంటాం. ►ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటివరకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956 సెక్షన్ 6(2) ప్రకారం నదీ జలాలను పంపిణీ చేస్తూ ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం. దాన్ని పునఃసమీక్షించడానికి అవకాశం లేదని చట్టం చెబుతోంది. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన 2,130 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లకపోవడానికి ఇదే కారణం. మొత్తంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. బ్రిజే‹శ్ ట్రిబ్యునలే తెలుగుగంగకు 25, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. మిగిలిన 165 టీఎంసీల్లో.. విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందిన హంద్రీ–నీవాకు 40, గాలేరు–నగరికి 38, వెలిగొండకు 43.5 టీఎంసీలు దక్కుతాయి. తెలంగాణకు చెందిన నెట్టెంపాడుకు 22, కల్వకుర్తికి 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసినా ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందే తప్ప తగ్గదు. పోతిరెడ్డిపాడుపై.. తెలంగాణ పోతిరెడ్డిపాడును ఏమాత్రం గుర్తించం. చెన్నైకి తాగునీటినందించేందుకు బచావత్ అవార్డులో 15 టీఎంసీలను కేటాయించగా ఏనాడూ అంతమేరకు అందించలేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ)కు 19 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పునఃకేటాయింపులు చేసింది. వీటిని కూడా జూలై–అక్టోబర్ వరకే తరలించాల్సి ఉంది. రెండింటికి కలిపి 34 టీఎంసీలను తరలించాల్సి ఉండగా వందల టీఎంసీలను తరలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్ చేయని కాలువను నిర్మించి రాయలసీమలోని పెన్నా బేసిన్కు కృష్ణాజలాల్ని తరలించారు. దీనిపై ట్రిబ్యునల్లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ పాలకులు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి అదనంగా కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు 5 వేల క్యూసెక్కుల జలాలను విడుదలచేసే పవర్ ఛానెల్ కూడా చేపట్టారు. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1500 క్యూసెక్కుల లైనింగ్ కాలువను నిర్మించాల్సి ఉండగా.. 60,500 క్యూసెక్కులు (11,500+44,000+5000) లైనింగ్ చేయని కాలువను నిర్మించారు. ఇది అక్రమం. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎగువన నీటి మట్టం ఉంటేనే ప్రస్తుత డిజైన్ మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కృష్ణా బేసిన్లో అతివృష్టి, అనావృష్టి వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. దీనివల్ల శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీ స్థాయిలో వస్తోంది. వరదను ఒడిసి పట్టేలా కాలువల సామర్థ్యం లేకపోవడంలో వందలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద నీటిని ఒడిసి పట్టి చట్టబద్ధంగా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులను 35 నుంచి 40 రోజుల్లో నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువలను విస్తరించే పనులు చేపట్టాం. సముద్రంలో కలిసే వరద జలాలను మళ్లించి కరువు ప్రాంతాన్ని సుభిక్షం చేయడం తప్పుకాదు. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి, తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఎస్సార్బీసీకి, తెలుగుగంగకు కేంద్ర జలసంఘం అనుమతి ఉంది. ఎస్సార్బీసీకి బచావత్, తెలుగుగంగకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కింద నీటి కేటాయింపులు ఉన్నాయి. గాలేరు–నగరిని విభజన చట్టం ద్వారా కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఈ ప్రాజెక్టుల ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తాం. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను గుర్తించబోమని తెలంగాణ సర్కార్ ప్రకటించడంలో అర్థం లేదు. బేసిన్లలో నీటి వినియోగం తెలంగాణ సహజ న్యాయ సూత్రాల ప్రకారం బేసిన్ తాగు, సాగు అవసరాలు తీరాకే నీటిని ఇతర బేసిన్కు తరలించాలని స్పష్టంగా ఉన్నా ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు తరలిస్తోంది. 367 టీఎంసీలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలిస్తున్నారు. ►శ్రీశైలం నుంచి తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తున్నారు. ►1977 అక్టోబర్ 28న కుదిరిన ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి సరఫరాకుగాను 15 టీఎంసీలను తరలించేందుకు 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న లైనింగ్ కాలువ నిర్మించాలి. ఈ కాల్వ ద్వారా కేవలం చెన్నై తాగునీటికే నీటిని సరఫరాచేయాలి. కానీ ఒప్పందానికి విరుద్ధంగా 11,150 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను నిర్మించారు. అనంతరం 55,150 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ఈ విషయాన్ని బ్రిజేశ్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లలేదు. ►ఒప్పందం ప్రకారం 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాల్సిన ఈ కాల్వ ద్వారా ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు ఇతర బేసిన్లకు తరలిపోతాయి. ఇక పెన్నా బేసిన్లో నిల్వ కోసం 185 టీఎంసీలతో రిజర్వాయర్లు కట్టారు. ఇందులో వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 16.950 టీఎంసీలు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ సామర్థ్యం 17.735 టీఎంసీలు, సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 77.988 టీఎంసీలు, కండలేరు సామర్థ్యం 68 టీఎంసీలు, కడపజిల్లా కోసమని మైదుకూరు, దువ్వూరు మండలాల్లో 4.577 టీఎంసీల సామర్థ్యంతో ఉప రిజర్వాయర్లు (ఎస్ఆర్–1, 2)నిర్మించారు. ఇందులో కండలేరు మినహా మిగిలిన రిజర్వాయర్లన్నీ పెన్నా బేసిన్లోనివే. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 1863లో జలరవాణా కోసం డచ్ సంస్థ కేసీ(కర్నూల్–కడప) కెనాల్ను తవ్వింది. సర్ ఆర్ధర్ కాటన్ నివేదిక ఆధారంగా కేసీ కెనాల్ను 1933లో నీటిపారుదల ప్రాజెక్టుగా బ్రిటీష్ సర్కార్ మార్చింది. ఈ కెనాల్ కింద 2,65,628 ఎకరాలకు నీళ్లందించడానికి బచావత్ 39.90 టీఎంసీలను కేటాయించింది. ఫిబ్రవరి 15, 1976న జరిగిన ఒప్పందం మేరకు తెలుగుగంగ చేపట్టాం. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 25 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరిని కేంద్రం అధికారిక ప్రాజెక్టుగా గుర్తించింది. కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు మళ్లించడం అక్రమమని తెలంగాణ సర్కార్ ఆరోపించడంలో అర్థం లేదు. ►తెలంగాణ సీఎం కేసీఆరే ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. నదీ జలాలను మళ్లించి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తాం.. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సహకరిస్తాం’ అని ప్రకటించారు. ►నదుల అనుసంధానంతో సముద్రం పాలవుతోన్న జలాలను మళ్లించి దుర్భిక్షాన్ని తరిమికొట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 27, 2012న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు కేంద్రం అనుసంధానాన్ని చేపట్టింది. ఈ అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్రానికి పూర్వమే చేపట్టిన కేసీ కెనాల్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టిన తెలుగగంగే స్ఫూర్తి అని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) పేర్కొంది. ప్రాజెక్టులపై.. తెలంగాణ కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పాలనా అనుమతులు జారీ చేయడం అసమంజసం. ఈ ప్రాజెక్టును ఒప్పుకోం. ఈ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవు, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవు. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు. ►గ్రీన్ ట్రిబ్యునల్ సైతం నిర్మాణ పనులు కొనసాగించవద్దని చెప్పినా వినడం లేదు. ఇది కోర్టు ధిక్కరణే. ►బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఏపీ చేపడుతోంది. ఇది విభజన చట్టానికి విరుధ్దం. ►పాలమూరు ఎత్తిపోతలపై సమగ్ర అధ్యయన నివేదిక కోసం 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టును రీ డిజైన్ చేశాం. ఇది పాత ప్రాజెక్టే. ►డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని రీ డిజైన్ చేశాం. ►తుమ్మిళ్ల ఎత్తిపోతలను సైతం తుంగభద్రలో మా వాటాను వినియోగించుకునేలా చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువలను అక్రమ ప్రాజెక్టులగా అభివర్ణించడం, పనులను ఆపాలని తెలంగాణ సర్కార్ కోరడం అర్థరహితం. ►తెలుగుగంగ, ఎస్సార్బీసీ, తెలుగగంగ, కేసీ కెనాల్ శ్రీశైలం కుడి గట్టు కాలువలకు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. మాకు దక్కిన 512 టీఎంసీలను సమర్థంగా వినియోగించుకుని ఆయకట్టును స్థిరీకరణకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ►శ్రీశైలంలో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలు.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి ద్వారా 2.4 టీఎంసీలు, 825 అడుగుల నుంచి సామర్థ్యం పెంచిన ఎస్సెల్బీసీ ద్వారా 0.5 చొప్పున 2.9 వెరసి.. 6.9 టీఎంసీలను తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలించడానికి అవకాశం ఉంటుంది. 854 అడుగులోల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల నుంచి 7 వేలు క్యూసెక్కులు తీసుకెళ్లవచ్చు. 848 అడుగులకు నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు నీళ్లు చేరవు. ►శ్రీశైలం నుంచి తెలంగాణ సర్కార్ ఎడాపెడా తోడేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందడం లేదు. నీటి కేటాయింపులు ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడానికి, చెన్నైకి తాగునీటిని అందించడానికే సీమ ఎత్తిపోతల చేపట్టాం. ఆర్డీఎస్ కుడి కాలువకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికే కుడి కాలువ పనులు చేపట్టాం. ►కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్సెల్బీసీసహా 24 ప్రాజెక్టులను తక్షణమే నిలిపేయాలి. నీటి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో 68.5 శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే ఉన్నాయి. అదే ఏపీకి 31.5శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 367 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోంది. కృష్ణా పరీవాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణకు 37.11 లక్షల హెక్టార్లు ఉండగా ఏపీకి కేవలం 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. అయినా ఏపీకి కేటాయింపులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ పరీవాహక ప్రాంతం ఆధారంగా నదీ జలాలను ట్రిబ్యునల్ పంపిణీ చేయదు. ఒప్పందాలు, వినియోగం ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తుంది. ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేనాటికి పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు లభ్యత ఆధారంగా కేటాయింపులు చేస్తుంది. బచావత్ ఏర్పాటయ్యేనాటికి అంటే 1969 నాటికే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలవినియోగం ఉండేది. దాంతో ఆ ప్రాజెక్టులకు బచావత్ నీటి కేటాయింపులు చేసింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలు కేటాయించింది. ఎక్కడా పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ పరీవాహక ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న కర్ణాటకకు 734 కేటాయించి.. తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలను కేటాయించేది కాదు. మళ్లింపు జలాల్లో వాటా తెలంగాణ 1976 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణాలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. కృష్ణా నీటిలో దక్కే 80 టీఎంసీలకుగానూ 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, నాగార్జునసాగర్కు ఎగువన ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఇందులో 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ సర్కార్ వాదిస్తుండటం అన్యాయం. నాగార్జునసాగర్కు ఎగువన ఆంధ్రపదేశ్కు కూడా ఆ జలాలు దక్కుతాయన్న వాస్తవం తెలుసుకోవాలి. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లోని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్ బేసిన్లకు 68.40, దేవాదుల ద్వారా 24.650, కాళేశ్వరం ద్వారా 83.190, వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.45 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ జలాలకుగానూ కృష్ణా జలాల్లో 211.45 టీఎంసీలను ఏపీకి అదనపు వాటాగా ఇవ్వాలి. తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్క తెలంగాణ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని 2016లో కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బేసిన్లోని హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోంది. తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయి. తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ సైతం తేల్చిచెప్పింది. దీని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. తాగునీటి కోసం తరలించే జలాల్లో 20 శాతం తాగునీటికి వెళ్తాయి. మిగిలిన 80 శాతం నీరు మురుగునీటి కాలువల ద్వారా తెలంగాణలోని చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులకే చేరుతాయి. ఆ నీటితో తెలంగాణలో పంటలు కూడా పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు తాగునీటి కోసం తరలించే కృష్ణా జలాల్లో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తెలంగాణ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలకు మేం వ్యతిరేకం. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ భేటీల్లోనూ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్¯ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ బ్రిజేశ్ తీర్పును కేంద్రం నోటిఫై చేసేదాకా కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ వాదించడం అసంబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జలాలను బచావత్ కేటాయించింది. కేంద్రం తక్షణమే బోర్డు పరిధిని నోటిఫై చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటిపై ఆధారపడిన సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటూ విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తెచ్చి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి. ఇతర బేసిన్లకు కుదరదు.. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని బచావత్ చెప్పింది. విద్యుత్ అవసరాలకు మినహా వేరే అవసరాలకు ఒక్క బొట్టు కూడా వాడొద్దు అని చెప్పింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా ఇదే చెప్పింది. విద్యుదుత్పత్తిని ప్రాజెక్టుల్లోని ఏ మట్టం నుంచైనా చేపట్టవచ్చు. తెలంగాణ అవసరాలు పట్టించుకోకుండా పక్క బేసిన్లకు నీటిని తరలిస్తామంటే కుదరదు. – రంగారెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొత్తగా కోరడం లేదు కృష్ణా జలాల్లో నీటి వాటాలు పెంచాలని కొత్తగా అడగడం లేదు. బేసిన్ అవసరాలు తీరాక వరద జలాలు తరలించుకుంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. పోలవరానికి సీడబ్ల్యూసీ అధికారిక అనుమతి వచ్చిన వెంటనే సాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి’ – శ్యాం ప్రసాద్రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కేటాయింపులు పెరగాల్సిందే కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటినుంచీ అన్యాయం జరిగింది. కేవలం 13శాతం పరీవాహకం ఉన్న ఆంధ్రా ప్రాంతం 45శాతం నీటిని అంటే 367 టీఎంసీలను వినియోగిస్తోంది. నిజానికి ఆంధ్రా ప్రాంతానికి ఉన్న అర్హత 106 టీఎంసీలు మాత్రమే. గతం నుంచి నీటిని అనుభవిస్తున్నామని సాకుగా చెబుతూ దానిని హక్కుగా చూపరాదు. – దొంతు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ పునఃపంపిణీ చట్టవిరుద్ధం ట్రిబ్యునల్ ఒక్క సారి నదీ జలాలను పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పునఃసమీక్షించడానికి వీల్లేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ కేటాయించిన 2130 టీఎంసీలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ పునఃపంపిణీ చేయకపోవడానికి కారణమదే. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధం. – డి.రామకృష్ణ, రిటైర్డు సీఈ సాగునీటి అవసరాలకే.. ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీశైలం, సాగర్, పులిచింతల నిర్వహణ ప్రోటోకాల్స్ రూపొందించారు. శ్రీశైలంలో మట్టం 834 అడుగులు దాటాకే సాగర్, కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలి. 2014 నుంచి నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటి నుంచే కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ఖాళీ చేస్తోంది. – ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డు ఈఎన్సీ రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం శ్రీశైలంలో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలు, అక్రమంగా చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ ద్వారా 800 అడుగుల నుంచే రోజుకు 2.9 టీఎంసీల చొప్పున మొత్తం 6.9 టీఎంసీలు తరలిస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. దీన్ని అధిగమించాలంటే 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువకు ఎత్తిపోయడం మినహా మార్గం లేదు. – నారాయణరెడ్డి, ఈఎన్సీ -
నీరంతా సముద్రం పాలు.. ఏమిటీ దారుణం..!
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ ఎడమగట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం డెడ్స్టోరేజీకి పడిపోయింది. నాగార్జునసాగర్, పులిచింతల్లోనూ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టు 20 గేట్లు అరడుగు మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం 8,400 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. పులిచింతలలో ఆదివారం విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కార్ పెంచడంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ఉదయం ఒక టీఎంసీ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్ల భవిష్యత్లో రెండు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ముప్పు పొంచి ఉందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. కానీ.. తెలంగాణ సర్కార్ ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,130 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 817.09 అడుగులకు పడిపోయింది. మొత్తం 215.81 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు తగ్గింది. నీటినిల్వ డెడ్స్టోరేజీకి పడిపోయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 21,973 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా 31,223 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 30,723 క్యూసెక్కుల వినియోగంతో విద్యుదుత్పాదన కొనసాగుతోంది. దీంతో సాగర్లో నీటిమట్టం 532.2 అడుగులకు పడిపోయింది. మొత్తం 312.04 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 174.46 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం వల్ల నీటినిల్వ 29.52 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు రైతులు సంసిద్ధంగా లేకపోవడంతో బ్యారేజీ నుంచి 8,400 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జున సాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో రెండు యూనిట్ల ద్వారా 46.4 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ణ, ఏఈ బి.కాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్
-
యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: తెలంగాణ దెబ్బకు జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పటికీ జూన్ 1 నుంచే తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ.. ప్రాజెక్టును ఖాళీ చేస్తూ.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు పదే పదే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కి మూడు ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు న్యాయం చేయాలని ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం శ్రీశైలంలోకి 6,287 క్యూసెక్కులు వస్తుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 819.49 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 40.45 టీఎంసీలకు తగ్గింది. అలాగే నాగార్జునసాగర్లోకి వచ్చిన నీటిని వస్తున్నట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేయడంతో నీటిమట్టం 533.69 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 175.45 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 9,000 క్యూసెక్కులు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉండటంతో.. ఆరు గేట్లు ఎత్తి 8,340 క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా విడుదల చేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. -
విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా తెలంగాణ సర్కార్ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి, ఒప్పందాలు, జాతీయ జలవిధానాన్ని బుట్టదాఖలు చేస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ.. వృథాగా దిగువకు నీటిని వదిలేస్తోంది. ఏపీకి నష్టం జరుగుతోందని ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో భారీగా మోహరించిన ఏపీ పోలీసు బలగాలు వెనుదిరిగాయి. తెలంగాణ అనాలోచిత ఏకపక్ష వైఖరి వల్ల రానున్న రోజుల్లో ఆ రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం శ్రీశైలంలోకి ఎగువ నుంచి 13,542 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తెలంగాణ సర్కార్ వదిలేస్తోంది. దీని వల్ల శ్రీశైలం నీటిమట్టం 820.64 అడుగులకు తగ్గిపోయింది. అలాగే నాగార్జునసాగర్లోకి వస్తున్న నీటిని వచ్చినట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. 9,100 క్యూసెక్కులను వాడుకుంటూ 35 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. శ్రీశైలం, సాగర్లను విద్యుదుత్పత్తి కోసం ఖాళీ చేయడం వల్ల తెలంగాణలో ఆ ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు నీళ్లందే అవకాశం ఉండదు. హైదరాబాద్ తాగునీటికీ ఇబ్బందులు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సర్కార్కు తెలియనివి కాదని.. ఏపీ హక్కులకు విఘాతం కల్పించాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తోందని అంటున్నారు. కాగా, శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయికి నీటి నిల్వ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,424 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు కృష్ణా డెల్టా రైతులు సంసిద్ధంగా లేకపోవడం.. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. చేసేది లేక ఆరు గేట్లు ఎత్తి 8,424 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. చదవండి: (జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు) -
నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది: ఎస్ఈ గంగరాజు
సాక్షి,నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం మెమొరాండం ఇవ్వడానికి వచ్చారు. కాగా తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులను సాగర్ బ్రిడ్జిపైనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ రైట్ కెనాల్ ఎస్ఈ గంగరాజు ఆధ్వర్యంలోని ఏపీ అధికారుల బృందం ఇచ్చిన మెమొరాండంను తెలంగాణ జెన్కో అధికారులు తిరస్కరించారు. ఫ్యాక్స్లో లేఖ పంపాలంటూ ఏపీ అధికారులతో పేర్కొన్నారు. దీంతో వారు అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైట్ కెనాల్ ఎస్ఈ గంగరాజు మాట్లాడుతూ.. ''విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా.. తెలంగాణ అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ నుంచి వెళ్లిన నీరు పులిచింతల వద్ద వదిలేయడంతో.. నీరంతా వృథగా సముద్రంలో కలుస్తుంది. మనం ఇంకా వ్యవసాయ సీజన్ మొదట్లోనే ఉన్నాం. రైట్ కెనాల్ కింద 11 లక్షల 15 వేల ఎకరాల సాగు చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేయడంతో రైతుల ఆశను ఒమ్ము చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ అధికారులకు మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లాం. తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ చర్య దుర్మార్గం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ డెడ్ స్టోరేజ్ లెవల్ నీటినిల్వల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా మంత్రివర్గం పేర్కొందని రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్యాదవ్, పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అన్యాయ వైఖరిపై కేంద్ర ప్రభుత్వంతోపాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా చేతగానితనంగా భావించవద్దు.. ‘రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటాన్ని అడ్డుకునేం దుకు ఎంతవరకైనా వెళ్తాం. తెలంగాణ మంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసమే రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు. ఇరుప్రాంతాల ప్రజల ప్రయోజనం కోసం మేము సంయమనం పాటిస్తున్నాం. విడిపోయిన తరువాత కూడా రెండు ప్రాంతాల తెలుగువారు బాగుండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం. అది మా చేతగానితనంగా భావించవద్దు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటి నిల్వలను వాడుకుంటూనే ప్రాజెక్టులు కడుతున్నాం. శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీళ్లు వెళ్లాలి అంటే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ కెపాసిటీ 44 వేల క్యూసెక్కులు తీసుకోవాలి. అం దుకు 885 అడుగుల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టులో నీటి నిల్వలు 881 అడుగులకు చేరితే తప్ప ఆ మేరకు నీళ్లు తీసుకోలేం. వరదల సమయంలో 15 నుంచి 20 రోజులు మాత్రమే మనకు ఆ లెవల్లో అంటే 881 అడుగుల నుంచి 885 అడుగులకు నీళ్లు చేరతాయి. అతి తక్కువ సమయంలో మనం మన వాటా నీళ్లను తీసుకోవాలంటే మన కెపాసిటీని పెంచుకోవాలి. అందుకే మనకు కేటాయించిన నీటి వాటా నుంచే వాడుకుంటూ ప్రాజెక్టులు చేపడుతున్నామని సీఎం అపెక్స్ కౌన్సిల్తోపాటు పలు వేది కల మీద స్పష్టంగా చెప్పారు. శ్రీశైలం డ్యాం నిండకుండా చేసేందుకే.. తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పాల్ప డుతోంది. ఈ రోజు శ్రీశైలంలో 30 వేల క్యూసెక్కులు వస్తుంటే, 26 వేల క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తికి వాడేస్తోంది. శ్రీశైలం డ్యాం నిండకుండా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడుతోంది. సాగర్లో 20 వేల క్యూసెక్కుల నీటిని వాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే పూర్తిసామర్థ్యం ఉంది. ఇప్పుడు పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్లు కిందకు విడిచిపెడితే ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేయలేమని తెలుసు. నీళ్లు సముద్రం లోకి వృథాగా విడిచిపెట్టడం తప్ప మరోదారి లేదు. ఇలాచేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని కేఆర్ఎంబీ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ తెలంగాణ పట్టించుకోవడంలేదు. జీవో జారీచేసి మరీ అన్ని జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో పూర్తిసామర్థ్యంలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తెలంగాణ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. ఎవరికివారు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తామంటే ఇక బోర్డులు ఎందుకు? ట్రిబ్యునళ్లు ఎందుకు? ఈ పరిస్థితి ఉండకూడదనే అన్ని ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చి క్రమబద్ధీకరించాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడుతుంది. నెట్టంపాడు, కల్వకర్తి ప్రాజెక్టులను విస్తరిస్తుంది. దేనికీ అనుమతి ఉండదు. ఈ విషయంపై ప్రధానికి, కేంద్ర జల్శక్తిశాఖ మంత్రికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేఆర్ఎంబీకి లేఖ రాస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వృథాచేసిన నీటిని వాళ్లకు కేటాయించిన 299 టీఎంసీల నుంచి కుదించమని కోరుతున్నాం. తెలంగాణ జీవో జారీచేయడం దుర్మార్గం ‘విద్యుత్తు ఉత్పత్తి చేయకూడదని కేఆర్ఎంబీ ఆదేశాలు జారీచేసినప్పటికీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీళ్లు దిగువకు వదలడం దుర్మార్గమైన చర్య. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు..’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ గుండెల్లో వైఎస్సార్ దివంగత మహానేత వైఎస్సార్పై తెలంగాణ మంత్రులు అన్యాయంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ తెలంగాణకు చీమంత అన్యాయం చేయలేదు. అందుకే ఆయన ఐదేళ్లు పరిపాలించిన తరువాత జరిగిన 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెలంగాణ నుంచే వచ్చాయి. ఆయనపై తెలంగాణ ప్రజలకు అంత ప్రేమ ఉంది. ఆయన వారికి ఎంత మంచి చేశారన్నదానికి అదే ఉదాహరణ..’ అని మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. -
రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం
రెంటచింతల (మాచర్ల)/విజయపురిసౌత్: గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగర్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 30,943 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తున్నామని డీఈ దాసరి రామకృష్ణ, ఏఈ బి.కాసులు బుధవారం తెలిపారు. 2 యూనిట్ల ద్వారా 45 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద భద్రతా దళాలు సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ పోలీస్ బందోబస్తు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతుండటంతో బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన జల విద్యుత్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనీస నీటిమట్టం 834 అడుగులకు చేరకుండానే శ్రీశైలం ఎడమగట్టున 796 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాల్లో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కో అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలోని 8 టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తున్నారు. -
సీలేరు.. లక్ష్యంలో సరిలేరు!
రంపచోడవరం/మోతుగూడెం: సీలేరు జలవిద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తిలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాయి. ఐదేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ఉత్పత్తి లక్ష్యాలను ఏటా కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) నిర్దేశిస్తుంది. సీలేరు కాంప్లెక్స్లోని నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకు 2020–21లో 2,074.98 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా, మార్చి నెలాఖరుకు 2,705.36 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తం నాలుగు విద్యుత్ కేంద్రాలు పరస్పరం పోటీ పడినట్టుగా అధిక ఉత్పత్తి సాధించాయి. అంతేకాదు.. ఈ కేంద్రాల ద్వారా ఈ ఏడాది గోదావరి డెల్టాకు 45 టీఎంసీల నీటిని కూడా అందించారు. గత ఏడాది నీటి సమస్యతో పాటు యూనిట్లు తరచూ మొరాయించిప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించడం విశేషం. ఈ ఏడాది పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంతో పాటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలోని యూనిట్లు మొరాయించాయి. స్థానిక ఇంజనీర్ల కృషితో పాటు కార్మికులు యూనిట్ల మరమ్మతులో జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ ఈ లక్ష్యాలను సాధించారు. రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 9.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్క సీలేరు కాంప్లెక్స్లోనే డిమాండ్కు అనుగుణంగా రోజుకు 7 నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టెయిల్ పాండ్, పెన్నా అహోబిలం, చెట్టుపేట మినీ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. సమష్టి కృషితోనే సాధ్యం డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. స్థానిక ఇంజనీర్లు, సిబ్బంది కృషితో లక్ష్యాన్ని సాధించాం. – ఎం.గౌరీపతి,చీఫ్ ఇంజనీర్, సీలేరు కాంప్లెక్స్, మోతుగూడెం, తూర్పు గోదావరి జిల్లా సాంకేతిక సమస్యలు అధిగమించాం.. ఈ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు ఏటా మొరాయిస్తున్నా.. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోగలిగాం. నాలుగు జలవిద్యుత్ కేంద్రాల యూనిట్ల ఆధునికీకరణకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. త్వరలోనే అనుమతులు లభిస్తే యూనిట్ల ఆధునికీకరణకు చర్యలు చేపడతాం. – కె.బాలకృష్ణ, డీఈ (ఎలక్ట్రికల్), ఆపరేషన్, మెయింటెనెన్స్ -
పల్లెపల్లెకూ 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: రాయలసీమలో విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏపీ ట్రాన్స్కో ఈ రెండినీ సమన్వయం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. కొత్త లైన్ల ఏర్పాటు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు రూ.1,349 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ఏపీ ట్రాన్స్కో ఉన్నతాధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. దీనివల్ల ప్రతీ పల్లెకు మరింత నాణ్యమైన విద్యుత్ అందబోతోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ వల్ల లో ఓల్టేజీ సమస్యను నివారించవచ్చని తెలిపారు. సీమ, కోస్తాంధ్ర అనుసంధానం రాయలసీమ, కోస్తా ఆంధ్రను అనుసంధానం చేసే 400 కేవీ లైను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్కో సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లాలోని తాళ్లయపాలెంలో 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ను ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఇది దోహద పడుతుంది. అనంతపురం జిల్లా హిందుపూర్, చిత్తూరు జిల్లా రాచగున్నేరి, ప్రకాశం జిల్లా పొదిలిలో గల 400 కేవీ సబ్ స్టేషన్లలో బస్ రియాక్టర్లను పెట్టడం వల్ల ఈ జిల్లాలలో 400 కేవి లైన్లలో వోల్టేజీ సమస్యలు పరిష్కరించొచ్చు. స్విచ్చింగ్ స్టేషన్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బ, వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 220 కేవీ స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోని 132 కేవీ సబ్ స్టేషన్ను 220 కేవీకి పెంచుతున్నారు. సిఎస్పురం, రుద్రసముద్రం సోలార్ పార్కుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. శరవేగంగా సోలార్ లైన్లు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, కర్నూలులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం విద్యుత్ను ఇతర కోస్తాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని తలారిచెరువు 400 కేవీ సబ్ స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి 400 కేవీ సబ్ స్టేషన్ వరకు 400 కేవీ లైన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని ట్రాన్స్కో ఉన్నాతాధికారి తెలిపారు. డిమాండ్ కన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అయితే, ఆ విద్యుత్తును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అదనపు విద్యుత్ను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్రం యోచిస్తోంది. -
నయా అణుకేంద్రం ‘నాట్రియం’
ముప్పై కోట్ల నుంచి.. మూడు వందల కోట్లు.. భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల మరణించే వారి సంఖ్య ఇది! బొగ్గు, చమురు ఉత్పత్తుల వాడకం వల్ల కార్బన ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.. వాటిని తగ్గించి, కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయంగా చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి నాట్రియం కూడా అలాంటిదే.. ఇదేంటి కొత్త అనుకుంటున్నారా? చాలా సింపుల్ మనం నిత్యం వాడే ఉప్పులో ఉండే సోడియం. సోడియంతో అణుశక్తి రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే ప్రయత్నమే ‘నాట్రియం’ ప్రాజెక్టు సాక్షి హైదరాబాద్: బొగ్గు, చమురు వాడకంతో భూవాతావరణంలో పేరుకుపోతున్న విష వాయువులను తగ్గించాలన్నది అందరి ప్రయత్నం. కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. సౌర, పవన, జియో థర్మల్, తరంగ శక్తి వంటి అన్నిరకాల సంప్రదాయేతర ఇంధన వనరులను ఉయోగించినా అది సాకారం కావాలంటే ఏండ్లకేండ్లు పడతాయి. పైగా వీటి వాడకంలో బోలెడన్ని చిక్కులూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘నాట్రియం’ తెరపైకి వచ్చింది. ఓవైపు వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ను తగ్గిస్తూనే.. మరోవైపు నిరంతరం విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు నాట్రియం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ దిశగానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్కు చెందిన టెరాపవర్, అంతర్జాతీయ సంస్థలు జనరల్ ఎలక్ట్రిక్, హిటాచీ, అమెరికా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కలిసి.. సోడియం ఆధారిత అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. సాంకేతికత పరంగా నాలుగో తరంగా చెప్పుకుంటున్న ఈ అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్ తయారీ వెనుక దశాబ్దాల శ్రమ దాగి ఉంది. అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఈ నమూనా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయింది కూడా. అన్నీ సవ్యంగా సాగితే.. మరికొన్ని నెలల్లోనే దాని నుంచి 345 మెగావాట్ల విద్యుత్తు అమెరికాకు అందనుంది. చవక, భద్రత కూడా.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అణువిద్యుత్ అనగానే రేడియేషన్ భయం మొదలవుతుంది. అయితే బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాలతో జరిగే విద్యుదుత్పత్తిలో ప్రతి టెరావాట్ ఉత్పత్తికి 24.6.. 18.1 చొప్పున మరణాలు సంభవిస్తోంటే.. అణువిద్యుత్ కారణంగా జరుగుతున్న మరణాలు 0.07 మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్నేండ్ల అణువిద్యుత్ ఉత్పత్తి చరిత్రలో చెర్నోబిల్, ఫుకుషిమా వంటి రెండు ప్రమాదాలు మాత్రమే జరగాయని గుర్తు చేస్తున్నారు. అయితే నాట్రియం డిజైన్లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అసలే లేనందున ఫుకుషిమా వంటి సంఘటనలు జరిగే అవకాశమే ఉండదని చెబుతున్నారు. వంద శాతం ఉత్పత్తి నాట్రియం డిజైన్లోని అణువిద్యుత్ కేంద్రాలు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. అదికూడా రోజంతా. ఈ ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న నాట్రియం అణువిద్యుత్ కేంద్రం సామర్థ్యం 345 మెగావాట్లు. ఎండాకాలంలోగానీ, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోగానీ అకస్మాత్తుగా విద్యుత్కు డిమాండ్ పెరిగితే.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల నుంచి ఆరేడు గంటల పాటు ఏకంగా 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో నాట్రియం అణువిద్యుత్ కేంద్రం ద్వారా సుమారు 2.25 లక్షల ఇండ్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయవచ్చునని నిపుణులు అంచనా వేశారు. నాట్రియం విజయవంతమైతే అతితక్కువ స్థలంలోనే ఈ కొత్త తరహా అణువిద్యుత్ కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని అంటున్నారు. నీటికి బదులు ఉప్పు! నాట్రియంకు, సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఉప్పు వాడకమే. యురేనియం అణువులను న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా పుట్టే శక్తితో నీటిని ఆవిరిగా మార్చడం, ఆ ఆవిరి సాయంతో టర్బయిన్లను తిప్పి విద్యుదుత్పత్తి చేయడం సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రక్రియ. నాట్రియంలోనూ ఇదే తరహాలో జరుగుతుంది. కానీ నీటికి బదులు ఉప్పును ఉపయోగిస్తారు. ఇక నీరు వంద డిగ్రీల సెల్సియస్లో ఆవిరిగా మారితే.. ఉప్పు 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారుతుంది. పైగా నీళ్లు వేడయ్యాక హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోయినట్టు ఉప్పు విడిపోదు. ఐదురెట్లు ఎక్కువ వేడిని నిల్వ చేసుకున్న ఉప్పును రియాక్టర్కు దూరంగా తీసుకెళ్లి నిల్వ చేయడం, అవసరానికి తగ్గట్టు నీటిని వేడి చేసి విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడం ‘నాట్రియం’ అణు విద్యుత్తు కేంద్రాల డిజైన్లోని ప్రధాన విశేషం. -
ఎత్తిపోతకు.. గట్టిమోతే!
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. నీళ్లున్నాయి... యాసంగిలో పంటలకు ఢోకా లేదు. అంతవరకు బాగానే ఉంది కానీ... నీటిని ఎత్తిపోయాలి. దీనికి భారీగా విద్యుత్ కావాలి. రాష్ట్రంలో ప్రధాన ఎత్తిపోతల పథకాల కింద గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏకంగా 4,720 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల కిందే అత్యధికంగా 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని లెక్కగట్టింది. ఖరీఫ్ సీజన్లో మంచి వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ఎత్తిపోతల పథకాలలో కరెంట్ మోత తప్పింది. యాసంగిలో మాత్రం బిల్లుల మోత గట్టిగానే ఉండనుంది. కాళేశ్వరం ద్వారా 50 టీఎంసీలు వానాకాలంలో స్థానిక పరీవాహకం నుంచి గరిష్ట ప్రవాహాల రాకతో రిజర్వాయర్లన్నీ నిండాయి. మోటార్ల ద్వారా ఎత్తిపోతల అవసరం గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద 31 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 టీఎంసీల మేర తక్కువ. ఈ ఎత్తిపోతల పథకాల పరిధిలోని రిజర్వాయర్లలో స్థానిక ప్రవాహాల నుంచి నీరు చేరడంతో ఒకటి రెండు మోటార్ల ద్వారానే నీటిని ఎత్తిపోçశారు. దీంతో విద్యుత్ వినియోగం పెద్దగా జరుగలేదు. ఇక దేవాదుల కింద కూడా కేవలం 7 టీఎంసీల నీటి ఎత్తిపోతే జరిగింది. దీని పరిధిలోని వెయ్యికి పైగా చెరువులు వర్షాలతోనే నిండాయి. కాళేశ్వరం ద్వారా వానాకాలంలో 15 టీఎంసీల కన్నా తక్కువే నీటి ఎత్తిపోతల జరిగింది. దీంతో మొత్తంగా 2 వేల మిలియన్ యూనిట్లకన్నా తక్కువే విద్యుత్ వినియోగం జరిగింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్లో ప్రధాన ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా 33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఈ స్ధాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే 330 టీఎంసీలు అవసరమని లెక్కగట్టింది. ఇందులో ప్రధాన ఎత్తిపోతల పథకాలైన దేవాదుల కింద 2.07లక్షల ఎకరాలకు 11.77 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద 2.67 లక్షల ఎకరాలకు 36 టీఎంసీలు, కల్వకుర్తి కింద 2.78 లక్షల ఎకరాలకు 37 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–1, 2ల కింద కలిపి 13 లక్షల ఎకరాలకు 120 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కగట్టింది. ఈ స్థాయిలో నీటిని ఇచ్చేందుకు ఎన్ని మోటార్లు... ఎప్పటినుంచి నడపాలి, ఎంత నీటిని ఎత్తిపోయాలి, ఎంత విద్యుత్ వినియోగం అవుతుందని ఇరిగేషన్ శాఖ అంచనాలు వేసింది. ఇందులో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ మొదలు, ప్యాకేజీ–8లోని గాయత్రి పంప్హౌజ్ వరకు ఐదు పంప్హౌజ్లను కనీసంగా 60 నుంచి 80 రోజుల వరకు నడపాల్సి ఉంటుందని తేల్చింది. ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలంటే కాళేశ్వరం ద్వారానే కనీసంగా 50 టీఎంసీల మేర నీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎత్తిపోయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికే 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక దేవాదుల పరిధిలోనూ ఈ ఏడాది 11 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలకు 779 మిలియన్ యూనిట్లు, మహబూబ్నగర్ ప్రాజెక్టుల కింద 800 మిలియన్ యూనిట్లు, ఏఎంఆర్పీ కింద 250 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుందని గుర్తించారు. మిగతా చిన్న ఎత్తిపోతల పథకాలు, ఐడీసీ పథకాలు కలిపి మొత్తంగా యాసంగిలో 4,720 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరాలను తేల్చారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి రెట్టింపు విద్యుత్ వినియోగం ఉండనుంది. -
పరిశ్రమలు రయ్రయ్..!
న్యూఢిల్లీ: తయారీ, కన్జూమర్ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదు కాగా.. కరోనా వైరస్పరమైన పరిణామాల కారణంగా మార్చి నుంచి ఆగస్టు దాకా ప్రతికూల స్థాయిలోనే కొనసాగింది. సెప్టెంబర్లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25న కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల కార్యకలాపాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక విభాగాలవారీగా చూస్తే అక్టోబర్లో.. ► తయారీ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్లో ఇది 5.7 శాతం క్షీణించింది. ఐఐపీలో తయారీ రంగానికి 77.6 శాతం వాటా ఉంటుంది. ► కన్జూమర్ గూడ్స్ విభాగం 17.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో ఇది 18.9 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. గత అక్టోబర్లో ఇది 3.3 శాతం క్షీణించింది. ► విద్యుదుత్పత్తి మెరుగ్గా 11.2% వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.5% క్షీణించింది. ► పెట్టుబడులకు కొలమానంగా నిల్చే భారీ యంత్రపరికరాల ఉత్పత్తి 3.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో క్షీణత 22.4 శాతం. ► ఇన్ఫ్రా/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం 7.8% వృద్ధి చెందింది. అయితే, ప్రైమరీ గూడ్స్ విభాగంలో 3.3% క్షీణత నమోదైంది. ఇంకా బలహీనంగానే.. ఐఐపీ ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసినప్పటికీ.. అక్టోబర్ డేటా ఊహించిన దానికన్నా బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘ఆశాభావంతోనే ఉన్నప్పటికీ ఎకానమీ పటిష్టంగా రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయి‘ అని నాయర్ పేర్కొన్నారు. మరోవైపు, ఐఐపీ గణాంకాలు సానుకూలంగా ఆశ్చర్యపర్చినప్పటికీ.. ఇదే ధోరణి కొనసాగకపోవచ్చని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సంస్థ ఈడీ సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు. భారీ ఉద్దీపన, ప్రభుత్వ వ్యయాలు, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు, నిధుల లభ్యత మెరుగుపడటం, సానుకూల ఐఐపీ.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు.. ఎకానమీ సత్వరం కోలుకోవడానికి తోడ్పడ్డాయని మిల్వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. పటిష్టమైన రికవరీ సుదీర్ఘకాలం కొనసాగగలదని అంచనా వేశారు. -
జెన్కో జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన విద్యుత్ను చాలావరకు తగ్గించింది. చౌక విద్యుత్కు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 987.39 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) అదనంగా అందించగలిగింది. 2014–15తో పోలిస్తే ఏకంగా 6,407.09 ఎంయూలు ఎక్కువ. అప్పట్లో ఆనవాయితీగా మారిన బ్యాకింగ్ డౌన్ ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 వేల మెగావాట్లు. రోజుకు 105 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. జెన్కో థర్మల్, జల విద్యుత్ కేంద్రాలతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్లు) దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయి. పీపీఏ ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయకపోతే ఫిక్స్డ్ (స్థిర) ఛార్జీలు (ప్లాంట్ల నిర్మాణ చార్జీలు) చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి వరకు ఇదే జరిగింది. ప్రైవేట్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు జెన్కోలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. తరుచూ బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గించడం) ఆనవాయితీగా మారింది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు థర్మల్ ప్లాంట్లు సామర్థ్యానికి తగినట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేయకుండా ఆపడం వల్ల డిస్కమ్లు యూనిట్కు రూ.1.50 వరకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో భారీయెత్తున నష్టాలకు గురయ్యాయి. మరోవైపు ఉత్పత్తి పెంచుకోలేక జెన్కో ఆర్థిక నష్టాల్లోకి వెళ్లింది. 2015–16లో జెన్కో విద్యుత్ను 1,747 ఎంయూలు తగ్గిస్తే... 2016–17లో 5,103 ఎంయూలు, 2018–19లో ఏకంగా 7,013 మిలియన్ యూనిట్లు తగ్గించేశారు. ఈ విధంగా పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ కేంద్రాలను పడుకోబెట్టడంతో 2015–16లో రూ.157.1, 2016–17లో రూ.629.9, 2017–18లో రూ.1,943.9, 2018–19లో రూ.2,766.4 కోట్ల చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. భారీగా ఉత్పత్తి తగ్గించడం, డిస్కమ్లు చెల్లించే స్థిర చార్జీలతో సరిపెట్టుకోవడం వల్ల జెన్కో కేంద్రాలు అప్పుల్లోకెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల వల్ల ఇప్పటికీ పవన, సౌర తదితర విద్యుత్ను ఉత్పత్తి అయినంతవరకు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటీకరణ ప్రచారానికి తెర ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. జెన్కో సంస్థల ప్రైవేటీకరణ దిశగా గత ప్రభుత్వం అడుగులేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రమాదం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణాలిప్పించడం వంటి చర్యలు తీసుకుంటోంది. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు కొనుగోలు కూడా చేస్తోంది. -
రాష్ట్రంలో ఏడు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్క్యాప్) రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వీటి సామర్థ్యం 6,300 మెగావాట్లు. వీటి ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నెడ్క్యాప్ టెండర్లు పిలిచింది. ఏడు కంపెనీలు సాంకేతిక బిడ్కు అర్హత సాధించాయి. త్వరలో ఆర్థిక బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు చేపడతామని నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి గురువారం తెలిపారు. కోతలకు అవకాశం లేకుండా.. పీక్ డిమాండ్ (ఎక్కువ వినియోగం ఉండే సమయం)లో విద్యుత్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటే కోతలకు ఆస్కారం ఉండదు. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి సమయంలో వినియోగం తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇలా.. నీటి రిజర్వాయర్ల దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ప్రత్యేకంగా నీటి నిల్వ కోసం ఓ రిజర్వాయర్ను నిర్మిస్తారు. కిందకు వెళ్లిన నీటిని పంపుల ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లోకి పంపుతారు. నాన్ పీక్ అవర్స్ (డిమాండ్ లేని సమయం)లో సౌర, పవన విద్యుత్తో దిగువన ఉన్న నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్కు తరలిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు జల విద్యుత్కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో డిమాండ్ ఉండే సమయంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనే ఇబ్బంది తప్పుతుంది. సౌర, పవన విద్యుత్లనూ మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రాల కాలపరిమితి దాదాపు 80 ఏళ్లు. నిర్మాణ వ్యయం తొలి 25 ఏళ్లలోనే తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చౌకగా జలవిద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 32 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించారు. -
ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపట్టడానికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) శాస్త్రీయంగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ లభించే వీలుంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. తొలిదశలో 6,050 మెగావాట్లకు టెండర్ డాక్యుమెంట్ను రూపొందించింది. ప్రస్తుతం దీనిని న్యాయ సమీక్షకు పంపారు. అనంతరం టెండర్లు పిలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల పంపుసెట్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. దీని వ్యయం రూ. 8,400 కోట్లు. మరో పదేళ్లలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ► పెరిగే డిమాండ్ను తట్టుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంపై ఏపీజీఈసీఎల్ కసరత్తు చేసింది. ఫలితంగా ఎక్కువ రేడియేషన్ ఉన్న ప్రాంతాల వైపు మొగ్గు చూపింది. ► ఇప్పటి వరకూ సూర్యశక్తిని విద్యుత్గా మార్చడానికి సాధారణ మాడ్యూల్స్ వాడేవారు. కొత్తప్లాంట్లలో సూర్యాస్తమయం సమయంలో సూర్యశక్తి తగ్గిన తర్వాత కూడా కొంతసేపు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అత్యాధునిక మాడ్యూల్స్ వాడబోతున్నారు. ► సూర్యుడు ప్రసరించే దిశను బట్టి శాస్త్రీయ కోణంలో అంచనాలు వేసి పది ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎత్తయిన ప్రదేశాలతో పాటు, సూర్యశక్తి ఎక్కువ ప్రదేశంలో (ప్యానల్స్ అన్నింటి మీద) ప్రసరించేలా జాగ్రత్త వహించారు. దీనివల్ల తక్కువ సమయంలోనే రేడియేషన్ వచ్చే వీలుందని అధికారులు తెలిపారు. ► మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సోలార్ విద్యుత్ ప్లాంట్లు 18 నుంచి 22 శాతం పీఎల్ఎఫ్తో పనిచేస్తున్నాయి. ప్రతిపాదించిన పది ప్రాంతాల్లో పీఎల్ఎఫ్ 25 శాతం తగ్గకుండా ఉత్పత్తి జరిగే వీలుందని అధికారులు తెలిపారు. అంటే సాధారణంగా 6,050 మెగావాట్లకు రోజుకు 31 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే, కొత్త విధానం ద్వారా రోజుకు 36 మిలియన్ యూనిట్ల వరకూ ఉత్పత్తి అవుతుంది. ► దీంతో రోజుకు దాదాపు రూ. కోటి వరకూ ఆదా అయ్యే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి. -
కడలివైపు కృష్ణమ్మ, పెన్నమ్మ
సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురి సౌత్ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు పది రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు తెరచి 3,77,160 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 26,777 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. కుడిగట్టు కేంద్రంలో 14.47 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ► నాగార్జునసాగర్ జలాశయం నుంచి 20 గేట్ల ద్వారా 3,40,344 క్యూసెక్కులు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 3,56,872 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 2,24,468 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. పెన్నా, ఉప నదులు పాపాఘ్ని, కుందూ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గండికోట, మైలవరం, సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ► సోమశిల నుంచి కండలేరుకు, అక్కడి నుంచి మిగులుగా ఉన్న 60 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నమ్మ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. గోదావరిలోనూ వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 3,55,011 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
స్వచ్ఛం.. సురక్షితం.. కచ్చితం
రేవా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్ను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా? లేక ఆర్థిక వ్యవస్థనా? అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్జీ, విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు. ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. ఇందుకోసం దేశం సోలార్ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. రేవా తరహాలోనే భారీ సోలార్ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్పూర్లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్ సమీపంలో తేలియాడే సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. -
10 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వడవడిగా పడుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయి. సింగరేణి నుంచి మరో 800, సీజీఎస్ ద్వారా మరో 809, సోలార్ ద్వారా 1,584, హైడల్ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. దీంతో మూడేళ్లలో 10 వేల మెగావాట్లకు పైగా అదనపు విద్యుత్ వచ్చి చేరుతుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారనుంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అవసరం ఉన్న వర్గాలకు మరిన్ని రాయితీలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. హైదరాబాద్లో రోజు 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కే సవాల్ను సీఎం కేసీఆర్ మొదటగా స్వీకరించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రం ఏర్పడిన 6వ నెల (2014 నవంబర్ 20) నుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందుతోంది. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. వంద శాతం పెరిగిన సామర్థ్యం.. 2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ఫిబ్రవరి 2020 నాటికి వంద శాతానికి పైగా పెరిగి 15,980 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3,681 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉంది. 27.77 వేల కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రగతి సాధించాయి. 99.9 శాతం ట్రాన్స్ మిషన్ అవెయిలబిలిటీతో దేశ సగటును మించింది. ఇందుకు రూ.27,770 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది. దేశ సగటును మించి ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ దేశ సగటును మించింది. 2018–19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ప్రస్తుతం 1,896 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధి రేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018–19 నాటికి 1,896కి చేరింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017–18లో దేశ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2018–19లో 1,181 యూనిట్లు నమోదైంది. ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలైన ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లలో ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగుల (ఆర్టి జన్ల) సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. -
పవన, సౌర విద్యుత్ ప్లాంట్లతో రైతులకు లబ్ధి
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా రైతులు అత్యంత ప్రయోజనం పొందేలా ‘విద్యుత్ ఎగుమతి విధానం’ (ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ) రూపొందించాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టే వారిని ప్రోత్సహించే విధంగా పాలసీ ఉండాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడ ప్లాంట్లు పెట్టి, వేరే చోట అమ్ముకోవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రైతుల భూముల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి లాభదాయకంగా లీజు సొమ్ము లభించే వీలుందని, ప్రభుత్వ భూములు లీజుకిచ్చినప్పుడు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు అధికారులు తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రాష్ట్ర నెట్వర్క్ ద్వారా ఇతర ప్రాంతాలకు పంపుతారని, ఫలితంగా విద్యుత్ సంస్థలకూ వీలింగ్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుందనే విషయమై చర్చించారు. విండ్, సోలార్ ప్లాంట్లు అటు రైతులకు, ఇటు విద్యుత్ సంస్థలకు లాభదాయకంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. కొత్త ప్లాంట్లు రావడం వల్ల రాష్ట్రంలో యువతకు మరికొన్ని ఉద్యోగాలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలని సీఎం సూచించారు. భూములు లీజుకిచ్చినా ప్రభుత్వం, రైతులకే హక్కులుంటాయని సీఎం అధికారులతో అన్నారు. త్వరితగతిన మెగా సోలార్ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం (బీవోటీ) పద్ధతిలో ప్లాంట్ నిర్మాణం చేపట్టే అంశం కూడా చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్లో ఉచిత విద్యుత్కు ఎలాంటి ఢోకా ఉండదని, ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందనే అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకొచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ఎన్టీపీసీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ అందించేందుకు వీలుగా ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు చేయాలని, వచ్చే రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!
గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్ ఇంటర్ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. ముప్పు ముంచుకొస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్లో మార్పులు చేసి తాము ఫిల్టర్ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు. -
రయ్.. రయ్.. జెన్కో
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో మూడు నెలలుగా విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఐదేళ్లుగా చిక్కి శల్యమైన ఈ సంస్థ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో తిరిగి పుంజుకుంటోంది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 50 శాతం కూడా దాటలేదు. కానీ ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్టంగా 60 శాతానికి పైగా పీఎల్ఎఫ్ నమోదు చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు నాణ్యమైన, చౌకైన విద్యుత్ అందించగలుగుతోంది. ఏపీ జెన్కో పురోభివృద్ధిపై జెన్కో వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరంపర కొనసాగితే ఈ ఏడాది 80 శాతం పీఎల్ఎఫ్కు చేరుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్లుగా అంధకారం! గత ఐదేళ్లుగా టీడీపీ సర్కార్ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకే పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. డిమాండ్ లేకున్నా, యూనిట్కు రూ. 5పైనే చెల్లించి ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసింది. అయిన వాళ్ల కోసం అడ్డగోలు పీపీఏలను ప్రోత్సహించింది. 2015లో ఏకంగా కమిషన్ చెప్పిన దానికి విరుద్ధంగా 11 వేల మిలియన్ యూనిట్లకు పైచిలుకు ప్రైవేటు విద్యుత్ తీసుకుంది. దానికి యూనిట్కు రూ. 6కుపైగా చెల్లించింది. ఈ విధంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తికి భారీగా గండి కొట్టారు. రోజూ 105 మిలియన్ యూనిట్ల సామర్థ్యం ఉన్న జెన్కోను సగానికి తక్కువగా పరిమితం చేశారు. దీంతో జెన్కో నిర్వహణ సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. నిర్మాణ వ్యయంపై కనీసం అప్పులు కట్టుకోలేని దైన్యస్థితికి చేరింది. జెన్కో ఇప్పటికీ రూ. 20 వేల కోట్ల అప్పుల్లో ఉంది. గత ఐదేళ్లుగా కనీసం ఆ అప్పులపై వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది అదికూడా సాధ్యం కాకపోతే విద్యుత్ సంస్థల ఆస్తులు తనఖా పెట్టుకోమని టీడీపీ ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. ఇలా జెన్కోను అంధకారంలోకి నెట్టివేసింది. కొత్త ప్రభుత్వం ప్రోత్సాహంతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఏపీ జెన్కో రూపురేఖలు మారిపోతున్నాయి. వీలైనంత వరకు జెన్కో ఉత్పత్తిని పెంచాలని సర్కార్ ఆదేశించింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 66.69కి పెరిగింది. దీన్ని 80 శాతం వరకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. లోడ్ ఫ్యాక్టర్ పెరిగే కొద్దీ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి అయితే, జెన్కో ఆదాయం గణనీయంగా పెరిగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు బొగ్గు కొరత లేకుండా, నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా మూడు నెలల్లోనే జెన్కో థర్మల్ ఉత్పత్తి గణనీయ స్థాయికి చేరుకుంది. ఖరీదైన ప్రైవేట్ ఉత్పత్తికి కళ్లెం వేస్తూ, పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంతో జెన్కోకు మంచి రోజులొచ్చాయి. మూడు నెలలుగా ప్లాంట్లలో పీఎల్ఎఫ్ పెరగడమే దీనికి తార్కాణం. ఈ పరంపర ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. – జెడ్వీ.గణేష్,బీసీ విద్యుత్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఫ్లైవీల్ టెక్నాలజీతో చౌక విద్యుత్
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితంగా తక్కువ ఖర్చులో విద్యుత్ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్న తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అందించాలని ఫ్లైవీల్ పవర్ మల్టిప్లికేషన్ ఎండీ భాస్కర శ్రీనివాస్ చాగంటి అన్నారు. ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాంక్లేవ్’లో పవర్ సెక్టార్లో జాతీయస్థాయిలో బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డును శనివారం ఎన్ఐఆర్డీలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు చౌకగా, కాలుష్యరహిత విద్యుత్ అందించాలనే ఈ ఆవిష్కరణ కోసం శ్రమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా ఉపయోగించని ‘ఫ్లైవీల్ పవర్ జనరేషన్’సాంకేతికతను రెండున్నర దశాబ్దాలపాటు తాను, తన భార్య చాగంటి బాల పరిశోధించి దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇలాంటి సాంకేతికత దేశంలో ఎక్కడా లేదనేది కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, డీఆర్డీవో, రైల్వే తదితర శాఖలు కితాబిచ్చినట్లు తెలిపారు. -
వేడితో కరెంటు
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉంటోంది. ఫోన్ను ఎక్కువ సేపు వాడితే వేడి అవుతుంటుంది. అయితే ఆ వేడి ఏమవుతుంది..? వృథా అవుతుంది. కానీ ఆ వేడిని వృథా కానీయకుండా.. విద్యుత్ తయారుచేస్తే..! సెల్ఫోన్లే కాదు ఫ్రిజ్లు, కార్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల నుంచి వెలువడే వేడితో విద్యుత్ను తయారుచేస్తే.. చాలా అద్భుతమైన ఐడియా కదా..? అయితే ఇలాంటివన్నీ అనుకోవడానికే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యమవుతుందని మూతి విరవకండి. ఎందుకంటే ఆ ఆలోచనను నిజం చేశారు.. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు. సిలికాన్ చిప్పులను ఉపయోగించి ఉష్ణం నుంచి విద్యుత్ను పుట్టించి చూపించారు. ఇందుకు 5 మి.మీ.ల పరిమాణంలోని రెండు సిలికాన్ చిప్లను 100 నానోమీటర్ల దూరంలో ఉంచి.. ఒకదాన్ని చల్లబరిచి.. మరోదాన్ని వేడి చేశారు. దీంతో ఉష్ణం వెలువడి.. దాని నుంచి విద్యుత్ తయారైంది. సిలికాన్ చిప్ల మధ్య ఎంత దూరం తక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ మాథ్యూ ఫ్రాంకోయెర్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వస్తువులు వేడి కావడాన్ని తగ్గించొచ్చు. వాటి బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరచవచ్చు. సౌర ఫలకాల పనితీరు కూడా మెరుగుపరచవచ్చని, వాహనాల ఇంజన్ నుంచి వెలువడే ఉష్ణ శక్తితో ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేసేలా, కంప్యూటర్లలో వాడే ప్రాసెసర్ల పని తీరు మెరుగుపర్చేలా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. -
వేడి వృథా కాకుండా.. కరెంటు..!
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉంటోంది. ఫోన్ను ఎక్కువ సేపు వాడితే వేడి అవుతుంటుంది. అయితే ఆ వేడి ఏమవుతుంది..? వృథా అవుతుంది. కానీ ఆ వేడిని వృథా కానీయకుండా.. విద్యుత్ తయారుచేస్తే..! సెల్ఫోన్లే కాదు ఫ్రిజ్లు, కార్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల నుంచి వెలువడే వేడితో విద్యుత్ను తయారుచేస్తే.. చాలా అద్భుతమైన ఐడియా కదా..? అయితే ఇలాంటివన్నీ అనుకోవడానికే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యమవుతుందని మూతి విరవకండి. ఎందుకంటే ఆ ఆలోచనను నిజం చేశారు.. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు. సిలికాన్ చిప్పులను ఉపయోగించి ఉష్ణం నుంచి విద్యుత్ను పుట్టించి చూపించారు. ఇందుకు 5 మి.మీ.ల పరిమాణంలోని రెండు సిలికాన్ చిప్లను 100 నానోమీటర్ల దూరంలో ఉంచి.. ఒకదాన్ని చల్లబరిచి.. మరోదాన్ని వేడి చేశారు. దీంతో ఉష్ణం వెలువడి.. దాని నుంచి విద్యుత్ తయారైంది. సిలికాన్ చిప్ల మధ్య ఎంత దూరం తక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ మాథ్యూ ఫ్రాంకోయెర్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వస్తువులు వేడి కావడాన్ని తగ్గించొచ్చు. వాటి బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరచవచ్చు. సౌర ఫలకాల పనితీరు కూడా మెరుగుపరచవచ్చని, వాహనాల ఇంజిన్ నుంచి వెలువడే ఉష్ణ శక్తితో ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేసేలా, కంప్యూటర్లలో వాడే ప్రాసెసర్ల పని తీరు మెరుగుపర్చేలా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. -
బాబు పాలనలో ప్రైవేట్ ‘పవర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కంటే ప్రైవేటు రంగానికే పాలకులు పెద్దపీట వేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీజెన్కో సమర్థతకు పూర్తిగా గండి కొట్టారు. అదేసమయంలో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రైవేటు రంగానికి ఎన్నో రెట్లు మేర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చే సంస్థలను, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వారిని టీడీపీ సర్కారు ప్రోత్సహించింది. ఫలితంగా ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయి, అప్పుల ఊబిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. నిజానికి జెన్కోకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే.. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకే లభించి ఉండేది. కానీ, ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అలా జరగలేదు. తాజాగా విద్యుత్ శాఖ సమీక్షలో నివ్వెరపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. కృష్ణపట్నం నుంచే 1,600 మెగావాట్లు 2014లో ఏపీ జెన్కో కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 4,483.29 మెగావాట్లు కాగా, 2019 నాటికి ఇది కేవలం 7,429.84 మెగావాట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య కాలంలో జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 2,946.54 మెగావాట్లు మాత్రమే అదనంగా పెరిగింది. ఇందులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. 2016లో సీవోడీ ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే ఈ ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెగావాట్ కూడా కొత్తగా ఉత్పత్తి కాలేదు. ప్రైవేటు విద్యుత్ మాత్రం 2014లో 3,997.30 మెగావాట్లు ఉండగా, 2019 మార్చి నాటికి ఏకంగా 9,176.81 మెగావాట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2,946.54 మెగావాట్లు పెరిగితే, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి 5,179.51 మెగావాట్లు పెరిగింది. వినియోగదారులపైనే భారం దేశవ్యాప్తంగా కాంపిటీటివ్ బిడ్డింగ్లో సోలార్, పవన విద్యుత్ ధరలను నిర్ణయిస్తుండగా, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టింది. సోలార్ కరెంటుకు ఒక్కో యూనిట్కు గరిష్టంగా రూ.6, పవన విద్యుత్కు రూ.4.84 వరకూ చెల్లించింది. ఐదేళ్లలో ప్రైవేటు రంగంలో పవన విద్యుత్ ఉత్పత్తి 777.02 మెగావాట్ల నుంచి 4,102.39 మెగావాట్లకు చేరింది. ఇదే సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి 76.85 మెగావాట్ల నుంచి 2,584.85 మెగావాట్లకు పెరిగింది. టీడీపీ ప్రభుత్వంలో పాలకులు తమ స్వలాభం కోసం జెన్కోను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ సంస్థలు దాదాపు రూ.20 వేల కోట్ల మేర అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
పల్లెపై బూడిద పడగ..
సాక్షి, తోటపల్లిగూడూరు: తీర ప్రాంతం పల్లెలపై బూడిద పడగేస్తోంది. పచ్చని పల్లెలు పవర్ ప్రాజెక్ట్లు వెదజల్లే వాయు కాలుష్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మండలంలోని వరకవిపూడి పంచాయతీ అనంతపురంలో సెంబ్కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ (ఎన్సీసీపీపీఎల్) ఏర్పాటైంది. 1,300 మెగావాట్ల విద్యుతుత్పత్తి లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం విద్యుతుత్పత్తి కొనసాగిస్తోంది. దీనికి సమీపంలోనే టీపీసీఎల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తన కార్యకాలాపాలను సాగిస్తోంది. విద్యుతుత్పత్తి ప్రారంభించిన సెంబ్కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ ఏడాదికే విషవాయువుల రూపంలో తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో వెలుబడుతున్న విష వాయువులు వరకవిపూడి, మండపం పంచాయతీలతో పాటు ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. మనుషులు.. మొక్కలు విలవిల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్లతో వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయతీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్పురం, గొల్లపాళెం గ్రామాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద, విషవాయులు ఇళ్లను చుట్టుముట్టతుండంతో ఆరుబయట విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. క్యాన్సర్, అల్సర్, ఇతర గుండె సంబంధిత వ్యాధులతో స్థానికులు వైద్యశాలల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. ఇళ్లల్లో పెంచుకొంటున్న పూల మొక్కలతో పాటు ఏళ్ల నాటి వటవృక్షాలు సైతం ఎండుముఖం పట్టి మోడు బారిపోతున్నాయి. ఏళ్ల తరబడి నీడతో పాటు ప్రాణవాయువును ఇచ్చిన పచ్చని చెట్లు తమ కళ్లెదుటే నిలువునా ఎండిపోతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేçస్తున్నారు. స్థానికంగా ఉన్న వందల ఎకరాల్లో పంటలు సైతం పండక భూములను బీళ్లుగా మార్చుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. వరిపైర్లపై వీటి ప్రభావం అధికంగా ఉండడంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు దాపరించాయని స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి సెంబ్కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ కారణంగా పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి. ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో కాలుష్యం విడుదలవుతూ పంటలు, పూల మొక్కలు, చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. కాలుష్యంతో స్థానికులు వివిధ రోగాల బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాజెక్ట్ల నుంచి విడుదలవుతున్న కాలుష్యం నియంత్రణ విషయంలో కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం. – ఉప్పల శంకరయ్యగౌడ్, అనంతపురం చెప్పిందొకటి.. చేస్తుంది మరొకటి ప్రాజెక్ట్ ప్రారంభం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, కనీస సౌకర్యాల కల్పనలో సెంబ్కార్ఫ్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యం పూర్తిగా గాలికొదిలేసింది. కాలుష్యం బారిన పడిన గ్రామాలకు, స్థానికులను రక్షించండంటూ మొత్తుకొంటున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విషయాయుల ప్రభావంతో స్థానిక గ్రామాల ప్రజలు అనేక రోగాలతో అల్లాడుతున్నారు. విషవాయువులు అధికమై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకీడుస్తున్న పైనాపుపురం గ్రామ వాసులను వేరే ప్రాంతానికి తరలించాలని అభ్యర్థిస్తున్న ఉలుకుపలుకు లేదు. – నెల్లూరు శివప్రసాద్, పైనాపురం -
మరో మైలురాయి దాటిన ఎన్ఎఫ్సీ
కుషాయిగూడ: అణు విద్యుత్ ఉత్పత్తిలో నిరంతరాయంగ సేవలందింస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంఫ్లెక్స్ (ఎన్ఎఫ్సీ) మరో మైలురాయిని దాటింది. సంస్థ తయారు చేసే పవర్ బండిల్స్ ఉత్పత్తి మిలియన్ (10లక్షలు)లకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం ఎన్ఎఫ్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా çహా జరైన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ యస్కే శర్మకు ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ శ్రీవాస్తవ పవర్ బండిల్స్ను అందజేశారు. అందుబాటులో అన్ని ఎఫర్ట్స్ను ఉపయోగిం చి సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తోడ్పాటునందిస్తున్న ఎన్ఎఫ్సీ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. -
అలల ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి...
సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం కొత్త కాకపోయినప్పటికీ... చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు ఎడిన్బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త యంత్రాన్ని తయారు చేశారు. ఇప్పటికే ఉన్న సముద్ర తరంగ జలశక్తి కేంద్రాల్లో వీటిని నేరుగా వాడుకోవచ్చు. లేదంటే విడిగానూ ఏర్పాటు చేసుకోవచ్చు. తాము తయారు చేసిన నమూనా యంత్రం ద్వారా 500 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఇది వంద ఇళ్లకు సరిపడా ఉంటుందని డేవిడ్ ఇన్గ్రామ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. డై ఎలక్ట్రిక్ ఎలాస్టోమీటర్ జనరేటర్ అని పిలిచే ఈ కొత్తయంత్రం రబ్బరుతో తయారైంది.గొట్టాల పైభాగంలో ఈ రబ్బరుతో తయారైన భాగాలను ఏర్పాటు చేస్తారు. గొట్టాల అడుగు భాగం నుంచి అలలు ప్రయాణిస్తాయి. ఫలితంగా ఈ రబ్బరు భాగంలో ఉండే గాలి పైకి ఎగుస్తుంది.. అల వెనక్కు వెళ్లగానే గాలి కూడా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో రబ్బరు భాగాలపైన ఉండే జనరేటర్లు కూడా పనిచేస్తాయి. విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ప్రస్తుతం తాము 25 మీటర్ల వ్యాసమున్న ట్యాంక్లో నమూనా యంత్రాన్ని పరిశీలిస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
‘వ్యర్థాల నుంచి విద్యుత్’పై రామ్కీ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రామ్కీ గ్రూప్ కంపెనీ... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే విషయంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా 45 మెగావాట్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహిస్తోంది. ఇవి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై సంస్థ రూ.600 కోట్లు వ్యయం చేసింది. మరో 105 మెగావాట్లకు సమానమైన ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ ఎం.గౌతమ్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి కోసం సుమారు రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. 2021 నాటికి ఇతర విభాగాలపై కంపెనీ మరో రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త మార్కెట్లకు.. కేకేఆర్కు వాటా విక్రయించటం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అడుగుపెట్టడానికి వినియోగించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో కంపెనీ సేవలందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 30% ఆదాయం సమకూరుతోంది. 2021 నాటికి ఇది 35– 36 శాతానికి చేరనుంది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తాం. మొత్తంగా భారత మార్కెట్ రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధిని నడిపిస్తుంది. క్లీన్ ఇండియా లక్ష్యంతో రామ్కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేకేఆర్ తోడవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సంబంధ సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్య 18,000కు... ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్లో 60 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.3,670 కోట్లు. విక్రయం అనంతరం సంస్థలో రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాటా 40 శాతానికి పరిమితమవుతుంది. తాజా డీల్లో భాగంగా ఐఎల్అండ్ఎఫ్ఎస్ ప్రైవేట్ ఈక్విటీ, స్టాండర్డ్ చార్టర్డ్లు కంపెనీలో తమకున్న 11 శాతం వాటాను కేకేఆర్కు విక్రయించాయి. ఇక రామ్కీ ఎన్విరో ఎండీగా గౌతమ్రెడ్డి కొనసాగుతారు. కేకేఆర్ టీమ్ సభ్యులు కంపెనీ బోర్డులోకి వస్తారు. కంపెనీలో ప్రస్తుతం 10,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 18,000 దాటనుంది. భారత్లో 20 నగరాల్లో రామ్కీ ఎన్విరో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కంపెనీ ఏటా 35 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 10 లక్షల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహిస్తోంది. 20,000 పైచిలుకు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు సేవలందిస్తోంది. -
కేటీపీఎస్ ప్రస్థానంలో మరో మైలురాయి
సాక్షి, కొత్తగూడెం: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) సుదీర్ఘ ప్రస్థానంలో 7వ దశ మరో మైలురాయిగా నిలవనుంది. అర్ధ శతాబ్దకాలంగా వెలుగులు విరజిమ్ముతున్న కేటీపీఎస్ సరికొత్త రూపు సంతరించుకోనుంది. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చే విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. జూలైలో అందుబాటులోకి రానున్న 7వ దశ ప్లాంట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైతే ప్రతిరోజూ కేటీపీఎస్ నుంచి రాష్ట్ర గ్రిడ్కు 2,460 మెగావాట్ల విద్యుత్తు సరఫరా కానుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3వ యూనిట్ మూతపడిన తరువాత) 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రూ.5,200 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన 7వ దశ ప్లాంట్ ద్వారా జూలై 8 నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేసేందుకు జెన్కో రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేటీపీఎస్ ఖ్యాతి మరింత విస్తరించనుంది. అనేక అవాంతరాలను అధిగమిస్తూ.. 2015 డిసెంబరులో 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అనేక అవాంతరాలను అధిగమిస్తూ తుది దశకు చేరుకుంది. గత డిసెంబరు నెలలో ట్రాక్ ఆర్డర్ వద్ద టీపీ–3 ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. ఈ నెలలో సాంకేతిక లోపం కారణంగా స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇలాంటి పలు అవాంతరాలను అధిగమిస్తూ 7వ దశ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ పూర్తి చేసింది. కీలకమైన మొదటి విడత లైటప్ పనులు జనవరి 31న పూర్తి చేశారు. యాసిడ్ క్లీనింగ్ పనులు, స్టీమ్ బ్లోయింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం వాల్వ్స్ సెట్టింగ్, రోలింగ్ టెస్టింగ్, పైప్ కంట్రోల్ వాల్వ్స్, గేజ్లు టెస్ట్ చేస్తున్నారు. టర్బైన్ పరీక్షించి జూన్ 20 నుంచి 25లోగా సింక్రనైజేషన్ చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. కోల్ ప్లాంట్, చిమ్నీ, కూలింగ్ టవర్, స్విచ్ యార్డు, ఫ్యూయల్ ఆయిల్ సిస్టమ్, రా వాటర్ రిజర్వాయర్ల పనులన్నీ 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. సర్వీస్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, క్యాంటీన్ బిల్డింగ్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. 26న సింక్రనైజేషన్కు ఏర్పాట్లు ఈ నెల 26న సింక్రనైజేషన్ చేసేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిసారి విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్కు (ట్రాన్స్కో) అనుసంధానం చేసే ప్రక్రియను సింక్రనైజేషన్ అంటారు. ఇప్పటికే బాయిలర్ పనులన్నీ పూర్తి కాగా గత ఏప్రిల్, మే నెలల్లోనే బాయిలర్లోని వేలాది పైపులైన్లను శుద్ధిచేసే ప్రక్రియ (స్టీం బ్లోయింగ్) పనులు కూడా విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం అన్ని పైపుల్లో టెస్టింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే సింక్రనైజేషన్ చేయడమే. ఇది పూర్తయ్యాక వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేసేందుకు నిర్ణయించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో.. కేటీపీఎస్లో ఇప్పటి వరకు ఉన్న 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతిలో విద్యుదుత్పత్తి చేసేవే. ఈ నేపథ్యంలో 7వ దశ ప్లాంట్ను ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్క్రిటికల్ టెక్నాలజీతో పోల్చుకుంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. 7వ దశలో భారీ నిర్మాణాలను బీహెచ్ఈఎల్ సంస్థ అనుకున్న సమయానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాయిలర్ను నిర్మించేందుకు 42 నెలలు నిర్దేశించుకోగా, 24 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. 2016 జూలైలో ప్రారంభమైన కూలింగ్టవర్ నిర్మాణం 2017 డిసెంబర్ నాటికి (18నెలల్లో) నిర్మాణం పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించినట్లు జెన్కో అధికారులు చెబుతున్నారు. 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ(షెల్) నిర్మాణం పనులు 20 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 370 మీటర్ల పొడవైన ట్రాక్ ఆపర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ట్రాక్పై ఒకేసారి 58 బోగీలు (1 ర్యాక్) ద్వారా 60 వేల టన్నుల బొగ్గు దిగుమతి అవుతుంది. మండించేందుకు ఈ ప్లాంట్కు ఒక రోజుకు 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. ఇక వ్యాగన్ టిప్లర్ పనులు నెలరోజుల్లో పూర్తి అయ్యాయి. బోగీ ఆగగానే బొగ్గు భూగర్భంలోకి జారిపోతుంది. 8 నాటికి పూర్తి స్థాయిలో.. 7వ దశ ప్లాంట్ నుంచి వచ్చే నెల 8వ తేదీ కల్లా విద్యుదుత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల చివరి వారం లో సింక్రనైజేషన్ చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందకు వెళుతున్నాం. సింక్రనైజేషన్ తర్వాత ముఖ్యమైన పనులు పూర్తి చేసి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి దిశగా వెళతాం. విద్యుదుత్పత్తి ప్రక్రియ నడిపిస్తూనే బయట ప్రాంగణంలో పెండింగ్లో ఉన్న సివిల్ పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేస్తాం. – సమ్మయ్య, చీఫ్ ఇంజనీరు -
ఫార్మాసిటీలో మూడు ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఔషధ నగరి పారిశ్రామికవాడలో ఔషధాలతో పాటు భారీ ఎత్తున విద్యుదుత్పత్తి జరగనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించనున్న హైదరాబాద్ ఫార్మాసిటీలో సౌర, సహజవాయువులు, ఘన వ్యర్థాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) నిర్ణయం తీసుకుంది. ఈ పారిశ్రామికవాడ అవసరాలకు 985 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండ గా, ఈ మూడు రకాల విద్యుత్ ప్లాంట్ల ద్వారా 688 మెగావాట్ల విద్యుత్ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి విని యోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 435 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్, 250 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం, మరో 3 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ(వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి) ప్లాంట్లను ఫార్మాసిటీలో నెలకొల్పుతామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. ఫార్మాసిటీ తుది విడత నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేస్తామని తెలిపింది. గ్యాస్ ఆధారిత విద్యుదు త్పత్తి ప్లాంట్కు అవసరమైన సహజవాయువులను సర ఫరా చేసేందుకు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరే షన్ అంగీకరించింది. ఫార్మాసిటీలోని పరిశ్రమలు, నివాస సముదాయాల నుంచి ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరపనున్నారు. అతిపెద్ద రూఫ్ టాప్ ! ఫార్మాసిటీలో ఏర్పాటు కానున్న 435 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది. దేశంలో మరెక్కడా కనీసం 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఫార్మాసిటీలో వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, విశ్వవిద్యాలయం, నివాస సముదాయాలకు సంబంధించిన భవనాలను నిర్మించనుండటంతో భారీ విస్తీర్ణంలో భవనాలపైన ఖాళీ ప్రాంతం అందుబాటులోకి రానుంది. ఫార్మాసిటీ ప్రణాళిక ప్రకారం... 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానుండగా, 9,535 ఎకరాల్లో పరిశ్రమలు, 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, 322 ఎకరాల్లో ఫార్మా వర్సిటీ, 544 ఎకరాల్లో కార్యాలయాలు, 827 ఎకరాల్లో పరిశోధన కేంద్రం, 203 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్, 104 ఎకరాల్లో ఆస్పత్రి, 141 ఎకరాల్లో హోటల్ను నిర్మించనున్నారు. వీటన్నింటికి సంబంధించిన భవనాలపై భాగంలో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 435 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. -
రెండేళ్లలో 3,480 మెగావాట్ల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో వచ్చే నెల నుండే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రెండేళ్లలో అదనంగా 3,480 మెగావాట్లు, ఆ తరువాత రెండేళ్లలో మరో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు వెల్లడించారు. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడోదశ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 1080 (4గీ270) మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్కు సంబంధించి తొలి రెండు యూనిట్లు వచ్చే ఏడాది మార్చి, మరో రెండు యూనిట్లు డిసెంబర్ నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ఆయన విద్యుత్ సౌధలో సమీక్షించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబె, జనరల్ మేనేజర్ సుదర్శన్, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి 20 వేల మెగావాట్లు ఎన్టీపీసీ, భద్రాద్రి, కేటీపీఎస్ ద్వారా 2020 మార్చి నాటికి అదనంగా 3,480 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ప్రభాకర్రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 20,000 మెగావాట్లు దాటుతుందన్నారు. 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంటును కూడా నిర్మిస్తామన్నారు. సోలార్, హైడల్, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా కూడా 28,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. శరవేగంగా రామగుండం ప్లాంట్ పనులు రామగుండంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగాల్సి వుండగా మొదటి దశలో 1600 (2గీ800) మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్టీపీసీ ఏఈ దూబె తెలిపారు. తొలి యూనిట్ ద్వారా వచ్చే ఏడాది నవంబర్ నుండి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మూడు నెలలకు మరో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
వెలుగుల దివ్వె ఎన్టీపీసీ
సాక్షి, పెద్దపల్లి/జ్యోతినగర్: దక్షిణభారత దేశానికి వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 40వ వసంతంలోకి అడుగు పెట్టింది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి వెలుగు కిరణాలను అందిస్తున్న ఎన్టీపీసీ గణనీయ పురోగతిని సాధిస్తోంది. 200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎన్టీపీసీ అంచెలంచెలుగా ఎదిగి 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రపంచ విద్యుత్ సంస్థలతో పోటీపడుతూ, ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని, రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తోంది. రామగుండం ఎన్టీపీసీ మంగళవారం 40వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం.. 1978లో శ్రీకారం అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1978 నవంబర్ 14న నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా ఎన్టీపీసీ పురుడు పోసు కుంది. 1983 అక్టోబర్ 23 నుంచి ప్లాంట్ వెలుగులు పంచడం మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఐఎస్వో 14001 సర్టిఫికెట్ ‘సూపర్ థర్మల్ పవర్ స్టేషన్’ అవార్డు పొందింది. ప్రపంచ స్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. 2,600 మెగావాట్ల సామర్థ్యం 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎన్టీపీసీ ప్రస్తు తం 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లోనే 11,048.100 మిలియన్ యూనిట్లను 82.78 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో ఉత్పత్తి చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం లో 19,597.497 మిలియన్ యూనిట్లను 86.04 శాతం పీఎల్ఎఫ్తో ఉత్పత్తి చేసింది. రామగుండంలో ఈ ఏడాది మార్చి 29న ఒక్కరోజు 64.401 మిలియన్ యూనిట్ల విద్యు దుత్పత్తి చేసి రికార్డు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. త్వరలో ‘తెలంగాణ’ వెలుగులు రాష్ట్ర పునర్విభజన ప్రకారం తెలంగాణకే త్వరలో ఎన్టీపీసీ వెలుగులు పంచబోతోంది. నిర్మాణ దశలో ఉన్న 1,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్ పూర్తయితే, మన రాష్ట్రానికి మరింత విద్యుత్ అందనుంది. తెలంగాణ స్టేజీ–1లో 800 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు యూనిట్ల నిర్మాణం ప్రస్తుతం సాగుతోంది. దీనితో ఎన్టీపీసీకి 1,600 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందనుంది. తెలంగాణ స్టేజీ–1ను 2016లో ప్రధాని మోదీ ప్రారంభించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో సంవత్సరానికి 8.0 మెట్రిక్ టన్నుల బొగ్గు, రెండు టీఎంసీల ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగం, మందాకిని–బి కోల్మైన్, ఒడిశా, డబ్ల్యూపీ ఎల్ కోల్ లింకేజీతో రూ.10,598.98 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. సోలార్ విద్యుత్ ను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సోలార్ ఫొటో వొల్టాయిక్ టెక్నా లజీతో క్రిస్టాలిన్ సిలికాన్ మోడ్యూల్స్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2016–17లో 16.101 మిలియన్ యూనిట్లను 18.39 సీయూఎఫ్తో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీనిని 132 కేవీ ద్వారా గ్రిడ్కు అనుసంధానించారు. అవార్డులు... - స్వర్ణశక్తి అవార్డు 2015–16 (విన్నర్ సీఎస్సార్–సీడి, రన్నర్ ప్రోడక్టివిటీలో) - ఎన్టీపీసీ బీఈ మోడల్ 2016–17లో ద్వితీయ స్థానం. - ఎంజీఆర్ విభాగం ఉద్యోగులకు విశ్వకర్మ పురస్కారం - క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా చాప్టర్ అవార్డు. - గ్రీన్టెక్ సేఫ్టీ అవార్డు–2016 - ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్ అవార్డు అంతర్జాతీయ గుర్తింపు రామగుండం ఎన్టీపీసీకి 2015 ప్రపంచ అత్యుత్తమ ప్రాజెక్టుగా అమెరికా పవర్ మ్యాగజైన్ గుర్తింపు దక్కింది. 442 రోజులు నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేసి జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకుంది. – దిలీప్కుమార్ దూబే,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్టీపీసీ రామగుండం 89 శాతం బూడిద.. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిదను 89.04 శాతం ఉపయోగంలోకి తెచ్చారు. రైల్వే వ్యాగన్ల ద్వారా బూడిదను తరలించి, భూగర్భ గనుల్లో నింపేం దుకు చర్యలు తీసుకొంటున్నారు. రైతులకు ఉచిత బూడిద సరఫరా చేయడంతో పాటు, బొగ్గు పూర్తిగా తొలగించిన ఓపెన్కాస్టు మైన్లను బూడిదతో నింపేందుకు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. 100 శాతం బూడిద వినియోగానికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. విద్యుదుత్ప త్తిలో రక్షణ చర్యలకు సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తోంది. సేప్టీ మేనేజ్ మెంట్ విధానం ద్వారా ప్రతి విభా గంలో రక్షణ బృందాలను ఏర్పాటు చేసి అనుక్షణం గమనిస్తుంటారు. క్వాలిటీ సర్కిల్ బృందాల ద్వారా వృత్తి నైపుణ్యతను పెంచుతూ, విద్యుదుత్పత్తి, ఉత్పాదకతలో మెరు గైన పద్ధతులను పాటిస్తున్నారు. తెలంగాణ స్టేజీ–1ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ (ఫైల్) -
జోరుగా జల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఊపందుకుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో డ్యాం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల అంచనాలకు మించి ఈ ఏడాది జల విద్యుదుత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ వార్షిక బడ్జెట్ నివేదికలో అంచనా వేశాయి. గత ఐదేళ్లలో జరిగిన జల విద్యుత్ నుంచి సగటు తీసి ఈ అంచనాకు వచ్చాయి. అయితే ఆదివారం నాటికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని జలాశయాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 504.9 టీఎంసీల వరద వచ్చి చేరగా.. వీటితో మొత్తం 1,424 ఎంయూల జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) వర్గాలు అంచనా వేశాయి. గత శనివారం నాటికే 725.81 ఎంయూ జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో ఇంకా 308.1 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో 2,351.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 11 జల విద్యుత్ కేంద్రాలు ఉండగా.. రోజుకు 25–30 మిలియన్ యూనిట్ల చొప్పున ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక ప్రైవేటు కొనుగోళ్లు అక్కర్లేదు.. వర్షాభావంతో ఏటా జల విద్యుదుత్పత్తిపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఉత్పత్తి లేకపోవడంతో లోటు పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే 2015–16లో 10 శాతమే జల విద్యుదుత్పత్తి జరిగినట్లు డిస్కంలు తమ వార్షిక బడ్జెట్ నివేదికలో పేర్కొన్నాయి. 2015–16లో సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.45కు పెరిగిందని, 2014–15తో పోల్చితే ఇది 53 పైసలు అధికమని ఇందులో నివేదించాయి. ఆశించిన మేరకు జల విద్యుదుత్పత్తి లేకపోవడంతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు ఏటా రూ.వందల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయి. 2015–16లో కేవలం 284.76 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరగ్గా.. 2016–17లో 1,305.80 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2017–18లో ఇప్పటివరకు 725.81 ఎంయూల ఉత్పత్తి జరగ్గా ఏడాది ముగిసే నాటికి 1,500 ఎంయూలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో డిస్కంలపై ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గనుంది. జెన్కోకు రూ.10 కోట్ల లాభం జల విద్యుదుత్పత్తి ప్రారంభం కావడంతో తెలంగాణలో విద్యుత్ మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో బయటి మార్కెట్లో, పవర్ ఎక్సే్ఛంజీలకు విద్యుత్ను విక్రయించి లాభాలు ఆర్జిస్తోంది. గత బుధవారం నుంచి ఆదివారం వరకు రోజుకు 3.5 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ విక్రయిస్తూ రూ.12 కోట్ల వరకు తెలంగాణ జెన్కో ఆదాయం ఆర్జించింది. రూ.2 కోట్ల ఉత్పత్తి వ్యయంతో రూ.12 కోట్ల ఆదాయాన్ని గడించింది. థర్మల్ విద్యుదుత్పత్తి కోసం యూనిట్కు రూ.3.50 నుంచి రూ.3.45 వరకు వ్యయం అవుతుండగా.. జల విద్యుత్ విషయంలో మాత్రం యూనిట్కు దాదాపు రూపాయి ఖర్చు అవుతోంది. ఎక్కడెంత ఉత్పత్తి? ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రియదర్శిని జూరాలలో 162.21 ఎంయూలు, దిగువ జూరాలలో 152.65 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 362.51 ఎంయూలు, నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 30 ఎంయూల విద్యుదుత్పత్తి జరిగింది. అలాగే చిన్న జల విద్యుత్ కేంద్రాలైన సింగూరులో 4.59 ఎంయూలు, నిజాంసాగర్లో 3.53 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్ నుంచి ఎడమ గట్టు కాల్వకు, పోచంపాడు రిజర్వాయర్ నుంచి కాకతీయ కెనాల్కు నీటిని విడుదల చేయాల్సి ఉంది. త్వరలో అక్కడి జల విద్యుత్ కేంద్రాల్లో సైతం ఉత్పత్తి ప్రారంభం కానుంది. -
జల విద్యుత్పై ‘పవన’వేటు
సాక్షి, అమరావతి: ప్రైవేటు సౌర, పవన విద్యుత్ కొనుగోలు కోసం థర్మల్ ఉత్పత్తికే కాదు... జల విద్యుత్కూ కోత పెట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసినా, ఏపీ మాత్రం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. 2014 నుంచీ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్ళున్నా, జల విద్యుత్ కేంద్రాలను సకాలంలో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా యూనిట్ రూ.1.80లకే లభించే జల విద్యుత్కు బదులు... యూనిట్ రూ. 5లుపైగా వెచ్చించి, పవన, సౌర విద్యుత్ను కొనుగోలు చేశారు. 2005 నుంచి 2007 వరకూ రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) జల విద్యుత్ ఉత్పత్తి 32 శాతం వరకూ పెరిగింది. 2007–08లో కూడా 11 శాతం అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి ప్రభుత్వం చౌకగా లభించే విద్యుత్కే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కానీ 2014 తర్వాత ఏపీ జెన్కో పరిధిలోని జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించింది. ఇది 2015 తర్వాత మరింత పెరిగింది. అప్పటికే ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం బేరసారాలు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఏపీఈఆర్సీ అనుమతించినా... పవన, సౌర విద్యుత్ కన్నా ముందు జల విద్యుత్కే ప్రాధాన్యం ఇవ్వాలని, దాని ఉత్పత్తిని పెంచాలని 2015–16లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్ ఆర్డర్లో స్పష్టం చేసింది. ఈ కాలంలో 3,404 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపింది. కానీ ఏపీ జెన్కో మాత్రం 2,320 మిలియన్ యూనిట్లకు మించి (32 శాతం తక్కువ) ఉత్పత్తి చేయలేదు. 2014–15లో 15 వేల మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున విద్యుత్ భారం మోపాల్సి వచ్చిందని అప్పట్లో కమిషన్ ముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సోలార్, విండ్ పవర్కు ప్రభుత్వం యూనిట్కు సగటున రూ. 5 వరకూ ఖర్చు పెడుతోంది. 2014లో సోలార్ పవర్ను యూనిట్ రూ. 6.25 చొప్పున కూడా కొనుగోలు చేసింది. కానీ జల విద్యుత్ కేవలం రూ.1.80కే లభిస్తుంది. మరమ్మతులేవి? నిజానికి రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, ఎగువ ప్రాంతాల వరద నీటితో డ్యాంల్లో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు చేరుతూనే ఉంది. మాచ్ఖండ్, తుంగభద్ర వంటి పొరుగు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులు చేయని కారణంగా తరచూ రిపేర్లు వస్తున్నాయి. రాష్ట్ర జెన్కో పరిధిలోని అప్పర్, లోయర్ సీలేరు, డొంకరాయి, శ్రీశైలం కుడికాల్వ, నాగార్జునసాగర్ కుడి, టేల్పాండ్ జల విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చే సమయానికే యంత్రాలను ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు థర్మల్ ప్లాంట్లను తరచూ మరమ్మతుల కోసం ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. వీటి స్థానంలో ప్రైవేటు పవన, సౌర విద్యుత్ను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ డిమాండ్లో సగానికిపైగా ఇవే ఆక్రమిస్తున్నాయి. అనూహ్య పరిస్థితిల్లో పవన విద్యుత్ పడిపోతే, అప్పటికప్పుడు థర్మల్ ప్లాంట్లను ఉత్పత్తిలోకి తేవడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. -
ఈ సోలార్ సెల్స్ను ఉతికేయొచ్చు..
సూర్యుడు వెలుగుతుంటే చాలు.. నీళ్లల్లో నానబెట్టినా.. రబ్బరులా సాగదీసినా.. కాగితంలా నలిపేసినా.. నిత్యం విద్యుత్ ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్ సెల్ ఇది. టోక్యోలోని రైకిన్, టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. కాగితం కంటే పలుచగా ఉండే ఈ సోలార్ సెల్స్ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అక్కడికక్కడే చార్జ్ చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒక్కో చదరపు సెంటీమీటర్కు దాదాపు 7.86 మిల్లీవాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. రెండు గంటల పాటు నీళ్లలో ఉంచినా దీని సామర్థ్యం నామమాత్రంగానే తగ్గుతుంది. పీఎన్టీజెడ్4ఓ అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు. -
రివర్స్ పంపింగ్ ఎస్సారెస్పీ దాకా చేయాలి
రెండు లిఫ్టుల భారం తగ్గుతుంది: జీవన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం దాకా ఉపయోగిస్తున్న రివర్స్ పంపింగ్ విధానాన్ని ఎస్సారెస్పీ వరకు కొనసాగించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లా డుతూ కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్తో తరలించడం ద్వారా వరద సమయంలో విద్యుత్ ఉత్పత్తికూడా కలిసి వస్తుందన్నారు. ఈ ప్రతిపాదన ద్వారా 50 కిలోమీటర్ల కాలువ నిర్మాణం, అదనంగా రెండు లిఫ్ట్ల భారం తగ్గు తుందన్నారు. గోదావరి ద్వారా రివర్స్ పంపింగ్ను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తా యన్నారు. అలాగే కడెంకు దిగువన మరో ప్రాజెక్టు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్కు నీటి తరలింపుపై ప్రభుత్వమే నిర్ణయం మార్చుకోవడం సంతోషకరమన్నారు. కోర్టుకెళ్లడమే తప్పంటే ఎలా? మంత్రి హరీశ్రావుకు న్యాయవ్య వస్థపై గౌరవముందా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కోర్టులకు ఎవరైనా వెళ్లొ చ్చునని, అయితే కోర్టులు ఏం తీర్పులు చెబుతున్నాయనేది ముఖ్య మన్నారు. భూసేకరణ చట్టం–2013 పక్కన పెట్టినందుకే బాధితులు కోర్టులకు వెళ్లారని చెప్పారు. కోర్టులకు వెళ్లడమే తప్పు అన్నట్టుగా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని, ఇది న్యాయ వ్యవస్థను తప్పుపట్టే విధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనన్నారు. జీఎస్టీని అద్భుతం అని కేసీఆర్ పొగడ్తలు కురిపించినప్పుడు నిజాలే మిటో తెలియదా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ దీక్షకు దిగితే అరెస్టు చేసి, దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామి కమని విమర్శించారు. -
జాంబీ ఎనర్జీ.. ఇంకెన్నాళ్లు!
రూ. 1.08 లక్షల కోట్లు శిలాజ ఇంధనాల విద్యుత్ ఉత్పత్తికి ఏటా సబ్సిడీలు రూ. 9.02 లక్షల కోట్లు ఉద్గారాల వల్ల ప్రజారోగ్యానికి కలుగుతున్న నష్టం 64.5% సబ్సిడీలు రద్దు చేస్తే వాయు కాలుష్య అకాల మరణాల్లో తగ్గుదల బ్రస్సెల్స్కు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అలయెన్స్(హీల్) అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అంశాలివీ. ప్రభుత్వ సబ్సిడీల వల్ల ప్రజారోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి ఈ నివేదిక విశ్లేషించింది. శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్నే పరిశోధకులు ‘జాంబీ ఎనర్జీ’ అంటుంటారు. కోల్, ఆయిల్, గ్యాస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో ప్రజారోగ్యానికి నష్టం కలుగుతుండటమే దీనికి కారణం. 2012లో ఇండోర్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల సంఖ్య 65 లక్షలు. మొత్తం మరణాల్లో ఇది 11.6 శాతం. – సాక్షి, తెలంగాణ డెస్క్ సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత లేదు.. 2014లో జీ20 దేశాలు శిలాజ ఇంధన కంపెనీలకు సబ్సిడీల కోసం వెచ్చించిన మొత్తం రూ.28.47 లక్షల కోట్లు. ఇదే సమయంలో శిలాజ ఇంధనాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య ఖర్చులు రూ.176.93 లక్షల కోట్లు. సబ్సిడీలకు ఇది ఆరు రెట్లు ఎక్కువ. వాయు కాలుష్యం వల్ల జీ20 దేశాల్లో సంభవిస్తున్న అకాల మరణాలు 32 లక్షలకు పైనే. 2009లో జీ20 దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను దశలవారీగా తగ్గిస్తామని ప్రకటించాయి. 2016 నాటికి అంటే ఏడేళ్ల తర్వాత కూడా దశలవారీగా సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత రాలేదు. ఇప్పటికీ జీ20 దేశాలు 2013–2015 మధ్య ఏటా రూ.4.60 లక్షల కోట్లను సబ్సిడీలుగా చెల్లిస్తున్నాయి. 75 శాతం విద్యుత్ బొగ్గు నుంచే.. 2014 నాటికి 75 శాతం దేశ విద్యుత్ అవసరాలను తీర్చేది థర్మల్ పవర్ ప్లాంట్లే. 2016 నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద థర్మల్ పవర్ ఉత్పత్తిదారు, వినియోగదారు భారతే. ఈ విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల వల్ల వెలువడే ఉద్గారాల్లో నలుసు పదార్థం(పర్టిక్యులేట్ మ్యాటర్–పీఎం), సల్ఫర్ డయా క్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ కీలకం. తలవెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా ఉండే నలుసు పదార్థం(పీఎం 2.5) పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. 2015లో పీఎం 2.5 వల్లే భారత్, చైనాలో 50% మరణాలు సంభవించాయి. చైనాలో 11,08,100 మంది పీఎం 2.5 వల్ల మృత్యువాత పడ్డారు. ► 2013–2014లో శిలాజ ఇంధనాల(ఫాసిల్ ఫ్యూయెల్స్) ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశం సబ్సిడీగా చెల్లించిన మొత్తం రూ. 1.08 లక్షల కోట్లు/ఒక ఏడాదికి. ► ఇదే సమయంలో శిలాజ ఇంధనాలను కరిగించడం వల్ల ఆరోగ్యపరంగా ఏటా జరుగుతున్న నష్టం రూ. 9.02 లక్షల కోట్లు. సబ్సిడీల కంటే ఇది 8 రెట్లు ఎక్కువ. ► రూ.1.08 లక్షల కోట్లతో 37.5 కోట్ల గృహాలకు సోలార్ బల్బులను ఇవ్వవచ్చు. 32 వేల మంది వైద్యులకు ఎయిమ్స్లో శిక్షణ ఇవ్వవచ్చు. శిలాజ ఇంధన సబ్సిడీలను రద్దు చేసి.. ఆయిల్, బొగ్గు, గ్యాస్పై పన్నులను సవరిస్తే.. వాయు కాలుష్యం వల్ల ఏటా సంభవిస్తున్న 14 లక్షల అకాల మరణాల్లో 64.5 శాతాన్ని తగ్గించవచ్చట. -
ఆర్టీపీపీలో 6వ యూనిట్ ప్రారంభం
కడప: రాయలసీమ థర్మల్ ప్లాంట్లో నూతనంగా నిర్మించిన 6వ యూనిట్లో గురువారం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటికే 1,050 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా.. ఇప్పుడు 6 వ యూనిట్ కూడా అందుబాటులోకి రావడంతో.. మరో 600 మెగావాట్ల ఉత్పత్తి జరగనుంది. 6వ యూనిట్కు గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే నిధదులు మంజూరు కాగా ఇప్పుడు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 6th unit starts in rayalaseema power plant -
కరెంటు దుస్తులు వస్తున్నాయ్...
వాషింగ్టన్: మానవుని శరీర కదలికల ద్వారా విద్యుదుత్పత్తి చేసే దుస్తులు త్వరలో రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి మాసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త కోటింగ్ ప్రక్రియను కనుగొన్నారు. మానవుని వెంట్రుకలో 1/10 వంతు మందంతో దుస్తులపై 3,4 ఎథిలిన్డైఆక్సీటైయోఫైన్ అనే పాలిమర్ను కోటింగ్ చేశామని, దీంతో కొన్ని మైక్రో వాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని శాస్త్రవేత్త త్రిషా ఆండ్రూ తెలిపారు. మనిషి కదలికల వలన రెండు ఎలక్ట్రోడ్ల మధ్య రాపిడి జరిగి విద్యుదుత్పత్తి అవుతుందని ఆమె వివరించారు. ఇప్పటి వరకు సిల్క్, లెనిన్, కాటన్ దుస్తులపై దీనిని పరీక్షించామని చెప్పారు. ఈ దుస్తులను ఉతికినా, ఇస్త్రీ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె వెల్లడించారు. రానున్న కాలంలో ఈ దుస్తులు మిలటరీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగ పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. -
లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి
► టార్గెట్ 68 మిలియన్ యూనిట్లు ► ఇప్పటివరకు ఉత్పత్తి అయింది 68.17 ఎం.యూ. ► నెలాఖరులోపు మరింత పెరగనున్న ఉత్పత్తి బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలని విద్యుత్సౌధ లక్ష్యం విధించింది. టార్గెట్ దాటడంపై జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు మరో ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నిల్.. కాకతీయ కాలువకు నీటి విడుదల ద్వారా స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గతేడాది ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయలేదు. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మిలియన్ యూనిట్లే విద్యుదుత్పత్తి జరిగింది. మూడేళ్ల తరువాత ఈ సంవత్సరమే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. టార్గెట్ తక్కువే.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం దాటడం హర్షణీయమే కానీ, విధించిన లక్ష్యమే చాలా తక్కువ. వాస్తవానికి 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా కనీసం 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని గతంలో నిర్దేశించారు. ఒక్క టీఎంసీ నీటితో ఒక మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చిన సమయంలో స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో 137 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం 102 టీఎంసీల నీరు గోదావరి పాలైనా, రబీ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా 68 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి పెద్ద గొప్పేమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గత మూడేళ్లలో ఈసారే అత్యధికంగా ఉత్పత్తి కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల ఉత్పత్తిని లెక్కలోకి తీసుకొని.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని çవిద్యుత్ సౌధ నిర్ణయిస్తుంది. గత పదేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని సగటుగా లక్ష్యం నిర్దేశిస్తారు. దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. – శ్రీనివాస్రావు, జెన్కో ఎస్ఈ, ఎస్సారెస్పీ -
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం: జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు ప్లాంట్(కేటీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్తు కేంద్రంలో బాయిలర్ లీకేజీ వల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు చీఫ్ ఇంజినీర్ మహేష్కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో మరమ్మతులు చేసి ప్లాంట్ను పునఃప్రారంభిస్తామన్నారు. రోజుకు రూ.32లక్షల విలువైన విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. -
శ్రీశైలంలో స్వల్పంగా విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు: కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు డిమాండ్ను అనుసరించి పీక్లోడ్ అవర్స్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.526 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.284 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పతి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 3,324 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయ పరిసర ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36.25 డిగ్రీలకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో 346 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. సోమవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 41.0482 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 820.30 అడుగులకు చేరుకుంది. -
‘తెలంగాణలో విద్యుత్కు డిమాండ్’
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్కు డిమాండ్ పెరుగుతోందని, మన అవసరాలకు అనుగుణంగా వచ్చే రెండేళ్లలో 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి బుధవారం పాల్వంచ కేటీపీఎస్ను సందర్శించారు. మణుగూరులలోని భద్రాద్రి విద్యుత్ ప్లాంట్కు త్వరలో పర్యావరణ అనుమతులు మంజూరవుతాయని మంత్రి చెప్పారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని పేర్కోన్నారు. -
ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కి అంతరాయం ఏర్పడింది. ఐదో యూనిట్లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. బాయిలర్ ట్యూబ్లో లీకేజీ అవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ప్రస్తుతం ప్లాంట్లో 2,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. -
ఒక్క యూనిటైనా ఉత్పత్తి పెంచారా?
యూపీఏ చర్యలతో దేశవ్యాప్తంగా మిగులు కరెంటు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క యూనిటైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచారా అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, సంపత్కుమార్, వంశీచంద్రెడ్డిలతో కలసి బుధవారం అసెంబ్లీలోని మీడియాపాయింట్ దగ్గర ఆయన మాట్లాడారు. తమ నిర్ణయాల వల్లనే కరెంటు సమస్య రాకుండా చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధం చెబుతున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క విద్యుత్ ప్లాంటును కూడా ప్రారంభించలేదని, ఒక్క యూనిట్ కరెంటును కూడా అదనంగా ఉత్పత్తిని చేయలేదని ఉత్తమ్ అన్నారు. 2009 నాటికి దేశవ్యాప్తంగా 79వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యేదని, యూపీఏ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఇది 1.79 లక్షల మెగావాట్లకు పెరిగిందని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా కరెంటు అందుబాటులో ఉన్నదన్నారు. దేశంలో కరెంటు కొరత లేదని, మిగులు విద్యుత్ ఉన్నందున కొత్తప్లాంట్లు అవసరంలేదనే విషయాన్ని కేంద్ర విద్యుత్శాఖమంత్రి పీయూష్ గోయల్ స్వయంగా చెప్పారని ఉత్తమ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్రకారం ఇప్పటికిప్పుడే గృహ, పారిశ్రామిక అవసరాలకే కాకుండా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటును అందించవచ్చునని చెప్పారు. టీఆర్ఎస్కు ప్రమేయం లేకుండానే దేశవ్యాప్తంగా కరెంటు సమస్య లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి కరెంటు సరఫరాలో తమ వల్లనే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు. -
సామర్ధ్యానికి మించిన విద్యుదుత్పత్తి
2వ యూనిట్లో 848 మెగావాట్లు జెన్కో ప్రాజెక్ట్లో సరికొత్త రికార్డు ముత్తుకూరు : మండలంలోని నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో సూపర్క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం గురువారం సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రాజెక్ట్లోని 2వ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా అనూహ్యంగా 848 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగించింది. ఒక్క సారిగా బోర్డులో సామర్ధ్యానికి మించి ఉత్పత్తి నమోదు కావడం చూసి ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో చేరి, సంతోషంతో కేరింతలు కొట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. బీహెచ్ఈఎల్, ఆపరేషన్, మెయింటినెన్స్ ఇంజనీర్లకు సీఈ చంద్రశేఖరరాజు అభినందనలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ 2వ యూనిట్ ఉత్పత్తికి సంబంధించి ఇదో సరికొత్త రికార్డు అన్నారు. బీహెచ్ఈఎల్ ప్రతినిధి శిఖామణి, ఎస్ఈలు రమేష్ముని, శ్రీనివాసబాబు, కేవీ రమణారెడ్డి, దేవప్రసాద్, రమణారెడ్డి, జీఎం భాస్కరరావు, ముఖ్యసంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, మాధవశర్మ, అభిమన్యుడు పాల్గొన్నారు. -
జల విద్యుత్పై ఆశలు...
సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి ఆశలు రేకెత్తిస్తోంది. భారీ వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండడంతో ఈ ఏడాది పెద్దెత్తున జల విద్యుదుత్పత్తిపై ఆశలు చిగురించాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల జలాశయాలు వెలవెలబోవడంతో నామమాత్రంగా విద్యుదుత్పత్తి జరిగింది. ఈ సారి జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమ గట్టు, సింగూరు, నిజాంసాగర్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. గతేడాది 2015-16లో 290 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తి మాత్రమే జరగగా.. ఈ ఏడాది 2016-17లో ఇప్పటి వరకు 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2014-15లో మాత్రం అత్యధికంగా 3128.69 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. జల విద్యుత్కు ఢోకా లేదు... జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్, నాగార్జునసాగర్ ఎడమగట్టుతో సహా రాష్ట్రంలో 2321.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సాగర్ మినహా మిగిలిన ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో గత కొన్నిరోజులుగా నిరంతర విద్యుదుత్పత్తి జరుగుతోంది. 2015 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో 63 ఎంయూల ఉత్పత్తి జరిగితే ...సరిగ్గా అదే వ్యవధిలో అంటే, 2016 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో 701 ఎంయూల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 2016-17లో 3420 ఎంయూల జలవిద్యుదుత్పత్తి జరగవచ్చని డిస్కంలు ఆశపెట్టుకున్నాయి. అయితే, ఇంతకు మించి 3841 ఎంయూల ఉత్పత్తి జరిగే అవకాశముందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) టారీఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1119 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు నుంచి 1350 ఎంయూలు, దిగువ జూరాల నుంచి 534 ఎంయూలు, జూరాల నుంచి 109 ఎంయూలు, ఇతరాత్రా జల విద్యుత్ కేంద్రాలు కలుపుకుని మొత్తం 3841 ఎంయూల వార్షిక ఉత్పత్తికి అవకాశముందని స్పష్టం చేసింది. ఇప్పటికే 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. మరోవైపు జలాశయాల నిండా నిల్వలు ఉండడంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈఆర్సీ అంచనాలకు మించి విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి. 2016-17లో రాష్ట్ర విద్యుత్ అవసరాలు 52,063 ఎంయూలు కాగా అందులో జల విద్యుత్ వాటా 3841 ఎంయూలు కావడం విశేషం. -
1వ యూనిట్లో 650 మెగావాట్లు
ముత్తుకూరు : నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో 1వ యూనిట్ కింద 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు సీఈ చంద్రశేఖరరాజు మంగళవారం తెలిపారు. 2వ యూనిట్ ఓవర్ ఆయిలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ యూనిట్ నుంచి 25, 26వ తేదీల్లో విద్యుత్ ఉత్పత్తి జరగవచ్చని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని పేర్కొన్నారు. -
6 నుంచి విద్యుత్ ఉత్పత్తి
ముత్తుకూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులోని ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్ట్లో ఓవర్ ఆయిలింగ్ కారణంగా ఉత్పత్తి నిలిపి వేసిన 1వ యూనిట్లో ఈ నెల 6వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు బుధవారం తెలిపారు. 2వ యూనిట్లో ప్రస్తుతం 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్లో బొగ్గు నిల్వలు 3.80 లక్షల టన్నులున్నాయన్నారు. -
జూరాలలో విద్యుదుత్పత్తి ప్రారంభం
మహబూబ్నగర్ : జూరాల ప్రాజెక్టులోని నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని గురువారం ప్రారంభించారు. జలాశయానికి ఇన్ఫ్లో బాగా ఉండడంతో బుధవారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించగా గురువారం తెల్లవారుజాము నుంచి నాలుగో యూనిట్లో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. జూరాలకు ఇన్ఫ్లో 74 వేల క్యూసెక్కులు ఉండగా విద్యుదుత్పత్తి కారణంగా 32 వేల క్యూసెక్కల నీటిని ఔట్ఫ్లోగా కిందికి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7,855 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలాశయ అధికారులు వెల్లడించారు. -
ఎన్టీపీసీ 5వ యూనిట్లో సాంకేతిక లోపం
రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్లో మంగళవారం సాంకేతికలోపం తలెత్తింది. ప్రాజెక్టు 5 యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ అయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. -
విద్యుత్ విధానాల్లో సరళీకరణ అవసరం
పుత్తూరు : విద్యుత్ ఉత్పత్తి, వినిమయం వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వ విధానాల్లో సరళీకరణ జరగాలని శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.మునస్వామి అన్నా రు. శుక్రవారం కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోజిత పునరుత్పాదక ఎలక్ట్రికల్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ ఆటోమిషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 145 మంది విద్యార్థులు సమర్పించిన పరిశోధనాత్మక పత్రాల్లో 74 మందివి మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. అమర్రాజా ఇండస్ట్రియల్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ తిరుపతి హెడ్ దామోదర్రావు మాట్లాడుతూ నాణ్యత, స్వచ్ఛత, పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పాదనే దేశ ప్రగతికి మూలమని అన్నారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ హెచ్వోడీ డాక్టర్ ఆర్వీఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సదస్సుకు సంబంధించిన బ్రోచర్స్ను విడుదల చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదరం, ఆర్ అండ్ డీ డెరైక్టర్ డాక్టర్ జి.నరేష్కుమార్, ఈఈఈ హెచ్వోడీ ప్రొఫెసర్ ఎ.హేమశేఖర్, కో-కన్వీనర్ కె.విజయభాస్కర్ పాల్గొన్నారు. -
డిమాండ్ లేక నిలిచిన విద్యుదుత్పత్తి
పాల్వంచ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో తగ్గింది. దీని ప్రభావం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడుతోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఉత్పత్తి తగ్గడంతో.. కర్మాగారాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కొంత తగ్గించి ఉత్పత్తి చేస్తున్నా.. కొన్ని ప్రైవేట్ కర్మాగారాల నుంచి మాత్రం విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో కర్మాగారాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం అయిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నవభారత్ ఎనర్జి ఇండియా లిమిటెడ్లో ఇరవై రోజులుగా విద్యుత్ ఉత్పిత్తి లేక వెలవెలబోతోంది. రోజువారీగా విధులు నిర్వర్తించే వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనులు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంత కాలం ఉత్పత్తి నిలిచిపోనుందో కూడా అర్థంకాని పరిస్థితి. మరోవైపు సంస్థ రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. రెండు కర్మాగారాల్లో నిలిచిన ఉత్పత్తి నవభారత్ సంస్థలో రెండు కర్మాగారాలు ఉండగా.. ప్రభుత్వం గత నెల 23వ తేదీ నుంచి విద్యుత్ కొనుగోలును పూర్తిగా నిలిపివేసింది. 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్ నుంచి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్లాంట్ నిర్మించిన మూడేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు తలెత్తలేదు. అంతేకాక పాత ప్లాంట్లో 114 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ స్పాంజ్ ఐరన్ కర్మాగారానికి అనుసంధానంగా ఉంది. ఇందులో తయారయ్యే ఉత్పత్తిలో సుమారు 50 మెగావాట్లను సంస్థ సొంత అవసరాలకు వాడుకుంటుంది. మిగిలిన 64 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అమ్మకం చేస్తారు. ఈ విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయకుండా నిలిపివేయడంతో సంస్థ ఒక్కసారిగా ఇరకాటంలో పడింది. ఒక్కసారిగా 214 మెగావాట్లను నిలిపివేయడంతో రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. ప్లాంట్లో తయారయ్యే ఒక్కో యూనిట్ను రూ.4.97 పైసలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అయితే ఇతర చిన్నాచితక కర్మాగారాల నుంచి తక్కువ రేటుకు వస్తున్న విద్యుత్ సరిపోతుండటంతో ఇక్కడి ఉత్పత్తిని ఆపివేశారనే వాదన కూడా ఉంది. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నవభారత్ కొత్త ప్లాంట్లో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 350 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా సుమారు ఐదారు వందల మంది ఉన్నారు. ఇరవై రోజులుగా ప్లాంట్ మూతపడటంతో పనుల్లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఖాళీగా కూర్చు ని ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. ఏ క్షణాన ప్రభుత్వం నుంచి ఉత్పత్తి కావాలని అడుగుతారో అని ఎదురుచూపులు చూడాల్సి వస్తుంద ని సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రిడ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి? రాష్ట్ర గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ గ్రిడ్ లేని కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్ను ఇక్కడే వినియోగించాలి.. లేదంటే ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి. జెన్కో వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాల్లో వర్షాల కారణంగా ఉత్పత్తిని కొంత మేర తగ్గించి వినియోగిస్తున్నారు. -
ఎన్టీపీసీ రామగుండంలో విద్యుదుత్పత్తికి అంతరాయం
ఎన్టీపీసీ రామగుండం 7వ యూనిట్లో విద్యుదుత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. అలాగే 5వ యూనిట్లో కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం ధర్మల్ విద్యుత్కేంద్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. -
ఐదేళ్లలో 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
బెంగళూరు: రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈమేరకు రాష్ట్రంలో మొట్టమొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణ పనులను సిద్ధరామయ్య మంగళవారం యలహంకలోప్రారంభించారు. అనంతర మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడ్లగి, బళ్లారి, యరమరస్ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించనున్నుట్లు వెల్లడించారు. రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి డీ.కే.శివకుమార్ మాట్లాడతూ....రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలను తీర్చడానికి,ముఖ్యంగా రైతులకు నిరంతర విద్యుత్ను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం యలహంకలో 370మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పావగడలో 12వేల ఎరకాల్లో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100తాలూకాలలో 20మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడానికి ప్రమయత్నిస్తున్నామని తెలిపారు. -
అండర్గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు
► ఎస్డీఎల్స్ స్థానంలో కంటిన్యూయస్ మైనర్లు? ► ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ‘ఆధునికత’పై దృష్టి పెట్టిన సింగరేణి గోదావరిఖని(కరీంనగర్) : రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న సింగరేణి యూజమాన్యం లక్ష్యాలను చేరుకోవడానికి ఆధునిక యం త్రాలను వినియోగించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా భూగర్భగనుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎస్డీఎల్ లాంటి యంత్రాల తో టార్గెట్లు చేరుకోలేమని గ్రహించిన కంపెనీ వాటి స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రసుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భగనుల ద్వారా రోజుకు 44వేల టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అరుుతే 32వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కంపెనీ వ్యాప్తంగా 156 ఎస్డీఎల్(సైడ్ డంపర్ లోడర్) యంత్రాలు వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా సరాసరిగా రోజుకు 20వేల టన్నుల బొగ్గు వెలికి తీయూల్సి ఉండగా 15వేల టన్నుల వరకు వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 7 వరకు ఎస్డీఎల్ యంత్రాలకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 11,37,664 టన్నులు కాగా 9,57,760 టన్నులు మాత్రమే వెలికితీశారు. యంత్రాల పనితీరు సరిగ్గా లేకపోవ డం వల్లే ఆశించిన ఉత్పత్తి రావడం లేదనేది స్పష్టమవుతోంది. తరుచూ మరమ్మతులకు రావడం, నిర్వహణ సరిగా లేకపోవడం, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండకపోవడం, ఆయి ల్ లీకేజీలు పెరిగిపోవడం, వైబ్రేషన్స్ అధికం కావడం ఇందకు కారణంగా తెలుస్తోంది. పనిస్థలాల్లో యంత్రం బొగ్గును తీసుకుని తిరిగి బెల్ట్పై పోసేందుకు వీలుగా మూల మలుపులు అనువుగా లేవు. యంత్రాన్ని నడిపించే ఆపరేట ర్ కూర్చోవడానికి సీట్ అనుకూలంగా లేక వెన్నుపూస సమస్యలు ఎక్కువై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎస్డీఎల్ యంత్రానికి ఉన్న బకెట్ ద్వారా ఒక ట్రిప్పునకు ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను మాత్రమే బొగ్గు తీసే సామర్థ్యం ఉంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఎస్డీఎల్ యంత్రాల స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను ప్రవేశపెట్టాల నే ఆలోచనతో యాజమాన్యం ఉంది. మరిన్ని గనుల్లో ఏర్పాటుకు అవకాశం ఇందులో భాగంగానే ఇటీవల సింగరేణి డెరైక్టర్ మనోహర్రావు, ఇతర అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు చెందిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన సింగరేణి బృందాన్ని అమెరికాలోని బొగ్గుగనుల సందర్శనకు పం పించింది. వీరు అక్కడి ఆధునిక యంత్రాలతో నడుస్తున్న పలు బొగ్గుగనులు, ప్రాజెక్టులు, కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేసే క్యాటర్ఫిల్లర్ సంస్థను సందర్శించి యం త్రాలను పరిశీలించారు. సింగరే ణిలో ప్రస్తుతం భూగర్భగనుల్లో గ్రేడియంట్లో హెచ్చు తగ్గులు ఉన్నారుు. వాటికి అనుగుణంగా కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేయడానికి క్యాటర్ఫిల్లర్ సంస్థ సుముఖంగా ఉన్నట్లు తెలియడంతో సింగరేణి బృందం ఆ విషయా న్ని సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లింది. భూగర్భగనుల్లో కంటిన్యూయస్ మైనర్ యంత్రాల ను ప్రవేశపెట్టడానికి సీఎండీ సానుకూలత చూపినట్లు సమాచారం. ప్రస్తుతం జీడీకే-11, వీకే-7 గనుల్లో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది మందమర్రి ఏరియూ పరిధి శాంతిఖని గనిలో ప్రవేశపెట్టనున్నారు. యాజమాన్యం చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో మరిన్ని కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లో కీలకంగా పనిచేయనున్నాయి. -
తుది దశకు ఎస్టీపీపీ పనులు
సీఓడీకి సన్నాహాలు చేస్తున్న అధికారులు బీఓపీ, బీటీజీ పనులకు డెడ్లైన్ విధించిన సీఎండీ చివరి పనులను ముమ్మరం చేసిన అధికారులు ఈనెలాఖరులో రెండో యూనిట్ సింక్రనైజేషన్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితం జైపూర్ (ఆదిలాబాద్) : జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చిలో మొదటి యూనిట్ ప్లాంట్ను సింక్రనైజేషన్ (ఉత్పత్తి ప్రారంభం) చేసిన అధికారులు.. తాజాగా రెండో యూనిట్ ప్లాంట్ను ఈనెల చివరిలోగా సింక్రనైజేషన్ చేసి కమర్షియ ల్ ఆపరేషన్ (సీఓడీ) విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా, ఇటీవల పవర్ప్లాంట్ పనులను పరిశీలించిన సింగరేణి సీఎండీ శ్రీధర్ యూనిట్-1, యూనిట్-2 బీఓపీ, బీటీజీ నిర్మాణ పనులకుగడువు విధించారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని పనులను ఈనెల 20లోగా అనుసంధానం చేయాలని స్పష్టంగా చెప్పారు. బీటీజీ పనులు పూర్తి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా ముందుకుసాగాయి. ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి వచ్చింది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు సింగరేణి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 1200 మెగావాట్ల పవర్ప్లాంట్ నిర్మాణంలో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంట్ను గత మార్చి 13వ తేదీన సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. కాగా, ఈనెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించి వచ్చేనెల నుంచి పూర్తిస్థాయిలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పవర్ ప్లాంట్ నిర్మాణంలో ప్రధానమైన బీటీజీ (బాయిలర్ టర్బైన్ జనరేషన్) నిర్మాణ పనులు ఇప్పటికే వం దశాతం శాతం పూర్తయ్యాయి. కాగా, కీలకమైన బీఓపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) పనులు బీటీజీ పనుల కన్నా ఏడాదిన్నర కాలం ఆల స్యంగా ప్రారంభంకావడంతో బీఓపీ పనుల్లో కొంత జాప్యం నెలకొంది. ఈ క్రమంలో బీఓపీ పనుల్లో ఇంకా చాలా పూర్తి కావాల్సి ఉంది. బీటీ జీ పనులు పూర్తి అయినప్పటికీ బీఓపీ పనుల్లో కీలకమైన కూలింగ్ టవర్స్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ), సర్క్యూలేటింగ్ వాటర్ (సీడబ్ల్యూ) సిస్టమ్, రిజర్వాయర్-2 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బీటీజీ పనులు పూర్తయినప్పటికీ బీఓపీ పనులు పూర్తికాకపోవడం విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడంలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పుడు బీఓపీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సింగరేణి డెరైక్టర్ (ఈఅండ్ఎం) రమేష్బాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తూ రోజువారీ వివరాలను సీఎండీ శ్రీధర్కు తెలియజేస్తున్నారు. నెలాఖరులోగా విద్యుత్ ఉత్పత్తి.. జైపూర్ సింగరేణి పవర్ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే యూనిట్-1 ప్లాంట్ సింక్రనైజేషన్ చేయగా త్వరలో యూనిట్-2ను సింక్రనైజేషన్ చేసి ఈ నెలాఖరులోగా కనీసం 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్లాంట్ను ప్రారంభించి సింగరేణి విద్యుత్ను జాతికి అంకితం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్లాంట్ వద్ద శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టగా.. థర్మల్ పవర్ప్లాంట్ ఆకృతితో మరో శిలాఫలకాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం గా ఈ నెలలో సింగరేణి వెలుగులు తెలంగాణ ప్రజలకు అందనున్నాయి. -
జెఎస్డబ్ల్యు ఎనర్జీ చేతికి జెఎస్పిఎల్ యూనిట్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రూ 46,000 కోట్ల రుణభారంతో ఉన్న సోదరుడు నవీన్ జిందాల్ ను ఆదుకోవడానికి జెఎస్డబ్ల్యు ఎనర్జీ అధిపతి సజ్జన్ జిందాల్ ముందుకొచ్చారు. దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థ గా రూపొందే వ్యూహంలో బాగంగా భారత అగ్రశ్రేణి ఉక్కు సంస్థ జెఎస్డబ్ల్యు ఎనర్జీ ఈ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ నేతృత్వంలోని అగ్రగామి సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జెఎస్పిఎల్) ను ఆదుకోవడానికి రంగం సిద్దం చేశారు. చత్తీస్గఢ్ లోని పవర్ ప్లాంట్ ను జెఎస్డబ్ల్యు ఎనర్జీ యూనిట్ ను రూ .6,500 కోట్లకు జెఎస్డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకోనుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నట్టు ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాయపూర్ లోని జెఎస్పిఎల్ చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను కొనుగోలు చేయనున్నట్లు జెఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ తెలిపారు. ఆస్తులను విక్రయించడానికి చూస్తున్న నేపథ్యంలో మోనేటిజేషన్ లో భాగంగా ద్రవ్య సరఫరా, ఉత్పత్తి ప్రణాళికలను రూపొందించే ప్రణాళికతో ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం విలువ రూ .4,000 కోట్లు, సంస్థ ప్రస్తుత నికర ఆస్తులు మొత్తం రూ .6,500 కోట్లకు చేరిందని జిందాల్ ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందం 2018 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ కొనుగోలు ద్వారా బొగ్గు ఉత్పత్తిలో తూర్పు భారతదేశం లో పట్టు సాధించాలనేది ప్లాన్. అటు జెఎస్పిఎల్ దాని అప్పులను తీర్చేందుకు కూడా ఈ డీల్ సహాయం చేస్తుంది. మరోవైపు రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న టాప్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) కు కూడా ఇది ఒక వరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తాజా ఒప్పందంతో జెఎస్ డబ్ల్యు ఎనర్జీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,531 మెగావాట్లకు పెరగనుంది.అటు ఈ ప్రకటన ఫలితంగా షేర్ మార్కెట్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ భారీగా లాభపడింది. 3.5 శాతం లాభాలతో షేర్ ధర రూ 71. 45 దగ్గర ట్రేడ్ అవుతోంది. గతంలో జిందాల్ సోదరులు విదేశీ ఆస్తులను కొనుగోలులో పోటీ పడ్డారు , కానీ సుప్రీంకోర్టు బొగ్గు గనుల లైసెన్సులు రద్దు చేయడం, కమోడిటీ మార్కెట్ల బలహీనత జేఎస్సీఎల్ లాభాలను ప్రభావితం చేశాయి. అటు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై దిగుమతి సుంకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని సూచనలు కూడా చేశారు. దీంతో జిందాల్ సోదరులు తమ వ్యాపార ఎత్తుగడలను సమీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. -
పట్టణాల అభివృద్ధిపై దృష్టి
మునిసిపల్శాఖ మంత్రి నారాయణ మచిలీపట్నం (కోనేరుసెంటర్) : రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాష్ట్ర మునిసిపల్శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం స్థానిక మల్కాపట్నంలోని ట్రావెల్స్బంగ్లా ఆవరణలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న పురపాలక సంఘ కార్యాలయ భవనానికి శనివారం మంత్రులు సిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో 75 శాతం మంది పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారన్నారు.తద్వారా ఆయా దేశాల తలసరి ఆదాయం అధికంగా ఉంటోందని చె ప్పారు. మన రాష్ర్టంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో నివసిస్తుండడంవల్లే తలసరి ఆదాయం తక్కువగా ఉంటోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం తెలంగాణలో రూ.లక్షా 35 వేలు, మన రాష్ట్రంలో రూ.లక్షా 7వేలు ఉందని మంత్రి చెప్పా రు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించి ప్రజల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతిజిల్లా కేంద్రంలో విద్యుత్ యూనిట్లు పదమూడు జిల్లాల్లోని ప్రధాన కేంద్రా ల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు యూనిట్స్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు నారాయణ వివరించారు. తొలుత శ్రీకాకుళంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఒక యూనిట్ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మచిలీపట్నంకు 9500 ఎల్ఈడీ బల్బులు అమర్చుతున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కింద బందరు ప్రాంతంలో రూ.37.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. రోడ్ల అభివృద్ధితోనే పరిశ్రమలు రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రహదారులు అభివృద్ధి చెందితేనే పరిశ్రమ లు, వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతాయన్నారు. పదేళ్లుగా రహదారులను నిర్లక్ష్యం చేశారన్నారు. బందరు ప్రాంతరోడ్ల అభివృద్ధికి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు మాట్లాడుతూ దేశంలో రెండోదిగా చరిత్రకెక్కిన బం దరు మునిసిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఎల్.ఎన్.ప్రసాద్, ఏఎంసీ ైచైర్మన్ గోపు సత్యనారాయణ, వైస్చైర్మ న్ కాశీవిశ్వనాథం, కమిషనర్ జస్వంతరావు, ఆర్డీవో పీ సాయిబాబు, బూరగడ్డ రమేష్నాయుడు పాల్గొన్నారు. -
సీలేరు విద్యుత్కు ఒడిశా నీరు
► రోజుకు 1000 క్యూసెక్కుల విడుదల ► ఇరు రాష్ట్రాల అధికారుల ► సమావేశంలో అంగీకారం సీలేరు: విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్లోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఒడిశా వాటా నీటిని ఏపీకి విడుదల చేసేందుకు ఒడిశాలోని పొట్టేరు వాటర్ ఇరిగేషన్ శాఖ, బలిమెల హైడ్రల్ పవర్ ప్రాజెక్టు కార్పొరేషన్ అధికారులు అంగీకరించారని ఏపీ జెన్కో మోతుగూడెం చీఫ్ ఇంజనీర్ కేశవస్వామి తెలిపారు. ఒడిశాలోని బలిమెల ప్రాజెక్టు అతిథి గృహంలో నీటి పంపకాలపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగిందన్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసేవరకు గురువారం నుంచి బలిమెల రిజర్వాయర్ ద్వారా సీలేరుకు రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు తీసుకుంటామని చెప్పారు. బలిమెలలో ఏపీ వాటాగా చుక్క నీరు కూడా లేదని, దీంతో సీలేరు కాంప్లెక్స్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింద న్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా అధికారులను సంప్రదించగా నీరు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. ప్రస్తుతం బలిమెల రిజర్వాయర్లో ఒడిశా వాటాగా 50.6349 టీఎంసీల నీరుందని, ఈ పది రోజుల్లోనే అందులో 2.6390 టీఎంసీల నీరు ఇప్పటికే తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు కురిసే వరకు రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీరు తీసుకొని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జల విద్యుత్ కేంద్రాల్లో పీక్ అవర్స్లో విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం గోదావరి ప్రాంతాలకు విడుదల చేస్తామని ఆయన వివరించారు. 2015-16 లో గోదావరి డెల్టాకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 50 టీఎంసీల నీటిని పంపించామని చెప్పారు. ఈ సమావేశంలో ఒడిశా అధికారులతో పాటు సీలేరు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.మురళీ మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఎల్ రమేష్, ఏడీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.