Sindhu
-
చదువు పూర్తవగానే కొత్తిల్లు కొన్న డ్యాన్సర్.. గృహప్రవేశం (ఫోటోలు)
-
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది. -
చదువుల తల్లికి ఎంత కష్టం
సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు. వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. -
క్వార్టర్స్లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
చైనాకు భారత మహిళల షాక్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది. ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రణయ్ ఓడినా... పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 4–1తో హాంకాంగ్పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది. ప్రపంచ నంబర్వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది. 3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్కు ముందే నాకౌట్కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది -
కొత్త సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్కు తనకు పెద్ద సవాల్గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది. గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... | ♦ గత రెండు ఒలింపిక్స్లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్లతో పోలిస్తే నాకు పారిస్లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ♦ మహిళల సర్క్యూట్లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం. ♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్గా నేను ఆసియా టీమ్ చాంపియన్షిప్ కోసం సిద్ధమయ్యాను. ♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్కు అర్హత సాధించగలిగాను. నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది. -
వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం
అచ్చంపేట: వరకట్న వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడగా.. యువతి తరఫు బంధువులు ఆగ్రహంతో భర్త పై దాడి చేయడంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన అతికారి సింధు (26), ఖమ్మం జిల్లాకు చెందిన నిమ్మతోట నాగార్జున (28) అచ్చంపేట ప్రగతి డిగ్రీ కళా శాలలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2021 మార్చిలో హైదరాబాద్ ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని తన బాబాయ్ డాక్టర్ కృష్ణకు చెందిన శ్రీరాంసర్రాం ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గొడ వలు మొదలయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని సింధును నాగార్జున, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీరాంసర్రాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్కర్నూల్కు, అక్కడి నుంచి మహబూబ్నగర్, చివరికి అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. అయితే అప్పటికే సింధు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం తీసుకువస్తుండగా.. కాగా, సింధు మృతదేహాన్ని భర్త నాగార్జున అ చ్చంపేటకు తీసుకొస్తుండగా ఆమన్గల్ సమీపంలో బంధువులు వాహనాన్ని అడ్డగించి నాగార్జునను మరో వాహనంలో తీసుకెళ్లి చితకబాది అచ్చంపేట తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులకు విషయం తెలియడంతో సింధు బంధువుల వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సింధు, నాగార్జున మృతదేహా లు ఒకే దగ్గర ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు సింధు మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి, నాగార్జున మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమ కూతురు మృతికి డాక్టర్ కృష్ణ, అతని భార్య, నాగార్జున తల్లి, చెల్లి కారణమని సింధు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. నాగార్జున బాబాయ్ డాక్టర్ కృష్ణ వరకట్నం డబ్బులు తేవాలని.. లేకపోతే తన కోరిక తీర్చాలని సింధుని వేధించినట్లు పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింధుది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆస్ప త్రుల చుట్టూ తిప్పారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సెమీస్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు తొలి గేమ్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
ప్రిక్వార్టర్స్లో సింధు
ఒడెన్స్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రత్యర్థినుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా చివరకు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో సింధు 21–14, 18–21, 21–10 స్కోరుతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లండ్)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత సింధుకు ఆ తర్వాత గిల్మర్ గట్టి పోటీనిచ్చి పోరును 1–1తో సమం చేసింది. అయితే నిర్ణాయక మూడో గేమ్లో సింధు తన స్థాయికి తగినట్లుగా చెలరేగింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి దూసుకుపోయిన భారత షట్లర్ చివరి వరకు దానిని కొనసాగించింది. మహిళల సింగిల్స్లో మరో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆకర్షి 10–21, 22–20, 21–12 తేడాతో లి వైవోన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ను నిరాశ ఎదురైంది. తొలి పోరులో శ్రీకాంత్ 21–19, 10–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. థాయిలాండ్కు చెందిన కంటఫాన్ వాంగ్ చరన్ 21–16, 21–18తో లక్ష్యసేన్పై విజయం సాధించాడు. మరో వైపు ఆసియా క్రీడల స్వర్ణపతక జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చివరి నిమిషంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఈ జంట వాకోవర్ ఇవ్వడంతో మలేసియా ద్వయం ఆంగ్ యు సిన్ – టియో యీ యి రెండో రౌండ్కు చేరింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
సింధు మృతి కేసులో నిందితుడి అరెస్టు
గుణదల (విజయవాడ తూర్పు): సీఏ విద్యార్థిని సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో నిందితుడు ప్రసేన్ను విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో సింధును లోబరుచుకుని మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ప్రసేన్.. సింధును వదిలించుకోవాలన్న దురాలోచనతో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు 306 సెక్షన్ కింద ప్రసేన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి పై పలు అనుమానం
-
హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. మైదానాలు పూర్తిగా ఏడారులే..! హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్ ఆజామ్ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ ఇండోర్ బృందం గ్లేసియర్ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్వర్క్లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. చదవండి: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్న సింధూ
మహబూబ్నగర్ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్ లిఫ్టింగ్లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్ ట్రైనింగ్ అనంతరం సింధూ వెయిట్ లిఫ్టింగ్కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది. 27 నేషనల్ పోటీల్లో 19 పతకాలు సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్ఘడ్ (రాయ్పూర్)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులోని ఎంఎస్యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్కత్తాలో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్లిఫ్టింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్కత్తా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. – సింధూ, వెయిట్లిఫ్టర్ 2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ -
డిప్యూటీ కలెక్టర్గా సుబ్రహ్మణ్యం కుమార్తె
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. (చదవండి: అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్మాధవ్) -
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్లో చేర్చే ‘వాచ్లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్లను ఈ డెవలప్మెంటల్ తుది జాబితాలో చేర్చారు. పారాలింపియన్లకు అండదండ... తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు. -
పెంట్హౌస్ రాబరీ
మూడున్నరకే చీకటి పడిపోయినట్టుగా కనిపిస్తోంది. రాత్రికి భారీ వర్షం పడే సూచనలున్నాయని వార్తల్లో చెబుతున్నారు. రాయల్ అపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. పెంట్హౌస్ నుంచి కేకలు వినబడుతున్నాయి. అది మూడంతస్తుల అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తులో నాలుగు, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. పైన పెంట్హౌస్ ఉంది. బిల్డర్ జగ్గారావు ఫ్యామిలీతో పెంట్హౌస్లో ఉంటున్నాడు. పెంట్హౌస్పై నుంచి కేకలు వినబడుతూ ఉండటంతో మెయిన్ గేటు పక్కన ఉన్న ఔట్హౌస్లో జోగుతున్న వాచ్మేన్ అప్పారావు ఉలిక్కిపడ్డాడు. ఏదో జరిగిందని అర్థమై మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. ఆ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు. కార్ పార్కింగ్ కూడా జగ్గారావు ఒక్కడికే ఉంది. మిగిలిన వారికి స్కూటర్ పార్కింగ్లే. అప్పారావు వెళ్లేసరికి సింధూరాణి ఆయాసపడిపోతూ ఉంది.‘‘ఏమైందమ్మా?’’ అని అడిగాడు అప్పారావు.‘‘సార్ పంపారని ఎవరో వచ్చారు. నిన్న ఇంట్లో పెట్టిన బ్రీఫ్కేస్ తెమ్మన్నారంటే నిజమే అనుకున్నాను. ఆయన నిన్న రాత్రి ఒక బ్రీఫ్కేస్ తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. రేపు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. వెళ్లేటప్పుడు ఆయన అడగలేదు. నేను గుర్తు చెయ్యలేదు.’’ సింధూరాణి ఆయాసం పెరిగిపోయి మాట్లాడలేక ఆగింది. ఆమె అవస్థ గమనించి, ‘‘కూర్చోండమ్మా!’’ అన్నాడు అప్పారావు. ఆమె కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘వచ్చిన ఇద్దరిలో ఎవరూ నాకు తెలిసిన వాళ్లు కాదు. బీరువాలోంచి బ్రీఫ్కేస్ తీశాను. ఇవ్వబోయే సమయానికి అనుమానం వచ్చింది. సరే, నేనే కాల్ చేసి అడుగుదామనుకున్నాను. టీపాయ్ మీదున్న ల్యాండ్లైన్ ఫోన్ డయల్ చేస్తున్నాను. సార్ నెంబర్ ఎంగేజ్ వస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతలో వాళ్లలో ఒకడు టీపాయ్ మీద ఉంచిన బ్రీఫ్కేస్ తీసుకుని పరిగెత్తాడు. రెండోవాడూ వాడితోపాటు పోయాడు’’ చెప్పింది సింధూరాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేశారా?’’ ఎవరో అడిగారు. ‘‘అమ్మా! ముందు సార్కి ఫోన్ చేయండి!’’ అన్నాడు అప్పారావు. సింధూరాణి తేరుకుని భర్తకి కాల్ చేసింది. అతను లైన్లోకి వచ్చాడు. ‘‘హలో!’’ అన్నాడు.‘‘ఏమండీ! చాలాసేపట్నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. లైన్ కలవడం లేదు. దొంగతనం జరిగిందండీ..’’ అంటూ సింధూరాణి చెప్పడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. వర్షం పెద్దదైనట్టు ఉంది. అందరూ రెయిన్కోట్లు వేసుకున్నారు. అవి కొంతమేర తడిసివున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతనుబాగా లావుగా బాన పొట్టతో ఉన్నాడు. అన్ని మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది. ఎస్సై జోసఫ్, నలుగురు కానిస్టేబుల్స్ నిలబడి అందరివంకా చూస్తున్నారు.‘‘ఎవరయ్యా వాచ్మేన్?’’ అన్నాడు సీఐ. ‘‘సార్! నేనే..’’ అంటూ ముందుకు వచ్చాడు అప్పారావు.‘‘అందర్నీ పంపెయ్!’’ అన్నాడు.అప్పారావు అక్కడున్నవాళ్లని దూరంగా వెళ్లమని చెప్పి వచ్చాడు. ‘‘మీరేనా ఇందులో ఉండేది?’’ అన్నాడు సీఐ సింధూరాణితో. ‘‘ఔనండీ!’’‘‘మీ పేరు?’’‘‘సింధూరాణి’’‘‘మీవారు ఎవరు? ఏం చేస్తుంటారు?’’‘‘జగ్గారావండీ. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు.’’‘‘అలాగా? ఏం జరిగింది?’’సింధూరాణి జరిగింది చెప్పింది.‘‘బ్రీఫ్కేస్లో ఏమున్నదమ్మా?’’‘‘తెలీదండీ! రాత్రి తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. పొద్దున ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. ఆయన వెళ్లేటప్పుడు అడగలేదు. పాపిష్టిదాన్ని నేనూ గుర్తు చేసుకుని ఇవ్వలేదు. ఇచ్చివుంటే ఇదంతా జరిగేది కాదు.’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. సీఐ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు. ‘‘మీ వారేరీ?’’ అడిగాడు సింధూరాణిని.‘‘జరిగిందంతా చెప్పానండీ! వస్తుంటారు.’’ అంది. ‘‘జోసెఫ్ ఆయన నెంబర్ తీసుకుని కాల్ చెయ్యి. అర్జెంటుగా రమ్మను.’’ అన్నాడు ఎస్సైతో. ‘‘ఎస్ సార్!’’ అని సింధూరాణిని అడిగి జగ్గారావు సెల్ నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేస్తుంటే రింగవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ‘‘సార్! ఆయన లిఫ్ట్ చేయడం లేదు.’’ చెప్పాడు జోసెఫ్.‘‘జర్నీలో ఉన్నాడేమో? ఓకే!’’ అన్నాడు సీఐ.‘‘వాచ్మేన్! ఇద్దరు మనుషులు మెయిన్గేట్ దాటి రావడం నువ్వు చూశావా?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘లేదండీ. నేనప్పుడు నా రూమ్లో ఉన్నాను.’’‘‘నువ్విక్కడ వాచ్మేన్వి. గేట్లో నుంచి వచ్చే పోయే వాళ్లని చూస్తుండొద్దా? ఏం చేస్తున్నావు? తాగి తొంగున్నావా?’’ గర్జించాడు సీఐ. అప్పారావు బెదిరిపోయాడు. ‘‘చూస్తూనే ఉంటానండీ. ఎవరోకళ్లు ఏదోక పని చెప్తుంటారండి. చెయ్యకపోతే కోపం. ఒక్కడ్నేనండి. ఎన్నని చెయ్యను!’’ నెమ్మదిగా చెప్పాడు అప్పారావు. ‘‘అట్లాంటప్పుడు ఆ పని చెప్పినవాళ్లని గేటు దగ్గర ఉండమని చెప్పాలి. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్లా?’’అప్పారావు మౌనంగా ఉండిపోయాడు. ‘‘అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టించారా?’’అప్పారావు తల అడ్డంగా ఊపాడు. ‘‘సీసీ కెమెరాలు లేవు. లిఫ్ట్ లేదు. ఏం అపార్ట్మెంటమ్మా? ఏదైనా జరిగినప్పుడు మా చావుకొస్తుంది.’’ అసహనంతో అన్నాడు సీఐ. సీఐ మాటమాటకీ వాచ్ చూసుకుంటున్నాడు. ‘‘ఏవండీ! మీ ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు?’’ సింధూరాణితో అన్నాడు.‘‘నేనూ ట్రై చేస్తున్నానండీ. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.’’ అంది ఆమె. ‘‘అయితే పోయిన బ్రీఫ్కేస్లో ఏముందో మీకు తెలియదన్నమాట?’’సింధూరాణి తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్టుగా. అంతలో ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. సింధూరాణి లిఫ్ట్ చేసి, ‘‘హలో!’’ అంది. అవతల చెప్పింది విని ఆమె ముఖం వివర్ణమయింది.‘‘ఎక్కడా?’’ అంది ఆందోళనపడుతూ. సింధూరాణి ఫోన్ పెట్టేసింది. అరవడం మొదలుపెట్టింది. ‘‘ఏమైందండీ!’’ అని అడిగాడు సీఐ.‘‘ఆయనకి గుండెపోటు వచ్చిందంటండీ! హాస్పిటల్లో చేర్పించారట. ఆఫీస్ వాళ్లు చెప్పారు.’’ ఏడుస్తూనే చెప్పింది సింధూరాణి. సీఐ మల్లికార్జున్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘బ్రీఫ్కేస్ పోయిందని తెలియగానే గుండెపోటు వచ్చిందంటే, దాంట్లో డబ్బు ఉండుంటుంది..!’’ అన్నాడు ఎస్సై వైపు చూస్తూ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘జోసెఫ్! వర్షం బాగా కురుస్తోంది. పాపం మేడమ్ ఎట్లా వెళ్తారు? ఆమెను హాస్పిటల్లో డ్రాప్ చెయ్. ఆయనకి ఎట్లా ఉందో డాక్టర్స్ని ఎంక్వయిరీ చేసి, నాకు కాల్ చెయ్! నేనిక్కడే ఉంటాను.’’ అన్నాడు సీఐ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘అమ్మా! మీరు మా వాళ్లతో వెళ్లండి. హాస్పిటల్కి తీసుకెళ్తారు. వర్రీ పడకండి. కష్టార్జితం ఎక్కడికీ పోదు. తప్పక దొరుకుతుంది.’’ ధైర్యం చెప్పాడు మల్లికార్జున్. ఎస్సైతో పాటు సింధూరాణి బయలుదేరింది. జగ్గారావు కోలుకున్నాడనీ, ఐసీయూ నుంచి రూమ్లోకి షిఫ్ట్ చేశారని సమాచారం వచ్చింది. సీఐ మల్లికార్జున్ తన స్టాఫ్తో హాస్పిటల్కి వెళ్లాడు. రూమ్లో అతని భార్య సింధూరాణి లేదు. వేరే ఇంకొక ఆమె ఉంది. ఎర్రగా పొడుగ్గా ఉంది. ఆమె పక్కన టీనేజ్ కుర్రాడు, పదేళ్ల పాప ఉన్నారు. ‘‘హలో సార్!’’ అని పలకరించాడు సీఐ. ‘‘నమస్తే!’’ అని లేవబోయాడు జగ్గారావు. ‘‘మీరు లేవొద్దు. ప్లీజ్!’’ అని ఆమె వైపు చూసి, ‘‘మీరు?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘నా వైఫ్ రాజేశ్వరి. వీళ్లు నా పిల్లలు’’ చెప్పాడు జగ్గారావు. మల్లికార్జున్ షాక్ తిన్నట్టయ్యాడు. ఈవిడ వైఫ్ అయితే, మరి సింధూరాణి? గురుడికి ఇద్దరు భార్యలా? అనుకున్నాడు. ‘‘ఓకే! చెప్పండి జగ్గారావుగారూ. బ్రీఫ్కేస్లో ఏముంది?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘యాభై లక్షలు క్యాష్ సార్!’’ విచారంగా అన్నాడు.‘‘మై గాడ్! ఫిఫ్టీ ల్యాక్స్? అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లినట్టు మీ స్టాఫ్లో ఎవరికైనా తెలుసా?’’‘‘మా అకౌంటెంట్కి తెలుసు.’’ ‘‘ఓకే.. అమ్మా! మీరు కొంచెం బయటకు వెళ్తారా?’’ రాజేశ్వరి వైపు చూసి అన్నాడు సీఐ మల్లికార్జున్. రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని గది బయటికి వెళ్లిపోయింది. ‘‘ఏమండీ! మీకు ఇద్దరు భార్యలా?’’‘‘ఔనండీ! సింధూరాణికి పిల్లలు లేరు. తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను.’’ చెప్పాడు జగ్గారావు. యాభై లక్షల క్యాష్ పోవడంతో అప్సెట్ అయ్యాడు జగ్గారావు. ఒక స్థలం కొనుగోలు చేయడానికి అంత క్యాష్ సమకూర్చుకునేసరికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్, తోటి బిల్డర్స్ దగ్గర సేకరించుకోవాల్సి వచ్చింది. స్థలం యజమాని క్యాష్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అంత క్యాష్ తెచ్చి పెద్ద భార్య సింధూరాణి ఇంట్లో ఉంచాడు. ఉదయం వెంట తెచ్చుకోవాల్సింది కానీ ఈ రోజుకి అవసరం లేదని ఊరుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ‘‘మీ బ్రీఫ్కేస్ ఏ రంగులో ఉంది?’’‘‘సిమెంట్ కలర్ సార్!’’ అన్నాడు జగ్గారావు. జగ్గారావు ఆఫీసుకెళ్లి అకౌంటెంట్ని విచారించాడు సీఐ. అతను రామశర్మ. రిటైరైపోయిన వృద్ధుడు. అతను తనకు ఏం తెలియదని నొచ్చుకున్నాడు అనుమానించినందుకు. రామశర్మ అనుమానించదగ్గ మనిషి కాదని మల్లికార్జున్కి అర్థమైంది. ‘‘సార్! సింధూరాణి భర్త మీద చాలా కోపంగా ఉంది. తరచుగా ఘర్షణ పడుతుంటుందని వాచ్మేన్ అప్పారావు చెప్పాడు. అపార్ట్మెంట్లో ఆడవాళ్లు కొన్ని సంగతులు చెప్పారు. జగ్గారావు పెద్ద భార్య దగ్గరికి వారానికి ఒకసారి కూడా రాడట. ఎక్కువగా రెండో భార్య, పిల్లలతోనే గడుపుతాడట. గచ్చిబౌళిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండో భార్యకు విల్లా కొని ఇచ్చాడట. అప్పట్నుంచి సింధూరాణి భర్త మీద మండి పడుతున్నదట.’’ చెప్పాడు ఎస్సై. సీఐకి కేసులో క్లూ దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ వాచ్మేన్ అప్పారావుని పట్టుకొచ్చాడు. స్టేషన్లోకి గడగడలాడుతూ వచ్చాడు అప్పారావు. వచ్చీ రావడంతోనే కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్! నాకేం తెలీదు.’’ అన్నాడు ఏడుస్తూ. ‘‘నీకు తెలీదుగాని ఒక సంగతి చెప్పు! ఆ రోజు పొద్దున జగ్గారావు కారులో వెళ్లిపోయాడు. సాయంకాలం మూడున్నర, నాలుగు గంటలకు దొంగతనం జరిగింది. ఈ లోపల పెంట్హౌస్కి ఎవరు వచ్చారు?’’ ప్రశ్నించాడు. అప్పారావు అతని పేరు చెప్పాడు. ఆ ఇల్లు కూడా తనకి తెలుసు అన్నాడు. వాచ్మేన్ని వెంటపెట్టుకుని సీఐ స్టాఫ్తో పోలీస్ వ్యాన్లో బయలుదేరాడు.పోలీసులు తన ఇంటికి రావడంతో బెదిరిపోయాడు భిక్షపతి. ఇల్లంతా గాలిస్తే దొరికింది బ్రీఫ్కేస్. అది బరువుగానే ఉంది. తను ఓపెన్ చేయలేదన్నాడు. పోలీస్ స్టేషన్లో తలవంచుకుని నిలబడి ఉంది సింధూరాణి. ‘‘చెప్పవమ్మా! బ్రీఫ్కేస్ మీ నాన్నకు ఇచ్చి పంపి, దొంగలు ఎత్తుకెళ్లారని ఎందుకు నాటకం ఆడావు?’’ గద్దించాడు సీఐ. ‘‘మా ఆయన నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడండీ. చిన్న పెళ్లానికి కోటి రూపాయలు పెట్టి విల్లా కొనిచ్చాడు. నేను అదే అడిగితే నువ్వుండే పెంట్హౌస్ నీకే రాసిస్తాను అన్నాడు. అదీ చెయ్యడం లేదు. నాకీ పెంట్ హౌస్ వద్దు. ఇది అనాథరైజ్డ్. దీనికి విలువలేదు. పది లక్షలకు కూడా ఎవరూ కొనరు. నాకూ విల్లా కొనివ్వు అని అడిగాను. పిల్లా జెల్లా లేరు నీకెందుకే విల్లా అని తిట్టాడండీ. ఏం చేయమంటారు? అందుకే బ్రీఫ్ కేస్ దొంగలెత్తుకెళ్లారని నాటకం ఆడాను. నాకు తెలుసు, అందులో యాభై లక్షలున్నాయని.’’ తప్పు ఒప్పుకుంటూ చెప్పింది సింధూరాణి. వాణిశ్రీ -
మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు
థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది. -
అజయ్, సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అజయ్ 7–5, 6–1తో అభిషేక్ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది. ఇతర మహిళల తొలిరౌండ్ మ్యాచ్ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్ (ఒడిశా)పై, దీక్ష అజిత్ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్కు చేరుకున్నారు. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్ల ఫలితాలు శివదీప్ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్ కుమార్ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్ (కర్ణాటక)పై, సాయి శరణ్రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్ (ఏపీ)పై, అనికేత్ వెంకట్ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్పై, టి. వినయ్ కుమార్ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్ కుమార్పై, డి. అఖిల్ కుమార్ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్పై, ఆయుశ్ (పంజాబ్)6–2, 6–3తో తరుణ్ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్ (తెలంగాణ)పై గెలుపొందారు. -
సైనా సింధులకు సన్మానం
-
కాళ్లపారాణి ఆరక ముందే..
చింతలపూడి : కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చింతలపూడి మండలం ఫాతిమాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే నూతంకి సింధు (24) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 25న కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జువ్వన రవికిరణ్తో ఫాతిమాపురం గ్రామానికి చెందిన నూతంకి సింధుకు నూజివీడులో వివాహం జరిగింది. మరుసటి రోజు 26న సింధు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో భర్త పక్క గదిలో ఉండగా సింధు గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ పి.రాజేష్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ టి.మైఖేల్రాజ్ శవ పంచనామా నిర్వహించారు. సింధు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి కాని, అత్తింటి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక సింధు మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పెళ్లిలో నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన సింధు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మనసులోని బాధను తమతో చెప్పినా అర్థం చేసుకుని తీర్చేవారమని ఇలా అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. సింధు మృతితో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సింధు... మళ్లీ శ్రమించి
బర్మింగ్హామ్ : ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్తోపాటు మ్యాచ్ను దక్కించుకుంది. పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. బుధవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 9–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–19, 21–18తో యుగో కొబయాషి–హోకి టకురో (జపాన్) జంటను ఓడించింది. రెండో స్థానానికి శ్రీకాంత్ గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్వన్ అవుతాడు. భారత్కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్కు చేరాడు. మహిళల సింగిల్స్లో సింధు మూడో ర్యాంక్లో, సైనా 12వ ర్యాంక్లో ఉన్నారు. -
అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
-
లక్ష్యం... టాప్ ర్యాంక్
బ్యాడ్మింటన్ సంచలనం సింధు స్పష్టమైన లక్ష్యాలతో ముందడుగు వేస్తోంది. త్రుటిలో చేజారిన ఫలితాలను రాబట్టేందుకు సిద్ధమైంది. ‘రియో’లో చేజారిన స్వర్ణం, గతేడాది ఫైనల్ ఓటములతో టాప్ ర్యాంక్ను అందుకోలేకపోయిన ఈ హైదరాబాదీ... మెగా ఈవెంట్లున్న ఈ ఏడాదిని విజయవంతంగా మలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ముంబై: ప్రతిష్టాత్మక ఈవెంట్లున్న 2018లో భారీ విజయాలపై దృష్టి పెట్టింది బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు. ముఖ్యంగా ఈ సీజన్లోనే ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధిస్తానని, 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం తెస్తానని చెప్పుకొచ్చింది. ఏడాదిలో తప్పనిసరిగా 15 టోర్నమెంట్లు ఆడాల్సిందేనన్న నిబంధన అమలవుతున్న నేపథ్యంలో శారీరక సామర్థ్యానికి ఈ సీజన్ పెద్ద పరీక్షలాంటిదని చెప్పింది. బ్రాండ్ అంబాసిడర్గా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఈ తెలుగు తేజం పలు అంశాలపై మీడియాతో ముచ్చటించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఆల్ ఇంగ్లండ్ నుంచి... గతేడాది కీలకమైన టోర్నీల్లో ఫైనల్కు చేరడం వల్ల టాప్ ర్యాంక్కూ చేరువయ్యా. కానీ తుదిపోరులో ఓడిపోవడం వల్ల అగ్రస్థానం అందకుండా పోయింది. ఈ ఏడాది మాత్రం తప్పకుండా నంబర్వన్ ర్యాంకు సాధిస్తా. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ నుంచే నా ప్రదర్శనకు ‘నంబర్వన్’ పట్టుదల కూడా జోడిస్తా. ఏడాది చివరికల్లా టాప్ ర్యాంకులో నిలుస్తా. ప్రతీ టోర్నీ భిన్నమైంది... ప్రతీ టోర్నీ ఒకలాగే సాగదు. నా వరకైతే ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ పోరు కఠినమైంది. చాలా సుదీర్ఘంగా సాగింది ఆ మ్యాచ్. ఇలాంటి పోటీల్లో కడదాకా పోరాడాలంటే కేవలం ఫిట్నెస్ ఉంటే సరిపోదు. మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. బీడబ్ల్యూఎఫ్ ఈ ఏడాది నుంచి ప్రతీ ప్లేయర్ 15 టోర్నీలు ఆడాలన్న నిబంధన అమలు చేస్తున్న దృష్ట్యా ఆటగాళ్లకు మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం. పతకం వన్నె మారుస్తా... రియో ఒలింపిక్స్లో పోరాడాను. క్వార్టర్ ఫైనల్లో తీవ్రంగా చెమటోడ్చాను. మొత్తానికి పతకం వేటలో నిలిచాను. తుదిపోరులో ఒకదశలో ఆధిక్యంలో నిలిచి పసిడి పతకానికి చేరువైనా... త్రుటిలో చేజార్చుకున్నాను. చిన్నపొరపాట్లతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ (2020)లో మాత్రం అలా కానివ్వను. తప్పకుండా బంగారు పతకం గెలుస్తాను. ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాను. 21 పాయింట్లే ముద్దు... ప్రస్తుతమున్న గేమ్ పాయింట్ల పద్ధతిని మార్చాల్సిన పనిలేదు. 21 పాయింట్లతో ‘బెస్టాఫ్ త్రీ గేమ్స్’ విధానమే బాగుంది. దీనికి బదులు 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్ గేమ్స్’ పద్ధతి తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో మ్యాచ్లో పుంజుకునేందుకు చాలా కష్టమవుతుంది. ఐదారు పాయింట్లు వెనుకబడినా... ఇంకా 15 పాయింట్ల దాకా ఉండే ఆటలో ముందంజ వేసే అవకాశముంటుంది. అదే 11 పాయింట్ల పద్ధతిలో ఈ అవకాశం చాలా తక్కువ. -
సైనా ఇంటికి... సింధు సెమీస్కి
టాప్ సీడ్ సింధు ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆడుగులు వేస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కథ క్వార్టర్స్లో ముగిసింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి జోడీ సెమీస్ చేరింది. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బరిలో భారత్ నుంచి సింగిల్స్లో సింధు, డబుల్స్లో సిక్కి రెడ్డి మిగిలారు. మిగతా వారంతా క్వార్టర్ఫైనల్స్కే పరిమితమయ్యారు. ఈ ఏడాది తొలి టైటిల్పై కన్నేసిన భారత స్టార్, టాప్ సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేసియా టోర్నీ రన్నరప్, నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్లోనే కంగుతింది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్ పరాజయం చవిచూశారు. శ్రమించిన సింధు... ఈ టోర్నీలో అలవోక విజయాలతో నెగ్గుకొచ్చిన సింధుకు క్వార్టర్స్లోనూ అలాంటి ఫలితమే ఎదురవుతుందని తొలి గేమ్తో అనిపించింది. కానీ రెండో గేమ్లో ఆమె ప్రత్యర్థి బియట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సింధు ఈ టోర్నీలో తొలిసారి మ్యాచ్ గెలిచేందుకు మూడో గేమ్ వరకు పోరాడింది. చివరకు తెలుగు తేజం 21–12, 19–21, 21–11తో గెలుపొందింది. సెమీఫైనల్లో సింధు... ప్రపంచ మూడో ర్యాంకర్ రచనోక్ (థాయ్లాండ్)తో తలపడుతుంది. మరో మ్యాచ్లో సైనా 10–21, 13–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో ఎనిమిదో సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–8, 21–13తో హన్ చెంగ్కాయ్–కా తొంగ్ వీ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 13–21తో మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) 21–17, 21–14తో సమీర్ వర్మను ఓడించగా, కశ్యప్నకు 16–21, 18–21తో కియావో బిన్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్లో ఏడో సీడ్ మేఘన–పూర్వీషా జంట 10–21, 15–21తో జోంగ్ కొల్ఫన్ – ప్రజోంగ్జయ్ (థాయ్లాండ్) జోడీ చేతిలో, సిక్కి–అశ్విని జంట 17–21, 21–23తో డు యుయి–యిన్హుయ్ (చైనా) ద్వయం చేతిలో కంగుతిన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్–అశ్విని జంట 17–21, 11–21తో క్రిస్టియన్సన్–క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్లో మనూ–సుమీత్ రెడ్డి ద్వయం 19–21, 19–21తో ఫెర్నాల్డి–çసుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడాయి. -
నడక ఇక బస్!
బాల్యం నుంచి నడిచి, నడిచి విసుగెత్తి... ఊరికి బస్సు కోసం 17 ఏళ్ల సింధు పడిన ఆరాటం, చేసిన పోరాటం చివరికి ఫలించింది. ఎంత కష్టపడితే ఫలించిందన్నది ఆమె మాటల్లోనే... చిమ్నాపూర్. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం. మండల కేంద్రానికి సమీప గ్రామం. ఎటు వెళ్లాలన్నా నాలుగైదేళ్ల క్రితం వరకూ కాలి నడకే. ఇప్పుడు తారు రోడ్డు ఉంది. కానీ షేరింగ్ ఆటో కోసం రెండు కిలోమీటర్లు.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటే మూడున్నర కిలోమీటర్లు.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. అత్యవసరమైనా.. ఆటో కిరాయికి రెండొందలు! ఆ చిన్నారి పాదాలకు ఈ దూరాలు, లెక్కలు ఏవీ తెలియవు. ఊహ తెలిసినప్పటి నుంచి అనుభవంలోకి వచ్చింది ఒక్కటే.. బడికి వెళ్లాలంటే నడవాలి... కాలేజీకి వెళ్లాలన్నా నడవాల్సిందే. ఒంటరి నడకలో బాల్యంలో భయపెట్టే దెయ్యాలు, భూతాలు.. టీనేజ్కి వచ్చాక.. ఎవరు వెంట పడతారో.. వేధిస్తారోనని.. అనునిత్యం భయాలు. బస్సు ఉంటే భయం లేకుండా వెళ్లొచ్చు. గతంలో రోడ్డు లేదు కాబట్టి బస్సు రావడం లేదన్నారు. ఇప్పుడు రోడ్డున్నా బస్సు రావడం కుదరదంటున్నారు.. తెగించింది.. మొండికేసింది.. తిండి మానేసింది.. చివరకు ఒక్కొక్కరు కదలివచ్చారు. చివరకు బస్సు కూడా!! మాది సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికి అనుబంధ గ్రామం చిమ్నాపూర్. నాన్న నారాయణరెడ్డిగారి శ్రీనివాస్రెడ్డి, అమ్మ సునీత. ఊర్లో కొద్దిపాటి భూమి ఉన్నా పంట పండదు. నాన్న పొద్దునే ప్రైవేటు కంపెనీకి పనికి వెళ్తాడు. అమ్మ గృహిణి, చెల్లి సంగారెడ్డిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ‘కంది’ శిశు మందిర్లో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదువుకున్నా. బడికి వెళ్లాలంటే ఊరు చివర ఉన్న పెద్ద చెరువు కట్ట మీదుగా నడవాల్సిందే. వీలైతే నాన్న వచ్చేవాడు. లేదంటే అటు వైపు వెళ్లేవారితోనో.. కొన్నిసార్లు ఒంటరిగానో నడవాల్సి వచ్చేది. దార్లో ఎదురయ్యే కుక్కలు, పశువులంటే విపరీతమైన భయం. ఐదో తరగతి దాటింది. మళ్లీ ఆరు నుంచి సంగారెడ్డి శిశు మందిర్.. నడక రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు. కుక్కలు కరిస్తే.. రెండుమార్లు ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను. చావు తప్పిందన్నారు. కల్వకుంట మీదుగా నడక తొమ్మిది, పదిలో సాయంత్రం పొద్దుపోయే వరకూ స్పెషల్ క్లాస్లు. బస్సు ఉంటే బాగుండు.. నడక తప్పేది.. సమయం కలిసి వచ్చేది.. రోజంతా ఇవే ఆలోచనలు. ఎవరికైనా చెపితే నవ్వుతారేమో.. అమ్మా, నాన్నకు చెపితే చదవలేక సాకులు వెతుకుతుందంటారేమో. గతంలో రోడ్డు లేదు.. ఇప్పుడు తారు రోడ్డు.. అయినా ఆటో అంకుల్ ఊరికి రానంటాడు. రెండు కిలోమీటర్లు నడిచి కందికి వెళ్తే.. మళ్లీ సంగారెడ్డికి రాను పోను 20 రూపాయలు. పోనీ కల్వకుంట మీదుగా సంగారెడ్డికి నేరుగా నడిచి వెళ్తే నాలుగు కిలోమీటర్లు. ఎవరైనా వెంటబడతారని భయం! చిన్నప్పుడు ఒక ఆంటీని చంపి.. ఆ కాల్వలోనే పడేశారు. ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్.. కొద్దిగా పెద్దదాన్నయిన ఫీలింగ్. కలెక్టర్ ఆఫీస్కి నడక తొమ్మిది నెలల క్రితం.. అమ్మా నాన్నలకు కూడా తెలియదు.. ఓ సోమవారం కలెక్టరేట్కు వెళ్లా. గవర్నమెంట్ కాలేజీలో పాములు, తేళ్లు వస్తున్నాయి. పక్కనే స్మశానం ఉంది.. అంటూ ఓ విజ్ఞాపన. దాంతో పాటే మా ఊరికీ బస్సు వేయమని మరో అర్జీ. కాలేజీ ఆవరణ శుభ్రం చేశారు. బిల్డింగ్కు రంగులు వేశారు. స్మశానం కనబడకుండా గోడ కట్టారు. కానీ ఊరికి బస్సు వేస్తామని చెప్పరేం? అసహనం.. దుఃఖం. అర కిలోమీటరు నడక తప్పుతుందని.. సెకండ్ ఇయర్లో ప్రైవేటు కాలేజీకి. ఇప్పుడు నాతో పాటు చెల్లి కూడా సంగారెడ్డి కాలేజీకి.. ఒకరికి ఒకరం తోడు.. అయితే కంది.. అక్కడ నుంచి ఆటో.. లేదంటే కల్వకుంట మీదుగా నడక. బస్సు కోసం నడక జనవరి 2. కాలేజీకి వెళ్లలేదు. అమ్మ సంగారెడ్డి హాస్పిటల్లో చెకప్ కోసం వెళ్లింది. బాల్యం గుర్తొస్తోంది.. నడక.. దాని చుట్టూ ముడిపడ్డ అనుభవాలు, జ్ఞాపకాలు, భయాలు. ఇంట్లో ఉండాలనిపించడం లేదు. సంగారెడ్డి కొత్త బస్టాండు వద్దకు వెళ్లా. వెంట తీసుకెళ్లిన బ్లేడుతో చేయి కోసుకున్నా. రక్తం కారుతోంది.. ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత అసలు పోలీసులు.. ఎందుకు చేశావని గదమాయిస్తున్నారు. అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఊరికి బస్సు కావాలి అన్నాను. పిచ్చిది.. మెంటల్.. అని కామెంట్లు. అయితే స్టేషన్కు నడువు.. హుంకరింపు. నా మొండితనం చూసి సంగారెడ్డి డీఎం ఉమా మహేశ్వర్ స్టేషన్కు వచ్చిండు. ఐదు రోజుల్లో బస్సు వస్తుందని హామీ. నాన్న వచ్చిండు.. కట్టు కట్టించి ఇంటికి తీసుకుపోయిండు. ఐదు రోజులు.. అన్నం సహించదు.. నీళ్లు తాగబుద్ది కాదు.. ఊర్లో ఎవరికీ పట్టనిది.. నీకెందుకు? చదువుకో.. బాగుపడు.. కన్నందుకు మమ్మల్ని గోస పెట్టకు.. అమ్మా నాన్న హితబోధ, వేడుకోలు.. ఒక రకంగా నిర్బంధం.. వాళ్లకేం.. తెలుసు నడకంటే నాకెంత నరకమో! బస్సు వేయలేదని నడక ఐదు రోజులైనా హామీ ఇచ్చినోళ్లు అడ్రస్ లేరు. అవమానం అనిపించింది. అమ్మా నాన్న వద్దన్నా.. ఊర్లో హనుమాండ్ల గుడికాడ కూర్చున్నా. ఐదు రోజులు.. పది రోజులు.. ఊర్లో వాళ్లు వస్తున్నరు.. మంచి పని చేస్తున్నవన్నరు. నాకు ఇవేమీ పట్టడం లేదు. బస్సు ఎందుకు వేయరు.. ఇదే నా ఆలోచన.. ఆవేదన. పేపర్లలో అప్పుడప్పుడూ నా గురించిన చిన్న వార్తలు. ఆరోగ్యం దెబ్బతింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయిండ్రు. ఈమె బతకదు.. గాంధీకి తీసుకెళ్లమన్నరు.. బస్సు వస్తేనే ఏదైనా అని తెగేసి చెప్పిన. ఐసీయూలో పెట్టిన్రు. బస్సును చూసేందుకు నడక జనవరి 24. మా ఊరికి ఎంపీటీసీ కృష్ణగౌడ్ వచ్చిండు. డీఎం వచ్చిండు.. ఇంకెవరెవరో ఉన్నరు.. ‘రేపు మీ ఊరికి బస్సు వస్తుంది.. ఎమ్మెల్యే చెప్పమన్నడు’ అన్నరు. నాకు నమ్మకం లేదు.. అయినా ఏదో మూలన సంతోషం. రాత్రికి ఇంటికి వెళ్లిన. తెల్లారేసరికి ఊర్లో నా ఫొటోతో ఫ్లెక్సీ! బస్సు వచ్చింది. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వచ్చిండు. దండ వేసి.. నాతోనే రిబ్బన్ కట్ చేయించిండు. అందరం సంగారెడ్డికి వచ్చి.. మళ్లా బస్సులోనే వెనక్కి వచ్చినం. ఇప్పుడు బస్సు వస్తోంది... కానీ టైం ఇదని చెప్పలేం. పరీక్షలు దగ్గరకు వస్తున్నయి. పోయినేడు నడక టెన్షన్తో ఇంగ్లీషులో ఫెయిలైన. ఇప్పుడు చదువుకోవాలే.. పాస్ కావాలే.. వాళ్లు మాట నిలబెట్టుకుంటరనే అనుకుంటున్న. ఊరికి రోజూ బస్సు వస్తే.. ఇంకా బాగా చదువుకుంట. – కల్వల మల్లికార్జున్రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ఊరికి బస్సు సౌకర్యం కావాలని..
-
వైవిధ్యంగా...
విజయ్భాస్కర్రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కార్తిక’. కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై మచెందర్ నట్టల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. కొత్త పరశురామ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ్భాస్కర్రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా పూర్తి న్యాయం చేసాడు’’ అన్నారు. ‘‘పరశురామ్ నాకు చెప్పిన కథను అలానే తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. మా టీమ్కి మంచి పేరొస్తుంది. త్వరలో పాటలు రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మచెందర్ నట్టల. అజయ్ఘోష్, రూలర్ రఘు, ప్రీతి, ప్రియ కోల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, కెమెరా: వల్లి ఎస్కె, సంగీతం: సుభాష్ ఆనంద్. -
బాక్సింగ్లో బేబి కిక్
బాక్సింగ్.. మగాళ్లే భయపడే ఆట.. బరిలోకి దిగి పంచ్లు విసరడం అంత సామాన్యం కాదు.. ఎంతో ఆత్మవిశ్వాసం అవసరం. ఇప్పుడా క్రీడలో తెనాలి అమ్మాయి తెగువ చూపుతోంది. అతి స్వల్ప కాలంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచి, బంగారు పతకాన్ని సాధించింది. జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ‘దెబ్బలు తగులుతాయి కదా’ అని ప్రశ్నిస్తే, ‘దెబ్బ కొడితేనే మనకూ పాయింట్లొస్తాయి.. అదే ఈ గేమ్లో కిక్’ అంటున్న బేబి సింధును ‘సాక్షి’ పలకరించింది. తొలి కిక్తోనే బంగారు పతకం.. తన పేరు బేబి సింధు. పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శారద, ఆర్టీసీ హైర్డ్ ప్రైవేటు బస్ డ్రైవర్ బి.కృష్ణకిషోర్ల కుమార్తె. ఈనెల 13, 14, 15 తేదీల్లో విశాఖపట్టణంలో నిర్వహించిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ క్రీడల పోటీల్లో విమెన్స్ బాక్సింగ్లో అండర్–17, 63–66 కిలోల విభాగంలో పోటీ పడింది.రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా పాల్గొన్న పోటీలోనే తన పంచ్ అదిరింది. ప్రథమస్థానం సాధించి, బంగారు పతకాన్ని గెలుచుకుంది. హరియాణలో నవంబరు 2–10 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళల బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి పతకం సాధించాలనే ఆశయంతో జోరుగా సాధన చేస్తోంది. బాక్సింగ్ కోసం ఆర్ట్స్ గ్రూపు.. స్థానిక వివేక పబ్లిక్ స్కూలు నుంచి పదో తరగతిలో 8.7 జీపీఏతో ఉత్తీర్ణురాలైన సింధు ప్రస్తుతం గుంటూరు ఏసీ కాలేజిలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. పదో తరగతి పరీక్షలైన వెంటనే గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బాక్సింగ్ సాధన ఆరంభించింది. ఆషామాషీ సాధన కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనేది ఆశయం. ‘సైన్స్, మేథ్స్ గ్రూపులు తీసుకుంటే, చదువుకూ సమప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. చదువుకు ఎక్కువ సమయం ఇవ్వటం సాధ్యంకాదన్న అభిప్రాయంతో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నా’నని చెప్పింది. ప్రేరణ అన్నయ్య విశాల్.. డిగ్రీ చేస్తున్న అన్నయ్య విశాల్ తనకు స్ఫూర్తి. చదువుకుంటూ బాక్సింగ్ సాధన చేస్తుండే విశాల్ను, దెబ్బలు తగులుతాయనే భావనతో తల్లిదండ్రులు ప్రోత్సహించే వారు కాదు. అలాంటిది బేబి సింధును అనుమతించటం విశేషం. బాక్సింగ్ ప్రాధాన్యం, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందనీ నచ్చజెప్పటంతో తల్లిదండ్రులు ఇద్దరికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో అన్నాచెల్లెళ్లు నచ్చిన కోర్సులో చేరి, అటు సాధనకు, ఇటు చదువుకు సమయాన్ని సర్దుబాటు చేసుకున్నారు. రోజూ 5 గంటలపైగా సాధన.. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగింటికి లేచి సిద్ధమై ఐదు గంటల బస్సుకు గుంటూరు చేరుకుంటారు. అక్కడ బీఆర్ స్టేడియంలో శిక్షకుడు హనుమంతు నాయక్ దగ్గర 6 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ. తరువాత కాలేజి, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ, సాధన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. హెచ్ఈసీ గ్రూపు అయినందున పోటీలప్పుడు కాలేజి అనుమతితో, సాధనకు అధిక సమయం వెచ్చిస్తున్నట్లు సింధు చెప్పింది. ఆత్మరక్షణకూ.. సెప్టెంబరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మహిళల బాక్సింగ్ పోటీలకు బీఆర్ స్టేడియంలోనే ఎంపిక నిర్వహించారు. అక్కడ ప్రదర్శనతో రాష్ట్ర పోటీలకు అర్హత లభించినట్లు బేబి సింధు చెప్పింది. ‘ఆత్మరక్షణకు బాక్సింగ్ ఎంతో ఉపయోగం.. ఇష్టంగా సాధన చేస్తే పతకాలు గెలిచే అవకాశం ఉంటుంది’ అనేది ఆమె అభిప్రాయం. అదే ఈ గేమ్లో కిక్’ అంటూ సమాధానమిచ్చింది. జాతీయ పోటీల్లో పతకం సాధించి, భారతదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంటులో పాల్గొనాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. -
శ్రీకాంత్, ప్రణయ్ ముందుకు
∙ సింధు, సైనా, సమీర్ ఇంటికి ∙ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్స్కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సమీర్ వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ పరాజయం చవిచూశారు. అలవోకగా...: వరుసగా మూడో సూపర్ సిరీస్ టైటిల్పై దృష్టి పెట్టిన శ్రీకాంత్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ 27వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ కేవలం 29 నిమిషాల్లో గెలుపొందాడు. ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–11తో హు యున్ను ఓడించాడు. హు యున్తో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్లో శ్రీకాంత్ ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్లు చొప్పున సాధించడం విశేషం. ‘మ్యాచ్ బాగా జరిగింది. హు యున్ ప్రమాదకర ప్రత్యర్థి. అతనికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే నిలకడగా పాయింట్లు సాధించడంపైనే దృష్టి పెట్టాను’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 23–21తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... సమీర్ వర్మ 21–10, 17–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... షి యుకితో ప్రణయ్ తలపడతారు. ఈసారి ఏకపక్షం...: మహిళల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో ఓడిపోయింది. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడోసారి ముఖాముఖిగా తలపడటం విశేషం. ఈ విజయంతో గతవారం కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా బదులు తీర్చుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు ఆ తర్వాత చివర్లో 18–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహారా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో ఒకుహారా జోరు పెంచగా... సింధు డీలా పడిపోయింది. ఈ గేమ్లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాకపోవడం గమనార్హం. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో, కొరియా ఓపెన్ ఫైనల్లో వీరిద్దరి మధ్య పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు జరగ్గా, ఈసారి అవి అంతగా కనబడలేదు. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 16–21, 13–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సైనా తొలి గేమ్లో 14–10తో... రెండో గేమ్లో 6–4తో ఆధిక్యంలో వెళ్లినప్పటికీ దీనిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది. క్వార్టర్స్లో సిక్కి–ప్రణవ్ జోడీ: మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–13, 21–17తో యుకి కనెకో–కొహారు యెనెమోటో (జపాన్) జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్పప్ప (భారత్) జోడీ 27–29, 21–16, 12–21తో నాలుగో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–డెబ్బీ సుశాంతో (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు, సమీర్
∙ సాయిప్రణీత్, కశ్యప్ అవుట్ ∙ కొరియా సూపర్ సిరీస్ టోర్నీ సియోల్: ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లోనూ కొనసాగుతోంది. ఈ భారత బ్యాడ్మింటన్ సంచలనం మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల ఈవెంట్లో సమీర్ వర్మ క్వార్టర్స్ చేరగా... భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 22–20, 21–17తో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థి జిందాపోల్ నుంచి తొలి గేమ్లో గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో సింధు కాస్త వెనుకబడింది. దీంతో థాయ్లాండ్ అమ్మాయి 9–7తో ఆధిక్యంలో నిలిచింది. మరో నాలుగు పాయింట్లు చేసి 13–10తో జోరు కొనసాగించింది. అనంతరం కాసేపటికి 16–14 స్కోరు వద్ద సింధు వరుసగా 6 పాయింట్లు చేసి తొలిసారిగా ఆధిక్యంలోకి వచ్చింది. దీటుగా బదులిచ్చిన జిందాపోల్ కూడా నాలుగు పాయింట్లు చేయడంతో స్కోరు సమమైంది. ఈ దశలో సింధు రెండు పాయింట్లు చేసి గేమ్ను కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా ఆరంభంలో హోరాహోరీగా సాగడంతో 8–8 వద్ద, 15–15 వద్ద స్కోరు సమమైంది. ఈ క్రమంలో జాగ్రత్తగా ఆడిన తెలుగమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను ముగించింది. క్వార్టర్ ఫైనల్లో సింధు... జపాన్కు చెందిన మినత్సు మితానితో తలపడనుంది. సమీర్ దూకుడు సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి చాంపియన్ సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో 21–19, 21–13తో హాంకాంగ్కు చెందిన వోంగ్ వింగ్ కీ విన్సెంట్పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్ల్లో పారుపల్లి కశ్యప్ 16–21, 21–17, 16–21తో సన్ వాన్ మో (కొరియా) చేతిలో కంగుతినగా... సాయిప్రణీత్ 13–21, 24–26తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి 23–21, 16–21, 21–8తో ఏడో సీడ్ లీ జె హుయి–లీ యాంగ్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్లో భారత జంట...మూడో సీడ్ తకెషి కముర–కెయిగో సొనోడా (జపాన్) జోడీతో తలపడుతుంది. సమీర్ వర్మ... టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)ను ఎదుర్కొంటాడు. -
ఫేవరెట్గా సింధు
∙ నేటి నుంచి కొరియా ఓపెన్ ∙ సైనా, శ్రీకాంత్ గైర్హాజరు సియోల్: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్, భారత స్టార్ పూసర్ల వెంకట సింధు కొరియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ ఈవెంట్లో ఆమెకు ఐదో సీడింగ్ దక్కింది. తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్లు జరుగుతాయి. మహిళల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్ పోరులో హైదరాబాదీ టాప్ స్టార్ చెంగ్ ఎన్గన్ యి (హాంకాంగ్)తో తలపడనుంది. ఈ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తప్పుకున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ కోసం వీళ్లిద్దరు ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో సన్నద్ధమవుతున్నారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఎన్గ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)తో పోటీపడనున్నాడు. సింగపూర్ ఓపెన్ చాంపియన్ భమిడిపాటి సాయిప్రణీత్ కూడా హాంకాంగ్కే చెందిన హు యున్తో తలపడతాడు. మిగతా మ్యాచ్ల్లో సమీర్ వర్మ... తనోంగ్సక్ సాన్సోంబూన్సుక్ (థాయ్లాండ్)తో, సౌరభ్ వర్మ క్వాలిఫయర్తో ఆడనున్నారు. నేడు జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్లో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్ తలపడతాడు. డబుల్స్ క్వాలిఫయింగ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం... జాంగ్ వూ చొ–హూ తే కిమ్ (కొరియా) జంటతో పోటీపడనుంది. -
‘సింధు’ వదనం చిన్నబోవద్దు
అద్భుతం ఆ పోరాటం...అసాధారణం ఆ ప్రదర్శన... అయితే ఆటలో క్రూరత్వం కూడా దాగి ఉంటుంది... అది మీ శ్రమను, చిందించిన చెమటను లెక్కలోకి తీసుకోదు. ప్రపంచాన్ని జయించాలంటే పడ్డ కష్టం పాయింట్ల రూపంలోనే కనిపించాలి. తుది ఫలితంలో చాంపియన్ ఒక్కరే కనిపిస్తారు. అలా చూస్తే సింధుకు ఇది పరాజయం కావచ్చు! కానీ 110 నిమిషాల పాటు కోట్లాది మంది అభిమానులను మునివేళ్లపై నిలబెట్టించగలిగిన ఆట అది. కోర్టులో ఆమె కదలికలకు ఫిదా అయిపోయిన క్షణాలు అవి. స్మాష్, డ్రాప్, ర్యాలీ... ఏదైతేనేం ఆమె చూపించిన ఆటకు జయహో అనకుండా ఉండగలమా? ‘రియో’ ఒలింపిక్ వేదికపై రజతంతో మురిపించిన మన సింధూరం ఈసారి మరో ప్రపంచ వేదికపై బంగారాన్ని అందుకునేందుకు చూపించిన పట్టుదలకు సలామ్ చేయకుండా ఆగిపోగలమా? ఆమె ఓటమి మనల్ని బాధించడం లేదు. ఎందుకంటే ఆమె ఒక్కో పాయింట్ సాధించిన తీరు గెలుపుతో సమానమైన సంతృప్తిని ఇచ్చింది. సింధు ఓడిపోయిందనే మాటను చెప్పేందుకు కూడా మనకు మనస్కరించడం లేదు. ఈ మ్యాచ్లో స్వర్ణాన్ని కోల్పోయినా... షటిల్ ప్రపంచంలో ఆమె ఎప్పటికీ మన బంగారు బాలికనే. సరిగ్గా ఏడాది క్రితం రియో ఒలింపిక్స్లో సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారతీయులందరి మనసు దోచుకుంది. ఆ వెంటనే సన్మానాలు, సత్కారాలు, కోట్ల రూపాయల కనకాభిషేకం, బ్రాండింగ్ బంధాలు... ఒక్కటేమిటి, సంవత్సరం వ్యవధిలో ఇలాంటివన్నీ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సాధారణంగా అయితే ఒక 22 ఏళ్ల ప్లేయర్ ఇలాంటి వాటి మాయలో ఆదమరిచి ఆటను కూడా వెనక్కి పంపే ప్రమాదం చాలా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిన క్రీడాకారులు ఎందరికో చరిత్ర సాక్షిగా నిలిచింది. ఒక ఒలింపిక్ పతకంతో జీవిత కాలపు ఆనందాన్ని అనుభవించి అంతటితో సంతృప్తి చెందే అల్ప సంతోషులు కూడా ఎందరో ఉంటారు. కానీ సింధులో గొప్పతనమంతా ఇక్కడే కనిపించింది.ఆమెపై ఎన్ని ప్రశంసలు ముంచేసినా... తను ఆటను మాత్రం అంతే అపురూపంగా చూసుకుంది. అందుకే ఎక్కడా తను ఆగిపోలేదు. ఒలింపిక్స్లో విజయం తర్వాత కూడా మూడు ప్రతిష్టాత్మక టోర్నీలలో విజేతగా నిలిచి తన ప్రాధాన్యాలేమిటో ఆమె చూపించింది. ముందుగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ గెలిచిన సింధు... ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్లో, సయ్యద్ మోడి గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది. ‘రియో’ నుంచి మొదలైన జోరును గ్లాస్గోలో ప్రపంచ విజేతగా ముగించాలని ఆమె కలగంది. దురదృష్టవశాత్తూ అది స్వర్ణ తీరం చేరలేకపోయినా... ఆమె స్థాయిని మరింత పెంచింది. ప్రిక్వార్టర్స్లో మినహా... ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత కూడా కోచ్ పుల్లెల గోపీచంద్ సంతృప్తి చెందలేదు. మనమేంటో ప్రపంచం గుర్తించాలంటే ప్రపంచ చాంపియన్ కూడా కావాలి అంటూ ఆయన తన ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా చెప్పారు. అదే లక్ష్యంగా సింధును సిద్ధం చేశారు కూడా. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో అలవోకగా నెగ్గిన సింధు, రెండో మ్యాచ్లో తడబడింది. తొలి గేమ్ను కోల్పోయి, చివరకు చచ్చీ చెడి మ్యాచ్ గెలుచుకుంది. బహుశా ఇదే ఆమెలో పట్టుదల పెంచింది. తన అసలు సత్తా ఏమిటో ఆమెకు మరోసారి గుర్తు చేసింది. ఫలితం... తర్వాతి రెండు మ్యాచ్లలో సింధు ప్రత్యర్థులకు ఏడుపొక్కటే తక్కువ! క్వార్టర్ ఫైనల్లో 21–14, 21–9 సున్ యు (చైనా)పై... సెమీస్లో 21–13, 21–10తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. సరిగ్గా చెప్పాలంటే తన ఆటతో ఆమె వారందరినీ తొక్కేసింది! ఇదే ఊపులో ఫైనల్కు కూడా సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన చూస్తే తుది పోరులో కూడా అందరూ అదే అద్భుతాన్ని ఆశించారు. అయితే ప్రాణం ఒడ్డి పోరాడిన తర్వాత చివరకు రెండో స్థానం తప్పలేదు. ఆగిపోవద్దు... 2013లో తొలిసారి సింధు ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకున్నప్పుడు అభిమానులకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. సైనా నెహ్వాల్ హవా సాగుతున్న ఆ సమయంలో సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచిన 18 ఏళ్ల అమ్మాయి గురించి కొత్తగా చర్చ మొదలైంది. తర్వాతి ఏడాది మరోసారి అదే పతకం గెలుచున్నప్పుడు సింధును సత్తా ఉన్న షట్లర్గా ప్రపంచం గుర్తించింది. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన ఈ తెలుగమ్మాయి రెండేళ్లలోనే ఒలింపిక్స్లో వెండి పతకం గెలుచుకొని తన విలువను ప్రదర్శించింది. ఈ మధ్యలో సూపర్ సిరీస్లు, గ్రాండ్ప్రి గోల్డ్లలో సంచలన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫైనల్లో సింధు ఓటమిలో అలసట కూడా ఒక కారణంలా కనిపించింది. అద్భుతమైన ఫిట్నెస్ ఉన్నా మ్యాచ్ ఆఖరి క్షణాల్లో ఆమె కాస్త బలహీనంగా మారిపోయింది. ఇవాళ విజయం దక్కకపోవచ్చు... కానీ ప్రపంచ చాంపియన్షిప్ ప్రతీ ఏటా ఆమె ముందుకు వచ్చే అవకాశం. ఈ తరహా ఆట ఆమెకు చాంపియన్ అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని చూపించింది. కాబట్టి సింధుకు స్వర్ణం సుదూర స్వప్నం మాత్రం కాబోదు! – సాక్షి క్రీడా విభాగం -
సింధు శ్రమించి...
►క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ►శ్రీకాంత్, సైనా ముందుకు.. సాయి ప్రణీత్ అవుట్ ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింధు ప్రిక్వార్టర్స్ ప్రత్యర్థి ఎన్గాన్ యి చెయుంగ్. ఈ హాంకాంగ్ అమ్మాయిపై గతంలో మూడు సార్లు అలవోక విజయం సాధించిన రికార్డు సింధుది. ఆమె ఫామ్ దృష్ట్యా ఈసారి కూడా అదే ఫలితమని భావించినా... మ్యాచ్ మాత్రం మరోలా సాగింది. ఎన్గాన్ పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ తుదికంటా హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ను కోల్పోయిన సింధు ఒక దశలో రెండో గేమ్లోనూ వెనుకబడింది. చివరకు తన అనుభవాన్నంతా రంగరించి మ్యాచ్లో నిలిచిన తెలుగమ్మాయి, మూడో గేమ్ విజయంతో గట్టెక్కింది. గ్లాస్గో: అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో పీవీ సింధు ఆపసోపాలు పడింది. సులువైన ప్రత్యర్థితో తలపడుతూ కూడా ఓటమి దిశగా వెళ్లినట్లు కనిపించింది. అయితే చివరకు తన అసలు సత్తాను ప్రదర్శించి కీలక సమరంలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సింధు 19–21, 23–21, 21–17తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మరో వైపు సైనా నెహ్వాల్ అలవోక విజయంతో క్వార్టర్స్కు చేరింది. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 13వ సీడ్ అజయ్ జయరామ్, 15వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించారు. అజయ్ 11–21, 10–21తో ఐదో సీడ్ చెన్ లాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా, సాయిప్రణీత్ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతిన్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో నాలుగో సీడ్ సింధు ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సివచ్చింది. 13వ సీడ్ ఎన్గాన్ ఆరంభం నుంచి పట్టుబిగించడంతో పోటాపోటీగా సాగిన తొలి గేమ్ను హాంకాంగ్ ప్లేయర్ వశం చేసుకుంది. ఇక రెండో గేమ్లోనూ తన దూకుడు పెంచడంతో సింధు 13–16తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో సర్వశక్తులు ఒడ్డి నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. ఐతే చెయుంగ్ కూడా దీటుగా పాయింట్లు సాధిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది చివరకు 21–21 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్ను కైవసం చేసుకుంది. మ్యాచ్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న హైదరాబాదీ స్టార్ నిర్ణాయక మూడో గేమ్లో మొదటి నుంచి జాగ్రత్తగా ఆడింది. నెట్ వద్ద చురుగ్గా స్పందించిన ఆమె స్మాష్లతో రాణించింది. 5–1తో టచ్లోకి వచ్చిన ఆమె 12–8 స్కోరు వరకు ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో ఎన్గాన్ వరుసగా 4 పాయింట్లు చేసి 12–12తో స్కోరును సమం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన సింధు వరుసగా మూడు పాయింట్లు చేసి జోరు పెంచింది. 21–17తో గేమ్ను, మ్యాచ్ను గెలిచింది. మరో ప్రి క్వార్టర్స్లో 12వ సీడ్ సైనా 21–19, 21–15తో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–18తో 14వ సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. వరుస గేముల్లో 42 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో కాసేపు మాత్రమే పోటీనిచ్చిన డెన్మార్క్ ఆటగాడు ఆ తర్వాత తేలిగ్గానే చేతులెత్తేశాడు. 5–6తో ఉన్న శ్రీకాంత్ వరుసగా 6 పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వచ్చాడు ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాని హైదరాబాద్ ఆటగాడు నిమిషాల వ్యవధిలో గేమ్ను ముగించాడు. తర్వాత రెండో గేమ్లో రెట్టించిన ఉత్సాహాన్ని కనబరిచిన అతను 11–3తో ఆధిపత్యాన్ని చాటాడు. అయితే ఆంటోన్సెన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించి నిలువరించే ప్రయత్నం చేసినా... శ్రీకాంత్ నెట్వద్ద తెలివిగా ఆడి పైచేయి కొనసాగించాడు. చివరి దాకా ఆధిక్యంలోనే నిలిచిన ఈ ప్రపంచ పదో ర్యాంకర్ 21–18తో గేమ్ను మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో 15వ సీడ్ సిక్కిరెడ్డి– ప్రణవ్ చోప్రా ద్వయం 22–20, 18–21, 18–21తో ఆరో సీడ్ డెబ్బి సుశాంటో–ప్రవీణ్ జోర్డాన్ జంట చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... టాప్సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో, మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు... ఐదో సీడ్ సన్ యూ (చైనా)తో, గిల్మోర్ (స్కాట్లాండ్), బింగ్ జియావో (చైనా) మ్యాచ్ విజేతతో సైనా తలపడుతుంది. -
మిషన్ ‘గ్లాస్గో’
∙ ఆశల పల్లకిలో శ్రీకాంత్, సింధు ∙ నేటినుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గ్లాస్గో (స్కాట్లాండ్): ఈ సంవత్సరంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరుపులు మెరిపిస్తున్నారు. కిడాంబి శ్రీకాంత్ వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించగా... సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్, థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్స్ను... సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్స్ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పీవీ సింధు సయ్యద్ మోదీ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో చాంపియన్ అయింది. వేదిక ఏదైనా, టోర్నీ స్థాయి ఏదైనా భారత క్రీడాకారులు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో మొదలయ్యే ప్రపంచ చాంపియన్షిప్లో అందరి దృష్టి భారత క్రీడాకారులపైనే కేంద్రీకృతమై ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి ఏకంగా 22 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 21 మందిని ఎంపిక చేసినా... మిక్స్డ్ డబుల్స్లో భారత్కే చెందిన ప్రజక్తా సావంత్ మలేసియా ప్లేయర్ యోగేంద్రన్ కృష్ణన్తో కలిసి విడిగా పోటీపడనుంది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న శ్రీకాంత్ సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్తో; పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో సమీర్ వర్మ తలపడతారు. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ ఆడతారు. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు ఇప్పటివరకు ఒకే పతకం వచ్చింది. 1983లో ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సాధించారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో వీరిద్దరూ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ల్లో బరిలోకి దిగుతారు. భారత్కే చెందిన రితూపర్ణ దాస్ తొలి రౌండ్లో ఐరీ మికెలా (ఫిన్లాండ్)తో; చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)తో తన్వీ లాడ్ పోటీపడనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను లెక్కలోకి తీసుకుంటే ఈసారీ భారత్కు సింగిల్స్ విభాగంలో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబుల్స్ విభాగంలో మాత్రం అంతగా అంచనాలు లేవు. ఒకవేళ డబుల్స్లో ఏదైనా పతకం వస్తే అది బోనస్ అవుతుంది. పతకాలే... ప్రైజ్మనీ లేదు... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే అన్ని స్థాయి టోర్నమెంట్లలో ప్రైజ్మనీ ఉంటున్నా... ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం పతక విజేతలకు ఎలాంటి ప్రైజ్మనీ ఇవ్వరు. సెమీఫైనల్కు చేరిన వారికి కాంస్య పతకాలు, ఫైనల్లో ఓడిన వారికి రజత పతకాలు, చాంపియన్స్కు స్వర్ణ పతకాలు అందజేస్తారు. 1977లో తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్ జరిగింది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1997లో గ్లాస్గోలో జరిగిన ఈ పోటీల్లో భారత్ తరఫున సింగిల్స్లో పుల్లెల గోపీచంద్ పోటీపడగా... 20 ఏళ్ల తర్వాత అదే వేదికపై ఆయన భారత జట్టుకు చీఫ్ కోచ్గా వ్యవహరిస్తుండటం విశేషం. భారత జట్టు వివరాలు ∙ పురుషుల సింగిల్స్: కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ. ∙ మహిళల సింగిల్స్: పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్. ∙ పురుషుల డబుల్స్: సుమీత్ రెడ్డి–మనూ అత్రి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్; సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి. ∙ మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ఆరతి సారా సునీల్–సంజన సంతోష్; మేఘన–పూర్వీషా రామ్. ∙ మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప; సాత్విక్ సాయిరాజ్–మనీషా. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్స్లో దేదీప్య, సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సాయిదేదీప్య 6–3, 1–6, 7–5తో సృష్టి దాస్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, సింధు 6–3, 6–3తో ప్రియాంక (మహారాష్ట్ర)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్లో సాయిదేదీప్య, తమిళనాడుకు చెందిన అద్వైత శరవణన్తో తలపడుతుంది. ఇతర మ్యాచ్ల్లో ఇస్కా తీర్థ 5–7, 1–6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో, మౌళిక రామ్ 4–6, 3–6తో అవిష్క గుప్తా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయారు. -
సింధుకు మరో అవార్డు
ముంబై: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు చేరింది. మారుతీ సుజుకి ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సింధు గెలుచుకుంది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. సింధుతో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. తన శిష్యురాలు సింధు చేతుల మీదుగా గోపీచంద్ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రముఖులు సందడి చేశారు. బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్, ప్లేయర్ గుత్తా జ్వాల, ఫుట్బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా, బాక్సర్ ఆమిర్ ఖాన్, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ‘లివింగ్ లెజెండ్’ అవార్డును పొందారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన భారత టెస్టు క్రికెటర్ లోకేశ్ రాహుల్ ‘గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోగా... బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. వీరితో పాటు రియో పారాలింపిక్స్లో పతకాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్, దీపా మలిక్లు కూడా అవార్డులను అందుకున్నారు. జూనియర్ పురుషుల హాకీ జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. -
ప్రిక్వార్టర్స్లో సింధు, సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు. కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిదేదీప్య 6–1, 6–2తో అవిష్క గుప్తాపై గెలుపొందింది. మరో మ్యాచ్లో సింధు 6–3, 6–3తో గాయత్రి శంకర్ (కేరళ)ను ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. ఇతర మ్యాచ్ల్లో మౌలిక (ఏపీ) 3–6, 6–2, 7–6 (7/2)తో ఆస్థా (మహారాష్ట్ర)పై, ఇస్కా తీర్థ (ఏపీ) 6–1, 6–2తో ప్రవీణపై, నిధి సూరపనేని 6–0, 6–0తో పూర్వ రెడ్డి, లాస్య పట్నాయక్ 6–2, 7–6తో అద్వైతపై గెలుపొంది తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. -
చైనా గోడ దాటుతారా?
సుదిర్మన్ కప్లో నేడు భారత్ కీలక పోరు గోల్డ్ కోస్ట్: సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేడు (శుక్రవారం) రసవత్తర పోరు జరగనుంది. నాకౌట్ దశలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత్, చైనా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. డెన్మార్క్తో తొలి లీగ్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది. 28 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధించడం ఇది రెండోసారి. 2011లో క్వార్టర్స్లోనే చైనా చేతిలో 1–3తో భారత్కు పరాభవం ఎదురైంది. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇండోనేసియాతో పోరులో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో చైనాపై గెలిచి సంచలన విజయం నమోదు చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇది అంత సులువైన పనేం కాదు. ఒలింపిక్ పతక విజేతలు లిన్ డాన్, చెన్ లాంగ్లతో చైనా జట్టు పటిష్టంగా ఉంది. అయితే భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్కు లిన్ డాన్పై గెలిచిన అనుభవం ఉంది. మరోసారి శ్రీకాంత్ అద్వితీయమైన ఆటతీరును ప్రదర్శిస్తే తప్ప అతన్ని కట్టడి చేయలేం. మరోవైపు ఇటీవల కాలంలో చైనా క్రీడాకారులపై ఆధిపత్యం చలాయిస్తోన్న సింధు తన దూకుడును కొనసాగించాలి. మహిళల సింగిల్స్లో ప్రపంచ నెం. 5 సింధు, హి బింగ్ జియావో (ప్రపంచ నెం. 7)తో లేదా సున్ యు (ప్రపంచ నెం. 6)తో తలపడే అవకాశం ఉంది. ఏప్రిల్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో బింగ్ జియావో చేతిలో సింధు పరాజయం పాలైంది. మరో క్రీడాకారిణి సున్ యు (4–3)కు కూడా సింధుపై మెరుగైన రికార్డు ఉంది. దీంతో సింధు మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ, మిక్స్డ్ డబుల్స్లో అశ్విని– సాత్విక్ సాయిరాజ్ జోడీలు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. గత మ్యాచ్లో ఓటమి పాలైన భారత పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి– మను అత్రి ఈ పోరులో రాణించాల్సి ఉంది. -
సింధు సినిమా కూడా...
బ్యాడ్మింటన్ స్టార్పై బయోపిక్కు సన్నాహాలు ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్స్పై సినిమాలు నిర్మించే సీజన్ ఇప్పుడు నడుస్తున్నట్లుంది! కొన్నాళ్ల క్రితమే పుల్లెల గోపీచంద్పై సినిమా తీయనున్నారనే వార్తలు రాగా... సైనా నెహ్వాల్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించనుందనే అధికారిక ప్రకటన వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుపై సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. సింధు ‘బయోపిక్’ను తాను నిర్మిస్తున్నట్లు నటుడు, నిర్మాత సోనూ సూద్ ప్రకటించారు. రియోలో సింధు పతకం గెలిచిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని, అప్పటి నుంచి సింధు జీవిత, కెరీర్ విశేషాలపై తమ బృందం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డట్లు సూద్ వెల్లడించారు. ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సూద్ చెప్పారు. తనపై చిత్రం రానుండటం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ‘నా ప్రయాణంపై సోనూ సూద్ సినిమా నిర్మించాలని నిర్ణయించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. గత ఎనిమిది నెలల శ్రమతో వారు రూపొందించిన స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంది. ఇది కచ్చితంగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతుందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా యువత తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రోత్సహించేలా ఉంటుందని ఆశిస్తున్నా’ అని సింధు స్పందించింది. -
‘టాప్’కు మరింత చేరువలో..ప్రపంచ నంబర్ 2గా సింధు
-
‘టాప్’కు మరింత చేరువలో...ప్రపంచ నంబర్ 2గా సింధు
న్యూఢిల్లీ: తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు మరో చరిత్రకు సిద్ధమవుతోంది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత వరల్డ్ టాప్ ర్యాంక్కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ హైదరాబాదీ సంచలన షట్లర్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్కు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో తెలుగు తేజం సింధు రెండో ర్యాంకుకు ఎగబాకింది. తద్వారా సైనా తర్వాత భారత్ తరఫున టాప్–3లో నిలిచిన రెండో క్రీడాకారిణిగా ఘనత వహించింది. ఆదివారం కరోలినా మారిన్ (స్పెయిన్) ను చిత్తు చేసి ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె మూడు స్థానాల్ని మెరుగుపర్చుకుంది. 75,759 రేటింగ్ పాయింట్లతో సింధు రెండో స్థానంలో నిలువగా... టాప్ ర్యాంకులో తై జు యింగ్ (చైనీస్ తైపీ; 87,911) కొనసాగుతోంది. మారిన్ నిలకడగా మూడో స్థానంలోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మలేసియా ఓపెన్లో తొలిరౌండ్లోనే నిష్క్రమించిన సైనా (64,279) ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 20వ ర్యాంకులో ఉన్నాడు. భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
-
మిషెల్ ప్రసంగం స్ఫూర్తితో..
► సేవా రంగం వైపు భారతీయ యువతి సింధూ ► ఒబామాకు లేఖ వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ రాకెట్లు సింధు, సైనా నెహ్వాల్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా రెండో రౌండ్ దాటని పూసర్ల వెంకట సింధుతో పాటు, 2015 రన్నరప్ సైనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఒకవేళ వీళ్లిద్దరు క్వార్టర్స్ అడ్డంకిని అధిగమిస్తే... సెమీఫైనల్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతను 13–21, 5–21తో ఏడో సీడ్ తియాన్ హౌవే (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 21–12, 21–4తో ఇండోనేసియాకు చెందిన దినార్ ద్యా అయుస్తిన్పై అలవోక విజయం సాధించింది. జోరు మీదున్న ఈ హైదరాబాదీ సంచలనం కేవలం అరగంటలోనే ప్రత్యర్థికి ఇంటిదారి చూపించింది. మరో పోరులో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 21–18, 21–10తో ఫ్యాబియెన్ డెప్రిజ్ (జర్మనీ)ని వరుస గేముల్లో ఓడించింది. తొలి గేమ్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో 12–8తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సైనా తర్వాత ప్రతిపాయింట్కు చెమటోడ్చాల్సి వచ్చినా చివరకు విజయం దక్కింది. -
సింధు ‘సిక్సర్’
సయ్యద్ మోడి గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ కైవసం ‘మిక్స్డ్’ చాంప్ సిక్కి రెడ్డి జోడి లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు సయ్యద్ మోడి గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆమె కెరీర్లో ఇది ఆరో గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ కాగా... సయ్యద్ మోడి టోర్నీలో మొదటిది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో రెండు సార్లు (2012, 2014) రన్నరప్తో సరిపెట్టుకున్న ఆమె ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21–13, 21–14తో గ్రెగోరియా మరిస్క (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. సింధు జోరు ముందు ఆమె ప్రత్యర్థి 30 నిమిషాల్లోనే తేలిపోయింది. గతంలో సింధు మకావు ఓపెన్ను మూడుసార్లు, మలేసియా మాస్టర్స్ టోర్నీని రెండుసార్లు గెలిచింది. పురుషుల సింగిల్స్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రన్నరప్తో తృప్తిపడ్డాడు. తుదిపోరులో తొమ్మిదో సీడ్ సాయి 19–21, 16–21తో భారత్కే చెందిన ఎనిమిదో సీడ్ సమీర్ వర్మ చేతిలో ఓడాడు. ‘మిక్స్డ్’లో విజేతగా నిలిచిన సిక్కిరెడ్డి... మహిళల డబుల్స్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. మిక్స్డ్ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడి 22–20, 21–10తో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటపై గెలిచింది. డబుల్స్లో అశ్వినితో జతకట్టిన ఆమె 16–21, 18–21తో కమిల్ల రైటెర్–క్రిస్టియానా పెడెర్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: భారత నంబర్వన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, టాప్సీడ్ పి.వి.సింధు సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు భమిడిపాటి సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడి కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–16తో అన్సల్ యాదవ్పై గెలుపొందగా, సింధు 21–7, 21–12తో లలిత దహియాపై నెగ్గింది. మిగతా మ్యాచ్ల్లో శ్రీకృష్ణప్రియ 23–21, 21–19తో ముగ్ధ అగ్రేపై, తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–17, 21–19తో ఐదో సీడ్ అండర్స్ అంటన్సెన్ (డెన్మార్క్)కు షాకిచ్చాడు. 11వ సీడ్ సౌరభ్ వర్మ 21–14, 21–16తో లక్ష్యసేన్పై గెలువగా... ఆరో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్కి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్స్లో హర్షిల్ డాని 21–18, 21–18తో ప్రణయ్ని ఇంటిదారి పట్టించాడు. 8వ సీడ్ సమీర్ వర్మ 21–15, 21–16తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్లో మూడో సీడ్ మను అత్రి–సుమిత్ రెడ్డి జంట 15–21, 21–17, 17–21తో మహ్మద్ ఆరిఫ్–కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి– అశ్విని జంట 21–7, 21–10తో డింపాల్ హజరికా–సంఘమిత్ర జోడీపై గెలిచింది. -
సింధు, శ్రీకాంత్ ముందంజ
లక్నో: సయ్యద్ మోడి గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మిం టన్ టోర్నీలో తెలుగుతేజాలు సింధు, శ్రీకాంత్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో సింధు, పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సింధు 21–9, 21–11తో అనుర ప్రభుదేశాయ్పై గెలిచింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–5, 21–12తో జుల్హెల్మి జుల్కిఫ్లి (మలేసియా)పై నెగ్గాడు. -
ఇద్దరు అమ్మాయిల ప్రేమకి అడ్డు చెప్పడంతో..
కమాన్పూర్(కరీంనగర్): ఇద్దరు యువతులు వివాహం చేసుకునేందుకు యత్నించారు. పెద్దలు అంగీకరించకపోవటంతో చెప్పాపెట్టకుండా ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ..గ్రామానికి చెందిన శిరీష, రామగిరి మండలం సెంటనరీకాలనీకి చెందిన సింధు గతకొద్ది రోజులుగా చనువుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరూ కనిపించకుండాపోయారు. దీనిపై రెండు కుటుంబాల వారు కమాన్పూర్, రామగిరి పోలీస్స్టేషన్లో వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు ఠాణాల పోలీసులు విచారణ నిర్వహించగా సింధు, శీరీషలు కలిసి వెళ్లినట్లు తేలింది. రెండు నెలల క్రితం సింధు శిరీషలు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్లోని ఓ తెలుగు టీవీ చానల్ కేంద్రానికి వెళ్లారు. ఆ చానల్ నిర్వహకులు ఇద్దరి యువవతుల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు. అయితే, ఈ నెల 5న శిరీష, సింధు ఇద్దరు కలిసి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. -
ఢిల్లీ ఏసర్స్ జోరు
స్మాషర్స్పై 5–2తో గెలుపు చెన్నై పరువు నిలిపిన సింధు పీబీఎల్–2 బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ ధాటికి చెన్నై స్మాషర్స్ తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 5–2తో చెన్నైపై జయభేరి మోగించింది. ఒక్క చివరి మ్యాచ్ మినహా ఆరంభం నుంచి జరిగిన సింగిల్స్, మిక్స్డ్, పురుషుల డబుల్స్ మ్యాచ్లన్నీ ఏసర్స్ ఆటగాళ్లే గెలిచారు. ఢిల్లీ 5–0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న దశలో బరిలోకి దిగిన సింధు తమ ట్రంప్ మ్యాచ్లో గెలిచి చెన్నై స్మాషర్స్ పరువు నిలిపింది. ముందుగా జరిగిన పురుషుల సింగిల్స్లో జాన్ ఒ జోర్గెన్సన్ (ఢిల్లీ) 10–12, 11–4, 11–6తో టామీ సుగియార్తో (చెన్నై)పై గెలిచాడు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తా జ్వాల (ఢిల్లీ) జోడీ 7–11, 11–4, 11–9తో క్రిస్ అడ్కాక్–సింధు (చెన్నై) జంటను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్లోనూ సన్ వాన్ హో (ఢిల్లీ) 12–10, 11–4తో పారుపల్లి కశ్యప్ (చెన్నై)పై గెలుపొందడంతో ఏసర్స్ ఆధిక్యం 3–0కు పెరిగింది. తర్వాత తమ ట్రంప్ మ్యాచ్లో ఢిల్లీ పురుషుల డబుల్స్ జంట ఇవనోవ్–సొజోనోవ్ జంట 11–6, 11–6తో క్రిస్ అడ్కాక్–మడ్స్ కోల్డింగ్ (చెన్నై) జోడీని ఓడించింది. దీంతో మరో 2 పాయింట్లు ఏసర్స్ ఖాతాలో చేరాయి. చివరగా జరిగిన చెన్నై ట్రంప్ మ్యాచ్లో సింధు 11–6, 11–7తో తన్వీ లాడ్ (ఢిల్లీ)పై గెలిచి చెన్నైకి ఊరటనిచ్చింది. సోమవారం జరిగే మ్యాచ్లో అవ«ద్ వారియర్స్తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. -
సింధును చిత్తు చేసిన కరోలినా
-
మారో మారో మారిన్...
హైదరాబాద్ గెలిచింది.. హైదరాబాదీ ఓడింది ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో సింధు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్ను ఓడించి బోణీ చేసింది. సింధును చిత్తు చేసిన కరోలినా తొలి మ్యాచ్లో హంటర్స్ శుభారంభం ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. ఇద్దరు స్టార్ ప్లేయర్ల పక్షం వహించారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. రెండు గేమ్లు హోరాహోరీగా సాగినా... నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం స్పెయిన్ స్టార్ చెలరేగిపోయింది. హంటర్స్ జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఘనంగా ప్రారంభమైన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)–2 టోర్నీలో అందరూ ఆశించిన వినోదం మొదటి మ్యాచ్లోనే దక్కింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో చెన్నై స్మాషర్స్ను ఓడించి బోణీ చేసింది. హైదరాబాద్: పీవీ సింధు వర్సెస్ కరోలినా మారిన్... రియో ఒలింపిక్స్ ఫైనల్ తర్వాత వీరిద్దరి మ్యాచ్ను భారత గడ్డపై చూడాలనుకున్న మన అభిమానులకు కొత్త సంవత్సరం మొదటి రోజునే ఆ అవకాశం లభించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టోర్నీ రెండో సీజన్లో భాగంగా ఈసారి తమ ఫ్రాంచైజీలు హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తరఫున ఆదివారం వీరిద్దరు తలపడ్డారు. ఈ మ్యాచ్లో మారిన్ (హంటర్స్) 11–8, 12–14, 11–2 స్కోరుతో పీవీ సింధుపై విజయం సాధించింది. ఇటీవలే దుబాయ్లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లీగ్ మ్యాచ్లో సింధు చేతిలో ఓడిన మారిన్, మరోసారి తన సామర్థ్యానికి తగిన ప్రదర్శనను కనబర్చడంతో సింధుకు నిరాశ తప్పలేదు. మారిన్ విజయంతో శుభారంభం చేసిన హంటర్స్ చివరకు ఈ పోరులో 4–3 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్ను ఓడించింది. ప్రతి పోటీలో రెండు జట్లు ఒక్కో మ్యాచ్ను తమ ‘ట్రంప్’ మ్యాచ్గా ఎంపిక చేసుకుంటాయి. ‘ట్రంప్’ మ్యాచ్ ల్లో గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. ఇతర మ్యాచ్ల్లో మాత్రం ఒక్కో పాయింట్ దక్కుతాయి. మారిన్ గెలుపుతో హైదరాబాద్ హంటర్స్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో టామీ సుగియార్తో (చెన్నై) 11–6, 11–8తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)ను ఓడించాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. చెన్నై స్మాషర్స్ జట్టు మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ను తమ ట్రంప్ మ్యాచ్గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్లో క్రిస్ అడ్కాక్–గాబ్రిలీ అడ్కాక్ ద్వయం (చెన్నై) 11–7, 11–9తో హోయ్ వా చౌ–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీని ఓడించింది. దాంతో చెన్నై 3–1తో ఆధిక్యంలో వెళ్లింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 6–11, 11–8, 11–6తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (చెన్నై)పై గెలిచాడు. దాంతో చెన్నై ఆధిక్యం 3–2కి తగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్ పోరులో బూన్ హెయోంగ్ తాన్–వీ కియోంగ్ తాన్ (హైదరాబాద్) జంట 11–7, 11–8తో కోల్డింగ్–సుమీత్ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్గా ఎంపిక చేసుకోవడం, విజయం కూడా సాధించడంతో ఓవరాల్గా హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మారిన్ దూకుడు... సింధుతో జరిగిన మ్యాచ్లో కరోలినా తొలి పాయింట్ సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 4–4 వద్ద చక్కటి డ్రాప్ షాట్లో మారిన్ ముందంజ వేయగా, వెంటనే సింధు కోలుకుంది. అయితే 6–6 వద్ద సమంగా ఉన్న స్థితిలో మారిన్ వరుసగా మూడు పాయింట్లు సాధించింది. సింధు కాస్త పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండో గేమ్లో కూడా ముందుగా పాయింట్లు సొంతం చేసుకొని మారిన్ 3–0తో ముందంజ వేసింది. అయితే 2–5తో వెనుకబడి ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా చెలరేగిపోయింది. స్మాష్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేసిన సింధు వరుసగా 5 పాయింట్లు స్కోర్ చేసి 7–5తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఆ తర్వాత పోరు మరింత రసవత్తరంగా మారింది. ఒకరితో మరొకరు పోటీ పడి ప్రతీ పాయింట్ కోసం శ్రమించడంతో స్కోరు సమమవుతూ వచ్చింది. మారిన్ 10–8 వద్ద మ్యాచ్ సొంతం చేసుకునే స్థితిలో నిలిచినా, సింధు పోరాడింది. తనదైన శైలిలో అద్భుతమైన స్మాష్తో స్కోరు సమం చేసిన సింధు, ఆ తర్వాత గేమ్ను గెలుచుకుంది. మూడో గేమ్లో మారిన్ ఆట ముందు సింధు సాధారణ ప్లేయర్గా మారిపోయింది. ఏకంగా 5–0తో ముందంజ వేసిన తర్వాత ప్రత్యర్థికి మొదటి పాయింట్ ఇచ్చిన మారిన్, తర్వాత కూడా మరో పాయింట్నే సింధుకు కోల్పోయింది. మారిన్ షాట్లకు సింధు వద్ద సమాధానం లేకుండా పోయింది. మారిన్ డ్రాప్ షాట్లతో పాటు లైన్ కాల్లను కూడా ఆమె సరిగ్గా అంచనా వేయగా... అన్నింటా పొరబడిన సింధు, సరైన రీతిలో స్పందించలేక ప్రేక్షకురాలిగా మారిపోయింది. పీబీఎల్–2లో నేడు హైదరాబాద్ హంటర్స్ గీ అవధ్ వారియర్స్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
స్పోర్ట్స్ క్యాలెండర్ 2017
గత ఏడాది పలు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిపించారు. అదే జోరును కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తొలిసారిగా భారత్ ఫుట్బాల్లో అండర్–17 విభాగంలో ప్రపంచకప్ నిర్వహించనుంది. ఇంగ్లండ్ వేదికగా భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. బ్యాడ్మింటన్లో సింధు, సైనా, శ్రీకాంత్ మరిన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయంగా భారత క్రీడాకారులు సందడి చేయనున్నారు.ఈ నేపథ్యంలో 2017లో జరిగే ప్రధాన క్రీడా టోర్నమెంట్ల వివరాలు తెలుపుతూ ‘సాక్షి క్రీడావిభాగం’ అందిస్తోన్న స్పోర్ట్స్ క్యాలెండర్.... క్రికెట్ జనవరి 15: భారత్–ఇంగ్లండ్ తొలి వన్డే (పుణే) జనవరి 19: భారత్–ఇంగ్లండ్ రెండో వన్డే (కటక్) జనవరి 22: భారత్–ఇంగ్లండ్ మూడో వన్డే (కోల్కతా) జనవరి 26: భారత్–ఇంగ్లండ్ తొలి టి20 (కాన్పూర్) జనవరి 29: భారత్–ఇంగ్లండ్ రెండో టి20 (నాగ్పూర్) ఫిబ్రవరి 1: భారత్–ఇంగ్లండ్ మూడో టి20 (బెంగళూరు) ఫిబ్రవరి 8–12: భారత్–బంగ్లాదేశ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ (హైదరాబాద్) ఫిబ్రవరి 23–27: భారత్–ఆస్ట్రేలియా తొలి టెస్టు (పుణే) మార్చి 4–8: భారత్–ఆస్ట్రేలియా రెండో టెస్టు (బెంగళూరు) మార్చి 16–20: భారత్–ఆస్ట్రేలియా మూడో టెస్టు (రాంచీ) మార్చి 25–29: భారత్–ఆస్ట్రేలియా నాలుగో టెస్టు (ధర్మశాల) ఏప్రిల్ 5–మే 21: ఐపీఎల్–10 సీజన్ (భారత్లో) జూన్ 1–18: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ఇంగ్లండ్లో) జులై: వెస్టిండీస్లో భారత్ పర్యటన (5 వన్డేలు, ఒక టి20) జులై–ఆగస్టు: శ్రీలంకలో భారత్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20) అక్టోబరు: భారత్లో ఆస్ట్రేలియా పర్యటన (5 వన్డేలు, ఒక టి20) టెన్నిస్ జనవరి 2–8: చెన్నై ఓపెన్ టోర్నీ జనవరి 16–29: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఫిబ్రవరి 3–5: న్యూజిలాండ్తో భారత్ డేవిస్ కప్ మ్యాచ్ మార్చి 9–19: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 23–ఏప్రిల్ 2: మియామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఏప్రిల్ 16–23: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 7–14: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 14–21: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 28–జూన్ 11: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ జులై 2–16: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆగస్టు 7–13: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 13–20: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఆగస్టు 28–సెప్టెంబరు 10: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ అక్టోబరు 8–15: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబరు 30–నవంబరు 5: పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబరు 12–19: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ బ్యాడ్మింటన్ జనవరి 1–14: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జనవరి 17–22: మలేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ (సిబు) జనవరి 24–29: సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో) ఫిబ్రవరి 14–19: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ (వియత్నాం) ఫిబ్రవరి 28–మార్చి 5: జర్మన్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ (ముల్హీమ్ యాన్ డెర్ రుర్) మార్చి 7–12: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (బర్మింగ్హమ్) మార్చి 14–19: స్విస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ (బాసెల్) మార్చి 28–ఏప్రిల్ 2: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 4–9: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (కౌలాలంపూర్) ఏప్రిల్ 11–16: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సింగపూర్ సిటీ) ఏప్రిల్ 25–20: ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్ మే 21–28: సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ (గోల్డ్కోస్ట్, ఆస్ట్రేలియా) జూన్ 13–18: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (జకార్తా) జూన్ 20–25: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సిడ్నీ) ఆగస్టు 21–27: ప్రపంచ చాంపియన్షిప్ (గ్లాస్గో, స్కాట్లాండ్) సెప్టెంబరు 12–17: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్) సెప్టెంబరు 19–24: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (టోక్యో) అక్టోబరు 17–22: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఒడెన్స్) అక్టోబరు 24–29: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (పారిస్) నవంబరు 14–19: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఫుజు) నవంబరు 21–26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలూన్) డిసెంబరు 13–17: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ (దుబాయ్) హాకీ జనవరి 21–ఫిబ్రవరి 20: హాకీ ఇండియా లీగ్ జూన్ 15–25: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (లండన్) జులై 9–23: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) జూన్ 21–జులై 2: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (బెల్జియం) జులై 8–22: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) నవంబరు 18–26: మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (న్యూజిలాండ్) డిసెంబరు 2–10: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (భారత్) రెజ్లింగ్ జనవరి 2–19: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 (భారత్) జనవరి 31–ఫిబ్రవరి 3: డేవ్ షల్ట్ స్మారక టోర్నీ (అమెరికా) మే 10–14: ఆసియా సీనియర్ చాంపియన్షిప్ (న్యూఢిల్లీ) జూన్ 15–18: ఆసియా జూనియర్ చాంపియన్షిప్ (చైనీస్ తైపీ) ఆగస్టు 1–6: ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (ఫిన్లాండ్) ఆగస్టు 21–26: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (పారిస్) టేబుల్ టెన్నిస్ జనవరి 26–28: వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ (ఇండోర్, భారత్) ఫిబ్రవరి 14–19: వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ (న్యూఢిల్లీ) మే 3–7: ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ (న్యూఢిల్లీ) మే 29–జూన్ 5: ప్రపంచ చాంపియన్షిప్ (జర్మనీ) వెయిట్లిఫ్టింగ్ ఏప్రిల్ 3–10: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (థాయ్లాండ్) ఏప్రిల్ 22–28: ఆసియా చాంపియన్షిప్ (తుర్క్మెనిస్తాన్) జూన్ 16–23: ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (జపాన్) జులై 22–30: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్షిప్ (నేపాల్) సెప్టెంబరు 3–9: కామన్వెల్త్ సీనియర్, జూనియర్, యూత్ చాంపియన్షిప్ (ఆస్ట్రేలియా) నవంబరు 28–డిసెంబరు 5: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (అమెరికా) ఫార్ములావన్ మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్ప్రి (మెల్బోర్న్) ఏప్రిల్ 9: చైనా గ్రాండ్ప్రి (షాంఘై) ఏప్రిల్ 16: బహ్రెయిన్ గ్రాండ్ప్రి (సాఖిర్) ఏప్రిల్ 30: రష్యా గ్రాండ్ప్రి (సోచి) మే 14: స్పెయిన్ గ్రాండ్ప్రి (బార్సిలోనా) మే 28: మొనాకో గ్రాండ్ప్రి (మోంటెకార్లో) జూన్ 11: కెనడా గ్రాండ్ప్రి (మాంట్రియల్) జూన్ 25: అజర్బైజాన్ గ్రాండ్ప్రి (బాకు) జులై 9: ఆస్ట్రియా గ్రాండ్ప్రి (స్పీల్బర్గ్) జులై 16: బ్రిటిష్ గ్రాండ్ప్రి (సిల్వర్స్టోన్) జులై 30: హంగేరి గ్రాండ్ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్ప్రి (స్టావెలోట్) సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్ప్రి (మోంజా) సెప్టెంబరు 17: సింగపూర్ గ్రాండ్ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబరు 1: మలేసియా గ్రాండ్ప్రి (కౌలాలంపూర్) అక్టోబరు 8: జపాన్ గ్రాండ్ప్రి (సుజుకా) అక్టోబరు 22: యూఎస్ గ్రాండ్ప్రి (టెక్సాస్) అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్ప్రి (మెక్సికో సిటీ) నవంబరు 12: బ్రెజిల్ గ్రాండ్ప్రి (సావోపాలో) నవంబరు 26: అబుదాబి గ్రాండ్ప్రి (అబుదాబి) ఫుట్బాల్ జనవరి 14–ఫిబ్రవరి 5: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (గాబోన్) మే 20–జూన్ 11: ‘ఫిఫా’ అండర్–20 ప్రపంచకప్ (కొరియా) జూన్ 3: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (కార్డిఫ్, వేల్స్) జూన్ 17–జులై 2: ‘ఫిఫా’ కాన్ఫెడరేషన్స్ కప్ (రష్యా) అక్టోబరు 6–28: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్ (భారత్) డిసెంబరు 6–16: ‘ఫిఫా’ క్లబ్ ప్రపంచకప్ (యూఏఈ) బాక్సింగ్ ఆగస్టు 25–సెప్టెంబరు 3: ప్రపంచ చాంపియన్షిప్ (జర్మనీ) నవంబరు: ప్రపంచ మహిళల యూత్ చాంపియన్షిప్ చెస్ ఫిబ్రవరి 10–మార్చి 5: ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్షిప్ (ఇరాన్) ఫిబ్రవరి 17–28: ఫిడే గ్రాండ్ప్రి సిరీస్ టోర్నీ–1 (షార్జా) మార్చి 31–ఏప్రిల్ 9: ఆసియా యూత్ చాంపియన్షిప్ (ఉజ్బెకిస్తాన్) మే 1–10: ఆసియా జూనియర్ చాంపియన్షిప్ (ఇరాన్) మే 11–22: ఆసియా పురుషుల, మహిళల చాంపియన్షిప్ (చైనా) మే 11–22: ఫిడే గ్రాండ్ప్రి సిరీస్ టోర్నీ–2 (రష్యా) జూన్ 16–28: ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ (రష్యా) జులై 5–16: ఫిడే గ్రాండ్ప్రి సిరీస్ టోర్నీ–3 (స్విట్జర్లాండ్) సెప్టెంబరు 1–25: ప్రపంచకప్ (జార్జియా) సెప్టెంబరు 16–26: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (ఉరుగ్వే) అక్టోబరు 1–16: ప్రపంచ జూనియర్, అండర్–20 మహిళల చాంపియన్షిప్ (ఇటలీ) నవంబరు 15–26: ఫిడే గ్రాండ్ప్రి సిరీస్ టోర్నీ–4 (స్పెయిన్) అథ్లెటిక్స్ మార్చి 26: ప్రపంచ క్రాస్కంట్రీ చాంపియన్షిప్ (ఉగాండా) మే 5: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) మే 13: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) మే 27: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా) జూన్ 8: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) జూన్ 15: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో, నార్వే) జూన్ 18: డైమండ్ లీగ్ మీట్–6 (స్వీడన్) జులై 1–4: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (భారత్) జులై 1: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్) జులై 6: డైమండ్ లీగ్ మీట్–8 (స్విట్జర్లాండ్) జులై 9: డైమండ్ లీగ్ మీట్–9 (లండన్) జులై 12–16: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (కెన్యా) జులై 16: డైమండ్ లీగ్ మీట్–10 (మొరాకో) జులై 21: డైమండ్ లీగ్ మీట్–11 (మొనాకో) ఆగస్టు 4–13: ప్రపంచ చాంపియన్షిప్ (బ్రిటన్) ఆగస్టు 20: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్హమ్) ఆగస్టు 24: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిచ్) సెప్టెంబరు 1: డైమండ్ లీగ్ మీట్–14 (బెల్జియం) ఆర్చరీ మే 16–21: ప్రపంచకప్ స్టేజ్–1 (షాంఘై, చైనా) జూన్ 6–11: ప్రపంచకప్ స్టేజ్–2 (అంటాల్యా, టర్కీ) జూన్ 20–25: ప్రపంచకప్ స్టేజ్–3 (సాల్ట్లేక్ సిటీ, అమెరికా) ఆగస్టు 8–13: ప్రపంచకప్ స్టేజ్–4 (బెర్లిన్, జర్మనీ) అక్టోబరు 15–22: ప్రపంచ చాంపియన్షిప్ (మెక్సికో సిటీ) -
బ్యాడ్మింటన్ బ్రహ్మోత్సవం
► రేపటి నుంచి పీబీఎల్–2 ► బరిలో 6 జట్లు ► మొత్తం ప్రైజ్మనీ రూ. 6 కోట్లు ► తొలి రోజే మారిన్తో సింధు ‘ఢీ’ బ్యాడ్మింటన్లో మళ్లీ వినోదాల పండగొచ్చింది. ఒలింపిక్స్లో సింధు రజత పతకంతో షటిల్పై ఉవ్వెత్తున ఎగసిన అభిమానానికి తోడుగా వేర్వేరు వేదికల్లో భారత ఆటగాళ్లు సాధించిన వరుస విజయాలు మరింత ఊపునిచ్చాయి. దాంతో సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మరోసారి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సన్నద్ధమైంది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతున్న సీజన్–2 పీబీఎల్తో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రెండు వారాల పాటు ‘బ్యాడీస్’ వినోదం అందించడం ఖాయం. ఇక సింధు, మారిన్ మధ్య జరిగిన రియో ఒలింపిక్స్లో ఫైనల్ మ్యాచ్ను టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులకు ఇప్పుడు వారిద్దరి ప్రత్యక్ష పోరును తిలకించే అవకాశం టోర్నీ తొలి రోజే వచ్చింది. హైదరాబాద్లో రెండు రోజుల ‘షో’ తర్వాత మరో నాలుగు నగరాలు ముంబై, లక్నో, బెంగళూరు, న్యూఢిల్లీలలో పీబీఎల్ సందడి చేయనుంది. హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో అంచె పోటీలకు రంగం సిద్ధమైంది. రేపు (ఆదివారం) నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం తొలి రోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి. జనవరి 14 వరకు జరిగే ఈ టోర్నీలో ఫైనల్ను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టాప్ షట్లర్లతో పాటు ప్రపంచంలో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో సింధు చెన్నై స్మాషర్స్కు... సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ అవధ్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ హైదరాబాద్ హంటర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. మొత్తం 6 జట్లు తలపడుతుండగా, ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి. 2016 జనవరిలో జరిగిన గత పీబీఎల్లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. అనివార్య కారణాలతో ఈసారి చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్లను బెంగళూరుకు తరలించారు. మారిన ఫార్మాట్... టోర్నమెంట్లో ఇరు జట్ల మధ్య జరిగే ఒక ‘టై’లో ఐదు మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల విభాగంలో రెండు సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లలో ఆటగాళ్లు తలపడతారు. గత ఏడాది మూడు గేమ్ల పోరులో మూడో గేమ్ మాత్రమే 11 పాయింట్లుగా ఉంది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 11 పాయింట్ల పద్ధతిని పీబీఎల్లో వాడుతున్నారు. ప్రసారకర్తల పరిమితుల వల్ల కూడా ఈసారి మూడు గేమ్లను కూడా 11 పాయింట్లతోనే నిర్వహిస్తారు. విజేతను తేల్చేందుకు చివర్లో ప్రత్యర్థుల మధ్య కనీసం 2 పాయింట్ల తేడా ఉండాలి. అది 14–14 వరకు సాగుతుంది. అప్పుడు మాత్రం ‘సడెన్ డెత్’గా ముందు ఎవరు స్కోర్ చేస్తే వారిదే గేమ్ అవుతుంది. వేలంలో మారిన్ టాపర్... ఈ టోర్నీ కోసం నవంబర్లో వేలం నిర్వహించారు. అందులో అత్యధికంగా రూ. 61.5 లక్షల మొత్తానికి కరోలినా మారిన్ను హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. సుంగ్ జీ హున్ (ముంబై)కి రూ. 60 లక్షలు దక్కాయి. శ్రీకాంత్ (రూ. 51 లక్షలు), సింధు (రూ. 39 లక్షలు), సైనా నెహ్వాల్ (రూ. 33 లక్షలు) ఎక్కువ మొత్తం పొందిన భారత షట్లర్లుగా నిలిచారు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకుంటున్న మారిన్, సైనా అంచనాలకు అనుగుణంగా తమ పూర్తి సత్తాను ప్రదర్శించగలరా చూడాలి. భారీ ప్రైజ్మనీ... పీబీఎల్లో మొత్తం ప్రైజ్మనీని రూ. 6 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 కోట్లు లభిస్తాయి. రన్నరప్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీస్ చేరిన రెండు జట్లకు చెరో రూ. 75 లక్షల చొప్పున అందజేస్తారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో పలు సంస్థలు పీబీఎల్తో జత కట్టడానికి ఆసక్తి చూపించడం బ్యాడ్మింటన్కు పెరిగిన ఆదరణను చూపిస్తుంది. పలు కార్పొరేట్ సంస్థలు టోర్నీకి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘బెంగళూరు బ్లాస్టర్స్’ జట్టును సొంతం చేసుకొని తొలిసారి ఈ లీగ్లోకి అడుగు పెట్టడం విశేషం. జట్ల వివరాలు హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, రాజీవ్ ఉసెఫ్, టాన్ బూన్ హెంగ్, టాన్ వీ కోంగ్, చౌ హో వా, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, శ్రీకృష్ణప్రియ, జె.మేఘన. ముంబై రాకెట్స్: సుంగ్ జీ హున్, లీ యోంగ్ డే, నిపిత్ఫాన్, నదీనా జీబా, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, చిరాగ్ శెట్టి, మోహితా సహదేవ్, వృశాలి. ఢిల్లీ ఏసర్స్: జాన్ జొర్గెన్సన్, సన్ వాన్ హో, జిందపాన్, ఇవాన్ సొజొనోవ్, వ్లదీమర్ ఇవనోవ్, గుత్తా జ్వాల, కె. మనీషా, అక్షయ్ దివాల్కర్, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. అవధ్ వారియర్స్: సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, మార్కిస్ కిడో, గో షెమ్, బోడిన్ ఇసారా, విన్సెంట్ వాంగ్ వింగ్ కి, ఆదిత్య జోషి, రితూపర్ణ దాస్, ప్రజక్తా సావంత్, సావిత్రీ అమిత్రపాయ్. బెంగళూరు బ్లాస్టర్స్: బూన్సాక్ పొన్సానా, విక్టర్ అక్సెల్సన్, కో సుంగ్ హ్యూన్, యూ యోన్ సోంగ్, చెంగ్ గాన్ యి, సౌరభ్ వర్మ, రుత్విక శివాని, ప్రణవ్ చోప్రా, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, తనోంగ్సక్ సాన్సోమ్బూన్సక్, టామీ సుగియార్తో, క్రిస్ అడ్కాక్, మ్యాడ్స్ కోల్డింగ్, గాబ్రియెల్ అడ్కాక్, రమ్య తులసి, అరుంధతి పంతవానే, సుమీత్ రెడ్డి. ► హైదరాబాద్లో జరిగే మ్యాచ్లకు టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ► పీబీఎల్ తొలి సీజన్ అభిమానులను ఆకట్టుకోగా రెండో సీజన్కు అన్ని వైపుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పదేళ్ల కాలానికి టోర్నీ నిర్వహణ కోసం మేం ‘బాయ్’తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా లాభాలు ఆశించడం లేదు. బ్యాడ్మింటన్కు ఆదరణ పెరిగినట్లే ఈ లీగ్ను కూడా పెద్ద స్థాయికి చేర్చాలనేదే మా లక్ష్యం. సచిన్లాంటి వ్యక్తి లీగ్తో జత కలవడం మా నమ్మకాన్ని పెంచింది. ఈ సీజన్లో అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశాం. –స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధి ఎం. ప్రసాద్ ► భారత్కు రావడం చాలా బాగుంది. హంటర్స్ అభిమానులు నాకు మద్దతు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా. సింధు కఠిన ప్రత్యర్థి. ఆమె సొంత నగరంలో ఆమెతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. –కరోలినా మారిన్ ► లీగ్లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయి. 11 పాయింట్ల ఫార్మాట్తో సమస్య లేదు. ప్రతీ పాయింట్ కీలకమే. – పీవీ సింధు -
సెమీస్లో సింధు
సమీర్ వర్మ కూడా ముందుకు క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ కౌలూన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు తన ఫామ్ను కొనసాగిస్తూ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో టాప్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్స్లో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో గ్జియావు లియాంగ్పై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్లలో సునాయాస విజయాలు సాధించిన సింధుకు క్వార్టర్స్లో గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ను చకచకా గెల్చుకున్న సింధు, రెండో గేమ్లో చేజేతులా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్నా... లియాంగ్ వరుస పారుుంట్లతో దూసుకురావడంతో స్కోరు 18-18 వద్ద సమమైంది. ఆ తర్వాత 21-21కి చేరాక సింగపూర్ అమ్మారుు వరుసగా రెండు పారుుంట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్లో 15-15 వరకు ఇద్దరు సమఉజ్జీలుగా కనిపించినా, కీలక సమయంలో పారుుంట్లతో సింధు మ్యాచ్ను సొంతం చేసుకుంది. గాయంనుంచి కోలుకున్న తర్వాత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సైనాకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ మూడు గేమ్ల పాటు పోరాడిన ఆమె ఈ సారి తలవంచింది. హాంకాంగ్కు చెందిన చుంగ్ గాన్ రుు 21-8, 18-21, 21-19తో సైనాను ఓడించింది. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్లో సైనా పేలవ ప్రదర్శన కనబర్చింది. అరుుతే కోలుకొని రెండో గేమ్ గెలుచుకోగలిగింది. మూడో గేమ్లో ఒక దశలో 11-18తో వెనుకబడింది. అరుుతే పుంజుకున్న సైనా వరుసగా ఏడు పారుుంట్లు కొల్లగొట్టి 18-18తో సమం చేసింది. కానీ చివరకు ప్రత్యర్థిదే పైచేరుు అరుుంది. సైనాను ఓడించి చుంగ్ గాన్తో సెమీస్లో సింధు తలపడుతుంది. సెమీస్లో సమీర్ వర్మ... పురుషుల విభాగంలోనూ భారత్కు మిశ్రమ ఫలితాలు లభించారుు. భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టగా, అజయ్ జయరామ్ క్వార్టర్స్లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 23-21తో ఫెంగ్ చోంగ్ వీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో జయరామ్ 15-21, 14-21 తేడాతో ఆంగస్ లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. తొమ్మిదో ర్యాంక్కు సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్సలో పీవీ సింధు తొమ్మిదో ర్యాంక్కు చేరగా... సైనా నెహ్వాల్ టాప్-10లోంచి బయటకు వెళ్లింది. గత వారం చైనా ఓపెన్ గెలిచిన సింధు రెండు ర్యాంక్లు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్ ఏకంగా ఐదు స్థానాలు కోల్పోరుు 11వ ర్యాంక్కు చేరింది. -
గుప్త జ్వాల
మనిషిలో ఉన్న ప్రతిభ గుప్తంగా ఎందుకు ఉండాలి? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గోప్యంగా ఎందుకుంచాలి? యజ్ఞంలో అగ్గిలేకపోతే ఎలా? జీవితంలో జ్వాల లేకపోతే ఎలా? ఈ ప్రజ్వలాలన్నీ కాంతినివ్వకపోతే ఎలా? ఈ కీర్తిని మసకబార్చిన వాళ్లపై కోపం ఉండదా? గుత్తా జ్వాలకు కోపం వచ్చింది! గోప్యం లేకుండా మాట్లాడింది! గుప్త జ్వాల ఎగిసిపడింది!! మీ ఆటకు బదులు మీ దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడితే మీకు బాధనిపించదా? మన దేశంలో విషాదం ఏంటంటే.. ఒక స్పోర్ట్స్ ఉమన్ అంటే సరిగ్గా డ్రెసప్ కాకూడదు. మేకప్ వేసుకోకూడదు. అలా వ్యక్తిగత శ్రద్ధ చూపించకపోతేనే వాళ్లు వాళ్ల కెరీర్ పట్ల ఫోకస్డ్గా ఉన్నట్టు లెక్క. ఒక్క స్పోర్ట్సే కాదు.. ఏ కెరీర్లోనైనా అంతే. అమ్మాయి కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నట్టు కనపడితే చాలు. ఈజీగా ముద్ర వేసేసారు. మ్యానిక్యూర్, పెడీక్యూర్ లాంటివి పర్సనల్ హైజీన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. కొంచెం బ్రైట్గా కనపడితే చాలు... ఫాస్ట్ అంటారు.. యాక్టివ్ అంటారు. సచ్ ఎ హారిబుల్ థింగ్. భవిష్యత్లో వాళ్లూ ఆడపిల్లలకు తండ్రులవుతారనే ఆలోచన ఎందుకు రాదో... అర్థం కాదు. మీరేం మాట్లాడినా కాంట్రవర్సీ అంటారు. ఎందుకు? యా... నన్ను, సానియాను కాంట్రావర్సీ క్వీన్స్ అంటారు. కానీ, నేనెప్పుడు కాంట్రవర్సీ చేశానండీ? ఎవరినైనా తిడితే.. కొడితే కాంట్రవర్సీ. మా ైరైట్స్ గురించి మాట్లాడితే కాంట్రావర్సీయా? నేను, ఈవెన్ సానియా.. మేమెప్పుడూ మా హక్కుల గురించే మాట్లాడాం. మన దేశంలో ఇప్పటికీ మనం రైట్స్ గురించి పోట్లాడాల్సిన దుఃస్థితి. హక్కుల గురించి పోరాడే మహిళలపై చాలా తేలికగా ముద్ర వేస్తారు. మీరు ఇతర స్పోర్ట్స్పర్సన్స్కు మద్దతిచ్చినట్టు మీకు వాళ్ల మద్దతు దొరికిందా? ఏ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, నేను సహించను. వాళ్లకు సపోర్ట్గా నిలబడతాను. నా విషయంలో వాళ్లు అలాగే స్పందించాలని ఎక్స్పెక్ట్ చేయను. నాతోపాటు నిలబడితే అది నాకు కాదు... వాళ్లకే హెల్ప్ అవుతుంది. వాళ్లు నా కోసం ఫైట్ చేయనప్పుడు వాళ్ల కోసం వాళ్లూ ఫైట్ చేసుకోలేరు కదా! మిగిలిన ప్లేయర్స్లా మీకూ ఎంకరేజ్మెంట్ దొరికిందా? టిల్ డేట్ నేను గవర్నమెంట్ని డబ్బులు అడగలేదు. ‘పద్మశ్రీ’ అవార్డ్ అడగలేదు. అవి వస్తే వస్తాయి.. అది సెకండరీ.. రెస్పెక్ట్ మాత్రం కోరుకున్నాను. మొన్న ఒలింపిక్స్ నుంచి సింధు వచ్చాక అందరూ ‘వాళ్ల ఫాదర్ ఇంత కష్టపడ్డారు.. అంత కష్టపడ్డారు’ అని అన్నారు. నో డౌట్ దె వర్క్డ్ హార్డ్. బట్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్. స్పోర్ట్స్ పర్సన్స్ అందరి పేరెంట్స్ అంతే కష్టపడ్తారు. కాని సింధుకు దొరికిన సపోర్ట్ ఏంటి? మిగతావాళ్లకు అందిన సపోర్ట్ ఏంటి? అని ఎవరూ ఎందుకు అడగరు? ఈవెన్ సానియా విషయంలో కూడా అంతే కదా... షి హ్యాడ్ జీవీకే స్పాన్సర్స్ ఆల్ ద టైమ్. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. వియ్ నెవర్ గాట్ ఎనీ సపోర్ట్. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు. అయితే ఎవరి సపోర్టూ అందలేదంటారా? హూ సపోర్టెడ్ మి?మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను నా బ్లడ్ ధారపోశా. బాడ్మింటన్కు నా లైఫ్ ఇచ్చా. ఐ బికేమ్ నేషనల్ ఛాంపియన్ బై మై ఓన్. ఐ బికేమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. కామన్వెల్త్ గేమ్స్ మెడల్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్... హ్యావ్ డన్ వెల్. నేను పాపులర్ అయింది, ఫేమస్ అయింది నా ఆటతీరుతో, మీడియా సపోర్ట్తో. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు. అలాగని ఎవరిపై కంప్లయింట్స్ లేవు. ఈరోజు ఎవరు పీఆర్ మెయిన్టైన్ చేయగలరో వాళ్లకే గుర్తింపు. పని మీదే దృష్టిపెట్టే వాళ్లకు ఏ గుర్తింపు లేదు. మా డాడీ చెప్పే ‘యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బాటిల్’ అనే మాట నమ్ముతా.. ఆచరిస్తా! అబద్ధాలు, రూమర్స్ ప్రచారం గురించి? నా గురించి అబద్ధాలు, రూమర్స్ నమ్మడం ఈజీ. మే బీ బికాజ్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఐయామ్ వెరీ టాల్ అండ్ బ్రాడ్ పర్సనాలిటీ. యారగెంట్నని.. నాట్ ఫ్రెండ్లీ అనీ నిర్ధారణకు వచ్చేస్తారు. పైగా, ఐ హ్యావ్ కలర్డ్ మై హెయిర్.. ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం ప్రెజెంటబుల్గా కనిపిస్తాను... కాబట్టి నా మీద వచ్చిన రూమర్స్ను జనాలు ఈజీగా నమ్మేస్తారు. నమ్మించేలా డర్టీ గిమ్మిక్స్ కూడా ప్లే చేస్తారు. కాని అవి నన్ను హర్ట్ చేస్తాయని, నాకూ ఓ కుటుంబం ఉంటుందని, ఫ్రెండ్స్ ఉంటారని ఆలోచించరు. నిజానికి నాది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రాక్టీస్ తర్వాత ఇంట్లో, రెస్టారెంట్లలో నా ఫ్రెండ్స్తో హ్యాంగవుట్ అవాలనుకుంటా... అవుతాను. ఇండిపెండెంట్ విమెన్పై మనవాళ్ల వైఖరిపై మీ వ్యాఖ్య? ఉయ్ లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. బట్ ఇన్ ఎ హిపొక్రటిక్ కంట్రీ. ఇండిపెండెంట్ విమెన్ పట్ల మన మైండ్ సెట్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ అనగానే సమ్థింగ్ ఈజ్ రాంగ్ అంటారు. దట్ ఈజ్ సచ్ ఎ హోప్లెస్, డర్టీ థింకింగ్. అయామ్ టెల్లింగ్ ఇట్ టుడే... అలా రాంగ్గా ఉండేది ఎక్కువగా మగవాళ్లే. కాని అబ్బాయికి అలాంటి పేరు లేదు. అమ్మాయికి మాత్రం పేరు పెడతారు. విచ్ ఈజ్ రియల్లీ సిక్. షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ థింగ్ లైక్ దట్. మీకు లేనివాటిని మీకు అపాదిస్తున్నట్టు అనిపిస్తోందా? అయామ్ వెరీ వార్మ్ పర్సన్. పీపుల్ లైక్ టు ఎజ్యూమ్. అండ్ దే ఆల్వేజ్ డన్ ఇట్ విత్ మి... చిన్నప్పటి నుంచి. నా గురించి తెలియని వాళ్లు నన్నెందుకు డిస్లైక్ చేస్తారో? నన్ను ఇష్టపడక పోవడానికి వాళ్లకుండే కారణాలు వాళ్లకుండొచ్చు. అది వాళ్ల సొంతం. నాకర్థమైంది ఏంటంటే.. నన్ను ఇష్టపడకపోవడానికి వాళ్ల ఇగో ఓ రీజన్ కావచ్చు. నేను మాత్రం అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాను. ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్గానే ట్రీట్ చేస్తాను. అలా పెంచారు మా డాడీ. మీ మ్యారీడ్ లైఫ్...? నేను పెళ్లి చేసుకునే నాటికి అంత పాపులర్ కాదు. ఫేమస్ కాదు. ఐ వజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైమ్. ఆ పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యభర్తలిద్దరిలో ఎవరికీ రిస్ట్రిక్షన్లా ఉండకూడదు. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ గ్రో టుగెదర్. భర్తకు చేదోడుగా భార్య, భార్యకు చేయూతగా భర్తా ఉండాలి. మా విషయంలో అలా జరగలేదు. సమ్వేర్ ఐ థాట్ ఉయ్ వర్ నాట్ గ్రోయింగ్.. ఇంకేవో కొన్ని విషయాలు. వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా? ఎందుకు ఉండదు? అయితే నాకు కొంచెం భయం. అంత త్వరగా ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయడంలో చాలా పూర్. మా పేరెంట్స్ ట్రూత్ఫుల్గా ఉండడమే నేర్పించారు. నా ఈ నేచర్, నా ఎక్స్పిరీయెన్సెస్ వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ యెస్.. పెళ్లి చేసుకునే ఆలోచనైతే ఉంది. కానీ నాకు కావల్సిన మనిషి ఇంకా దొరకలేదు. టాల్గా కూడా ఉండాలి (నవ్వుతూ). మీ సినిమా ఎంట్రీ.. ఎక్స్పెక్టెడా? అనెక్స్పెక్టెడా? నితిన్ నాకు మంచి ఫ్రెండ్. మాకు ఓ కామన్ గ్రూప్ ఉంది. ఓ సారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. ‘జ్వాలా! నా మూవీలో యాక్ట్ చేస్తావా?’అని అడిగాడు. నేను అంతే కాజ్యువల్గా ‘ఆ చేస్తాను’ అని చెప్పి ఆ విషయం మరిచిపోయా. త్రీ మంత్స్ తర్వాత ‘జ్వాలా! సాంగ్ రెడీ’ అంటూ వచ్చాడు. ఐ వజ్ షాక్డ్. ఆ టైమ్లో బాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడట్లేదు. సో చేసేశాను. భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో... ఐ డోంట్ థింక్. ఇప్పటి వరకు నా లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఓ కొత్త ఫీల్డ్లోకి వెళ్లి మళ్లీ అక్కడ స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. ఐ లైక్ చాట్ షోస్. వాటిని హోస్ట్ చేయడం లాంటివైతే ఓకే. ఐ వాంట్ టు టీచ్ యూత్ టు డీల్ విత్ ట్రూత్. కోచ్గా మారే అవకాశం ఏమైనా ఉందా? నాకు పేషెన్స్ తక్కువ. సో మంచి కోచ్ని కాలేను. అయితే మన దగ్గర కోచ్లను గౌరవించే కల్చర్ లేదు. అలాంటి కల్చర్ను పెంచాలనైతే ఉంది. గవర్నమెంట్ సహాయంతో విమెన్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలని ఉంది. మన దగ్గర మంచి పనులకు అవకాశాలు త్వరగా దొరకవుగా. ఎన్నాళ్లో నుంచో ప్రయత్నిస్తున్నా. చూద్దాం! ఫ్యూచర్లో ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నారు? పదిహేనేళ్ల కిందట ఉన్న మంచి వాతావరణం.. భద్రతా ఇప్పుడు లేవు. ఆడవాళ్లను గౌరవంగా చూడాలని, వాళ్లనూ మనుషులుగానే పరిగణించాలని మన మగపిల్లలకు నేర్పించట్లేదు. ఐఫోన్ 7 ఉంటేనో, బీఎమ్డబ్ల్యూ కారు ఉంటేనో డెవలప్ అయినట్టు కాదు. ఆడవాళ్లు మగవాళ్లతో సమాన గౌరవం పొందగలిగినప్పుడు, ఆమె భద్రంగా ఉండగలిగినప్పుడే ఈ సొసైటీ డెవలప్ అయినట్టు! మా ఇంట్లో అలాంటి ఎట్మాస్ఫియరే ఉంది. మా అమ్మ విషయంలో, మా విషయంలో దేనికీ రిస్ట్రక్షన్స్ పెట్టలేదు మా నాన్న. ఉయ్ నీడ్ మెన్ లైక్ హిమ్. అలాగే ఆడవాళ్లూ సాటి ఆడవాళ్లకి సపోర్ట్గా నిలవాలి. ఇది ఇంటి నుంచే మొదలుకావాలి. ఎందుకంటే పిల్లలు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లను గౌరవించే వాతావరణం ఉంటే అదే పిల్లలకూ అలవడుతుంది! రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా? టు డూ సమ్థింగ్ గుడ్ యు నీడ్ పవర్.. సో ఐ విల్ సీ. నాలాంటి అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయవేత్తలైనా నాకు అవకాశం ఇస్తే, నేననుకున్నది చేయగల స్వేచ్ఛను ఇస్తే.. డెఫినెట్లీ డు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే అధికారాన్ని ఈ దేశంలోని మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తా! ‘గాంధీ’ కోసం వచ్చాం! డాడీ (గుత్తా క్రాంతి), మమ్మీ (ఎలెన్) మహారాష్ట్రలోని సేవాగ్రామ్లో ఒకటే కాలేజ్లో చదువుకున్నారు. మా ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ వస్తూ తన వెంట మా మమ్మీని కూడా తీసుకొచ్చారు. అలా కాలేజ్లో కలుసుకున్న మమ్మీ డాడీల పరిచయం... ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా మారింది. డాడీ నాగ్పూర్లో రిజర్వ్బ్యాంక్లో పనిచేసేవారు. నేను అక్కడే పుట్టాను. నాకు ఓ చెల్లి (ఇన్సీ). నా నాలుగో ఏట హైదరాబాద్కి వచ్చాం. పుల్లెల గోపీచంద్తో గొడవేంటి? నాకూ తెలియదు. టిల్ డేట్ ఐ రియల్లీ వండర్. నాకొకటే బ్యాడ్ ఫీలింగ్.. ఏంటంటే.. సింగిల్స్కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు.. వై? వాట్ ఈజ్ ద రీజన్? గివ్ మి వన్ రీజన్ అని అడుగుతున్నా. ఇఫ్ హి కెన్ మేక్ సింధూ.. కెన్ మేక్ అనదర్ డబుల్స్ ఛాంపియన్.. మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్.. విమెన్ డబుల్స్ ఛాంపియన్. ‘ఐ వజ్ వరల్డ్ నంబర్ 6... యు డోంట్ వాంట్ టు గివ్ మి ఎనీ రెస్పెక్ట్.. ఫైన్! ఎంకరేజ్ ది అదర్ డబుల్స్.. వై నాట్?’ ఇది మాట్లాడ్డానికి చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు. నా విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా. నితిన్ క్లోజ్... ఐ లవ్ ప్రభాస్... నాని కూడా ఇష్టం..! వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ రెండూ ఇష్టపడతా. చీరలంటే చాలా ఇష్టం. సిన్మాలు బాగా చూస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ! తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఐ హ్యావ్ మెట్ ప్రభాస్ వన్స్ ఆర్ ట్వయిస్. హి ఈజ్ సో టాల్ ఆల్సో. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా! (నవ్వు) - సరస్వతి రమ -
క్వార్టర్ ఫైనల్లో సింధు
జయరామ్ కూడా... చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫుజౌ (చైనా): భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్లో అజయ్ జయరామ్ కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ సింధు 18-21, 22-20, 21-17తో బెవెన్ జంగ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్ ఆరంభంలో సింధు ఒక దశలో 11-7తో ఆధిక్యంలో నిలిచింది. అరుుతే అమెరికన్ ప్రత్యర్థి వరుసగా పారుుంట్లు సాధించి 13-13తో స్కోరును సమం చేసింది. అదే జోరుతో ఆమె 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా పారుుంట్లు సాధించి గేమ్ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్లోనూ సింధుకు ఓడినంత పనైంది. మొదట 8-0తో ఆధిక్యం పొందినప్పటికీ తర్వాత జంగ్... సింధుకు అవకాశమివ్వకుండా రెచ్చిపోరుుంది. 16-16తో స్కోరును సమం చేసి అనంతరం 19-17తో ఆధిక్యంలోకి వచ్చింది. అరుుతే సింధు ఐదు పారుుంట్లు సాధించి గేమ్ను కై వసం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్లోనూ బెవెన్ జంగ్ పట్టుదలను ప్రదర్శించినప్పటికీ సింధు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించింది. తదుపరి క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. పురుషుల ప్రిక్వార్టర్స్లో అజయ్ జయరామ్ 20-22, 21-19, 21-12తో వే నాన్ (హాంకాంగ్)పై కష్టపడి గెలిచాడు. క్వార్టర్స్లో జయరామ్కు ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో భమిడిపాటి సారుుప్రణీత్ 16-21, 9-21తో మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ) చేతిలో, హెచ్.ఎస్.ప్రణయ్ 17-21, 19-21తో కియావో బిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
‘టోక్యో’లో సింధు స్వర్ణం నెగ్గాలి
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్ష హైదరాబాద్: ఫిలింనగర్ దైవసన్నిధానం సాక్షిగా 2020 టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు బంగారు పతకంతో తిరిగి రావాలని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన పీవీ సింధును ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆయన ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింధు కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవద్దని బంగారు పతకం సాధించి ప్రపంచం గర్విం చదగ్గ క్రీడాకారిణిగా ఎదగాలన్నారు. రియో ఒలింపిక్స్ ముందు దైవసన్నిధానంలో సింధుకు పతకం రావాలని కోరుకుంటూ కుంభాభిషేకం చేయడం జరిగిందని, దేవుడు అనుగ్రహించాడని తెలిపారు. కేవలం దైవభక్తి ఉంటే సరిపోదని గురుభక్తి కూడా కావాలని... గోపీచంద్ గురువుగా సింధు ఆయన మార్గంలో నడిచి ఈ పతకాన్ని సాధించిందన్నారు. గోపీచంద్తో తనకు ఐదేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. సింధుకు పతకం రావడానికి గోపీచంద్ ఎంత కారణమో తన వద్దకు చాముండేశ్వరీనాథ్ ఆమెను తీసుకొచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, చాముండేశ్వరీనాథ్, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటిన రోజా
గాయపడ్డ మహిళను ఆస్పత్రిలో చేర్పించిన నగరి ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, తిరుపతి: నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను కాపాడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరులో జరిగే జెడ్పీ సమావేశానికి బయల్దేరిన రోజాకు నేండ్రగుంట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సింధు అనే మహిళ కనబడింది. స్కూటీపై వెళ్తున్న ఆమె ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బండి అదుపు తప్పడంతో రోడ్డుపై పడింది. తల రోడ్డుకు బలంగా కొట్టుకొని ర క్తస్రావమైంది. ఈ సంఘటనను చూసిన రోజా డ్రైవర్ను అప్రమత్తం చేసి సింధును తన కారులో ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న పూతలపట్టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యులు ఆమెను అంబులెన్సులో తిరుపతి స్విమ్స్కు తరలించారు. ఆమె కోలుకుంటోంది. -
శ్రీవారికి సింధూ తులభారం
– 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పణ – శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గోపిచంద్ సాక్షి,తిరుమల: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు సమర్పించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితో కలసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. ముందుగా బెల్లంతో తులాభారం సమర్పించారు. తర్వాత శ్రీవారి, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో పోల భాస్కర్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ వారి వెంట ఉన్నారు. బాధ్యత పెరిగింది.. మరింత కష్టపడతా: పీవీ సిం«ధూ రియో ఒలింపిక్స్లో వెండిపతకం సాధించడంతో తనపై బాధ్యత పెరిగిందని, మరింత కష్టపడి దేశానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పీవీ సింధూ అన్నారు. ఒలింపిక్స్ ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నానని , పతకం సాధించి మళ్లీ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందిస్తే మరికొందరి ప్రతిభ తప్పక వెలుగు చూస్తుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దేవుడి కృప ఉండాలని ప్రార్థించాను : పుల్లెల గోపీచంద్ తిరుమల శ్రీవారి ఆశీస్సులు, సింధూ ఆటతీరుతో ఒలింపిక్స్లో పతకం వచ్చిందని, ఎల్లప్పుడూ ఆ దేవదేవుని కృప ఉండాలని కోరుకున్నానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. -
అమ్మవారి సేవలో సింధు
తిరుచానూరు: ఒలింపిక్ బ్యాడ్మింటన్ రజత విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్లు శనివారం రాత్రి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు జీ.భానుప్రకాష్రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రవి స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఈ క్రీడాదిగ్గజాలకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి దర్శనార్థం వీరు తిరుమలకు వెళ్లారు. -
తిరుమల చేరుకున్న సింధు
సాక్షి, తిరుమల: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ శనివారం తిరుమలకు వచ్చారు. ఈ విశ్వ రజత విజేత గతంలో రియో ఒలింపిక్స్ ముందు ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అత్భుత ప్రతిభతో వెండి పతకం సాధించిన నేపథ్యంలో ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు తల్లిదండ్రులు పీవీ రమణ, పి.విజయ, కోచ్ పుల్లెల గోపీచంద్తో కలసి శనివారం రాత్రి 10 గంటలకు తిరుమలకు వచ్చారు. ఇక్కడి జీఎమ్మార్ అతిథిగృహం వద్ద బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు. -
సింధుకు వజ్రాల రాకెట్ కానుక
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అంతర్జాతీయ పోటీల్లో రాణించే క్రీడాకారులందరికీ ప్రోత్సాహం, గుర్తింపు అవసరమని ఒలింపిక్స్ రజత విజేత పీవీ సింధు అన్నారు. ప్రసిద్ధ వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ సోమాజిగూడ షోరూమ్లో సింధుని శుక్రవారం ఘనంగా సన్మానించింది. కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ వజ్రాలు పొదిగిన బంగారు బ్యాడ్మింటన్ రాకెట్ను సింధుకు బహుమతిగా అందజేశారు. సిసలైన బంగారం లాంటి సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ శాంతకుమార్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, మధుసూధన్, సీమా మెహతా పాల్గొన్నారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్ప్రీత్సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్చెయిర్లో... రియో ఒలింపిక్స్లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది. -
ఈ విజయంతో ఆగిపోవద్దు!
‘రియో’ స్టార్లకు సచిన్ సూచన 2020లో మరింత బాగా ఆడాలన్న మాస్టర్ సింధు, సాక్షి, దీప, గోపీచంద్లకు కార్లు బహుకరణ హైదరాబాద్: భారత దేశం యావత్తూ కలిసి వేడుకను జరుపుకునేందుకు రియో విజేతలు అవకాశం ఇచ్చారని, మున్ముందు ఇలాంటి రోజులు మరిన్ని రావాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. జాతి మొత్తం ఈ సమయంలో పట్టరాని సంతోషంతో ఉందని ఆయన అన్నారు. రియోలో పతకాలు గెల్చుకున్న సింధు, రెజ్లర్ సాక్షి మలిక్లతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్లను అభినందించేందుకు ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ తరఫున ఈ నలుగురికి బీఎండబ్ల్యూ కార్లను సచిన్ బహుకరించారు. ‘భారత క్రీడల్లో ఇదో సుదినం. మన అమ్మాయిలు గర్వపడే ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడే విజయాల ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మేమందరం మీ కోసం ప్రార్థిస్తాం. మీకు అండగా నిలుస్తాం. మేం సంబరాలు జరుపుకునేందుకు మళ్లీ మీరు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు రానున్నాయని నేను నమ్ముతున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించారు. పుల్లెల గోపీచంద్ను రియల్ హీరోగా, యువతరానికి రోల్మోడల్గా అభివర్ణించిన సచిన్... మరిన్ని పతకాలు సాధించేందుకు ఆయన మార్గదర్శనం కావాలని చెప్పారు. ఈ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు ఉన్నాయని సింధు, సాక్షిలపై మాస్టర్ ప్రశంసలు కురిపించారు. మరిన్ని విజయాలు సాధిస్తాం... దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకం తెస్తానని తాను చెబితే ఎవరూ నమ్మలేదని, సహకరించేందుకు ముందుకు రాలేదని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో అకాడమీ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు వరుస ఒలింపిక్స్లలో పతకాలు గెలవగలిగామని ఆయన అన్నారు. ఒలింపిక్స్కు ముందు, ఒలింపిక్స్ సమయంలో కూడా సచిన్ మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాయని గోపీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి దేశంలో సంబరాలకు కారణం కావడం గతంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఒలింపిక్స్కు ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని సాక్షి సంతోషం వ్యక్తం చేయగా... పతకం తీసుకురాకపోయినా దేశ ప్రజలు ఇంతటి ప్రేమ చూపించడం గర్వంగా అనిపిస్తోందని దీపా కర్మాకర్ చెప్పింది. చాన్నాళ్ల క్రితం బ్యాడ్మింటన్లో ప్రదర్శనకే తొలి కారు స్విఫ్ట్ డిజైర్ అందుకున్నానని, ఇప్పుడు కారు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించడం పట్ల సింధు కృతజ్ఞతలు తెలిపింది. సింధు, గోపీలకు బీఎండబ్ల్యూ 320డి మోడల్... సాక్షి, దీపలకు బీఎండబ్ల్యూ ఎక్స్1 మోడల్ కార్లను బహుమతిగా అందజేశారు. చాముండేశ్వరీనాథ్తో పాటు పారిశ్రామికవేత్తలు వై.నవీన్, టి. శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, సి.అనిల్ వీటికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మరోవైపు గోపీచంద్ అకాడమీ తరఫున కూడా సింధు, సాక్షి, దీప లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. -
సింధు సక్సెస్ సీక్రెట్స్
-
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
ఎన్ఏసీ జ్యూవెలరీ ఎండీ అనంత పద్మనాభన్ విజయవాడ స్పోర్ట్స్ : రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి సింధుకు సిగ్నేచర్ నెక్పీస్ను బహూకరిస్తామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లోనే ఉమెన్ ఫ్రీస్టయిల్(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్కు రూ.3లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లను అందిస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకే తాము వీరికి ఆభరణాలు బహూకరించి గౌరవిస్తున్నట్లు వివరించారు. -
సింధు,గోపీలకు ఘనంగా సన్మానం
-
వెండికొండకు స్వాగతం
-
గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్న సింధు
-
సింధు, సాక్షిలకు ‘ఖేల్రత్న’
* జీతూ రాయ్, దీపలకు కూడా... * అథ్లెటిక్స్ కోచ్ రమేశ్కు ద్రోణాచార్య * సత్తి గీతకు ధ్యాన్చంద్ అవార్డు * రహానేకు అర్జున పురస్కారం * 29న ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న దక్కింది. అలాగే పట్టువదలని పోరాటంతో అందరి మనస్సులు గెలుచుకున్న షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్లను కూడా ఈ పురస్కారం వరించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటించింది. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని కేవలం 0.15 పాయింట్ల తేడాతో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా షూటర్ జీతూ రాయ్ ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించాడు. వీరికి పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇవ్వనున్నారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్.రమేశ్కు ద్రోణాచార్య తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత (అథ్లెటిక్స్) ధ్యాన్చంద్ అవార్డ్కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు. 15ఏళ్ల శ్రమకు గుర్తింపు: రమేశ్ అల్వాల్: శిక్షణలో మానవీయ కోణం జోడిస్తే క్రీడాకారులకు నమ్మకం కలిగి మరింత ప్రోత్సాహం అందుతుందని ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. ‘15 సంవత్సరాల పాటు నా శిక్షణ అనుభవానికి తగిన గుర్తింపు లభించింది. నాకు ఈ గౌరవం దక్కుతుందని గోపీచంద్, లక్ష్మణ్ తరచూ చెప్పేవారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు) పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డులు (రూ.5 లక్షలు) అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు) నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు) సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్). -
పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం
లింగాల ఘాట్లో నదీమతల్లికి పూజలు సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/సాక్షి ప్రతినిధి, కర్నూలు : కృష్ణా పుష్కరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్రంలోని పలు పుష్కర ఘాట్లను పరిశీలించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైదలో పర్యటించిన ఆయన.. తొలుత అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుని, దైదలో పుష్కర ఘాట్లను సందర్శించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దైతను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. క్రీడాకారిణి సింధుకు మనం చేసిన ప్రార్థనలతో వెండి మెడల్ వచ్చిందన్నారు. ఇక్కడ పుట్టిన బిడ్డ భారత దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. నేడు ఆమె పుష్కర స్నానానికి వస్తోందని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల పుష్కర ఘాట్ను చంద్రబాబు పరిశీలించారు. నది ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. నదీమతల్లికి చీర సమర్పించిన సీఎం కృష్ణా పుష్కరాల్లో భాగంగా శ్రీశైలంలోని లింగాలఘాట్ను సీఎం సందర్శించారు. నదిలో పసుపు, కుంకుమ, చీరను వదిలి కృష్ణా నదీమ తల్లికి పూజలు చేశారు. -
జయహో సింధు..
అచ్యుతాపురం: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం గురుకుల పాఠశాల విద్యార్థినులు జయహో సింధు.. ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి అచ్యుతాపురం కూడలి వరకూ ర్యాలీచేసి మానవహారం ఏర్పడ్డారు. ఒలింపిక్స్లో రజిత పథకం సాధించి సింధు హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా సామూహిక స్వాగతాంజలి సమర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇకనైనా ప్రభుత్వాలు స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి ఉన్నప్పటికీ మైదానం, క్రీడాసామగ్రి లేని కారణంగా వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యం కల్పించాలని, మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలుగుతేజం సింధు దేశానికి ఖ్యాతిని తీసుకురావడం గర్వకారణంగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. -
ఊరు.. ఊరేగింది
మన సింధు సిటీకి వచ్చింది...ఉత్సాహం ఉరకలేసింది..ఊరు ఊరంతా ఊరేగింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి...ప్రశంసలందుకొన్న పీవీ సింధును భాగ్యనగరం ఘనంగా స్వాగతించింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జనం జేజేలు పలికారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో..మరికాసేపు గుర్రపు బగ్గీపై ఊరేగుతూ..పూలవర్షంలో తడుస్తూ..అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ ఆమె గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంది. -
సింధు, గోపీచంద్కు సర్ఫ్రైజ్
-
గోపీ కష్టానికి ఫలితం దక్కింది