Bhuvneshwar Kumar
-
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్రైజర్స్తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్గా నిలిచిన దీపక్ చహర్కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఆరెంజ్ ఆర్మీ హార్ట్బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు సన్రైజర్స్ హైదరాబాద్తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్లో భాగంగా సన్రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్రైజర్స్తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ను.. 2014లో సన్రైజర్స్ దక్కించుకుంది.సన్రైజర్స్ ను చాంపియన్గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్రైజర్స్ బ్రేకప్తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్రైజర్స్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
భువనేశ్వర్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై కూడా అర్ష్దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్కు పంపిన అర్ష్దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్కు 80 మ్యాచ్లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్లలో 96 వికెట్లు2. అర్ష్దీప్ సింగ్- 59 మ్యాచ్లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్బర్గ్లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
భార్యను సర్ప్రైజ్ చేసిన భువీ (ఫోటోలు)
-
భువనేశ్వర్ కుమార్కు జాక్ పాట్.. లీగ్ చరిత్రలోనే భారీ ధర
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్-2024లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి ఎడిషన్లో నోయిడా సూపర్ కింగ్స్కు ప్రాతనిథ్యం వహించిన భువనేశ్వర్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం లక్నో ఫాల్కన్స్ తరపున ఆడనున్నాడు. ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు. ఈ భారత వెటరన్ క్రికెటర్ కోసం కాన్పూర్ సూపర్ స్టార్స్ , గోరఖ్పూర్ లయన్స్ కూడా తీవ్రంగా శ్రమించాయి. కానీ వారి పర్స్లో తగినంత మొత్తం లేకపోవడంతో సదరు ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అయితే లక్నో ఫాల్కన్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. గత సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన భువీ 13 వికెట్లతో అదుర్స్ అన్పించాడు. కాగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువనేశ్వర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021 మెగా వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ రూ. 4.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ టీ20 లీగ్-2024 సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి వారు భాగం కానున్నారు. -
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్పై రైజర్స్ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్కు సన్రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్పై సన్రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్-2024లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్మెన్ పావెల్, అశ్విన్ ఉండగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ భువీ అప్పగించాడు. చివరి ఓవర్ తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీసి పావెల్కు స్ట్రైక్ ఇచ్చాడు. పావెల్ రెండో బంతికి డబుల్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రాజస్తాన్ విజయసమీకరణం 6 పరుగులుగా మారింది. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీయడంతో ఆఖరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో భువనేశ్వర్ ఆఖరి డెలివరీని అద్బుతంగా బౌలింగ్ చేసి పావెల్ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం నమోదు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
దుమ్ములేపిన భువీ.. కెరీర్ బెస్ట్.. టీమిండియా రీఎంట్రీ ఎప్పుడో?
Ranji Trophy 2024- Bhuvneshwar Kumar: దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 60 పరుగులకే ఆలౌట్ దేశవాళీ క్రికెట్లో తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ బెంగాల్తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. కాన్పూర్లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత ఫీల్డింగ్కు దిగింది. యూపీ జట్టును కేవలం 60 పరుగులకే ఆలౌట్ చేసి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ జోరుకు భువీ అడ్డుకట్ట వేయగలిగాడు. తొలి రోజే ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13 పరుగులకే పరిమితం కాగా.. సుదీప్ కుమార్ డకౌట్గా వెనుదిరిగాడు. ఇతర ఆటగాళ్లలో అనుస్తుప్ మజుందార్(12), కెప్టెన్ మనోజ్ తివారి(3), అభిషేక్ పోరెల్(12)లు కూడా భువీకే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికే భువీ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. భువీ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం ఇది 13వసారి. ఈ క్రమంలో 95/5 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్ 188 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తం ఎనిమిది వికెట్లు రెండో రోజు ఆటలో.. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శ్రేయాన్ష్ ఘోష్ను పెవిలియన్కు పంపిన భువీ.. ప్రదీప్త ప్రమాణిక్(1), సూరజ్ సింధు జైస్వాల్(20)లను కూడా అవుట్ చేశాడు. దీంతో భువీ ఖాతాలోని వికెట్ల సంఖ్య ఎనిమిది చేరింది. ఇక కరణ్ లాల్(12), ఇషాన్ పోరెల్(10) రూపంలో మరో రెండు వికెట్లను లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ దక్కించుకున్నాడు. బెంగాల్ ఆలౌట్ అయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్ ఆరంభించిన ఉత్తరప్రదేశ్ జట్టు శనివారం ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. సమర్థ్ సింగ్ 21, ఆర్యన్ జుయాల్ 20 రన్స్తో క్రీజులో ఉన్నారు. అదే ఆఖరు.. రీఎంట్రీ ఎప్పుడో?! ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. 2022, నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్లో ఈ సీమర్ ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి జట్టులో చోటు కరువైంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లతో పాటు యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ప్రస్తుతం దేశవాళీ, లీగ్ క్రికెట్కే పరిమితమైన భువనేశ్వర్ కుమార్ తాజాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భువీ ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేయాలని అభిమానులు బీసీసీఐ సెలక్టర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు జట్టును ప్రకటించినప్పటికీ.. మిగిలిన మూడు టెస్టులకైనా అతడిని పరిగణనలోకి తీసుకుంటే బాగుండని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే..
Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఈ రైటార్మ్ పేసర్ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్ నైపుణ్యాలతో బెంగాల్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మహ్మద్ కైఫ్నకు నాలుగు వికెట్లు కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం. భువీ కూడా తగ్గేదేలే ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ ఘరామి 0, అనుస్తుప్ మజుందార్ 12, మనోజ్ తివారి 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పరిమితమయ్యారు. ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్ బ్యాటర్లు శ్రేయాన్ష్ ఘోష్ 37, కరణ్ లాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అన్న షమీ బాటలో తమ్ముడు కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ షమీకి దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్ పేసర్ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్ కైఫ్ సైతం ప్రస్తుతం బెంగాల్కే ఆడుతున్నాడు. ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కానీ.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చదవండి: IND Vs AFG: రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్ .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్కు పంపాల్సింది’
India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై వరుస సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ ఒక్కో ఫార్మాట్కు ఒక్కో జట్టును సెలక్ట్ చేస్తుందని ముందే ఊహించానని పేర్కొన్నాడు. అయితే, మూడు జట్లలోనూ ఓ కీలక ఆటగాడి పేరు మాత్రం మిస్ అయిందని.. అతడు ఉంటే జట్టు మరింత పటిష్టమయ్యేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే మూడు జట్లను ప్రకటించింది. రెగుల్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకులుగా వ్యవహరించనున్నారు. టెస్టు సిరీస్తో రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా జియో సినిమా షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరికీ సంతోషమే.. ఆ ఒక్కడికి తప్ప ‘‘సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. జట్టులో చోటు ఆశించిన చాలా మందికి సంతోషం దక్కింది. అయితే, ఈ టూర్ గురించి వినగానే నా మదిలో మెదిలిన పేరు భువనేశ్వర్ కుమార్. సౌతాఫ్రికాకు వెళ్తున్నామంటే జట్టులో ఎక్కువగా ఫాస్ట్బౌలర్లు ఉండాలి. అయితే, కొత్త బంతితో ఫలితం రాబట్టగల అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి యువ బౌలర్ల రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నమాట వాస్తవమే. భువీ లాంటి అనుభవజ్ఞుడిని మర్చిపోకండి కానీ భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్బౌలర్ జట్టులో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెలక్టర్లు అతడి పేరును పూర్తిగా విస్మరించడం తగదు. ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సెలక్టర్లను ఉద్దేశించి మాట్లాడాడు. దేశవాళీ టోర్నీలో అదరగొట్టినా కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భువీ.. ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. స్థానిక లీగ్, దేశవాళీ మ్యాచ్లలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం యువ బౌలర్లతో పోటీలో మాత్రం వెనుకబడిపోయాడు. ఇటీవల ముగిసిన టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ.. మొత్తంగా 16 వికెట్లు తీశాడు. చదవండి: సౌతాఫ్రికా టూర్: వన్డేలకు రాహుల్ సారథి.. జట్ల వివరాలివే చదవండి: WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్.. -
చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. 9 బంతుల్లో 5 వికెట్లు
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు. చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్ -
అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ
AB de Villiers on Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్పై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు భువీ సొంతమని.. అతడు బంతిని స్వింగ్ చేసే తీరు బ్యాటర్లకు చెమటలు పట్టిస్తుందని పేర్కొన్నాడు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ స్వింగ్ సుల్తాన్ను ఆకాశానికెత్తాడు. కాగా 2018లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో 1-2తో ఆతిథ్య జట్టుకు టెస్టు సిరీస్ను కోల్పోయింది. అయితే, భారత జట్టుకు ఓటమి ఎదురైనా.. భువీ మాత్రం ఈ సిరీస్లో కొన్ని మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు. ఏబీడీ వికెట్ పడగొట్టాడు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా గెలిచిన మూడో మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ను 5 పరుగులకు పెవిలియన్కు పంపి సత్తా చాటాడు. తాజాగా ఈ విషయాలను గుర్తుచేసుకున్న ఏబీడీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భువీ అద్భుతమైన బౌలర్. అతడి నైపుణ్యాలు అమోఘం. బ్యాటర్ను మునివేళ్ల మీద నిలబెడతాడు. ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న మన బలహీనతను క్యాష్ చేసుకుని పండుగ చేసుకుంటాడు. సెంచూరియన్లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. భువీ అద్భుతం అవుట్స్వింగర్లతో నన్ను టీజ్ చేశాడు. ఎట్టకేలకు ఓ ఇన్స్వింగర్తో నా వికెట్ తీశాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే స్టంప్స్ ఎగిరిపోయాయి. భువీ పట్ల నాకెల్లప్పుడూ గౌరవభావం ఉంటుంది’’ అని డివిలియర్స్ భువనేశ్వర్ కుమార్ను కొనియాడాడు. టీమిండియాకు దూరం కాగా భువీకి టీమిండియాలో అవకాశాలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్లో అతడు ఆఖరిసారిగా ఆడాడు. వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతం 33 ఏళ్ల భువీ లీగ్ క్రికెట్కే పరిమితమయ్యాడు. చదవండి: WC- Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన ద్రవిడ్! ఇషాన్కు లక్కీ ఛాన్స్! -
అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Bhuvneshwar Kumar Comments: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్లో అతడు ఆఖరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించింది బీసీసీఐ. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి గత కొంతకాలంగా జట్టులో చోటు కరువైంది. ఈ నేపథ్యంలో ఈ యూపీ సీమర్ లీగ్ క్రికెట్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో హైదరాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. తాజా ఎడిషన్లో 14 మ్యాచ్లలో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్తో బిజీగా ఉన్నాడు. స్థానికంగా జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో భువీ ప్రాతినిథ్యం వహిస్తున్న నోయిడా సూపర్ కింగ్స్ టాప్లో కొనసాగుతోంది. భువీ(PC: SRH) ఈ నేపథ్యంలో నేషనల్న్యూస్తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్బౌలర్గా తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకానికి చేరిందన్న ఈ రైట్ఆర్మ్ పేసర్... ఇప్పుడు తన దృష్టంతా కేవలం ఆటను ఆస్వాదించడం మీదే ఉందని పేర్కొన్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్నాను ‘‘మన కెరీర్ ఎలా సాగుతుందన్న విషయం మనసు మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్బౌలర్గా మనగలను. అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు. అయినా ఆ విషయం నన్ను బాధించడం లేదు. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కొచ్చు. ఇకపై నా దృష్టి మొత్తం దానిమీదే అంతేగానీ.. ప్రత్యేకంగా తిరిగిరావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఫార్మాట్లో అయినా.. ఎలాంటి లీగ్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నా దృష్టి ఉంది’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను లీగ్ క్రికెట్పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు తీశాడు. లోకల్ టాలెంట్ వెలుగులోకి యూపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి లీగ్లు స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. కాగా ఆరు జట్ల మధ్య పోటీతో ఆగష్టు 30న యూపీ టీ20 లీగ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. -
తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ
Bhuvneshwar Kumar Comments On Virat Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న అందరి బౌలర్ల కంటే తానే బెస్ట్ అని కోహ్లి భావిస్తాడని.. అయితే, అతడు బంతి పట్టుకుంటే తాము మాత్రం హడలిపోయేవాళ్లమని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా భువీ వెల్లడించాడు. షాకిచ్చిన బీసీసీఐ కాగా 2012లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్.. ఇప్పటి వరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు పడగొట్టాడు. అయితే, భువీ గత కొంతకాలంగా వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అదే ఆఖరు గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. అప్పటి నుంచి మళ్లీ అతడు జట్టుకు ఎంపిక కాలేదు. ఇదిలా ఉంటే.. ముంబైలో సోమవారం జరిగిన CEAT అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు. కోహ్లి బౌలింగ్ చేస్తుంటే మాకు భయమేస్తుంది ఈ సందర్భంగా కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ కోహ్లి... జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్ తానేనని భావిస్తాడు. కానీ మేము మాత్రం కోహ్లి బౌలింగ్ చేసినప్పుడల్లా భయపడిపోతాం. తన బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్కడ గాయపడతాడో అని బెంబేలెత్తిపోతాం’’ అని భువీ సరదాగా వ్యాఖ్యానించాడు. కింగ్ ఎక్కడైనా కింగే! ఇక క్రికెటర్ కాకపోయి ఉంటే కోహ్లి మల్లయోధుడు(రెజ్లర్) అయి ఉండేవాడని భువీ పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది. ఈ క్రమంలో కోహ్లి గురించి భువీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో కింగ్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత జట్టులో ఉన్న చాలా మంది బౌలర్ల కంటే కోహ్లి బెస్ట్’’అని ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆసియ కప్ బరిలో ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఆసియా కప్-2023తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీకి సంబంధించిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు పేసర్లను సెలక్టర్లు ఎంపిక చేయగా.. భువీకి మాత్రం చోటు దక్కలేదు. చదవండి: వరల్డ్కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అందుకే తిలక్ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ Bhuvneshwar Kumar said, "Virat Kohli thinks he's the best bowler in the team, we're always scared when he bowls that he doesn't get injured due to his bowling action (laughs)". pic.twitter.com/Ky3FgyK8d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2023 -
కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్గా!
కరేబియన్ గడ్డపై టీమిండియా వెటరన్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతమైన ప్రదర్శరన కనబరిచిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2కు భారత్ తగ్గించింది. కుల్దీప్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్క్ను అందుకున్న భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్ల్లో కుల్దీప్ ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చాహల్ 34 మ్యాచ్ల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20ల్లో వెస్టిండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. విండీస్పై ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కుల్దీప్.. 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్ పేపసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. భువీ 18 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Yashasvi Jaiswal: ఇషాన్ను కాదని నిన్ను ఆడిస్తే ఏం చేశావు? అప్పుడు సెంచరీ.. ఇప్పుడు రెండు సున్నాలు తగ్గాయంతే! ఫ్యాన్స్ ఫైర్ Charles ☝️ Nicholas Pooran ☝️ Brandon King ☝️ Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re — OneCricket (@OneCricketApp) August 8, 2023 -
సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం!
Bhuvneshwar Kumar: టీమిండియా సీమర్ భువనేశ్వర్ కుమార్ అనూహ్య చర్యతో వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో మార్పు చేసి ఫాలోవర్లను కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన భువీ 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పేస్ దళంలో ముఖ్యమైన సభ్యుడిగా జట్టుకు సేవలు అందించి ఎన్నో రికార్డులు సాధించాడు. గడ్డు పరిస్థితులు.. అయితే, గత కొంతకాలంగా ఈ ఫాస్ట్బౌలర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబరులో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన 33 ఏళ్ల భువీని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి బీసీసీఐ ఇటీవలే తొలగించింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీ-2022, టీ20 ప్రపంచకప్-2022లో దారుణ ప్రదర్శన తర్వాత బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. దేశవాళీ క్రికెట్కు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడే అలాంటి నిర్ణయాలు వద్దు ఈ నేపథ్యంలో భువీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఇండియన్ క్రికెటర్ను ఇండియన్గా మార్చుకోవడం విశేషం. ఇది గమనించిన ఫ్యాన్స్.. ‘‘అయ్యో ఇదేంటి భువీ! నువ్వు పునరాగమనం చేస్తావనని మేము బలంగా కోరుకుంటున్నాం. టీమిండియాకు నువ్వు చేయాల్సింది చాలా ఉంది! ఇదంతా చూస్తుంటే నువ్వు బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి. ఇప్పుడే రిటైర్మెంట్ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్’’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా ఇన్స్టాలో ఇండియన్ క్రికెటర్ అన్న పదాలను తొలగించిన భువీ.. ట్విటర్లో మాత్రం కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్ పేసర్ తన చర్యతో నెట్టింట వైరల్గా మారాడు. చదవండి: జట్టులో చోటు కొట్టేశావు.. ఆఖరికి జెర్సీ కూడానా?! ఇదేంటి సూర్య! Yaar Bhuvi!!!!! 😔 We hope atleast me, You will Make a strong comeback🤞. A lot of cricket left in you To play for INDIA. #BhuvneshwarKumar #Bhuvi pic.twitter.com/kB1AXPnQeK — Devanshu Maheshwari (@beingdevanshu19) July 28, 2023 View this post on Instagram A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే!
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత మీ, నా మదిలో ఓ ప్రశ్న మెదలడం ఖాయం కదా! అదేంటంటే.. సర్రే ఓవల్లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టును ఫైనల్ చేసేటపుడు భువీని పరిగణనలోకి తీసుకుంటారా? ఇంగ్లండ్లో వేసవి తొలి అర్ధ భాగంలో ఆడే మ్యాచ్లలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే స్వింగ్ రాబట్టాల్సిందే. ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సగం సగమే అనిపిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి భువనేశ్వర్ కుమార్ను జట్టుకు ఎంపిక చేస్తారా? చేస్తే బాగుండు. కానీ అలా జరుగకపోవచ్చు.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 5 వికెట్లతో చెలరేగిన భువీ! స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆకాశ్.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని నిట్టూర్చాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు. టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (0), శుబ్మన్ గిల్(101), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8), టెయిలెండర్లు నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ(0) వికెట్లు కూల్చాడు. 4 ఓవర్ల బౌలింగ్లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే! ఈ మ్యాచ్లో రైజర్స్ ఓడినప్పటికీ భువీ ప్రదర్శన మాత్రం సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. భువీని కొనియాడుతూనే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడికి ఆడే అవకాశం వస్తే బాగుండని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పిచ్లపై భువీ లాంటి స్వింగ్ మాస్టర్ అద్భుతాలు చేయగలడని పేర్కొన్నాడు. అయితే, సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7- 11 వరకు ఇంగ్లండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో బీసీసీఐ భువీకి చోటివ్వని సంగతి తెలిసిందే. చదవండి: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్! తుది జట్టులో.. A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. అంతా మా వల్లే: మార్కరమ్
IPL 2023- GT Vs SRH: ‘‘పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది. అప్పుడే మేము పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాం. మా నుంచి గేమ్ చేజారిపోయింది’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించారని.. అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. రైజర్స్ అవుట్ ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్తో సోమవారం మ్యాచ్లో సన్రైజర్స్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టగా.. రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గిల్ సెంచరీతో స్టార్ పేసర్ భువీ.. టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. కానీ మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆ ఆనందాన్ని నిలవకుండా చేశాడు. అతడికి వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా తోడయ్యాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమైన వేళ గిల్ సెంచరీ(58 బంతుల్లో 101 పరుగులు)తో చెలరేగగా.. సాయి 47 పరుగులతో రాణించాడు. కుప్పకూలిన టాపార్డర్ వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగా సొంతమైదానంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గుజరాత్ 188 పరుగులు స్కోరు చేసింది. భువీ మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది. టైటాన్స్ పేసర్ షమీ ధాటికి కకావికలమైంది. ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్(5), అభిషేక్ శర్మ (4) పూర్తిగా నిరాశపరిచారు. ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ మార్కరమ్(10) వైఫల్యం కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి(1) తప్పుడు షాట్ సెలక్షన్తో వికెట్ పారేసుకున్నాడు. పాపం క్లాసెన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఓ వైపు టపాటపా వికెట్లు పడుతున్నా.. సంయమనంతో ఓపికగా ఆడాడు. భువీ నుంచి సహకారం అందడంతో 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. క్లాసెన్ కారణంగా ఏదో అద్భుతం జరుగబోతుందని ఆశించిన ఆరెంజ్ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లుతూ 17వ ఓవర్ ఐదో బంతికి షమీ అతడిని పెవలియన్కు పంపాడు. తర్వాత భువీ(27) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 34 పరుగుల తేడాతో రైజర్స్ ఓటమిపాలైంది. మార్కరమ్ (PC: IPL) సహకారం అందించలేకపోయాం.. అంతా మావల్లే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో బంతిని స్వింగ్ చేయగల వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. భువీ ఈరోజు అద్భుతంగా ఆడాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే! అయితే, శుబ్మన్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు అద్భుతం ఇక క్లాసెన్ తాను ఎంతటి అద్భుతమైన బ్యాటరో మరోసారి నిరూపించాడు. క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ మాలో ఒక్కరం కూడా అతడికి సహకారం అందించలేకపోయాం. తన పోరాటం వృథాగా పోవడం నిజంగా దురదృష్టకరం. మిగిలిన రెండు మ్యాచ్లలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తాం. ఈ ఏడాది కూడా నిరాశగా టోర్నీని ముగించడం బాధిస్తోంది. ఈ మ్యాచ్లో మమ్మల్ని పోటీలో ఉంచేందుకు భువీ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ మేము మ్యాచ్ను కాపాడుకోలేకపోయాం’’ అని విచారం వ్యక్తం చేశాడు. చదవండి: తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా? A comprehensive win at home and @gujarat_titans qualify for the #TATAIPL 2023 playoffs 🥳 They register a 34-run win over #SRH 👏🏻👏🏻 Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/gwUNLVjF0J — IndianPremierLeague (@IPL) May 15, 2023 -
వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ పేసర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన మార్క్ను మరోసారి చూపించాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో రెండో సారి ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మరో రన్ బైస్ రూపంలో వచ్చింది. ఈ ఓవర్లో భువీ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా ఓ రనౌట్ కూడా చేశాడు. ఓవరాల్గా ఆఖరి ఓవర్లో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువీతో పాటు నటరాజన్, ఫరూఖీ, జానెసన్ తలా వికెట్ సాధించారు. చదవండి: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని ఆడుతాడని గట్టిగా నమ్ముతున్నాం: సీఎస్కే సీఈవో A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్గా
ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్ల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో నిలిచాడు. భువీ తాను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో డేవిడ్ వార్నర్ను డకౌట్ చేయడం ద్వారా భువీ ఈ ఫీట్ సాధించాడు. భువనేశ్వర్ తర్వాత ట్రెంట్ బౌల్ట్(21 వికెట్లు) రెండో స్థానంలో, ప్రవీణ్ కుమార్ 15 వికెట్లతో మూడో స్థానంలో, సందీప్ శర్మ 13 వికెట్లతో నాలుగో స్థానంలో, 12 వికెట్లతో జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. చదవండి: కేకేఆర్ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్ -
ఐపీఎల్లో భువనేశ్వర్ అరుదైన రికార్డు.. రెండో బౌలర్గా
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, సర్రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఫిల్ సాల్ట్ను డకౌట్ చేసిన భువీ..ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఇప్పటివరకు భువీ 25 మంది బ్యాటర్లను డకౌట్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగా(36) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. చదవండి: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్ కాలికి! ఏం జరిగిందంటే? -
IPL 2023: ‘పవర్ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్ విషయంలో మా నిర్ణయం సరైందే!
IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తమ ఓటమికి రెండు ‘పవర్ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్ పవర్ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్ప్లేలో పరుగులే చేయలేకపోయాం. 200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్ పేసర్ నటరాజన్ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్.. తన రెండో ఓవర్ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు. ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్ రాయల్స్ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్కుమార్ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్ పిచ్పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు! Nattu in death overs 👉 Always 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvRR pic.twitter.com/DIErNzIWxm — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2023 -
SRH Vs RR: మర్చిపోవాలి అంతే! నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా?
IPL 2023- SRH Vs RR: సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత.. అభిమానుల కేరింతల నడుమ ఉప్పల్ వేదికగా ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి పరాజయంతో ఈ సీజన్ను ఆరంభించింది. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గైర్హాజరీ నేపథ్యంలో రైజర్స్ పగ్గాలు చేపట్టిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. తప్పు చేశాడు! టాస్ గెలిచిన భువీ.. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై తొలుత బౌలింగ్ ఎంచుకుని పెద్ద పొరపాటే చేశాడు. పవర్ప్లేలోనే సన్రైజర్స్కు ఈ విషయం అర్ధమైపోయింది. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(37 బంతుల్లో 54 పరుగులు), జోస్ బట్లర్ (22 బంతుల్లో 54 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరికి తోడు కెప్టెన్ సంజూ శాంసన్ సైతం అర్ధ శతకం(32 బంతుల్లో 55 పరుగులు) అద్భుతంగా రాణించాడు. ఆఖర్లో హెట్మెయిర్ తనదైన శైలిలో (16 బంతుల్లో 22 పరుగులు) ఫినిష్ చేశాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు స్కోరు చేసింది రాజస్తాన్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాజస్తాన్ పరుగుల వరద.. పెవిలియన్కు క్యూ కట్టిన రైజర్స్ బ్యాటర్లు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట.. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యాడు. టాపార్డర్లో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రైజర్స్ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో! ఫలితంగా 72 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్గా పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సన్రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ‘‘బ్యాటింగ్ పిచ్పై బౌలింగ్ ఎంచుకున్నావు. టాస్ సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకన్నావు. పోనీ కెప్టెన్సీపై దృష్టి పెట్టావా అంటే అదీ లేదు. ముగ్గురు పేసర్లు ఉన్నారు.. వారి సేవలు వినియోగించుకోవాల్సింది పోయి.. నువ్వూ బౌలింగ్ చేశావు. 3 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నావు. ఒత్తిడిని అధిగమించలేకపోయావు. కెప్టెన్గా నువ్వు పనికిరావు. పైగా ఓటమికి చచ్చు కారణాలు చెబుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ భువీ ఏమన్నాడంటే.. ‘‘ఈ పరాజయం గురించి మర్చిపోయి.. ముందుకు సాగాలి. ఆఖరి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఏదేమైనా ఇదే మొదటి మ్యాచ్. కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు. సౌతాఫ్రికన్లు జట్టుతో చేరాల్సి ఉంది. వాళ్లు జట్టుతో చేరితో బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. పిచ్ బాగుంది. మేమేమీ బాధపడటం లేదు నిజానికి ఇక్కడ మాకు అనుకూలంగా తయారు చేయించుకోవచ్చు. కానీ.. ఆ విషయంలో మేమేమీ బాధపడటం లేదు. రాజస్తాన్ ఓపెనర్లు బట్లర్, జైశ్వాల్ అద్భుతంగా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ పవర్ప్లేలో వికెట్లు తీసి మమ్మల్ని దెబ్బకొట్టాడు. ఇక యుజీ చహల్, రవి అశ్విన్ తమదైన శైలిలో చెలరేగారు. జేసన్ హోల్డర్ బౌలింగ్, ఫీల్డింగ్లో మెరిశాడు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో పిచ్ గురించి మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలే అతడిపై ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. కాగా సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సహా ఇతర సౌతాఫ్రికా ఆటగాళ్లు నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ ముగించుకుని జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. Aiden Markram: అక్కడ కెప్టెన్ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం ⚡️⚡️ Trent-ing in Hyderabad!pic.twitter.com/FVa7owLQnL — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
సన్రైజర్స్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2023 సీజన్కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ ధానాధాన్ లీగ్ ఆరంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రోటీస్ స్టార్ ఆటగాళ్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, రబాడ, మగాల, డికాక్, నోర్జే ఐపీఎల్ తొలి మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ఐడైన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్కు మార్క్రమ్ దూరం కానున్నాడు. ఐపీఎల్-2023లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు మార్క్రమ్ గైర్హజరీ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా కొన్ని మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ సారథిగా భువీ వ్యవహరించాడు. అదే విధంగా గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక సభ్యునిగా భువీ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మెన్జెమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాకిచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి భువనేశ్వర్ను బీసీసీఐ తొలిగించింది. బీసీసీఐ తాజగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్లో భువనేశ్వర్ కుమార్కు చోటు దక్కలేదు. భువీతో పాటు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్లను కోల్పోయారు. కాగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువీని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆసియాకప్ నుంచి భువీ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఆసియాకప్-2022లో ఆప్గానిస్తాన్పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ కూడా భువనేశ్వర్ విఫలమయ్యాడు. అనంతరం టీ20 ప్రపంచకప్లో కూడా తన చెత్త ఫామ్ను భువీ కొనసాగించాడు. ప్రపంచకప్లో ఆరు మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కేవలం 4వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి భువీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్దం అవుతున్నాడు. అతడు ఇప్పటికే ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్లో బీజీబీజీగా గడుపుతున్నాడు. బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్ చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు -
Ind Vs SL: భువీ రికార్డుకు ఎసరు పెట్టిన చహల్! అదే జరిగితే..
India Vs Sri Lanka 1st T20: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. శ్రీలంకతో మంగళవారం మొదలు కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టీ20 తుదిజట్టులో చహల్కు చోటు ఖాయంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు వాంఖడే మ్యాచ్లో నాలుగు వికెట్లు తీస్తే.. తోటి బౌలర్, టీమిండియా సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు బద్దలు కొట్టే వీలుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్గా భువీ కొనసాగుతున్నాడు. భువీ రికార్డు బద్దలు! ఇప్పటి వరకు మొత్తంగా పొట్టి క్రికెట్లో పేసర్ భువీ ఆడిన 87 మ్యాచ్లలో 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. స్పిన్నర్ చహల్.. 71 మ్యాచ్లలో 87 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో స్వదేశంలో సిరీస్కు భువీని సెలక్టర్లు పక్కనపెట్టగా.. చహల్కు మాత్రం జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో రాణిస్తే చహల్.. భువీ పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉంది. టాప్-5లో ఉన్నది వీళ్లే కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీ20 సిరీస్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో పాండ్యా టాప్-5లో ఉండటం విశేషం. భువీ 90, చహల్ 87, అశ్విన్ 72, జస్ప్రీత్ బుమ్రా 70 వికెట్లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా -
భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి!
టీ20 ప్రపంచకప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత టీ20 జట్టులోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్ను తీసుకురావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. చాహర్ గాయాలతో బాధపడుతున్నప్పటికీ భువీ కంటే మెరుగైన ఆటగాడు అని అతడు తెలిపాడు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఆడిన భువీకి వన్డే సిరీస్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్కు దూరంగా ఉన్న దీపక్ చహర్ వన్డే సిరీస్కు భారత జట్టులోకి వచ్చాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్లో కనేరియామాట్లాడూతూ... "దీపక్ చాహర్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడిని భారత జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చాహర్ని తీసుకోవాలి. అతడు భువీ కంటే అద్భుతంగా రాణించగలడు. అతడు పవర్ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. మీకు నాలుగు ఓవర్లలో 35 నుంచి 40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువీకి గుడ్బై చెప్పే సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్ వంటి పేస్ బౌలర్లు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి భువీ ఫిట్గా ఉండడానికి మనకు తెలుసు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం"అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. ప్రపంచ రికార్డుకు చేరువలో భువనేశ్వర్
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 18న వెల్లంగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్కు ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్లో మరో నాలుగు వికెట్లు భువీ సాధిస్తే ఒక క్యాలెండర్ ఈయర్లో టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ సంచలన బౌలర్ జోషువా లిటిల్ పేరిట ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 26 మ్యాచ్లు ఆడిన లిటిల్ 39 వికెట్లు పడగొట్టాడు. ఇక భువీ విషయానికి వస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36 మ్యాచ్లు ఆడి 30 వికెట్లు సాధించాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డుకు కూడా చేరువలో భువీ ఉన్నాడు. ఈ సిరీస్లో 11 వికెట్లు భువీ సాధిస్తే.. టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా రికార్డులకెక్కతాడు. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: T20 WC 2022: 'అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్ దిగ్గజం సంచలన వాఖ్యలు! -
WC 2022: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
T20 World Cup 2022- 2nd Semi-Final- England Beat India By 10 Wickets: ‘‘తీవ్ర నిరాశకు లోనయ్యాం. మేము బాగానే బ్యాటింగ్ చేశాం. మెరుగైన స్కోరు నమోదు చేయగలిగాం. కానీ బౌలర్లు రాణించలేకపోయారు. నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించడమే అతి ముఖ్యమైనది. అయినా, మా జట్టులోని ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్లు కొత్తేమీ కాదు. వీళ్లంతా ఐపీఎల్లో ఇలాంటి నాకౌట్ మ్యాచ్లు ఆడినవాళ్లే. కానీ ఈరోజు మాకు శుభారంభం లభించలేదు. ఇంగ్లండ్ విజయంలో క్రెడిట్ మొత్తం ఓపెనర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా ఆడారు. మొదటి ఓవర్ నుంచే వారు దూకుడు ప్రదర్శించారు. టోర్నీ మొదటి మ్యాచ్లో మేము పట్టుదలగా ఆడిన తీరు గుర్తుండే ఉంటుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ హోరాహోరీ పోరు జరిగింది. ఏదేమైనా ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం. అందుకే ఇబ్బందుల్లో పడ్డాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మరీ ఇంత దారుణంగా టీ20 ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అడిలైడ్ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్కు చేరుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశను మిగులుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది రోహిత్ సేన. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(50), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(63) అర్ధ శతకాలతో 168 పరుగులు చేయగలిగిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ను నిలువరించలేకపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 80, అలెక్స్ హేల్స్ 86 పరుగులతో చెలరేగి 16 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించారు. అద్భుత అజేయ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను ఫైనల్కు చేర్చారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 25, అర్ష్దీప్ సింగ్ రెండు ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మ్యాచ్ స్కోర్లు: భారత్: 168/6 (20) ఇంగ్లండ్: 170/0 (16) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ హేల్స్ చదవండి: T20 WC 2022 Ind Vs Eng: 'మీ బౌలింగ్కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్ ఆడుకోండి' T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ! View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2022: ఐరిష్ బౌలర్ సంచలనం.. ప్రపంచ రికార్డు! భువీని వెనక్కి నెట్టి
T20 World Cup 2022- New Zealand vs Ireland- Joshua Little: న్యూజిలాండ్తో మ్యాచ్లో ఐరిష్ బౌలర్ జోషువా లిటిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా కివీస్తో మ్యాచ్లో హ్యాట్రిక్తో మెరిసిన ఈ 23 ఏళ్ల పేసర్.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లిటిల్ 39 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. వరల్డ్కప్ గ్రూప్-1 సూపర్-12లో భాగంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ వికెట్లు తీసి ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ సీమర్ భువనేశ్వర్ కుమార్ను వెనక్కి నెట్టడం గమనార్హం. కాగా అడిలైడ్ వేదికగా న్యూజిలాండ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో 19వ ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసిన జోషువా లిటిల్.. మొత్తంగా తన కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు.. మార్క్ అడేర్ ఒకటి, డెలని రెండు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లు(ఇప్పటి వరకు) ►జోషువా లిటిల్(ఐర్లాండ్)- 39 (2022) ►సందీప్ లమిచానే(నేపాల్)- 38 (2022) ►వనిందు హసరంగ(శ్రీలంక)- 36 (2021) ►తబ్రేజ్ షంసీ(సౌతాఫ్రికా)- 36 (2021) ►దినేశ్ నకార్ని(ఉగాండా)- 35 (2021) ►భువనేశ్వర్ కుమార్(ఇండియా)- 35 (2022) చదవండి: ఐసీసీ భారత్కు సపోర్ట్ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్ అవార్డులు ఇవ్వాలంటూ పాక్ మాజీ ప్లేయర్ అక్కసు T20 WC 2022: 4 సెమీస్ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్.. ఎవరంటే!
ICC Mens T20 World Cup 2022: ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్లు.. మరోవైపు వర్షం కారణంగా డేంజర్ జోన్లో పడుతున్న జట్లు.. సూపర్-12లో ఇప్పటికే కొన్ని మ్యాచ్లు వాన వల్ల రద్దు కాగా.. వరణుడు ఎవరిని కరుణిస్తాడో.. ఎవరిని ముంచుతాడో తెలియని సందిగ్ద పరిస్థితి.. వెరసి టీ20 వరల్డ్కప్-2022 ఆసక్తికరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే వ్యక్తిగత ప్రదర్శనతో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్.. బౌలర్లు అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యాన్స్ను ఖుషీ చేస్తున్నారు. సూపర్-12 ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్లో కోహ్లి, పాండ్యా చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక నెదర్లాండ్స్తో మ్యాచ్లో కోహ్లి- సూర్య జోడీ.. సరేసరి. ఈ బ్యాటర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగగా.. పేసర్లు భువనేశ్వర్ కుమార్- అర్ష్దీప్ రాణించారు. ముఖ్యంగా భువీ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 2 వికెట్లు తీయగలిగాడు. వాళ్లిద్దరే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వరల్డ్కప్-2022 టోర్నీలో టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు తీసే ఆటగాళ్లను అంచనా వేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వసీం జాఫర్ను ఓ నెటిజన్ ఈ విషయం గురించి అడుగగా.. ‘‘విరాట్ కోహ్లి, అర్ష్దీప్ సింగ్’’ అంటూ వీళ్లిద్దరికీ దిష్టి తగలకూడదన్నట్లుగా ఓ ఎమోజీని జత చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కోహ్లి 144 పరుగులు(82 నాటౌట్, 62 నాటౌట్) చేశాడు. ఇక అర్ష్దీప్ పాక్తో మ్యాచ్లో మూడు, నెదర్లాండ్స్తో మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? Ind Vs Ned: నాటి వరల్డ్కప్లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. -
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా
అంతర్జాతీ టీ20ల్లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా భువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్ 23) చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో షాహిన్ ఆఫ్రిదిని ఔట్ చేసిన భువీ.. తన 86వ టీ20 వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను భువీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ 86 వికెట్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(85) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును భువీ బ్రేక్ చేశాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: తొలి రౌండ్లోనే ఇంటికి.. వెస్టిండీస్ కెప్టెన్సీకి పూరన్ గుడ్బై! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. గట్టి సవాల్! ఎట్టకేలకు టీమిండియా..
T20 World Cup 2022 India First Practice Match- Ind Vs WA XI: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ అర్ధ శతకంతో రాణించగా.. పేసర్లు అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా పెర్త్ వేదికగా ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్ చుక్కలు చూపించారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే సరికి కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో కూరుకుపోయిన జట్టును సామ్ ఫానింగ్ ఆదుకున్నాడు. 59 పరుగులు సాధించి టీమిండియాకు సవాల్ విసిరాడు. అయితే, మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 145 పరుగులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా కథ ముగిసింది. వారెవ్వా.. అర్ష్దీప్ సింగ్ భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు మూడు(3/6), చహల్కు రెండు(2/15), భువనేశ్వర్ కుమార్కు రెండు(2/26) వికెట్లు, హర్షల్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి. 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరోవైపు భువీ సైతం ఫామ్లోకి వచ్చాడని.. అసలైన పోరులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. వాళ్లిద్దరూ తుస్సుమన్నారు.. అయినా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(3)కు జోడీగా రిషభ్ పంత్(9) ఓపెనర్గా వచ్చాడు. వీరిద్దరు పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ దీపక్ హుడా 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సూర్య నాలుగో స్థానంలో వచ్చి 35 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. హార్దిక్పాండ్యా 27, దినేశ్కార్తిక్ 19(నాటౌట్), అక్షర్ పటేల్ 10, హర్షల్ పటేల్ 5 పరుగులు చేశారు. కాగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్తో టీమిండియా ఐసీసీ ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. టీమిండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్: డీ ఆర్సీ షార్ట్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్క్రాఫ్ట్(వికెట్ కీపర్), అష్టన్ టర్నర్(కెప్టెన్), సామ్ ఫానింగ్, హమీష్ మెకెంజీ, జై రిచర్డ్సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్డార్ఫ్, మాథ్యూ కెల్లీ, నిక్ హాబ్సన్. చదవండి: Ind Vs SA: టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో! ఇక అయ్యర్.. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి T20 WC 2022 Final: ఈసారి ఫైనల్లో వెస్టిండీస్తో పోటీపడేది ఆ జట్టే! ఇంకా.. That's that from the practice match against Western Australia.#TeamIndia win by 13 runs. Arshdeep Singh 3/6 (3 overs) Yuzvendra Chahal 2/15 Bhuvneshwar Kumar 2/26 pic.twitter.com/NmXCogTFIR — BCCI (@BCCI) October 10, 2022 -
భువనేశ్వర్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు?
-
T20 WC: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా మద్దతు ఇవ్వాలి.. అప్పుడే: శ్రీశాంత్
India Vs Australia 2022 T20 Series- Bhuvneshwar Kumar- T20 World Cup 2022: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి టీ20లో 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్న భువీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగాడు. మొత్తంగా ఈ సిరీస్లో 91 పరుగులు ఇచ్చాడు భువీ. భువీ వైఫల్యం.. అభిమానుల్లో ఆందోళన డెత్ ఓవర్ల స్పెషలిస్టు, ప్రధాన పేసర్లలో ఒకడైన భువనేశ్వర్ ఇలా విఫలం కావడం జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2022కు సమయం ఆసన్నమవుతున్న వేళ భువీ ఫామ్లేమి అభిమానులను కలవరపెడుతోంది. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లతో భువీ డీకేకు అండగా ఉన్నట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భువీపై నమ్మకం ఉంచి అతడికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాదిరి భువనేశ్వర్కు కూడా అండగా నిలవాలని సూచించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భిల్వారా కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ హిందుస్థాన్ టైమ్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఒక్కోసారి మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ.. బ్యాటర్ చేతిలో మనకు పరాభవం తప్పకపోవచ్చు. ఆస్ట్రేలియా పిచ్లపై రాణించగలడు కొన్నిసార్లు మన వ్యూహం పక్కాగా అమలు అవుతుంది. మరికొన్నిసార్లు బెడిసికొడుతుంది. భువనేశ్వర్కు ఇప్పుడు మనందరి మద్దతు అవసరం. దినేశ్ కార్తిక్కు అండగా నిలిచినట్లే భువీకి కూడా సపోర్టుగా ఉండాలి. బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగల భువీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. తను నకుల్ బాల్ సంధించగలడు. పేస్లో వైవిధ్యం చూపగలడు. ఆస్ట్రేలియా పిచ్లపై తను తప్పకుండా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ధైర్యంగా ఉండు భువీ! విమర్శలు, కొంతమంది కామెంటేటర్ల మాటలు ఒక్కోసారి మనల్ని ఆందోళనకు గురిచేస్తాయని.. అయితే, మన నైపుణ్యాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని భువీకి సూచించాడు. విమర్శలు పట్టించుకోవద్దని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని భువీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుండగా.. భువీకి విశ్రాంతినిచ్చారు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్గా ధావన్.. వైస్ కెప్టెన్గా శాంసన్! Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
'అతడు బాగా అలిసిపోయాడు.. తిరిగి వచ్చి అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గత కొన్ని మ్యాచ్ల నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భువీ పూర్తిగా తేలిపోతున్నాడు. ఆసియాకప్-2022లోనూ ఆప్గానిస్తాన్పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ కూడా భువనేశ్వర్ విఫలమయ్యాడు. ఈ సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భువీ.. తన అఖరి రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్కు ముందు భువీ పేలవ ఫామ్ భారత జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవీ నాన్స్టాప్గా క్రికెట్ ఆడి అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని హేడన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్కు విశ్రాంతి అవసరం భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 అనంతరం హేడన్ మాట్లాడూతూ.. "బ్యాటర్ల కంటే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఆలసిపోతారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. విరాట్ కోహ్లి కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. అతడు కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని జట్టులో మళ్లీ చేరాడు. ఇప్పుడు విరాట్ తిరిగి తన ఫామ్ను పొందాడు. కాబట్టి భువీ కూడా విశ్రాంతి తీసుకుని వచ్చి చెలరేగుతాడు. ఏ బౌలరైనా బాగా అలసి పోతే.. అతడు బంతితో ఏకాగ్రత సాధించలేడు. భువీ అద్భుతమైన బౌలర్. అతడికి కాస్త విశ్రాంతి లభిస్తే తన ఫామ్ను తిరిగి పొందుతాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో బుమ్రా, భువీ జోడీ భారత జట్టుకు కీలకం కాబోతుంది అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భువీకి రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు -
'మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి'
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవరల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్-2022లోనూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించకున్న భువీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ సొంతమైంది. ఈ క్రమంలో తన చెత్త బౌలింగ్ కారణంగానే భారత్ డెత్ ఓవర్లలో విఫలమైంది అని భువనేశ్వర్ నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్ను ట్రోల్చేస్తున్న ట్రోలర్స్కు అతడి భార్య నుపుర్ నగర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని సోషల్ మీడియా వేదికగా నగర్ ఫైర్ అయింది. "ఈ రోజుల్లో చాలా మంది ఏ పనికి రానివారు. వాళ్లు ఏమి చేయరు. ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఒకరిపై విమర్శలు, ద్వేషం వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్లకు చాలా సమయం ఉంది. వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే.. మీ మాటల వల్ల ఎవరూ ప్రభావితం కారు. అంతేకాకుండా మీ ట్రోల్స్ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇతరలను విమర్శించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మీ జీవితాలను బాగు చేసుకోవడం. అది మీకు చాలా కష్టమే అని నాకు తెలుసు" అని నగర్ ఇన్స్టాగ్రామ్ రాసుకొచ్చింది. చదవండి: Ind vs Aus 2nd T20: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం: రోహిత్
Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Rohit Sharma Comments On Loss: ‘‘ఇది ప్రతిష్టాత్మక మ్యాచ్. కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్, నవాజ్ల జోడీని విడదీయలేకపోయాం. వారిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బకొట్టింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాము మెరుగైన స్కోరు నమోదు చేసినా దానిని కాపాడుకోలేకపోయామంటూ విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరే! ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిజ్వాన్, నవాజ్ జోరుకు బ్రేక్ వేయలేకపోయిన భారత బౌలర్లు టీమిండియా స్టార్ బ్యాటర్ 60 పరుగులతో భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. ఆదిలోనే కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పట్టుదలగా నిలబడ్డాడు. 51 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 15 పరుగులకే పెవిలియన్ చేరినా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ నవాజ్ 20 బంతుల్లోనే 42 పరుగులు సాధించి పాక్ విజయానికి బాటలు వేశాడు. రవి, భువీ, అర్ష్దీప్.. ఇక 18, 19 ఓవర్లలో భారత బౌలర్లు రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ వైడ్ల రూపంలో భారీగా పరుగులు సమర్పించుకోవడం.. కీలక సమయంలో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ను అర్ష్దీప్ వదిలేయడం వంటి పరిణామాల నేపథ్యంలో గెలుపు పాక్ను వరించింది. ఐదు వికెట్ల తేడాతో భారత్ దాయాది చేతిలో ఓటమి పాలైంది. మాకంటే పాక్ మెరుగ్గా ఆడింది ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్లో తాము చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ‘‘వాళ్ల జట్టులో కూడా క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. సమయం వచ్చినపుడు తమను తాము నిరూపించుకున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని తెలుసు. అయితే, 180 పరుగులు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మేము మెరుగైన స్కోరే నమోదు చేశాం. అయితే, దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యాం. కోహ్లిపై రోహిత్ ప్రశంసలు ఈ మ్యాచ్లో క్రెడిట్ పాకిస్తాన్కే దక్కుతుంది. మాకంటే వాళ్లు బాగా ఆడారు’’ అని రోహిత్ అన్నాడు. ఇక జట్టుకు అవసరమైన సమయంలో రాణించాడంటూ హిట్మ్యాన్.. విరాట్ కోహ్లిని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయిన సమయంలో తను బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. చదవండి: Asia Cup 2022: 'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' Asia Cup 2022: పాక్పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత! Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్! వైరల్ A brilliant 60 off 44 deliveries from @imVkohli makes him our Top Performer from the first innings. A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/VPEfamGENJ — BCCI (@BCCI) September 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs Pak: బాబర్ ఆజం ఒక్కడిని అవుట్ చేసినంత మాత్రాన..!
Asia Cup 2022 India vs Pakistan: ‘‘బాబర్ను అవుట్ చేసిన తర్వాత.. పాకిస్తాన్ సగం జట్టును పెవిలియన్కు పంపామని మేము భావించలేదు. నిజానికి అతడు గొప్ప ఆటగాడే! అయితే, టెక్నికల్గా మేము మరో తొమ్మిది మందిని అవుట్ చేయాలి కదా! ప్రత్యర్థి జట్టు బెస్ట్ బ్యాటర్ను అవుట్ చేసినంత మాత్రాన మేము రిలాక్స్ అవ్వలేదు. అయితే, కీలక బ్యాటర్ను పెవిలియన్కు పంపి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడం సహా.. వారి ప్రణాళికలను చిన్నాభిన్నం చేశామని మాకు తెలుసు’’ అని టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. బాబర్ను అవుట్ చేసి.. ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట భారత బౌలర్లు పాక్ జట్టును 147 పరుగులకు ఆలౌట్ చేయగా.. ఛేజింగ్ ఆఖర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ బాది జట్టుకు విజయం అందించాడు. ఇక ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ను భువీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. టెస్టులు మినహా పరిమిత ఓవర్ల క్రికెట్లో అగ్రస్థానంలో ఉన్న బ్యాటర్ను త్వరగా అవుట్ చేయడం ద్వారా పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి బాటలు పరిచాడు భువీ. తద్వారా పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత షాబాద్ ఖాన్, అసిఫ్ అలీ, నసీం షా వికెట్లు తీసి మ్యాచ్లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భువీ మాట్లాడుతూ.. బాబర్ను త్వరగా పెవిలియన్కు పంపడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఆ విషయం మర్చిపోయాము.. అయితే.. కానీ.. ఆ ఒక్కడిని అవుట్ చేసినంత మాత్రాన బాధ్యత తీరిపోయినట్లు భావించకుండా తమ ప్రణాళికలు పక్కాగా అమలు చేసి విజయం సాధించామని పేర్కొన్నాడు. ఇక గతేడాది ప్రపంచకప్ టోర్నీలో పాక్ చేతిలో పరాభవం గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘అప్పుడు ఏం జరిగిందో నిజంగా మేము పూర్తిగా మర్చిపోయాం. ఆటగాళ్లుగా గెలవడానికి ఎల్లప్పుడూ శాయశక్తులా కృషి చేస్తాం. అయితే, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉంటాయని తెలుసు. కాబట్టి మిగితా పరాజయాలను దాయాది చేతిలో ఓటమితో పోల్చలేము. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మాకు తెలుసు’’ అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ మొత్తంగా 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చదవండి: Hardik Pandya: సిక్సర్తో హార్దిక్ ఫినిషింగ్! ‘టేక్ ఏ బో’ అన్న డీకే! వీడియో వైరల్ Asia Cup 2022: 'కూల్గా ఉండు కార్తీక్ భాయ్.. నేను ఫినిష్ చేస్తా'! వీడియో వైరల్ -
పాకిస్తాన్పై భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి బౌలర్గా!
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పాండ్యా (33 నాటౌట్)తో పాటు జడేజా(35) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అంతకుముందు బౌలింగ్లో కూడా పాండ్యా అదరగొట్టాడు. మరోవైపు ఈ మ్యాచ్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన భువీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో పాకిస్తాన్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఈ మ్యాచ్లో తన రెండో వికెట్గా ఆసిఫ్ అలీను ఔట్ చేసిన అనంతరం భువీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్పై భువీ 9 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(6 వికెట్లు) పేరిట ఉండేది. ఈ ఘనత సాధించిన జాబితాలో 9 వికెట్లతో భువీ తొలి స్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా 7 వికెట్లతో రెండు స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ సంక్షిప్త సమాచారం టాస్: భారత్ బౌలింగ్ పాకిస్తాన్: 147/10 పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్: మహ్మద్ రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు) భారత బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, హార్ధిక్ పాండ్యా 3వికెట్లు, అర్షదీప్ సింగ్ 2వికెట్లు టీమిండియా : 148/5(19.4 ఓవర్లు) భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లు: విరాట్ కోహ్లి(35), జడేజా(35) పాక్ బౌలింగ్: మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు, నషీమ్ షా రెండు వికెట్లు విజేత: 5 వికెట్ల తేడాతో పాక్పై టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా( మూడు వికెట్లతో పాటు 33 పరుగులు (నాటౌట్)) చదవండి: Asia Cup 2022: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం -
T20 WC: అతడు మరీ అంత బ్యాడ్ ఛాయిస్ కాదు! ప్రపంచకప్ జట్టులో ఉంటే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్కప్ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రయోగాలు చేస్తున్న టీమిండియా! ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లను మెగా ఈవెంట్కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. మహ్మద్ షమీ(PC: BCCI) ఐపీఎల్లో అదరగొట్టిన షమీ! అయినా.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మరింత మెరుగయ్యాడు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్ షమీ కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్ మ్యాచ్ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు. కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్దీప్తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్! -
Ind Vs WI: అందుకే ఆఖరి ఓవర్లో ఆవేశ్ చేతికి బంతి! ఇదో గుణపాఠం... అయినా: రోహిత్
India Vs West Indies 2nd T20- Rohit Sharma Comments On Loss: కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బ్రేకులు వేసింది. రెండో టీ20లో విజయం సాధించి ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పైచేయి సాధించి 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. టాస్ గెలిచి... సెయింట్ కిట్స్లోని వార్నర్ పార్క్ వేదికగా సోమవారం విండీస్- టీమిండియా మధ్య రెండో టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ను.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేయడం సహా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ను 11 పరుగులకే పెవిలియన్కు పంపాడు. ఇక వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే పరిమితం కాగా.. రిషభ్ పంత్ 24 పరుగులు చేశాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా 31, రవీంద్ర జడేజా 27 పరుగులతో రాణించారు. బెస్ట్ ఫినిషర్గా గుర్తింపు పొందిన దినేశ్ కార్తిక్(7 పరుగులు) వికెట్ తీసి మరోసారి మెకాయ్.. దెబ్బతీశాడు. అశ్విన్ 10, భువనేశ్వర్ 1, ఆవేశ్ ఖాన్ 8, అర్ష్దీప్ 1(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 19.4 ఓవర్లలో రోహిత్ సేన 138 పరుగులు సాధించింది. అదరగొట్టిన బ్రాండన్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ బ్రాండన్ కింగ్(68 పరుగులు) అద్భుత ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కైలీ మేయర్స్ మాత్రం 8 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ నికోలస్ పూరన్(14 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు. షిమ్రన్ హెట్మెయిర్ 6 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. బౌండరీ బాది విండీస్ విజయం ఖరారు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్ను కాదని.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్కు బంతిని ఇవ్వడం గమనార్హం. ఇక 19వ ఓవర్లో అర్ష్దీప్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేయగా(6 పరుగులు ఇచ్చాడు)... ఆఖరి ఓవర్లో ఆవేశ్ ఖాన్ తేలిపోయాడు. మొదటి బంతి నోబాల్ కాగా.. థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. మా బ్యాటింగ్ బాగాలేదు! ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా డెత్ ఓవర్లలో యువ ఆటగాళ్లను బరిలోకి దింపడంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. పిచ్ చాలా బాగుంది. కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. మెరుగైన స్కోరు నమోదు చేయలేకపోయాము. అందుకే వాళ్లకు అవకాశం! అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ప్రతిసారి అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మాకు ఇదొక గుణపాఠం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక ఆఖరి ఓవర్ విషయానికొస్తే.. యువకులకు తప్పక అవకాశాలు ఇవ్వాలి. నిజానికి భువి మాకోసం ఏం చేయగలడో.. ఏమేం చేశాడో ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితమైంది. గత కొన్నేళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, ఆవేశ్, అర్ష్దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా! వాళ్లలోని నైపుణ్యాలు, ప్రతిభకు పదును పెట్టగలరు. అయినా కేవలం ఈ ఒక్క గేమ్తో ఒక అంచనాకు రాలేము. నా జట్టు పట్ల నేను గర్వపడుతున్నా. నిజానికి 13-14 ఓవర్లోనే ముగుస్తుందనుకున్న మ్యాచ్ను మా వాళ్లు చివరి ఓవర్ వరకు లాక్కొచ్చారు. మార్చే ప్రసక్తే లేదు! మా బౌలర్లు అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. అయితే, బ్యాటింగ్ పరంగా మేము మెరుగుపడాల్సి ఉంది. కానీ, ప్రయోగాలకు మాత్రం వెనుకాడబోము. ఒక్క ఓటమి కారణంగా మేము బెంబేలెత్తిపోము. ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వము’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా ఇటీవల తరచుగా ఓపెనింగ్ జోడీని మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2) మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్గా Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc — Windies Cricket (@windiescricket) August 1, 2022 -
Ind Vs WI: ఎవరికి ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు: భువీ
West Indies vs India, 2nd T20I: టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై సహచర ఆటగాడు, సీనియర్ పేసర్ భునవేశ్వర్ ప్రశంసలు కురిపించాడు. ఏ బ్యాటర్కు ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసన్నాడు. యువ ఆటగాళ్లలో చాలా తక్కువ మందిలో మాత్రమే ఇలాంటి పరిణతి ఉంటుందంటూ అర్ష్దీప్ను కొనియాడాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్దీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రంలోనే అదరగొట్టాడు! పంజాబ్కు ఆడిన ఈ 23 ఏళ్ల ఫాస్ట్బౌలర్ 14 ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న అర్ష్దీప్.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. మొత్తంగా.. 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా క్రికెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాడు. అర్ష్దీప్ అరంగేట్రం(PC: BCCI) ఈ క్రమంలో వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో 2 వికెట్లతో సత్తా చాటాడు. అదే జోష్లో సోమవారం నాటి(ఆగష్టు 1)రెండో టీ20కి సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు భువీ మాట్లాడుతూ.. అర్ష్దీప్ ఆటతీరును ప్రశంసించాడు. అర్ష్దీప్నకు ఆ విషయం బాగా తెలుసు! ‘‘ఎప్పుడు ఎలా ఆడాలో తనకు బాగా తెలుసు. అతడిలో ఉన్న అత్యుత్తమ గుణం ఇదే! ఏ బ్యాటర్కు ఎలా బౌలింగ్ చేయాలి? ఫీల్డ్ ఎలా సెట్ చేసుకోవాలి? అన్న విషయాలు బాగా తెలుసు. యువ ఆటగాళ్లలో చాలా కొంతమంది మాత్రమే ఇలాంటి పరిణతి కనబరచగలరు’’ అని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ గత రెండు సీజన్లలోనూ అర్ష్దీప్ నిలకడగా రాణించాడన్న భువీ.. పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మలచుకోవడంలో ముందుంటాడని కొనియాడాడు. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు India Probable XI: అలా అయితే అయ్యర్పై వేటు తప్పదు! ఓపెనర్గా మళ్లీ అతడే!? -
Ind Vs Eng: భువీ డెడ్లీ ఇన్స్వింగర్.. బట్లర్ బౌల్డ్.. వీడియో వైరల్
India Vs England 1st T20: ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. టీమిండియా విధించిన 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను మొదటి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. గత కొన్ని నెలలుగా భీకర ఫామ్ కొనసాగిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన అద్భుతమైన ఇన్స్వింగర్తో బట్లర్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ఐదో బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. బట్లర్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కాగా భువీ ఇన్స్వింగర్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘మళ్లీ పాత భువీని చూస్తున్నాం.. చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ బట్లర్ను భువీ అవుట్ చేసి ఉండకపోతే కచ్చితంగా పరిస్థితి వేరేలా ఉండేది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 148 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భువీ 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 198/8 (20) ఇంగ్లండ్ స్కోరు: 148 (19.3) విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు! #TeamIndia post a total of 198/8 in 20 overs 🏏 #ENGvIND pic.twitter.com/Mc1dDtEXqB — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 -
IND Vs IRE: గంటకు 208 కి.మీ. వేగం.. అక్తర్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?
India vs Ireland T20 Series: ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మొదటి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్లో మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ వైస్ కెప్టెన్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా హార్దిక్ పాండ్యా సేన ఐర్లాండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా భువీ బౌలింగ్ చేస్తున్నపుడు స్పీడోమీటర్ రెండుసార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బంతి విసిరినట్లు చూపడం గమనార్హం. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్కు భువీ వేసిన బాల్ 201 Km/h, అదే విధంగా బల్బిర్నీకి 208 201 Km/h వేగంతో బంతిని విసిరినట్లు చూపింది. నిజానికి అంతర్జాతీయ మ్యాచ్లో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట ఉంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం అంతుబట్టక నెటిజన్లు తికమకపడుతున్నారు. అదే సమయంలో.. భువీని కొనియాడుతూ.. ‘‘తప్పో.. ఒప్పో.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంతకీ షోయబ్ అక్తర్’’ ఎవరూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా స్పీడోమీటర్లో చూపింది విండ్స్పీడ్రా బాబూ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్ Shoaib Akhtar, Umran Malik who??? Bhuvi just bowled the fastest ball ever.🤣🤣 Real pic, just took ss pic.twitter.com/2wDDDJQ6gK — Usama Kareem (@UsamaKarem2) June 26, 2022 201 kmph 😂😂#INDvIRE pic.twitter.com/QFNlhedAlb — Arslan Awan (@iamArslanawan) June 26, 2022 -
అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్
సౌతాఫ్రికాతో టి20 సిరీస్లో టీమిండియా తడబడుతుంది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిపోయిన టీమిండియా మంగళవారం విశాఖ వేదికగా కీలకమ్యాచ్ ఆడనుంది. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక కటక్ వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా స్టార్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లు వేసిన భువీ 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు వికెట్లు పవర్ ప్లేలో( తొలి ఆరు ఓవర్లు) రావడం విశేషం. మూడో టి20 జరగనున్న నేపథ్యంలో భువనేశ్వర్ ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. టి20ల్లో పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్.. విండీస్ బౌలర్ శామ్యూల్ బద్రీ, టిమ్ సౌథీలతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ జరిగే మ్యాచ్లో పవర్ ప్లేలో ఒక వికెట్ తీసినా భువీ.. బద్రీ, సౌథీలను అధిగమించి తొలి స్థానంలో నిలవనున్నాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ 59 మ్యాచ్ల్లో 5.66 ఎకానమీతో 33 వికెట్లు తీశాడు. ఇక వెస్టిండీస్కు చెందిన శామ్యూల్ బద్రీ 50 మ్యాచ్ల్లో 6.29 ఎకానమీతో 33 వికెట్లు తీయగా.. కివీస్ బౌలర్ సౌథీ 68 మ్యాచ్ల్లో 7.30 ఎకానమీతో 33 వికెట్లు తీశాడు. వీరి తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ 58 మ్యాచ్ల్లో 6.74 సగటుతో 27 వికెట్లతో ఉండగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ జోష్ హాజిల్వుడ్ 30 మ్యాచ్ల్లో ఆరు ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. ఇక తొలి రెండు టి20ల్లో ఓటమి పాలవ్వడంతో టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ల ఎంట్రీ ఖాయంగా కనబడుతోంది. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ స్థానంలో వీరిద్దరు తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది. చదవండి: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..! IND vs SA: 'మ్యాచ్ టైట్ అయినప్పడు పంత్ ఒత్తిడికి గురివుతున్నాడు' -
IPL 2022: అప్పుడే మరింత కామ్గా ఉండాలి: ఉమ్రాన్తో భువీ
IPL 2022 SRH vs MI: Bhuvneshwar Kumar Comments: ‘‘డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేటపుడు కూల్గా ఉండాలి. అలాంటి కీలక సమయంలో ఒక్క బౌండరీ వెళ్లినా ఒత్తిడిలో కూరుకుపోతాం. అయితే, అప్పుడే మనం మరింత కామ్గా ఉండాలి. ఒత్తిడిని జయిస్తేనే ప్రణాళికను పక్కాగా అమలు చేయగలం’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన భువీ.. తన సహచర ఆటగాడు, స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్కు ఆట గురించి ఈ మేరకు సలహాలు ఇచ్చాడు. ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్తో కీలకమైన మ్యాచ్లో సన్రైజర్స్ మూడు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి(76), ప్రియమ్ గార్గ్(42), నికోలస్ పూరన్(38) రాణించారు. ఇక ఉమ్రాన్ మాలిక్ 3 కీలక వికెట్లు పడగొట్టగా.. భువీ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ముఖ్యంగా 19వ ఓవర్ను మెయిడెన్ చేసి సన్రైజర్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఉమ్రాన్తో సంభాషణలో భాగంగా.. ‘‘అదృష్టవశాత్తూ 19వ ఓవర్ మెయిడెన్ అయింది. నిజానికి యార్కర్లు వేయడానికి ప్రయత్నించాను. పరుగులు లభిస్తున్న వికెట్పై యార్కర్లు సంధించడమే సరైన ఆప్షన్ అని భావించాను. లక్కీగా అన్నీ సరైన స్పాట్లో బౌల్ చేయగలిగాను. నా ప్రణాళికను పక్కాగా అమలు చేశాను’’ అని భువనేశ్వర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ 65: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ స్కోర్లు: సన్రైజర్స్-193/6 (20) ముంబై- 190/7 (20) చదవండి👉🏾Kane Williamson: సన్రైజర్స్కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ చదవండి👉🏾Eng Vs NZ Test Series: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. వెరీ స్పెషల్.. వాళ్లిద్దరికీ చోటు! What has Umran learnt in #TATAIPL 2022? 🤔 What's the story behind Umran's celebration❓ Find out all in this special chat between @umran_malik_1 & @BhuviOfficial. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #MIvSRH | @SunRisershttps://t.co/xMdNi2r4F6 pic.twitter.com/X5PnXx75nN — IndianPremierLeague (@IPL) May 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI vs SRH: టీ20 క్రికెట్లో బుమ్రా సరికొత్త రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు!
IPL 2022 MI vs SRH- Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ బౌలర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా టీ20 ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో 250 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్గా నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. సన్రైజర్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇక టీ20 క్రికెట్లో బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గా సన్రైజర్స్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఆఖరి వరకు పోరాడిన ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో సన్రైజర్స్ చేతిలో ఓటమి పాలైంది. రైజర్స్ 193 పరుగులు చేసి, గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై బౌలర్లలో డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్, బుమ్రా ఒక్కో వికెట్ తీయగా.. రమణ్దీప్ సింగ్ ఏకంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్: అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు ►జస్ప్రీత్ బుమ్రా- 250 ►భువనేశ్వర్ కుమార్- 223 ►జయదేవ్ ఉనద్కట్- 201 ►వినయ్ కుమార్-194 ►ఇర్ఫాన్ పఠాన్- 173 చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్రైజర్స్కు విజయాలు.. బుమ్రా బౌలింగ్నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్కు ఎంపిక చేయండి! That's that from Match 65#MumbaiIndians fought hard, but fell short in the end as @SunRisers win by 3 runs. Scorecard - https://t.co/U2W5UAx6di #MIvSRH #TATAIPL pic.twitter.com/43SRO9X85o — IndianPremierLeague (@IPL) May 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి భారత పేసర్గా..!
ఐపీఎల్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్గా బౌలర్గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ ఈ ఘనత సాధించిన జాబితాలో ఏడో స్థానంలో భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, పీయూష్ చావ్లా, హార్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ డ్వేన్ బ్రావో 177 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన బౌలర్లు డ్వేన్ బ్రావో 177 వికెట్లు లసిత్ మలింగా 170 వికెట్లు అమిత్ మిశ్రా 166 వికెట్లు పీయూష్ చావ్లా 157 వికెట్లు యజువేంద్ర చాహల్ 151 వికెట్లు భువనేశ్వర్ కుమార్ 150 వికెట్లు చదవండి: సీఎస్కే బౌలర్కు చుక్కలు చూపించిన రషీద్ ఖాన్.. -
చెత్త బౌలింగ్లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్లో దాదాపు ఎస్ఆర్హెచ్ బౌలర్లందరూ దారాళంగా పరుగులిచ్చుకున్నారు. తొలి స్పెల్లో నోబాల్స్ వేసినప్పటికి అద్బుత స్పెల్ వేసిన భువనేశ్వర్ మలి స్పెల్లో అదే జోరును చూపెట్టలేకపోయాడు. సంజూ శాంసన్, హెట్మైర్ల దాటికి భువీ భారీగా పరుగులిచ్చుకున్నాడు. అయితే ఇంత చెత్త బౌలింగ్లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక డాట్ బంతులు వేసిన బౌలర్గా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో భువీ 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా ఇందులో 12 డాట్బాల్స్ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్లో భువనేశ్వర్ ఇప్పటివరకు 133 మ్యాచ్ల్లో 1338 డాట్ బాల్స్ వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో హర్భజన్ సింగ్ 163 మ్యాచ్ల్లో 1314 డాట్ బాల్స్తో రెండో స్థానంలో.. రవిచంద్రన్ అశ్విన్ 167 మ్యాచ్ల్లో 1293 డాట్ బాల్స్తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 41, బట్లర్ 35 పరుగులతో జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా -
IPL 2022: కష్టమని తెలుసు.. కానీ ఈసారి ట్రోఫీ గెలుస్తాం: భువీ
IPL 2022- Sunrisers Hyderabad: ‘‘తిరిగి సన్రైజర్స్ జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. కొత్త ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని కలిసేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఈసారి అభిమానులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. వారి ముఖాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా లక్ష్యం. వ్యక్తిగతంగా నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలేమీ లేవు. సమష్టి కృషితో ముందుకు సాగి ఈ సారి ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నాం. ఇదంతా తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని తెలుసు. మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా అభిమానులను ఖుషీ చేయడానికి శక్తిమేర ప్రయత్నిస్తాం’’ అని టీమిండియా బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్-2022 సీజన్లో టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మెగా వేలంలో నేపథ్యంలో రిటెన్షన్లో భాగంగా హైదరాబాద్ భువీని వదిలేసింది. అయితే, వేలంలో అతడిని 4.2 కోట్లు ఖర్చు చేసి తిరిగి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజా సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీతో భువీ చేరాడు. కాగా మార్చి 29 న విలియమ్సన్ సారథ్యంలోని సన్రైజర్స్ రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2016లో సన్రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి.. View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
Ind Vs Wi 2nd T20: బాల్ను ఎందుకలా తన్నావు రోహిత్.. పాపం భువీ!
IND vs WI: Angry Rohit Sharma kicks ball: రోహిత్ శర్మ.. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. స్వదేశంలో ఇప్పటికే న్యూజిలాండ్తో టీ20, వెస్టిండీస్తో వన్డే సిరీస్లు గెలిచాడు. ఇక విండీస్తో శుక్రవారం నాటి రెండో టీ20లో భారత్ విజయంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. కాగా జట్టు ఎంపిక, తుదిజట్టు కూర్పు తదితర అంశాల్లో కచ్చితంగా వ్యవహరిస్తున్న హిట్మ్యాన్... మైదానంలో కూడా దూకుడుగా ఉంటున్నాడు. ఆటగాళ్లు చిన్న చిన్న తప్పిదాలు చేసినా అస్సలు సహించడం లేదు. సీరియస్గా ఉంటూ అక్కడిక్కడే వార్నింగ్లు ఇస్తున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నపుడు యజువేంద్ర చహల్ సరైన స్థానంలో నిల్చోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ... రెండో టీ20 మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తీరుపై కూడా అసహనం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు నికోలస్ పూరన్, పావెల్ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 15వ ఓవర్ బౌల్ చేసిన భువీ... ఆఖరి బంతికి పావెల్ ఇచ్చిన క్యాచ్ను జారవిడిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ కోపంతో బంతిని తన్ని అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘మరీ అంత కోపమా రోహిత్.. బంతిని ఎందుకలా తన్నావు.. పాపం భువీ!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో రోహిత్ సేన 8 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో భువీ.. ప్రమాదకర బ్యాటర్ నికోలస్ పూరన్ వికెట్ తీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్కు కూడా డౌటే.. ఎందుకంటే! 🙌🙌#TeamIndia @Paytm #INDvWI pic.twitter.com/NjrkDCxt2q — BCCI (@BCCI) February 18, 2022 pic.twitter.com/JNYZTNxmmd — Addicric (@addicric) February 18, 2022 -
ఇదే చివరి అవకాశం.. ఆడకుంటే రహానే, పుజారా మాదిరి
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్కు బీసీసీఐ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. వెస్టిండీస్తో జరుగుతున్న టి20 సిరీస్ భువనేశ్వర్కు కీలకంగా మారింది. ఈ సిరీస్లో గనుక భువీ రాణించకుంటే రహానే, పుజారాల మాదిరే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు వేసింది. ఇషాంత్, సాహాలు జట్టుకు దాదాపు దూరమైనట్లే.. ఇక రహానే, పుజారాలు రంజీ సీజన్లో రాణించడంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్కు కూడా విండీస్తో టి20 సిరీస్ డెత్ సిరీస్గా పరిగణించొచ్చు. విండీస్తో తొలి రెండు టి20ల్లో మంచి ప్రదర్శన చేయకపోతే భువీపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతుంది. కాగా తొలి టి20లో భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ ప్రదర్శన అంత మెచ్చుకునేది కాదనే చెప్పొచ్చు. ఒకవేళ భువీపై వేటు పడితే మాత్రం.. భవిష్యత్తులో టీమిండియాలోకి రావడం కష్టమవుతుంది. ఇప్పటికే టెస్టులకు దూరమైన భువీ కొంతకాలంగా పరిమిత, టి20 మ్యాచ్ల్లోనే ఎక్కువగా ఆడుతున్నాడు. స్వింగ్ బౌలర్గా.. డెత్ ఓవర్ల స్పెషలిస్టగా పేరు పొందిన భువీ.. గాయం నుంచి కోలుకున్నాకా మునుపటి ఫామ్ను కొనసాగించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ సెలక్టర్లలో ఒకరు పేర్కొన్నారు. ''భువీకి ఇది చివరి అవకాశంగా భావించొచ్చు. గతేడాది ఐపీఎల్ నుంచే పాత భువీ కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటన అతనికి పీడకల మిగిల్చింది. ఇప్పటికే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు టీమ్ మేనేజ్మెంట్ రెడీ అవుతుంది. ఒకవేళ షమీ తుది జట్టులోకి వస్తే భువీకి మరింత సమస్యగా మారుతుంది. విండీస్తో టి20 సిరీస్లో మూడు టి20ల్లో తొలి రెండు టి20ల్లో చేసే ప్రదర్శనపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. విఫలమైతే మాత్రం పుజారా, రహానేల మాదిరే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చారు. గతేడాది ఐపీఎల్ నుంచి భువీ ప్రదర్శన చూసుకుంటే.. ►2021 ఐపీఎల్లో భువనేశ్వర్ 11 మ్యాచ్లాడి కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్ కెరీర్లో భువీకి అత్యంత చెత్త ప్రదర్శన ఇదే అని చెప్పొచ్చు. ►శ్రీలంకతో సిరీస్లో రేండు మ్యాచ్లాడిన భువీ మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ►న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్లో మూడు వికెట్లు తీసినప్పటికి ఎకానమీ రేటు ఎక్కువగా ఉంది. ►ఇక సౌతాఫ్రికా పర్యటన భువీకి పీడకల. మూడు వన్డేల్లో రెండు మాత్రమే ఆడిన భువీ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో విండీస్తో సిరీస్లో వన్డేలకు ఎంపిక కాలేదు. -
Ind vs Wi: భువీపై టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు.. బ్రేక్ తీసుకుని...
Ind Vs Wi Series: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఫామ్లేని ఆటగాళ్లను నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలన్నారు. వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలని సూచించారు. ఇక వెస్టిండీస్తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు స్పోర్ట్స్తో మాట్లాడిన గావస్కర్... ‘‘భువనేశ్వర్ కుమార్.... అతడి బౌలింగ్లో మునుపటి పస లేదు. పేస్లో పదును లేదు. భువీకి భవిష్యత్తు ఉందని అనిపించడం లేదు. అతడు మళ్లీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. భువనేశ్వర్ బ్రేక్ తీసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఇక భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్ ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయన్న అంశం గురించి గావస్కర్ చెబుతూ... ‘‘దీపక్ చహర్కు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలి. ఈ యువ ఆటగాడు అద్భుతంగా బంతిని స్వింగ్ చేయగలడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. భువీ స్థానంలో చహర్ను తుది జట్టులో ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాగా ఫిబ్రవరి 6 నుంచి విండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు అహ్మదాబాద్కు పయనమయ్యారు. ఇక ఇంగ్లండ్పై టీ20 సిరీస్తో విజయంతో జోరు మీదున్న పొలార్డ్ బృందం త్వరలోనే భారత్ చేరుకోనుంది. కాగా విండీస్తో వన్డే, టీ20 సిరీస్కు దీపక్ చహర్ ఎంపిక కాగా.. భువీ కేవలం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్ IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్కోచ్ -
భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. క్రికెటర్ కూతురు ఫొటో వైరల్
Bhuvneshwar Kumar Daughter Photo: కెరీర్ పరంగా కాస్త వెనుకబడిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్యాబిడ్డలతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కూతురు రాకతో తమ ప్రపంచం మొత్తంగా మారిపోయిందంటూ సంబరపడిపోడతున్నాడు. కాగా భువీ భార్య నుపుర్ గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో పెళ్లిరోజు జరుపుకొన్న మరుసటి రోజే పాపాయి ఈ భూమ్మీదకు రావడంతో వారి సంతోషం రెట్టింపైంది. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో తొలిసారిగా కూతురితో కలిసి ఉన్న ఫొటోను భువీ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ క్రమంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సహా పలువురు భువీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా భువీ తన గారాల పట్టిని ఎత్తుకుని ఉండగా.. నుపుర్ ఆత్మీయంగా ఆమెను చూస్తున్న ఈ చిత్రం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి’’ చేరింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి ధోని, ప్రస్తుత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్టు సారథి విరాట్ కోహ్లి సహా అజింక్య రహానే, పుజారా తదితరులు ఆడపిల్లల తండ్రులన్న సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న సంగతి తెలిసిందే. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్బై ప్లేయర్లు: నవ్దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా. చదవండి: U 19 World Cup 2022: మనోళ్లు ఇద్దరు.. శభాష్ రషీద్, రిషిత్ రెడ్డి! Vijay Hazare Trophy: ‘యశ్’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి.. View this post on Instagram A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) -
Bhuvneshwar Kumar: మొదటిసారి తండ్రైన టీమిండియా బౌలర్
Bhuvneshwar Kumar Became Father Couple Welcome Their First Child: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. అతడి భార్య నుపుర్ నగర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తమ నాలుగో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న మరుసటి రోజే భువీ- నుపుర్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం విశేషం. నుపుర్కు మంగళవారం నొప్పులు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా నేడు(బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు పాప పుట్టింది. ఇక ఇటీవల ముగిసిన ఇండియా- న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్న భువీకి ఫోన్లో ఈ శుభవార్త చెప్పినట్లు సన్నిహితులు వెల్లడించారు. కాగా భువనేశ్వర్- నుపుర్ నగర్ 2017లో నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు. ఇక కివీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భువీ 3 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ తర్వాత స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను రోహిత్ సేన క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Venkatesh Iyer: ప్రమాదంలో పాండ్యా కెరీర్; ఆల్రౌండర్ను.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధం! -
T20 World Cup: అతడు ఫామ్లో లేనంత మాత్రాన..: కోహ్లి
Virat Kohli Comments Bhuvneshwar Kumar: ఐపీఎల్-2021 సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్కుమార్. ఈ ఎడిషన్లో 11 మ్యాచ్లు ఆడిన ఈ టీమిండియా పేసర్ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ 7.97. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న భువీ... ఇలా ఫామ్లేమితో సతమతమవుతుండటం.. పొట్టి ప్రపంచకప్నకు ముందు భారత జట్టును కలవరపెట్టే అంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో భువీ ఆట తీరుపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించగా... టీమిండియా సారథి విరాట్ కోహ్లి మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. భువీ అనుభవం తమకు కలిసి వచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. నేటి నుంచి(అక్టోబరు 17) టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో కోహ్లి మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘భువీ ప్రదర్శన గురించి అస్సలు ఆందోళన లేదు. తన ఎకానమీ రేటు బాగానే ఉంది. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచే తన అనుభవం మాకు ఉపకరిస్తుంది. ఇటీవలి ఆర్సీబీ, సన్రైజర్స్ మ్యాచ్లో తను మెరుగ్గా రాణించాడు. తనేంటో నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఏ సమయంలో.. బంతిని ఎక్కడ వేయాలో తనకు అవగాహన ఉంటుంది. నిలకడైన ఆట తీరు కనబరచగలడు. తన అనుభవం, కచ్చితత్వం జట్టుకు విలువకట్టలేని ఆస్తి అని చెప్పవచ్చు’’ అని కోహ్లి... భువీపై ప్రశంసలు కురిపించాడు. కాగా అక్టోబరు 24న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్తో టీమిండియా వరల్డ్ కప్ టోర్నీ ప్రయాణం మొదలుకానుంది. చదవండి: T20 WC Ind Vs Pak: కోహ్లి వద్ద అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి.. కానీ -
టీ20 ప్రపంచకప్లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు..
Aakash Chopra Comments On Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2021 లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భువి పేలవ ఫామ్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. అతడు ఇదే ఫామ్ కొనసాగిస్తే రాబోయే టీ20 ప్రపంచకప్లో టీమిండియా తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యచ్లో భువనేశ్వర్ కుమార్ 34 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా సాధించకుండా తన నాలుగు ఓవర్ల కోటాను ముగించాడు. చెన్నైకు చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ తన ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ ఫామ్ ముఖ్యంగా టీమిండియాకు చాలా ఆందోళన కలిగించే విషయం అని అతడు తెలిపాడు "నేను భువనేశ్వర్ కుమార్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్నాను. ఒక వేళ రేపు వరల్డ్ కప్ ప్రారంభమవుతుంటే భువనేశ్వర్ కుమార్కు నా తుది జట్టులో చోటు ఇవ్వను. ఎందుకంటే ప్రస్తుతం అతడి బౌలింగ్ ప్రదర్శన దారుణంగా ఉంది. భువీ తన ఫామ్కోసం చాలా కష్టపడుతున్నాడు. భారత జట్టులో బుమ్రా, భువీ, షమీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. బుమ్రాకు తోడుగా భువీను నా రెండవ బౌలర్గా ఎంచుకున్నాను. కానీ ఈ సమయంలో అతడు ఇకపై నా రెండవ బౌలర్ కాదు.. మూడో బౌలర్ అయ్యాడు." అని అతడు పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్లో భువీ స్థానంలో దీపక్ చహర్ను తీసుకోవాలని పలువురు భారత మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు -
T20 World Cup 2021: మంచి ఫామ్లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు
Ian Bishop Comments On Deepak Chahar: టీ20 ప్రపంచకప్ జట్లలో మార్పులకు అక్టోబరు 10 వరకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో తాజా ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్-2021 రెండో అంచెలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టీ20 వరల్డ్కప్ జట్టులోని వారి స్థానాలను శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లతో భర్తీ చేయడం బెటర్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలోనూ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్ను ఆడిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ భువీ, దీపక్ మధ్య పోలికలు, తాజా ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ... ‘‘టీ20 జట్టులో ఎంపిక కాని... దీపక్ చహర్ దురదృష్టవంతుడనే చెప్పాలి. భువీ గత ప్రదర్శన, అనుభవం రీత్యా అతడికే సెలక్టర్లు ఓటు వేసి ఉంటారన్న విషయాన్ని అర్థం చేసుకోగలను. కానీ.. ప్రస్తుతం దీపక్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరే ఇతర బౌలర్కు సాధ్యం కాని విధంగా బాల్ను స్వింగ్ చేస్తున్నాడని నా అభిప్రాయం. ఇంకో విషయం.. డెత్ ఓవర్లలో భువీ స్పెషలిస్టు అన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఐపీఎల్ సీజన్లో అతడి కంటే దీపక్ చహర్ మెరుగ్గా బౌల్ చేస్తున్నాడని అంగీకరించక తప్పదు’’ అని పేర్కొన్నాడు. భువీ స్థానంలో దీపక్ను ఎంపిక చేస్తే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్.. 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువీ... ఆడిన 8 మ్యాచ్లలో 8.53 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో వీరికి అవకాశం ఇస్తే మంచిదేమో! Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి -
అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ
ముంబై: భువనేశ్వర్ కుమార్.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థులను తన బౌలింగ్తో బెంబేతెత్తిస్తుంటాడు. నకుల్ బౌలింగ్తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మ్యాచ్ల్లో పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమయ్యేవాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా నిలిచిన భువీ ఒకానొక సందర్భంలో అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్గా మారాడు. కానీ క్రమంగా టెస్టులు ఆడడం తగ్గించేశాడు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భువీని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్కు సరిగ్గా సరిపోతాయి. అయితే భువీ పరిమిత ఓవర్లు, టీ20ల్లో దృష్టి పెట్టేందుకే టెస్టులకు దూరమవుతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. దీనిపై భువీ స్వయంగా తన ట్విటర్ ద్వారా స్పందించాడు. '' టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడడానికి నేను ఎప్పుడూ సిద్దమే. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్కే మొదటి ఓటు ఉంటుంది. వన్డే, టీ20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్ అయినా సరే.. సంప్రదాయ క్రికెట్కే మొగ్గు చూపుతాడు. ఒక బౌలర్కు తన బౌలింగ్లో వైవిధ్యం ఎక్కువగా చూపించే అవకాశం టెస్టుల్లోనే లభిస్తుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్టులకే ప్రాధాన్యమిస్తా. కేవలం ఊహాగానాల ఆధారంగా నాపై అసత్య ప్రచారాలు రాయొద్దంటూ '' చెప్పుకొచ్చాడు. ఇక భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం టెస్టు క్రికెట్లో టీమిండియా తరపున బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్లు అద్భుతంగా రాణిస్తుండడంతో పరోక్షంగా భువీకి టెస్టుల్లో అవకాశాలు తగ్గిపోయాయి. చదవండి: WTC Final: కొత్త వ్యూహంతో కివీస్ ఆటగాడు పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు -
ఆ భారత పేసర్ కూడా బుమ్రా స్థాయి బౌలరే
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించాడు. స్లాగ్ ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ను కట్టడి చేసిన విధానం అమోఘమన్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ తీసి 14 పరుగులే ఇచ్చిన బుమ్రా భారత్కు దొరికిన ఒక అదృష్టమన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన బిషప్.. అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఒక సెన్సేషనల్ బౌలర్ బుమ్రా అని ప్రశంసించాడు. అందుకు గల కారణాలు వెల్లడించాడు ఈ మాజీ విండీస్ దిగ్గజం. ‘చాలాకాలం కెరీర్ ఆరంభించిన తర్వాత ఓ దశలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత తన బౌలింగ్ను గాడిలో పెట్టడానికి పరుగులు పెట్టాడు. మంచి రిథమ్ను అందుకున్నాడు. అసలు పేస్ బౌలింగ్లో కచ్చితత్వాన్ని సాధించడంపై ఫోకస్ పెట్టాడు.. సక్సెస్ చూశాడు. స్లో బాల్స్ ఎలా వేయాలి. ఆఫ్ కటర్స్ ఎలా వేయాలి, యార్కర్లు ఎక్కడ సంధించాలి. లెంగ్త్ బాల్స్ను ఎప్పుడు వేయాలి అనే విషయాలను బాగా అర్థం చేసుకున్నాడు. పేస్ బౌలింగ్ను అతను అర్థం చేసుకున్న అమోఘం. ఇక భారత బౌలర్లలో బుమ్రా స్థాయి బౌలరే భువనేశ్వర్ కుమార్. ఇద్దరికీ పోలికలున్నాయి. అతని అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృష్టి చేస్తాడు. బౌలింగ్ వేసేటప్పుడు తన ఆలోచనతో భిన్నమైన బంతుల్ని వేస్తాడు. అతను బుమ్రా కంటే మంచి పేసర్ కాకపోవచ్చు. బుమ్రా బౌలింగ్లో కంట్రోల్ ఉంటుంది. భువీ బౌలింగ్లో అది లోపిస్తుంది. అందుకే ఇద్దరిలో బుమ్రానే మంచి బౌలర్. అన్ని ఫార్మాట్లు ఆడుతూ దానికి తగ్గట్టు బౌలింగ్ చేయడం, అదే సమయంలో ఫిట్గా ఉండటాన్ని ఊహించుకోలేకపోతున్నా’ అని పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయాల్లో బుమ్రా మరొకసారి కీలక పాత్ర పోషిస్తాడని బిషప్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ చదవండి: టీవీలో చూడట్లేదా ఏంటి.. నేను ప్రిపేరయ్యే ఉన్నా: ధవన్ ‘క్రికెట్ చరిత్రలోనే అది అత్యంత చెత్త రూల్’ -
డైలమాలో సన్రైజర్స్!
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్లు మీద షాక్లు తగిలాయి. సన్రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్లోనే ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడి టోర్నీకి దూరమైతే, కేన్ విలియమ్సన్ గాయం కారణంగా రెండు మ్యాచ్లకు ఆడలేదు. దాంతో సన్రైజర్స్ ఆదిలోనే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా, సన్రైజర్స్ జట్టులోని కీలక సభ్యుడు, పేసర్ భువనేశ్వర్ కుమార్ తుంటి గాయంతో లీగ్ నుంచి వైదొలిగాడు. ఇప్పటివకే ఐదు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ రెండు మ్యాచ్ల్లోనే గెలిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన సన్రైజర్స్.. వరుసగా రెండు విజయాలతో టచ్లోకి వచ్చింది. కానీ ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ ఆడిన గత మ్యాచ్లో మళ్లీ ఓటమి వెక్కిరించింది. ప్రధానంగా బౌలింగ్లో బలహీనంగా ఉండటంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఈరోజు(గురువారం) కింగ్స్ పంజాబ్తో పోరుకు సన్నద్ధమైంది ఆరెంజ్ ఆర్మీ.(చదవండి: ‘టీ20’ని మార్చండి: సునీల్ గావస్కర్) ఈ తరుణంలో మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్న సన్రైజర్స్ పూర్తిగా డైలమాలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఐదో బౌలర్ ఆప్షన్ లేకపోవడమే. ఆ జట్టులో బౌలింగ్ వనరులున్నా నమ్మదగిన బౌలర్ ఎవరూ కనిపించడం లేదు. సన్రైజర్స్ పేస్ విభాగాన్ని సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, నటరాజన్లు పంచుకుంటే నాల్గో బౌలర్గా స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. కానీ ఐదో బౌలర్ ఎవరు అనేది సన్రైజర్స్కు ప్రశ్న. భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన పృథ్వీ రాజ్ యర్రాకు వెంటనే అవకాశం రాకపోవచ్చు. ఈ తరుణంలో ఐదో బౌలర్ గురించి తర్జన భర్జనలు పడుతుంది సన్రైజర్స్. స్పిన్నర్ షహబాజ్ నదీమ్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. కానీ స్పిన్నర్లను బాగా ఆడే కేఎల్ రాహుల్ క్రీజ్లో కుదురుకుంటే మాత్రం ఇది మళ్లీ సన్రైజర్స్కు తలపోటుగా మారిపోవడం ఖాయం. ముంబైతో జరిగిన మ్యాచ్లో అబ్దుల్ సామద్, కేన్ విలియమ్సన్లు తలో రెండు ఓవర్లు వేసి ఐదో బౌలర్ ఆప్షన్ను పంచుకున్నారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలో 51 పరుగులిచ్చారు. దాంతో ఐదో బౌలర్గా స్పెషలిస్టు బౌలర్ కావాలి. మరి అది స్పిన్నర్కు ఇస్తే బాగుంటుందా.. లేక మీడియం ఫాస్ట్ బౌలర్కు ఇవ్వాలనేది సన్రైజర్స్కు సవాల్గా మారింది. ఒకవేళ పేస్ విభాగంలో ఇస్తే బాసిల్ థంపిని జట్టులోకి తీసుకురావొచ్చు. విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉండాలనే నిబంధనలో భాగంగా జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్లకే తుది జట్టులో ఉంటారు. అంటే ఇక్కడ ఐదో బౌలర్ అనేవాడు కచ్చితంగా భారత్కు చెందిన ఆటగాడే ఉండాలి. అప్పుడు బాసిల్ థంపినా, నదీమ్లే సన్రైజర్స్కు అందుబాటులో ఉన్న ప్రధాన బౌలింగ్ వనరులు. (చదవండి: శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) (చదవండి: సన్రైజర్స్ ‘గాయం’ ఎంతవరకూ..) -
భువీ స్థానంలో పృథ్వీ రాజ్ యర్రా
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ను గాయాలు వేధిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి మ్యాచ్లోనే ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైతే, ఇంకా సగం లీగ్ కూడా పూర్తి కాకుండానే మరొక పేసర్ భువనేశ్వర్ కుమార్ తుంటి గాయంతో వైదొలిగాడు. భువీ తిరిగి కోలుకోవడానికి కనీసం ఆరువారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో టోర్నీకి దూరం కాకతప్పలేదు. అయితే మార్ష్ స్థానంలో జేసన్ హోల్డర్ను హైదరాబాద్ బ్యాకప్గా తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఆంధ్రాకు చెందిన లెఫ్టార్మ్ మీడియం పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను జట్టులోకి తీసుకుంది. గత ఐపీఎల్ సీజన్లో పృథ్వీరాజ్ యర్రా కేకేఆర్కు ఆడాడు. కేకేఆర్ తరఫున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన పృథ్వీరాజ్.. ఈ సీజన్లో ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. గత ఐపీఎల్ కోసం పృథ్వీరాజ్ను రూ. 20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. (చదవండి:ఇలా అయితే కష్టం పృథ్వీషా!) పృథ్వీ ఖాతాలో వార్నర్ వికెట్.. గతేడాది కేకేఆర్ తరఫున ఆడిన పృథ్వీ రాజ్.. రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి కేవలం ఒక వికెట్ తీశాడు. అది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ కావడం విశేషం. ఇప్పుడు అదే పృథ్వీరాజ్.. ఎస్ఆర్హెచ్కు ఆడబోతున్నాడు. గతేడాది కేకేఆర్కు ఆడే వరకూ ట్వంటీ20 క్రికెట్ ఆడని పృథ్వీ.. నేరుగా ఐపీఎల్లో అడుగుపెట్టడం మరొక విశేషం. తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 11 మ్యాచ్లు ఆడిన పృథ్వీ 39 వికెట్లు సాధించాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 22 ఏళ్ల పృథ్వీ రాజ్.. ఫస్ట్క్లాస్ కెరీర్లో 21. 51 యావరేజ్ కల్గి ఉన్నాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 11 మ్యాచ్లు ఆడి 15 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో పృథ్వీ రాజ్ ఆడబోతున్న విషయాన్ని ఎస్ఆర్హెచ్ తన ట్వీటర్ అకౌంట్లో తెలిపింది. ఈ సీజన్కు భువీ దూరమయ్యాడనే విషయాన్ని తెలిపిన ఆరెంజ్ఆర్మీ.. పృథ్వీ రాజ్తో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. (చదవండి: ఎంఎస్ ధోని ఫన్నీ వాక్) Update 🚨 Bhuvneshwar Kumar is ruled out of #Dream11IPL 2020 due to injury. We wish him a speedy recovery! Prithvi Raj Yarra will replace Bhuvi for the remainder of the season.#OrangeArmy #KeepRising — SunRisers Hyderabad (@SunRisers) October 6, 2020 -
ఇటు భువనేశ్వర్...అటు అమిత్ మిశ్రా
దుబాయ్: ఐపీఎల్లో ఇప్పటికే తడబడుతూ ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ ఇక ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. అది గ్రేడ్–2 లేదా గ్రేడ్–3 స్థాయి గాయం కావచ్చు. దీని వల్ల కనీసం 6–8 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లేనట్లే’ అని ఆయన వెల్లడించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్ బౌలింగ్ చేస్తూ భువనేశ్వర్కు గాయమైంది. అతని తొడ కండరాలు పట్టేయడంతో ఒక బంతి మాత్రమే వేసి తప్పుకున్నాడు. ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టిపడేయడంతో పాటు డెత్ ఓవర్లలో కూడా పరుగులు నియంత్రించగల, అనుభవజ్ఞుడైన భువీ దూరం కావడం హైదరాబాద్ టీమ్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఈ సీజన్లో 4 మ్యాచ్లలో 3 వికెట్లే తీసినా... కేవలం 6.8 ఎకానమీతో పరుగులివ్వడం భువీ విలువేమిటో చూపిస్తుంది. ఢిల్లీకి సమస్యే... సీనియర్ లెగ్స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా చేతి వేలికి గాయంతో లీగ్ నుంచి నిష్క్రమించాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో నితీశ్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకునే క్రమంలో మిశ్రాకు గాయమైంది. ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి కీలకమైన గిల్ వికెట్ తీసిన అతనికి మ్యాచ్ తర్వాత పరీక్షలు నిర్వహించగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. తాజా పరిణామం పట్ల తాము తీవ్రంగా నిరాశ చెందుతున్నామని క్యాపిటల్స్ యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ (170) తర్వాత మిశ్రా (160) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిశ్రా దూరమైన నేపథ్యంలో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. -
సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి ఎదురుదెబ్బ
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఇప్పుడు పేసర్ భువనేశ్వర్ కుమార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్కు దూరమైన భువీ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదని ఎస్ఆర్హెచ్ అధికారి ఒకరు ఏఎన్ఐకు తెలిపారు. (చదవండి: కెప్టెన్ ఒకటి, కోచ్ మరొకటి అంటే కష్టమే: ధోని) ‘భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ ఐపీఎల్కు దూరం కానున్నాడు. భువీ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. అతడు మా జట్టు పేస్ విభాగంలో కీలకం. కానీ అతడు టోర్నీలో లేకపోవడం కచ్చితంగా మాకు ఎదురుదెబ్బ’ అని సదరు అధికారి తెలిపారు. తొలి మ్యాచ్లోనే స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరం కావడంతో సన్రైజర్స్ బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. ఇప్పుడు భువీ లేకపోవడం ఆ జట్టు పేస్ విభాగంపై ప్రభావం చూపనుంది.(చదవండి: సన్రైజర్స్ ‘గాయం’ ఎంతవరకూ..) -
‘బుమ్రా నో బాల్ కొంపముంచింది’
న్యూఢిల్లీ: సుమారు మూడేళ్ల క్రితం పాకిస్తాన్తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గురించి టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. పాక్ బ్యాట్స్మన్ ఫకార్ జమాన్కు బుమ్రా వేసిన నో బాల్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందన్నాడు. బుమ్రా బౌలింగ్ ఆరంభంలోనే ఫకార్ ఇచ్చిన క్యాచ్ను ధోని అందుకున్నా అది నో బాల్ కావడం కొంపముంచిందన్నాడు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం వన్ సైడ్ వార్లా మారిపోవడంతో పాక్ టైటిల్ను గెలిచిందన్నాడు. ‘2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఏకపక్ష పోరులా మారిపోయింది. జట్టంతా సమష్టిగా విఫలం చెందడం ఒక ఎత్తు అయితే, బుమ్రా వేసిన నో బాల్ మరొక ఎత్తు. (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..) నో బాల్తో బతికి బయటపడ్డ ఫకార్ 114 పరుగులు చేసి పాక్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత మేము బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాం. పాక్ 338 పరుగులు చేస్తే, మేము 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమి చెందాం’ అని భువీ తెలిపాడు. అయితే ఓవరాల్గా గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగైందనే విషయాన్ని భువీ తెలిపాడు. ‘2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నుంచి నాలుగు ఐసీసీ టోర్నీలు జరిగితే అందులో రెండు నుంచి మూడు సార్లు సెమీస్,ఫైనల్స్కు చేరాం. 2015లో ఆసీస్తో సెమీస్లో ఓడిపోయాం. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి. 2019 వరల్డ్కప్లో కూడా బ్యాడ్లక్ వెంటాడింది. మా టాపార్డర్ విఫలం కావడంతో సాధారణ స్కోరును కూడా సాధించలేక సెమీస్ నుంచే నిష్క్రమించాం’ అని భువీ పేర్కొన్నాడు.(రోహిత్ను వరల్డ్కప్లోకి తీసుకోలేకపోవడమే..) -
‘రైజర్స్’తోనే నేర్చుకున్నా...
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ అందించడంలో అతనికి అతనే సాటి. లీగ్లో సాగించిన ఈ తరహా ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు. ‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని. అయితే సన్రైజర్స్తో ఆడటం మొదలు పెట్టాక నాలో మార్పు వచ్చింది. ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని అతను చెప్పాడు. 2014 నుంచి సన్రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్న భువీ 6 సీజన్లలో 86 మ్యాచ్లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. మాజీ కెప్టెన్ ధోని తరహాలోనే తాను కూడా నేర్చుకునే ప్రక్రియపైనే దృష్టి పెడతాను తప్ప ఫలితం గురించి ఆలోచించనని ఈ పేసర్ అన్నాడు. ఐపీఎల్లో కూడా అలా చేయడం వల్లే సానుకూల ఫలితాలు వచ్చాయని భువీ విశ్లేషించాడు. -
సెలైవా ఉపయోగించకుంటే బంతిని షైన్ చేయలేం..
న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆటను కొనసాగిస్తామని టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. వైరస్ ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో బంతిని షైన్ చేసేందుకు లాలాజలం(సెలైవా) ఉపయోగించాలా లేదా అన్న విషయంపై స్పష్టతకు రాలేదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో గురువారం జరుగనున్న తొలి వన్డే మ్యాచ్కు టీమిండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన భువీ.. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘‘సెలైవా ఉపయోగించకుంటే బంతిని షైన్ చేయలేం. దాంతో బ్యాట్స్మెన్ మా బౌలింగ్ను చీల్చిచెండాడుతారు. అప్పుడు.. బౌలింగ్లో పస లేదని మీరే అంటారు. కాబట్టి దీనికి పరిమితి పెట్టాలా లేదా అసలే వాడకూడదా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నాం. జట్టు సమావేశం పూర్తయిన తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుంది. టీం డాక్టర్ సలహాలు, సూచనల ప్రకారం నడుచుకుంటాం.(కరోనా ఎఫెక్ట్ : మాస్క్తో చహల్) ఇక కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం భారత్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మేం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ నిరంతరం మా వెంటే ఉంటారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతులు తరచుగా కడుక్కోవడం వంటి వాటి ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే మాపై ప్రేమ కురిపించే అభిమానులను దూరం పెట్టడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో తప్పదు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా భారత్కు చేరుకున్న ప్రొటీస్ జట్టు సైతం మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. ఇక కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులతోనూ కరచాలనం చేయకూడదని సఫారీలను ఆదేశించినట్టు ఆ జట్టు ప్రధాన కోచ్ బౌచర్ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ హెల్త్ సూపర్వైజర్ను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.(కరోనాతో వ్యక్తి మృతి : భారత్లో తొలి కేసు..!) -
భువనేశ్వర్కు శస్త్ర చికిత్స
న్యూఢిల్లీ: ‘స్పోర్ట్స్ హెర్నియా’తో జట్టుకు దూరమైన భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్కు లండన్లో శస్త్ర చికిత్స జరిగింది. ఈ నెల 11న అతనికి ఆపరేషన్ నిర్వహించినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను తిరిగొచ్చి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస చికిత్స తీసుకొంటాడని బోర్డు ప్రకటించింది. ఫిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్ కూడా భువీతో పాటే ఉండి అతని చికిత్సను పర్యవేక్షిస్తున్నాడని కూడా పేర్కొంది. అయితే ఎప్పటిలోగా అతను పూర్తిగా కోలుకొని భువీ మళ్లీ బరిలోకి దిగుతాడనే విషయంతో బోర్డు స్పష్టతనివ్వలేదు. మరో వైపు భుజం గాయంనుంచి యువ ఆటగాడు పృథ్వీ షా పూర్తిగా కోలుకున్నాడు. దాంతో భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు అతను న్యూజిలాండ్ బయల్దేరి వెళుతున్నాడు. -
భువీకి శస్త్రచికిత్స.. ఐపీఎల్ డౌటేనా?
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్కు లండన్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో హెర్నియా శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గత కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న ఈ మీడియం పేసర్ జట్టులోకి వస్తూ వెళుతున్నాడు. తాజాగా వెస్టిండీస్ సిరీస్లో ఇబ్బంది పడిన ఈ బౌలర్ను జట్టు నుంచి తప్పించారు. అయితే తాజాగా భారత ఫిజియోథెరపిస్ట్ యోగేశ్వర్ పర్మార్ పర్యవేక్షనలో భువీకి శస్త్రచికిత్స జరిగిందని, పునరావాస శిక్షణ కోసం త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చేరతాడని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అయితే విశ్రాంతి ఎన్ని రోజులు అనే దానిపై అయన స్పష్టతనివ్వలేదు. దీంతో భువీ ఐపీఎల్ ఆడటం అనుమానమేనని పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రధానమైన బౌలరైన భువీ ఐపీఎల్ ఆడకపోతే ఆ జట్టుకు తీవ్ర నష్టం జరగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా ఏడు నెలల నిషేధం, తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన యువ క్రికెటర్ పృథ్వీ షా విషయంపై కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడని, పునరావాస కేంద్రం ఎన్సీఏలో పూర్తి ఫిట్నెస్ సాధించాడని జైషా పేర్కొన్నాడు. అంతేకాకుండా సెలక్షన్స్కు అతడు పూర్తిగా అందుబాటులో ఉంటాడని, త్వరలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టుతో కలుస్తాడని తెలిపాడు. ఇక ఆటగాళ్లు పదేపదే గాయాల పాలవడంతో ఎన్సీఏ తీరు పట్ల మాజీ క్రికెటర్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసా కేంద్రంలో ఆటగాళ్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేవని, అందుకే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఎనీసీఏపై నమ్మకం లేకనే ప్రయివేట్గా ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. -
టీమిండియాకు షాక్.. శార్దూల్కు పిలుపు!
చెన్నై: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి గాయం బారిన పడ్డాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం మోకాలి గాయం కారణంగా ఆటకు నాలుగు నెలలు దూరమైన ఈ మీడియం పేసర్ వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆదివారం నుంచి వెస్టిండీస్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. అయితే నెట్ ప్రాక్టీస్లో భాగంగా భువీకి గాయం తిరగబెట్టినట్టు సమాచారం. గాయం కారణంగా భువీని వన్డే సిరీస్ నుంచి తప్పించి అతడి స్థానంలో ముంబై మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే భువీ గాయం తీవ్రతపై స్పష్టతనివ్వడానికి ఆ అధికారి నిరాకరించారు. టీ20 సిరీస్ గెలిచిన ఉత్సాహంతో కీలక వన్డే సిరీస్కు సమయాత్తమవుతున్న టీమిండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. దీంతో వన్డే సిరీస్లో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీతో కలిసి యువ పేసర్ దీపక్ చహర్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక భువీ గాయంపై బౌలింగ్ కోచ్ అరుణ్కుమార్ స్పందించాడు. ‘భువీ గాయంపై ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నాడని, నివేదిక రాగానే అతడి గాయంపై స్పష్టత వస్తుంది’అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, నవదీప్ సైనీలు గాయాల బారిన పడటంతో భారత బౌలింగ్ రిజర్వ్ బెంచ్ బలహీనపడింది. తాజాగా భువీ కూడా మరోసారి గాయపడటంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనచెందుతోంది. ఆటగాళ్లు ముఖ్యంగా బౌలర్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఇక భువనేశ్వర్కు బ్యాకప్గా ఉమేశ్ను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ.. శార్దూల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపినట్లు సమాచారం. యువ పేసర్ నవదీప్ సైనీ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్థిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో రిస్క్ చేయడం ఎందుకని సైనీని పరిగణలోకి తీసుకోలేదు. ఇక శార్దూల్ టీమిండియా తరుపున గతేడాది జరిగిన ఆసియా కప్-2018 టోర్నీలో చివరగా ఆడాడు. ఐపీఎల్-12లోనూ అంతగా ఆకట్టుకోని శార్దూల్ అందివచ్చిన అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. -
భువీ పునరాగమనం
ముంబై: వెస్టిండీస్తో పోరుకోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ వన్డే, టి20 జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకుంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు టి20ల్లో చోటిచ్చిన సెలక్టర్లు ఇటీవల బంగ్లాతో టి20లు ఆడిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, పేసర్ ఖలీల్ అహ్మద్లకు ఉద్వాసన పలికారు. వీరితో పాటు సంజూ సామ్సన్, రాహుల్ చాహర్లను జట్టు నుంచి తప్పించారు. వీళ్లిద్దరిని బంగ్లాతో జరిగిన టి20లకు తీసుకున్నప్పటికీ ఆడే అవకాశం లభించలేదు. వన్డే, టెస్టుల్లో పంజా విసురుతున్న పేసర్ షమీని తాజాగా టి20లకు ఎంపిక చేశారు. ఈ సీమర్ పొట్టి మ్యాచ్ (అంతర్జాతీయ)ను చివరిసారిగా 2017లో ఆడాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు కూడా పొట్టి జట్టులో చోటిచ్చారు. బంగ్లాతో టి20ల్లో ఆకట్టుకున్న శివమ్ దూబేకు వన్డేల్లో స్థానమిచ్చారు. -
ధావన్ను ట్రోల్ చేసిన భువీ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టు ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించారు. రోహిత్ శర్మ 85 పరుగులు సాధించగా, శిఖర్ ధావన్ 31 పరుగుల వద్ద తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మతో కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాల్ని అత్యధిక సార్లు నెలకొల్పిన రికార్డులో ధావన్ భాగమయ్యాడు. కాగా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. ధావన్ను ట్రోల్ చేశాడు. ధావన్ ఒక వీడియోను రూపొందించండంతో భువీ తనదైన శైలిలో స్పందించాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్-4 చిత్రంలో ఒక సన్నివేశాన్ని యజ్వేంద్ర చహల్-ఖలీల్ అహ్మద్లతో కలిసి ధావన్ రీక్రియేట్ చేశాడు. వీరు ముగ్గురూ కలిసి హోటల్లో ఈ వీడియోను రూపొందించారు. దీన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ధావన్ పోస్ట్ చేశాడు. దీనిపై భువీ రిప్లై ఇస్తూ ధావన్ టాలెంట్పై హిందీలో కామెంట్ చేశాడు. ‘ యాక్టింగ్ను మర్చిపోయినట్లు నటించాల్సిన అవసరం ఏముంది. నీ యాక్టింగ్ నేచురల్గానే ఉంది కదా’ అని పేర్కొన్నాడు. View this post on Instagram Bala ke side effects 😂 @akshaykumar @khaleelahmed13 @yuzi_chahal23 A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Nov 7, 2019 at 11:29pm PST -
‘ఆ కసి కోహ్లిలో కనపడింది’
ట్రినిడాడ్: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి ఫీల్డ్లో దూకుడు ఎక్కువే. సెంచరీ సాధించిన తర్వాత అయితే కోహ్లి సెలబ్రేట్ చేసుకునే విధానం ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. ఇది తన బ్యాటింగ్ పవర్ అనే అర్థం వచ్చేలా కోహ్లి సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. మరి 11 వన్డే ఇన్నింగ్స్ల తర్వాత కోహ్లి శతకం సాధిస్తే ఆ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్తో రెండో వన్డేలో కోహ్లి సెంచరీ చేసిన తర్వాత అతని హావభావాలు సెంచరీ కోసం ఎంత ఆకలిగా ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని సహచర ఆటగాడు భువనేశ్వర్ కుమార్ కూడా పేర్కొన్నాడు. ‘సెంచరీ తర్వాత కోహ్లి ముఖ కవలికలు చూడండి. ఎప్పుడూ లేనంతగా ఉన్నాయి. ఆ కసి అంతా సెంచరీ కోసమే. అంటే అతను ఫామ్లో లేడని కాదు. వరల్డ్కప్లో కూడా కోహ్లి ఆకట్టకున్నాడు. కాకపోతే 70-80 పరుగుల మధ్యలో ఔటయ్యాడు. అతను ఎప్పుడో భారీ పరుగులు చేయడం కోసమే తపిస్తూ ఉంటాడు. గత కొంతకాలంగా సెంచరీలు చేయలేకపోతున్నాననే కసిలో ఉన్న కోహ్లి.. విండీస్ మ్యాచ్లో ఆ దాహం తీర్చుకున్నాడు. ఈ వికెట్పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అటువంటి కోహ్లి సెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని కూడా కోహ్లి నమోదు చేశాడు. దాంతో మ్యాచ్పై పట్టుదొరికింది’ అని భువీ పేర్కొన్నాడు. కోహ్లి 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులు సాధించగా, అయ్యర్ 68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 71 పరుగులు చేశాడు. కోహ్లి-అయ్యర్ల ద్వయం నాల్గో వికెట్కు 125 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
వావ్ భువీ.. వాటే క్యాచ్!
ట్రినిడాడ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ టార్గెట్ను ఛేదించే క్రమంలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ గెలుపును అందుకుని సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా విజయంలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కాగా, భువీ పట్టిన రిటర్న్ క్యాచ్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.(ఇక్కడ చదవండి: క్రిస్ గేల్ ఆల్టైమ్ రికార్డు!) భువీ వేసిన 35 ఓవర్ ఐదో బంతిని రోస్టన్ ఛేజ్ లెగ్ సైడ్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని రిట్నర్ క్యాచ్గా రాగా దాన్ని భువీ డైవ్ కొట్టి అద్భుతంగా అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు రిటర్న్ క్యాచ్ను అందుకోవడం అంత ఈజీ కాదు. బంతిని వేసిన తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ భువీ చాకచక్యంగా క్యాచ్ను పట్టుకున్నాడు. దాంతో కెప్టెన్ కోహ్లితో సహా సహచర ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. -
శభాష్ సైనీ..
లాడర్హిల్ (అమెరికా): వెస్టిండీస్తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్ నవదీప్ సైనీ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు ప్రధాన వికెట్లను సాధించాడు ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ను వికెట్ మెయిడిన్గా ముగించి భళా అనిపించాడు. తన అరంగేట్రపు తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే సైనీ ఆకట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగేట్రం మ్యాచ్లో ఈ తరహా అద్భుత ప్రదర్శన చేయడం అరుదుగా జరుగుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సైనీ ప్రధాన పాత్ర పోషించాడన్నాడు. ఇక సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం సైనీ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తనలోని సత్తా ఏమిటో తొలి అంతర్జాతీయ టీ20లోనే నిరూపించుకున్నాడన్నాడు. ఈ వికెట్పై బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని, సైనీ మాత్రం తన అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టకున్నాడన్నాడు.145-150కి.మీ వేగంతో బౌలింగ్ చేయడమంటే మాటలు కాదన్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్తో మిగతా బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపాడన్నాడు. తనకు అవకాశం ఎక్కడ వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటూనే సైనీ ముందుకు సాగుతున్నాడన్నాడు. అటు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్, భారత్-ఎ మ్యాచ్ల్లో సైనీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడని భువీ పేర్కొన్నాడు. టెన్నిస్ బాల్తో క్రికెట్ మొదలుపెట్టి.. సైనీ క్రికెట్ కెరీర్ టెన్నిస్ బంతులతో ఆరంభమైంది. కర్మల్ ప్రీమియర్ లీగ్లో ద్వారా అతని క్రికెట్ అరంగేట్రం జరిగింది. సైనీ తండ్రి హర్యానా రాష్ట్రంలో ఒక డ్రైవర్గా పనిచేశాడు. ఇదిలా ఉంచితే, 2013లో తొలిసారి సైనీని అదృష్టం తలుపు తట్టంది. ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఢిల్లీ నెట్ బౌలర్గా బ్యాట్స్మన్కు బంతులు వేసే అవకాశం సైనీకి వచ్చింది. దాంతో అప్పటి భారత ఓపెనర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్కు నెట్ బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్లో వేగాన్ని గమనించిన గంభీర్.. ఆ సీజన్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దాంతో పాటు ఆ సీజన్ ఆసాంతం ఓపెనింగ్ పేస్ అవకాశం రావడం మరొక విశేషం. విదర్భతో జరిగిన ఆనాటి మ్యాచ్లో సైనీ రెండు వికెట్లతో మెరిశాడు. అలా తన ఫస్ట్క్లాస్ క్రికెట్ను ఆరంభించిన సైనీ.. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు సాధించడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. -
భువీ ఈజ్ బ్యాక్
మాంచెస్టర్ : పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. భూవీ బ్యాకప్ ప్లేయర్గా నవదీప్ సైనీ ఇంగ్లండ్కు వెళ్లడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందోళనలు కలిగాయి. అయితే తాజాగా స్థానిక ఇండోర్ నెట్స్లో భువనేశ్వర్ బౌలింగ్ చేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోనూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. పాక్తో మ్యాచ్లో గాయపడిన భువనేశ్వర్ మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం భారత్కు ఊరటకలిగించే వార్తే. కాగా, అఫ్గానిస్తాన్ మ్యాచ్లో భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి భారత్ను గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో భువీ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. భారత్ ఇప్పటికే 5మ్యాచ్ల్లో 9 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రపంచకప్లో జరిగిన అన్ని మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని జట్లుగా భారత్, న్యూజిలాండ్లు దూసుకుపోతున్నాయి. అయితే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. బుమ్రా, షమీ, భువనేశ్వర్లతో కూడిన భారత్ పేస్ బలగం మరింత పటిష్టంగా తయారయ్యింది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్కు క్రికెటర్ల గాయాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే బొటనవేలి గాయంతో శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ గురువారం వెస్టిండీస్తో తలపడనుంది. Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn — BCCI (@BCCI) 25 June 2019 -
షైనీకి పిలుపు.. ఇంగ్లండ్కు పయనం
మాంచెస్టర్: కండరాల నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్కు స్టాండ్ బై ప్లేయర్గా నవ్దీప్ షైనీకి భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నుంచి పిలుపు అందింది. భారత జట్టు నుంచి పిలుపు అందిన మరుక్షణమే అతను ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు. సోమవారం జట్టుతో కలిసిన షైనీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని కాలి కండరాలు పట్టేశాయి. దీనితో ఓవర్ మధ్య నుంచే భువనేశ్వర్ కుమార్ అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. అఫ్గానిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరం అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ గాయం పరిస్థితిపై భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. అయినప్పటికీ అతను కోలుకుంటాడని, ఈ నెల 30వ తేదీన ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఈలోగా స్టాండ్ బై ఫాస్ట్ బౌలర్గా ఉన్న నవ్దీప్ షైనీకి టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు అందింది. దీనితో అతను హుటాహుటీన ఇంగ్లండ్కు బయలుదేరి వెళ్లాడు. కాగా, నవ్దీప్ షైనీని కేవలం నెట్ బౌటర్గా సేవలను అందించడానికి మాత్రమే పిలిపించుకున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బ్యాట్స్మెన్లు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు. సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల ఆ విభాగం బలహీన పడినట్లు భావిస్తున్నారు. సరైన టెక్నిక్తో బంతులను సంధించే ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటే నెట్ ప్రాక్టీస్ సులువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ మిగిలిన మ్యాచ్లకు కూడా దూరంగా ఉండాల్సి వస్తే.. నవ్దీప్ షైనీని ఆడించే అవకాశాలను మాత్రం కొట్టి పారేయట్లేదు. స్పెషలిస్ట్ పేస్ బౌలర్గా షైనీని ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడించే అవకాశాలు ఉన్నాయని టీమ్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని ఇంకా ఏ ఆటగాడితోనూ భర్తీ చేయలేదు. అతని స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం శిఖర్ ధావన్ గాయపడటంతో రిషభ్ పంత్ను స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ధావన్ పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగినా, పంత్కు ఆడే అవకాశం ఇంకా రాలేదు. -
చైన్లతో ధావన్, హార్దిక్.. నోరెళ్లబెట్టిన భువీ
మా ఇద్దరి చైన్లు చూసి భువీ నొరెళ్లబెట్టాడంటూ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెడలో వేసుకునే లావైన చైన్లను పోలుస్తూ శిఖర్ ధావన్ ఏకంగా ఓ పెద్ద చైన్ను మెడలో వేసుకుని సరదాగా ట్వీట్ చేశాడు. హార్దిక్ పాండ్యాను, తనను చూసి భువనేశ్వర్ నోరెళ్లబెట్టాడంటూ ధావన్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమ బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయంతోనే ఆ మ్యాచ్లో సెంచరీ సాధించిన గబ్బర్కు మ్యాచ్ అనంతరం పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగిందని మూడు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. దీంతో ప్రపంచకప్లోని ఇతర మ్యాచ్లకు గబ్బర్ దూరయ్యాడు. అయితే ఇలా ప్రతిష్టాత్మక ప్రపంచ కప్కు అర్థాంతరంగా దూరమవడంతో ధవన్లో మరింత కసి పెరిగింది. శారీరకంగా, మానసికంగా తనను తాను పటిష్టంగా ఉంచుకోవడానికి శిఖర్ ధావన్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. గాయంపై శిఖర్ ధావన్ తన ప్రతిస్పందనను ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్ ఇందోరీ రాసిన కవితా రూపంలో వెల్లడించడం, గాయం తగ్గకపోయినా జిమ్లో తీవ్ర కసరత్తులు చేయడం చూస్తుంటే జట్టులోకి రావాడానికి గబ్బర్ ఎంతలా ప్రయత్నిస్తున్నాడో అర్థమవుతుంది. ఇక ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మానసిక ప్రశాంతత కోసం తన సహచరులను ఆటపట్టిస్తూ గబ్బర్ ట్వీట్ చేయడంతో.. త్వరగా కోలుకుని జట్టులోకి రావాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. Bhuvi ka muh khula reh gaya dono ki chains ke rate dekhke 😱😁😜 @BhuviOfficial @hardikpandya7 pic.twitter.com/kRjIf7zBst — Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019